కాశినాయన చిత్రపటాన్ని గుర్రంపై ఊరేగిస్తున్న దృశ్యం
బండిఆత్మకూరు: కాశినాయన 21వ ఆరాధన ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. సోమవారం రాత్రి తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దీపాలతో నడుచుకుంటూ కాశిరెడ్డినాయన ఆశ్రమానికి చేరుకునా్నరు. అక్కడ ఆశ్రమంలో పెంచిన గుర్రంపై కాశినాయన చిత్రపటాన్ని పెట్టి ఊరేగించారు. రాత్రి 12గంటల సమయంలో గాయత్రిదేవి ఆలయం సమీపంలో జ్యోతిని వెలిగించారు. ఆ తర్వాత కూర్మగిరి క్షేత్రంలోనూ ఇదే విధంగా జ్యోతిని పూజారులు పూజలు నిర్వహించి వెలిగించారు. తొలిసారిగా ఓంకార క్షేత్రం ఆవరణలో ఉన్న కాశినాయన ఆశ్రమంలో నిర్వహిస్తున్న ఈ జ్యోతి ఉత్సవాలను తిలకించడానికి జనం భారీగా తరలివచ్చారు.