Jyothi
-
కిల్లర్తో వస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. ఆసక్తిగా పోస్టర్స్!
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ లాంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ సుక్కు పూర్వాజ్. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో కిల్లర్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ కీలక పాత్రలో కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే కిల్లర్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్తో కనిపిస్తోన్న ఈ పోస్టర్స్ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమానుఏయు అండ్ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో థింక్ సినిమా బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Venkata Suresh Kumar Kuppili (@poorvaaj) -
Peruri Jyoti Varma: పవర్ ఫుల్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్ప్రెస్ నేషనల్ చాంపియన్షిప్లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్పూర్. పెళ్లికిముందు హ్యాండ్బాల్ గేమ్లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్గా చేస్తున్న డాక్టర్ పిఎల్ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.– పేరూరి జ్యోతి– దాళా రమేష్బాబు, సాక్షి, గుంటూరుఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు. -
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం నిందితులకు సహకరించిన జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి 14 రోజులు పాటు రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు.కాగా సుభాష్ నగర్లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మాజా రెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. అయితే అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన జ్యోతి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం పద్మజా రెడ్డికి సహకరించింది. ఇటీవల పోలీసులు పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని సైతం అరెస్ట్ చేశారు. -
జ్యోతి పూర్వజ్ కొత్త సినిమా ప్రకటన
తెలుగు బుల్లితెరపై పలు సూపర్ హిట్ సీరియల్స్తో పాటు సినిమాల్లో నటించి వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వజ్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మరో కొత్త సినిమా రానుంది. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తాజాగా 'కిల్లర్' అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని వారు అనౌన్స్ చేశారు. మూవీ టైటిల్తో పాటు మోషన్ పోస్టర్ లాంఛ్ చేశారు మేకర్స్.పవర్ ఫుల్ లేడీ, గన్, చెస్ కాయిన్స్తో ఆల్ట్రా మోడరన్గా డిజైన చేసిన 'కిల్లర్' మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్పై పూర్వాజ్, ప్రజయ్ కామత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. పూర్వాజ్ 'కిల్లర్' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) -
నా బిడ్డను బతికించండి
గాందీ ఆస్పత్రి: ప్రాణాపాయస్థితి కొట్టుమిట్టాడుతున్న తన కుమార్తెకు మెరుగైన వైద్యసేవలు అందించి కాపాడాలని ఓ కన్నతల్లి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడంలేదని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి చేరే వరకు ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం మండపేట గ్రామం తాటిపూడికి చెందిన ఇల్ల శ్రీనివాస్, సుశీల దంపతులు. కొంతకాలం క్రితం నగరానికి వచ్చి అంబర్పేట తిరుమల నగర్లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్నారు. వీరి కుమార్తె జ్యోతి (25) తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ నెల 18న ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో జ్యోతి తల, వెన్నెముక, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) నమోదు చేసి అంబులెన్స్లో గాందీఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రాథమిక వైద్యం అందించి, జూడాల సమ్మె కారణంగా అత్యవసర శస్త్ర చికిత్స చేయడం కుదరదని.. ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కావడంతో ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతూ గాంధీ వైద్యులు చేతులెత్తేశారని బాధితురాలి తల్లి సుశీల పేరిట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. సీఎం రేవంత్రెడ్డికి చేరేవరకూ పోస్ట్ను ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. తాము పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సోమవారం వైరల్ కావడంతో అప్పటివరకు పట్టించుకోని గాంధీ వైద్యులు స్పందించారని, న్యూరోసర్జరీ, ఇతర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్సలు అందిస్తున్నారని బాధితురాలి బంధువు రవిశంకర్ మీడియాకు తెలిపారు. కాగా.. గాంధీ అత్యవసర విభాగంలో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని, వైరల్ అయిన పోస్ట్లో వాస్తవం లేదని గాంధీ సూపరింటెండెంట్ సీహెచ్ రాజకుమారి స్పష్టంచేశారు. జ్యోతికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. -
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతికి 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కె.జగజ్యోతిని ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. జ్యోతికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మార్చ్ 6 వరకు జ్యోతికి రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. జ్యోతిని చంచల్గూడా మహిళా జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని జజ్యోతి తరపు నన్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నారని ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. దీంతో జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధింస్తున్నామని కోర్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్ బాయిస్ హాస్టల్ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్డ్ కాంట్రాక్టర్ చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్ను ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్ఎస్) భవన్లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్ఛార్జి హోదాలో ఎస్ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం. చదవండి: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అరెస్ట్ -
10 కోట్ల ఆస్తి.. 4 కేజీల బంగారం.. మైండ్ బ్లాక్ అయ్యేలా జ్యోతి ఆస్తులు
-
జ్యోతి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు
-
ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి అరెస్ట్
-
బిగ్బాస్ కంటెస్టెంట్ భార్య గొప్పమనసు.. వారి కోసం అలా!
బిగ్బాస్ కంటెస్టెంట్, కొరియాగ్రాఫర్ ఆట సందీప్ ఈ సీజన్లో తన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్నారు. తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7లో మొదటి నుంచి హౌస్లో గట్టి పోటీదారునిగా నిలిచారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్గా స్థిరపడిపోయింది. అయితే ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. ఆమె సైతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటోంది. తాజాగా ఆమె చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే నిద్రిస్తున్న వారికోసం తనవంతు సాయంగా ముందుకు కదిలారు. రోడ్డు పుట్పాత్లపై నిద్రిస్తున్న వారికి దుప్పట్లు అందించారు. తన ఫ్రెండ్తో కలిసి ఆమె రోడ్ల పక్కన నిద్రిస్తున్న ఉన్నవారికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్స్ ప్రశంసలు కురిస్తున్నారు. మీరు ఇలాగే మరికొంత మందికి సాయం చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jyoti Raj (@jyothiraj_sandeep) -
కాంగ్రెస్ నేతలపై దాడి.. జ్యోతి పటేల్ సంచలన ఆరోపణలు
భోపాల్: మధ్యప్రదేశ్లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నమోదైంది. అత్యధికంగా 76 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల కాంగ్రెస్-బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఇక, తాజాగా బీజేపీ మంత్రి గోపాల్ భార్గవపై కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. తన మద్దతుదారుల వాహనాలపై దాడి చేసి వారిని చంపే ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత పలు చోట్ల ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలోని గఢకోట్ల వద్ద కాంగ్రెస్ మద్దతుదారులపై శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి పటేల్ మాట్లాడుతూ..‘బీజేపీ మంత్రి గోపాల్ భార్గవ, ఆయన కుమారుడు అభిషేక్ భార్గవ కలిసి కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడ్డారు. నాపై, నా మద్దతుదారులపై దాడులకు వారు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేతల వాహనాలపై రాళ్లతో దాడులు చేశారు. కాల్పులకు తెగబడ్డారు. బీజేపీ నేతల దాడుల్లో నేను చనిపోయినా, గాయపడినా వారిద్దరే బాధ్యులు’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ మద్దతుదారులు దాడులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. BIG BREAKING: #MPElections2023 📍Madhya Pradesh Narendra Modi says "Beti Bachao" But today, goons, gangsters of BJP minister Gopal Bhargava attacked, open fired, threatened Rehli Congress candidate Jyoti Patel. Sources says, Gopal Bhargava's son Abhishek Bhargava is present… pic.twitter.com/8GIH9s5Slq — Liz/Barsha (@debunk_misinfos) November 18, 2023 మరోవైపు.. కాంగ్రెస్ నేతల వాహనాలపై రాళ్ల దాడులు జరగడంతో హస్తం పార్టీ నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో, బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఘర్షణ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ లోకేష్ సిన్హా స్పందించారు. రెండు పార్టీల నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
జ్యోతి సురేఖకు స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండు పతకాలు గెలిచింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ 145–145 (8/9) ‘షూట్ ఆఫ్’లో భారత్కే చెందిన పర్ణీత్ కౌర్ చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరి స్కోర్లు సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందు ఇద్దరికి ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. జ్యోతి సురేఖ బాణం 8 పాయింట్ల వృత్తంలోకి వెళ్లగా... పంజాబ్కు చెందిన 18 ఏళ్ల పర్ణీత్ కౌర్ 9 పాయింట్ల షాట్తో తొలి అంతర్జాతీయ వ్యక్తిగత స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత బృందం కాంపౌండ్ టీమ్ ఫైనల్లో 234–233తో చైనీస్ తైపీని ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియా చాంపియన్షిప్లో పాల్గొన్న జ్యోతి సురేఖ ఓవరాల్గా 5 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో అదితి–ప్రియాంశ్ జోడీ 156–151తో కనోక్నాపుస్–నవాయుత్ (థాయ్లాండ్) జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్లో అభిషేక్ వర్మ 147–146తో జూ జేహూన్ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. -
రెండు స్వర్ణాలపై జ్యోతి సురేఖ గురి
బ్యాంకాక్: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాల కోసం విజయం దూరంలో నిలిచింది. విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్లో జ్యోతి సురేఖ 148–145తో హువాంగ్ జౌ (చైనీస్ తైపీ)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో భారత్కే చెందిన పర్ణీత్ కౌర్తో సురేఖ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో పర్ణీత్ కౌర్ 147–145తో విక్టోరియా లియాన్ (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి ప్రిక్వార్టర్ ఫైనల్లో 145–146తో బొన్నా అక్తర్ (బంగ్లాదేశ్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. మహిళల కాంపౌండ్ టీమ్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత జట్టు 228–217తో థాయ్లాండ్ జట్టును ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుతో సురేఖ బృందం ఆడుతుంది. మరోవైపు పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిõÙక్ వర్మ, ప్రియాంశ్, ప్రథమేశ్లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెలిచింది. -
ఆర్చరీలో ‘డబుల్’ ధమాకా
పారిస్: భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 ఈవెంట్లో పసిడి పంట పండించారు. కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో ‘డబుల్’ ధమాకా సాధించాయి. రికర్వ్ జట్లు కాంస్య పతకాలు గెలిచాయి. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ఓజస్ ప్రవీణ్, ప్రథమేశ్ జౌకర్లతో కూడిన భారత జట్టు శని వారం జరిగిన ఫైనల్లో 236–232 స్కోరుతో క్రిస్ షాఫ్, జేమ్స్ లుజ్, సాయెర్ సలైవాన్లతో కూడిన అమెరికా జట్టుపై ఘన విజయం సాధించింది. మూడు రౌండ్లు ముగిసేసరికి ఇరు జట్లు సమంగా నిలవగా, కీలకమైన చివరి రౌండ్లో భారత్ పైచే యి సాధించింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో సెమీస్లో ఓడిన భారత జట్టు కాంస్య పతక పోరులో స్పెయిన్ టీమ్పై గెలిచింది. ధీరజ్ బొమ్మదేవర, అతాను దాస్, తుషార్లతో కూడిన భారత్ 6–2తో స్పానిష్ టీమ్ను ఓడించి కాంస్యం గెలుచుకుంది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భజన్ కౌర్, అంకిత భకత్, సిమ్రాన్జీత్ కౌర్లు ఉన్న భారత త్రయం కాంస్య పతక పోరులో 5–4తో మెక్సికో జట్టుపై గెలిచింది. అమ్మాయిల జట్టు పైచేయి మహిళల కాంపౌండ్లో జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్, పర్నీత్ కౌర్లతో కూడిన భారత బృందం 234–233తో మెక్సికో జట్టుపై గెలిచి పసిడి పతకం చేజిక్కించుకుంది. తొలి రౌండ్లో 59–59తో అండ్రియా బెకెరా, అనా సోఫియా, డాఫ్నే క్వింటెరోలతో కూడిన మెక్సికో జట్టుతో భారత్ స్కోరు సమంచేసింది. రెండో రౌండ్లో 59–58తో స్వల్ప ఆధిక్యం కనబరిచింది. 118–117 తో మూడో రౌండ్లోకి దిగిన భారత ఆర్చర్లు 57–59తో వెనుకబడ్డారు. 175–176తో ఆధిక్యం మెక్సికోవైపు మళ్లింది. ఈ దశలో నాలుగో రౌండ్పై దృష్టిపెట్టిన ఆర్చర్లు 59 స్కోరు చేస్తే... మెక్సికన్ అమ్మాయిలు 57 స్కోరే చేయడంతో పాయింట్ తేడాతో భారత్ (234–233) స్వర్ణ పతకం గెలుపొందింది. జ్యోతి సురేఖ @ 50 ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ పోటీల్లో పతకాల ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఈ టోర్నీకి ముందు 48 పతకాలు సాధించిన ఆమె శనివారం కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. అనంతరం వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుచుకోవడంతో 50వ పతకం ఆమె ఖాతాలో చేరింది. సెమీస్లో ఓడిన ఆమె మూడో స్థానం కోసం కొలంబియాకు చెందిన సారా లోపెజ్తో తలపడింది. స్కోరు 146–146తో సమం కాగా, షూటాఫ్లోనూ 10–10తో సమంగా నిలిచారు. అయితే లక్ష్యబిందువుకు అతి సమీపంగా కచ్చితత్వంతో కూడిన బాణాలు సంధించిన జ్యోతినే విజేతగా ప్రకటించడంతో కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో కలిపి గెలిచిన మొత్తం 50 పతకాల్లో 17 స్వర్ణాలు, 18 రజతాలు, 15 కాంస్యాలున్నాయి. -
నేను ఏ తప్పు చేయలేదు, భయపడేది లేదు: నటి జ్యోతి
డ్రగ్స్ కేసులో అరెస్టయిన తెలుగు నిర్మాత కేపీ చౌదరితో ఫోన్ కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. కేపీ చౌదరితో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందని, ఫ్యామిలీ బాండింగ్ తప్ప డ్రగ్స్తో తనకు సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకు అయినా తాను సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తన ఫోన్ కూడా పోలీసుకు ఇవ్వడానికి సిద్ధమేనని జ్యోతి స్పష్టం చేశారు. తను ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని, అవసరమైతే నార్కోటిక్ టెస్ట్కి సిద్దమన్నారు. ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడేది లేదని చెప్పారు. కేపీ హైదరాబాద్ వచ్చినప్పుడు వారి అబ్బాయిని తన ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లేవాడని, తన కుమారుడు, కేపీ కుమారుడు కలిసి ఆడుకునే వారని జ్యోతి తెలిపారు. ఇలా ఫ్యామిలీ బాండింగ్ తప్ప కేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక నుంచైనా తనపై దుష్ప్రచారం చేయొద్దని జ్యోతి కోరారు. (చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి) కాగా, డ్రగ్స్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేపీ చౌదరిని పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలను కూడా విచారించే చాన్స్ ఉంది. అయితే కేపీ చౌదరి నిర్మాతగా ఉన్నారు కాబట్టి తమ మధ్య ఫోన్ కాంటాక్టులు సహజమని సినీ ప్రముఖులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Jyoti Labala (@jyothiactress) -
MasterChef India 7: Nayanjyoti Saikia: వంటకోసం ప్రాణం ఇస్తాడు
వంట అమ్మ చేయాలి.. అది రూలట. తర్వాత అమ్మాయి చేయాలి.. అది పెంపకం అట. కాని అబ్బాయి చేస్తే? అబ్బాయి నేర్చుకుంటే? వంట ద్వారానే విజేతగా మారితే? అస్సాంలో టీ తోటల్లో కార్మికుడిగా ఉన్న నయన్జ్యోతి సైకియా వంట మీద ధ్యాస పెట్టాడు. మునివేళ్ల మంత్రం నేర్చాడు. మాస్టర్ చెఫ్ పోటీలో విజేతగా నిలిచి 25 లక్షల ప్రైజు సాధించాడు. అమ్మ ఊరికెళితే కర్రీ పాయింట్ వైపు అడుగులు వేసే పుత్రరత్నాలు ఇతని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. 27 ఏళ్ల నయన్జ్యోతి సైకియాకు రాని వంట లేదు. మూడు నెలల పాటు ముంబైలో ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో కోసం ఉండి, రకరకాల వంటలు చేసి, భేష్ అనిపించుకుని, వారం క్రితం 25 లక్షల రూపాయల మొదటి ప్రైజ్ గెలిచాక ఎగువ అస్సాంలో ఉండే అతని ఊరి ప్రజలు ఉత్సవం జరుపుకుంటూ, ట్రోఫీతో తిరిగి వస్తున్న అతనికి స్వాగతం చెప్పడానికి రకరకాల వంటలు చేయిస్తూ ‘ప్రత్యేకంగా ఏం చేయించమంటావ్’ అని అడిగితే నయన్జ్యోతి సైకియా ‘ఏం వద్దు... మా ఇంట్లో చేసే టొమాటో చేప కూర చాలు’ అన్నాడు. దాదాపు రెండు వేల మంది అతనికి స్వాగతం చెప్పడానికి ఊరిలో జమ అయితే ఈ కూర నాలుకకు తగిలాకే ‘అమ్మయ్య... ఇప్పటికి మన ఊరు చేరినట్టయ్యింది’ అని నవ్వాడు. ఇవాళ నయన్జ్యోతి సైకియాను అస్సాం అంతా తనవాడు అని గర్వంగా చెప్పుకుంటోంది. అతను ఆస్కారో నోబెలో తేలేదు. కేవలం వంట ద్వారానే తన ప్రాంతం తల ఎత్తుకు తిరిగేలా చేశాడు. మెకానికల్ ఇంజనీర్ నయన్జ్యోతి సైకియా సొంత ఊరు తిన్ సుకియ. ఇది గౌహతికి 490 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సైకియా తండ్రి టీ ఎస్టేట్లలో పని చేస్తాడు. రైతు. 2018లో గౌహతిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సైకియా ఊరికి తిరిగి వచ్చి టీ ఎస్టేట్లో తండ్రి పనికి సాయంగా ఉంటూ వచ్చాడు. నిజానికి చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట విషయంలో సాయం చేస్తూ వచ్చిన సైకియాకు వంట మీద రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోయిందని ఇంటి వాళ్లు గుర్తించలేదు. అది ఒక ముఖ్య ఉపాధి అని కూడా భావించలేదు. కాని సైకియా మాత్రం తన బెడ్రూమ్లో ఒక మూల చిన్న స్టవ్ను ఏర్పాటు చేసుకొని రకరాల వంటలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్ వరకూ ఇది కొంత రహస్యం గా సాగినా ఇంజనీరింగ్ కోసం గౌహతికి వెళ్లాక ఆ నాలుగేళ్లు అతని ప్రయోగాలకు అడ్డు చెప్పేవారు లేకపోయారు. ఇంటర్నెట్ గురువు ‘నాకు గురువులు లేరు. వంట శాస్త్రం కాలేజీకి వెళ్లి చదువుకోలేదు. నాకు వచ్చిందంతా ఇంటర్నెట్లో రకరకాల షెఫ్లను ఫాలో అయి నేర్చుకున్నదే. నేను మంచి ఫొటోగ్రాఫర్ని. నేను చేసిన వంటలను చాలా ఆకర్షణీయంగా ఫొటోలు తీసి ఇన్స్టాలో పెట్టేవాణ్ణి. అలా అందరి దృష్టి నా మీద పడింది. ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా నా ఇన్స్టా పేజీలో నా వంటలను చూసి నన్ను వెతుక్కుంటూ అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మా ఊరు వచ్చారు. మా ఇంట్లో మా సంప్రదాయ వంటలు వండి చూపించారు. నన్ను మాస్టర్ షెఫ్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్గా తీసుకెళతానని అడిగారు. గట్టిపోటీలో ఈశాన్య రుచులు చూపి ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో అంటే మాటలు కాదు. కొమ్ములు తిరిగిన పార్టిసిపెంట్లు వస్తారు. అనుభవం సంపాదించుకున్నవారు వారిలో ఉంటారు. వారందరితో తలపడి మొదటి స్థానానికి వెళ్లడం చాలా గొప్ప. అదీ గాక జడ్జీలను మెప్పించాలి. ఈ షోకు జడ్జీలుగా వచ్చిన రణ్వీర్ బ్రార్, గరిమ అరోర, వికాస్ ఖన్నాను ఆకట్టుకున్నాడు సైకియా. ‘అందుకు కారణం నేను నా వంటల్లో మా ఊరి దినుసులను దాదాపుగా వాడటం. వాటితో ప్రయోగాలు చేయడం.’ అంటాడు సైకియా. ఎన్నో అడ్డంకులున్నా ఇంత విజయం సాధించాక పెద్ద పెద్ద రెస్టరెంట్లే అతణ్ణి భాగస్వామిని కమ్మని అడుగుతున్నాయి. విజయం అంటే ఇది. కోరుకున్న కలను ఛేదించాలంటే ఇలాంటి పట్టుదలే ఉండాలి. ‘నేను జీవితంలో ఇప్పటికీ పెద్ద రెస్టరెంట్కు వెళ్లలేదు. మా ఊళ్లో లేకపోవడం వల్ల. అంత డబ్బు లేకపోవడం వల్ల. కాని పెద్ద రెస్టరెంట్లలో చేసేవన్నీ నేను అంతకన్నా బాగా చేయడం నేర్చుకున్నాను’ నార్త్ ఈస్ట్ అంటే మాంసాహారం అని ఎక్కువమంది అనుకుంటారు. నేను శాకాహారం రెసిపీలు కూడా చేసి చూపించాను. మణిపూర్ నల్లబియ్యంతో సంగటి వొండితే వారికి బాగా నచ్చింది. ఇక రకరకాల పాస్తాలు చేయడంలో నన్ను మించినవారు లేరు. – నయన్జ్యోతి సైకియా -
Story: ఆమె జ్యోతి.. తన ‘కథ’ తెలుసుకున్న రాణి తిరిగి వస్తుందా?
‘మేడంగారూ ఇవాళ మీ కథ చెప్తానన్నారు కదా?’ మేడంగారి పేరు జ్యోతిర్మయి. అందరూ జ్యోతిమేడం అంటారు. కథ అడిగినావిడ పేరు రాణి. ఇలా రాణి అడిగినప్పుడు అప్పుడే బెంగాల్ కాటన్ కనకాంబరం రంగు చీర కుచ్చిళ్ళు సవరిస్తూ గదిలో నుంచి వచ్చింది జ్యోతి. ‘మీరు చీర కట్టుకుంటే మేడంగారూ రెప్పేయబుద్ధి కాదంటే నమ్మండి.’ రాణి మాటకి జ్యోతి మేడం ముసి ముసిగా నవ్వుకుంది. ‘ఎంతైనా అందంలో మనోళ్ళని మించినాళ్ళు వుండర్లెండి.’ ఈ మాట అన్న రాణి వైపు కోపంగా చూసింది జ్యోతి. ఆమె ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పాతికేళ్ళుగా తెలుగు టీచర్గా పనిచేస్తోంది. భర్త జర్నలిస్టు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. నలభై ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు ఏభైలో పడింది టీచర్. ఇంటి పనీ, బయటి పనీ ఆమె వల్ల కావడం లేదు. అందుకే రాణిని వంటకోసం పెట్టుకున్నారు. రాణి వయసూ టీచరమ్మ వయసూ ఇంచుమించూ ఒకటే అవ్వడం వల్ల ఆమెను రాణిగారూ అంటుంది ఈ టీచర్ గారు. రాణి పదోతరగతి దాకా చదువుకుంది. భర్త తాగుబోతు. కొడుకు ప్రయోజకుడై, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి విషయంలో కంటే వాడి ప్రయోజకత్వం పెళ్ళానికే ఎక్కువ పనిచేసినట్టుంది. అంత బతుకూ బతికి వంట పనిచేసుకుని పొట్ట పోసుకోవలసి వస్తోంది రాణికి. పాపం అందుకే జ్యోతికి రాణి అంటే సానుభూతి. ఎంతైనా స్త్రీ హృదయం కదా. కానీ రాణి దగ్గర నచ్చని విషయం ఏంటంటే మాటి మాటికీ మనాళ్ళూ మనాళ్ళూ అంటూ సాగదీస్తుంది. జ్యోతి ఒడ్డూ పొడుగూ పొందిక అన్నీ చూసి టీచరమ్మ తమ కులమే అని నిర్ధారించేసుకుంది. పనిలో చేరిన రెండో రోజునే ‘మేం ఫలానా అండి టీచర్ గారూ’ అంటూ గొప్పగా తమ ఇంటి పేరు చెప్పింది. మరి మీరో అన్నట్టుగా ఉంది ఆ మాట. మేం ‘బలపాల వారమండి రాణిగారూ’ అంది జ్యోతి . దీంతో టీచరమ్మ మా వాళ్ళమ్మాయే అని పూర్తి నమ్మకంతో అన్నీ ఓపెన్గా మాట్లాడేస్తుంది రాణి. ‘మీరు బలపాలవారా మరి చెప్పేరు కదేమండి టీచర్గారూ. మన వాళ్ళలో బలపాల వారు చాలా బలిసిన వారే ఉన్నారుగా. అదీ సంగతి. మిమ్మల్ని చూసిన మొదటి రోజే అనుకున్నాను.’ ఈ మాటలకు ఒళ్ళంతా కంపరం పుట్టింది జ్యోతికి. కులంతో వచ్చిన అహంకారంతో మాట్లాడుతుందా, లేక అమాయకంగా మాట్లాడుతుందా అన్న తర్జనభర్జన చాలానే జరిగింది జ్యోతిలో. రాణి కుటుంబ నేపథ్యం, ఆమె పడిన అష్టకష్టాలు, బాధలు, ఆమె మనస్తత్వం అన్నీ బాగా స్టడీ చేశాక, ‘పాపం పిచ్చిది ఏదో అలా వాగేస్తుంది అంతే’ అని నిర్ధారించుకుంది. జీవితమంతా దేహానికి అంటుకున్న ముళ్ళను విదిల్చుకుంటూ మనిషితనంతో గుబాళించడమే తెలిసిన జ్యోతికి రాణి వాలకం పెద్ద బాధ కలిగించ లేదు. కానీ రాణికి తన కథ చెప్పి తీరాలన్న కోరిక జ్యోతి మనసులో ఒకానొక ఘడియలో చిన్నగా మొలకెత్తి రాను రాను అది వటవృక్షమై బయటపడాలని హడావుడి చేస్తోంది. అయితే అసలు విషయం తెలిస్తే రాణి ఎక్కడ పారిపోతుందో అని ఒక ఆందోళన. కానీ ఆమెకు తన కథ చెప్తే గానీ తనలో ఏభై ఏళ్ళుగా పేరుకుని గడ్డకట్టి బండబారి కొండలా మారిన నిజం, ముక్క ముక్కలై కరిగి కరిగి నీరై ఆవిరయ్యే అవకాశం లేదని టీచరమ్మ ఆలోచన. చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఊహ తెలిసినప్పటి నుంచి తన మనసులోనే పడిన ఘర్షణ ఒకటే. అదే తన కులం పేరు. తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లు కావడం వల్ల సంఘంలో కొద్దో గొప్పో గౌరవం, మర్యాదా దొరికాయి. కానీ తన కులం పేరు చెప్తే ఆ గౌరవాలూ ఆ మర్యాదలూ ఎక్కడ పోతాయో అని జ్యోతి బడిలో దోస్తుల్ని ఎవరినీ చిన్నప్పుడు తమ వాడలోకి రానిచ్చేది కాదు. వస్తే వాడలో వాతావరణం చూసి తనతో స్నేహం చేయరేమో అని అనుమానం. కాలేజీ రోజుల్లో.. యూనివర్సిటీ రోజుల్లో.. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో బతుకంతా ఇదే బరువు. ఒకటే మోత. ఎవరికీ తెలియని అనంత భారం. ఇలా ఏభయ్యేళ్ళ పాటు కులం అనేది ఆమెను లోపల్లోపల తగలబెడుతూ వచ్చింది. ఆ బూడిదలోంచి తాను తిరిగి పుడుతూ వచ్చింది జ్యోతి. కానీ ఇంతకాలానికి తన కులం పేరు బ్రహ్మాండం బద్దలయ్యేట్లు చెప్పాలన్న కోరిక జ్యోతికి కలిగింది. ‘రాణిగారూ మీరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో తెలుసా’ అని అన్నప్పుడు రాణిగారి మొహంలో కులానికి ఎన్ని రంగులుంటాయో అన్ని రంగులూ చూడాలని టీచరమ్మ ఉబలాటం. జ్యోతి స్కూలుకి వెళ్ళి సెలవు పెట్టి వచ్చింది. కేవలం తన కథ రాణిగారికి చెప్పాలనే. రాణిగారు కూడా కుతూహలంతో ఎదురు చూస్తోంది. జ్యోతి తీరుబడిగా కుర్చీలో కూర్చుంది. రాణి కింద ప్లాస్టిక్ పీట మీద కూర్చుని కూరగాయలు తరుగుతోంది. అలా చూసినప్పుడు భూమి పైకి లేచినట్టు, ఆకాశం కిందకి కూలినట్టు అనిపిస్తుంది జ్యోతికి. యుగాలుగా కింద కూర్చున్న జాతి పైకి, పైన కూర్చున్న జాతి కిందకీ తల్లకిందులైనట్టు అనిపించినప్పుడు జ్యోతిర్మయిలో యుగాలుగా మండుతున్న కసి ఏదో కొంచెం కొంచెం చల్లారుతున్న భావన గొప్ప ఉపశాంతినిచ్చింది. ఈ దృశ్యాన్ని ఏ చిత్రకారుడైనా చిత్రించాలని, దాన్ని పట్టుకుని తన బాల్యపు గతం నుంచి తిరిగి ప్రయాణం మొదలు పెట్టి వర్తమానం దాకా ఊరేగాలని ఆమెకు అప్పుడప్పుడూ అసాధ్యమైన ఊహలు కూడా కలుగుతాయి. అంతలోనే జ్యోతిలోని బౌద్ధ భిక్షుకి నిద్ర లేస్తుంది. ‘పాపం రాణి ఒక చిన్న పిల్లలాంటిది’ అంటూ. ‘కరుణామయులైన వారు తమను మాత్రమే గాక, ఇతరులనూ విముక్తి చేయాలని కోరుకుంటారు.’ బుద్ధుని బోధనల్లో చాలా విలువైన ఈ పంక్తులను తాను మాటి మాటికీ స్మరించుకుంటుంది. అందుకే తనను దహించే అగ్నిని తానే చల్లార్చుకుని రాణిని ఎప్పటిలా ప్రేమిస్తుంది. చిన్న పిల్లల మీద ఎవరైనా కసి తీర్చుకోవాలనుకుంటారా? ఇదీ జ్యోతి అంతరంగం. ‘రాణిగారూ మీకు కులం గురించి ఏం తెలుసు?’ అమాయకంగా మొహం పెట్టిన రాణి వైపు చూసి జ్యోతి నవ్వుకుంది. మీకొక కథ చెప్పనా అని సమాధానం రాకుండానే చెప్పింది. ‘ గౌతముడు తన దగ్గరకు వచ్చిన సునీత అనే అంటరాని కులస్తుడిని తన సంఘంలో చేర్చుకున్నాడు. అతని వృత్తి వీధులు ఊడ్వడం. నువ్వు మా సంఘంలో ఏం చేస్తావు అని ఒక సాటి భిక్షువు అతడ్ని అడిగాడట. అప్పుడు సునీత అనే అతను ఏం చెప్పాడో తెలుసా? ‘ నేను ఇన్నాళ్ళూ వీధులు ఊడ్చాను. ఇప్పుడు మనుషుల మనో వీధులు శుభ్రం చేస్తాను’ అన్నాడట. ఎంత బాగా చెప్పాడో కదా?’ అంటూ రాణి మొహంలోకి చూసింది జ్యోతి. రాణి.. పాఠం అర్థం కాని పిల్లలా మొహం పెట్టింది. అప్పుడు మళ్ళీ ఇలా అంది.. ‘రాణిగారూ కులానికి ఏ విలువా లేదు. వ్యక్తి చేసే పనికే విలువ వుంటుంది. ఒకసారి అశోకుడితో ఆయన మంత్రి.. ప్రభూ మీరు అన్ని రకాల కులాలకు చెందిన భిక్షువులకు సాష్టాంగపడి, పాదాభివందనం చేయడం సబబుగా లేదు అన్నాడు. దానికి అశోక చక్రవర్తి ఏమన్నాడో తెలుసా రాణిగారూ?’ ‘ ఏమన్నారండీ?’ ‘ఉచితంగా ఇచ్చినా ఎవ్వరూ ఆశించని విలువ లేని వస్తువు ఈ నా శిరస్సు. దీనిని ఓ పవిత్రకార్యానికి వినియోగించే అవకాశమే నేను భిక్షువులకు చేసే పాదాభివందనం అని అశోకుడు బదులిచ్చాడు. ఎంత గొప్ప మాట ఇది రాణిగారూ! అర్థమైందా?’ ‘ఏమోనమ్మా. అన్నట్టు అశోకుడు మన వాడేనంటగా ఎవరో అంటే విన్నాను.’ ఈ మాటతో తల పట్టుకుంది టీచరమ్మ. ఈమెకు ఎలా వివరించి చెప్పాలబ్బా అని తనలో తనే తెగ ఘర్షణ పడింది. ఒక మనిషి గొప్పతనం పుట్టుకతో రాదని, రంగుతో రాదని, కులంతో రాదని, అతని ఆచరణతోనే వస్తుందని తాను చదివిన బౌద్ధ బోధనల్లోని సారాన్ని కథలు కథలుగా చెప్పాలని ప్రయత్నించింది. కానీ ఆమెకు ఎక్కడా ఎక్కలేదు. ‘మేడంగారూ మీ ఊరి కథ చెప్పండి బాబూ ఇవన్నీ నాకెందుకు’ అనేసింది. ‘ సరే చెప్తాను వినండి. మా ఊరి కథలోనే నా కథ కూడా వుందన్నాను కదా. అర్థం చేసుకోండి మరి. అసలు నిజానికి నూజివీడు అనేది ముందు నువ్వు చేల వీడు. ఒకసారి ఉయ్యూరు నుంచి దొరగారు వచ్చి ఆ నువ్వు చేల వనాన్ని చూశాడట. అక్కడ తోడేలు, మేకపోతూ భయంకరంగా కొట్లాడుకోవడం చూసి ఆశ్చర్యపోయాడట. ఇదేదో పౌరుషం గల నేలలా వుందే అనుకుని అక్కడ కోట కట్టించుకున్నాడట. ఆయనతో పాటు మరి కొందరు దొరలు కూడా వచ్చారు. అది క్రమంగా నువ్వుచేలవీడు, నూజేలవీడు అయ్యి.. చివరికి నూజివీడు అయ్యింది.’ ‘భలే కథండి టీచర్గారూ, ఇంతకీ మీ కథేంటో మరి..!’ ‘అక్కడికే వస్తున్నాను మరి. దొరలకు సేవకులు కూడా అవసరమే కదా.. బలాపాముల అనే ఊరి నుంచి ఇద్దరు బలమైన పొడవైన వ్యక్తుల్ని తమ కోటకు తెచ్చుకున్నారట. ఆ ఇద్దరు వ్యక్తుల సంతాన వారసత్వమే మేము.’ ‘అదేంటండీ మనోళ్ళు దొరలకు సేవ చేయడానికి వచ్చారా? అబ్బే నాకేం నచ్చలేదు ఈ కథ.’ తరుగుతున్న కూరగాయల్ని పక్కనే పెట్టి రాణి, గోడకి చేరబడి రెండు మోకాళ్ళూ మునగదీసుకుని రెండు చేతులతో వాటిని పట్టుకుని ‘సరే చెప్పండి తర్వాతేమైందో ’ అన్నది. ‘ఆగండి రాణి గారూ. అప్పుడే కంగారెందుకు? మీరు కంగారు పడాల్సిన విషయాలు చాలా వున్నాయి’ అంటూ తిరిగి కథ అందుకుంది. ‘మా తాతలు ఇద్దరు ఎంత పొడగరులంటే తాటి చెట్లను రెండు చేతులతో పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోగలరు’ జ్యోతి మాటలకి నోరు వెళ్ళబెట్టింది రాణి. ‘చెట్లనే కాదండీ, పశువుల కళేబరాలను కూడా ఒంటిచేత్తో ఈడ్చి పారేసేవారు.’ ఈ మాట విన్నది విన్నట్టే రాణి, గోడకు అతుక్కుపోయి నోరు తెరిచింది. వెంటనే తేరుకోని ‘అదేంటి మేడంగారూ కళేబరాలేంటి? మనోళ్ళకి అదేం ఖర్మ?’ అంది ‘అవును అది మా తాతల వృత్తి మరి.’ ఆ మాటతో గోడకు జారబడ్డ రాణి ఎవరో మంత్రించినట్టు ఉన్నట్టుండి శిలావిగ్రహంలా మారిపోయింది. ఏదో అనాలని నోరు తెరవబోయింది. జ్యోతి, ‘ఆగు. ఏం మాట్లాడకు. చెప్పేది విను’ అని హూంకరించింది. ఎప్పుడూ రాణిగారూ అనే మేడం ఒక్కసారిగా ఏకవచన సంబోధన చేసిన విషయం కూడా గమనించలేదు రాణి. జ్యోతి చెప్పుకుంటూ వెళ్లింది.. ‘అవును మా ముత్తాతలు ఆ పనే చేసేవారు. ఒకరు పెద రామయ్య, ఒకరు చినరామయ్య. దొరల సంతానం కోటలో పెరిగింది. మా తాతల సంతానం పేటలో పెరిగింది. గొడ్ల కోతలో, చెప్పుల చేతలో వారిని కొట్టే వారు రాజమహేంద్రం దాకా విస్తరించిన నూజివీడు జమీనులో ఒక్కడూ లేడంట. అంత గొప్పోళ్ళు మా తాతలు. జాగ్రత్తగా విను’ ఇక గారు అనడం మర్చిపోయింది జ్యోతి. ‘ వింటున్నావా..?’ ‘ ఆ.. ఆ.. ’ అని తడబడుతూ తలూపింది రాణి. ‘మా తాతల కళా నైపుణ్యం గురించి చాలా చెప్పాలి. గొడ్లను కోసి వాటి చర్మాలను ఇంటికి తెచ్చినప్పుడు ఏదో రాజ్యాన్ని జయించి భుజం మీద ఆ రాజ్యాన్ని మోసుకు వస్తున్నంత గర్వంగా కనపడేవారట అందరికీ. ఆ తర్వాత చాలా కాలం ఆ వృత్తి మా వాళ్ళు చేశారు. మా మేనమామ, ఆయన పిల్లలూ ఆ పని చేయడం నేను దగ్గరగా చూశాను. నాకు ఆ పనులన్నీ చూడ్డం ఇష్టమే కాని, వాటిని నా స్నేహితులు చూడ్డం ఇష్టం ఉండేది కాదు. అందుకే ఎవరినీ రానిచ్చే దాన్ని కాదు మా ఇంటికి. చర్మాన్ని నేల మీద పరచి కత్తితో గీరి, ఉప్పు రాసి సున్నం నీటిలో తంగేడు చెక్క, కరక్కాయలు వేసి మూడు నాలుగు రోజులు నానబెట్టేవారు. అబ్బా ఆ కంపు భరించలేక చచ్చేవాళ్ళం’ఇలా అని రాణి వంక కసిగా చూసింది జ్యోతి. వాసనేదో వస్తున్నట్టే అనిపించినా ముక్కు మూసుకోవాలన్న స్పృహ కూడా లేకుండా అలాగే కూర్చుని వింటోంది రాణి. జ్యోతిని చూడ్డానికి భయం కూడా వేస్తోంది ఆ సమయంలో. ‘నానబెట్టిన చర్మాన్ని తీసి, వెంట్రుకలన్నీ గీకి, దాన్ని నేల మీద గట్టిగా లాగి నాలుగు వైపులా మేకులు కొట్టి ఎండబెట్టేవారు. అప్పుడు వాళ్ళు ఆకాశాన్ని నేల మీద పరిచినంత సంబరపడిపోయేవారు. ఎండిన చర్మాన్ని గంజి రాసి రోల్ చేసి మడత పెట్టి, కొన్ని రోజుల తర్వాత ఆ చర్మాన్ని అనేకానేక రూపాల్లో కత్తిరించి చెప్పులు తయారు చేసేవారు. దొరల పాదాల కింద తరించడానికి తమ జీవితాలనే కత్తిరించుకున్నంత సంతృప్తి పడేవారు. ఇప్పుడు అర్థమైందా మా ఊరి కథ.. నా కథ..? అర్థమైందా నేనెవరో?’ గద్దించినట్టు జ్యోతి అనేటప్పటికి ఉలిక్కిపడింది రాణి. రాతి బొమ్మలో చలనం వచ్చినట్లయింది. జ్యోతి కూడా ఉన్నట్టుండి ఉలిక్కిపడింది. తానెక్కడికో వెళ్ళిపోయింది. స్పృహలోకి వచ్చినట్టు ఒకసారి కలయజూసింది. రాణిగారూ రాణిగారూ అని కలవరించినట్టు అరిచింది సన్నగా. మేడంగారూ మేడంగారూ అని రాణి కూడా కలవరించింది. జ్యోతికి అంతలోనే రాణి మీద జాలి, కరుణ ప్రేమ తన్నుకొచ్చాయి. ‘సారీ అండీ రాణిగారూ. నాలో ఎవరో పూనినట్టున్నారు. నా గురించి నేను మనసారా చెప్పుకోవాలన్న జీవితకాలపు కోరికలో నన్ను నేనే మరిచిపోయి చాలా వికృతమైన ఆనందాన్ని పొందాను. సారీ. ఏమీ అనుకోకండి.’ ‘అయ్యో.. అంత మాటెందుకు మేడంగారూ. నా పిచ్చి మాటలతో వెన్నపూసలాంటి మిమ్మల్ని ఎంత కోతపెట్టానో పిచ్చి ముండని. పిచ్చి ముండని’ అనుకుంటూ తనలో తనే ఏదో గొణుక్కుంటూ వంట ఏదో అయ్యిందనిపించి త్వరగా వెళ్ళిపోయింది రాణి. ఉదయమే వచ్చింది. వస్తూ వెంట ఎవరినో తీసుకొచ్చింది. ‘ మీకు వంటకి ఇబ్బంది కలక్కూడదని ఈమెను తీసుకు వచ్చా మేడంగారూ. నేను కాశీకి పోతున్నాను. గంగలో మునిగితేనే గానీ నా పాపానికి విరుగుడు లేదు. పాపిష్టి దాన్ని మీ మనసెంత నొప్పించానో. నా కడుపుకింత కూడు పెట్టిన మిమ్మల్ని కులం కులం అని ఎంత క్షోభ పెట్టానో. వస్తానమ్మా.. బతికి బాగుంటే మళ్ళీ మీ దగ్గరకే వస్తాను టీచర్గారూ. మీరు క్షమిస్తారు. మీ మనసు నాకు తెలుసు. ఆ గంగమ్మ క్షమిస్తుందో లేదో..’ కథలూ సీరియల్సూ చదివే అలవాటున్న రాణి తనకు తెలిసిన భాషలో ఏదో అనేసి విసురుగా వెళ్ళిపోయింది. జ్యోతినుంచి సమాధానం కూడా వినలేదు. జరిగిందంతా రాత్రికి సహచరుడు సురేష్కి చెప్పి కొంత ఉపశమనం పొందింది జ్యోతి. రాణి మనసు గాయపరచానేమో అని దిగులుపడిపోతోంది. ‘జీవితమంతా ఒక కొండను లోపల మోసుకుంటూ తిరిగావన్న మాట. నాక్కూడా ఎప్పుడూ చెప్పనే లేదు. పోన్లే ఇప్పటికైనా బరువు దించుకున్నావు. ఆమె గురించి ఆలోచించకు. తానేదో పాపం చేసిందని, ఆ పాపం కడుక్కోవడానికి కాశీకి వెళ్ళిందని ఆమె చెప్తే నువ్వు నమ్ముతున్నావు. కానీ ఆమె నీ దగ్గర పనిచేసి పాపపంకిలమైనందుకు ప్రాయశ్చిత్తం చేసుకోడానికి వెళ్లిందని నేను అనుకుంటున్నాను. వదిలేయ్. పడుకో. ఇన్నేళ్ళూ నువ్వు కోల్పోయిన నిద్రను ఈ రాత్రికి సంపూర్ణంగా ఆస్వాదించు’ అని కళ్ళు మూసుకున్నాడు సురేష్. జ్యోతికేవేవో జ్ఞాపకాలు గుండెల్లో సుడులు తిరిగాయి. తనకు ప్రమేయం లేని తన పుట్టుక తన బతుకంతా ఒక కొండలా కాళ్ళకి ఎలా చుట్టుకుందో, ఎవరికీ కనపడని ఆ బరువును ఈడ్చుకుంటూ ఎలా నడిచిందో.. తలుచుకుంటూనే భయపడిపోయింది. ఎన్నో ఘటనలు.. ఎంతో కన్నీరు. ఒంటె తన అవసరానికి మంచి నీళ్లను దేహంలో దాచుకుంటుందట. జ్యోతి కన్నీళ్ళు దేహంలో దాచుకునే విద్యను చిన్నప్పుడే అభ్యసించింది. ‘ఏమో ఆమె తిరిగి వస్తుందనే నా నమ్మకం’ జ్యోతి తనలో తాను అనుకుంటూనే పైకి అనేసింది. ‘అది నీ పిచ్చి నమ్మకం జ్యోతీ..’ ‘కొన్నిసార్లు సిద్ధాంతంతో కూడిన సందేహం కంటే ప్రేమతో కూడిన నమ్మకమే గెలుస్తుంది సురేష్!’ ‘నేను మాత్రం రాణి తిరిగి వస్తుందంటే ససేమిరా నమ్మను. ఆమె కులం ఆమెను రానివ్వదు’అన్నాడు. ‘ఏమో సురేష్ , ఆమె వస్తుందనుకుంటే నా మనసుకు రిలీఫ్గా వుంది.’ ‘చూద్దాం అంటే చూద్దాం’ అని ఇద్దరూ చెరో వైపూ తిరిగి కళ్ళు మూసుకున్నారు. జ్యోతి కన్నుల మీద రాత్రంతా గంగానది ప్రశాంతంగా ప్రవహిస్తూనే వుంది. ఆ అలల మీద ఒకే ప్రశ్న తేలియాడుతోంది. ‘ఇంతకీ ఆమె వస్తుందా..?’ చదవండి: కథ: కొత్త బట్టలు.. మా యమ్మ ఫోన్ సేసి అడిగినప్పుడ్నుంచి ఏడుచ్చా పనుకున్యా! -
మహిళ కష్టం చూసి చలించిన సీఎం జగన్
-
తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
సాక్షి, కోనసీమ(అల్లవరం): తల్లీకుమార్తెల సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. మాజీ ప్రియుడ్ని తన వైపు తిప్పుకునే క్రమంలో ఓ మహిళ పన్నాగానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ నెల 2వ తేది తెల్లవారుజామున సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి సజీవదహనమైన సంగతి తెలిసిందే. అమలాపురం రూరల్ సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమరగిరిపట్నానికి చెందిన సురేష్, జ్యోతి ప్రేమించుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకుని గోడితిప్పలో నివసిస్తున్నారు. అంతకుముందు సురేష్కు నాగలక్ష్మి అనే వివాహితతో వివాహేతర సంబంధముండేది. పెళ్లయిన తర్వాత ఆమెకు దూరమవడంతో నాగలక్ష్మి ఎలాగైనా జ్యోతి సురేష్లను విడదీయాలనుకుంది. ఇందులో భాగంగా సురేష్ ఇంటి వద్ద ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పడేసేది. ఇందుకు తన సవతి కుమార్తెలు సౌజన్య, దివ్య హరితలను వినియోగించుకునేది. ఆ ఉత్తరాలలో జ్యోతికి అక్రమ సంబంధం ఉన్నట్లు రాసేవారు. వాటిని చదివినా సురేష్ ఆమెతో ప్రేమగానే ఉండేవాడు. ఇలా కాదని జ్యోతిని హతమారిస్తే సురేష్ తనకు దగ్గరవుతాడని భావించింది. ఇదే సమయంలో జ్యోతి తన పుట్టింటికి వెళ్లింది. చదవండి: (తీరని శోకం: రెండు కుటుంబాలు.. నలుగురు బిడ్డలు..) ఈనెల 2వ తేదీ రాత్రి తన తల్లి సాధనాల మంగాదేవితో కలిసి పడుకుంది. ఇదే అదునుగా నాగలక్ష్మి తన సవతి కుమార్తెలిద్దరినీ ఉసి గొల్పింది. నిద్రిస్తున్న తల్లీ కూతుళ్లపై పెట్రోలు పోయాలని చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి తల్లీకూతుళ్లపై పెట్రోలు పోసి బయటకు వచ్చి నిప్పంటించారు. కాసేపటికే మంటలు ఎగసిపడుతుండటంతో జ్యోతి తండ్రి లింగన్న మేల్కొన్నాడు. మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికే మంగాదేవి, జ్యోతి సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి చురుగ్గా దర్యాప్తు చేశారు. ఈ హత్యతో సంబంధమున్న నాగలక్ష్మ, సౌజన్య, దివ్య హరితలను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితులనురాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దర్యాప్తులో ఎస్సై ప్రభాకరరావు, కానిస్టేబుళ్లు ధర్మరాజు, సుభాకర్, క్రైం పార్టీకి చెందిన కానిస్టేబుల్ బాలకృష్ణ, రామచంద్రరావు, జి.కృష్ణసాయి, డి.అర్జున్ కీలక భూమిక పోషించారు. చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు) -
ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..
సాక్షి, సిటీబ్యూరో/నాగోలు: నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న కొలిపాక శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హతురాలు అతడికి రెండో భార్య అని, ఆమె ప్రియుడితో గడపడానికి అంగీకరించినట్లు నటించి ఇద్దరినీ అంతం చేశాడని పోలీసులు తేల్చారు. ఏసీపీ కె.పురుషోత్తమ్రెడ్డితో కలిసి గురువారం డీసీపీ సన్ప్రీత్సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం నగరానికి వలసవచ్చి.. విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన కొలిపాక శ్రీనివాసరావు మొదటి భార్య ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సత్యవతి అలియాస్ జ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. ఐదుగురు సంతానంలో ఇద్దరికి వివాహాలు కాగా... మిగిలిన ముగ్గురూ విజయవాడలో నానమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఏడాది క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీనివాసరావు తన భార్య జ్యోతితో కలిసి నగరానికి వలస వచ్చాడు. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఇతడు ఆరు నెలలు పార్శిగుట్టలో ఉండి ఆపై వారాసిగూడకు మారాడు. నామాలగుండులో ఉంటున్న సమయంలో బౌద్ధనగర్కు చెందిన యడ్ల యశ్వంత్ అలియాస్ బన్నీతో జ్యోతికి పరిచయం ఏర్పడింది. గతంలో బన్నీ క్యాబ్ డ్రైవర్గా పని చేసేవాడు. ఓ సందర్భంలో జ్యోతి అతడి క్యాబ్ బుక్ చేసుకోవడంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సన్ప్రీత్సింగ్ వినకపోవడంతో ‘వదిలించుకోవాలని’... వారి మధ్య వివాహేతర సంబంధం విషయం కొన్నాళ్ల క్రితమే శ్రీనివాసరావుకు తెలిసింది. మందలించినప్పటికీ జ్యోతి తన ప్రవర్తన మార్చుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ తన ఇంట్లోనే ఏకాంతంగా గడుపుతున్నారని తెలిసి శ్రీనివాసరావు ఆవేశంతో రగిలిపోయాడు. మాట వినని జ్యోతితో పాటు ఆమెను లోబర్చుకున్న బన్నీని అంతం చేయాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు. తొలుత జ్యోతిని తీసుకుని విజయవాడకు కాపురం మారిస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించాడు. ఇదే విషయం ఆమెకు చెప్పిన శ్రీనివాసరావు గత వారమే సామాన్లు పంపేశాడు. ఆదివారం బైక్పై ఇద్దరూ విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఆ సందర్భంలో జ్యోతి ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ శ్రీనివాసరావుతో చెప్పింది. ఇలాంటి సందర్బం కోసమే ఎదురు చూస్తున్న అతడు వెంటనే అంగీకరించి ఆమెతోనే బన్నీకి ఫోన్ చేయించి తన ఇంటికి రప్పించాడు. నగర శివార్లకు వెళ్లిన తర్వాత అనువైన ప్రాంతంలో ఇద్దరూ ఏకాంతంగా గడపాలని, ఆపై తాము విజయవాడ వెళ్లిపోతామని, నువ్వు వెనక్కు వచ్చేయమంటూ బన్నీకి చెప్పాడు. సుత్తితో కొట్టి, స్క్రూడ్రైవర్తో పొడిచి... దీంతో నామాలగుండు నుంచి శ్రీనివాసరావు, జ్యోతి ఒక వాహనంపై బన్నీ తన సోదరుడి వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కున్నారు. అనంతరం ముగ్గురూ అబ్దుల్లాపూర్మెట్ మండలం, కొత్తగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల మధ్యలో శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా... కాస్త దూరంలో జ్యోతి, బన్నీ ఏకాంతంగా గడుపుతున్నారు. ఇద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో తన వాహనంలో నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్ తీసుకుని వెళ్లి వారిపై దాడి చేశాడు. తేరుకునే లోపే ఇద్దరి తలపై కొట్టాడు. ఆపై స్క్రూడ్రైవర్తో విచక్షణారహితంగా పొడిచాడు. సమీపంలో ఉన్న రాయితో బలంగా మోది చంపేశాడు. అక్కడ నుంచి జ్యోతి సెల్ఫోన్ తీసుకుని తన వాహనంపై విజయవాడకు వెళ్లిపోయాడు. మంగళవారం ఈ హత్యలు వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్మెట్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వి.స్వామి, ఎస్సై డి.కరుణాకర్రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.అంజిరెడ్డి నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి వాహనంతో పాటు హత్యకు వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
యర్రాజి జ్యోతికి స్వర్ణం
కోజికోడ్: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యర్రాజి జ్యోతి పసిడితో మెరిసింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. 13.08 సెకన్ల టైమింగ్తో ఆమె రేస్ను పూర్తి చేసింది. నిజానికి జ్యోతి నమోదు చేసిన టైమింగ్కు జాతీయ రికార్డుగా గుర్తింపు దక్కాలి. 2002లో అనురాధ బిశ్వాల్ నమోదు చేసిన 13.38 సెకన్లను ఆమె సవరించింది. అయితే నిబంధనల ప్రకారం గాలి వేగంలో ఉండే మార్పుతో అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉండటం వల్ల (టెయిల్ విండ్) దానిని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. టెయిల్ విండ్ను 2 మీటర్/సెకన్ వరకు అనుమతిస్తుండగా, ఈ రేస్ సమయంలో అది 2.1 మీటర్/సెకన్గా నమోదు కావడంతో జ్యోతికి నిరాశ తప్పలేదు. మహేశ్వరికి కాంస్యం... మహిళల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో తెలంగాణ అథ్లెట్ జి. మహేశ్వరి కాంస్యం గెలుచుకుంది. 10 నిమిషాల 47.30 సెకన్లలో రేస్ను పూర్తి చేసిన మహేశ్వరి మూడో స్థానంలో నిలిచింది. -
అంతర్జాతీయ మారథాన్లలో వరంగల్ ‘జ్యోతి’
సాక్షి, వరంగల్: పాప జన్మించిన సమయంలో ఆమెకు థైరాయిడ్ సమస్య నిర్ధారణ అయింది. మందులతోనే సమస్య తగ్గదన్న వైద్యుడి సూచన మేరకు తొలుత యోగా, వాకింగ్ మొదలుపెట్టిన ఆమె.. ఆ తరువాత పరుగుపై దృష్టిపెట్టింది. ఆమె ప్రారంభించిన పరుగు 46వ ఏట పూర్తిస్థాయిలో పట్టాలెక్కింది. తొలుత భారత్లో జరిగిన మారథాన్లలో పరుగులు పెట్టిన ఆమె కాళ్లు...అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న ఐదు మారథాన్లను చుట్టివచ్చాయి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి వయస్సు 51 ఏళ్లు. ఆమె ఇటీవల లండన్ మారథాన్లో లక్ష్యాన్ని పూర్తి చేసి మెడల్ దక్కించుకొని వరంగల్ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమ్మకాన్ని పెంచిన ముంబై మారథాన్ 23 ఏళ్ల వయసులో థైరాయిడ్ వచ్చింది. బరువు పెరిగి ఏ పని చేయాలన్నా శరీరం సహకరించలేదు. మందులతోపాటు వ్యాయామం చేస్తే ఫలితాలు ఉంటాయని వైద్యులు చెప్పారు. కొన్నాళ్ల పాటు ఇంటి పరిసరాల్లోనే యోగా, వాకింగ్ చేసేదాన్ని. అయితే కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్ కేబీఆర్ పార్కుకు వాకింగ్ వెళ్లా. ఆ సమయంలో మారథాన్ క్లబ్ గురించి తెలుసుకొని వారి వద్ద శిక్షణలో చేరా. ఇందుకోసం అత్యంత కష్టమైన ట్రెక్కింగ్ కూడా చేశాను. వారానికి రెండుసార్లు లాంగ్రన్లు, నిత్యం వ్యాయామం చేశా. విశాఖపట్నం, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లో ఎక్కడా మారథాన్ నిర్వహించినా వెళ్లి పాల్గొన్నా. 2016 మేలో శిక్షణ ప్రారంభించిన ఏడాదిలోనే విశాఖపట్నంలో జరిగిన హాఫ్ మారథాన్ పూర్తి చేశా. 2017 జనవరిలో ముంబైలో జరిగిన 42.2 కిలోమీటర్ల మారథాన్ను 4.55 గంటల్లో పూర్తి చేయగలిగా. అప్పుడు నాకు నమ్మకం బాగా పెరిగింది. 2018లో హైదరాబాద్లో జరిగిన 55 కిలోమీటర్ల అల్ట్రా మారథాన్లో రెండో స్థానం సాధించా. వీటన్నింటి తర్వాత నా దృష్టి విదేశాల్లో జరిగే మారథాన్లపై పడింది. మేజర్ మారథాన్లలో పాల్గొంటూ.. జర్మనీలోని బెర్లిన్, అమెరికాలో బోస్టన్, షికాగో, న్యూయార్క్, లండన్, జపాన్లోని టోక్యోలో అంతర్జాతీయ మారథాన్లు జరుగుతాయి. విపరీతమైన వేడి ఉండే దుబాయ్ మారథాన్లో ఐదు గంటలపాటు పరిగెత్తాను. ఉక్కపోతతో పరుగు తీయడం కష్టంగా మారినా లక్ష్యాన్ని చేరుకున్నా. 2018 నుంచి 2019లోపు వరల్డ్ మేజర్ మారథాన్లైన బెర్లిన్, బోస్టన్, షికాగో, న్యూయార్క్ మారథాన్లలో దిగ్విజయంగా పరుగులు పెట్టా. ఇటీవల లండన్లో జరిగిన మారథాన్లో 42.6 కిలోమీటర్లను ఐదు గంటల 15 నిమిషాల్లో చేరా. జపాన్లోని టోక్యోలో జరిగే మారథాన్లో పాల్గొంటే నా కల పూర్తిగా సాకారమవుతుంది. వరంగల్లోనూ మారథాన్ నిర్వహించేలా పరుగు కోసం చాలా సమయం కేటాయించాలి. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మరోవైపు మారథాన్లో పాల్గొనడంపై దృష్టి సారించా. హైదరాబాద్ రన్నర్స్ ఏటా మారథాన్ నిర్వహిం చినట్టుగా వరంగల్తోపాటు భూపాలపల్లిలోనూ 5కే, 10కే రన్ నిర్వహించాలనుకుంటున్నా. టోక్యో లో మారథాన్ పూర్తిచేశాకే దీనిపై దృష్టిసారించి యువతకు ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తా. -
బిగ్బాస్: మెరుపుతీగలా వచ్చిపోయింది వీళ్లే!
Telugu Bigg Boss, 1st Week Eliminated Contestants: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అంటే ఇదేనేమో.. బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చినా ప్రేక్షకులు కనికరించకపోవడంతో మొదటివారమే ఇంటిబాటపట్టారు చాలామంది సెలబ్రిటీలు. బిగ్బాస్ ఆడే నాటకంలో వారం రోజులకే ఎలిమినేట్ అవక తప్పలేదు. తెలుగు బిగ్బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఐదుగురు సెలబ్రిటీలు అందరి కంటే ముందే షోలో ఎలిమినేట్ అయ్యారు. వారెవరన్నది చూసేద్దాం.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్బాస్ తొలి సీజన్లో నటి జ్యోతి అందరికంటే ముందుగా ఎలిమినేట్ అయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించిన రెండో సీజన్లో సంజన అన్నె షోలో అడుగు పెట్టిన వారం రోజులకే అందరికీ వీడ్కోలు పలుకుతూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కింగ్ నాగ్ బిగ్బాస్ హోస్టింగ్ను భుజానికెత్తుకున్న మూడో సీజన్లో నటి హేమ మొదటివారమే ఎలిమినేట్ అయింది. నాలుగో సీజన్లో సూర్య కిరణ్ను ఎలిమినేట్ చేయగా తాజా సీజన్లో సరయూ ఫస్ట్ వీక్లోనే బయటకొచ్చింది. అయితే వీరిలో కొందరు కోపం, కొట్లాటల కారణంగానే ముందుగా ఎలిమినేట్ అయ్యారనేది తెలిసిన విషయమే. కాకపోతే ఒక్కవారంలోనే కంటెస్టెంట్లను జడ్జ్ చేయడం సరికాదని బిగ్బాస్ వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా నామినేషన్స్లోకి వచ్చినవారిలో కొందరిని బిగ్బాస్ కావాలని నెగెటివ్గా చూపిస్తారనేది కూడా కొంతమంది వాదన. మరికొందరినేమో కనీసం తెర మీద కూడా చూపించకుండా మాయ చేస్తాడనేది మరో విమర్శ. అందుకే ఎన్నో ఆశలతో బిగ్బాస్ షోలో అడుగు పెట్టే కంటెస్టెంట్లకు వారేంటో నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం. ఇందుకుగానూ తొలివారం ఎలిమినేషన్ను ఎత్తేస్తే బాగుంటుందని బుల్లితెర అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? -
అయ్యో జ్యోతి: అప్పట్లో సంచలనం.. ఇప్పుడు విషాదం
తండ్రి ఆరోగ్యం బాగోలేదు. పైగా లాక్డౌన్ కష్టాలు. అందుకే ఆ కూతురు సాహసానికి పాల్పడింది. వారంపాటు 1200 కిలోమీటర్లపైగా సైకిల్ మీద తండ్రిని ఇంటికి చేర్చింది. సైకిల్ జ్యోతి కుమారి సాహసానికి, ధైర్యానికి అప్పట్లో సర్వత్రా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఇంట విషాదం నెలకొంది. పాట్నా: సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ త్యాగరాజన్ ప్రకటించారు. ఏ తండ్రి కోసమైతే జ్యోతి కుమారి అంత కష్టానికి ఓర్చిందో.. ఆ తండ్రే ఇక లేరని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని త్యాగరాజన్ అన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు కూడా. కాగా, జ్యోతి కుటుంబ స్వస్థలం బిహార్లోని దర్బంగా. యాక్సిడెంట్ తర్వాత.. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ ఆటో డ్రైవర్. బతుకు దెరువు కోసం ఢిల్లీలోని గురుగ్రామ్కు వెళ్లాడు. ఇక పదో తరగతి ఫెయిల్ అయిన పెద్దకూతురు జ్యోతి కూడా ఆయతో పాటే వెళ్లింది. మోహన్ భార్య మిగిలిన పిల్లలతో ఊరిలో ఉండేది. పోయినేడాది ఓ రోడ్డు ప్రమాదంలో మోహన్ గాయపడ్డాడు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. సరిగ్గా అదే టైంలో లాక్డౌన్ వచ్చి పడింది. ఇంటి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓనర్ ఖాళీ చేయమన్నాడు. దీంతో తండ్రి ఆరోగ్య దృష్ట్యా ఊరికి వెళ్లాలని జ్యోతి అనుకుంది. సైకిల్పై తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది. వారం కష్టం జబ్బు పడిన తండ్రి మోహన్ను సైకిల్ పై కూర్చోబెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టింది జ్యోతి. రోజూ ముప్ఫై నుంచి నలభై కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కింది. మధ్య మధ్యలో కొందరు ట్రక్ డ్రైవర్లు లిఫ్ట్, భోజనం ఇచ్చి సాయపడ్డారు. మొత్తానికి వారం తర్వాత ఇంటికి చేరుకుంది. జ్యోతి ప్రయత్నానికి అప్పట్లో దేశమంతా సలాం కొట్టింది. అంత చిన్న వయసులో ఏమాత్రం అధైర్యపడకుండా... ఎక్కడా అలసిపోకుండా... అంత సుదీర్ఘ దూరం ఆమె సైకిల్పై ప్రయాణించడం అప్పట్లో అంతా మెచ్చుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం జ్యోతి తెగువకు హ్యాట్సాఫ్ చెబుతూ బాలపురస్కార్ ప్రకటించారు. ఇవాంక ట్రంప్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా సైకిల్ జ్యోతి సాహసంపై స్పందించారు. అయితే ఆ టైంలో కొంత సాయం అందినప్పటికీ.. ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకోలేదని తెలుస్తోంది. జ్యోతి కుటుంబానికి సాయం జ్యోతి కథనాల తర్వాత అధికారులు ఆమెకు కొంత సాయం అందించారు. అప్పట్లో సైక్లింగ్ ఫెడరేషన్ కూడా జ్యోతిని సైకిల్ రైడర్గా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే జ్యోతి తల్లి మాత్రం కూతురి చదువే మొదటి ప్రాధాన్యంగా పేర్కొంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన జ్యోతి కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. దీంతో సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. -
పవన్ కల్యాణ్ నాపై ఏకంగా కవిత్వం రాశారు: నటి
బిగ్బాస్ తెలుగు మొదటి సీజన్ కంటెస్టెంట్, నటి జ్యోతి పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. షూటింగ్ సెట్స్లో అందరూ తన వెనకాలే పడేవారని, రకరకాల ప్రయత్నాలు చేస్తూ తనకు ట్రై చేసేవారని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె పవన్ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. ‘అందరూ షూటింగ్ సెట్లో పవన్ కల్యాణ్ ఎవరితో మాట్లాడరని, ఆయన పని ఆయన చేసుకుంటారని చెబుతుంటారు. కానీ షూటింగ్ సెట్స్లో ఆయన నాతో చాలా సరదాగా ఉండేవారు. విరామ సమయంలో నాతో ఎక్కువగా మాట్లాడేవారు. అంతేకాదు ఆయన నాపై ఓ కవిత్వం కూడా రాశారు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా పవన్తో జ్యోతి గుడుంబా శంకర్ మూవీ నటించిన సంగతి తెలిసిందే. హంగామా, ఎవడి గోల వాడిది, మహాత్మ, పెళ్లాం ఊరెళితే వంటి సినిమాల్లో నటించిన జ్యోతికి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన తెలుగు బిగ్బాస్ మొదటి సీజన్లో ఆమె పాల్గోనే అవకాశం వచ్చింది. దీంతో బిగ్బాస్ హౌజ్ అడుగు పెట్టిన ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఇక అప్పటి నుంచి జ్యోతి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటు అప్పడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. చదవండి: నాకో ప్రియుడు కావాలి, డేటింగ్కు వెళ్తా: జ్యోతి హాట్ టాపిక్గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ -
‘సైకిల్ గర్ల్’కు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
పట్నా: లాక్డౌన్ నేపథ్యంలో సైకిల్పై తండ్రిని ఎక్కించుకుని సుదీర్ఘ ప్రయాణంతో స్వగ్రామానికి చేరుకున్న జ్యోతి కుమారికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చిన ప్రభుత్వం ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందజేసింది. జ్యోతితో పాటు దేశవ్యాప్తంగా మరో 32 మంది చిన్నారులకు కూడా ఈ పురస్కారం లభించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జ్యోతి కుమారిపై ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘‘జ్యోతి చూడటానికి తన తోటి పిల్లల్లాగే కనిపిస్తుంది, కానీ ఆమె చూపిన ధైర్యసాహసాల గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. అనారోగ్యం బారిన పడిన తండ్రిని సైకిల్పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. బాల్ పురస్కార్ అందుకున్న బిహార్లోని దర్భాంగాకు చెందిన జ్యోతి కుమారికి శుభాకాంక్షలు. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి’’ అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. (చదవండి: ఎస్పీ బాలుకు పద్మాంజలి.. 102 మందికి పద్మశ్రీ) అదే విధంగా... క్రీడా విభాగంలో ఈ పురస్కారం అందుకున్న పదేళ్ల చెస్ మాస్టర్ ఆర్షియా దాస్ను సైతం ప్రధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. ‘‘త్రిపుర చెస్ మాస్టర్ అర్షియా దాస్. పదేళ్ల ఈ చిన్నారి అంతర్జాతీయంగా సత్తా చాటింది. గోల్డ్ మెడల్ సాధించింది. లాక్డౌన్లో ఆన్లైన్ టోర్నమెంట్లలో పాల్గొంది. శుభాభినందనలు’’ అంటూ అర్షియా దాస్ను ప్రశంసించారు. కాగా హర్యానాలోని గుర్గ్రాంలో ఇ- రిక్షా నడిపే జ్యోతి కుమారి తండ్రి పాశ్వాన్ ప్రమాదానికి గురవడంతో, ఇంటి అద్దె చెల్లించలేకపోతే ఇక్కడనుంచి వెళ్లిపోవాలని యజమాని చెప్పడంతో కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడింది. అయితే ఎలాగైనా స్వస్థలానికి వెళ్లిపోదామని, తండ్రికి ధైర్యం చెప్పిన జ్యోతి.. సైకిల్పై ఆయనను కూర్చోబెట్టుకుని తమ ఊరు సింగ్వారాకు తీసుకువచ్చింది. కొన్నాళ్లపాటు క్వారంటైన్లో ఉన్న తర్వాత వారు తమ ఇంటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో జ్యోతి కుమారిపై ప్రశంసల జల్లు కురిసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ సహా పలువురు ప్రముఖులు ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. दरभंगा, बिहार की 16 साल की ज्योति कुमारी को प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार मिलने पर बहुत बधाई और उज्ज्वल भविष्य के लिए शुभकामनाएं। pic.twitter.com/aRXJp1vgLU — Narendra Modi (@narendramodi) January 25, 2021 -
ఒక ఎన్నికల ప్రేమకథ
కేరళలో స్థానిక ఎన్నికల కథ ఎలా ఉన్నా అక్కడ పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల కథలు మాత్రం సినిమాలకు తక్కువ కాకుండా ఉన్నాయి. పాలక్కాడ్లో పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న జ్యోతి ఇప్పుడు న్యూస్మేకర్. చత్తిస్గడ్కు చెందిన ఈమె 2010లో బస్లో ప్రయాణిస్తూ అదే బస్లో ఉన్న కేరళకు చెందిన జవాన్ ను ప్రమాదం నుంచి రక్షించి తన చేతిని భుజం వరకూ కోల్పోయింది. అతడు ఆమెను హాస్పిటల్లో చేర్చాడు. పునఃజన్మ ఇచ్చినందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడామె కేరళ కోడలు. ఎన్నికలలో ఆమె గెలుపు కంటే ఈ ప్రేమ కథ అందరికీ ఇష్టంగా ఉంది. సాహసాలు, త్యాగాలు చేసిన సామాన్యులు జనంలో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటారు. కాని పబ్లిక్లోకి వచ్చి నిలబడినప్పుడే వారి గాథలు లోకానికి తెలిసి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి అసామాన్య స్త్రీల కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కారణం ఇప్పుడు అక్కడ స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉండటమే. ఆ పోటీల్లో భిన్నమైన నేపథ్యాలు ఉన్న మహిళలు పోటీకి నిలుస్తూ ఉండటమే. జ్యోతిది కూడా అలాంటి కథే. దంతెవాడ అమ్మాయి దంతెవాడకు చెందిన జ్యోతి 2010లో నర్సింగ్ చదువుతోంది. జనవరి 3న ఆమె తన హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లడానికి బస్ ఎక్కింది. అదే బస్లో ఎవరో మిత్రుణ్ణి కలిసి క్యాంప్కు వెళుతున్న వికాస్ కూడా ఉన్నాడు. వికాస్ది కేరళలోని పాలక్కాడ. అతనక్కడ సిఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)లో పని చేస్తున్నాడు. సాయంత్రం కావడంతో ప్రయాణికులు కునుకుపాట్లు పడుతున్నాడు. వికాస్ది విండో సీట్ కావడంతో విండో కడ్డీల మీద తల వాల్చి నిద్రపోతున్నాడు. జ్యోతి అతని వెనుక కూచుని ఉంది. ఇంతలో ఒక లారీ అదుపుతప్పి వేగంగా వస్తున్నట్టు జ్యోతి గ్రహించింది. అది విండోల మీదకి వస్తోంది. జ్యోతి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వికాస్ను లాగేసింది. కాని అప్పటికే లారీ ఢీకొనడం, జ్యోతి కుడి చేయి నుజ్జు నుజ్జు కావడం జరిగిపోయాయి. మొదలైన ప్రేమకథ తేరుకున్న వికాస్ గాయపడిన జ్యోతిని తానే స్వయంగా దంతెవాడ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు ఇక్కడ వైద్యం కుదరదు... చేయి తీసేయాలి రాయ్పూర్కు తీసుకెళ్లండి అని చెప్పారు. ‘ఆమె నీ ప్రాణం కాపాడ్డానికి ఈ ప్రమాదం తెచ్చుకుంది’ అని తోటి ప్రయాణికులు వికాస్కు చెప్పారు. వికాస్ ఆమెను రాయ్పూర్ తీసుకెళ్లాడు. వైద్యానికి అయిన ఖర్చంతా తనే భరించాడు. ‘తను నాకు పునర్జన్మను ఇచ్చింది. నేను ఆమెకు పునర్జీవితాన్ని ఇద్దామని నిశ్చయించుకున్నాను‘ అన్నాడు వికాస్. వారిద్దరూ క్రమంగా ప్రేమలో పడ్డారు. ట్విస్ట్ వచ్చింది అయితే ఈ ప్రేమ కథ సవ్యంగా సాగలేదు. జ్యోతి తండ్రి గోవింద్ కుండు ప్రభుత్వ ఉద్యోగి. తన కూతురికి యాక్సిడెంట్ అయ్యాక మొదట నర్సింగ్ చదువును మాన్పించాడు. చేయి పోవడానికి కారకుడైన వాడే ప్రేమ పేరుతో దగ్గరవుతున్నాడని తెలిసి ప్రేమకు అడ్డుగా నిలిచాడు. అయితే జ్యోతి వికాస్ను గట్టిగా ప్రేమించింది. ప్రేమే ముఖ్యం అనుకుంది. అంతే... ఇల్లు విడిచి అతనితో పాలక్కాడ్ వచ్చేసింది. 2011 ఏప్రిల్లో వారిద్దరికీ పెళ్లయ్యింది. వికాస్ ఉద్యోగరీత్యా దేశమంతా తిరుగుతూ ఉన్నా జ్యోతి పాలక్కాడ్లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దాడికి 8. చిన్నాడికి 4. పంచాయతీ ఎన్నికలలో ప్రస్తుతం కేరళలో జరుగుతున్న స్థానిక ఎన్నికలలో సరైన మహిళా అభ్యర్థుల కోసం వెతుకుతున్న పార్టీలు జ్యోతి కథ తెలిసి ఆమెను ఎన్నికలలో పోటీ చేయమని కోరాయి. జ్యోతి వెంటనే రంగంలో దిగింది. పాలక్కాడ్లో కొల్లన్గోడే బ్లాక్ నుంచి పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తోంది. ‘నాకు ఓట్లు వేస్తారో లేదో తెలియదు. కాని జనం మాత్రం నా ధైర్యానికి త్యాగానికి మెచ్చుకుంటున్నారు’ అని ఆమె చెప్పింది. ఎన్నికల ప్రచారంలో జ్యోతి జ్యోతి ఎప్పుడూ ఒక శాలువను కుడి చేతి మీద వేసుకుని ఉంటుంది. ఎందుకంటే ఆమె కుడిచేయి భుజం దిగువ వరకూ తీసివేయబడింది. ఆమె ఒక్క చేత్తోనే జీవితాన్ని సమర్థంగా నిర్వహిస్తోంది. గెలిస్తే పదవి బాధ్యతలను కూడా అంతే సమర్థంగా నిర్వహిస్తుందనిపిస్తుంది. స్త్రీల సామర్థ్యాలకు అవకాశం దొరకాలే గాని నిరూపణ ఎంత సేపు. – సాక్షి ఫ్యామిలీ -
సైకిల్ గర్ల్పై అత్యాచారం, హత్య: నిజమెంత?
పాట్నా: నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టొస్తుందని ఊరికే అనలేదు. పనీపాటా లేని చాలామంది లేనిపోని వదంతులు సృష్టిస్తూ.. దానికి సోషల్ మీడియాను అస్త్రంగా వినియోగిస్తూ అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పేలోపే అది దేశమంతా పాకిపోతోంది. కొన్నిసార్లైతే అది అబద్ధమంటూ కుండ బద్ధలు కొడుతూ అసలు నిజాన్ని బయటపెట్టినా జనాలు వినే స్థితిలో లేరు. ఇప్పటివరకు నటీనటులకు, రాజకీయ నాయకులకు లేని కరోనాను అంటిస్తూ, కొందరైతే ఏకంగా మరణించినట్లు అసత్య వార్తలు ప్రచారం కావడాన్ని చూశాం. ఇప్పుడు ఓ దారుణ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లాక్డౌన్లో గాయపడ్డ తన తండ్రిని సైకిల్పై కూర్చోబెట్టుకుని 1200 కి.మీ ప్రయాణించిన బిహార్ బాలిక జ్యోతి కుమారి అత్యాచారానికి గురైందంటూ ఫేస్బుక్లో పోస్టులు కనిపిస్తున్నాయి. (బార్కోడ్తో చైనా వస్తువును గుర్తించొచ్చా?) ఆమె స్వస్థలమైన బిహార్లోని దర్భంగాలో మాజీ సైనికుడి చేతిలో ఆ బాలిక దారుణంగా అత్యాచారానికి గురవడమే కాక అతని చేతిలో ప్రాణాలు కోల్పోయిందని సదరు నకిలీ పోస్టుల సారాంశం. అంతేకాకుండా చెట్ల పొదల్లో నిర్జీవంగా పడి ఉన్న ఓ బాలిక ఫొటోలను ఈ పోస్టులకు జత చేస్తున్నారు. నిజమేంటంటే.. దర్భంగాలో పదమూడేళ్ల బాలిక విద్యుదాఘాతానికి గురై మరణించింది. ఆమె మృతదేహం మాజీ సైనికుడి ఇంటి ఆవరణలో పడి ఉండటంతో అనుమానించిన పోలీసులు అతడిని, అతడి భార్యను అరెస్ట్ చేశారు. ఇక్కడ మరణించిన బాలికకు సైకిల్ గర్ల్ జ్యోతికుమారికి ఎలాంటి సంబంధం లేదు. అయితే మరణించిన బాలిక పేరు కూడా జ్యోతి కుమారి అని ఉండటమే ఈ గందరగోళానికి తావిచ్చింది. (సైక్లింగ్ తెచ్చిన అవకాశాలు..) ముగింపు: సైకిల్ గర్ల్పై ఎలాంటి అత్యాచారం, హత్య జరగలేదు. -
వెండితెరపై ‘1200 కిలో మీటర్ల పయనం’
పాట్నా: లాక్డౌన్ కాలంలో గాయాలతో ఉన్న తన తండ్రిని ఎక్కించుకుని 1200 కి.మీ. సైకిల్ తొక్కి ఇంటికి చేరుకున్న జ్యోతి కుమారి గాధ అప్పట్లో మార్మోగిపోయింది. అయితే ఈ ప్రయాణం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. దీన్ని ప్రధానంగా తీసుకుని 'ఆత్మనిర్భర్' చిత్రం తెరకెక్కనుంది. ఇందులో జ్యోతి కుమారి స్వయంగా నటించనుండటం విశేషం. దీనికి సంబంధించిన షూటింగ్ ఆగస్టులో పట్టాలెక్కనున్నట్లు విమేక్ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ సినిమాలో జ్యోతి కథే కాకుండా ఆ బాలికను ఇబ్బందుల్లోకి నెట్టేసిన సమాజంలోని లోటుపాట్లను కూడా చూపించనున్నామని సినిమా దర్శకుడు షైన్ కృష్ణ అన్నారు. (ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ) గుర్గావ్ నుంచి దర్భంగా వరకు ఆమె ప్రయాణించిన ప్రదేశాల్లో సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు. ఈ సినిమా హిందీ, ఇంగ్లిష్తో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా లాక్డౌన్లో హర్యానాలోని గుర్గావ్లో తండ్రితో కలిసి నివసిస్తోన్న జ్యోతిని ఇంటి యజమానులు అద్దె కట్టాలంటూ వేధించారు. దీంతో సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న జ్యోతి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుగోలు చేసింది. ఆ సైకిల్పై తండ్రిని కూర్చోబెట్టుకొని ఏకంగా 1200 కి.మీ. తొక్కింది. అయిదు రోజుల పాటు అష్టకష్టాలు పడి బిహార్లోని స్వస్థలానికి చేరుకుంది. (ఆలయంలో నయన్-శివన్ల వివాహం!) -
సైక్లింగ్ తెచ్చిన అవకాశాలు..
కోల్కతా: గాయపడిన తన తండ్రిని సైకిల్ పై కూర్చొబెట్టుకొని ఢిల్లీ నుంచి దర్భంగా వరకు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన బిహార్కు చెందిన విద్యార్థిని జ్యోతి కుమారికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ ఎత్తేశాక జ్యోతిని సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే ట్రయల్స్కు పంపుతామని, అయితే చదువే తమ మొదటి ప్రాధాన్యమని ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ తెలిపారు. వలస కార్మికులంతా ఇళ్లకు తిరిగి వెళుతుంటే తమకు మరో మార్గం లేక పాత సైకిల్ కొని ప్రయాణం సాగించినట్లు తెలిపారు. దారి మధ్యలో తాము ట్రక్కులు, ట్రాక్టర్లను పట్టుకొని ప్రయాణం చేసినట్లు తెలిపారు. దర్భంగా జిల్లా కలెక్టర్ జ్యోతిని ఇటీవల పిండారుచ్ హైస్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. ఆమెకు కొత్త సైకిల్, యూనిఫాం, షూ అందించారు. జ్యోతి చదువుయ్యే ఖర్చును భరిస్తామని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. మరోవైపు జ్యోతికి సైక్లింగ్ లో ట్రైనింగ్, స్కాలర్ షిప్ ఇచ్చే అవకాశాలను పరిశీలించాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ క్రీడల మంత్రి కిరెన్ రిజిజును కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. -
ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ
వాషింగ్టన్ : గాయపడిన కన్నతండ్రిని కరోనా కష్ట కాలంలో సొంతూరికి చేర్చడం కోసం 15 ఏళ్ల వయసున్న జ్యోతి కుమారి అయిదు రోజులు, 1500 కి.మీ. సైకిల్ తొక్కడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఆ అమ్మాయి చేసిన సాహసం ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ జ్యోతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె కథని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఇవాంకా ‘‘అదో అందమైన సహనంతో కూడిన ప్రేమ.ఆమె చేసిన ఫీట్ని భారత్ ప్రజలతో పాటు సైక్లింగ్ ఫెడరేషన్ గుర్తించాయి‘‘అని ట్వీట్ చేశారు. ఎందుకా సాహసం అంటే .. ఎనిమిదో తరగతి చదువుతున్న జ్యోతికుమారి స్వగ్రామం బీహార్ లోని దర్భాంగా. ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ గత 20 ఏళ్లుగా గుర్గావ్లో ఆటో నడుపుతున్నారు. గత జనవరిలో ఆటోకు ప్రమాదం జరిగి పాశ్వాన్ తీవ్రంగా గాయ పడ్డారు. తండ్రిని చూసు కోవడానికి తల్లితో పాటు జ్యోతి కూడా గుర్గావ్ వచ్చింది. తల్లి అంగన్వాడీ వర్కర్ కావడంతో ఎక్కువ రోజులు గడిపే వీలులేక తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయింది. చిన్నారి జ్యోతి తండ్రి ఆలనా పాలనా చూడసాగింది. ఇంతలో ఉరుము లేని పిడుగులా కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు. తండ్రి ఇంకా పూర్తిగా గాయాల నుంచి కోలుకోలేదు. అద్దె ఇవ్వాలంటూ యజమానులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న జ్యోతి తన సైకిల్పై తండ్రిని కూర్చోబెట్టుకొని ఏకంగా 1500 కి.మీ. తొక్కింది. అయిదు రోజుల పాటు అష్టకష్టాలు పడి ఎంతో శ్రమకి ఓర్చుకొని ఆ అమ్మాయి తండ్రితో పాటు సొంతింటికి చేరి ఊపిరిపీల్చుకుంది. జ్యోతి కథ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది. నిర్విరామంగా ఆమె సైకిల్ తొక్కిన విషయం తెలుసుకున్న సైక్లింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) ఆమెకి సైక్లింగ్లో శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. జ్యోతి శిక్షణలో విజయవం తమైతే నేషనల్ సైక్లింగ్ అకాడమీలో ట్రైనీగా తీసుకుంటారు. ఇప్పుడు ఇవాంకా నుంచే ప్రశంసలు రావడంతో ఆమె సాహసానికి తగిన గుర్తింపు లభించినట్టయింది. -
సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపిన జ్యోతి తల్లి
సాక్షి, నంద్యాల : కరోనా వైరస్ కారణంగా చైనాలో చిక్కుకున్న జ్యోతి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో ఆమె తల్లి ముఖంలో ఆనందం విరబూసింది. భారత వైమానిక దళం గురువారం ప్రత్యేక విమానంలో చైనా నుంచి 112 మందిని ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో కర్నూలు వాసి అన్నెం జ్యోతి ఒకరు. కూతురు క్షేమంగా తిరిగి రావడంతో జ్యోతి తల్లి ప్రమీల తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. కూతురు తమ చెంతకు చేరేందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మనందరెడ్డికి, అధికారులకు, మీడియాకు ప్రమీల ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఢిల్లీ నుంచి తమ కూతురిని త్వరగా పంపిస్తే అనుకున్న సమయానికి జ్యోతి వివాహం జరిపిస్తామని విజ్ఞప్తి చేశారు. (ఎట్టకేలకు భారత్ చేరుకున్న జ్యోతి) చదవండి: కేంద్ర మంత్రిని కలవనున్న జ్యోతి కుటుంబ సభ్యులు -
ఎట్టకేలకు భారత్ చేరుకున్న జ్యోతి
సాక్షి, మహానంది: చైనాలోని వుహాన్లో చిక్కుకుపోయిన బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన అన్నెం జ్యోతి గురువారం ఇండియాకు తిరిగొచ్చింది. ఈ విషయాన్ని జ్యోతితో పాటు ఇండియన్ ఎంబీసీ అధికారులు ధ్రువీకరించినట్లు ఆమెకు కాబోయే భర్త అమర్నాథ్రెడ్డి తెలిపారు. భారతదేశం నుంచి మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ వస్తుందని, నేటి (గురువారం) ఉదయం బయలుదేరేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని వుహాన్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్ర ఆరోగ్య, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి మెసేజ్లు అందినట్లు ఆయన వెల్లడించారు. ఈక్రమంలో చైనా నుంచి ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ అబ్జర్వేషన్లో కొన్ని రోజులు ఉంచి, ఆ తర్వాత ఇంటికి పంపించనున్నారు. (జ్యోతిని క్షేమంగా రప్పించండి) ఉద్యోగ శిక్షణ నిమిత్తం వుహాన్ వెళ్లిన జ్యోతి కోవిడ్ (కరోనా) వైరస్ నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయిన విషయం విదితమే. ఓ డార్మెటరీలో నెల రోజుల నుంచి ఉంటున్నారు. ఆమెకు ఇండియాకు రప్పించేందుకు తల్లి అన్నెం ప్రమీలాదేవి, కాబోయే భర్త అమర్నాథ్రెడ్డి, బావ సురేకుమార్రెడ్డిలు పలువురు ఎంపీలు, మంత్రులను కలిశారు. ముఖ్యంగా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని..జ్యోతి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రుల వద్దకు తీసుకెళ్లి వినతిపత్రాలు ఇప్పించారు. ఈ నేపథ్యంలో జ్యోతిని ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. (కేంద్ర మంత్రిని కలవనున్న జ్యోతి కుటుంబ సభ్యులు) న్యూఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా చైనాలో చిక్కుకున్న76 మంది భారతీయులను, మరో 36 మంది పౌరులను భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చింది. వీరిలో బంగ్లాదేశ్, యూఎస్ఏ, మయన్మార్, మాల్దీవులు, దక్షిణాఫ్రికాకు చెందిన వారున్నారు. కరోనా వైరస్తో అతలాకుతలం అవుతున్న చైనాకు భారత్ సహాయం అందించింది. భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో బుధవారం 15 టన్నుల వైద్య సామాగ్రిని పంపించింది. తిరుగు ప్రయాణంలో చైనాలో చిక్కుకున్న 112 మందిని భారత్కు తీసుకు వచ్చింది. గురువారం ఉదయం ఈ విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి వారిని 14 రోజులపాటు ప్రత్యేక వైద్య శిబిరంలో ఉంచి.. కోవిద్- 19 పరీక్షలు చేయనున్నారు. కాగా భారతీయులను తరలించడానికి సహకరించిన చైనా ప్రభుత్వాన్ని విదేశాంగ శాఖ మంత్రి జయ శంకర్ అభినందించారు. మరోవైపు జపాన్లోని డైమండ్ ప్రిన్సెస్ నౌకలో చిక్కుకున్న భారతీయులను రక్షించి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి తరలించారు. నౌకలో చిక్కుకున్న 119 భారతీయులతో సహా శ్రీకంల, నేపాల్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన అయిదురురిని టోక్యో నుంచి డిల్లీకి తీసుకొచ్చారు. వీరిని తరలించినందుకు కృషి చేసిన జపాన్ అధికారులకు, ఎయిర్ ఇండియాకు మంత్రి జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ వైరస్ కారణంగా చైనాలో ఇప్పటికే 2,715 మంది మృత్యువాత పడగా. 78 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
జ్యోతిని క్షేమంగా రప్పించండి
కర్నూలు, మహానంది: చైనాలోని వుహాన్లో చిక్కుకుపోయిన అన్నెం జ్యోతిని క్షేమంగా ఇండియాకు రప్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వంగా గీత తదితరులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ను కలిసి విన్నవించారు. వారితో పాటు జ్యోతి తల్లి ప్రమీలమ్మ, కాబోయే భర్త అమర్నా«థ్రెడ్డి కూడా ఉన్నారు. తన కుమార్తెతో పాటు చైనాకు వెళ్లిన వారిలో ఆమె, మరో విద్యార్థి మాత్రమే అక్కడ ఉండిపోయారని ప్రమీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి స్పందిస్తూ జ్యోతిని ఇండియాకు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి రోజూ చైనాలోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడుతున్నామని చెప్పినట్లు అమర్నాథ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డికి విజ్ఞప్తి జ్యోతి తల్లి ప్రమీలమ్మ, కాబోయే భర్త అమర్నాథ్రెడ్డి ఢిల్లీలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కూడా కలిశారు. జ్యోతిని ఇండియాకు త్వరగా రప్పించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. క్షేమంగా ఇంటికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. -
కేంద్ర మంత్రిని కలవనున్న జ్యోతి కుటుంబ సభ్యులు
సాక్షి, న్యూఢిల్లీ : చైనాలోని వుహాన్లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని స్వదేశానికి పంపించేందుకు ఎంపీ బ్రహ్మనందరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయ శంకర్ను జ్యోతి కుటుంబ సభ్యులు కలవనున్నారు. మార్చి 14న జ్యోతి వివాహం ఉండటంతో త్వరగా తమ కుమార్తెను స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. భారత్, చైనా మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపి వేమడంతో అక్కడ ఉన్న తెలుగు అమ్మాయి జ్యోతి స్వదేశానికి రాలేని స్థితి నెలకొంది. వారం రోజుల క్రితం జ్యోతికి జ్వరం కారణంగా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో అధికారులు ఇండియాకు తీసుకురాలేకపోయారు. (జ్యోతిని స్వదేశానికి తీసుకోస్తామని కేంద్ర మంత్రి హామీ) -
కర్నూలు యువతిని ఇండియాకు తీసుకోస్తామని మంత్రి హామీ
-
ఎంతపని చేశావు తల్లీ !
కర్ణాటక,మండ్య : చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు, భర్త బాధ్యతారాహిత్యంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలసి చెరువులోకి దూకింది. ఘటనలో తల్లి మృతి చెందగా చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఉదంతం శుక్రవారం మండ్య తాలూకా తిబ్బనహళ్లిలో చోటు చేసుకుంది. తాలూకాలోని హుళ్లేనహళ్లి గ్రామానికి చెందిన నంజప్పకు అదే ప్రాంతానికి చెందిన జ్యోతి (33)తో చాలా కాలం క్రితం వివాహమైంది. కొద్ది కాలంగా నంజప్ప అనారోగ్యంతో బాధ పడుతుండడంతో కుటుంబ పోషణభారం జ్యోతి పై పడింది. ఈ పరిస్థితుల్లో నంజప్ప ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో అప్పు చేసి ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో కొత్త బైకు కొనాల్సిన అవసరం ఏంటంటూ జ్యోతి తన భర్తను ప్రశ్నించింది. ఇదే విషయమై కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా శుక్రవారం కూడా గొడవ జరగడంతో మనస్తాపం చెందిన జ్యోతి ఇద్దరు పిల్లలు నిసర్గ (7), పవన్(4)లతో కలసి తిబ్బనహళ్లి గ్రామ సమీపంలోని కాలువలో దూకింది. గమనించిన స్థానికులు కాలువలోకి దూకి రక్షించడానికి ప్రయత్నించారు.అప్పటికే జ్యోతి మృతి చెందగా ఇద్దరు పిల్లల కొట్టుకుపోయారు. ఈ ఘటనతో జ్యోతి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవు తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్తంభానికి కట్టి మహిళపై చెప్పులతో దాడి
-
స్తంభానికి కట్టి మహిళపై చెప్పులతో దాడి
కోహెడరూరల్: ఓ మహిళను విద్యుత్ స్తంభానికి తాళ్లతో కట్టేసి చెప్పులతో దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. కోహెడ మండలం పోరెడ్డిపల్లి తండాకు చెందిన జ్యోతి, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన హంస, స్వరూపల వ్యవసాయ భూములు పోరెడ్డిపల్లి గ్రామ పరిధిలో ఉంటాయి. ఈ క్రమంలో వారు తరచూ గొడవలకు పాల్పడేవారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న హంస, స్వరూప.. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన కృష్ణ సాయంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న జ్యోతిని ట్రాక్టర్లో ఎక్కించుకొని లక్ష్మీపూర్కు తీసుకువెళ్లి స్తంభానికి కట్టి చెప్పులతో దాడిచేశారు. ఇది గమనించిన స్థానికులు 100కు కాల్ చేశారు. నిందితులు హంస, కృష్ణ, స్వరూప, శంకర్, రమలపై కేసు నమోదు చేశారు. -
ఫుల్ యాక్షన్...
వినయ్ పరునెళ్ల, జ్యోతి జంటగా ‘రామ రావణ రాజ్యం’ అనే సినిమా తెరకెక్కనుంది. వీ3 ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి వికాశ్ వి. దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేసింది చిత్రబృందం. ‘‘జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. పాత, కొత్త నటుల కాంబినేషన్లో సినిమా ఉంటుంది. పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం ఇది’’ అని వికావ్ వి. తెలిపారు. ఈ చిత్రానికి కనిష్క సంగీతాన్ని అందించనున్నారు. -
విబూది
పెద్ద వయసులో ఎవరెస్టును ఎక్కడం, చిన్న వయసులో ఐఐటీ ధన్బాద్ సీటు కొట్టడం, యాషెస్ సిరీస్లో రన్ల రికార్డ్ను బ్రేక్ చెయ్యడం ఎవ్రీడే అచీవ్మెంట్స్గా అనిపించవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న ‘హఠంపట్టు’ (పర్సెవీరెన్స్) ఎవరికి వాళ్లకే ప్రత్యేకం. వన్ అండ్ ఓన్లీ. ఆ పట్టు పిడికిలిలోంచి రాలిపడే విబూదిని నుదుటికి రాసుకోవలసిందే.- మాధవ్ శింగరాజు బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ :అని అనడంలో ‘స్త్రీ సాధించింది’ అని కాక, ‘స్త్రీ అయివుండీ సాధించింది!’ అనే ఎగ్జయిట్మెంట్ ఉండే మాట వాస్తవమే. అయితే స్త్రీని ఉమన్ అచీవర్గా కాక, ఒక హ్యూమన్ అచీవర్గా మాత్రమే చూడడం అంటే ఆమె పర్సెవీరెన్స్ని తక్కువ చేయడమే. తక్కువ అంటే పురుషుడికి ఈక్వల్ చెయ్యడం. ఎవరికైనా గిన్నిస్ ఒక గుర్తింపు. అయితే ఇప్పుడెవ్వరూ గిన్నిస్ను గుర్తిస్తున్నట్లు లేదు. గిన్నిస్ బుక్కే చిన్నబోయేంతగా ఉంటున్నాయి మరి ఘనతలు! విజయాలు, వీర స్వర్గాలూ రొటీన్ అయిపోయి అభినందనగా చెయ్యి చాచడానికి ఎవరికీ మనసు రావడం లేదు. ఎక్కినందుకు, దిగినందుకు, ఎగిరినందుకు.. ఇలా గిన్నిస్వాళ్లు రికార్డులు ఇస్తూనే ఉన్నా.. ఎక్కడమేం గొప్ప, ఎగరడమేం గొప్ప అన్న చప్పరింపే వినిపిస్తోంది. బహుశా.. గిన్నిస్లోకి ఎక్కడమన్నది ఏ విలువా లేని గుర్తింపు అనే కాలంలోకి మనుషులు వచ్చి పడుండొచ్చు. శిఖరాన్ని చేరుకోవడం గొప్ప పనేం కాదనే అనుకుందాం. చేరుకునేవరకు మనసు నిలువలేకపోవడం.. అది గొప్పే కదా. కొండలెక్కొస్తే ఎవరికి ఉపయోగం? ఎవరికీ లేదు. కొండకి లేదు. కొండను ఎక్కిన మనిషికీ లేదు. కానీ ఒరిపిడి! పాదాల ఒరిపిడి రాళ్లకు, రాళ్ల ఒరిపిడి పాదాలకు. ఆ రాపిడి పొడి విబూదిలా నుదుటిపై పెట్టుకోవలసిందే. ఎక్కి దిగొచ్చేలోపు ఎన్ని జన్మలు, ఎన్ని జన్మరాహిత్యాలు.. ఆ మనిషికి! మహిళలు సాధించే విజయాలు కూడా గిన్నిస్ రికార్డుల్లా చాలా ఈజీ అయిపోయాయి. మహిళలకు కాదు ఈజీ అయిపోవడం, ఆపోజిట్ జెండర్కి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ నెగ్గడం సర్వసాధారణం అయిపోవడం వల్ల ఆ నెగ్గడానికి ఏ విలువా ఉన్నట్లు కనిపించకపోయినా, నెగ్గుకు రావడం అనేది ఒకటి ఉంటుంది.. దానికి ఉంటుంది వాల్యూ. ఒకళ్లిస్తే పెరిగే వాల్యూ, ఇవ్వకపోతే తగ్గిపోయే వాల్యూ కాదది. ‘ఎందుక్కాదో తేల్చుకుందాం’ అని అనువుకాని దాని వెంటపడి సాధించడంలోని ‘వాల్యూ ఆఫ్ పర్సెవీరెన్స్’! ఈ పర్సెవీరెన్స్ (పట్టువదలకపోవడం) స్త్రీ, పురుషులిద్దరికీ ఉంటుంది కానీ, స్త్రీ ‘మోర్ పర్సెవీరింగ్’గా ఉండాలి. చేతులు ఊపుకుంటూ నడిచే నడకకు, తలపైన బరువులు మోసుకుంటూ నడిచే నడకకు మధ్య ఉండే వ్యత్యాసం వల్ల తప్పనిసరి అయ్యే ‘మోర్’ అది. ఎక్కువ కష్టపడాలి స్త్రీ తను అనుకున్నది సాధించడం కోసం. టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్కి ఈ మాట నచ్చదు. ‘లెబ్రాన్ జేమ్స్ని బెస్ట్ మేల్ ప్లేయర్ అంటున్నారా? ఫెదరర్నీ, టైగర్ ఉడ్స్నీ బెస్ట్ మేల్ ప్లేయర్స్ అంటున్నారా? మరెందుకు నేను గానీ, ఇంకో ఉమన్ అథ్లెట్ గానీ బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ అవ్వాలి?’అని రెండేళ్ల క్రితం కావచ్చు ఆవిడ చికాకు పడ్డారు. బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ అని అనడంలో ‘స్త్రీ సాధించింది’ అని కాక, ‘స్త్రీ అయివుండీ సాధించింది!’ అనే ఎగ్జయిట్మెంట్ ఉండే మాట వాస్తవమే. అయితే స్త్రీని ఉమన్ అచీవర్గా కాక, ఒక హ్యూమన్ అచీవర్గా మాత్రమే చూడటమంటే ఆమె పర్సెవీరెన్స్ని తక్కువ చేయడమే. తక్కువ అంటే పురుషుడికి ఈక్వల్ చెయ్యడం. ఉమెన్స్ యాషెస్ సిరీస్లో ఇటీవల ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఇంగ్లండ్లోని ఛెమ్స్ఫోర్డ్లో జరిగిన ట్వంటీ ట్వంటీ మహిళల ఇంటర్నేషనల్ మ్యాచ్ అది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్. 63 బంతుల్లో 133 పరుగులు తీశారు. వాటిల్లో 6 సిక్సర్లు, 17 ఫోర్లు. నాటౌట్. టీ–ట్వంటీ మహిళా క్రికెట్లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. వరల్డ్ రికార్డు. మన దగ్గర ఒక్క పేపర్ కూడా మెగ్ లానింగ్ సాధించిన ఈ ఘన విజయం గురించి చిన్న వార్తయినా రాయలేదు! కనీసం రెండు కారణాల వల్లనైనా లానింగ్ని సీరియస్గా తీసుకోకపోవడం అన్నది జరగకుండా ఉండాల్సింది. ఒక కారణం: రికార్డును సాధించడమే కాదు, రికార్డును బ్రేక్ చేశారు కూడా లానింగ్. ఆ బ్రేక్ చేసిన రికార్డు కూడా తనదే! ఐదేళ్ల క్రితం బంగ్లాదేశ్లో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు మీద 126 పరుగులు స్కోర్ చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు లానింగ్. దాన్నే మళ్లీ బ్రేక్ చేశారు. రెండో కారణం : లానింగ్ ఆడింది ‘యాషెస్’ సిరీస్! నూటా ముప్ఫై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సిరీస్. మగవాళ్లది మెన్స్ యాషెస్. మహిళలది ఉమెన్స్ యాషెస్. మగవాళ్లయినా, మహిళలైనా యాషెస్ సిరీస్లో రికార్డు సాధించడం గొప్ప సంగతి. కానీ క్రికెట్లో ఒక్క రన్నే అయినా మగవాళ్లు కొట్టినదే, ఒక్క వికెట్టే అయినా మగవాళ్లు తీసిందే గొప్పగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. చదువుల్లో కూడా అమ్మాయిల ఘనతలు కామన్ అయిపోయాయి! ఆ ఘనతల వెనుక ఆ కష్టం, ఆ స్ట్రెస్ కామన్ విషయాలా? వంద మంది అమ్మాయిలు ఒకే విధమైన వంద విజయాలను ఏటా సాధిస్తూనే ఉన్నా ప్రతి అమ్మాయి విజయమూ ప్రతి ఏడాదీ తొలి మహిళా విజయమే. ఈ ఏడాది జ్యోతి ప్రియదర్శిని అనే 15 ఏళ్ల రాయ్బరేలి అమ్మాయి జార్ఖండ్లోని ధన్బాద్ ఐఐటీలో (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) సీటు సంపాదించింది! కాకపోతే చిన్న వయసులో పెద్ద చదువులు చదవడం అన్నది పాత బడిపోయి జ్యోతి కూడా ఒక రొటీన్ జీ–ర్యాంకర్ అయిపోయింది లోకానికి. జ్యోతి తండ్రి సురేశ్కుమార్ మ్యాథ్స్, సైన్స్ టీచర్. పదకొండు మంది ఉండే ఉమ్మడి కుటుంబానికి (అందులో ఒకరు స్ట్రోక్ సర్వైవర్) ఆయన జీతమే ఆధారం. జ్యోతిని మెడిసిన్ చదివించాలని ఆయన. ఇంజనీరింగ్ చదవాలని జ్యోతి. తండ్రిని ఒప్పించేందుకు ఒక పెయిన్. తండ్రిని నొప్పిస్తున్నానేమోనని ఇంకో పెయిన్.జ్యోతి అనే కాదు, చదువు అనే కాదు. లానింగ్ అనే కాదు, ఆట అనే కాదు. ఏ రంగంలో ఏ స్త్రీ సాధించిన ఘనత వెనుకైనా ఘనత వహించిన పెయిన్ ఒకటి ఉంటుంది. దానిక్కొట్టాలి సెల్యూట్.. చెయ్యి పైకెత్తి, కాలును నేలకు తాటించి. -
నా సెల్ నంబర్ బ్లాక్ చేశారు
సాక్షి, చెన్నై: కరూర్ కలెక్టర్, ఎంపీ జ్యోతిమణిల మధ్య వార్ మరింతగా ముదురుతోంది. ఎంపీ అన్న కనీస మర్యాద కూడా తనకు కలెక్టర్ ఇవ్వడం లేదని జ్యోతిమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే, పార్లమెంట్లో ప్రస్తావించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు చేశారు. తన సెల్ నంబర్ను ఆయన బ్లాక్ చేసి ఉండడం బట్టిచూస్తే, ఏ మేరకు కలెక్టర్ తీరు ఉందో స్పష్టం అవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.లోక్సభ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి కరూర్ లోక్సభ నియోజకవర్గంలో రాజకీయ వివాదం రాజుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ అన్నాడీఎంకే అభ్యర్థిగా గత ›ప్రభుత్వంలో పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై రేసులో ఉండడం ఇందుకు కారణం. అలాగే, ఆయనపై తీవ్ర వ్యతిరేకత నియోజకవర్గంలో ఉండడాన్ని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిమణి తీవ్రంగానే ఓట్ల వేట సాగించారు. అయితే, ఎన్నికల నామినేషన్ దాఖలు మొదలు, ప్రచారాల అనుమతి వరకు అడుగడుగునా జ్యోతిమణికి అడ్డంకులు తప్పలేదు. కరూర్ జిల్లా డీఎంకే నేత, మాజీ మంత్రి సెంథిల్ బాలాజి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఆయన్ను అధికారులు టార్గెట్ చేశారన్న ప్రచారం ఎన్నికల వేళ జోరుగానే సాగింది. ఇందుకు తగ్గట్టుగా బెదిరింపుల ఆడియోలు, వీడియోలు ఆ సమయంలో వైరల్గా మారాయి. ఇక, కరూర్ కలెక్టర్ ఎన్నికల అధికారి వ్యవహరించిన అన్భళగన్ అధికార పక్షానికి ప్రత్యక్షంగానే సహకరిస్తున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా జ్యోతిమణి, అరవకురిచ్చి అసెంబ్లీ డీఎంకే అభ్యర్థిగా సెంథిల్ బాలాజి తీవ్రంగానే విరుచుకుపడ్డారు. అదే సమయంలో ప్రచార ముగింపు రోజున సాగిన అల్లర్లు, ఎన్నికల రోజున వివాదాలు...ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతి విషయంలోనూ అధికారులు అధికార పక్షానికి అండగా వ్యవహరించారన్న ఆరోపణల్ని, ఆగ్రహాన్ని ప్రతి పక్షాలు కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు తీసుకెళ్లాయి. ఈవీఎంలను భద్రత పరిచిన స్ట్రాంగ్ రూములకు భ›ద్రత మరీ తక్కువగా నియమించి ఉండడంవంటి వ్యవహారాలు ఎన్నికల కమిషన్ విచారణకు సైతం దారి తీశాయి. ఈ ఎన్నికల వివాదం అన్నాడీఎంకే – కాంగ్రెస్ అభ్యర్థి మధ్య అని చెప్పడం కన్నా, కలెక్టర్ అన్భళగన్– కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిమణి మధ్య అన్నట్టుగా మారింది. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో జ్యోతిమణి ఎంపీగా విజయకేతనం ఎగుర వేశారు. అయినా, ఈ ఇద్దరి మధ్య వివాదం సమసినట్టు లేదు. ఇందుకు కారణం, వివాదం మరింతగా ముదిరిందనేందుకు తగ్గట్టుగా కలెక్టర్పై జ్యోతి మణి విరుచుకు పడడం గమనార్హం. ప్రజాసమస్యలపై ఎవర్ని ఆదేశించాలి.. అరవకురిచ్చి ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో కలిసి ఎంపీ జ్యోతి మణి శని, ఆదివారాల్లో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకున్నారు. అయితే, అధికారులు తన పర్యటనలో కనిపించక పోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జిల్లా కలెక్టర్ పనితీరును గుర్తు చేస్తూ, ఏ మేరకు తమకు ఆయన మర్యాదను ఇస్తున్నారో అన్నది తాజాగా స్పష్టం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎంపీగా ఉన్న తనను, ఎమ్మెల్యేగా ఉన్న సెంథిల్బాలాజీని తాగు నీటి ఎద్దడిపై జరిగిన సమావేశానికి ఆహ్వానించకపోవడం విచారకరంగా పేర్కొన్నారు. ఎంపీ అన్న కనీస మర్యాద కూడా ఇవ్వక పోగా, తన సెల్ నంబర్ను కలెక్టర్ బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై కలెక్టర్తో చర్చించలేని పరిస్థితి ఉందని, ఆయన పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో తన సెల్ నంబర్ బ్లాక్ చేసి ఉంటారేమోనని, ఇకనైనా పద్దతి మార్చుకోవాలని, లేని పక్షంలో పార్లమెంట్లో కలెక్టర్ తీరును ప్రస్తావించక తప్పదని హెచ్చరించారు. -
పరుగుల జ్యోతి
బుల్లితెర మీద పరుగుల రాణి ‘జ్యోతి’గా తెలుగువారికి పరిచయమైంది. తెర వెనుక ‘చదువుల తల్లి’ అని అమ్మానాన్నల చేత భేష్ అనిపించుకుంది. శాస్త్రీయ నృత్యంతో ఆకట్టుకుంది. నటన చదువు రెండూ నాకు ఇష్టమే అంటూ తన గురించి ‘సాక్షి’తో పంచుకున్న ‘జ్యోతి’ సీరియల్ నటి ‘వేద నారాయణ్’ ముచ్చట్లివి. ‘నేను పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేశాను. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. అనుకోకుండా స్నేహితుల ద్వారా వచ్చిన అవకాశంతో నటనవైపు ఆసక్తి చూపాను. కన్నడలో నాలుగు సీరియల్స్ చేశాను. అయితే, అవి మెయిన్ రోల్స్ కాదు. తెలుగులో మా టీవీలో ప్రసారమయ్యే ‘జ్యోతి’ సీరియల్ ద్వారా మెయిన్ రోల్స్గా మీ ముందుకు వచ్చాను. ‘జ్యోతి’ సీరియల్లో... ఇందులో జ్యోతి పాత్ర చాలా స్ఫూర్తిమంతంగా ఉంటుంది. పల్లెటూరి అమ్మాయి జ్యోతి. రన్నింగ్ కోసం ఏమైనా చేస్తుంది. ఒకసారి జ్యోతి రోడ్డుపై వెళ్లే వాహనాలతో పోటీ పడి పరిగెత్తుతూ వాటిని ఓవర్టేక్ చేసే సాహసం చేస్తుంది. కోచ్ ఈ అమ్మాయిని చూసి ప్రతిభ ఉందని స్పోర్ట్స్ అకాడెమీకీ సెలక్ట్ చేస్తాడు. అలా ఆ అమ్మాయి పల్లెటూరి నుంచి హైదరాబాద్ స్పోర్ట్స్ అకాడమీలో చేరడం, అక్కడ ఉండే వాతావరణం .. ప్రతీది నేచురల్గా ఉంటుంది. ఒలంపిక్స్లో మెడల్ సాధించడమే జ్యోతి ముందున్న లక్ష్యంగా సీరియల్ రన్ అవుతుంది. ఈ సీరియల్లో స్పోర్ట్స్ మాత్రమే కాకుండా సిటీలో జ్యోతికి ఒక చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది. నేనూ స్కూల్ రోజుల్లో కబడ్డీ ప్లేయర్ని. అకాడమీ వరకు వెళ్లాను. ఈ సీరియల్ స్పోర్ట్స్ థీమ్ ఉన్న లైన్ అవడంతో వెంటనే ఒప్పుకున్నాను. ఎంట్రీ ఇలా... మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. పేరు నారాయణ్. ఈ ఫీల్డ్కి నేను రావడం నాన్నగారికి ఇష్టం లేదు. ‘ఇంజనీయర్ చేశావు, సీరియల్స్ ఏంటి?’ అనేవారు. నాకు ఐటీ వైపు వెళ్లడం ఇష్టం లేదు. అదే విషయం చెప్పాను. అమ్మ మంజుల బ్యూటిషియన్. యాక్టింగ్ ఫీల్డ్ అంటే అమ్మకు ఇంట్రస్ట్ ఉంది. దీంతో నాన్నకు నచ్చజెప్పడం సులువు అయ్యింది(నవ్వుతూ). అమ్మానాన్నల వైపు ఎవరూ టీవీ, సినిమా పరిశ్రమలో లేరు. అయితే, మా తాతగారికి మాత్రం నాటకాలలో ప్రవేశం ఉంది. అలా నాకు ఈ ఆసక్తి వచ్చి ఉంటుందని అమ్మానాన్నలు అంటుంటారు. నాకు ఓ తమ్ముడు. ప్రస్తుతం వాడు చదువుకుంటున్నాడు. వచ్చిన ఆఫర్స్ని యాక్సెప్ట్ చేస్తూనే నేనూ ఐఎఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. ఏ చిన్న లోపమైనా... నాన్నగారు ముందు ఈ ఫీల్డ్ అంటే ఇంట్రస్ట్ చూపకపోయినా ఇప్పుడు నా సీరియల్ని తప్పనిసరిగా చూస్తారు. నటనలో ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే చెప్పేస్తారు. దాంతో మరోసారి అవి రిపీట్ కాకుండా జాగ్రత్తపడతాను. ఇక అమ్మ అయితే రెగ్యులర్గా నా కాస్ట్యూమ్స్, ఇతర యాక్సెసరీస్ అన్నీ తనే సెలక్ట్ చేస్తుంది. నాకేం సూటవుతాయో అమ్మకు బాగా తెలుసు. అందుకే, బెస్ట్ అనిపించే ఆ ఛాయిస్ అమ్మదే. కుటుంబం సపోర్ట్ ఉంటడంతో మరింత హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నాను. జీవితంలో పరుగులు పెట్టను... సీరియల్లోనే పరుగులు తప్ప జీవితం అంతా పరుగులతో నిండి ఉండాలని అనుకోను. కూల్గా, హ్యాపీగా గడిచిపోవాలని కోరుకుంటాను. నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎంకరేజ్ చేసేవారే కావడంతో నా జీవితం మరింత సంతోషంగా గడిచిపోతుంది. నటనలో ఇంతవరకే అనే పరిమితులు ఉండవు. కన్నడలో చేసిన సీరియల్స్ అన్నీ నెగిటివ్ పాత్రలే. ఇక్కడ పాజిటివ్... అందులోనూ లీడ్ రోల్ చేస్తున్నాను. కాకపోతే ఎప్పటికైనా ‘అరుంధతి’ సినిమాలో హీరోయిన్లా ఒక రోల్ చేయాలని ఉంది.’ – నిర్మలారెడ్డి -
జ్యోతి హత్యకేసులో వీడని మిస్టరీ
తాడేపల్లిరూరల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన జ్యోతి హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం కారణంగా దోషులు తప్పించుకునే అవకాశం ఉందంటూ బంధువులు మొదటినుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. చివరకు అదే జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతిని నమ్మించి ప్రియుడైన చుంచు శ్రీను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి అతి కిరాతకంగా చంపాడు. ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొని జ్యోతిని హత్యచేసి, తనను గాయపరిచారంటూ ఓ సినిమా స్టోరీని అల్లాడు. దానికి పోలీసులు సైతం సహకరించడంతో పసిగట్టిన బంధువులు ఆందోళన నిర్వహించడం, ఆ తర్వాత ప్రియుడ్ని అదుపులోకి తీసుకోవడం, పోలీసు విచారణలో చుంచు శ్రీను తనే నేరం చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు చుంచు శ్రీను, ఆయన స్నేహితుడైన పవన్పై కేసు నమోదు చేశారు. అప్పటినుంచి కేసుకు ధారాలు సేకరించకుండా పోలీసులు పక్కన పెట్టడంతో మరోసారి బంధువులు జిల్లాలోని కలెక్టర్తో పాటు, వివిధ శాఖల అధికారులను కలిసి తమకు న్యాయంచేయాలని కోరారు. జ్యోతి హత్య జరిగి నేటికి 75 రోజులవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. జ్యోతి పోస్టుమార్టం నిర్వహించేటప్పుడే పోలీసులు ఆమె దుస్తులను సేకరించకపోవడం, పూర్తిస్థాయిలో పోస్టుమార్టం నిర్వహించకపోవడం అనుమానాలకు దారితీసింది. దీంతో జ్యోతి బంధువులు ఆందోళన నిర్వహించి, రీపోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. తిరిగి మరలా గుంటూరు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం నిర్వహించి, మొదట పోస్టుమార్టం జరగలేదని నిర్ధారించారు. అనంతరం చుంచు శ్రీనును అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య చేయడానికి ఉపయోగించిన రాడ్డును సీజ్ చేశారే తప్ప జ్యోతి వద్ద ఉన్న సెల్ఫోన్, హ్యాండ్బ్యాగ్, ఇతర వస్తువులను నేటికీ కూడా రికవరీ చేయలేదు. కేసులో కీలక ఆధారమైన సెల్ఫోన్ సీజ్ చేయకపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుందంటూ జ్యోతి సోదరుడు అంగడి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ దిగులుతోనే మా తండ్రి చనిపోయాడని, ఎస్టీ (ఎరుకుల) కులానికి చెందిన మమ్ములను పోలీస్ అధికారులు తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పాడు. కనీసం తమకు అందాల్సిన రాయితీలను కూడా ఇవ్వకుండా పోలీసులు వేధిస్తున్నారని పేర్కొన్నాడు. చెల్లి హ్యాండ్బ్యాగ్, సెల్ఫోన్, సీఐ బాలాజీ దగ్గరే ఉన్నాయని, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే వాటిని రికవరీ చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నాడు. ఇప్పటికైనా పోలీసులు జ్యోతి కుటుంబానికి న్యాయం చేస్తారో లేదో వేచి చూడాల్సిందే! -
జ్యోతి కుటుంబంలో మరో విషాదం
గుంటూరు, తాడేపల్లి రూరల్(మంగళగిరి): తన కుమార్తెను దారుణంగా హత్యచేశారన్న బాధను జీర్ణించుకోలేక అనారోగ్యం పాలైన తండ్రి గోవిందయ్య చికిత్స పొందుతూ మరణించాడు. ఫిబ్రవరి 15 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బిడ్డ హత్యను తట్టుకోలేకే తండ్రి కూడా మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. మూకుమ్మడిగా హత్యకేసులో నిందితుడి ఇంటిపై దాడి చేసిన ఘటన తాడేపల్లి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. రాజధాని ప్రాంతంలో ఫిబ్రవరి 11వ తేదీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అంగడి జ్యోతి తండ్రి జ్యోతి మరణాన్ని జీర్ణించుకోలేక ఆమె తండ్రి గోవిందయ్య అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు గత నెల 15న ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. (పెళ్లి ప్రస్తావన రాగానే చంపేశాడు) శ్రీను బంధువులపై దాడి బుధవారం సీతానగరంలోని జ్యోతి ఇంటి నుంచి గోవిందయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. గోవిందయ్య, జ్యోతి మధ్య అనుబంధాన్ని బంధువులు చర్చించుకున్నారు. అంత్యక్రియలు పూర్తిచేసి తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఉన్న చుంచు శ్రీను ఇంటిని చూసిన బంధువులు జ్యోతి, గోవిందయ్యల మృతికి కారణమైన వాడి ఇల్లు ఇదేనంటూ ఆ ఇంటి తాళాలు పగలగొట్టి, తలుపులు విరగ్గొట్టి దాడికి పాల్పడి, ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న చుంచు శ్రీను బాబాయి లక్ష్మీనారాయణ, పిన్ని, నాయనమ్మపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని స్థానికులు చూసి 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో జ్యోతి బంధువులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. చుంచు శ్రీను బంధువులు సైతం పోలీసులకు 100 ద్వారా ఫిర్యాదు చేశారు కానీ, పోలీస్స్టేషన్లో రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదు చేయలేదు. (కేసు ముగించే కుట్ర ) -
20 ఏళ్లు చిన్నదైనా కన్నేసి.. కడతేర్చాడు
గుంటూరు, తెనాలిరూరల్: సంచలనం సృష్టించిన బిట్రా శ్రీజ్యోతి దారుణ హత్యకేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని కోర్టుకు తరలించేముందు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మరీదు శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో నివశిస్తున్న మృతురాలు శ్రీజ్యోతి కుటుంబానికి సన్నిహితుడైన నేతికుంట్ల సత్యనారాయణ (40) కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. అతను శ్రీజ్యోతిని వివాహం చేసుకోవాలని భావించాడు. రెండు సార్లు ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించగా, వారు వారించారు. గత నెల 21వ తేదీన వివాహ సంబంధం మాట్లాడుకునేందుకు ఏలూరు వెళ్లిన యువతి తల్లిదండ్రులకు వరుడు నచ్చడంతో, సంబంధం దాదాపు ఖరారైనట్టేనని తండ్రి సుధాకర్ తనకు మిత్రుడైన సత్యనారాయణకు చెప్పాడు. తాను వివాహం చేసుకుందామనుకున్న యువతి తనకు దక్కకుండా పోతుందని కక్ష కట్టిన సత్యనారాయణ.. శ్రీజ్యోతి ఇంటికి వెళ్లి.. ఒంటరిగా ఉన్న ఆమెపై చాకుతో దాడి చేశాడు. గొంతులో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. కాగా, నిందితుడు వేద టాకీస్ పక్క సందులోని అతని మామయ్య ఇంట్లో ఉండగా గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. సత్యనారాయణను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. -
పెళ్లి ప్రస్తావన రాగానే చంపేశాడు
సాక్షి, గుంటూరు/గుంటూరు: సంచలనం సృష్టించిన అంగడి జ్యోతి హత్య కేసు మిస్టరీ వీడింది. నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 11న రాజధాని ప్రాంతం మంగళగిరి మండలం నవులూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియం దగ్గరలోని నిర్మానుష్య ప్రదేశంలో అంగడి జ్యోతి (25) హత్యకు గురైన విషయం తెలిసిందే. జ్యోతి ప్రియుడు శ్రీనివాస్ ఈ హత్యకు పాల్పడినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు చెప్పారు. శ్రీనివాస్ వద్ద పనిచేసే పవన్ ఈ హత్యకు సహకరించాడన్నారు. జ్యోతి కేసులో ముద్దాయిలు చుంచు శ్రీనివాస్, కటారి పవన్కల్యాణ్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పెళ్లి కోసం ఒత్తిడి చేసిందని: చుంచు శ్రీనివాస్ రోడ్డు మరమ్మతుల కాంట్రాక్టు పనులు చేస్తుండేవాడు. అతను, అదే ప్రాంతానికి చెందిన అంగడి జ్యోతి ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జ్యోతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో శ్రీనివాస్ పెళ్లి విషయాన్ని దాటవేస్తున్నాడు. పెళ్లి విషయమై గట్టిగా అడగడం మొదలు పెట్టిన జ్యోతి.. తేడా చేస్తే పోలీస్ కేసు పెడతానని బెదిరించింది. ఏదో రకంగా జ్యోతి అడ్డు తొలగించుకోవాలని, ఈ విషయాలన్నీ తన వద్ద పనిచేసే కటారి పవన్కల్యాణ్కు చెప్పి తనకు సహాయం చేయాలని శ్రీనివాస్ కోరాడు. 11వ తేదీ మధ్యాహ్నం 12.30కు జ్యోతి తన సర్టిఫికెట్ల కోసం తాడేపల్లి నుంచి గుంటూరు చుట్టుగుంట ప్రియదర్శిని ఫార్మా కళాశాలకు వెళ్లి.. తాను గుంటూరుకు వచ్చినట్లు 1.21 గంటలకు శ్రీనివాస్కి ఫోన్ చేసింది. మంగళగిరిలో కలుసుకుందామని శ్రీనివాస్ చెప్పాడు. ఈ విషయం పవన్కు ముందే చెప్పిన శ్రీనివాస్ ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. పవన్ బైక్పై వచ్చిన శ్రీనివాస్.. జ్యోతిని మంగళగిరిలో కలుసుకున్న తదుపరి నెట్ సెంటర్లో ఆమెను బైక్పై ఎక్కించుకొని యర్రబాలెం–నవులూరు గాంధీబొమ్మ సెంటర్లోని నూడిల్స్ పాయింట్కు తీసుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలోకి ఆమెను తీసుకెళ్లి.. పథకం ప్రకారం పవన్ను అక్కడికి రప్పించాడు. పవన్ తన చేతిలో ఉన్న రాడ్డుతో జ్యోతి తలపై గట్టిగా కొట్టాడు. అనంతరం దెబ్బ సరిగా తగిలిందో లేదోనని శ్రీనివాస్ కూడా ఆమె తలపై కొట్టాడు. దీంతో అమె అక్కడికక్కడే చనిపోయింది. వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు, చిత్రంలో నిందితులు అనుమానం రాకుండా..: అనుమానం రాకూడదని శ్రీనివాస్ తనకు యాక్సిడెంట్ అయిందని నాటకమాడాడు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి బెదిరించి జ్యోతిని తమతో పంపమని అడుగగా తాము అందుకు నిరాకరించామని, తమపై దాడి చేసి జ్యోతిని చంపారని శ్రీనివాస్ కట్టుకథ చెప్పాడు. హత్యకు గురైన జ్యోతితోనే కాకుండా శ్రీనివాస్ మరికొందరు యువతులతో సన్నిహితంగా ఉంటున్నాడు. శ్రీనివాస్ సెల్ఫోన్లో యువతుల న్యూడ్ ఫొటోలు, వీడియోలున్నాయి. ఫేస్బుక్లో 80 మందికి పైగా యువతులతో శ్రీనివాస్ చాటింగ్ చేశాడని ఎస్పీ వివరించారు. జ్యుడీషియల్ విచారణ జరిపించాలి జ్యోతి తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాల నాయకులు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. జ్యోతి తల్లిదండ్రులు అంగడి చిన్నగోవిందు, దుర్గ మాట్లాడుతూ తమ కుమార్తెను నమ్మించి మోసం చేసి దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నార్త్ డీఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించి పోస్టుమార్టం చేసేందుకు వచ్చిన వైద్యురాలిని అడ్డుకున్న కారణంగానే ఖననం చేసిన తమ కుమార్తె మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో తమకు పోలీస్ శాఖపైనే నమ్మకం సడలుతోందన్నారు. సంఘటన స్థలంలో తమ కుమార్తెకు చెందిన సెల్ఫోన్, పర్స్, చెప్పులు ఏమయ్యాయనే విషయాలు పోలీసులు వెల్లడించలేదన్నారు. జుడీషియల్ విచారణకు ఆదేశిస్తే పూర్తి స్థాయిలో వివరాలు బహిర్గతమవుతాయని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మీడియా ముందుకు జ్యోతి హత్యకేసు నిందితులు
-
శ్రీనివాస్ పోలీసుల్నీ తప్పుదోవ పట్టించాడు..
సాక్షి, గుంటూరు : రాష్ట్ర రాజధాని అమరావతిలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్తో పాటు అతడికి సహకరించిన పవన్ కల్యాణ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులుశనివారం ఉదయం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను అర్బన్ ఎస్పీ విజయరావు వివరించారు. ‘జ్యోతికి శ్రీనివాస్కు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకోమని అడిగినందుకే ప్రియురాలిని హతమార్చేందుకు పక్కా పథకం వేశాడు. గతంలో జ్యోతి దగ్గర శ్రీనివాస్ లక్ష రూపాయలు తీసుకున్నాడు. (వెలుగులోకి శ్రీనివాసరావు అకృత్యాలు) జ్యోతిని హత్య చేసేందుకు శ్రీనివాస్ తన వద్ద క్లర్క్గా పనిచేస్తున్న పవన్ కల్యాణ్ సహకారం తీసుకున్నాడు. రాడ్తో తలపై కొట్టిన దెబ్బలకు షాక్తో జ్యోతి చనిపోయింది. సంఘటన జరిగిన రోజు శ్రీనివాస్ ...జ్యోతికి మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేశాడు. ఇద్దరి విజువల్స్ సీసీ టీవీ పుటేజ్లో లభించాయి. కేసును తప్పుదోవ పట్టించడానికి ఎన్నో ప్రణాళికలు వేసిన శ్రీనివాస్.... ఎవరో వచ్చి దాడి చేశారంటూ కట్టుకథలు చెప్పాడు. ఎవరికి అనుమానం రాకుండా పవన్తో ఇనుప రాడ్తో శ్రీనివాస్ దాడి చేయించుకున్నాడు. చీకట్లో బలంగా కొట్టడం వల్లే అతడికి పెద్ద దెబ్బ తగిలింది. శ్రీనివాస్ ఫేస్బుక్లోను అసభ్య చాటింగ్లు గుర్తించాం. చాలామంది మహిళలతో అతడు వీడియో చాట్ చేశాడు. శ్రీనివాస్పై రౌడీ షీట్ ఓపెన్ చేశాం. నిందితులు ఇద్దర్ని కోర్టులో ప్రవేశపెడుతున్నాం.’ అని ఎస్పీ తెలిపారు. -
మృగాడి దాష్టీకానికి ఆరిన మరో ‘జ్యోతి’
తన కుమారుడి వయసున్న యువతి నిండు ప్రాణాలను ఆ మానవ మృగం బలి తీసుకుంది. ఆమెకు పెళ్లి కుదరడాన్ని తట్టుకోలేకపోయింది. తనకు దక్కని ఆమె ఎవరికీ దక్కకూడదన్న అక్కసుతో గొంతునులిమి, పీక కోసి హతమార్చింది. పెళ్లి సంబంధం కోసం ఏలూరు వెళ్లిన తల్లిదండ్రులు తమ బిడ్డ హత్యకుగురైందని తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. తెనాలి రూరల్: గుంటూరు జిల్లాలోని రాజధాని పరిధిలో ప్రేమికుడి వెంట వెళ్లిన నేరానికి ప్రాణాలు కోల్పోయిన జ్యోతి హత్య కేసులో వాస్తవాలు ఇంకా వెలుగు చూడక ముందే.. తెనాలిలో ఓ మృగాడి ఘాతుకానికి మరో ‘జ్యోతి’ కొడిగట్టింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ యువతిని గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఆ మానవ మృగం..నేరుగా పోలీసుస్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే..పట్టణానికి చెందిన బిట్రా సుధాకర్, దుర్గాభవాని దంపతులు పట్టణ ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో నివసిస్తున్నారు. వస్త్ర దుకాణాల్లో పనిచేసే వీరికి కుమారుడు ప్రవీణ్ అలియాస్ నాని, కుమార్తె శ్రీజ్యోతి (20) ఉన్నారు. ప్రవీణ్ ఆటోనగర్లో స్టీలు కంపెనీలో పనిచేస్తుండగా, పదోతరగతి వరకు చదివిన శ్రీజ్యోతి ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు పెళ్లిసంబంధం మాట్లాడేందుకని సుధాకర్ దంపతులు గురువారం తెల్లవారుజామునే ఏలూరు బయలుదేరి వెళ్లారు. ప్రవీణ్ ఆటోనగర్ వెళ్లాడు. శ్రీజ్యోతి తండ్రి సుధాకర్ది స్వస్థలం భట్టిప్రోలు. అదే ఊరికి చెందిన నేతికుంట్ల సత్యనారాయణ(42)తో స్నేహం కుదిరింది. తన కొడుకుతోపాటు అదే ఈడు వాళ్లయిన సుధాకర్ పిల్లలనూ సత్యనారాయణ ఆడిస్తుండేవాడు. ఏడెనిమిదేళ్ల క్రితం వ్యాపారంలో నష్టపోయిన సుధాకర్ ఉపాధి కోసం తెనాలికి వచ్చేసి సాలిపేటలో అద్దెకు ఉంటున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు సత్యనారాయణ కూడా కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చి రైస్కాలనీలో నివసించసాగాడు. కుటుంబ వివాదాల కారణంగా సత్యనారాయణ ఒంటరిగా జీవిస్తున్నాడు. కుటుంబ స్నేహితుడిగా అన్ని అవసరాలకు సుధాకర్ కుటుబానికి ఆసరాగా ఉంటూ వచ్చాడు. అయితే తన కుమారుడి వయస్సున్న శ్రీజ్యోతిపై కన్నేసిన సత్యనారాయణ ఆమెను వివాహం చేసుకుంటానని ఎవరి చేతనో తల్లిదండ్రులను అడిగించాడు. ఎందుకలా అడిగారని సుధాకర్ దంపతులు అతడిని నిలదీయగా..‘నేనెందుకు అన్నాను..చిన్నపిల్లకదా..సరదాగా అన్నాను’ అంటూ సత్యనారాయణ మాట దాటేశాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషనుకు వచ్చిన మృతురాలి తలిదండ్రులు బిట్రా సుధాకర్, దుర్గాభవాని ఆ తర్వా త కొద్దిరోజులకే ‘శ్రీజ్యోతికి పెళ్లి చేయండి..అవసరమైతే ఎంతో కొంత డబ్బు సర్దుబాటు చేస్తాను’ అంటూ హామీనిచ్చాడు. అతని మాటలు నమ్మిన శ్రీజ్యోతి తల్లిదండ్రులు ఏలూరులో చూసిన పెళ్లి సంబంధం దాదాపు ఖరారైనట్టేనని ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సత్యనారాయణకు ఫోనులో చెప్పారు. దీంతో ఆమె తనకు దక్కదని భావించిన సత్యనారాయణ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీజ్యోతిని హత్య చేసి పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. నిర్ఘాంతపోయిన పోలీసులు..అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లాంపేటలోని సుధాకర్ ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో శ్రీజ్యోతి మృతదేహం కనిపించింది. గొంతు నులిమి కూరగాయలు కోసుకునే కత్తితో పీక కోసినట్టు గమనించారు. నిందితుడిని పోలీస్స్టేషనుకు తరలించి..ఏలూరు వెళ్లిన తలిదండ్రులకు వన్టౌన్ సీఐ మరీదు శ్రీనివాసరావు సమాచారం అందించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న ఆ దంపతులు, విగత జీవురాలై పడి ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు చెప్పారు. -
పరిటాల సునీతపై మండిపడ్డ జ్యోతక్క
‘‘పరిటాల కుటుంబం ఉద్యమాన్ని స్వార్థానికి వాడుకుంటోంది. అణగారిన వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నామని నమ్మిస్తూ రాజకీయంగా ఎదగాలని చూస్తోంది. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు...రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు’’ అని మాజీ నక్సలైటు, 2004లో పోలీసుల తూటాలకు బలైన నక్సల్ ఉద్యమ నేత ఎర్రసత్యం సతీమణి అరుణక్క అలియాస్ జ్యోతక్క అభిప్రాయపడ్డారు. నక్సల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె...ఆ తర్వాత వైఎస్సార్ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసి పోయారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె... బుధవారం తనకల్లు మండలం ఉస్తినిపల్లిలోని తన స్వగృహంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నారు. అనంతపురం, కదిరి: నక్సల్ ఉద్యమం...ప్రస్తుత రాజకీయాలపై జ్యోతక్క తన అభిప్రాయాలను సాక్షితో ఇలా పంచుకున్నారు. ‘సాక్షి’: నక్సల్ ఉద్యమానికి ఎలా ఆకర్షితులయ్యారు..? జ్యోతక్క: మా పుట్టిల్లు తాడిపత్రి. మా నాన్న నక్సల్ ఉద్యమంలో రైతు కూలీ సంఘ నాయకుడిగా ఉండేవారు. అలా నేను కూడా ఆకర్షితురాలినై చిన్నప్పుడే జననాట్య మండలిలో చేరి ఉద్యమంలోకి వెళ్లాను. గణపతి వర్గంలో జిల్లా కమిటీలో పనిచేశాను. నా భర్త ఎర్రసత్యం ఎంఏ గోల్డ్మెడలిస్ట్. ఆయన ఎస్కేయూలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూ.. నక్సల్ ఉద్యమంలో చేరి రాష్ట్ర కమిటీలో చురుగ్గా ఉండేవారు. ‘సాక్షి’: పరిటాల కుటుంబీకులు కూడా నక్సల్ ఉద్యమంలో పనిచేశారు కదా..! జ్యోతక్క: రవి తండ్రి శ్రీరాములు, రవి సోదరుడు హరి వీరిద్దరూ పనిచేశారు. వారి గురించి ప్రస్తావించలేము. కానీ పరిటాల రవితో పాటు ఆయన సతీమణి సునీత చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్లు...మా కుటుంబం అణగారిన వర్గాల కోసం పనిచేస్తోందని ప్రజల్ని నమ్మిస్తూ రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నక్సల్ ఉద్యమాన్ని కూడా రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు. వారికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ‘సాక్షి’: వైఎస్సార్, చంద్రబాబు..వీరిద్దరిలో ఎవరు ప్రజల మనిషి..? జ్యోతక్క: వైఎస్ రాజ శేఖరరెడ్డికి, చంద్రబాబుకు నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబు ఏమీ లేకపోయినా హంగామా ఉంటుంది. కానీ వైఎస్సార్ ప్రజల మనిషి. ఆయన అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డారు. ఆఖరుకు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు ఎక్కువ రోజులు పరిపాలించినా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అదే వైఎస్సార్ ఎక్కువ రోజులు పరిపాలించినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. ‘సాక్షి’: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు? జ్యోతక్క: ఇప్పుడున్న పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాస్త బెటర్ అన్పించింది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. గత ఎన్నికల్లోనే ఆయన ఒక్క అబద్ధం చెప్పింటే అధికారంలోకి వచ్చేవారు. విలువలకు, విశ్వసనీయతకు మారు పేరు వైఎస్ జగన్ అని చెప్పచ్చు. ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం. అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరగాలంటే జగనన్నే కరెక్ట్. అందుకే నేను కూడా ఎంతో కొంత ప్రజలకు నా వంతు ప్రజా సేవ చేయాలని భావించే వైఎస్సార్సీపీలో చేరాను.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ప్రజలను పలకరించిన తీరుగానీ..ప్రజల కోసం ఆయన పడుతున్న తపన గానీ చూస్తే ఆయన జనం కోసమే పుట్టారేమో అనిపిస్తోంది -
స్కెచ్ గీసి చంపారు..!
-
వెలుగుచూస్తున్న శ్రీనివాసరావు అకృత్యాలు
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో సంచలనం కలిగించిన జ్యోతి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపుగా ఛేదించారు. పెళ్ళి చేసుకోమని జ్యోతి ఒత్తిడి చేయడంతో ఆమెను వదిలించుకునేందుకు స్నేహితుడు పవన్తో కలిసి శ్రీనివాసరావు పథకం ప్రకారం హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం. 2 రోజుల క్రితం పవన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య ఎలా జరిగింది? హత్యకు వాడిన ఆయుధాన్ని ఎక్కడ పడేశారు? అన్న అంశాలపై పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ నెల 11న రాత్రి తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి జ్యోతిపై అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేయడమే కాకుండా తన తలపై బలంగా కొట్టి గాయపర్చారని ఇంతవరకూ శ్రీనివాసరావు చెప్తూవచ్చాడు. (ప్రియుడే హంతకుడా?) అయితే విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. స్నేహితుడు పవన్ సహాయంతో తన తలపై గాయపరుచుకుని సినీ ఫక్కీలో డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. రీ పోస్టుమార్టంలో జ్యోతిపై లైంగిక దాడి గానీ, లైంగిక దాడి యత్నం గానీ జరగలేదని, ఆమెను బలమైన రాడ్డులాంటి ఆయుధంతో కొట్టి చంపారని తేలడంతో శ్రీనివాసరావు కుట్ర బయటపడింది. హత్యకు పాల్పడిన విధానాన్ని పవన్ పోలీసులకు చెప్పిన వీడియోను చూపించినప్పటికీ శ్రీనివాసరావు మాత్రం తాను హత్య చేసినట్లు అంగీకరించలేదు. దీంతో పోలీసులు బుధవారం అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి అరెస్టు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. నేరం అంగీకరించమని తమ కుమారుడిని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని శ్రీనివాస్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరావు గతంలోనూ అనేక మంది యువతుల్ని మోసగించిన ఘటనలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ సెల్ఫోన్లో ఆధారాల కోసం వెతగ్గా పలువురు యువతుల న్యూడ్ ఫొటోలు, వీడియోలు ఉండటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ వ్యవహారాలు జ్యోతికి తెలియడం వల్లే పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేసిందని చెబుతున్నారు. గతంలో శ్రీనివాస్ నేరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, జ్యోతి హత్య కేసులో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే చేసినట్లు చూపించిన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ విజయభారతిపై వేటు పడనున్నట్టు తెలిసింది. (కేసు ముగించే కుట్ర) -
కేసు ముగించే కుట్ర
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో సంచలనం కలిగించిన జ్యోతి హత్యకేసులో అటు పోలీసులు.. ఇటు ప్రభుత్వ వైద్యులు అనుసరించిన తీరు, కేసును నీరుగార్చే కుట్రలు బట్టబయలయ్యాయి. ఈ కేసులో పోలీసులు జ్యోతి మృతదేహంపై దుస్తులు, వేలిముద్రలను సేకరించకుండా ఖననం చేయడం.. ఆ తరువాత దొంగచాటుగా మృతదేహాన్ని వెలికితీసి దుస్తులు సేకరించడంతో అనుమానాలు వెల్లువెత్తగా రీపోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో చీకటి కోణం వెలుగు చూసింది. సంచలనాత్మకమైన కేసులో పకడ్బందీగా పోస్టుమార్టం నిర్వహించాల్సిన ప్రభుత్వ వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహించిన తీరు బయటపడింది. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ జి.విజయభారతి జ్యోతి మృతదేహానికి అసలు పోస్టుమార్టమే నిర్వహించకుండా పొట్టపై చిన్న గాటు పెట్టి కుట్లు వేసి పంపించిన వైనం బయటపడడంతో అటు జిల్లా ఉన్నతాధికారులు, ఇటు పోలీసు అధికారులు ఉలిక్కి పడ్డారు. జ్యోతి తలపై రాడ్డు లాంటి ఆయుధంతో బలంగా కొట్టడం వల్లే ఆమె మృతిచెందిందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే పోస్టుమార్టం సమయంలో మృతదేహం తలపై చిన్న గాటు కూడా పెట్టిన దాఖలాలు లేవంటే పోస్టుమార్టం ఏవిధంగా నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. జ్యోతి హత్య కేసులో ప్రభుత్వ వైద్యురాలు ఈ విధంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇవి నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పులు కావని, కుట్రపూరితంగా కేసును పక్కదారి పట్టించేందుకే పథకం ప్రకారం చేసినవనే విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్ విజయభారతిపై చర్యలు షురూ.. జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ విజయభారతిని రెండు రోజుల క్రితం పిలిపించిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమె ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను పరిశీలించి రీపోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వేటు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆమెను సస్పెండ్ చేసి వదిలేస్తారా.. లేక క్రిమినల్ కేసు సైతం నమోదు చేస్తారా? అనే విషయంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే జ్యోతిని రాడ్డు లాంటి బలమైన ఆయుధంతో తలపై బలంగా కొట్టడం వల్ల తల లోపల పుర్రె ముక్కలు ముక్కలైనట్లు రీపోస్టుమార్టంలో తేలినట్లు తెలుస్తోంది. జ్యోతిది కేవలం హత్య మాత్రమేనని, ఆమెపై ఎటువంటి లైంగిక దాడులు జరగలేదని కూడా తేలినట్లు సమాచారం. స్నేహితులతో కలిసి జ్యోతిని హతమార్చిన శ్రీనివాసరావు జ్యోతిని హతమార్చేందుకు శ్రీనివాసరావు ఏవిధంగా కుట్ర చేశాడనే వైనాన్ని పోలీసులు పూర్తిగా ఆధారాలతో సేకరించినట్లు తెలిసింది. అతని వద్ద పనిచేసే పవన్ పోలీసుల అదుపులో అసలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అయితే జ్యోతిని హతమార్చేందుకు శ్రీనివాసరావు తన వద్ద పనిచేసే పవన్ సహాయం తీసుకున్నాడా.. అసలు జ్యోతిని ఎలా హతమార్చారు.. శ్రీనివాసరావుకు తగిలిన గాయం ఎవరు చేశారు.. అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే శ్రీనివాసరావు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించకపోవడంతో ఆసుపత్రి నుంచి నేడో, రేపో డిశ్చార్జి చేసి అరెస్టు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. అయితే రాజధాని ప్రాంతంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందనే ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార పార్టీ నేతలు కేసును పక్కదారి పట్టించేందుకు అటు పోలీసులు, ఇటు ప్రభుత్వ వైద్యులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో పాటు భారీ మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎవరెవరిపై వేటు పడుతుందో వేచి చూడాలి. -
స్నేహితుని సాయంతో అంతం?
సాక్షి, గుంటూరు/ తాడేపల్లి రూరల్: అంగడి జ్యోతి హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈనెల 11న మంగళగిరి నవులూరు సమీపంలోని అమరావతి టౌన్షిప్లో అంగడి జ్యోతి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో జ్యోతి ప్రియుడు శ్రీనివాసరావు పాత్రపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి పోలీసులు శ్రీనివాసరావు స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు సమాచారం. జ్యోతిని వదిలించుకునే ఆలోచనతో స్నేహితుల సాయంతో శ్రీనివాసరావే ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆధారాల కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ యువకుడి బైక్ పైనే అమరావతి టౌన్షిప్కు.. తన బైక్ పైనే 11న జ్యోతిని శ్రీనివాసరావు అమరావతి టౌన్షిప్కు తీసుకువెళ్లినట్టు శ్రీనివాసరావు స్నేహితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచి పెళ్లి విషయంలో శ్రీనివాస్, జ్యోతిల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా అతను వెల్లడించాడు. పెళ్లి చేసుకోవాలని జ్యోతి తీవ్ర ఒత్తిడి చేస్తుండటంతో ఆమెకు సంబంధించిన అసభ్యకర ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని శ్రీనివాసరావు జ్యోతిని బెదిరించేవాడని, అయినా సరే జ్యోతి పెళ్లి గురించి ఒత్తిడి చేసేదని అతను చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతి అడ్డు తొలగించుకోవాలని శ్రీనివాస్ ఆమెను నమ్మించి అమరావతి టౌన్షిప్కు రప్పించాడని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. తాడేపల్లి పరిధిలోని మహానాడు ప్రాంతంలో నివసించే ఇద్దరు యువకులను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో ఓ యువకుడు శ్రీనివాసరావు ప్రణాళిక ప్రకారమే హత్య చేశామని ఒప్పుకొన్నట్లు సమాచారం. తాను జ్యోతితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వెనుకనుంచి వచ్చి దాడికి పాల్పడాలని ప్రణాళిక వేసినట్లు అతని స్నేహితుడు పోలీసులకు వెల్లడించాడని సమాచారం. ముందుగా తనపై రాడ్తో దాడిచేసి, అనంతరం జ్యోతిపై దాడి చేయాలన్న శ్రీనివాసరావు ప్రణాళిక ప్రకారమే చేశామని, అనంతరం ఆ రాడ్ను బకింగ్హామ్ కెనాల్లో పడవేశామని అతను చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు తాడేపల్లి పరిధిలోని సీతానగరం, కొత్తూరు రైల్వే బ్రిడ్జి కింద భాగంలో బకింగ్హామ్ కెనాల్ లాకులు మూయించిన ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా గజ ఈతగాళ్లతో గాలించారు. అయినా రాడ్డు లభించలేదు. కాగా కేసు దర్యాప్తులో కీలక ఆధారాలైన జ్యోతి సెల్ఫోన్, హ్యాండ్ బ్యాగ్ల జాడ నేటికీ లభించలేదు. -
జ్యోతి హత్య కేసు.. ప్రియుడే హంతకుడు
-
ప్రియుడే హంతకుడా?
మంగళగిరి: రాజధాని ప్రాంతంలో జరిగిన జ్యోతి హత్య కేసులో పోలీసులు మిస్టరీని దాదాపు ఛేదించినట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా కేసు పలు మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే జ్యోతిని ప్రియుడు శ్రీనివాసరావు హత్య చేసి ఉంటాడా? అన్న కోణంలో విచారణను వేగవంతం చేశారు. శ్రీనివాసరావు వ్యవహార శైలిని తీవ్రంగా అనుమానిస్తున్న పోలీసులు, ఇప్పటికే అతని ఫోన్ నుంచి కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసుల తీరుపై పలు విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం గుంటూరు అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయరావు, ఉమన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత, అర్బన్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ హరిరాజేంద్రబాబులు జ్యోతి ప్రియుడు శ్రీనివాసరావును ఎన్నారై ఆసుపత్రిలో విచారించారు. అలాగే సీసీ పుటేజ్, కాల్ డేటా ఆధారంగా పలు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. హత్య జరిగినప్పటి నుంచి ఇంతవరకూ శ్రీనివాసరావు చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. అందువల్లే అతనే జ్యోతిని హత్యచేసి ఉండవచ్చా? అన్న అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. ఈ హత్య జరిగిన తీరు పలు అనుమానాలకు తావిచ్చినప్పటికీ ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారో తేల్చడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. దీనికి తోడు మృతదేహంపై ఉన్న బట్టలు, వేలిముద్రల్ని సేకరించకుండానే ఖననం చేయడం, ఆ తర్వాత పోలీసులు దొంగచాటుగా మృతదేహాన్ని వెలికితీసి బట్టలు సేకరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లపై వేటు వేసిన అధికారులు నార్త్ డీఎస్పీ రామకృష్ణను సైతం కేసు విచారణ నుంచి తప్పించారు. శ్రీనివాసరావు సెల్ఫోన్లో కీలక ఆధారాలు ఈనెల 11న మంగళగిరి మండలంలోని నవులూరు అమరావతి టౌన్షిప్లో శ్రీనివాసరావు, జ్యోతిలపై దాడి జరగ్గా.. జ్యోతి అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. దాడిలో గాయపడి ఎన్నారై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న శ్రీనివాసరావు అనారోగ్యం పేరుతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడని, అపస్మారకస్థితిలో ఉన్నానని, తనకు ఏమీ తెలియదంటూ నాలుగు రోజులుగా పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. 14వ తేదీ మధ్యాహ్నం ఐసీయూ నుంచి వార్డుకు మార్చగానే పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా అతన్ని విచారించారు. ప్రియుడు శ్రీనివాసరావును పెళ్లి చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి చేయడంతో ఆమెను అడ్డు తొలగించుకుంటానని స్నేహితులతో చెప్పిన ఆడియో రికార్డుల్ని పోలీసులు సేకరించడంతో పాటు శ్రీనివాసరావు సెల్ఫోన్లో జ్యోతితో పాటు, పలువురు యువతుల అసభ్యకర ఫొటోలు, వీడియోల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పలువురు యువతులతో శ్రీనివాసరావు చేసిన చాటింగ్లు కూడా దొరికాయని చెబుతున్నారు. వీటిన్నంటిని విశ్లేషించాక అతనే జ్యోతిని హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు పోలీసుల్లో బలపడుతున్నాయి. స్నేహితుల సాయంతో తనను గాయపర్చుకుని హత్య చేశాడా? అనే కోణంలో విచారణను వేగవంతం చేశారు. పోలీసు అధికారులు మాత్రం శ్రీనివాసరావే చంపాడన్న విషయాన్ని నిర్ధారించడం లేదు. విచారణ పూర్తయ్యాక మాత్రమే అసలు నిందితులు ఎవరనేది తేలుతుందని, ప్రస్తుతం అతనిపై అనుమానాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. డాక్టర్ భారతిపై చర్యలు! జ్యోతి హత్య కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటుపడగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ భారతిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జ్యోతి మృతదేహానికి మొదట పోస్టుమార్టం నిర్వహించిన భారతిని కలెక్టర్ కోన శశిధర్ పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసే సమయంలో తప్పులు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టును సైతం కలెక్టర్ తెప్పించుకున్నారని తెలిసింది. తప్పు చేస్తే శిక్షించండి: శ్రీనివాసరావు తల్లిదండ్రులు తమ కుమారుడు శ్రీనివాసరావు నేరస్తుడు కాదని, నేరం చేసి ఉంటే చట్టపరంగా శిక్షించవచ్చని శ్రీనివాసరావు తల్లి లక్ష్మి, తండ్రి నరసింహారావు అన్నారు. ఆసుపత్రి ఆవరణలో శ్రీనివాసరావు తల్లి లక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ.. నిందితులెవరైనా ఉరితీయాలని తెలిపింది. జ్యోతి కుటుంబసభ్యుల వల్ల తమతో పాటు తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. జ్యోతిని హత్య చేసేంతటి నేరం తమ కుమారుడు చేస్తాడని అనుకోవడం లేదని నరసింహరావు చెప్పారు. -
జ్యోతి హత్యకేసు: శ్మశానం వద్ద ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : సంచలనం సృష్టించిన ‘రాజధానిలో జ్యోతి హత్య’ కేసులో జ్యోతి మృతదేహానికి రీ పోస్ట్మార్టం పూర్తయింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు...పోస్ట్ మార్టంలో ఏం తేలిందో చెప్పాలంటూ డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రీ పోస్ట్మార్టం చేసిన వైద్యుడిని జ్యోతి బంధువులు అడ్డుకున్నారు. పోస్ట్మార్టం నివేదిక వెల్లడించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జ్యోతి బంధువులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాగా అంతకు ముందు జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం చెయ్యకుండానే పోలీసులు చేశామని చెబుతున్నారంటూ కుటుంబసభ్యులు గురువారం తాడేపల్లి మహానాడు శ్మశాన వాటిక వద్ద ఆందోళన చేపట్టారు. జ్యోతి మృతదేహంపైన పోస్టుమార్టం చేసిన ఆనవాళ్లు కనిపించటం లేదంటూ వారు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం జరగాలంటూ జ్యోతి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జ్యోతి కుటుంబసభ్యులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సీఐ బాలాజీని కాపాడటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ వారు ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా తన చెల్లెల్ని అత్యాచారం చేసి హత్య చేశారని, ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు స్పందించడం లేదని జ్యోతి సోదరుడు ప్రభాకర్ వాపోయాడు. కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. పోస్టుమార్టం సైతం తూతూ మంత్రంగా చేశారన్నారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంగళగిరి సీఐ బాలాజీని సస్పెండ్కు సిఫార్సు చేయడంతోపాటు, ఎస్ఐ బాబూరావు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (‘జ్యోతి వాచ్, బట్టలు కావాలన్నారు’) -
జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం
సాక్షి, గుంటూరు: అమరావతిలో ప్రేమ జంట శ్రీనివాస రావు- జ్యోతిపై జరిగిన దాడి కేసు విచారిస్తున్న పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు సరిగా విచారించడం లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఏఎస్పీ లక్ష్మీనారాయణ.. జ్యోతి మృతదేహానికి గురువారం రీపోస్టుమార్టం నిర్వహించనున్నట్టు తెలిపారు. పోస్టుమార్టంపై జ్యోతి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. పోస్టుమార్టంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హత్యకేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ బాలజీని సస్పెండ్ చెస్తామని ప్రకటించారు. గత సోమవారం రాత్రి తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతిలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో యువతి జ్యోతి మృతి చెందగా.. శ్రీనివాసరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
జ్యోతి హత్య కేసు దర్యాప్తుపై అనుమానాలున్నాయి
-
‘జ్యోతి వాచ్, బట్టలు కావాలన్నారు’
సాక్షి, గుంటూరు : అమరావతిలో ప్రేమ జంట శ్రీనివాస రావు- జ్యోతిపై జరిగిన దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. గుర్తు తెలియని దుండగులు జరిపిన ఈ దాడిలో యువతి జ్యోతి మృతి చెందగా.. శ్రీనివాసరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తుపై జ్యోతి సోదరుడు ప్రభాకర్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును సరిగా విచారించడం లేదని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో అసలు ఏమి జరిగిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు జరపడంలేదన్నారు. (రాజధానిలో ప్రేమజంటపై దాడి) ‘బుధవారం ఉదయం మంగళగిరి పోలీసులు ఫోన్ చేసి మృతదేహంపై ఉన్న బట్టలు, వాచ్ కావాలన్నారు. దీంతో సమాధి చేసిన మృతదేహాన్ని బయటకు తీసి బట్టలు, వాచ్ పోలీసులకు ఇచ్చాం. అయితే ఈ విషయాన్ని మీడియాకి చెప్పకుండా గోప్యంగా ఉంచమని చెప్పారు. దీంతో నాకు పోలీసులు దర్యాప్తుపై అనుమానం కలుగుతోంది. అసలు జ్యోతి మృతదేహాన్ని పోస్ట్మార్టం చేయలేదని భావిస్తున్నా. ఈ కేసును పోలీసులు తప్పదోవ పట్టించేలా ఉన్నారు’ అని ప్రభాకర్ అనుమానం వ్యక్తం చేశారు. (మాజీ ప్రియుడి పనేనా ?) ఇది చదవండి : జ్యోతి మృతిపై అనుమానాలున్నాయి -
మాజీ ప్రియుడి పనేనా ?
గుంటూరు, మంగళగిరి: మండలంలోని నవులూరు అమరావతి టౌన్షిప్లో ఈనెల 11వ తేదీ సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలో మృతి చెందిన యువతి అంగడి జ్యోతి మృతిపై పలు అనుమనాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు తెలిపారు.జ్యోతి ఎంఫార్మసీ పూర్తి చేయగా, శ్రీనివాసరావు ఇంటర్ మాత్రమే చదివాడు. ఇద్దరు ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల కిందట తల్లితండ్రులు లేని సమయంలో జ్యోతి ఇంటికి వచ్చిన శ్రీనివాసరావుని ఆమె సోదరుడు ప్రభాకర్ హెచ్చరించారు. అతని తల్లితండ్రులతో కుమారుడిని జాగ్రత్తగా ఉంచుకోవాలని కూడా చెప్పారు. దీంతో శ్రీనివాసరావు కుటుంబసభ్యులు అక్కడ నుంచి నివాసం మార్చారు. ఇటీవల మరలా అక్కడికే మారి యువతితో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలసి సోమవారం రాత్రి అమరావతి టౌన్షిప్లోకి చేరుకుని మాట్లాడుకుంటుండగా నలుగురు దుండగులు దాడి చేయడంతోజ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన శ్రీనివాసరావు మండలంలోని చినకాకానిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు సేకరించిన పోలీసులు పోలీసులు యువతి మృతదేహాన్ని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. జ్యోతి సోదరుడు ప్రభాకర్తో పాటు బంధువుల నుంచి రూరల్ సీఐ బాలాజీ, ఎస్ఐలు బాబూరావు, నాగరాజు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జ్యోతి సోదరుడు ప్రభాకర్ మాట్లాడుతూ తన సోదరికి సోమవారం ఉదయం 11 గంటలకు మరో యువతి ఫోన్ చేసిందని, గుంటూరులోని కళాశాలలో ప్రొవిజన్ సర్టిఫికెట్ తీసుకునేందుకు రావాలని కోరిందన్నారు. తమ తండ్రికి బాగాలేదని.. రేపు వస్తానని చెప్పినా వినకుండా ఒత్తిడి చేయడంతో వెంటనే బయలుదేరి వెళ్లిందని తెలిపారు. శ్రీనివాసరావే తన చెల్లిని మరో యువతితో రప్పించి హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరారు. సోమవారం రాత్రి 8.44 గంటలకు తమ తండ్రి జ్యోతికి ఫోన్ చేయగా పది నిముషాలలో వస్తానని చెప్పిందని, మరలా 9గంటల 15 నిముషాలకు చేయగా స్విచ్చాఫ్ చేసి ఉందని తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువతి హత్యను పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు నోరు తెరిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ భారతి మాట్లాడుతూ యువతి తలపై బలమైన గాయం కారణంగానే మృతి చెందిందని తెలిపారు. రక్తనమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని, నివేదిక వస్తే కాని అత్యాచారం జరిగింది లేదా అనేది తెలియదని తెలిపారు. మాజీ ప్రియుడి పనేనా ? తాడేపల్లి రూరల్: జ్యోతి మృతి పట్ల ఆమె స్వగ్రామంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో సైతం శ్రీనివాస్ కంటే ముందు ఆమె వేరే యువకున్ని ప్రేమించిందని, బహుశా అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు సైతం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేమికులిద్దరు బైక్పై వెళ్లినప్పుడు వారిని ఎవరైనా వెంబడించారా? అనే కోణంలో పోలీస్లు సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. నాకేమీ గుర్తులేదు ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా తాను అపస్మారక స్థితిలో ఉన్నానని, తనకు ఏమి గుర్తు లేదని చెప్పాడు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారితో మాట్లాడినప్పుడు తాము మాట్లాడుకుంటుండగా నలుగురు యువకులు దాడి చేసి జ్యోతిపై అఘాయత్యానికి పాల్పడినట్లు చెప్పాడు. తాను ప్రతిఘటించగా ఇద్దరిపై దాడి చేశారని, జ్యోతి అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. – శ్రీనివాసరావు -
భర్తను చంపి.. ఇంటిముందే పూడ్చింది
శామీర్పేట్: భర్తను హత్య చేయడమేగాక ఈ విషయం బయటికి పొక్కకుండా ఇంటి ఆవరణలోనే గోయ్యితీసి పూడ్చి పెట్టిన ఘటన శామీర్పేట మండలం కేశవరంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ భాస్కర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేశవరం గ్రామంలో ఈ నెల 3న గుర్తుతెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మామిండ్ల మల్లేష్గా గుర్తించారు. దీంతో మల్లేష్ భార్య జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది వెలుగులోకి వచ్చింది. కేశవరం గ్రామానికి చెందిన మల్లేష్ ,జ్యోతి దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. గత కొంత కాలంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 3న మద్యం మత్తులో ఉన్న మల్లేష్, భార్యతో గొడవపడ్డాడు. దీంతో జ్యోతి అతడిని తోసివేయడంతో కిందపడిన మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతకూ లేవకపోవడంతో భర్త మృతిచెందాడని గుర్తించి ఆందోళనకు గురైన ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోనే గోయ్యి తీసి పూడ్చిపెట్టింది. వర్షం కురవడంతో మృతదేహం కుళ్లి దుర్వాసన రావడంతో ఆమె ఈ నెల 2న అర్ధరాత్రి శవాన్ని బయటకుతీసి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల గోతిలో పారవేసింది. స్ధానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జ్యోతిని నిందితురాలిగా గుర్తించి మంగళవారం రిమాండ్కు తరలించారు. -
లెట్స్ డూ కుమ్ముడు
చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలోని ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే.. ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. కేతన్, ప్రాచి, జ్యోతి, ఆశ, డాక్టర్ గురుప్రసాద్, విజయ్ నటించారు. సింగిల్ మ్యాన్ మూవీస్ బ్యానర్పై బి.ఎస్.ఆర్. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా బి.ఎస్.ఆర్. మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులకు అవసరమైన అన్ని అంశాలుంటాయి. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉంటుంది. జూన్ 6న రామానాయుడుగారి జయంతి సందర్భంగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్. కుమార్, సంగీతం: విరించి సాయి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గుర్రపు విజయ్ కుమార్. -
బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
ధారూర్: గమ్యానికి దగ్గరగా వచ్చానని ఫోన్ చేసి చెప్పిన యువతి ఆ వెంటనే రైలు ప్రమాదా నికి గురైంది. రైల్వే స్టేషన్కు వచ్చి యువతి కోసం నిరీక్షించిన కుటుంబీకులు ఆమె రాకపోవ డంతో రాత్రంతా రైలు పట్టాల వెంట వెదికారు. ఉదయాన్నే పట్టాల పక్కనే మృత్యువుతో పోరాడుతూ కనిపించిన కూతుర్ని బతికించుకునేందుకు తల్లి, ఇతర కుటుంబీకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటన ధారూర్ మండలంలోని మైలారం రైల్వేస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కుటుంబీ కులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన కాశమ్మ, మల్లికార్జున్ దంపతుల మూడో కూతురు అల్లాపురం జ్యోతి (21) రంగారెడ్డి జిల్లా లింగంపల్లిలోని గ్రీన్ట్రెండ్స్ బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్గా పనిచేస్తోంది. జ్యోతి కుటుంబం బతుకు దెరువు కోసం ఇరవయ్యేళ్ల క్రితమే తాండూరుకు వచ్చి స్థిరపడింది. జ్యోతి రోజూ ఉదయం రైలులో లింగంపల్లి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని బీజాపూర్ ప్యాసింజర్లో ఇంటికి బయలుదేరింది. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామం లో ఉంటున్న అమ్మమ్మ ఇంటి వద్ద ఆదివారం రాత్రి ఫంక్షన్ ఉండటంతో అక్కడికి వెళ్లడానికి తన చెల్లెలు ఉమకు ఫోన్ చేసింది. వికారాబాద్ దాటాను.. అరగంటలో రుక్మాపూర్ రైల్వేస్టేషన్కు వస్తాను.. బైక్ను పంపిం చమని చెప్పింది. బైక్ను తీసుకుని రైల్వేస్టేషన్కు వచ్చిన మేనమామ కొడుకు రైలు వెళ్లిపోయినా జ్యోతి రాకపోవడంతో ఇంటికి వెళ్లి కుటుంబీకులకు చెప్పాడు. ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నా లేపకపోవ డంతో అనుమానం వచ్చి తెల్లవారే వరకు రైలు పట్టాల వెంట వెదికారు. రుక్మాపూర్–మైలారం స్టేషన్ల మధ్య మైలారం చివరి ఫ్లాట్ఫాం వద్ద ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. వెంటనే పుష్పుల్ రైలులో వికారాబాద్కు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. యువతి పరిస్థితిని గమనించిన వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అంబులెన్స్లో తరలిస్తుండగా చేవెళ్ల దగ్గర జ్యోతి తుదిశ్వాస వదిలింది. ఈ ఘటనపై జ్యోతి తల్లి కాశమ్మ వికారాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యోతి ప్రేమికుడిపై అనుమానం... రైలులో వస్తున్న జ్యోతి రుక్మాపూర్ స్టేషన్లో దిగాల్సి ఉండగా రెండు స్టేషన్ల ముందే రైల్లోంచి ఎలా దూకుతుందనే అనుమా నాన్ని కుటుంబీకులు వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రేమిస్తున్న ఓ యువకుడు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడన్నారు. రైలు ప్రయాణంలో జ్యోతి వెంట అతనూ ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతికి ఫోన్ చేస్తే లేపట్లేదని.. తమకు ఫోన్ చేయడంపై అనుమానం బలపడుతుందని వారు పేర్కొన్నారు. తన అక్క ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని జ్యోతి చెల్లెలు వాపోయింది. -
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
పదం పలికింది – పాట నిలిచింది ప్రేయసిని ఎలా నవ్వాలో కోరడంలోనే, ఆమె నవ్వు అలా ఉందన్న ధ్వని ఏమైనా ఉందా ఈ ‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు’ పాటలో. 1976లో వచ్చిన ‘జ్యోతి’ కోసం ఆచార్య ఆత్రేయ రాశారిది. ‘చిరుగాలి తరగల్లె మెలమెల్లగా సెలయేటి నురగల్లె తెలతెల్లగా చిననాటి కలలల్లె తియతియ్యగా’ నవ్వాలని ఆశించారాయన. దానికి ఒక తార్కిక ముగింపుగా– ‘నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా’ అన్నారు. ఈ పాటను ఈ నవ్వంత అందంగా పాడింది జానకి, బాలు. సంగీతం చక్రవర్తి. దర్శకుడు కె.రాఘవేంద్రరావు. -
ఆదర్శ జ్యోతి
ఇంట్లో మగవారే సంపాదించాలి. ఆడవాళ్లు ఇంటి పనులకే పరిమితమవ్వాలి...చాలా కుటుంబాల్లో కనిపించేది ఇదే. కానీ భర్త ప్రభుత్వోద్యోగి అయినా ఆయనపై ఆధారపడకుండా తనకంటూ ఉపాధి ఉండాలనుకున్నారు కంభానికి చెందిన ఆకవీటి జ్యోతి. ఇంటర్మీడియెట్ వరకే చదువుకున్నా.. పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు నేర్చుకున్నారు. మరికొంత మంది ఆడవాళ్లకు ఉపాధి చూపుతున్నారు. వందలాది మంది రైతులు మల్బరీ తోటలు సాగుచేసేందుకు దారి చూపారు. సాగులో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన ఆకుల దిగుబడి తదితర అంశాల్లో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. ఆమె విజయగాథపై ‘సాక్షి’ కథనం. పట్టుదల, కృషి.. విజయానికి సోపానాలు. ఈ మాటను అనేకమార్లు విని ఉంటారు! ఎన్నో చోట్ల చదివుంటారు! ఆకవీటి జ్యోతి జీవితంలో కృషి, పట్టుదల అడుగడుగునా కనిపిస్తాయి. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి.. ఇంట్లోనే ఉంటూ కుటుంబ ఆలనాపాలనా చూసుకుంటూ కాలం గడిపేయొచ్చు. కానీ ఆమె అలా ఆలోచించలేదు. స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకుంది. తోటి మహిళలకు ఉపాధి కల్పించాలని భావించింది. పట్టుపరిశ్రమ శాఖలో పనిచేస్తున్న తన భర్త నుంచి పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు నేర్చుకుంది. తన లక్ష్యం వైపు అడుగులేసి విజయం సాధించింది. ప్రకాశం , కంభం : పట్టుపురుగుల పెంపకంలో విశేష అనుభవాన్ని గడించడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది కంభం పట్టణానికి చెందిన ఆకవీటి జ్యోతి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్న జ్యోతిది వ్యవసాయ కుటుంబం కాదు. భర్త సుబ్రహ్మణ్యం పట్టు పరిశ్రమల శాఖలో పనిచేస్తుండటంతో ఆ రంగంపై ఆసక్తి పెంచుకుని భర్త ద్వారా పట్టుసాగులో మెళకువలు నేర్చుకుంది. తద్వారా గిద్దలూరు నియోజకవర్గంలో వందల మంది రైతులు మల్బరీ సాగులో సాంకేతిక విప్లవం సాధించడంలో ఎనలేని పాత్ర పోషించింది. మల్బరీ సాగులో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన ఆకుల దిగుబడి తదితర అంశాల్లో సాధించిన ప్రగతికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రశంస పత్రాలు, అవార్డులు అందుకుంది. రైతు సేవలో.. మైసూర్లోని జాతీయ పట్టు పరిశోధనా సంస్థలో వారం రోజులపాటు శిక్షణ తీసుకున్న జ్యోతి.. 2005లో కంభంలో పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. రైతులకు అవగాహన కల్పించడం కోసం విజ్ఞాన యాత్రలు, శిక్షణలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నిరంతరం వారి అభివృద్ధికి సహకారం అందిస్తోంది. జిల్లాలో 2 వేల ఎకారాల్లో మల్బరీ సాగవుతుండగా కంభం, బేస్తవారిపేట మండలాల్లో 350 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. హిందూపురం, ధర్మవరం, కదిరి, పలమనేరు, మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం పట్టు క్వింటా ధర రూ.40 వేల నుంచి రూ.50 వేలు పలుకుతోంది. ఈ లెక్కన రైతులు ఒక పంటకు పురుగుల పెంపకం సంఖ్యను బట్టి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. 24 రోజుల్లో పూర్తయ్యే పట్టుపురుగుల పెంపకంలో మొదటి 8 రోజులు పురుగులను పొదిగించి, ఆ తర్వాత వాటికి ఆహారం అందించాలి. నిర్ధిష్టమైన వాతావరణ పరిస్థితులతోపాటు పరిశుభ్రత పాటించడం అవసరం. ఈ విషయాలపై రైతులకు సూచనలివ్వడమే కాకుండా తానూ పాటిస్తుంది. జ్యోతి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల రైతులు రావడం విశేషం. జ్యోతి చాకీ పట్టు పురుగుల కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 15–20 మంది నిత్యం ఉపాధి కల్పిస్తుండగా.. పరోక్షంగా వందలాది మంది రైతు కూలీలకు, రైతులకు ఉపాధి దొరుకుతోంది. పట్టు సాగుపై రైతులు ఆసక్తి చూపాలి నీటి సౌకర్యం కలిగిన రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపాలి. మల్బరీ సాగు వల్ల ప్రతి నెలా ఆదాయం వస్తుంది. ఆసక్తి ఉన్న రైతులకు సహకారం అందిస్తాం. రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుంది. ఆర్కేవీవై పథకం కింద రూ. రూ.1,37,500, సీడీపీవీ పథకం కింద రూ.80,500, ఎస్సీ రైతులకు రూ.2 లక్షలు, పరికరాలకు రూ.20 వేలు, గది నిర్మాణానికి రూ.22 వేలు, కూలింగ్ సిస్టంకు రూ.9,750, మల్బరీ మొక్కలు ఎకరాకు రూ.10,500, వ్యాధి నిరోధక మందులు, వేపపిండికి 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. రైతులు మల్బరీ సాగుకు ముందుకు వస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. – ఆకవీటి జ్యోతి వరించిన అవార్డులు 2007లో జాతీయ స్థాయిలో ఏపీ తరఫున ఉత్తమ మహిళా అవార్డు, 2011లో రైతేరాజు అవార్డు, అదే ఏడాది దూరదర్శన్ సంస్థ నుంచి ఉత్తమ అవార్డు, 2012లో రాష్ట్ర స్థాయి అవార్డు, 2013లో అప్పటి గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ చేతులమీదుగా ఉత్తమ మహిళా అవార్డు, అదే ఏడాదిలో పట్టుసిరి అవార్డు, 2015లో పట్టు పరిశ్రమ శాఖ నుంచి ఉత్తమ అవార్డును జ్యోతి అందుకుంది. -
చీకటి జీవితాల్లో ‘ఆశాజ్యోతి’
చీకటి. ఆమె జీవితంతో పెనవేసుకుపోయింది. వివాహం... పుత్రుని జననం... ఆమెకు కన్నీళ్లే మిగిల్చాయి. అయితేనేం చీకటితో పోరాడారు. కన్నీళ్లను దిగమింగారు. భర్త చేయిపట్టుకుని అత్తవారిల్లు వదిలి వచ్చి... యాభై మంది అంధ విద్యార్థులకు అమ్మయ్యారు. చీకటి నుంచి వెలుగులోకి తాను పయనిస్తూ వారినీ నడిపిస్తున్నారు. ఆమే విజయనగరానికి చెందిన మాచేపల్లి ఆశాజ్యోతి. ద్వారకామాయి అంధుల పాఠశాల నిర్వహణలో ఆమెకు స్వలాభాన్ని బేరీజు వేసుకునే తీరిక ఉండదు. ఎందుకంటే ఉచితంగా విద్యనందిస్తూ వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీస్తూ ఆ పిల్లలను తల్లిలా సాకడమే ఆమె ముందున్న లక్ష్యం. వారూ తన కుమారుడిలాంటివారేననీ... అందుకే వారిని అక్కున చేర్చుకుని అమ్మలా వారితో గడుపుతున్నాననీ... ఆనందంగా చెప్పే విశేషాలు ‘నేను శక్తి’ తొలి కథనంగా... మీ కోసం. సాక్షి ప్రతినిధి, విజయనగరం : మాది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగి పెద్దయ్యాను. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఖోఖో, కబడ్డీలో జాతీయ స్థాయి వరకూ వెళ్లాను. కానీ నా చదువు మధ్యలో ఉండగానే మామయ్య రవికుమార్తో పెళ్లైంది. తరువాత కుటుంబ సమస్యల కారణంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అమ్మమ్మ వాళ్ల ఇల్లు వదిలి కట్టుబట్టలతోనే విజయనగరం వచ్చేశాం. మామయ్యకు అప్పట్లో చాలా వ్యాపారాలు ఉండేవి. కానీ అవన్నీ అక్కడే వదిలేశారు. ఇక్కడికి వచ్చాక కేవలం రూ.1500ల జీతానికి పనిలో చేరారు. ఆ సమయంలో ఆనారోగ్యానికి గురైతే కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి మాది. బాబు పుట్టాకే కొత్త జీవితం... కొన్నాళ్లకు బాబు పుట్టాడు. వాడికి హరిస్మరణ్ అని పేరు పెట్టుకున్నాం. వాడు పుట్టిన గంటకే మా ఆనందం మొత్తం ఆవిరైపోయింది. వైద్యుల నిర్ణక్ష్యం వాడి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఐదేళ్ల పాటు మంచం మీదే జీవచ్ఛవంలా ఉండేవాడు. ఆ తర్వాతే వాడికి అంధత్వం ఉందని తెలిసింది. కనీసం అమ్మ అనే పిలుపు కూడా ఉండేది కాదు నాకు. ఆ సమయంలో వాడితో పాటే చీకటి గదిలోనే ఉంటూ నిత్యం కన్నీరుమున్నీరుగా ఏడ్చాను. నా సోదరుడొకరు నాకు ధైర్యం చెప్పడంతో బాబును మార్చాలని ప్రయత్నించాను. తొమ్మిది సంవత్సరాలకు వాడు కోలుకున్నాడు. సాధారణ స్కూళ్లలో చేర్చినా అక్కడ ఇమడలేకపోయాడు. బ్లైండ్ స్కూల్కు వెళ్లి అక్కడి వారి పరిస్థితిని కళ్లారా చూశాను. వారం రోజుల పాటు కోలుకోలేక పోయాను. బాబును అక్కడ చేర్చి వాడితో పాటు నేనూ స్కూల్కు వెళ్లడం వల్ల బ్లైండ్ స్కూల్ పిల్లలందరూ నాకు దగ్గరయ్యారు. నిత్యం వాళ్లతో మమేకమవుతూ అక్కడే ఉండిపోయేదాన్ని. మా బాబు ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఏటా విద్యాసంవత్సరం ముగియగానే గ్రామాల్లో సర్వే చేసి అంధ విద్యార్థులను గుర్తించి వారిని తీసుకు వచ్చి జాయిన్ చేసుకుంటుంటాం. వారి తల్లిదండ్రులకు ముందుగా అవగాహన కల్పిస్తాం. అవసరమైతే వారిని తీసుకువచ్చి వారం రోజులు పాఠశాలలో ఉంచి ఇక్కడి పరిస్థితులు వివరించి ఒప్పిస్తాం. పిల్లలకు యూనిఫాంతో పాటు అన్నీ ఇక్కడే కల్పిస్తాం. ప్రస్తుతం 14 మంది ఉద్యోగులున్నారు. బీఏబీఈడీ అర్హత కలిగిన ముగ్గురు అంధ ఉపాధ్యాయులతో పాటు మొత్తం 9 మంది ఉపాధ్యాయులున్నారు. అందరి జీత భత్యాలు, పాఠశాల నిర్వహణ ఖర్చు మొత్తం మేమే భరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో దాతలు కొందరు ముందుకు వచ్చి సహాయం చేస్తుండటం వల్ల సగం భారం తగ్గింది. అంధుల కళాశాల స్థాపనే లక్ష్యం పిల్లలు స్కిల్స్ సంపాదించి ఎవరి కాళ్లమీద వా రే నిలబడేలా చేయడమే నా లక్ష్యం. పిల్లలందరికీ మ్యూజిక్, క్విజ్, నృత్యం, నటన తదితర అంశాలపై ఆసక్తి పెంచి నేర్పిస్తున్నాను. పిల్లలు కూడా రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధిస్తున్నారు. నా సర్వస్వం స్కూలే.. నాకు వేరే ఆలోచనే ఉండదు. రాష్ట్ర స్థాయిలో బెస్ట్ స్కూల్ అవార్డు సాధించినప్పుడు కంటే పిల్లలకు బెస్ట్ అవార్డులు వచ్చినప్పుడే నేను ఎక్కువగా సంతోషపడుతుంటాను. రానున్న రోజుల్లో వారి కోసం కాలేజీ ప్రారంభించాలని ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా అంధుల కళాశాల లేదు. మామూలు కాలేజీల్లో వారిని చేర్చుకోవడం లేదు. ప్రభుత్వం స్థలం ఇస్తే కళాశాల భవనాలు కట్టించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంధులైనా... వారే నా జీవితానికి వెలుగులు మనం ఎవరిమీద ఆధారపడకూడదు. మన టాలెంట్ను నిరూపించుకుంటూ ముందుకు వెళ్లిపోవాలనేది నా అభిమతం. మా సిబ్బంది కూడా నాకు ఎంతగానో సహకరిస్తుంటారు. పిల్లలకు ఏమైనా అనారోగ్యం వస్తే నేనే స్వయంగా ప్రాథమిక వైద్యం చేస్తుంటాను. మా బాబుకు మందులు వాడీ వాడీ వారి సమస్యకు ఏ మందు వేయాలో బాగా తెలుసుకున్నాను. గతంలో ఒక పాపకు పక్షవాతం వచ్చింది. ఫోన్చేస్తే ఆమె తల్లిదండ్రులు పక్కన పడేయమన్నారు. విశాఖ కేజీహెచ్లో జాయిన్ చేసి నేనే వైద్యం చేయించి తర్వాత వారికి అప్పగించాను. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కూడా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలున్నాయి. అయితేనేం పిల్లల్లో దాదాపు 99 శాతం మంది ఆరోగ్యంగా ఉన్నారు. వారి ఆట, పాటల మధ్య నాకు కాలం తెలియదు. కష్టం తెలియదు. చీకటిని జయించిన చిరుదివ్వెలు నా ఈ యాభై మంది పిల్లలు. వారే నా సర్వస్వం. స్కూల్పెట్టడానికి అదే కారణం... మా బాబును చూసి బంధువుల్లో కొందరు ఛీదరించుకునే వారు. అదే నాలో పంతం పెంచేలా చేసింది. వాడిలో ఉండే టాలెంట్ను బయట పెట్టాలన్న తపన నాలో పెరిగింది. బాబును రోజూ బయటకు తీసుకెళ్లి అన్నింటినీ గుర్తించేలా తిప్పేదాన్ని. మేం కూడా ఆర్థికంగా నిలబడ్డాం. మావయ్య నాకు కనిపించే దైవం. మా అమ్మ నిర్మలాదేవి, నాన్న నాగభూషణరావు ఇచ్చిన స్పూర్తితోనే ఈ స్కూలు స్థాపించగలిగాం. జామి మండలం విజినిగిరిలో ఉండే రాపర్తి రామారావు ఆశ్రమానికి మా కుటుంబ సభ్యులమంతా వెళ్లేవాళ్లం. ఆయనే నా గురువు. నా కొడుకును ఎలా తయారు చేయాలనుకున్నానో అలాగే మిగిలిన పిల్లలందరినీ తయారు చేయాలనే ఉద్దేశంతో 2013 ఆగస్టులో 18 మంది పిల్లలతో ద్వారకామాయి అంధుల పాఠశాల స్థాపించాం. తొలుత ఒకటి నుంచి 7వ తరగతి వరకూ, తరువాత 8, 9, 10 తరగతులను ప్రారంభించాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వచ్చిన మొత్తం 50 మంది పిల్లలు ఇప్పుడు ఉన్నారు. -
మీర్పేటలో ట్రిపుల్ మర్డర్
-
మీర్పేట సుమిత్ర ఎన్క్లేవ్లో దారుణం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మీర్పేటలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు కన్నబిడ్డలు ఇద్దర్నీ హతమార్చాడో దుర్మార్గుడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే మీర్పేట్ సుమిత్ర ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న హరీందర్ గౌడ్...సోమవారం తెల్లవారుజున భార్య జ్యోతి, కుమారుడు అభితేజ్ (6), కుమార్తె సహస్ర(5)ను గొంతు నులిమి అతి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని కాలనీవాసులకు చెప్పి... నేరుగా మీర్పేట పీఎస్లో లొంగిపోయాడు. కాగా హరిందర్ మలక్పేటలో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సత్యజ్యోతి
చెడు చీకటి నుంచి సత్యం వైపు నడిపించే జ్యోతి మార్గమే అయ్యప్ప దీక్ష అరిషడ్వర్గాలను అరికట్టే అమోఘమైన దీక్ష అయ్యప్ప దీక్ష. ఏటా కార్తీక మాసం నుంచి అయ్యప్ప దీక్షల సందడి మొదలవుతుంది. మార్గశిర, పుష్య మాసాల వరకు ఈ సందడి కొనసాగుతుంది. అయ్యప్ప వెలసిన శబరిమలలో మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో దీక్షను ముగించే వారు కొందరైతే, మండల దీక్షలు చేపట్టే భక్తులు కొందరు జ్యోతి దర్శనంతో నిమిత్తం లేకుండా, దీక్ష గడువు పూర్తవడంతోనే స్వామిని దర్శించుకుని దీక్ష విరమించుకుంటారు. కనీసం మండలకాలం... అంటే నలభైఒక్క రోజులు అత్యంత కఠినమైన నియమ నిబంధనలతో త్రికరణ శుద్ధిగా సాగించే అయ్యప్ప దీక్షలు భక్తుల మనశ్శరీరాలను ప్రక్షాళన చేస్తాయి. వారిలో ఆధ్యాత్మికతను ఇనుమడింపజేస్తాయి. భక్తులకు కొంగుబంగారంగా శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామి గురించి, ఆయన భక్తుల దీక్షల గురించిన విశేషాలు మకర సంక్రాంతి సందర్భంగా... ఆరోగ్య దీప్తి... సామూహిక స్ఫూర్తి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే భక్తులు పాటించే నియమాలు సామాన్యులకు కఠినతరంగా అనిపిస్తాయి. అయితే, ఈ నియమాలు ఇంద్రియ నిగ్రహానికి, ఆత్మ సంయమనానికి, దుర్వ్యసనాల నుంచి విముక్తికి దోహదపడతాయని చెబుతారు. దీక్షలో ఉండే భక్తులు సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చన్నీటితో స్నానం చేస్తారు. ఉదయం, రాత్రివేళల్లో కేవలం అల్పాహారం తీసుకుంటారు. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తారు. అల్పాహారమైనా, భోజనమైనా పూర్తిగా సాత్వికాహారమే తీసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలకు, మాంసాహారానికి దూరంగా ఉంటారు. మద్యపానం, ధూమపానం, తాంబూలం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు. దీక్ష పూర్తయ్యేంత వరకు క్షురకర్మ సహా అన్ని బాహ్యాలంకారాలకు దూరంగా, కేవలం దీక్షా వస్త్రాలతోనే ఉంటారు. కటిక నేల మీదనే శయనిస్తారు. అయ్యప్ప దీక్షలో కొనసాగే భక్తులకు విధి నిషేధాలు చాలానే ఉన్నాయి. అనవసర ప్రసంగాలకు, అసత్యానికి వారు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. పాదరక్షలను ధరించకూడదు. ఇతరులను మాటలతో గాని, చేతలతో గాని హింసించే పనులేవీ చేయరాదు. గురుస్వామి ద్వారా దీక్ష మాల ధరించినది మొదలు, శబరిమల యాత్ర పూర్తి చేసుకుని, మాలను తీసివేసేంత వరకు అయ్యప్ప భక్తులు ఈ కఠోర నియమాలను తు.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. దీక్షలో ఉన్నప్పుడు ఎక్కువ కాలం భజనల్లోను ‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’ అనే శరణు ఘోషలో గడపాల్సి ఉంటుంది. ఇంత నియమబద్ధంగా నలభై ఒక్క రోజులు గడిపే వారిలో శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి. దీక్షకు ముందు క్రమశిక్షణ లేకుండా గడిపేవారిలో సైతం దీక్ష పూర్తయ్యాక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సంయమనం, సహనం, ఆత్మ నిగ్రహం, ఏకాగ్రత పెరుగుతాయని చెబుతారు. ఒకసారి దీక్ష తీసుకున్న వారు ఏటేటా మళ్లీ మళ్లీ దీక్ష తీసుకుని అయ్యప్పను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతారు. ఏటేటా దీక్షలు చేపట్టే భక్తులు ఆధ్యాత్మిక చింతనతో తామసిక ప్రవృత్తికి దూరంగా ఉంటారు. అయ్యప్ప స్వాములందరూ బృందాలుగా ఉంటూనే సామూహికంగా దీక్షలు సాగిస్తారు. ఈ దీక్షలు వారిలో సామూహిక స్ఫూర్తి పెంపొందించేందుకు దోహదపడతాయి. సన్మార్గానికి సోపానాలు శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయానికి పద్దెనిమిది మెట్లు ఉంటాయి. నియమ నిష్ఠలతో దీక్ష సాగించి, ఇరుముడితో ఇక్కడకు చేరుకునే వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కగలరని అంటారు. అయ్యప్ప ఆలయానికి గల ఈ పద్దెనిమిది మెట్లు సన్మార్గానికి సోపానాలని ప్రతీతి. వీటిలోని తొలి ఐదు మెట్లు పంచేంద్రియాలకు (కళ్లు, చెవులు, ముక్కు, నోరు, చర్మం); తర్వాతి ఎనిమిది మెట్లు అష్టరాగాలకు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, తత్వ అహంకారాలు); ఆ తర్వాతి మూడు మెట్లు త్రిగుణాలకు (సత్వ రజస్తమో గుణాలు); మిగిలిన రెండు మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీకలుగా భావిస్తారు. వీటన్నింటినీ అధిగమించిన తర్వాతే భక్తులు అహాన్ని వీడి భగవంతుని చేరుకోగలుగుతారని చెబుతారు. అంతేకాదు, ఈ పద్దెనిమిది మెట్లు అష్టాదశ పురాణాలకు ప్రతీక అని కూడా అంటారు. స్వామి భక్తులు దీక్ష చేపట్టినప్పుడు కట్టిన ఇరుముడిని తలపై పెట్టుకుని ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి, స్వామిని దర్శించుకుంటారు. ఇరుముడిని సమర్పించి, ప్రసాదాన్ని స్వీకరిస్తారు. హరిహర సుతుడి గాథలు అయ్యప్పస్వామి హరిహర సుతుడిగా ప్రసిద్ధుడు. మోహినీ అవతారంలోని విష్ణువును శివుడు మోహించిన ఫలితంగా అయ్యప్ప జననం సంభవించిందనే కథనం బాగా ప్రచారంలో ఉంది. మోహినీ అవతారం గురించిన ప్రస్తావన ఉన్న భాగవతంలో అయ్యప్ప జననం ప్రస్తావన కనిపించదు. అయితే, హరిహర నందనుడిగా అయ్యప్ప జననానికి సంబంధించిన గాథ శ్రీ భూతనాథ పురాణంలో విపులంగా ఉంది. ఈ గాథ మేరకు భక్తులు అయ్యప్పస్వామిని హరిహర నందనుడిగానే భావిస్తారు. శివకేశవులకు పుట్టిన వాడైనందున శైవులు, వైష్ణవులు కూడా అయ్యప్పను ఆరాధిస్తారు. అయ్యప్పస్వామి జనన కారణానికి సంబంధించి ఒక గాథ ఉంది. దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేశాక, అతడి సోదరి మహిషి దేవతలపై పగబట్టింది. దేవతలపై పగతీర్చుకోనే శక్తుల కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించింది. శివకేశవులకు పుట్టిన సంతానం తప్ప తనను ఎవరూ జయించరాదని, అది కూడా ఆ హరిహర నందనుడు భూలోకంలో ఒక రాజు వద్ద పన్నెండేళ్లు సేవాధర్మం నిర్వర్తించిన తర్వాత మాత్రమే తనను జయించగలగాలని, లేకుంటే తన చేత ఓటమి చెందాలని వరం కోరింది మహిషి. ‘తథాస్తు’ అంటూ వరాన్ని అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు. ఇక అప్పటి నుంచి మహిషి దేవతలను పీడించసాగింది. ఇదిలా ఉంటే, హరిహర నందనుడిగా మెడలో మణిమాలతో మణికంఠుడిగా జన్మించిన అయ్యప్ప తన తండ్రి శివుడి ఆదేశంపై పంపా సరోవర తీరాన ఉన్న అరణ్యంలో బాలకుడిగా అవతరించాడు. సంతానం లేని పందళ దేశాధీశుడు రాజశేఖరుడు వేట కోసం అడవికి వచ్చినప్పుడు దివ్యతేజస్సుతో ఉన్న బాలకుడు కనిపించాడు. భగవంతుడే తనకు కుమారుడిని ప్రసాదించాడనే సంతోషంతో రాజశేఖరుడు ఆ బాలకుడిని అంతఃపురానికి తీసుకుపోతాడు. ముద్దులొలికే శిశువును చూసి మహారాణి సంతోషిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషానికి మహారాణికి కడుపు పండి, కొద్దికాలానికి మగశిశువును ప్రసవిస్తుంది. అయ్యప్పను కూడా రాజ దంపతులు కన్నకొడుకుతో సమానంగా అల్లారు ముద్దుగా పెంచసాగారు. బాలకుడిగా ఉన్నప్పుడే అయ్యప్ప జనులకు ధర్మవర్తనపై మార్గదర్శక సూత్రాలను బోధించాడు. బాల్యంలోనే ఆయన ధర్మనిష్ఠకు ముగ్ధులైన జనులు ఆయనను ‘ధర్మశస్త’ పేరుతో పిలవసాగారు. మెడలో మణిహారంతో దొరికిన కారణంగా మణికంఠుడిగా కూడా పిలవసాగారు. మణికంఠుడి సాత్విక గుణాల వల్ల కొందరు ఆయనను ‘అయ్య’ అని, ఇంకొందరు ‘అప్ప’ అని పిలవసాగారు. మరికొందరు రెండింటినీ కలిపి ‘అయ్యప్ప’ అని పిలవసాగారు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తిస్తాడు. విద్యాభ్యాసానికి తగిన వయసు రాగానే రాజశేఖరుడు అయ్యప్పను, తన కొడుకును గురుకులానికి పంపుతాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకు వచ్చిన తర్వాత అయ్యప్పకు రాజ్యభారాన్ని అప్పగించాలని భావిస్తాడు రాజశేఖరుడు. మహారాణికి అది నచ్చక తలనొప్పి అంటూ నాటకమాడుతుంది. తన వ్యాధి తగ్గడానికి పులిపాలు కావాలంటుంది. పులిపాలు తెస్తానంటూ అయ్యప్ప అడవికి బయలు దేరుతాడు. మహిషి వధ అయ్యప్ప అడవికి బయలుదేరే సమయంలో నారదుడు కూడా అడవికి వెళ్లాడు. అడవిలో సంచరిస్తూ మునులను, దేవతలను పీడించే మహిషిని కలుసుకున్నాడు. కలహప్రియుడైన నారదుడు ‘నిన్ను చంపేందుకు రాజకుమారుడు ఈ అడవికి వస్తున్నాడు’ అంటూ మహిషిని రెచ్చగొట్టాడు. పులిపాల కోసం అడవికి వచ్చిన అయ్యప్పను చంపడానికి మహిషి గేదె రూపంలో రంకెలు వేస్తూ బయలుదేరింది. ఎదురుపడిన అయ్యప్ప మీదకు లంఘించింది. అయ్యప్ప అమాంతం అక్కడే ఉన్న కొండపైకి ఎక్కి తాండవమాడుతూ మహిషిని ఎదిరించాడు. మహిషితో అయ్యప్ప యుద్ధాన్ని తిలకించడానికి దేవతలంతా అదృశ్యరూపంలో అక్కడకు చేరుకున్నారు. భీకర యుద్ధంలో అయ్యప్ప మహిషిని ఒడిసి పట్టుకుని నేలకేసి విసిరికొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. మహిషి పీడ విరగడ కావడంతో ఇంద్రాది దేవతలు హర్షాతిరేకాలతో ముందుకు వచ్చి అయ్యప్పను వేనోళ్ల ప్రస్తుతించారు. ‘స్వామీ! నిన్నెలా సేవించుకోగలం’ అని దేవతలు ప్రశ్నించగా, ‘నేను పులి పాల కోసం ఈ అడవికి వచ్చాను. మీరంతా పులులుగా మారి నాకు తోడ్పడండి’ అని కోరాడు. దేవతలంతా పులులుగా మారిపోయారు. ఇంద్రుడు పులి రూపంలో తానే అయ్యప్పకు వాహనంగా మారాడు. పులుల దండుతో అయ్యప్ప రాజ్యానికి చేరుకుంటాడు. శబరిమల నివాసం అడవి నుంచి రాజ్యానికి చేరుకున్న అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలని భావిస్తాడు రాజశేఖరుడు. అయ్యప్ప తనకు రాజ్యం వద్దని, తనకు ఒక ఆలయాన్ని నిర్మించి ఇస్తే చాలని కోరుతాడు. తాను ఇక్కడి నుంచి సంధించి విడిచి పెట్టిన బాణం ఎక్కడ పడుతుందో అక్కడ తనకు ఆలయం నిర్మించాలని సూచిస్తాడు. అయ్యప్ప విడిచిన బాణం శబరిమల కొండ మీద పడుతుంది. అక్కడ కట్టించిన ఆలయంలోనే అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకుని జనుల మంచిచెడ్డలు చూసుకునేవాడు. ఈ ఆలయంలో కొలువైన అయ్యప్ప ఇప్పటికీ తమ కోర్కెలు తీరుస్తుంటాడని భక్తుల నమ్మకం. అయ్యప్ప వెలసిన ఈ శబరిమల లోగడ రామభక్తురాలైన శబరికి ఆవాసంగా ఉండేది. శబరి శ్రీరాముడికి తాను రుచి చూసిన పండ్లు తినిపించినది ఇక్కడేనని ప్రతీతి. శబరిమల యాత్ర దీక్ష స్వీకరించి, నియమబద్ధంగా మండలం రోజులు గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. స్వామి సన్నిధానాన్ని సందర్శించుకుని, ఇరుముడిని స్వామికి సమర్పించి, ప్రసాదాన్ని స్వీకరించడంతో యాత్ర ముగుస్తుంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పడమటి కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది శబరిమల. దట్టమైన అడవులు ఉన్న ప్రాంతంలో పద్దెనిమిది కొండల నడుమ ఉన్న శబరిమల అయ్యప్ప సన్నిధానానికి యాత్రలు ఏటా నవంబరు నెలలో ప్రారంభమవుతాయి. జనవరి నెలలో మకర సంక్రాంతి నాటితో ముగుస్తాయి. కార్తీకమాసంలో మండల దీక్షలు చేపట్టే వారు సాధారణంగా నవంబర్ నెలలో స్వామిని దర్శించుకుని, యాత్రను ముగిస్తారు. ‘మకర విళక్కు’ యాత్రకు వెళ్లే వారు మకర సంక్రాంతి రోజున స్వామిని దర్శించుకుంటారు. ఇదేరోజు ఆలయం నుంచి చూసే వారికి ‘మకరజ్యోతి’ కనిపిస్తుంది. మకరవిళక్కు యాత్రకు వెళ్లే భక్తులు ‘మకరజ్యోతి’ దర్శనంతో యాత్రను ముగించుకుంటారు. ఎరుమేలితో యాత్ర మొదలు... శబరిమల యాత్ర ఎరుమేలి నుంచి మొదలవుతుంది. ఎరుమేలిలో భక్తులు తొలుత ‘వావరు స్వామి’ని దర్శించుకుంటారు. వావరు స్వామి తొలుత గజదొంగగా ఉండేవాడు. అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవికి వెళ్లినప్పుడు ఆయనను అడ్డగించాడు. స్వామి మహిమను తెలుసుకున్న తర్వాత స్వామికి భక్తుడిగా మారిపోయాడు. ఒకరకంగా వావరుస్వామి అయ్యప్పస్వామికి తొలి భక్తుడు. ‘నా దర్శనానికి వచ్చే భక్తులందరూ తొలుత నిన్ను దర్శించుకుంటారు’ అని అయ్యప్పస్వామి వావరుస్వామికి వరం ఇచ్చినట్లు ప్రతీతి. ముస్లిం అయిన వావరుస్వామి ఎరుమేలిలోని మసీదులో వెలిశారు. స్వామి భక్తులందరూ తొలుత ఇక్కడి మసీదులోని వావరు స్వామిని దర్శించుకుంటారు. దర్శనం తర్వాత రకరకాల వేషధారణలతో ‘పేటై తుళ్ల’ అనే నాట్యం చేస్తారు. ఎరుమేలిలో ఉన్న ‘ధర్మశాస్త’ ఆలయంలో అయ్యప్పస్వామి ధనుర్బాణాలతో దర్శనమిస్తాడు. ఇదే ఆలయంలో వినాయకుడు కూడా కొలువై ఉన్నాడు. అరణ్యమార్గంలో పాదయాత్ర వావరు స్వామి దర్శనం తర్వాత ఎరుమేలి నుంచి అయ్యప్పస్వామి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. శబరిమల వెళ్లడానికి ఇక్కడి నుంచి రెండు మార్గాలు ఉన్నాయి. ‘పెద్దపాదం’ మార్గం అత్యంత దుర్గమమైన అరణ్యమార్గం. దాదాపు ఎనభై కిలోమీటర్లు ఉండే ఈ మార్గంలో పెరుర్తోడు, కాలైకుట్టి అనే స్థలాలు ఉన్నాయి. మహిషితో అయ్యప్ప యుద్ధం చేస్తుండగా కాలైకుట్టి నుంచి శివకేశవులు ఆ యుద్ధాన్ని తిలకించారట. ఇక్కడకు చేరువలోనే అళుదా నది ఉంది. మహిషి కన్నీరు కార్చగా ఆ కన్నీరే ఇక్కడ అళుదా నదిగా ఏర్పడిందట. ఈ నదిలో భక్తులు స్నానాలు ఆచరించి, నది నుంచి రెండు రాళ్లను తీసుకువెళతారు. ఆ రాళ్లను మహిషిని పూడ్చిపెట్టిన చోటు ‘కళిద ముకుంద’ వద్ద పడవేస్తారు. అక్కడి నుంచి ముందుకు సాగి కరిమల కొండకు చేరుకుంటారు. ఏటవాలుగా ఉండే ఈ కొండ మీదకెక్కడం చాలా కఠినమైన పని అని చెబుతారు. అయితే భక్తులు ఎలాంటి భయం లేకుండా శరణుఘోషతో బృందాలు బృందాలుగా ముందుకు సాగుతారు. కరిమల కొండను దాటిన తర్వాత పంపా నది వద్దకు చేరుకుంటారు. పంపానదిలో స్నానం భక్తుల అలసటను పోగొడుతుంది. పంపా స్నానం తర్వాత భక్తులు ఇక్కడి నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామి సన్నిధానానికి చేరుకుంటారు. కఠినమైన ‘పెద్దపాదం’ మార్గంలో వెళ్లలేని భక్తులు ‘చిన్నపాదం’ మార్గాన్ని ఎంచుకుంటారు. ‘చిన్నపాదం’ మార్గంలో బస్సులు తిరుగుతాయి. ఈ మార్గంలో భక్తులు నేరుగా పంపానది వరకు బస్సుల్లో చేరుకోవచ్చు. అయితే, అక్కడి నుంచి సన్నిధానం వరకు పాదయాత్ర సాగించాల్సి ఉంటుంది. ఇరుముడి అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమల వెళ్లే భక్తులు నెత్తిమీద ‘ఇరుముడి’ని మోసుకుపోతుంటారు. ‘ఇరుముడి’ అంటే రెండు అరలు ఉండే మూట. ఈ ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ ఒకటి, రెండు మామూలు కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు, నాణేలు, పసుపు, గంధపు పొడి, విభూతి, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, అరటిపండ్లు, కలకండ, అగరువత్తులు, కర్పూరం, మిరియాలు (వావరు స్వామి కోసం), తేనె, ఎండుద్రాక్ష, తువ్వాలు తదితరమైనవి పెట్టుకుంటారు. దీక్ష స్వీకరించే భక్తులు ఈ వస్తువులను ‘ఇరుముడి’గా కట్టుకొనే ఉత్సవాన్ని ‘కెట్టునిరా’ లేదా ‘పల్లికట్టు’ అంటారు. నలుపు దుస్తులు ఎందుకంటే.? అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు దీక్షా వస్త్రాలుగా నలుపురంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారంటే... ఒకసారి శనీశ్వరుడు అయ్యప్పస్వామితో తలపడి ఓటమి చెందాడు. శనీశ్వరుడు శరణు వేడటంతో క్షమించిన అయ్యప్పస్వామి ఆయనకు ‘నా దీక్ష చేపట్టే భక్తులు నీకు ఇష్టమైన నలుపు రంగు దుస్తులే ధరిస్తారు’ అంటూ వరమిచ్చాడు. అందుకే అయ్యప్ప భక్తులు నలుపురంగు దుస్తులను ధరిస్తారు. అలాగే, అయ్యప్ప భక్తులకు శనీశ్వరుడు ఎలాంటి ఇక్కట్లూ కలిగించడని ప్రతీతి. పడిపూజ అయ్యప్పస్వామి దీక్షలో కొనసాగే భక్తులు శక్తిమేరకు తోటి స్వాములను ఆహ్వానించి భిక్ష (భోజనం) పెడతారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి సన్నిధానాన్ని తలపించే రీతిలో పద్దెనిమిది మెట్లతో పీఠాన్ని ఏర్పాటు చేసి, దానిపై అయ్యప్పను నిలిపి పూజలు చేస్తారు. భజనలు, పూజలు, శరణుఘోషతో భక్తి పారవశ్యాలతో గడుపుతారు. ఈ కార్యక్రమాన్నే పడిపూజ అంటారు. గురుస్వామి ప్రశస్తి అయ్యప్ప దీక్షలు చేపట్టే భక్తులు గురుస్వామిని సాక్షాత్తు అయ్యప్పస్వామికి ప్రతిరూపంగా భావిస్తారు. గురుస్వాములే మిగిలిన స్వాములకు మాలధారణం చేయిస్తారు. తొలిసారి అయ్యప్ప మాల ధరించే వారిని కన్నెస్వాములంటారు. రెండోసారి మాల ధారణ చేసేవారిని కత్తి స్వాములని, మూడోసారి మాలధారణ చేసేవారిని ఘంట స్వాములని, నాలుగోసారి మాలధారణ చేసేవారిని గద స్వాములని, ఐదోసారి మాల ధారణ చేసేవారిని పెరుస్వాములని, ఆరోసారి మాలధారణ చేసేవారిని గురుస్వాములని అంటారు. హరివరాసనం అయ్యప్పస్వామి పూజ చివరిలో ‘హరివరాసనం’ లేదా ‘శ్రీ హరిహరాత్మజాష్టకం’ గానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. శబరిమలతో పాటు ఇతర ప్రాంతాల్లోని అయ్యప్పస్వామి ఆలయాల్లోనూ ‘హరివరాసనం’ గానంతో అయ్యప్పస్వామి పూజలను ముగిస్తారు. ఇది స్వామివారికి జోల వంటిది. ఇందులో ఎనిమిది శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతున్నప్పుడు ఆలయంలోని ఒక్కొక్క దీపాన్ని కొండెక్కిస్తారు. చివరిగా గర్భగుడిలో ఒక్క దీపాన్ని మాత్రమే ఉంచుతారు. ‘హరివరాసనం’ స్తోత్రాన్ని కుంబకుడి కులతూర్ అయ్యర్ రచించారు. స్వామి విమోచానంద ఈ స్తోత్రాన్ని 1955లో శబరిమలలో గానం చేశారు. అప్పట్లో ఈ ప్రాంతం దాదాపు నిర్మానుష్యంగా ఉండేది. ఆ కాలంలో వీఆర్ గోపాల మీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలోనే నివసిస్తూ ఉండేవాడు. ఆయన అయ్యప్ప సన్నిధానంలో నిత్యం ‘హరివరాసనం’ స్తోత్రాన్ని గానంచేస్తూ వచ్చేవాడు. కొన్నాళ్లకు గోపాల మీనన్ శబరిమల నుంచి వెళ్లిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆయన కాలం చేశాడు. ఆయన మరణవార్త తెలుసుకున్న అయ్యప్పస్వామి అర్చకుడు ఈశ్వరన్ నంబూద్రి ఆలయాన్ని మూసివేసే సమయంలో ‘హరివరాసనం’ స్తోత్రాన్ని గానం చేశాడు. అప్పటి నుంచి ఆలయం మూసివేసే సమయంలో ఈ స్తోత్రాన్ని గానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. -
కర్నూలు మహిళకు డాక్టర్ అర్నికర్ అవార్డు
కర్నూలు సిటీ: భారత రసాయశాస్త్ర కౌన్సిల్ కర్నూలు నగరానికి చెందిన డాక్టర్ జ్యోతి అబ్బార్కు ప్రముఖ రసాయనశాస్త్రవేత్త డాక్టర్ అర్నికర్ అవార్డు అందజేసింది. అగ్రాలోని 36వ భారత రసాయశాస్త్ర కౌన్సిల్ దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన యువ శాస్త్రవేత్తలకు ఈ అవార్డును అందజేస్తారు. పంజాబ్ యూనివర్సిటీలో భౌతిక రసాయశాస్త్రంలో పరిశోధన పత్రాలను అందజేయడంతోనే యువశాస్త్ర వేత్తగా గుర్తించి, అవార్డును అందజేశారు. -
భార్య భర్త మధ్యలో ప్రియుడు!
-
పోలీసుల అదుపులో కి‘లేడి’?
విజయనగరం టౌన్: గర్భసంచి అమ్మకాలకు సంబంధించిన ముఠాలో కీలక నిందితురాలు జ్యోతిని, ఆమెతో పాటూ మరో వ్యక్తిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గర్భసంచిని ఇస్తే మనిషికి రూ.8 లక్షల వరకూ ఇస్తానంటూ సుమారు ఎనిమిది మంది మహిళలను మభ్యపెట్టి, వారి నుంచి పరీక్షల నిమిత్తం రూ. 3లక్షలకు పైగా వసూలు చేసిన కిలేడీపై బాధితుల పిర్యాదు మేరకు కొద్దిరోజుల కిందట టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ గర్భసంచి అమ్మకాల ముఠా వెనుక ఎవరెవరూ ఉన్నారు. రాజకీయ నాయకులు ప్రమేయమేమైనా ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
కటాకటాల్లోకి జ్యోతి
అడ్డాకుల (దేవరకద్ర): జీవితాంతం కలి సుంటానని భర్తతో ఏడడుగులు నడి చింది.. కానీ ఏడేళ్లు కూడా కాపురం చేయకుండానే ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్నోడిని కర్కశంగా కడతేర్చి.. కన్నపిల్లలను వీధిన పడేసింది.. చివరికి తాను తవ్వుకున్న గోతిలో తానే పడినట్లు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వా తిరెడ్డి కేసు మాదిరిగానే నాగరాజు హత్యకు గురవడం గమనార్హం. ఈ కేసులో నిందితులైన భార్య జ్యోతి, ఆమె ప్రియుడు కార్తీక్తోపాటు మరో ముగ్గురిని చౌటుప్పల్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ సంఘటనతో నాగరాజు, జ్యోతి దంపతుల ఇద్దరు పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పెళ్లికి ముందే పరిచయం.. 2012 డిసెంబర్లో రాచాలకు చెందిన కమ్మరి నాగరాజు(33)కు కోయిలకొండ మండలం అవంగపట్నం గ్రామానికి చెందిన జ్యోతి(24)తో పెళ్లి జరిపించారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్లోని కర్మన్ఘాట్లో నివాసముంటుండగా నాగరాజు వడ్రంగి పనిచేస్తున్నాడు. వారికి జీవిత(3), విక్కీ (10 నెలలు) పిల్లలున్నారు. అయితే పెళ్లికి ముందే జ్యోతికి హైదరాబాద్లో ఉండే కార్తీక్తో పరిచయం ఏర్పడగా ప్రేమాయణం సాగించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా జ్యోతి తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఇద్దరి కులాలు వేరు కావడంతో చివరికి జ్యోతిని నాగరాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఇటీవల ప్రియుడు కార్తీక్తో జ్యోతి మళ్లీ వివాహేత సంబంధం నెరిపింది. ప్రియుడి మోజులో పడిన జ్యోతి అడ్డుగా ఉన్న భర్త నాగరాజును అంతమొందించాలని పక్కా పథకం రచించి కనికరం లేకుండా హత్య చేయించింది. తన భర్త కనిపించడం లేదని బంధువులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా జ్యోతి కాల్డేటా, నాగరాజు శవపరీక్ష నివేదిక ఆధారంగా చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా హత్య కేసును ఛేదించారు. తల్లి జైలుకు.. పిల్లలు రాచాలకు! భర్త నాగరాజు హత్య కేసులో నిందితులైన భార్య జ్యోతి, ఆమె ప్రియుడు కార్తీక్, మరో ముగ్గురిని శుక్రవారం చౌటుప్పల్ పోలీసులు కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశం మేరకు నల్లగొండ జైలుకు తరలించారు. నాగరాజు పిల్లలిద్దరూ రెండు రోజులుగా ఠాణా వద్దే ఉన్నారు. తల్లిని జైలుకు తీసుకెళ్లడంతో నాగరాజు సోదరుడు శ్రీనివాసులు పిల్లలిద్దరిని తీసుకుని రాత్రి రాచాలకు బయలుదేరారు. తల్లిదండ్రులిద్దరూ లేకపోవడం.. పిల్లలిద్దరు రోదిస్తుండటంతో ఏం చేయాలో తోచడం లేదని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తల్లి చేసిన నేరం పిల్లలిద్దరూ తండ్రిని కోల్పోవడంతోపాటు వారి భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని నాగరాజు కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రియుడి మోజులో భర్తనే హత్య చేయించింది
-
ప్రియుడికి సుపారీ ఇచ్చి భర్త హత్య
చౌటుప్పల్: ప్రియుడి మోజులో పడిన ఓ భార్య కట్టుకున్నోడిని కడతేర్చింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడికే సుపారీ ఇచ్చి హత్యకు పన్నాగం పన్నింది. ఈ కేసులో మృతుడి భార్యతోపాటు ఆమె ప్రియుడు, అతని ముగ్గురు మిత్రులను అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శుక్రవారం డీసీపీ రామచంద్రారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఆరేళ్ల క్రితం వివాహం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాలకు చెందిన కమ్మరి నాగరాజు (35)కు బేగంపేటకు చెందిన జ్యోతి(22)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జీవన(4), యశ్వంత్(2) సంతానం. నాగరాజు కర్మన్ఘాట్లో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. అయితే మూడు నెలల నుంచి భార్య జ్యోతిలో మార్పును గమనించిన నాగరాజు విషయాన్ని పసిగట్టాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో భర్తను హత్య చేయాలని ఆమె పథకం రచించింది. పెళ్లికి ముందే సంబంధం వివాహానికి ముందు నాచారంలో జరిగిన బంధువుల వివాహానికి జ్యోతి వెళ్లింది. అక్కడ కార్తీక్తో ఏర్పడిన పరిచయం ప్రేమ గా మారి, వివాహేతర బంధానికి దారి తీసింది. విషయం తెలిసిన జ్యోతి తల్లిదండ్రులు కూతుర్ని నాగరాజుకిచ్చి వివాహం చేశారు. మూడు నెలల క్రితమే ఫోన్ నంబరు జ్యోతి మూడు నెలల క్రితం ప్రియుడు కార్తీక్ సెల్ నంబరును సేకరించింది. అప్పటి నుంచి తరచూ మాట్లాడుతుండేది. అప్పుడప్పుడు నేరుగా వెళ్లి కలసి వచ్చేది. ఈ క్రమంలో భార్యకు కార్తీక్తో వివాహేతర సంబంధం ఉందని నాగరాజు గుర్తించాడు. పద్ధతి మార్చుకొమ్మని ఆమెను మందలించాడు. పాలల్లో నిద్ర మాత్రలు కలిపి.. ఈ నేపథ్యంలో భర్త హత్యకు జ్యోతి పథక రచన చేసి.. దాని అమలు బాధ్యత ప్రియుడికి అప్పగించింది. ఇందు కు కొంత సుపారీని సైతం ఇచ్చిం ది. దీంతో కార్తీక్ గత నెల 30న నిద్రమాత్రలు తెచ్చి ఇచ్చాడు. వాటిని జ్యోతి పాలలో కలిపి భర్తతో తాగించింది. గాఢ నిద్రలో ఉండగా ప్రియుడికి ఫోన్ చేసింది. అతను మరో ముగ్గురు మిత్రులతో వచ్చాడు. వీరు అర్ధరాత్రి నాగరాజు ముఖంపై దిండు పెట్టి నులిమి హత్య చేశారు. నాగరాజు చనిపోయాడని నిర్ధారించుకున్న ఆ ఐదుగురు.. మృతదేహాన్ని ఓ అద్దె కారులో వేసుకుని చౌటుప్పల్ మండలం జిల్లేడుచెల్క శివారులో చెట్ల పొదల్లో పడేసి వెళ్లారు. మరునాడు సాయంత్రం స్థానికులు చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన పద్ధతిలో విచారణ చేయగా విషయం వెల్లడైంది. దీంతో హత్యలో భాగస్వాములైన జ్యోతి (21)తోపాటు నాచారానికి చెందిన మహం కాళి కార్తీక్(22), అతని మిత్రులు మహ్మద్ యాసిన్ (19), నదియాల్ దీపక్(24), సిర్రప్ప నరేశ్(23)లను అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ రామోజు రమేశ్, సీఐ నవీన్కుమార్ ఉన్నారు. -
గర్భశోకం
విజయనగరం టౌన్: గర్భసంచి ఇస్తే లక్షల రూపాయాలు ఇస్తామని ఆశ చూపి బాధితులను బుట్టలో వేసుకునే విష సంస్కృతి జిల్లాకు పాకింది. ఒక్కో మహిళకు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి టెస్ట్ల పేరిట ముందస్తుగా కొంత సొమ్ము తీసుకుని ఓ ముఠా పరారైంది. కొన్నాళ్లుగా ఎంతో సీక్రెట్గా జరుగుతున్న ఈ తంతును స్థానికుల సమాచారంతో పోలీసులు ఛేదించారు. ఇందులో ప్రధానసూత్రధారిగా భావిస్తున్న జ్యోతి అనే మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. పోలీసులు ఇద్దరు బాధితులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అసలు జరిగే పనేనా..? కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు అయిపోయిన తర్వాత కూడా మహిళల వద్ద నుంచి గర్భసంచి తీసుకుని వేరే మహిళకు అమర్చి సంతాన ప్రాప్తి కల్పిస్తామని ముఠా సభ్యులు చెబుతున్న వాదన. అయితే ఈ విధానం సరైనది కాదని వైద్యులు చెబుతున్నారు. యూట్ర స్ మార్పిడి చాలా క్లిస్టతరమైనదని.. ఎక్కడో ఒకచోట సక్సెస్ సాధించి ఉండవచ్చు గాని విజయావకాశాలు బాగా తక్కువని తెలిపారు. కి‘లేడీ’పై కేసు నమోదు గర్భసంచి ఇస్తే రూ. 8 లక్షలు ఇస్తామని ఆశ జూపి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ ఎస్సై వి. అశోక్కుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో కమ్మవీధి, బూడివీధి, తదితర ప్రాంతాలకు చెందిన పలువురు మహిళలను విశాఖ జిల్లా భీమిలి పట్నానికి చెందిన ఆదిలక్ష్మి అలియాస్ జ్యోతి అనే మహిళ మచ్చిక చేసుకుని గర్భసంచి ఇస్తే రూ. 8 లక్షలు ఇస్తానని నమ్మబలికింది. దీంతో కానూరి రాజేశ్వరి, బుజ్జి అనే మహిళ ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.750లు, ఆధార్ కార్డు, మూడు ఫొటోలు నిందితురాలు తీసుకుంది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వారిని కలిసి పరీక్షల పేరుతో రూ. 50 వేల నుంచి 80 వేల రూపాయల వరకు తీసుకుంది. ఈ క్రమంలో మరికొంతమంది బాధితులు రూప, భూదేవి, రమ, సంతోషి, రాజీ, తదితరులు డబ్బులు సమర్పించుకున్నారు. అయితే జ్యోతి పరారుకావడంతో బాధితల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో లేదు.. యూట్రస్ (గర్భసంచి) మార్పిడి సౌకర్యం మనదేశంలోనే లేదు. ఇతర దేశాల్లో చేసినట్లు కూడా కచ్ఛితంగా తెలియదు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (ట్యూబెక్టీమీ) జరిగిన తర్వాత గర్భం రావడం అసాధ్యం. – డాక్టర్ రాజ్యలక్ష్మి, గైనికాలజిస్టు, కేంద్రాస్పత్రి -
జ్యోతి ఆరిపోయింది!
♦ పెళ్లైన ఏడాదికే వివాహిత అనుమానాస్పద మృతి ♦ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి బంధువులు ♦ దర్యాప్తు చేస్తున్న పోలీసులు ♦ బాతుపురంలో విషాదం పెళ్లైన ఏడాదికే వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ సంఘటన వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకోగా.. పసుపురెడ్డి జ్యోతి (22) మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. జ్యోతి చావుకు అత్త వేధింపులే కారణమని కన్నవారు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు రూరల్: సోంపేట మండలం లక్కవరం గ్రామానికి చెందిన టేకు వాసుదేవరావు, సరోజినిల పెద్ద కుమార్తె జ్యోతికి బాతుపురం గ్రామానికి చెందిన సింహాచలంతో గత ఏడాది ఏప్రిల్లో వివాహమైంది. సింహాచలం ఉపాధి కోసం 10 రోజుల క్రితమే విజయవాడ వెళ్లిపోయాడు. దీంతో ఇంటి వద్ద అత్త లక్ష్మీకాంతం, జ్యోతి మాత్రమే ఉంటున్నారు. కాగా లక్ష్మీకాంతం శనివారం ఉదయం కాశీబుగ్గ వెళ్లి 12 గంటల సమయానికి తిరిగి ఇంటికి వచ్చేసరికి జ్యోతి ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయి ఉండడాన్ని చూసి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మృతదేహాన్ని కిందకుదించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తాతారావు, వజ్రపుకొత్తూరు ఎస్ఐ ప్రసా ద్ సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రస్తుతం బిలాయిలో ఉంటున్న జ్యోతి తల్లిదండ్రులు వచ్చే వరకు మృతదేహాన్ని ఉంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. జ్యోతి మృతికి కారణాలు తెలియరాలేదని సీఐ పేర్కొన్నారు. అయితే జ్యోతి మృతదేహం వద్ద హిందీ లో రాసిఉన్న సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత ్త వేధింపులే జ్యోతి మరణానికి కారణం! జ్యోతి మరణానికి అత్త వేధింపులే కారణమని కన్నవారు తరఫువారు ఆరోపించా రు. లక్ష్మీకాంతాన్ని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. అందరితో కలివిడిగా ఉండే జ్యోతి ఇక లేదని తెలియడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీ రుగా విలపించారు. జ్యోతి మృతితో బాతుపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విచారణ చేపడుతున్నాం జ్యోతి మరణంపై కేసు నమోదు చేసి విచా రణ చేపడుతున్నామని కాశీబుగ్గ రూరల్ సీఐ తాతారావు తెలిపారు. జ్యోతి అత్తను విచారించామన్నా రు. బిలాయి నుంచి జ్యోతి తల్లి దండ్రులు వచ్చిన తరువాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తామన్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకొని..
వలిగొండ: ప్రేమించి పెళ్లి చేసుకొని.. నాలుగేళ్లు కాపురం చేసి ఇప్పుడు తనను వద్దంటున్నాడని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో శనివారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన పలుసం లింగస్వామి, కొరబోయిన జ్యోతి నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరుకావడంతో వారి ప్రేమకు పెద్దలు నిరాకరించడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్లో నివాసముంటున్న వీరి మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలో 'నువ్వు నా భార్యవే కాదు.. నీకు నాకు సంబధం లేదు' అని అంటుండటంతో మనస్తాపానికి గురైన యువతి ఈ రోజు నాతాళ్లగూడెంలో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆమెకు వివిధ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపారు.