శ్రీశైల జలశయానికి 25 టీఎంసీల నీటి చేరిక | 25tmcs water increse in srisailam dam | Sakshi
Sakshi News home page

శ్రీశైల జలశయానికి 25 టీఎంసీల నీటి చేరిక

Aug 6 2016 11:58 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైల జలశయానికి 25 టీఎంసీల నీటి చేరిక - Sakshi

శ్రీశైల జలశయానికి 25 టీఎంసీల నీటి చేరిక

శ్రీశైలానికి వరద ఉధతి ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు 25.0078 టీఎంసీల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది.

శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలానికి వరద ఉధతి ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు 25.0078 టీఎంసీల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది. 24 గంటల్లోనే 14.70 అడుగులు నీటిమట్టం పెరిగింది. జూరాల ప్రాజెక్టు నుంచి మధ్యాహ్నం 3గంటల సమయానికి 2.12 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జలాశయం నుంచి విద్యుత్‌ ఉత్పాదన అనంతరం దిగువ నాగార్జునసాగర్‌కు 5,106 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, హంద్రీనీవా సుజలస్రవంతికి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 81.0918 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 850.50 అడుగులకు చేరుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement