మీర్‌పేట సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో దారుణం | Man kills wife, two children in Meerpet | Sakshi
Sakshi News home page

మీర్‌పేట సుమిత్ర ఎంక్లేవ్‌లో దారుణం

Published Mon, Feb 5 2018 10:16 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM

Man kills wife, two children in Meerpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని మీర్‌పేటలో  దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు కన్నబిడ్డలు ఇద్దర్నీ హతమార్చాడో దుర్మార్గుడు. అనంతరం  పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే మీర్‌పేట్‌ సుమిత్ర ఎన్‌క్లేవ్ లో నివాసం ఉంటున్న హరీందర్‌ గౌడ్‌...సోమవారం తెల్లవారుజున భార్య జ్యోతి, కుమారుడు అభితేజ్‌ (6), కుమార్తె  సహస్ర(5)ను గొంతు నులిమి అతి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని కాలనీవాసులకు చెప్పి... నేరుగా మీర్‌పేట పీఎస్‌లో లొంగిపోయాడు. కాగా  హరిందర్‌ మలక్‌పేటలో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement