Dam
-
పోలవరం ఎత్తు తగ్గించడం సంపద సృష్టా? తోపుదుర్తి స్ట్రాంగ్ కౌంటర్
-
కొడుకా.. అంతలోనే వెళ్లిపోతివా..!
బన్సీలాల్పేట్: కొండపోచమ్మ డ్యామ్లో మునిగిపోయి మృతిచెందిన దినేశ్వర్ అంత్యక్రియలు ఆదివారం బన్సీలాల్పేట్ శ్మశానవాటికలో నిర్వహించారు. దీంతో చాచానెహ్రునగర్లో విషాదఛాయలు నెలకొన్నాయి.స్థానికులు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తరలి వచ్చి దినేశ్వర్ భౌతికకాయంపై పుష్పగుచ్చాలుంచి నివాళులరి్పంచారు. కుమారుడి పారి్థవదేహంపై పడి తల్లి సుమలత విలపించిన తీరు చూపరుల కంటతడి పెట్టించింది. బాగా చదువుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటావనుకుంటే కొడుకా.. అంతలోనే అందని లోకాలకు వెళ్లావంటూ తల్లి విలపించిన తీరు అక్కడున్న వారి హృదయాలను కదిలించింది. దినేశ్వర్ అంతిమయాత్ర చాచానెహ్రునగర్ నుంచి బయలుదేరి వివిధ ప్రాంతాల గుండా బన్సీలాల్పేట్ శ్మశానవాటికకు చేరుకుంది. ప్రముఖుల పరామర్శ..బన్సీలాల్పేట్ డివిజన్ చాచానెహ్రునగర్లో ఉంచిన దినేశ్వర్ భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులరి్పంచారు. స్ధానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ కె. హేమలత, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీపతి, జి. పవన్కుమార్ గౌడ్, ఏసూరి మహేష్, వెంకటేశన్ రాజు తదితరులు కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
కొండపొచమ్మ సాగర్ డ్యామ్లో పడి ఐదుగురు మృతి
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాలు తీసింది. మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్లో యువకులు గల్లంతయ్యారు. ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు.మృతులను హైదరాబాద్ ముషీరాబాద్ వాసులు ధనుష్(20), లోహిత్(17), దినేశ్వర్(17), సాహిల్(19), జతిన్(17)గా గుర్తించారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే. మృగాంక్(17), ఇబ్రహీం(20) ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతిఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు విద్యార్థుల గల్లంతుపై సీఎం ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలన్నారు.మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: హరీష్రావుకొండపోచమ్మ సాగర్ ఘటనపై మాజీ మంత్రి హరీష్రావు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదీ చదవండి: సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు -
భారత్కు అందే జలాలపై ప్రతికూల ప్రభావం ఉండదు
బీజింగ్: భారత్తో సరిహద్దుల్లోని టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలా శయాన్ని నిర్మించే ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న భయాందోళనలపై చైనా స్పందించింది. ఈ డ్యామ్ కారణంగా భారత్, బంగ్లాదేశ్లకు అందే జలాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దిగువ దేశాలపై పర్యావరణం, భౌగోళిక స్వరూపాన్ని హాని ఉండదని పేర్కొంది. కచ్చితత్వంతో కూడిన శాస్త్రీయ పరిశీలన తర్వాతే ఈ ప్రాజెక్టును తలపెట్టామని వివరించింది. పైపెచ్చు, ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో దిగువ ప్రాంతాల్లో విపత్తుల తీవ్రతను తగ్గించడంతోపాటు నివారించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పాటు నిస్తుందని చెప్పుకొచ్చింది. పర్యావరణం దృష్ట్యా అత్యంత సున్నితమైన, భూకంపాలకు ఎక్కువ అవకాశాలున్న హిమాలయ ప్రాంతంలో 137 బిలియన్ డాలర్లతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలని చైనా నిర్ణయించడంపై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. చైనా తీరుపై అమెరికా ప్రభుత్వంతోనూ చర్చిస్తోంది. -
శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాల ప్రవాహం పెరిగింది. శ్రీశైలానికి జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 1,47,682 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో శుక్రవారం 6 గేట్లను తెరచి నాగార్జునసాగర్కు 1,67,076 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 212.91 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం స్పిల్వే, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో శుక్రవారం నాగార్జున సాగర్ జలాశయానికి 2,04064 క్యూసెక్కులు జలాలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి 20 క్రస్ట్ గేట్లు ఎత్తి స్పిల్వే మీదుగా 1,61,800 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో మరో 28,339 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, ఏఎమ్మారీ్ప, వరద కాల్వల ద్వారా 13,925 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి 1,31,803 క్యూసెక్కులు వస్తుండగా 202 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నారు. మిగులుగా ఉన్న 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. శాంతిస్తున్న గోదావరి ధవళేశ్వరం: ఉరకలెత్తిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.10 అడుగులకు చేరింది. గురువారం రాత్రి 11.75 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అనంతరం క్రమేపీ పెరుగుతూ శుక్రవారం ఉదయానికి 12.30 అడుగులకు చేరింది. సాయంత్రం 6 గంటలకు స్వల్పంగా తగ్గింది. కాటన్ బ్యారేజీ నుంచి 10,36,440 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. డెల్టా కాలువలకు 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ∙ఆరు గేట్ల ద్వారా 1,67,076 క్యూసెక్కులు విడుదల ∙ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి -
డ్యామ్ తెగి 60 మంది మృతి, వంద మందికి పైగా గల్లంతు!
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈస్ట్రన్ రెడ్ సీ ప్రాంతంలో ఒక డ్యామ్ తెగిపోవడంతో పలువురు మృతిచెందారని, లెక్కలేనంతమంది గల్లంతయ్యారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో 60 మంది మృతిచెందారని, 100 మంది గల్లంతయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎడతెగని భారీ వర్షాలకు అర్బత్ డ్యామ్ తెగిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతిచెందారనేది ఇంకా తెలియలేదు. పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. స్థానిక అధికారి ఒకరు సుడానీస్ వార్తా వెబ్సైట్ అల్-తాగిర్తో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 60 మంది మృతిచెందివుండవచ్చని, లెక్కలేంతమంది గల్లంతైవుంటారని అన్నారు. ఈ ప్రమాదం కారణంగా జరిగిన నష్టం తీవ్రవమైనదని నీటిపారుదలశాఖ అధికారి అమర్ ఇసా తాహిర్ మీడియాకు తెలిపారు.సూడానీస్ వార్తా సంస్థ మెదామిక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో 100 మందికి పైగా జనం గల్లంతయ్యారు. సమీప గ్రామప్రజలు కొండలపైకి చేరుకుని తలదాచుకున్నారని తెలుస్తోంది. ఈ డ్యామ్ పోర్ట్ సూడాన్ నగరానికి ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం శనివారం రాత్రి ఈ డ్యామ్ కూలిపోయింది. సూడాన్లో ప్రతి ఏటా వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా ఈ ప్రాంతంలో సంభవిస్తున్న వరదలకు వందలాది మంది మృతి చెందగా, పెద్ద ఎత్తున పంటనష్టం ఏర్పడింది.🇸🇩 SE COLAPSA PRESA DE JOR ARBAAT EN SUDÁNAl menos 60 personas perdieorn la vida ahogadas, luego de registrarse el colpaso de la presa de #JorArbaat, ubicada al este de #Sudán, que terminó por inundar al menos 5 pueblos con 5,000 habitantes cada una.Según reportan, la presa… pic.twitter.com/TH5eS6ePps— 𝗧𝗵𝗲 𝗠e𝘅𝗶𝗰𝗼 𝗣𝗼𝘀𝘁 (@MexicoPost) August 27, 2024 -
శ్రీశైలం, సాగర్ జలాశయాల గేట్లు మూసివేత
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: ఎగువ నుంచి వరద తగ్గిపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల గేట్లను సోమవారం సాయంత్రం మూసివేశారు. కృష్ణా బేసిన్లో వర్షం తగ్గడంతో జూరాలలో గేట్లను మూసివేయడంతోపాటు విద్యుత్ ఉత్పాదనను కూడా నిలిపివేశారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో సుంకేసుల బ్యారేజీకి ఓవర్ఫ్లో ప్రవాహం పెరిగింది. సుంకేసుల నుంచి శ్రీశైలానికి 77,598 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. ఈ ప్రవాహంతోపాటు దిగువకు విడుదలవుతున్న నీరు, డ్యాం గరిష్టస్థాయి నీటిమట్టాన్ని బేరీజు వేసుకుని ఇంజనీర్లు శ్రీశైలం గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం సమయానికి డ్యాం నీటిమట్టం 881.20 అడుగులు కాగా, 194.3069 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అదేవిధంగా నాగార్జునసాగర్ జలాశయంలో 588.80 అడుగులు నీటిమట్టంతో 308.4658 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 47,035 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి మళ్లీ సాగర్ రేడియల్ క్రస్ట్గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది.‘తుంగభద్ర గేటుకు వెంటనేమరమ్మతులు చేయాలి’ సాక్షి, అమరావతి: తుంగభద్ర ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు, సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి, కౌలు రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు సోమవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి నీరంతా వృథాగా పోతుండడంతో ఈ రెండు జిల్లాల్లోని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. -
భారత్పై చైనా వాటర్ బాంబ్!
బీజింగ్: చైనా మనపై మరో కుయుక్తికి దిగుతోంది. తన అధీనంలోని టిబెట్ గుండా భారత్లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్కేంద్రం, డ్యామ్ను నిర్మించాలని తలపోస్తోంది. అదే జరిగితే అరుణాచల్ ప్రదేశ్, అసోంలకు తాగు, సాగు నీటి కష్టాలు తప్పవు. అంతేకాదు, యుద్ధమే వస్తే డ్యామ్ను నింపేసి ఒక్కసారిగా గేట్లన్నీ ఎత్తి భారత్లో పలు ప్రాంతాలను వరదతో ముంచెత్తే కుట్ర ఇందులో దాగుందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడివంది. ‘జల రాజకీయాలు: భారత్, చైనా భద్రతా పోరులో బ్రహ్మపుత్ర పాత్ర’ పేరిట ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. ‘‘బ్రహ్మపుత్ర జలాలు అరుణాచల్ వద్ద భారత్లోకి మహోధృతంగా ప్రవహిస్తాయి. అక్కడే భారీ డ్యామ్కు చైనా ప్లాన్ చేస్తోంది. విద్యుదుత్పత్తి కోసమని చెబుతున్నా ప్రాజెక్టు నీటిమట్టం, నిల్వ, కిందకు వదిలే సమయం, పరిమాణం వంటి సమాచారాన్ని భారత్తో చైనా పంచుకునే అవకాశాల్లేవు. కనుక ఒక్కసారిగా వచ్చిపడే వరద ఉధృతిని ఎదుర్కొనేందుకు, తగు ఏర్పాట్లు చేసుకునేందుకు భారత్కు అస్సలు సమయం ఉండదు. ఇలా డ్యామ్తో భారత్పైకి వాటర్బాంబ్ను చైనా గురిపెడుతోంది’’ అని పేర్కొంది. -
3 గేట్లు ఎత్తిన అధికారలు
-
మహారాష్ట్రలో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం
పుణె: మహారాష్ట్రలో ప్రముఖ పర్యాటక ప్రాంతం భూషీ ఆనకట్ట దిగువన ఉన్న జలపాతంలో వద్ద ఒక కుటుంబం కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో వరదనీటి ప్రవాహం జలపాతం వద్ద పోటెత్తింది. హదాప్సార్ నుంచి వచి్చన అన్సారీ కుటుంబం ఇదే సమయంలో జలపాతం వద్ద ఉంది. ప్రవాహం ధాటికి అంతా కొట్టుకుపోయారు. ఈ ఘటనలో 36 ఏళ్ల శహిష్ట అన్సారీ, 13 ఏళ్ల అమీమీ, ఎనిమిదేళ్ల ఉమేరాల మృతదేహాలను దిగువన కనుగొన్నారు. ఇద్దరి జాడ గల్లంతైంది. -
నేడు తెలంగాణకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది. బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటి పారుదల శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలతో సమావేశం కానుంది. ఈ నెల 7, 8వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి తనిఖీలు నిర్వహించనుంది. మళ్లీ 9న హైదరాబాద్లో అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదేరోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది. మరోవైపు బ్యారేజీల డిజైన్లు మొదలు నిర్మాణం వరకు ఇందులో పాలుపంచుకున్న అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కమిటీ కోరింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన 19 రకాల సమాచారం అందించాలని లేఖ రాసింది. ఇదీ చదవండి: వీడ్కోలు సమయాన విన్నపాలు -
వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై విచారణ కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కొత్త చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వచ్చేవారం రానుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, కేంద్ర నదుల అనుసంధాన టాస్్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కోరి న పూర్తి సమాచారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గాకుండా.. ›ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఇస్తేనే.. జియో సిస్మిక్, క్వాలిటీ చెక్ వంటి అంశాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని స్ప ష్టం చేశారు. గురువారం పీఐబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి, మేడి గడ్డ సమస్య, కేఆర్ఎంబీ అధికార పరిధి, కేఆర్ఎంబీ–2కు సంబంధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్లపై శ్రీరామ్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి పరిశీలన తర్వాతే తేలేది.. ఎన్డీఎస్ఏ జియో సిస్మిక్, జియో ఫిజికల్, సాంకేతిక అంశాలు, ఇతర నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపాకే.. బ్యారేజీల విషయంలో స్పష్టత వస్తుందని వెదిరె శ్రీరామ్ వివరించారు. ఆయా అంశాల పరిశీలన కోసం కమిటీకి నాలుగు నెలల సమయం ఇచ్చామని, నెల రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మేడిగడ్డలో పియర్స్, కాంక్రీట్ బ్లాకులు కుంగిపోయినందున.. ఈ ప్రాజెక్టులో ఇతర చోట్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే మేడిగడ్డను పునరుద్ధరించవచ్చా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత, అంతర్రాష్ట్ర అంశాల ప్రాతిపదికనే ఆమోదం కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపిందని చెప్పారు. డిజైన్ లోపాలు తెలంగాణ నీటిపారుదలశాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లవేనని.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికే కేంద్రం ప్రయత్నం.. తెలంగాణ, ఏపీ మధ్య జల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, కేఆర్ఎంబీ ప్రయత్నిస్తున్నాయని.. దీనివెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని శ్రీరామ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)లో గణాంకాలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నందున పరిశీలించే అవకాశం లేదని సీడబ్ల్యూసీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా అదనపు (మూడో టీఎంసీ) పనులకు ఆమోదం లేదని కూడా స్పష్టం చేసిందని.. ఆ క్రమంలోనే ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇతర వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి రూ.28వేల కోట్ల రుణాలను నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ పనులను 2021 జూలైలోనే అనుమతి లేని జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్లో.. ఎకరాకు వంద క్వింటాళ్ల పంట పండుతుందని పేర్కొందని చెప్పారు. దీనితోపాటు ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి ఇంత అని, సాగునీటికి ఫీజులు, సెస్సుల వసూలు ద్వారా ఇంత అని ఆదాయం లెక్కలు చూపిందన్నారు. ప్లంజ్పూల్తో ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్పూల్ తొలిచినట్టు అయి.. దాని పగుళ్లు డ్యాం కిందివరకు వెళ్లడం ప్రమాదకరమేనని శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇటీవలి నివేదికలు కూడా ఈ ప్రాజెక్టులకు తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే డ్యామ్ల స్థిరత్వానికి ప్రమాదమన్నారు. -
పాక్కు రావి నది నీటిని ఆపేసిన భారత్
పాకిస్తాన్ వైపు వెళ్లే రావి నది నీటిని ఎట్టకేలకు భారత్ నిలిపివేసింది. డ్యామ్ను నిర్మించి, రావి నది నీటి ప్రవాహం పాకిస్తాన్ వైపు వెళ్లకుండా భారత్ నిలువరించింది. ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో 1960లో సంతకం చేసిన ‘ఇండస్ వాటర్ ట్రీటీ’ ప్రకారం రావి జలాలపై భారతదేశానికి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలోని షాపూర్ కంది బ్యారేజీ.. జమ్ము కశ్మీర్, పంజాబ్ మధ్య వివాదం కారణంగా నిలిచిపోయింది. ఫలితంగా గత కొన్నేళ్లుగా భారత్కు చెందిన నీటిలో ఎక్కువ భాగం పాకిస్తాన్కు వెళుతోంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ జలాలపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉండగా, సింధు, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్తాన్కు హక్కులు ఉన్నాయి. 1979లో పంజాబ్, జమ్ము కశ్మీర్ ప్రభుత్వాలు రంజిత్ సాగర్ డ్యామ్తో పాటు దిగువన ఉన్న షాపూర్ కంది బ్యారేజీని నిర్మించడానికి, పాకిస్తాన్కు జలాలను ఆపడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై నాటి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లా, అతని పంజాబ్ కౌంటర్ ప్రకాష్ సింగ్ బాదల్ సంతకం చేశారు. 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి దీనిని పూర్తి చేయాలని భావించారు. 2001లో రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాగా, షాపూర్ కంది బ్యారేజీని నిర్మించలేక పోవడంతో రావి నది నీరు పాకిస్తాన్లోకి ప్రవహిస్తూనే ఉంది. షాపూర్ కంది ప్రాజెక్టును 2008లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా, 2013లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పంజాబ్, జమ్ము కశ్మీర్ మధ్య వివాదాల కారణంగా 2014లో ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఆగిపోయింది. 2018లో కేంద్రం మధ్యవర్తిత్వం వహించి, ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని తర్వాత డ్యాం పనులు ప్రారంభమై, ఎట్టకేలకు పూర్తయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబాలకు ఇకపై సాగునీరు అందనుంది. ఇన్నాళ్లూ ఈ నీరు పాకిస్తాన్కు తరలిపోయింది. ఇకపై 1,150 క్యూసెక్కుల సాగునీరు 32,000 హెక్టార్ల భూమికి అందనుంది. జమ్ముకశ్మీర్తో పాటు పంజాబ్, రాజస్థాన్లకు కూడా ఈ డ్యామ్ నీరు ఉపయోగపడనుంది. -
నేడు రాష్ట్రానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం
-
మేడిగడ్డపై ‘నివేదిక’ అర్థరహితం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’రూపొందించిన నివేదికలో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుంగిన ర్యాఫ్ట్ వద్ద తవ్వకాలు జరిపి పరిశీలన జరిపితేనే అసలు కారణాలు తెలుస్తాయని.. ఎన్డీఎస్ఏ వంటి చట్టబద్ధసంస్థ తొందరపాటుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని తప్పుపట్టారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందంటూ ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికపై శనివారం ఆయన జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఇతర సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికలోని చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తమ సమావేశంలో నిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని రజత్కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. డిజైన్ల ప్రకారమే నిర్మాణం మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్గా డిజైన్ చేసి, దానికి విరుద్ధంగా రిజిడ్ స్ట్రక్చర్గా నిర్మించారని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని రజత్కుమార్ తెలిపారు. ర్యాఫ్ట్, సీకెంట్ పైల్స్ మధ్య జాయింట్ ఉందని.. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు, వ్యయ అంచనాలు, ఆపరేషనల్ వివరాలను గతంలోనే సీడబ్ల్యూసీకి, డైరెక్టరేట్ ఆఫ్ కాస్టింగ్కి సమర్పించామన్నారు. వారు ఎన్నో వివరాలు అడిగాకే ఆమోదించారని.. తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వీటిని ఆమోదించిందని తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఇంజనీరింగ్ అద్భుతంగా కితాబునిచ్చారని గుర్తుచేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 2023 జూన్లో డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 పరిధిలోకి వచ్చిందని, కానీ అంతకుముందు సమయానికి సంబంధించి బ్యారేజీ నిర్వహణ నిబంధనలను పాటించలేదని నివేదికలో పేర్కొనడం అర్థ రహితమని విమర్శించారు. వానాకాలం ముగిసిన నేపథ్యంలో నవంబర్ నుంచి తనిఖీలు ప్రారంభిస్తామన్నారు. తనిఖీ చేయకుండానే ఆరోపణలు ఎలా? ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయకుండానే వాటికి సైతం ప్రమాదం పొంచి ఉందని నివేదికలో పేర్కొనడాన్ని రజత్కుమార్ తప్పుబట్టారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కదలడంతో పైపింగ్, బాయిలింగ్ (బ్యారేజీ గేట్లకు దిగువన సీపేజీ) జరిగాయని చెప్పారు. ఆప్రాన్ డిజైన్లను సరిదిద్దుతున్నాం మేడిగడ్డ బ్యారేజీ ఆప్రాన్ డిజైన్లలో ఎన్డీఎస్ఏ బృందం కొన్ని లోపాలున్నట్లు తెలిపిందని, తాము దీన్ని గతంలోనే గుర్తించి నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించామని రజత్కుమార్ తెలిపారు. 2021 వరదల్లోనే ఆప్రాన్ దెబ్బతిందని, డిజైన్లను సరిదిద్దాక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలోని నిపుణులు 10 డిజైన్లను సిఫారసు చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరంగా లోపాల్లేవని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకొని నిదానంగా కారు నడిపినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, ఇది కూడా అలానే జరిగిందని వ్యాఖ్యానించారు. అధికారులిచ్చిన డిజైన్ల ప్రకారమే మేడిగడ్డ నిర్మాణం స్పష్టం చేసిన ఎల్అండ్టీ సంస్థ సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 23న 7వ బ్లాకు కుంగిపోవడంతో కొంతభాగానికి పగుళ్లు వచ్చాయని పేర్కొంది. నీటిపారుదల శాఖ అధికారులు అందజేసిన డిజైన్ అనుసరించి నాణ్యతను అనుసరిస్తూ బ్యారేజీని నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేసింది. నాటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు బ్యారేజీ వరదలను తట్టుకుని నిలబడిందని పేర్కొంది. బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ పూర్తైన తర్వాత సత్వరంగా పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎల్అండ్టీ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ‘నివేదిక’పై సమగ్రంగా సమాధానం ఎన్డీఎస్ఏ బృందం 20రకాల డాక్యుమెంట్లను కోరగా.. గత నెల 29న 17 రకాల డాక్యుమెంట్లు, ఈ నెల 1న మిగతా 3 డాక్యుమెంట్లను అందజేశామని రజత్కుమార్ తెలిపారు. కానీ 11 డాక్యుమెంట్లే ఇచ్చినట్టు నివేదికలో పేర్కొనడం దారుణమన్నారు. మళ్లీ 20రకాల డాక్యుమెంట్లను రిప్లైతో కలిపి పంపిస్తామని చెప్పారు. ఈ మేరకు రజత్కుమార్ ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలకు వివరణలతో శనివారం రాత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాశారు. -
‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు’
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో భేటీ అయింది. ఆనకట్ట కుంగిన వ్యవహారంపై ఇంజినీర్లతో కేంద్ర బృందం చర్చించింది. ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించింది. భేటీ అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మాట్లాడుతూ.. ‘‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు. లోపాలు ఉంటే మూడు సీజన్లు తట్టుకునేది కాదు కదా!. ఏడో బ్లాక్లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగింది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఇసుక కారణంగా సమస్య వచ్చిందని భావిస్తున్నాం. బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ శాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయి. కాపర్ డ్యామ్కు వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తాం’’ అని ఈఎన్సీ పేర్కొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్ద శబ్దంతో కుంగుబాటు.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ శనివారం రాత్రి భారీ శబ్దంతో కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం ఆందోళన రేకెత్తించింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. దీంతో బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ఆపై కేంద్రం తరపున నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్ల ద్వారా వివరాలు తీసుకున్నారు. -
ఆల్మట్టిలో పెరిగిన వరద ఉద్ధృతి
సాక్షి,అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యామ్లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.67 టీఎంసీలకు చేరింది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆల్మట్టి నుంచి విడుదల చేస్తున్న జలాలకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న వరద తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్లోకి 13,681 క్యూసెక్కులు చేరుతున్నాయి. నారాయణపూర్లో నీటి నిల్వ 20.36 టీఎంసీలకు చేరింది. కృష్ణా ప్రధాన పాయ, భీమా నుంచి జూరాల ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలోనూ వరద ఉద్ధృతి మరింత పెరిగింది. టీబీ డ్యామ్లోకి 83,842 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 32.86 టీఎంసీలకు చేరింది. జూరాలలో విద్యుదుత్పత్తిని ఆపేయడంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1236 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 37.08 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలానికి దిగువన కురిసిన వర్షాల వల్ల సాగర్లోకి 6,438 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 142.44 టీఎంసీలకు చేరింది. మూసీ వరద పులిచింతలలోకి నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 12,560 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్కు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన మున్నేరు, కట్టలేరు, వైరా కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో బ్యారేజ్కు 11,840 క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజ్ 16 గేట్లను అడుగు మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజీకి 50 వేల క్యూసెక్కులు అంతకు మించి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సంగమేశ్వరుడి సన్నిధికి.. కొత్తపల్లి (నంద్యాల): నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్తనదుల సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరాలయాన్ని కృష్ణా జలాలు సమీస్తున్నాయి. సంగమేశ్వరాలయం వద్ద బీమలింగం కొలను పూర్తిగా మునిగిపోయి ఆలయ సమీపంలోని మెట్ల మార్గం వరకు చేరుకున్నాయి. దీంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. -
ఇండియానే కాదు, చైనాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి
ప్రస్తుతం భారత్లోని ఉత్తరాది ప్రాంతం భారీ వర్షాలకు, వరదలకు వణుకుతుండగా, చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో గల మైన్యాంగ్ సిటీ నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్యాంగ్లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇదేవిధంగా చైనాలోని చోంగ్కింగ్ నగర పరిధిలో 9,700 మంది తుపాను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. మీడియా ఏజెన్సీ షిన్హువా తెలిపిన వివరాల ప్రకారం చోంగ్కింగ్ పరిధిలోని 41 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. వాన్ఝోవూలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 227 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాన్ఝోవూ విపత్తు నియంత్రణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 300 హెక్టార్లలోని పంటపొలాలు నీట మునిగాయి. ఇళ్లు నీట మునగడంతో వందల మంది నిరాశ్రయులుగా మారారు. వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని రెస్క్యూ బృందాలు కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇది కూడా చదవండి: ‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్ను కలవరపెడుతున్న తాజా నివేదికలు! -
‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్ను కలవరపెడుతున్న తాజా నివేదికలు!
టిబెట్లోని వాస్తవ నియంత్రణ రేఖకు (ఎల్ఎసి) సమీపంలో గల యార్లంగ్-త్సాంగ్పో నది (భారతదేశంలో దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు) దిగువ ప్రాంతాలపై ‘సూపర్’ డ్యామ్ను నిర్మించేందుకు చైనా తన ప్రణాళికలను కొనసాగిస్తున్నదంటూ మరోమారు నివేదికలు వెలువడ్డాయి. భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా.. ప్రముఖ భౌగోళికరాజకీయ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ నిక్కీ ఇటీవల..చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను రహస్యంగా నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. కాగా చైనా రూపకల్పనలోని ఈ మెగా ప్రాజెక్ట్ 60 గిగావాట్ల సామర్థ్యం కలిగి భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా ఉంది. కాగా చైనా చేపడుతున్న ఈ ఆనకట్ట నిర్మాణ కార్యకలాపాల నివేదికలు మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల స్థాయిని, భౌగోళిక పరిధిని చైనా ఎప్పుడూ వెల్లడించనందున అవి రహస్యంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నదిపై.. బ్రహ్మపుత్ర నది కైలాష్ పర్వతం సమీపంలోని అంగ్సీ హిమానీనదంపై ఉద్భవించింది. 3,969-కిలోమీటర్ల పరిధి కలిగివుంది. దీని ఉపనది యార్లంగ్-త్సాంగ్పో వైవిధ్యమైన వాతావరణ, జలసంబంధమైన మండలాలను కలిగి ఉన్న ఒక ప్రధాన నదీ వ్యవస్థగా అలరారుతోంది. ఇది టిబెట్ అటానమస్ రీజియన్ (టీఏఆర్) నుంచి విభిన్న ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో బ్రహ్మపుత్రగా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చివరకు బంగ్లాదేశ్లో డెల్టాను ఏర్పరుస్తుంది. తూర్పు దిశలో అనేక ఉపనదులను తనలో కలుపుకున్న తరువాత నది ఈశాన్యం వైపుకు మారుతుంది. హిమాలయాల తూర్పు చివర పర్వత ప్రాంతాల మధ్య పెద్ద ఇరుకైన మార్గం గుండా వెళ్లి తిరిగి చైనాను దాటుతుంది. భారత వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కు ఇరువైపులా 5,000 మీటర్ల పరిధిలో విస్తరించి భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు లోతైన గార్జ్ (యార్లంగ్ త్సాంగ్పో గ్రాండ్ కాన్యన్) ఏర్పడుతుంది. నీటి విడుదల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నది (సెకనుకు 19,825 క్యూబిక్ అడుగులు). ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ.. ‘ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం’ యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర వద్ద నది భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఉన్న ప్రదేశంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా యోచిస్తోందని సమాచారం. నవంబర్ 2020లో ఆనకట్ట గురించిన నివేదికలు వెలువడినప్పుడు చైనీస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్.. ‘చైనా యార్లంగ్-త్సాంగ్పో నదిపై ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇది ఆసియాలోని ప్రధాన జలాల్లో ఒకటి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ గుండా కూడా వెళుతుంది’ అని పేర్కొంది. కాగా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఛైర్మన్.. ‘చరిత్రలో దీనికి సమానమైనది లేదు. ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం. ఈ ఆనకట్ట 300 బిలియన్ల ఆదాయాన్ని అందించగలదని’ ప్రకటించారు. బీజింగ్ రూపొందించిన స్వచ్ఛమైన శక్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన రిపోర్టులు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. నీటి దోపిడీలో నిమగ్నమైన చైనా చైనా తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను నివారించేందుకు ఈ నదిని ఉత్తరం వైపు మళ్లించే అవకాశం కూడా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారతదేశానికి పలు చిక్కులు తలెత్తనున్నాయి. పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం తగ్గుతుందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. చైనా పలు ప్రధాన నదుల నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 డ్యామ్ల ప్రణాళికలను కలిగి ఉందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ తెలిపారు. టిబెటన్ పీఠభూమి నుండి ప్రవహించే అన్ని ప్రధాన నదులపై బహుళ డ్యామ్లను నిర్మింపజేస్తూ నీటి దోపిడీలో చైనా నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా యార్లంగ్-త్సాంగ్పో నదిపై పలు ప్రాంతాల్లో చైనా చిన్న డ్యామ్లను నిర్మించడం ప్రారంభించింది. ఇప్పుడు అతిపెద్ద ఆనకట్టలను నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తూ.. ఈ ఏడాది జనవరిలో జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పలు ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి, టిబెట్లోని మబ్జా జాంగ్బో (త్సాంగ్పో) నదిపై భారత్-నేపాలీ-చైనీస్ సరిహద్దు ట్రైజంక్షన్కు ఉత్తరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్యామ్ నిర్మిస్తున్నట్లు ధృవీకరించారు. ఇది ఆనకట్ట నిర్మాణ కార్యకలాపానికి సంబంధం లేనప్పటికీ, ఇది హిమాలయ సరిహద్దులోని పలు విభాగాలలో కొనసాగుతున్న అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తున్నదన్నారు. యూఎన్ కన్వెన్షన్ ఆన్ నాన్-నేవిగేషనల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్కోర్స్ ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ నదిలో జోక్యానికి వీటో అవకాశం కల్పించలేదు. చైనా ధోరణిపై భారత్ అప్రమత్తం 2002లో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం చైనా.. యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర జలసంబంధ సమాచారాన్ని మే, అక్టోబర్ మధ్య భారత్తో పంచుకోవాలి. తద్వారా వర్షాకాలంలో భారీ ప్రవాహం తలెత్తినప్పుడు భారతదేశం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే 2017 డోక్లామ్ సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత చైనా నది నీటి ప్రవాహ స్థాయిలను భారత్తో కమ్యూనికేట్ చేయడాన్ని అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నేపధ్యంలో చైనా ధోరణి విషయంలో భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతం యార్లంగ్-త్సాంగ్పో-బ్రహ్మపుత్ర మార్గంలో చైనా చేపడుతున్న ఆనకట్ట నిర్మాణం పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! -
అసోం హై అలర్ట్.. భూటాన్ చేసిన పనితో..
అసోం: వరదలతో ఉత్తరాది వణికిపోతున్న వేళ.. అసోం సహా పలు రాష్ట్రాలకు కొత్తగా మరో ముప్పు పొంచి ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అసోంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. దాదాపు 4000 మంది వరకు ప్రజలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిశ్వనాథ్, బొంగైగాన్, ఛిరంజ్, ధేమాజీ, దిబ్రుగర్హ్, కోక్రజార్హ్, నల్బరి, టిన్సుకియా ప్రాంతాలు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. అయితే.. తూర్పు భూటాన్లోని కురిచ్చు ప్రాజెక్టును డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(డీజీపీసీ) నిర్వహిస్తోంది. కాగా.. ఈ రిజర్వాయర్ నుంచి వరద నీటిను విడుదల చేయనున్నట్లు జులై 13 అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. నియంత్రిత పద్దతిలో కనీసం 9 గంటలపాటు నీటిని విడుదల చేయనున్నామని స్పష్టం చేసింది. దీంతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అప్రమత్తమయ్యారు. ఆయా ముంపుకు గురయ్యే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. జాగ్రత్తగా పరిస్థితులను గమనించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కురిచ్చు రిజర్వాయర్ వరదతో భేకీ, మనాస్ నదులు విజృంభించే అవకాశం ఉందని చెప్పారు. The Royal Government of Bhutan has informed us that tonight there will be an excess release of water from the Kurichu Dam. We have alerted our district administrations to remain vigilant and assist the people in every possible way in case the water breaches the Beki and Manas… — Himanta Biswa Sarma (@himantabiswa) July 13, 2023 అసోంలోని బ్రహ్మపుత్ర, భేకీ, డిసాంగ్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 179 జిల్లాలు, 19 రెవెన్యూ సర్కిళ్లు, ముంపులో ఉన్నాయి. 2211.99 హెక్టార్ల పంట నష్టం జరిగింది. ధేమాజీ, ఛిరంగ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అసోం విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రస్తుతం భూటాన్ ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే నీటితో ఇంకా ఎంత నష్టం జరగనుందో అని ప్రజలు ఆందోళనలో చెందుతున్నారు. ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
ఉక్రెయిన్లో కూలిపోయిన భారీ డ్యామ్.. పలు ప్రాంతాలు జలమయం (ఫొటోలు)
-
Russia-Ukraine war: ఆగని కన్నీటి వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): నీపర్ నదిపై కఖోవ్కా డ్యామ్ పేలుడుతో కొత్త మలుపు తీసుకున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో జనం కష్టాలు మరింత పెరిగాయి. ఇన్నాళ్లూ బాంబుల మోతతో బంకర్లతో, భూగర్భ గృహాల్లో తలదాచుకున్న జనం ఇప్పుడు అవన్నీ జలమయం కావడంతో పొట్టచేతపట్టుకుని ప్రాణభయంతో పరుగుపెడుతున్నారు. యుద్ధంలో శత్రుదేశ సైన్యం సంహారం కోసం జనావాసాలకు దూరంగా పూడ్చిపెట్టిన మందుపాతరలు వరదప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి. ఆ వరదనీరు జనావాసాలను ముంచెత్తడంతో అవి ఇప్పుడు జనావాసాల్లో ఎక్కడికి కొట్టుకొచ్చి ఆగాయో, ఎప్పుడు పేలుతాయోనన్న భయం జనాలను వెంటాడుతోంది. నీటితో నిండిన నోవా కఖోవ్కా నగరంలో కొంతభాగం రష్యా అధీనంలో మరికొంత భాగం ఉక్రెయిన్ అధీనంలో ఉంది. తమ అధీన నగర ప్రాంతంలో ఐదుగురు చనిపోయారని రష్యా నియమిత మేయర్ వ్లాదిమిర్ గురువారం చెప్పారు. మరికొందరి జాడ గల్లంతైంది. స్థానికుల తరలింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. తాగునీరు కరువై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్, మొబైల్ ఫోన్ నెట్వర్క్ పూర్తిగా పోయిందని అధికారులు చెప్పారు. నష్టపరిహారం ఇవ్వండి: జెలెన్స్కీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ‘రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతవాసులకు వరద నష్టపరిహారం చెల్లించాలి. ఆస్తులు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సాయం అందించాలి’ అని తర్వాత ఆయన కార్యాలయం ఆన్లైన్లో ఒక డిమాండ్ పంపింది. ‘600 చదరపు కిలోమీటర్ల భూభాగం నీటమునిగింది. ఇక్కడ ఏకంగా 18 అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. 14,000కుపైగా భవనాలు నీటమునిగాయి. 4,000కుపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు పంపాం’ అని రష్యా నియమిత ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ చెప్పారు. నీపర్ నది తూర్పు పరివాహక ప్రాంతంలో మూడింట రెండొంతుల భూభాగం ర్రష్యా ఆక్రమణలో ఉంది. ఇది విధ్వంసకర దాడే: మేక్రాన్ ‘డ్యామ్ను కూల్చేయడం ముమ్మాటికీ విధ్వంసకర దాడే. అరాచక చర్య ఇది’ అని ఏ దేశాన్నీ ప్రస్తావించకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్వీట్చేశారు. వాటర్ ప్యూరిఫయర్లు, 5,00,000 ప్యూరిఫికేషన్ టాబ్లెట్లు, శుభ్రతా కిట్లు పంపిస్తున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. ‘డ్యామ్ కూలడానికి మూడు రోజుల ముందు 200 సైనిక వాహనాలు, 2,000 మంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్ ఆ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు డ్యామ్ను ఉక్రెయినే కూల్చింది’ అని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆరోపించారు. -
ఉక్రెయిన్ను ముంచెత్తిన వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా దురాక్రమణకు దిగాక ఇన్నాళ్లూ బాంబుదాడులకు భయపడి ప్రాణాలు అరచేత పట్టుకుని వలసపోయిన జనం ఇప్పుడు వరదరూపంలో వచ్చిన జలఖడ్గం దాటికి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీపర్ నదీ ప్రవాహంపై నిర్మించిన కఖోవ్కా ఆనకట్ట, జలవిద్యుత్ ప్లాంట్పై బాంబుల వర్షం నేపథ్యంలో డ్యామ్ బద్దలై వరదనీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలు జలమయమయ్యాయి. కొందరు ఇళ్లపైకి ఎక్కి అక్కడే గడిపారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ మొదలుపెట్టి స్థానిక పాలనా యంత్రాంగాలు పౌరులను వేరే చోట్లకు హుటాహుటిన తరలిస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ఆవిష్కతమయ్యాయి. దొరికింది తీసుకెళ్తూ ఏదో ఒకదాంట్లో వలసపోతూ.. చేతికందినంత నిత్యావసర వస్తువులు తీసుకుని మిలటరీ ట్రక్కులు, రాఫ్ట్లపై ఎక్కి జనం ఓవైపు వలసపోతుంటే శతఘ్ని పేలుళ్ల చప్పుళ్లతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఇంకొందరు బస్సుల్లో, రైళ్లలో వెళ్లిపోయారు. డ్యామ్ కుప్పకూలి 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దాడికి కారకులు ఎవరో తెలియరాలేదు. మీరంటే మీరని ఉక్రెయిన్, రష్యాలు పరస్పర దూషణలు మాత్రం ఆపట్లేవు. కొంతకాలంగా రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న ఈ డ్యామ్ పరిసరాల్లో తరచూ బాంబు దాడులు జరుగుతున్నాయి. రణక్షేత్రంగా మారిన ఈ ప్రాంతంపై ఇరుపక్షాల్లో ఒకరు పొరపాటున భారీ దాడి చేసిఉంటారని, నిర్లక్ష్యం కూడా అయి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగకుండా వస్తున్న వరదనీటితో దిగువ ప్రాంతాల్లో వచ్చే 20 గంటల్లో మరో మూడు అడుగులమేర నీరు నిలుస్తుందని అధికారుల ఆందోళన వ్యక్తంచేశారు. విస్తారమైన ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రిజర్వాయర్లలో కఖోవ్కా డ్యామ్ కూడా ఒకటి. గత ఏడాది రష్యా ఆక్రమించిన ఖేర్సన్ ప్రాంతంలోనే ఈ డ్యామ్ ఉంది. ఖేర్సన్ సిటీకి కేవలం 44 మైళ్లదూరంలో ఈ డ్యామ్ ఉండటంతో ఇప్పటికే వరదనీరు సిటీలోకి ప్రవేశించింది. వరదనీటి మట్టం పెరిగితే ఖేర్సన్కు కష్టాలు పెరుగుతాయి. డ్యామ్ పూర్తిగా పాడవలేదని, ఇంకా చాలా నీరు నిల్వ ఉందని, కొద్దిరోజుల్లో మొత్తం డ్యామ్ నేలమట్టమైతే మరో దఫా వరద ఖాయమని బ్రిటన్ రక్షణ శాఖ తన తాజా అప్డేట్లో పేర్కొంది. ఈ శాఖ తరచూ యుద్ధసమాచారాన్ని అందరితో పంచుకుంటోంది. తాగేందుకు నీరే లేదు: జెలెన్స్కీ ‘కుట్ర పన్ని రష్యా ఈ డ్యామ్ను నేలమట్టం చేసింది. వేలాది మంది ప్రజలకు కనీసం తాగు నీరు లేకుండా పోయింది’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టెలిగ్రామ్లో పోస్ట్చేశారు. ఇది రష్యా పనే: అమెరికా మేథో సంస్థ ‘నీపర్ దిగువ ప్రాంతాలను వరదమయం చేస్తే రష్యాకే మేలు. ఉక్రెయిన్ సేనలు మళ్లీ ఆప్రాంతాలను చేజిక్కించుకోకుండా ఆలస్యం చేయడం రష్యా ఎత్తుగడ. అందుకే తమకు కొంచెం నష్టం జరుగుతుందని తెల్సికూడా ఇలా డ్యామ్ను పేల్చేసింది’ అని రక్షణ, విదేశీవ్యవహారాల విశ్లేషణ మేథోసంస్థ, అమెరికాకు చెందిన లాభాపేక్షలేని ‘స్టడీ ఆఫ్ వార్’ వ్యాఖ్యానించింది. పొంచి ఉన్న ధరాఘాతం గోధుమలు, బార్లీ, పొద్దుతిరుగుడు నూనె, ఇతర ఆహార ఉత్పత్తుల్ని భారీ స్థాయిలో పండిస్తూ ప్రపంచ ఆహార అవసరాలు తీర్చడంలో ఉక్రెయిన్ కీలక భూమిక పోషిస్తోంది. డ్యామ్ వరదనీటితో పంట నష్టం వాటిల్లి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు తగ్గి డిమాండ్ పెరిగి ధరలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంది. డ్యామ్ కూలిన ఈ కొద్ది గంటల్లోనే గోధుమ ధరలు 3 శాతం ఎగబాకాయి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలోని కొన్ని దేశాలు ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తులపై ఆధారపడు తున్నాయి. డ్యామ్ కూల్చివేత కారణంగా కలిగే నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని రష్యా, ఉక్రెయిన్, ఐక్యరాజ్యసమితి అధికారులు చెబుతున్నారు. డ్యామ్ను బాగుచేసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలంటే ఈ యుద్ధతరుణంలో ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. -
ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన.. డబ్బు చెల్లించమంటూ లేఖ!
చత్తీస్గఢ్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ ఫోన్ కోసం రిజర్వాయర్ నీటిని ఎత్తిపోయించడంతో సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఫోన్ కోసం నీటిని వృధా చేసినందుకు గానూ అతడి జీతం నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేయకూడదంటూ సబ్ డివిజనల్ అధికారి ఆర్కే ధివర్కు ఈనెల 26న లేఖ రాశారు. వృధాగా పోయిన 21 లక్షల నీటి కోసం ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ వేతనం నుంచి డబ్బు వసూలు చేయండని అని లేఖలో పేర్కొన్నారు. వేసవిలో సాగు నీరు, ఇతర అవసరాల కోసం అన్ని రిజర్వాయర్లలో నీరు అవసరమని ఆ లేఖలో తెలిపారు. అయితే సదరు ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ తన ఫోన్లో అధికారిక డిపార్టమెంటల్ డేటా ఉన్నందున దాన్ని తిరిగి పొందేందుకు యత్నించినట్టు తెలిపాడు. నిజానికి ఆ నీరు ఆ నిరుపయోగంగానే ఉందంటూ వాదిస్తున్నాడు. తాను వారాంతం కావడంతో తన స్నేహితులతో కలిసి కాంకేర్ జిల్లాలోని ఖేర్కట్టా డ్యామ్ వద్ద స్నానం చేయడానికి వెళ్లానని, సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఫోన్ డ్యామ్ నీటిలో పడిపోయిందని చెప్పాడు. స్థానికులు ప్రయత్నించి విఫలమయ్యారు. అందులోని నీరుని రెండు నుంచి మూడడుగులు తోడిస్తే ఫోన్ దొరుకుతుందని అక్కడి వారు చెప్పడంతో.. ఎస్డీఓకి కాల్ చేసి అభ్యర్థించానని చెప్పుకొచ్చాడు. ఆయన అదేమంతా సమస్య కాదనడంతో ముందుకెళ్లానని చెబుతున్నాడు. మూడు, నాలుగు అడుగుల నీటిని తోడించగానే తన ఫోన్ దొరికేసిందని రాజేష్ చెప్పారు. ఎక్కువ మొత్తంలో నీరు ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే కేవలం మూడు లేదా నాలుగు అడుగుల నీటిని తోడించేందుకు అంగీకరించానని, అందుకు స్థానికుల సాయం కూడా తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా జలవనరుల శాఖ అధికారి మాత్రం తాను ఐదడుగులు నీటిని తీసేందుకే పర్మిషన్ ఇచ్చానని చెబుతుండటం గమనార్హం. (చదవండి: రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్లో నీటిని ఎత్తిపోశాడు.. తీరాచూస్తే..) -
రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్లో నీటిని ఎత్తిపోశాడు.. తీరా చూస్తే..
అసలే ఎండాకాలం. నీటి ఎద్దడి సమస్యను చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. డబ్బుల లాగే నీటిని కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి తలెత్తింది. నీటిని కానీ ఓ అధికారి తన సెల్ఫోన్ కోసం ఏకంగా రిజర్వాయర్లోని నీటిని బయటకు ఎత్తిపోశారు. తన స్వార్థం కోసం వందల ఎకరాలకు సాగునీరు అందించే నీటిని వృథా చేశాడు. ఏం అని ప్రశ్నిస్తే.. ఆ నీరు వాడుకకు పనికిరానిదని, కలెక్టర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నాడు. అసలు ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో చుద్దాం.. చత్తీస్గఢ్ రాష్ట్రం కంకారా జిల్లాలోని కొల్లిబేడ ప్రాంతానికి చెందిన రాజేశ్ విశ్వాస్ ఆహార ధాన్యాల సరాఫర శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సెలవు దినాన్ని సరదాగా గడపడానికి ఖేర్కట్ట డ్యామ్కు వచ్చారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో తన రూ.లక్ష విలువైన స్మార్ట్ఫోన్ రిజర్వాయర్లో జారిపడింది. స్థానిక ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. డ్యామ్ దాదాపు 15 అడుగుల లోతు ఉంటుందని, నీరు 10 అడుగుల లోతు ఉన్నాయని భావించారు. దీంతో 30హెచ్పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను మూడు రోజులపాటు ఉపయోగించి 21 లక్షల లీటర్ల నీటిని నీటిని ఎత్తిపోశారు. గత సోమవారం నుంచి గురువారం వరకు నిరంతరాయంగా నీటిని తోడిపోశారు. ఈ నీటితో దాదాపు 1500 ఎకరాల సాగుకు ఈ నీరు అందించవచ్చు. చివరికి స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన నీటివనరుల శాఖ అధికారులు ఆ ప్రక్రియను నిలుపుదల చేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోసినట్లు అధికారులు చెప్పారు. అయితే చివరికి రాజేష్కు తన ఫోన్ లభించింది. కానీ అది మూడు రోజులు వాటర్లో ఉండటం వల్ల పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్గా మారింది. అనంతరం శుక్రవారం సదరు అధికారిని సస్పెండ్ చేశారు.దీనిపై స్పందించిన నెటిజన్లు ఫుడ్ ఆఫీసర్పై మండిపడుతున్నారు. ఒక ఫోన్ కోసం వందల ఎకరాలకు ఉపయోగపడే నీటిని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి విలువ తెలిసిన వారు ఇలా చేయరని హితవు పలుకుతున్నారు. అతనిని చట్టం ప్రకారం శిక్షించాలని సూచిస్తున్నారు. చదవండి: Video: విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు దీనిపై ఫుడ్ ఆఫీసర్ రాజేష్ విశ్వాస్ మాట్లాడుతూ.. ‘నేను స్నేహితులతో డ్యామ్లో ఈతకొట్టడానికి వెళ్లాను. ఈ క్రమంలో ఫోన్ నీటిలో పడిపోయింది. అందులో అధికారిక సమాచారం ఉంది. ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నాలుగు అడుగుల మేర నీటిని ఎత్తిపోస్తే ఫోన్ను కనిపెట్టోచ్చని అన్నారు. దీంతో స్థానిక నీటి వనరుల అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాను. నా ఫోన్ దొరికింది. ఈ నీరు సాగుకు పనికి రాదు. నా చర్య వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు.’ అని తెలిపారు. మరోవైపు రాజేశ్ విశ్వాస్ అనే అధికారికి తాము ఎలాంటి రాతపూర్వక అనుమతి ఇవ్వలేదని నీటి వనరుల అధికారులు పేర్కొన్నారు. కేవలం వర్బల్గానే అనుమతి పొందారని తెలిపారు. నాలుగు అడుగుల మేర నీటిని మాత్రమే ఎత్తిపోయడానికి అనుమతి ఇచ్చామని, అంతకంటే ఎక్కువ నీటిని ఎత్తిపోశారని అధికారులు తెలిపారు. #Chhattisgarh के अंतागढ़ में फूड इंस्पेक्टर ने अपना मोबाइल खोजने के लिए बहा दिया परलकोट जलाशय का 21 लाख लीटर पानी! फोन मिल गया फूड इंस्पेक्टर का कहना है - उन्होनें कुछ गलत नहीं किया, वहीं मंत्री @amarjeetcg कार्रवाई की बात कह रहे है।@ZeeMPCG @mohitsinha75 @RupeshGuptaReal pic.twitter.com/c0qcPpOUrd — कुलदीप नागेश्वर पवार Kuldeep Nageshwar Pawar (@kuldipnpawar) May 26, 2023 -
గోదారమ్మ మణిహారంలో కలికితురాయి
పోలవరం జలవిద్యుత్కేంద్రం నుంచి సాక్షి ‘ప్రత్యేక’ ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు: గోదారమ్మ మణిహారంలో మరో కలికితురాయి ఒదగనుంది. పోలవరం జాతీయ బహుళార్ధక సాధక ప్రాజెక్టులో అంతర్భాగంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన జలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జలవిద్యుత్కేంద్రాలలో ఇదే అతి పెద్దది కావడం గమనార్హం. జలాశయం పనులు పూర్తయ్యేలోగా జలవిద్యుత్కేంద్రం పనులనూ పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలవరం జలవిద్యుత్కేంద్రం పూర్తయితే రాష్ట్ర విద్యుత్ ముఖచిత్రంలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని విద్యుత్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–1కి ఎడమవైపున కొండను తొలచి 960 మెగావాట్లు (1280) సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించే డిజైన్ను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది. రివర్స్ టెండరింగ్తో రూ.405.23 కోట్లు ఆదా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టులో మిగిలిన రూ.3,302 కోట్ల విలువైన పనులను 2018 ఫిబ్రవరి 27న నామినేషన్ పద్ధతిలో నవయుగకు కట్టబెట్టిన టీడీపీ సర్కార్ రూ.3,216.11 కోట్ల వ్యయంతో జలవిద్యుత్కేంద్రం పనులను కూడా అదే సంస్థకు కట్టబెట్టింది. ఆ సంస్థ నుంచి నాటి సీఎం చంద్రబాబు భారీగా ముడుపులు వసూలు చేసుకున్నారు. ఈ అక్రమాలపై నిపుణుల కమిటీతో విచారణకు ఆదేశించిన సీఎం వైఎస్ జగన్.. కమిటీ సిఫార్సుల మేరకు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. జలవిద్యుత్కేంద్రం పనులను రూ.2,810.88 కోట్లకే చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.405.23 కోట్లు ఆదా అయ్యాయి. చంద్రబాబు అక్రమాల బాగోతాన్ని రివర్స్ టెండరింగ్ బట్టబయలు చేసింది. శరవేగంగా పనులు.. టీడీపీ హయాంలో జలవిద్యుత్కేంద్రం పనుల్లో ఎలాంటి ప్రగతి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం జలవిద్యుత్కేంద్రం నిర్మాణానికి వీలుగా గోదావరి ఎడమ గట్టుపై ఉన్న కొండను తొలిచే పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. – జలవిద్యుత్కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రెజర్ టన్నెళ్లు(సొరంగాలు) తవ్వకం పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. 150.3 మీటర్ల పొడవు, 9 వ్యాసంతో కూడిన 12 టన్నెళ్లను తవ్వారు. – ప్రెజర్ టన్నెళ్లలో ఫెరోల్స్ అమర్చి లైనింగ్ పనులను చేపట్టారు. ఇప్పటికే ఏడు టన్నెళ్లలో ఫెరోల్స్ అమర్చి లైనింగ్ పనులను దాదాపుగా పూర్తి చేశారు. సొరంగాల ద్వారా నీరు సక్రమంగా వెళ్లేందుకు లైనింగ్ తోడ్పడుతుంది. – ఒక్కో టన్నెల్లో 52 ఫెరోల్స్ చొప్పున 12 టన్నెళ్లలో 624 ఫెరోల్స్ను అమర్చనున్నారు. 9 మీటర్ల వ్యాసం, 25 మిల్లీమీటర్ల మందంతో కూడిన ఇనుప రేకులతో వీటిని తయారు చేశారు. ఫెరోల్స్ తయారీకి మొత్తం 8520 టన్నుల స్టీల్ను వినియోగించారు. – ఈ టన్నెళ్లకు చివర తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటు చేస్తారు. టర్బైన్ల పునాది పనులను వేగవంతం చేశారు. – వర్టికల్ కెప్లాన్ టర్బైన్ల తయారీని భోపాల్లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈల్కు అప్పగించారు. ఈ టర్బైన్లు ఆసియాలోనే అతి పెద్దవి కావడం గమనార్హం. హిమాలయ జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా.. – గోదావరి నుంచి ఏటా సగటున మూడు వేల టీఎంసీల జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రవాహమంతా పోలవరం ప్రాజెక్టు మీదుగానే ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతోంది. – జలవిద్యుత్కేంద్రంలో ఒక సొరంగం (యూనిట్) ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటే రోజుకు 331 క్యూమెక్కులు (11,690 క్యూసెక్కులు) నీటిని విడుదల చేయాలి. ఈ లెక్కన 12 సొరంగాలలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలంటే 1,40,280 క్యూసెక్కులు (12 టీఎంసీలు) అవసరం. – పోలవరం పూర్తి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు వద్దకు జూలై నుంచి అక్టోబర్ రెండో వారం వరకూ ఏడాదికి సగటున 100 నుంచి 120 రోజుల వరకూ 1.50 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద ప్రవాహం వస్తుంది. అంటే ఏడాదికి సుమారు వంద నుంచి 120 రోజులు పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. – ఆ తర్వాత వరద ప్రవాహం తగ్గిన మేరకు విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. గోదావరి డెల్టాకు రబీ పంటలకు పోలవరం నుంచే నీటిని విడుదల చేయాలి. వాటిని విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తారు. అంటే ఏడాది పొడవునా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. – అందువల్ల హిమాలయ నదులపై ఏర్పాటు చేసిన జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి అవుతుందిన అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఛత్తీస్గఢ్: కొండగావ్ జిల్లాలో విషాదం.. డ్యామ్లోకి స్నానానికి దిగిన నలుగురు విద్యార్థుల గల్లంతు
-
మానవుడు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ
-
ఒక డ్యామ్.. భూమిని స్లో చేసింది
ప్రపంచంలోనే అతి భారీగా.. చైనాలోని యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్ డ్యామ్ను నిర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ డ్యామ్.. 2.33 కిలోమీటర్ల పొడవునా 181 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. దీనితో 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుందని అంచనా. రోజు పెరిగింది.. భారీ డ్యామ్, రిజర్వా యర్లో నిలిచే నీటి బరువు ఓవైపు.. డ్యామ్ నుంచి విడుదలయ్యే నీరు 150 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంటే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్ప డిందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల భూమి భ్రమణవేగం అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గిందని.. రోజు గడువు 0.06 మైక్రోసెకన్లు పెరిగిందని తేల్చారు. అంతేకా దు ఈ భారీ డ్యామ్ వల్ల.. భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏమిటీ ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’? వేగంగా, గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ అన్నివైపులా సమానంగా సర్దుకుంటాయి. అన్నివైపులా సమాన బరువు ఏర్పడుతుంది. అలాకాకుండా ఏదో ఒకచోట భారీ బరువు చేరినప్పుడు జడత్వం (ఇనెర్షియా) నెలకొని.. సదరు వస్తువు తిరిగే వేగం తగ్గిపోతుంటుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల భూమిపై ఇలాంటి ప్రభావమే పడి.. భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి పొరల కదలికలు కూడా ప్రభావితమయ్యాయని, చిన్న స్థాయిలో భూకంపాలు వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ డ్యామ్ను పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు. త్రీగోర్జెస్.. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్.. భూమ్మీద మనుషులు నిర్మించిన డ్యామ్లలో అదీ ఒకటి అంతేకదా అంటారా.. కాదు.. అది అన్నింటిలో ఒకటి కాదు.. ఏకంగా భూమి తిరగడాన్నే స్లో చేసేసింది. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వింత రంధ్రం.. మనుషుల తంత్రం!
ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది. డ్యామ్లో ఏదో పెద్ద రంధ్రం ఏర్పడి నీళ్లు లోపలికి వెళ్లిపోతున్నాయని అనిపిస్తోంది కదా. కానీ ఇది మనుషులు ఏర్పాటు చేసిన రంధ్రమే. ఆశ్చర్యంగా ఉంది కదా..! అసలీ రంధ్రం ఎక్కడ ఉంది.. ఎందుకు ఏర్పాటు చేశారు.. దీని లాభనష్టాలేంటి.. తెలుసుకుందాం. ♦డ్యామ్లో నీటి నియంత్రణకు.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తూర్పు నప లోయలో మోంటిసెల్లో డ్యామ్ ఉంది. 1950ల్లో ఈ ఆనకట్టను కట్టారు. అత్యంత తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పుడు, వర్షాలు విపరీతంగా కురిసినప్పుడు ఈ డ్యామ్లో నిండిన నీళ్లు బయటకు వెళ్లేలా ఇంజినీర్లు ఓ భారీ పైపును (రంధ్రంలా) ఏర్పాటు చేశారు. 22 మీటర్ల వెడల్పు, 75 మీటర్ల పొడవుతో దాన్ని నిర్మించారు. ఈ పైపు నుంచి మరో చిన్న పైపు ద్వారా అర కిలోమీటరు దూరంలోని పుటాహ్ క్రీక్లోకి నీళ్లను తరలించేలా ఏర్పాటు చేశారు. పైన ఫొటోలో చూస్తున్న రంధ్రం ఈ పైపే. ఈ రంధ్రం సెకనుకు దాదాపు 48 వేల క్యూబిక్ అడుగుల నీటిని లాగేసుకోగలదు. ఈ రంధ్రాన్ని స్థానిక ప్రజలు ‘గ్లోరీ హోల్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. డ్యామ్లో నీటిని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ఇలాంటి రంధ్రాలను ‘బెల్ మౌత్స్’ అంటుంటారు. ప్రపంచంలోని చాలా డ్యామ్లలో ఈ విధానం పాటిస్తున్నారు. ♦2017 నుంచి వార్తల్లో.. వర్షాలు విపరీతంగా కురవడం, ఈ పైపు నుంచి నీళ్లు బయటకు వెళ్లడం లాంటి పరిస్థితులు 50 ఏళ్లకోసారి వస్తే రావొచ్చని అప్పట్లో ఇంజనీర్లు అనుకున్నారు. అయితే 2000 సంవత్సరం మొదలయ్యాక ఇప్పటికే చాలాసార్లు ఈ హోల్లో నుంచి నీళ్లు బయటకు వెళ్లాయి. 2017లో భారీ స్థాయిలో వర్షాలు కురిసినప్పుడు ఈ బెల్ మౌత్ వార్తల్లో నిలిచింది. చాలా మంది స్థానికులు, పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వచ్చారు. 2019లో కూడా వర్షాలు భారీగా కురవడంతో మరోసారి ఈ హోల్ దర్శనమిచ్చింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ మనుషులు వెళ్లకుండా.. సుడిగుండం లాంటి ఈ రంధ్రం దగ్గరకు మనుషులు వెళ్లకుండా అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారు. అటువైపు స్విమ్మింగ్, బోటింగ్ నిషేధించారు. పైగా ఈ రంధ్రంలోని నీళ్లు వెళ్లే వేగానికి వ్యతిరేకంగా ఈత వచ్చిన ఎవరైనా బయటకు రాగలని చెబుతున్నారు. ఈ రంధ్రంలో పడి మనుషులు చనిపోయిన ఘటన ఇప్పటివరకు ఒక్కటే జరిగింది. 1997లో ఓ మహిళ అందులో పడి చనిపోయింది. ఆ రంధ్రంలో పడటానికి 20 నిమిషాల ముందు వరకు తను రంధ్రం అంచున వేలాడుతూ కనిపించింది. రెస్క్యూ బృందం రావడం ఆలస్యమవడంతో అందులో పడిపోయింది. -
అడుగంటినది
పర్లాకిమిడి(భువనేశ్వర్): గజపతి జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో మహేంద్రతనయ, వంశధార నదీజలాలు అడుగంటాయి. రాష్ట్ర సరిహద్దులో మహేంద్రతనయ నది చిన్నపాయలా ప్రవహిస్తోంది. పాతపట్నం మండలం–పర్లాకిమిడి సరిహద్దుల్లో ప్రజారోగ్యశాఖ ఇంజినీర్లు మహేంద్రతనయ వంతెన కింద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి, పంపుల సాయంతో నీటిని పర్లాకిమిడి లోని పీహెచ్ఈడీ పంప్హౌస్కి పంపిస్తున్నారు. పర్లాకిమిడిలో రోజుకు 12మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరం కాగా.. 8 మిలియన్ల గ్యాలన్ల తాగునీటిని మాత్రమే సరఫరా అవుతోందని అధికారులు తెలిపారు. పట్టణంలో రోజూ ఉదయం గంట సేపు మాత్రమే తాగునీటిని అధికారులు అందిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో వర్షాలు పడకపోతే పట్టణ ప్రజలకు మరిన్ని ఇబ్బందుతు తప్పవని అభిప్రాయ పడుతున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలతో పర్లాకిమిడి డీఎన్ ప్యాలెస్ వద్ద నీటిని రిజర్వ్ చేశారు. మూడు గోట్టపు బావులు తవ్వకాలు చేపట్టారు. దీంతో కొంతవరకు నీటి ఎద్దడికి అడ్డకట్ట వేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పగటిపూట 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
Up Assembly Election 2022: ఆ 11 గ్రామాలకు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలు
ఏ దేశానికేగినా, ఎందుకాలిడినా.. మొదట అడిగేది నీవెక్కడి వాడివోయ్ అనే! అలా చెప్పుకోవడానికి అస్తిత్వమే లేకపోతే.. మనకంటూ ఓ ఊరు, ఓ ఉనికే లేకపోతే... ఎంతో దుర్భరంగా ఉంటుంది కదా! తమ పూర్వీకుల తాలుకూ ఇళ్లు,, జ్ఞాపకాలు నదీగర్భంలో కలిసిపోతే... రచ్చబండ, చేదబావి, ఊరిచెరువు... ఈతపళ్లు... ఈ జ్ఞాపకాలన్ని కనుమరుగైపోతే... మెరుగైన జీవనానికంటూ పట్టణాలకు పరుగులు పెడుతున్న నేటి కుర్రకారుకు వాటి విలువ తెలియకపోవచ్చు.. కానీ మట్టిలో ఆడి.. ఎండిన చెరువుల మడుల్లో పాపెర్లు పట్టిన చిట్టి చేతులకు తెలుసు అవెంతటి విలువైన జ్ఞాపకాలో... నా పల్లెకేమైందని... గొంతుకేదో అడ్డం పడుతోంది.. మాట పెగలట్లేదు! మార్పు ఓ నిరంతర ప్రక్రియ. కొత్తనీరు వచ్చి నపుడు పాతనీరు కొట్టుకుపోతుంది. అభివృద్ధి జరగాల్సిందే కానీ... ఉన్న గతాన్నంతా ఊడ్చేసి మాత్రం కాదు. పుట్టిన ఊరితో, పెరిగిన వీధితో, చెడ్డీ దోస్తులతో పెనవేసుకున్న బంధాలు మాత్రం ఎన్నేళ్లయినా... ఎంత ఎత్తుకు ఎదిగినా... గుండెను తడుముతూనే ఉంటాయి. ఒక్కసారైనా ఊరెళ్లి మనోళ్లందరినీ కలిసి రావాలని మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్ సోన్భద్ర్ జిల్లా దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 గ్రామాలకు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలుగా మారాయి. దీంతో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉన్న ఈ 11 గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఏమాత్రం కనిపించట్లేదు. సోన్భద్ర్లో నిర్మిస్తున్న కన్హర్ డ్యామ్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ అయిన దుద్ధి నియోజకవర్గంలో అప్నాదళ్ (సోనేలాల్)కు చెందిన హర్ ఇరాం బీఎస్పీ అభ్యర్థిపై 1,085 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా 8,522 మంది ప్రజలు నోటాకే మొగ్గు చూపారంటే పరిస్థితి ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు రూ.2,700 కోట్లతో నాలుగు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న కన్హర్ డ్యామ్ను వచ్చే ఏడాది కల్లా సిద్ధం చేసేందుకు కొన్నేళ్లుగా చర్యలు వేగవంతం అయ్యాయి. సోన్భద్ర్ జిల్లాలోని అమ్వార్ గ్రామంలో పాగన్ నది, కన్హర్ నది సంగమం వద్ద జరుగుతున్న డ్యామ్ నిర్మాణంతో సిందూరి, భీసూర్, కోర్చి గ్రామాలతో పాటు కలిపి మొత్తం 11 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. దీంతో పరిహారం, పునరావాసం విషయంలో తాము చేస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎవరూ సహకరించట్లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చదవండి: (మీసం మెలేసేది రైతన్నే!) కన్హర్ డ్యామ్ కోసం 1976 నుంచి 1982 వరకు ప్రజల నుంచి భూమిని తీసుకుని ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. అయితే 1984లో ఆనకట్ట పనులు ఆగిపోవడంతో ప్రజలు ఎవరూ గ్రామాలు ఖాళీ చేయలేదు. కాగా ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కన్హర్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 65% భూసేకరణ పూర్తయిందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ముంపు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2023 వర్షాకాలానికి ముందే ఈ మెయిన్ డ్యాంలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దాంతో ఈసారి ఈ 11 గ్రామాలకు చెందిన ప్రజలు బరువెక్కిన గుండెతో కన్నీటి బొట్టునే చూపుడు వేలిపై సిరా చుక్కగా మలచుకొని... తమదిగా చెప్పుకోగలిగే ప్రాంతంలో ఆఖరిసారిగా ఓటేసి... తట్టాబుట్టా సర్దుకొని తలోవైపు వెళ్లిపోనున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
రామానుజులు కట్టిన వెయ్యేళ్ల ఆనకట్ట.. మరోసారి తెరపైకి
సాక్షి, హైదరాబాద్: నిరంతరం భగవన్నామ స్మరణలో ఉండే గురువులు.. చుట్టూ ఉన్న ప్రాణికోటి మేలు కోసం ఆలోచించాలన్నదే శ్రీరామానుజుల తత్వం. ఈ తపనతోనే ఆయన దాదాపు వెయ్యేళ్ల కింద ఓ జలాశయ నిర్మాణానికి పూనుకున్నారు. తాను కొంతకాలం నివసించిన ప్రాంతంలో నీటి కరువు లేకుండా చేశారు. అదే కర్ణాటకలోని తొండనూరులో ఉన్న తిరుమల సముద్రం. ఇప్పటికీ వేల ఎకరాలకు నీళ్లిస్తున్న ఈ సరస్సు.. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రైతుల బాధ చూసి.. అప్పట్లో రామానుజాచార్యులు తమిళనాడులోని శ్రీరంగాన్ని వదిలి కర్ణాటక ప్రాంతానికి వచ్చారు. మేల్కోటికి వెళ్తూ ప్రస్తుత మాండ్యా జిల్లాలోని తొండనూరులో కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో హొయసల రాజ్యానికి రెండో రాజధానిగా తొండనూరు ఉందని చరిత్ర చెబుతోంది. ఆ రాజ్య ప్రతినిధి తొండనూరు నంబి రామానుజులను స్వాగతించారు. అయితే అక్కడ తరచూ కరువుతో రైతులు ఇబ్బందిపడు తుండటాన్ని చూసిన రామానుజులు.. తానే ఇంజనీరుగా అవతారమెత్తి.. వర్షాధార పెద్ద చెరువుకు చివరలో ఉన్న రెండు గుట్టలను జోడిస్తూ ఆనకట్ట కట్టించారు. దాంతో చిన్న చెరువు.. 2200 ఎకరాల భారీ సరస్సుగా మారింది. దానికి తిరుమల సముద్రంగా పేరుపెట్టారు. దేశంలో ప్రాచీన ఆనకట్ట ఇదేనని చరిత్ర పరిశోధకులు చెప్తున్నారు. వెయ్యేళ్ల కిందటి ఈ జలాశయం ఒక్కసారి కూడా ఎండలేదని స్థానికులు అంటున్నారు. తమ సమస్య తీర్చడంతో స్థానికులు 35 అడుగుల ఎత్తుతో రామానుజాచార్య విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. సరస్సు నుంచి నీళ్లు ఓ చిన్న జల పాతంలా దిగువకు ప్రవహిస్తాయి. దాన్ని రామానుజ గంగగా పిలుస్తుంటారు. నీటి అడుగున గులకరాళ్లు స్పష్టంగా కనిపించేంత తేటగా నీళ్లుండటంతో.. టిప్పు సుల్తాన్ ఈ సరస్సుకు మోతీ తలాబ్ అని పేరు పెట్టాడు. తర్వాత ఆయనే దాని ఆనకట్టను కొంత ధ్వంసం చేయించారని.. తర్వాత బ్రిటిష్ పాలకులు మరమ్మతు చేయించారని చెబుతారు. జైనం నుంచి వైష్ణవంలోకి.. తొండనూరు ప్రాంతాన్ని పాలిస్తున్న హొయసల రాజు బిత్తి దేవ మొదట్లో జైనమతాన్ని ఆచరించేవారు. ఆయన కుమార్తెకు ఏదో వింత మానసిక సమస్య తలెత్తి, పరిష్కారం దొరక్క మనోవేదనకు గురయ్యారు. చివరకు రామానుజులను ఆశ్రయించటంతో.. రాజు కుమార్తెకు తిరుమల సముద్రంలో స్నానం చేయించి విష్ణు ఆరాధన చేయించారు. కొంతకాలానికి ఆమె సమస్య తగ్గటంతో బిత్తి దేవరాజు రామానుజులను అనుసరిస్తూ వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించారు. తన పేరును విష్ణువర్ధనుడిగా మార్చుకుని.. ఆ ప్రాంతంలో అద్భుత నిర్మాణ శైలితో నంబి నారాయణ దేవాలయాన్ని నిర్మించారు. రామానుజులు నిర్మించిన పంచ నారాయణ దేవాలయాల్లో ఇదీ ఒకటిగా, పర్యాటక క్షేత్రంగా వెలుగొందుతోంది. -
టీడీపీ నేత దేవినేనిని నమ్మి మోసపోయాం
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మాటలు నమ్మి మోసపోయామని ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ మేరకు సబ్ కాంట్రాక్టర్లు తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.20 కోట్లుపైనే ఖర్చు చేసినా ఇంతవరకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తమను మోసం చేశారని తెలిపారు. తమ సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. -
పాతిక కోట్లను బాంబులతో పేల్చేశారు!
వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం.. అంతులేని అవినీతి, కుమ్మక్కు రాజకీయాల ఫలితంగా నిర్మించిన ఏడాదికే ఓ ఆనకట్టకు అవినీతి కంతలు పడ్డాయి. దీనికితోడు భారీ వర్షాలకు నీటి ఉద్ధృతి పెరగడంతో డ్యాం కూలిపోయే పరిస్థితి నెలకొంది. చేసేది లేక అధికారులు ఆనకట్టనే పేల్చివేశారు. అలా.. రూ.25 కోట్ల ప్రజాధనం నీళ్లపాలైంది. సాక్షి, చెన్నై(తమిళనాడు): భారీ వ్యయంతో నిర్మించిన ఆనకట్ట ఏడాదిలోపే బలహీన పడిపోయింది. పొంచి ఉన్న ముంపుముప్పు నుంచి గ్రామాలను కాపాడేందుకు దక్షిణ పెన్నానదిపై రూ.25.35 కోట్లతో నిర్మించిన ఆనకట్టను ఆది, సోమవారాల్లో బాంబులతో అధికారులే పేల్చి.. కూల్చేవేశారు. వివరాలు.. విళుపురం జిల్లా దళవానూరు గ్రామం, కడలూరు జిల్లా ఎనదిరిమంగళూరు గ్రామాలకు మధ్య ప్రవహించే దక్షిణ పెన్నానదిపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం రూ.25.35 కోట్లతో ఆనకట్ట నిర్మించింది. వ్యవసాయ ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ ఆనకట్టను గత ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు. అయితే ప్రారంభించిన నాలుగు నెలలకే.. అంటే ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఆనకట్ట క్రస్ట్గేట్లకు దన్నుగా ఇరువైపులా అమర్చిన గోడ పాక్షికంగా తెగిపోయింది. ఫలితంగా నీరు బయటకు ప్రవహించడం ప్రారంభమైంది. ఈ వ్యవహారంలో బాధ్యులుగా భావిస్తూ ప్రజాపనులశాఖలోని ఆరుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. ప్రభుత్వ మార్పుతో.. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు చోటు చేసుకోగా రూ.15 కోట్లతో ఆనకట్టను మరమ్మతు చేయాలని ప్రజాపనులశాఖ అంచనాలు సిద్ధం చేసింది. ఈలోగా భారీ వర్షాలు, వరద ప్రవాహం మొదలవడంతో మరమ్మతు పనులను ప్రారంభించలేక పోయారు. ఇదిలా ఉండగా, విళుపురం జిల్లాలో గత కొన్నిరోజులు కుండపోత వర్షాల వల్ల దక్షిణ పెన్నానదిలో వరద ప్రవాహం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఆనకట్ట పూర్తిగా నిండిపోయి వరదనీరు రెండువైపుల ఒడ్డును తాకడం మొదలైంది. ఇన్ఫ్లో అంతకంతకూ పెరిగింది. ఆనకట్టలోని మూడు క్రస్ట్ గేట్లు బలహీన దశకు చేరుకుని ఏ క్షణమైన బద్దలయ్యే పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆనకట్టలోకి నీటి ప్రవాహాన్ని ఇసుకబస్తాలు వేసి నిలువరించేందుకు ఈనెల 10వ తేదీన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇన్ఫ్లో, ప్రవాహ ఒత్తిడిని తట్టుకోలేక ఆనకట్ట ఎడమవైపు తెగిపోగా ఉధృతంగా ప్రవహించిన నీటిలో స్థానికంగా సాగు చేసిన చెరకు పంట కొట్టుకుపోయింది. పైగా 11వ తేదీన అనకట్ట ప్రహరీగోడ బీటలు వారింది. దీంతో విళుపురం జిల్లా కలెక్టర్ మోహన్, ఎస్పీ శ్రీనాథ ఇతర ఉన్నతాధికారులు ఆదివారం ఉదయం ఆనకట్టను పరిశీలించారు. ఈ సమయంలో సాతనూరు ఆనకట్ట నుంచి సెకనుకు 3,500 ఘనపుటడుగుల నీటిని దక్షిణ పెన్నానదిలోకి విడుదల చేసినట్లు సమాచారం అందింది. ఈ ప్రవాహం వల్ల పెన్నానది ఒడ్డు మరింతగా దెబ్బతిని పరిసర గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తే పెనుముప్పు తప్పదని అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ కారణంగా దెబ్బతిన్న మూడు క్రస్ట్ గేట్లను, దానికి సమీపంలోని ఆనకట్ట ప్రాంతాన్ని 50 అడుగుల మేర బాంబులతో పేల్చి తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. మొదటిసారి తూచ్.. మూడు క్రస్ట్ గేట్లను, తీరంలోని కాంక్రీట్ గోడను వంద జిలెటిన్ స్టిక్స్, వంద తూటాలను 20 చోట్ల అమర్చి ఆదివారం సాయంత్రం 5.50 గంటలకు కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో పేల్చేశారు. పేలుళ్ల ధాటికి ఆనకట్ట శిథిలాలు వంద మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. అయినా ఆశించిన స్థాయిలో ఆనకట్టను తొలగించలేక పోగా, అక్కడక్కడా పగుళ్లు చోటుచేసుకుని మరింత ప్రమాదకరంగా తయారైంది. దక్షిణ పెన్నానదిలో ప్రవాహ ఉధృతి పెరిగినట్లయితే ఆనకట్ట పూర్తిగా కొట్టుకుపోయి ప్రమాదం జరిగే అవకాశం ఏర్పడింది. దీంతో సోమవారం మరోసారి బాంబులు పెట్టి పూర్తిస్థాయిలో పేల్చివేసినట్లు ప్రజాపనులశాఖ అధికారులు వెల్లడించారు. -
సాగర్ను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు
సాక్షి,పెద్దవూర(నల్లగొండ): తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ (గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు) పరిధిలోకి తీసుకువచ్చే చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. అందులో భాగంగా గెజిట్ను అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గాను ఒక్కో రివర్ బోర్డునుంచి ఇద్దరు చొప్పున కేంద్రం నలుగురు చీఫ్ ఇంజనీర్లను నియమించింది. కాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఇంజనీర్లు టీకే శివరాజన్, అనుపం ప్రసాద్ బుధవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ ప్రధాన డ్యాం, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, రేడియల్ క్రస్ట్గేట్లను, గ్యాలరీలను, టెలీమెట్రీలతోపాటు స్పిల్వేను పరిశీలించారు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో, ఔట్ఫ్లో తదితర విషయాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసు కున్నారు. బుధవారం రాత్రి సాగర్ హిల్కాలనీలోని అతిథిగృహంలో బసచేసి గురువారం ఉదయం పుట్టంగండి ప్రాజెక్టును, అక్కడ నుంచి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సందర్శనకు వెళ్లనున్నారు. వీరివెంట సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ ధర్మానాయక్, ఈఈ సత్యనారాయణ, డీఈలు సుదర్శన్రావు, పరమేశ్, శ్రీనివాస్రావు, ఏఈలు సత్యనారాయణ, రవి, కృష్ణయ్య, జైల్సింగ్ ఉన్నారు. టెయిల్ పాండ్ పరిశీలన: నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండంలోని టెయిల్పాండ్ను బుధవారం కేఆర్ఎంబీ ఇంజనీర్లు సందర్శించారు. టెయిల్ పాండ్ డ్యాంను, డ్యాం గేట్లు, పవర్ హౌస్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు -
పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-౩ కాంక్రీట్ డ్యామ్ పూర్తి
-
తక్కళ్లపల్లి డ్యామ్ వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం :వైఎస్ఆర్ జిల్లా
-
తెగిన ఆనకట్ట..23 మంది మృతి!
సాక్షి, ముంబై : గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా చిప్లున్ తాలుకాలోని తెవరీ ఆనకట్ట తెగింది. ఈ దుర్ఘటనలో దాదాపు 23 మంది వరకు చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. తెవరీ ఆనకట్టకు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉండగా, మంగళవారం రాత్రి తెగిందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆనకట్ట కింద ఉన్న ఏడు గ్రామాల్లో వరదలాంటి పరిస్థితి ఏర్పడింది. 12 ఇళ్లు కొట్టుకుపోయాయి. రత్నగిరి అదనపు ఎప్పీ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 11 మృతదేహాలను బయటకు తెచ్చాం. ఆయా గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాం’ అని చెప్పారు. మరణించిన వారి బంధువులకు ప్రభుత్వం రూ. 4 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వరద నీటి ఉధృతికి దెబ్బతిన్న ఇళ్లు ముందే చెప్పినా పట్టించుకోలేదు: ఆనకట్టకు పగుళ్లు ఉన్నట్లు గతేడాది నవంబర్లోనే గుర్తించి జిల్లా అధికారులకు చెప్పి మరమ్మతులు చేయించమన్నామనీ, అయినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తివరే ఆనకట్ట చిప్లున్, దపోలీ తాలూకాల్లో విస్తరించి ఉంది. అయితే ఈ ఆనకట్ట ఏ తాలూకా పరిధిలోకి వస్తుందనే విషయంపై వివాదం ఉండటంతో రెండు తాలూకాల అధికారులూ పట్టించుకోలేదని చనిపోయిన వ్యక్తి బంధువు ఒకరు చెప్పారు. మరో వ్యక్తి మాట్లాడుతూ ‘అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఇలా జరిగింది. నా తల్లిదండ్రులు, భార్య, ఏడాదిన్నర వయసున్న బిడ్డ గల్లంతయ్యారు. నా సోదరుడు తన వాహనం తెచ్చుకోడానికి వెళ్లి తిరిగిరాలేదు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. గల్లంతైన వారి కోసం జాతీయ విపత్తు స్పందన దళం గాలింపు చేపడుతున్నారు. ప్రమాదానికి కారణం ప్రభుత్వమేనని స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆనకట్టకు మరమ్మతులు చేయాల్సిందిగా తాము ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆనకట్ట గోడలకు పగుళ్లు ఉన్నాయని అధికార యంత్రాంగానికి చెప్పామనీ, అయినా వారు ఏ చర్యలూ తీసుకోలేదని ప్రజాప్రతినిధులు నిందించారు. -
40 ఏళ్ళైనా పూర్తి కాని గుండ్లమోటు డ్యాం నిర్మాణం
-
బ్రెజిల్లో ఘోర ప్రమాదం
బ్రసిలియా : ఆగ్నేయ బ్రెజిల్లో భారతకాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెలో హారిజాంటే ప్రాంతంలో మైనింగ్ దిగ్గజం వాలే కంపెనీ వ్యర్థ పదార్థాలను వేరు చేసేందుకు నిర్మించిన ఆనకట్ట కూలిపోయింది. ఈ క్రమంలో భారీ స్థాయిలో బురద వరదలా పొంగి సమీపంలో ఉన్న ఓ భవన సముదాయాన్ని ముంచెత్తింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మంది గాయపడ్డారు. సహాయకచర్యలు చేపట్టిన అధికారులు ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం కూడా ఇటువంటి ఘటనే జరిగింది. మినాస్ గెరాయిస్లోనే ఓ పట్టణంలో డ్యామ్ కూలిన ఘటనలో 19 మంది మృతి చెందారు. -
తాజా మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
కరీంనగర్ : తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు షాకయ్యే పరిస్థితి తలెత్తింది. కరీంనగర్ మానేరు డ్యామ్లో వాటర్ స్కూటర్ దిగుతుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. కొత్తగా వచ్చిన స్పీడ్బోటులో ప్రయాణించి తిరిగి ఒడ్డుకు చేరుకున్న అనంతరం బోటు నుంచి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా పట్టుజారి ఆయన నీటిలో పడిపోయారు. అయితే లైఫ్జాకెట్ వేసుకోవడంతోపాటూ, అక్కడ పెద్దగా లోతులేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా కమలాకర్ స్పీడ్ బోటు ప్రారంభోత్సవానికి కాకుండా, దాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా సదర్మఠ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా మేడంపల్లి గ్రామ పరిధిలోని సదర్మఠ్ ఆనకట్ట, కామారెడ్డి జిల్లాలోని పెద్ద చెరువును ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) గుర్తించింది. ఆగస్టు 30న కెనడాలో జరిగిన ఐసీఐడీ 69వ వార్షిక సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ మేరకు ఈ నెల 9న కేంద్ర జల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. 4.12 టీఎంసీల సామర్థ్యమున్న సదర్మఠ్ ఆనకట్టను 1891–92 ఏడాదిలో నిర్మించారు. ఈ ప్రాజెక్టును ఫ్రెంచ్ ఇంజనీర్ జేజే ఓట్లీ డిజైన్ చేశారు. దీనికింద 13,100 ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, దీన్ని 7.76 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. రాష్ట్రంలో అత్యంత పురాతన కట్టడం కావడంతో దీన్ని వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసిన ప్రతిపాదనకు ఐసీఐడీ ఆమోదం తెలిపింది. ఇక కామారెడ్డిలోని పెద్ద చెరువును 1897లో నిర్మించారు. దీని కింద 858 ఎకరాలు సాగవుతోంది. ఇటీవలే మిషన్ కాకతీయలో భాగంగా రూ.8.96 కోట్లతో దీన్ని మినీ ట్యాంక్బండ్గా మార్చారు. దీన్ని సైతం వారసత్వ కట్టడంగా గుర్తించాలని ప్రతిపాదించగా.. గ్రీన్సిగ్నల్ దక్కింది. వారసత్వ కట్టడాలుగా సదర్మఠ్, పెద్ద చెరువును ప్రకటించడంపై మంత్రి హరీశ్రావు, ఈఎన్సీ నాగేందర్రావు హర్షం వ్యక్తం చేశారు. వారసత్వ కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీశ్రావు పేర్కొన్నారు. -
వరదలతో విలవిలలాడుతున్న కెన్యా
-
వాణీవిలాస్..చూస్తే దిల్ఖుష్
అనంతపురం , మడకశిర : పిల్లలూ...వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారా.. ఆ సెలవుల్లో పర్యాటక ప్రాంతానికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మడకశిర నియోజకవర్గ సరిహద్దుకు ఆనుకుని ఉన్న వాణీవిలాస్ జలాశయం(మారికణివె డ్యాం)ను కూడా మీ ప్లాన్లో చేర్చుకోండి. ఎందుకంటే ఈ డ్యాంకు ఈ డ్యాంకు 112 ఏళ్ల చరిత్ర ఉంది. చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలూకా వాణీవిలాస్పురంలో రెండు కొండల మధ్య ఈ డ్యాంను నిర్మించారు. చునిలాల్తారాచంద్ దలాల్ ఈ డ్యాం నిర్మాణానికి డిజైన్ చేశారు. 1898లో ఈ డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించి 1907లో పూర్తి చేశారు. ఈ డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 135 అడుగులు. హిరియూరు, హొసదుర్గ తదితర తాలూకాలకు ఈ డ్యాం ద్వారా సాగునీరు వెళ్తుంది. ఈ డ్యాం కింద ఏటా వేలాది ఎకరాల భూములు సాగులోకి వస్తున్నాయి. డ్యాం కింది భాగాన మారెమ్మ దేవస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలో రోజూ పూజలు జరుగుతాయి. భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. కర్ణాటక ప్రభుత్వం ఈ డ్యాం సమీపంలో అత్యద్భుతమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. డ్యాంకు వచ్చే సందర్శకులంతా ఈ ఉద్యానవనంలో సేదదీరుతుంటారు. వేసవిలోనూ నీటి ప్రవాహం.. మండు వేసవిలోనూ చల్లని వాతావరణం ఉండడంతో ఈ డ్యాంకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఏపీలోని సరిహద్దు ప్రాంతాల వారితో పాటు బెంగళూరు, బళ్లారి, మైసూరు, తుమకూరు తదితర ప్రాంతాల సందర్శకులు ఈ డ్యాంను తిలకించడానికి ఎక్కువగా వస్తుంటారు. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన ఈ జలాశయం వద్ద ఎన్నో సినిమాలను చిత్రీకరించారు. ఎలా వెళ్లాలంటే.. ఈ డ్యాం చిత్రదుర్గ జిల్లా హిరియూర్కు 20 కి.మీ దూరంలో ఉంది. మడకశిరకు 100 కి.మీ దూరంలో ఉంటుంది. మడకశిర నుంచి అమరాపురం మీదుగా హిరియూర్కు చేరుకుంటే అక్కడి నుండి బస్సు సౌకర్యం ఉంది. హిరియూర్ నుంచి హొసదుర్గకు రోడ్డు మార్గాన వెళ్లాలి. అనంతపురం నుంచి కల్యాణదుర్గం, చెళ్ళకెర, హిరియూర్ మీదుగా కూడా ఈ డ్యాంకు చేరుకోవచ్చు. బస చేయడానికి గెస్ట్హౌస్ సౌకర్యం కూడా ఉంది. -
అడియాశలేనా!
ములకలపల్లి : మండలంలోని మాధారం గ్రామ శివారులోని పాములేరు వాగుపై 200 ఎకరాలకు సాగునీరించే లక్ష్యంతో చేపట్టిన చెక్డ్యాం నిర్మాణం శిలాఫలకానికే పరిమితమైంది. సుమారు పన్నెండేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘నీరు మీరు’పథకంలో దీనిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ముప్పై లక్షల రూపాయల వ్యయంతో ఈచెక్డ్యాం నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. ఆయకట్టు కమిటీ ఆధ్వర్యంలో సుమారు 12 లక్షల రూపాయల ఖర్చు చేసి పునాది దశ వరకూ నిర్మించారు కూడా. ఈతర్వాత ఈనిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయంది. దీని పునాది నిర్మాణం కోసం ఖర్చు చేసిన 12 లక్షల రూపాయలు వృథాగా నీటిపాలయ్యాయి. ఈలోగా ప్రభుత్వం మారడంతో నిర్మాణం ఊసేలేకుండా పోయింది. చెక్డ్యాం నిర్మాణంతో తమ పంట పొలాలు సస్యశ్యామల మవుతాయని ఆశించిన రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలోనేనా పాలకపక్షాలు నిధులు మంజూరు చేసి చెక్డ్యాం నిర్మాణాన్ని పూర్తిచేయాలని, లేదా నూతనంగా మరో డిజైన్ రూపొందించి చెక్డ్యాం నిర్మాణం జరిగేలా చూడాలని ఆయకట్టు రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. -
సాగర్ డ్యాంకు గులాబీ రంగు
అభ్యంతరం తెలిపిన ఏపీ వాసులు నాగార్జునసాగర్: రెండు రాష్ట్రాల మధ్య గులాబీ చిచ్చు రగిలింది. ఆంధ్రా–తెలం గాణ రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులతో ఆధునికీకరణలో భాగంగా రంగులు వేస్తున్నారు. డ్యాంపై రోడ్డుకు ఇరువైపులా గోడలకు గులాబీ రంగు వేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రంగు గులాబీ కావడంతో డ్యాం అవతల వైపునఉన్న ఆంధ్రా వాసులు శుక్రవారం డ్యాం మీదకు వచ్చి రంగులు వేసిన గోడలను పరిశీలించారు. సాగర్కు గులాబీ రంగు వేయడం ఏమిటని నిలదీ శారు. పాత రంగునే వేయాలని తెలంగాణ ఇంజనీర్లతో గొడవకు దిగారు. ఈ విష యమై సాగర్ డ్యాం సీఈ సునీల్ను వివ రణ కోరగా.. ఇది చర్చనీయాంశమే కాదని, రంగు నాణ్యమైనదా కాదా అని చూడాలి తప్ప.. ప్రాజెక్టుకు వేసే రంగు ఏదైతే ఏముందన్నారు. మొదట తెల్లరంగు, తర్వాత ఈ రంగు వేశామని.. పైన కింద బార్డర్ డార్క్ బ్లూ వస్తుందని తెలిపారు. -
డ్యామ్ల పటిష్టతపై దృష్టి పెట్టండి
అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశాలు ► డ్యామ్ల పనితీరుపై నిరంతరం సమీక్షించాలి ► భద్రతకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలి ► అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల డ్యామ్ల పటిష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికా రులను ఆదేశించారు. డ్యామ్ గేట్లు, వాటి పని తీరు, ఇతర అంశాలపై నిరంతరం తనిఖీ చేస్తూ, సమీక్షించాలని సూచించారు. మంగళవారం ’వాలంతరి’ సంస్థలో జరిగిన డ్యామ్ సేఫ్టీ సదస్సులో మంత్రి హరీశ్ ప్రసంగించారు. డ్యాముల ఆపరేషన్ వ్యవహారాల్లో తగు పరి జ్ఞానం అవసరమని, ప్రతి డ్యామ్ దగ్గర లైన్ డయాగ్రం ఉండాలని ఇంజనీర్లకు సూచిం చారు. 2009 వరదలప్పుడు ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రతిభ చూపి డ్యాములను రక్షించారని, అలాంటి అనుభవాలను ఆచరించాలన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, జూరాల వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల డ్యామ్ భద్రతా వ్యవహారాల బాధ్యతలను ఎస్ఈలు మీడియం, మైనర్ ప్రాజెక్టు వ్యవహారాలను ఈఈలు చూడాలని ఆదేశించారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి: వర్షాకాలానికి ముందు, వర్షాకాలం అనంతరం చేపట్టవలసిన చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని అమలు చేయాలని హరీశ్ సూచించారు. ప్లాన్ అమలుకు నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం 10 మేజర్, 39 మీడియం, 132 మైనర్ డ్యామ్లు రాష్ట్రంలో ఉన్నాయని, డ్యామ్ల అభివృద్ధి కోసం కేంద్రం డీఆర్ఐపీని ప్రకటించిందని వెల్లడించారు. డ్యాముల పటిష్టతకు చర్యలు చేపట్టేందుకు అంచనాలను సిద్ధం చేసి పంపాలని రాష్ట్రాలను కేంద్రం కోరిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇందుకుగానూ ఈఎన్సీ, ’కాడా’ కమిషనర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ, ఇరిగేషన్ ప్రాజెక్టుల సీఈలు సమన్వయంతో అంచనాలు తయారు చేయాలని చెప్పారు. డ్యామ్ల రక్షణ కోసం అంతర్జాతీయ అనుభవాలు అనుసరించాలని, గేట్లు, గ్రీసింగ్ పనులను, మరమ్మతులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ప్రమాదాలు రాకముందే వాటిని నిరోధించడానికి చర్యలవసరమని, ఇందుకు రిటైర్డు అధికారుల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. 39 ప్రాజెక్టులకు ‘క్యాడ్వాం’ నిధులు రాష్ట్రంలోని 39 సాగునీటి ప్రాజెక్టు లకు క్యాడ్వాం కింద కేంద్రం నిధులు ఇవ్వ నుంది. ఏఐ బీపీ పరిధిలోని 11 ఆన్ గోయింగ్ ప్రాజె క్టులకు క్యాడ్వాం కింద రూ.1,928 కోట్లు మంజూరయ్యాయని, అందులో నిబంధ నల ప్రకారం వివిధ కాంపోనెంట్ల కింద కేంద్రం 50% భరించనుందని, ఆ నిధుల మొదటి ఇన్స్టాల్మెంట్ కోసం ప్రతిపాద నలు తయారు చేసి పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఇక ఇదివరకే పూర్తయిన ప్రాజెక్టుల్లో 28 ప్రాజెక్టులు క్వాడ్వాం నిధులు విడుదలయ్యే జాబితా లోకి చేరాయని, ఈ జాబితాలో ఉన్న ప్రాజెక్టుల్లో చేపట్టనున్న పనులకు సంబంధించిన డీపీఆర్లను వెంటనే కేంద్రానికి పంపించాలని సూచించారు. మిడ్మానేరు పనులు వేగిరం చేయండి ► అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల రాజన్న జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశిం చారు. మంగళవారం మిడ్మానేరు తదితర ప్రాజెక్టుల పురోగతిని ’వాలంతరి’లో సమీ క్షించారు. మిడ్మానేరుకు చెందిన ఆర్ అండ్ ఆర్ సమస్యలని వెంటనే పరిష్కరిం చాలని సమావేశంలో పాల్గొన్న జిల్లా కలె క్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారు లను ఆదేశించారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, ఇతర అంశాలను గ్రామాల వారీ గా మంత్రి సమీక్షించారు. అలాగే ఆర్ అండ్ ఆర్ కాలనీలలో మౌలిక సదుపాయా ల కల్పనకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు పనులను సత్వరం చేయాలన్నారు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని, జయ శంకర్ భూపాలపల్లి జిల్లా పాలెం వాగు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. -
సరిహద్దులో డ్యాం రచ్చ
– నాలుగు గంటలు హైవే దిగ్బంధం, రైల్ రోకోలు చెన్నై : కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగు గంటలపాటు జాతీయ రహదారిని నిరసనకారులు దిగ్బంధం చేశారు. రైల్ రోకోలకు దిగారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని కేరళ వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తోపులాట, వాగ్వివాదాల నడుమ డీఎంకేతోపాటు పలు పార్టీల, సంఘాల నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. భవాని నదిపై డ్యాం కట్టేందుకు కేరళ చేస్తున్న ప్రయత్నాలు పశ్చిమ తమిళనాడులోని మూడు జిల్లాల్లో ఆక్రోశాన్ని రగిల్చింది.ఈ జలాశయంలోకి నీటి రాక కరవైన పక్షంలో కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్తోపాటు కరూర్ జిల్లాల్లో తాగు, సాగు నీటి కష్టాలు తప్పవన్న ఆందోళన బయలుదేరింది. కేరళ చర్యల్ని నిరసిస్తూ ఆదివారం డీఎంకే, కాంగ్రెస్, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్, మనిద నేయ మక్కల్ కట్చి, కొంగు మక్కల్ కట్చిలతోపాటు 40 పార్టీలు, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు సరిహద్దుల్లో ఉద్రిక్తతకు దారితీసింది. డీఎంకే మాజీ మంత్రులు సుబ్బలక్ష్మి జగదీశన్, పొంగలురు పళని స్వామి, వెల్ల కోవిల్ స్వామినాథన్, ఎంఎంకే నేత జవహరుల్లా, కొంగు మక్కల్ కట్చి నేత ఈశ్వర్లతో పాటు వేలాదిగా నాయకులు, కార్యకర్తలు కేరళ సరిహద్దులో కోయంబత్తూరు– పాలక్కాడు జాతీయ రహదారిని దిగ్బంధించారు. అక్కడి టోల్గేట్ వద్ద నాలుగు గంటల పాటు రహదారిని దిగ్బంధించడంతో పోలీసులు నిరసనకారుల్ని రెండుగా విడదీసి ఓ వైపు ఉన్న వాళ్లు మరో వైపు రాకుండా అడ్డుకున్నారు. దీంతో మరో వైపు ఉన్న వాళ్లు ఆగ్రహించి కేరళ వైపు పరుగులు తీశారు. వాగ్వాదాలు, తోపులాటల మధ్య నాయకుల్ని అరెస్టు చేశారు. కేరళ చర్యలకు నిరసనగా కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్లలో సీపీఐ నేతృత్వంలో రైల్ రోకోలు సాగాయి. కోయంబత్తూరు ఉత్తర స్టేషన్లో ఓ రైలును ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ నేతృత్వంలో కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈరోడ్లో మాజీ కార్యదర్శి టీ పాండియన్ నేతృత్వంలో నిరసన సాగగా ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. -
శ్రీశైల జలాశయంలో 87 టీఎంసీల నీరు
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంత్రానికి 87.0433 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తుండడంతో నీటినిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 0.197 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి సాగర్కు 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 3,300 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 490 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయనీటిమట్టం 853.10 అడుగులుగా నమోదైంది. -
శ్రీశైలంలో 97.6 టీఎంసీల నీరు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయంలో మంగళవారం సాయంత్రం సమయానికి 97.6076 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన జరుగుతుండడంతో నీటినిల్వలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. డిమాండ్ను బట్టి రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సోమవారం నుంచి మంగళవారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.320 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.529 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 9,444 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 1,000 క్యూసెక్కులు, హంద్రీనివా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 420 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయ నీటిమమట్టం 857.10 అడుగులుగా నమోదైంది. -
గోదావరిపై మరో ఆనకట్ట
నిర్మల్(మామడ) : గోదావరి నదిపై మరో ఆనకట్టను నిర్మాణం కానుంది. మామడ మండలంలోని పొన్కల్ సమీపంలో గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ.516 కోట్ల నిధులతో బ్యారేజీ నిర్మాణ పనులు గోదావరి నదిపై శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నిర్మాణం కాగా మరికొన్ని ప్రాజెక్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. పొన్కల్ వద్ద గోదావరిపై బ్యారేజీ నిర్మాణం కోసం 2008లో సర్వే నిర్వహించి, నిర్మాణానికి రూ.500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఖానాపూర్ పట్టణంలో శిలాçఫలానికి శంకుస్థాపన చేశారు. తదనంతరం పరిణామాల కారణంగా బ్యారేజీ నిర్మాణం వాయిదా పడింది. మళీర్ల గతేడాది అధికారులు బ్యారేజీ నిర్మాణం కోసం సర్వే నిర్వహించి నిర్మాణ వ్యయం రూ.516 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ని««దlులను మంజూరు చేసింది. 15 వేల ఎకరాలకు సాగునీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 కిలోమీటర్ల దిగువన, సదర్మాట్ ప్రాజెక్టుకు 7 కిలోమీటర్ల ఎగువన ఈ బ్యారేజీని నిర్మించనున్నారు. పొడవు 1,250 మీటర్లు ఉండగా, బ్యారేజీలో 150 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. బ్యారేజీకి 56 గేట్లను అమర్చనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో మామడ మండలంలోని పొన్కల్, ఆదర్శనగర్, కమల్కోట్ గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ భూములు 1200 ఎకరాలు, జగిత్యాల జిల్లాలోని మూలరాంపూర్ గ్రామ రైతుల వ్యవసాయ భూములు 400 ఎకరాల ముంపునకు గురవుతున్నాయని అధికారులు సర్వేలో సూచించారు. కడెం, ఖానాపూర్ మండలంలోని 15 వేల ఎకరాల భూమి సాగులకు రానుంది. నష్టపరిహారం అందాలి బ్యారేజీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.8.50 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు అందించేందుకు అధికారులు గ్రామసభలను నిర్వహించి భూముల ధరలను నిర్ణయించి నివేదికలు పంపించారు. నష్టపరిహారం అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. బ్యారేజీ నిర్మాణం అనంతరం దాని నుంచి ఎత్తిపోతల ద్వారా చెరువులకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఈ బ్యారేజీ నిర్మాణంతో ఇక్కడి ప్రాంత రైతులకు భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నారు. చేపల పెంపకానికి అనుకూలంగా ఉపాధి లభిస్తుందని మత్స్యకారులు భావిస్తున్నారు. పట్టాలు అందించాలి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో మా భూములను కోల్పాయాం. పునరావాసంగా ఆదర్శనగర్లో భూములను చూపించారు. భూములను బాగు చేసుకుని వ్యవసాయం చేస్తున్నాం. ప్రస్తుతం సదర్మాట్ మినీ బ్యారేజీ నిర్మాణంలోనూ మా భూములు ముంపునకు గురవుతున్నాయి. చాలా మంది రైతులకు డి1 పట్టాలు మాత్రమే ఉన్నాయి. సెత్వార్ అందించి సమస్యను పరిష్కరించాలి. – గంగారెడ్డి, రైతు, ఆదర్శనగర్ ఎత్తిపోతల నీరందించాలి సదర్మాట్ బ్యారేజీ అనంతరం ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలి. ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులకు నీటిని అందిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. బ్యారేజీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలి. – రమేశ్, రైతు, పొన్కల్ -
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 859.60 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం డ్యాం నీటిమట్టం సోమవారం 859.60 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 104.6466 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఆదివారం నుంచి సోమవారం వరకు 0.553 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.807 మిలియన్ యూనిట్లు విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 4,446 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుత్ డిమాండ్ను అనుసరించి రెండు పవర్హౌస్లలో ఉత్పత్తి చేస్తుండగా, సోమవారం సాయంత్రం 6 గంటలకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో రెండు జనరేటర్లు ఒక్కొక్కటి 106.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. -
నాగార్జున సాగర్.. ఒక అరుదైన ముచ్చట
నాగార్జున సాగర్.. ఇది ఒక ఆధునిక దేవాలయం. దాదాపు పన్నేండేళ్ల శ్రమకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా భాగం హరితవనంగా మారడానికి ఈ ఆనకట్టే కారణం. నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణా నదిపై నాగార్జున సాగర్ నిర్మించారు. ఇది దేశంలోనే అతి పెద్ద రాతికట్టడం. 1955-1967కాలంలో దీన్ని నిర్మించారు. దాదాపు 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉన్న ఈ జలాశయం 490 అడుగుల ఎత్తు కలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల వెడల్పు కలిగి 45 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇంత పెద్ద రాతి ఆనకట్ట నిర్మాణంలో యంత్రాలకంటే మనుషులే అమితంగా సేవలు అందించారు. పెద్దపెద్ద బండరాళ్లను, ఇనుప సామాన్లను కావిడ్లు వేసుకొని తమ భుజాలపై అంత ఎత్తుకు ఎక్కారు. ఒక చేత్తో కర్ర పొడుచుకుంటూ మరో చేత్తో భుజాలపై త్రాసులాగా తగిలించిన కావిడ్లపై పెద్ద పెద్ద బండరాళ్ల వేసుకొని ఆన కట్ట నిర్మాణానికి అందించారు. పదుల అంతస్తుల్లో నిర్మించిన పరంజీలు ఎక్కి మరీ ఈ సాహసం చేశారు. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చిన్నచిన్న పిల్లలు కూడా ఈ ఆనకట్ట నిర్మాణంలో భాగస్వాములయ్యారు. తమ నెత్తిన సిమెంటు ఇసుకను, బండరాళ్లను కాళ్లకు చెప్పులు కూడా ధరించకుండా మిక్కిలి సంతోషంతో అందించారు. ఆనాటి పరిస్థితుల ప్రకారం తమ పొట్ట నింపుకునేందుకు అంతపెద్ద కష్టం చేసి ఉంటారేమోకానీ, వాస్తవానికి తాము చేస్తోంది ఒక చరిత్రోపకారం అనే విషయం ఆ అమాయక చిన్నారులకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ వయసులోనే అంతపెద్ద బరువులు మోసిన వారితో పోలిస్తే నేటి చిన్నారుల బలం బలాదురూ అవుతుందేమో..! -
శ్రీశైలం డ్యాం తనిఖీ
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల నీలం సంజీవరెడ్డిసాగర్ డ్యాంను నిపుణుల కమిటీ గురువారం తనిఖీ చేసింది. డ్యాం పటిష్టత, గేట్ల ఆపరేషన్, గ్యాలరీ నిర్వహణ, ప్లంజ్ఫుల్, స్టాఫ్లాక్, ఎలిమెంట్లను పరిశీలించింది. వార్షిక మరమ్మతు పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో వరదలు వచ్చినప్పటికి కూడా శ్రీశైలం డ్యాంకు ఎటువంటి ముప్పు లేదని, పటిష్టమైన కాంక్రీట్ తదితర పనులు ఇంకా చేయాల్సి ఉందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. కమిటీలో అడ్వైజర్ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ అబ్దుల్ బషీర్, రిటైర్డు ఎస్ఈ సత్యనారాయణ, పరిశీలనాధికారి కృష్ణారావు, ఎస్ఈ మల్లికార్జునరెడ్డి, క్వాలీటీ కంట్రోల్ డీఈ శంకరరెడ్డి, నీటిపారుదలశాఖ ఈఈలు మాణిక్యాలరావు, వరహాలరావు, డీఈఈలు గన్యానాయక్, సేనానంద్ ఉన్నారు. -
శ్రీశైలంలో తగ్గుతున్న నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం క్రమేపీ తగ్గుతోంది. వస్తున్న ఇన్ఫ్లో తక్కువగా ఉండడం, దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న నీటి పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 48వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా, జలాశయం నుంచి 56,268 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదన చేస్తూ 45,043 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 9,200 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 202.5056 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.60 అడుగులకు చేరుకుంది. -
శ్రీశైలానికి పెరిగిన వరద
· మరో మూడు రోజుల్లో డ్యాం నిండే అవకాశం · ఎగువ ప్రాంతాల నుంచి 17 టీఎంసీల నీరు విడుదల శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 1,95,568 క్యూసెక్కుల నీరు విడుదలైంది. సోమవారం సాయంత్రానికి 17 టీఎంసీల నీరు శ్రీశైలాన్ని చేరుకోనుంది. ఇప్పటికే డ్యాం నీటిమట్టం 879.50 అడుగులకు చేరుకుంది. సోమవారానికి డ్యాంలో గరిష్టస్థాయి నీటినిల్వలు 200 టీఎంసీలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం జలాశయంలో 215.65 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. మరో 30 టీఎంసీలు వచ్చి చేరితే పూర్తిస్థాయి 885 అడుగులకు చేరుకుంటుంది. వస్తున్న ఇన్ఫ్లోను దృష్టిలో ఉంచుకుని మరో మూడు రోజుల్లో డ్యాం గేట్లను తెరచి దిగువ నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ ఇంజనీర్లు సన్నద్ధమవుతున్నారు. శ్రీశైలానికి ఇన్ఫ్లో పెరుగుతుండడంతో రెండు పవర్హౌస్లో విద్యుత్ ఉత్పాదనను పూర్తిస్థాయిలో చేపడుతున్నారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఏడు జనరేటర్లు, భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఐదు జనరేటర్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,541 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 500 క్యూసెక్కులు, హంద్రీనివా సుజల స్రవంతికి 1680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 10.40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
శ్రీశైలం డ్యాంను సందర్శించిన ఎస్ఈ
శ్రీశైలం ప్రాజెక్టు: జలాశయంలో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో జలవనరుల శాఖ ఎస్ఈ మల్లికార్జునరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం డ్యాంను సందర్శించారు. గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తే అప్రమత్తంగా ఉండాలని ఇంజినీర్లకు సూచించారు. వస్తున్న వరదనీరు, దిగువ ప్రాంతాలకు విడుదలవుతున్న నీటి వివరాలు పక్కాగా ఉండాలని గేజింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఆయనతోపాటు డిప్యూటీ ఎస్ఈ బాబూరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాణిక్యాలరావు, డీఈ సేనానంద్ ఉన్నారు. -
శ్రీశైలం జలాశయానికి వరద జలాలు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయానికి బుధవారం నుంచి గురువారం వరకు ఒక టీఎంసీ జలాలు వచ్చి చేరాయి. సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగా, ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి వరద నీరు విడుదల అవుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం సమయానికి జూరాల నుంచి 40వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి విడుదలవుతోంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,680 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. డిమాండ్ను బట్టి గురువారం భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో పీక్లోడ్ అవర్స్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంపరిసర ప్రాంతాల్లో 25.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 160.5282 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 874.30 అడుగులుగా నమోదైంది. -
శ్రీశైలం జలాశయానికి వరద జలాలు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయానికి బుధవారం నుంచి గురువారం వరకు ఒక టీఎంసీ జలాలు వచ్చి చేరాయి. సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగా, ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి వరద నీరు విడుదల అవుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం సమయానికి జూరాల నుంచి 40వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి విడుదలవుతోంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,680 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. డిమాండ్ను బట్టి గురువారం భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో పీక్లోడ్ అవర్స్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంపరిసర ప్రాంతాల్లో 25.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 160.5282 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 874.30 అడుగులుగా నమోదైంది. -
శ్రీశైలం జలాశయంలోకి 1.5 టీఎంసీల నీరు చేరిక
-
ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలి
హన్మకొండ : గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోరారు. సోమవారం వారు న్యూ ఢిల్లీలో మంత్రి ఉమా భారతినికి కలిసి వినతి పత్రం అందజేశారు. ఇచ్చంపల్లి వద్ద అనకట్ట నిర్మిస్తే వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగు నీరు అందుతుందని మంత్రికి వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ నాయకులు వెన్నంపల్లి పాపయ్య, మధు పాల్గొన్నారు. -
శ్రీశైలం జలాశయంలోకి 1.5 టీఎంసీల నీరు చేరిక
శ్రీశైలం ప్రాజెక్టు: కష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం సాయంత్రం వరకు జలాశయంలోకి 1.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 159.0010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రోజా నుంచి వచ్చే వరద జలాలు నిలిచిపోగా, జూరాల నుంచి 16వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదలవుతుంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం 874 అడుగులకు చేరుకుంది. -
శ్రీశైలం డ్యాం వద్ద చిరుత సంచారం
-
శ్రీశైలం డ్యాం వద్ద చిరుత సంచారం
· భయాందోళనలో సిబ్బంది శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం వద్ద శనివారం రాత్రి 8గంటల సమయంలో చిరుత సంచరించడంతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. డ్యాం ప్రధాన ద్వారాలలోని రెండో గేటు రోడ్డుపై చిరుత సంచరిస్తూ నిద్రకు ఉపక్రమించింది. తెలంగాణా సరిహద్దుకు ఆనుకుని ఉన్న రెండో గేటు వద్ద చిరుత సంచరించడంతో ఎస్పీఎఫ్ పోలీసులు, డ్యాం సిబ్బంది గేటును మూసివేశారు. అక్కడే కొద్దిసేపు సంచరించిన చిరుత గోడపై పడుకుని విశ్రాంతి తీసుకుంది. గతంలో శ్రీశైలం డ్యాంపైన వాహనాల రాకపోకలు జరిగేవి. దాదాపు మూడేళ్ల నుంచి అడ్డుగోడను నిర్మించి రాకపోకలను నిషేధించడంతో ఆ ప్రాంతంలో జనసంచారం తగ్గింది. దీంతో వన్యప్రాణులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. తాజాగా చిరుత సంచరించడంతో అక్కడ ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఏ సమయంలోనైనా నడక మార్గంలో డ్యాంకు చేరుకునే అవకాశాలు కూడా ఉండడంతో అటవీశాఖ అధికారులకు, ఎస్పీఎఫ్ అధికారి రామిరెడ్డికి సమాచారం చేరవేశారు. చిరుతను అడవుల్లోకి పంపేందుకు అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. -
టీబీ డ్యాం నుంచి నీటి విడుదల బంద్
– ఇండెంట్ గడువుకు ముందే నిలుపుదల – హంద్రీనీవా నుంచి మళ్లింపునకు అనుమతించని సర్కారు – కేసీ ఆయకట్టు రైతుల ఆందోళన కర్నూలు సిటీ: మూడు రోజులు ముందుగానే తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల శనివారం నిలిచిపోయింది. కేసీ ఆయకట్టును కాపాడేందుకు డ్యాం నుంచి గత నెల 29న నీటి విడుదల ప్రారంభించారు. 3వేల క్యుసెక్కుల చొప్పున 5 రోజులు, 1500 క్యుసెక్కుల చొప్పున 10 రోజులపాటువిడుదల చేయాలని టీబి బోర్డుకు జల వనరుల శాఖ ఇంజినీర్లు ఇండెంట్ పెట్టారు. డ్యాం నుంచి విడుదల చేసిన నీరు ఈ నెల 3న సుంకేసుల బ్యారేజీకి చేరుకుంది. కాల్వ ద్వారా డ్యాం నుంచి 120 కి.మీ. వరకు కూడా చేరకముందే నీరు బంద్ కావడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఈ నెల 13 వరకు డ్యాం నుంచి నీరు రావాల్సి ఉన్నా ఎలాంటి సమాచారం లేకుండానే బోర్డు అధికారులు నీటిని బంద్ చేశారు. ఈ కారణంగా కేసీకి మరో మూడ, నాలుగు రోజుల్లో నీటిని బంద్ చేసే అవకాశం ఉన్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. ఆదిలోనే అడ్డంకులు.. కేసీ ఆయకట్టుకు సాగునీరు అందించడం కోసం హంద్రీనీవా మొదటి లిఫ్ట్ మల్యాల నుంచి ప్రత్యామ్నాయంగా నీటి మళ్లించేందుకు రెండు పైపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిపాదన 2013 నుంచి పెండింగ్లోనే ఉంది. అయితే ఇటీవల దీని కోసం రైతులు డిమాండ్ చేయడంతో పనులు మొదలు పెట్టి పూర్తి చేసే దశకు చేరుకున్నారు. ఒక పంపు పనులు పూర్తి చేసి రెండు రోజుల క్రితమే ట్రయల్ రన్ చేశారు. మరో పైపు పనులు రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే నీటి మళ్లింపునకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ట్రయల్రన్ చేసిన వెంటనే బంద్ చేసినట్లు తెలిసింది. కేసీకి నీరు మరో నాలుగు రోజులే.. టీబీ డ్యాం నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే నీటి విడుదల నిలిపేశారు. అయితే పై నుంచి వస్తున్న నీరు కేసీకి మరో నాలుగు రోజులు సరిపోతుంది. హంద్రీనీవా నుంచి నీరు మళ్లించేందుకు ప్రస్తుతం ఒక పైపు పనులు పూర్తయ్యాయి. అవసరం మేరకు హంద్రీనీవా నీరు వాడుకుంటాం. అనుమతుల విషయం తెలియదు. – ఎస్.చంద్రశేఖర్రావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ -
శ్రీశైలానికి 8వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహకప్రాంతమైన జూరాల నుంచి 8వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. రెండు పవర్హౌస్లలో శనివారం విద్యుదుత్పత్తి జరగలేదు. జలాశయం నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 4,500 క్యూసెక్కుల ప్రకారం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 871.90 అడుగుల వద్ద 149.7760 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
శ్రీశైలం డ్యాం నీటి మట్టం 874.10 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 874.10 అడుగులకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 2.7 టీఎంసీల నీరు విడుదల కావడంతో నీటిమట్టం 6 పాయింట్లకు పడిపోయింది. 162.0554 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం గురువారం సాయంత్రానికి 159.3828 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ పరీవాహకప్రాంతమైన జూరాల నుంచి 16వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు సుమారు 40వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. రెండు పవర్హౌస్లలో డిమాండ్ను బట్టి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. సగటున విద్యుదుత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 25వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 14,200 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
శ్రీశైల జలశయానికి 25 టీఎంసీల నీటి చేరిక
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలానికి వరద ఉధతి ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు 25.0078 టీఎంసీల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది. 24 గంటల్లోనే 14.70 అడుగులు నీటిమట్టం పెరిగింది. జూరాల ప్రాజెక్టు నుంచి మధ్యాహ్నం 3గంటల సమయానికి 2.12 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన అనంతరం దిగువ నాగార్జునసాగర్కు 5,106 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, హంద్రీనీవా సుజలస్రవంతికి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 81.0918 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 850.50 అడుగులకు చేరుకుంది. -
శ్రీశైలం డ్యాంకు పెరిగిన వరద ఉధృతి
-
శ్రీశైలం డ్యాంకు పెరిగిన వరద ఉధృతి
శ్రీశైలం ప్రాజెక్టు: నదీ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైల జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదలవుతోంది. శుక్రవారం సాయంత్రం సమయానికి 42,316 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరింది. వరద ఉధతి జూరాలకు భారీగా పెరగడంతో 2,59,070 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి వరద పోటెత్తడంతో శుక్రవారం మధ్యాహ్నం హంద్రీ నీవా సుజలస్రవంతికి 350 క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభించారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో డిమాండ్ను అనుసరించి పీక్లోడ్ అవర్స్లో సగటున 12వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 56.0840 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 835.80 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. -
శ్రీశైలం డ్యామ్కు వరద నీరు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యామ్కు ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 32వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. విద్యుత్ డిమాండ్ను అనుసరించి తెలంగాణా, ఆంధ్రప్రాంతంలోని జల విద్యుత్ కేంద్రాలు ఉత్పాదన చేస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు జనరేటర్లు విద్యుత్ ఉత్పత్తి చేశాయి. భూగర్భజలవిద్యుత్ కేంద్రంలో ఒక జనరేటర్ 150 మెగావాట్ల సామర్థ్యంలో ఉత్పాదన చేస్తున్నాయి. సగటున 15 వేల క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్లో 45.6830 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. -
సోమశిలకు 3,472 క్యూసెక్కుల ఇన్ఫ్లో
సోమశిల : రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల జలాశయానికి సోమవారం ఉదయం కల్లా 3,472 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమశిలకు పైతట్టు ప్రాంతాలైన పెన్నా నది ప్రధాన హెడ్ రెగ్యులేటర్ ఉన్నæ వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద 700 క్యూసెక్కుల వంతున వరద ప్రహిస్తోంది. చెన్నూరు వద్ద 1,100 క్యూసెక్కుల వరద నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 11.069 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నారు డెల్టాకు 2వేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 84.32 మీటర్లు, 276.64 అడుగుల మట్టం నమోదైంది. సగటున 55 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. -
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 816.60 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయ నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 816.60 అడుగులకు చేరుకుంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల, రోజా, హంద్రీల నుంచి 44,779 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్కు చేరుతుంది. తెలంగాణ ప్రాంతంలోని భూగర్భజలవిద్యుత్కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతూనే ఉంది. శనివారం ఒకజనరేటర్ 150 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 38.4044 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. -
అయ్యో.. అన్నమయ్య
♦ డ్యాం ఆధునికీకరణలో జాప్యం ♦ పర్యాటకపరంగా నోచుకోని అభివృద్ధి ♦ నరకప్రాయంగా ప్రాజెక్టు రోడ్డు ♦ డ్యాం నిర్వహణపై కలెక్టరు అసంతృప్తి రాజంపేట: చెయ్యేరు నదిపై నిర్మితమైన అన్నమయ్య జలాశయం ఆధునికీకరణలో జాప్యం కొనసాగుతోంది. బడ్జెట్లో కూడా అరకొరగా నిధులు కేటాయించడంతో అభివృద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు నిధులు పుష్కలంగా ఉన్నాయని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ వెళ్లడించడంతో ఇక ఆధునికీకరణ పనులు చేపట్టడానికి కారణాలు ఏమిటో అంతుబట్టడం లేదు. గేట్లకు రబ్బరు సీలు, గ్రీసు, పెయింటింగ్ లేక జలాశయం బోసిపోయింది. పర్యాటకపరంగా అభివృద్ధికి నోచుకోలేదు. 2.33948 టీఎంసీ స్టోరేజీ కెపాసిటీతో నిర్మితమైన జలాశయ నిర్మాణానికి తొలుత అంటే 1996-97లో రూ.68.92కోట్ల వ్యయంతో ప్రారంభించారు. అప్పటి నుంచి దశలవారీగా నిర్మాణం పూర్తి చేసుకుంది. 2001-2002లో రూ.57.347కోట్లు వ్యయం చేశారు. 2003లో వరదలకు గేట్లు డ్యామేజీ కావడంతో రూ.1.20కోట్లు 2004 జూన్ నాటికి పూర్తి చేశారు. 2003-2004 లో రూ3.కోట్లు కేటాయించారు. ఆది నుంచి అన్నమయ్య డ్యాం అరకొర నిధులతోనే ముందుకు సాగుతూ వచ్చింది. ప్రతిపాదన దశలో.. జలాశయం అభివృద్ధి చేయడానికి నిధులు కోసం ఎదురు చూపులతో కాలయాపన జరుగుతోంది. ఉన్న అరకొర నిధులకు సంబంధించి ప్రతిపాదన దశలో ఉందని సమాచారం. అంధకారంలో ఉన్న జలాశయానికి సోలార్ వెలుగులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి రూ.25లక్షలతో ఎస్టిమేట్స్ వెళ్లాయి. అలాగే పెయింటింగ్ కోసం రూ.1.60కోటి నిధుల విడుదలకు సంబంధించి ఎస్టిమేట్స్ ప్రభుత్వానికి పంపారు. పవర్లైను రిపేరు కోసం రూ.1.4లక్షలు, జనరేటర్కు రూ. 1.63లక్షలు, క్రైన్మెయింటెనెన్స్కు రూ.136లక్షలు, ఎర్త్ డ్యాం గ్యాలరీ కోసం రూ.2.1లక్షలు, స్పిల్వేకు రూ.2.8లక్షలు, రబ్బర్సీలింగ్ (గేట్ల) రూ.9.9లక్షలు, స్పాట్లాగ్ ఎలిమెంట్స్ రూ.9.9లక్షలు, ఆయిల్, గేట్ మెయింటెన్స్ కోసం రూ.8.42లక్షల కోసం ప్రతిపాదనలు పంపారు. టెండర్లను కూడా త్వరలో పిలవనున్నారు. సీఈ పరిధిలో జలాశయం మెయింటెన్స్కు ఈ పనులు చేట్టనున్నారు. పర్యాటకపరంగా నోచుకోని అభివృద్ధి.. గత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో అన్నమయ్య డ్యాంను పర్యాటక పరంగా అభివృద్ది చేయాలని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలను తర్వాత వచ్చిన పాలకులు ఆటకెక్కించారు. అలాగే పర్యాటకులు ఉండటానికి అతిథి గృహం కూడా శిధిలావస్థకు చేరుకుంది. పర్యాటకులు పోవడానికి వీలులేని విధంగా డ్యాం రోడ్డు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా రోడ్డులో వెళ్లాలంటే వాహనదారులకు నరక ప్రాయం చూపిస్తోంది. ఈ డ్యాంను జిల్లా కలెక్టరు సందర్శించి డ్యాం నిర్వహణపై పెదవి విరిచారు. నిధులు ఉన్నా డ్యాం ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఏ అధికారి వచ్చినా డ్యాం గురించి నిర్వహణ లోపాలను ఎత్తిచూపడమే తప్ప మరొకటి ఉండదనే భావన పర్యాటకుల్లో నెలకొంది. -
ప్రజల కోసం.. పదెకరాలు అమ్మేశాడు!
ప్రజల బాగు కోసం సొంత ఆస్తుల్ని సైతం అమ్ముకునేందుకు వెనకాడని హీరోల్ని తెలుగు సినిమాల్లో చాలా సార్లే చూసుంటాం. కానీ, నిజజీవితంలో ఇలాంటి వాటికి చోటు ఉండదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుండే సమాజంలో పక్కవారి కోసం త్యాగాలు చేయడానికి ఎవరూ సాహసించరు. మహారాష్ట్రకు చెందిన 42 ఏళ్ల సంజయ్ టిడ్కే దీనికి భిన్నం. ఎవరో రావాలని, ఏదో చేయాలని.. చూసినన్నాళ్లు ఎదురు చూశాడు. నిరీక్షణలు ఫలించవని తెలుసుకున్నాక తానే స్వయంగా బరిలోకి దిగాడు. ఇంతకీ, ఆయనేం చేశాడు? మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన సంజయ్ టిడ్కేను చాలా కాలంగా ఓ సమస్య వేధిస్తోంది. అదే.. డ్యామ్..! అవును, తన పంట పొలాల మీదుగా వృథాగా పోయే కాలువ నీటిని ఎలాగైనా నిల్వచేయాలనుకున్నాడు. దీనికి ఓ చిన్నపాటి డ్యామ్ అవసరమవుతుందని ఆయనకు బాగా తెలుసు. అయితే, పదిమందికీ పనికొచ్చే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రభుత్వాలు పూర్తి చేయాల్సినవే అని సంజయ్ భావించాడు. ఆ దిశగా అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాడు. డ్యామ్ని నిర్మించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరాడు. కానీ, ఏనాడూ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆయనకు సరైన సమాధానం రాలేదు. దీంతో ఓసారి తన ప్రయత్నంగా మట్టితో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. కానీ, ఆ ఏడాది కురిసిన వర్షాలకు మట్టి డ్యామ్ నిలబడలేదు. దీంతో సంజయ్ సహా రైతుల భూములన్నీ నీటమునిగాయి. పంటలు నాశనమై, వారంతా తీవ్రంగా నష్టపోయారు. కనీసం అప్పుడైనా ప్రభుత్వం తన అభ్యర్థనను మన్నిస్తుందని ఆశించాడు సంజయ్. కానీ, అలా జరగలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వం ఉదాసీనత చూపింది. ఈ ఘటనతో కళ్లు తెరచుకున్న సంజయ్.. తన ముప్పై ఎకరాల భూమిలోంచి కొంత భాగాన్ని అమ్మేసి కాంక్రీట్ డ్యామ్ను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అలా పదెకరాలు అమ్మగా వచ్చిన రూ.55 లక్షలతో డ్యామ్ నిర్మాణం ప్రారంభించాడు. ఇది చూసైనా సానుకూలంగా స్పందించాల్సిన అధికారులు విచిత్రంగా వ్యవహరించారు. సంజయ్ను వేధించడం మొదలుపెట్టారు. ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నాడంటూ కేసులు పెట్టారు. అయితే, సంజయ్ దేనికీ భయపడలేదు. గ్రామస్థుల సహకారంతో సొంతంగానే కాంక్రీట్ డ్యామ్ను నిర్మించాడు. దీని స్టోరేజీ సామర్థ్యం 3 కోట్ల లీటర్ల పైమాటే. ప్రస్తుతం తుది దశలో ఉన్న నిర్మాణ పనులు.. జూన్ మొదటివారం నాటికి పూర్తి కావొచ్చు. ఇదే కనుక, ప్రారంభమైతే ఆ ప్రాంత రైతులు సిరులు పండిస్తారనడంలో ఆశ్చర్యం లేదు! -
శ్రీశైలం డ్యాంలో స్వల్పంగా నీటి చేరిక
కర్నూలు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. మంగళవారం రాత్రి సెల్ప్ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన స్వల్ప వర్షం కారణంగా 676 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది. దీంతో 785 అడుగులుగా ఉన్న నీటిమట్టం 785.20 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాల్లో 16.60 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు 41.26 డిగ్రీలుగా ఉండడంతో జలాశయం నుంచి 76 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్ సిబ్బంది తెలిపారు. -
డేంజర్లో ‘సింగూరు’ డ్యామేజీ!
♦ రిజర్వాయర్ ఎండిపోవడంతో పగుళ్లు ♦ యుద్ధప్రాతిపదికన డ్యామ్ పటిష్టతను ♦ నిర్ధారించాలంటూ గేట్కు లేఖ ♦ మార్చిలో సింగూరు రానున్న నిపుణులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు డ్యామ్కు ప్రమాదం పొంచి ఉంది. రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో డ్యాంకు పగుళ్లు ఏర్పడి, నైబారే ప్రమాదం ఉందని సాగునీటి శాఖ అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం కేవలం 0.07 టీఎంసీల నీళ్లు మాత్రమే సింగూరులో ఉన్నాయి. డ్యాం పునాదుల వరకు నీళ్లు ఎండిపోయి సిమెంట్స్ బెడ్స్ బయటికి తేలాయి. పునాదుల వద్ద నీళ్లు లేకపోవడంతో మట్టి ఎండిపోయి క్రమంగా అది రాలిపోవడంతో రంధ్రాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. నీటి ప్రవాహం వచ్చినప్పుడు ఈ రంధ్రాల గుంగా నీళ్లు బయటికి కారిపోయి.. క్రమంగా పెద్ద పగుళ్లుగా మారి డ్యాం ఉనికిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోనళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన డ్యాం మరమ్మతు పనులను చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులు గేట్కు లేఖ రాశారు. 1977-78లో సింగూరు రిజర్వాయర్ రూపుదిద్దుకుంది. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ఇప్పటి వరకు ఎండిపోలేదు. కనిష్ట నీటి మట్టం 10 టీఎంసీలు (డెడ్ స్టోరేజ్). గత ఏడాది ఫిబ్రవరి 19న డ్యాంలో 9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్క నీరు కూడా చేరలేదు. ఉన్న నీటినే తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలోనే నీ టి నిల్వలు 0.09 టీఎంసీలకు చేరటం తో ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు నీటి సరఫరాను నిలిపివేశారు. కేవలం మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకే నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. గుంతల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఏళ్ల తరబడి నీటి అలల తాకిడికి ప్రాజెక్టు పునాదుల వద్ద చిన్న చిన్న రంధ్రాలు పడతాయి. అయితే ఈ రంధ్రాల్లో వెంటనే ఒండ్రు మట్టి చేరిపోతుంది కాబట్టి డ్యాంకు ఎటాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అధికారులు డ్యాం పునాదుల వద్ద నిరంత రం నీళ్లు ఉండేటట్లు జాగ్రత్త పడతారు. ప్రస్తుతం నీళ్లు లేకపోవడంతో మట్టి ఎండిపోయింది. ఈ నేపధ్యంలో రంధ్రాల్లోని మట్టి రాలిపోతున్నట్లు, అక్కడక్కడ సిమెంటు గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. పటిష్టతపై లేఖ రాశాం.. ఇరిగేషన్ డిప్యూటీ ఇఇ జగన్నాథం: ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 0.07 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. నీళ్లు లేకపోవడం వల్ల ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో ప్రాజెక్టు పటిష్టతను పరిశీలించాలని కోరుతూ గేట్ డివిజన్ జనరల్ సూపరింటెండెంట్ గోవింద్కు లేఖ రాశాం. మార్చి తర్వాత హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా యంత్రాలను తెప్పించి, వాటి సహాయంతో ప్రాజెక్టు గేట్లు ఇతర నిర్మాణాల పటిష్టతను పశీలించి నివేదిక రూపొందిస్తారు. అవసరం అనుకుంటే గేట్లు, డ్యాంకు మరమ్మతు చేస్తారు. -
పోలవరం వ్యయం భారీగా పెంపు
-
శ్రీశైలం ప్రాజెక్ట్ భద్రతపై కేంద్రం దృష్టి
-
డ్యామ్లో పడిపోయిన బస్సు: 22 మంది జలసమాధి
- బుర్కినా ఫాస్కోలో ఘోరం వాగాడూగు: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాస్కోలో ఘోర ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి లోతైన డ్యామ్ లోకి పడిపోవడంతో 22 మంది జలసమాధి అయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 27వ నంబర్ జాతీయ రహదారిపై కెబలోగ్ ప్రాంతం వద్ద గురువారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలను అధికారులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికితీస్తున్నదని, క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత పేద దేశాల్లో ఒకటైన బుర్కినా ఫాస్కోలో సరైన రోడ్లు లేక తరచూ భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం విషాదం. -
ఏడుకొండలపై నీటికి కోటా
తిరుమల గోవిందుని సన్నిధిలో తాగడానికి గుక్కెడు నీళ్లు కరువైపోయాయి. కొండమీద తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటి జలాశయాలు ఎండిపోయాయి. ఉన్న నీటితో రెండు బ్రహ్మోత్సవాలు నెట్టుకొచ్చిన టీటీడీకి భవిష్యత్పై నీటి కష్టం ఎదురవుతోంది. కొండమీద పెరిగిన నీటి పొదుపు చర్యలు తీవ్ర నీటి ఎద్దడి కారణంగా తిరుమల కొండ మీద టీటీడీ నీటి పొదుపు చర్యలు చేపట్టింది.ఆలయం, అన్నప్రసాద కేంద్రం మినహాయించి మిగిలిన చోట్ల సుమారు 40 శాతం కోత విధించారు. 30 మఠాలు, 20 దాకా పెద్ద హోటళ్లు, మరో 50 హోటళ్లకు సరఫరాలోనూ పొదుపు చర్యల్ని తీవ్రం చేశారు. దీంతో తిరుపతి నుంచి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్లో కూడా పది రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. కాటేజీల్లోని నీటి కొళాయిల సరఫరాలోనూ కోత విధించారు. ఆరుబయట కొన్ని తాగునీటి కొళాయిల్ని మూసివేశారు. ఆరుబయట రోడ్లకు ఇరువైపులా ఉండే మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కొన్ని మూసివేశారు. నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అడుగంటి ప్రధాన జలాశయాలు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతోపాటు ఆలయ అవసరాల కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరం. ఏటా కొండమీద శేషాచలం అడవుల్లో 1,369 మి.మీ.వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ యేడు అందులో సగం కూడా పడలేదు. దీంతో తాగునీరు సరఫరా చేసే గోగర్భం ( 2,840 లక్షల గ్యాలన్ల సామర్థ్యం), ఆకాశ గంగ (670 లక్షల గ్యాలన్లు), పాపవినాశనం (5,240 లక్షల గ్యాలన్లు), కుమారధార(3,224 లక్షల గ్యాలన్లు), పసుపుధార (886.70 లక్షల గ్యాలన్ల) ఎండిపోయాయి. ఈ ప్రాజెక్టుల్లో అడుగంటిన బురద నీరు కనిపిస్తోంది. గంగ, బోర్ల నీటితో నెట్టుకొస్తున్న టీటీడీ తిరుమల అవసరాల కోసం రోజూ 7 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పెర్ డే) తెలుగుగంగ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం రోజూ 10 ఎంఎల్డీ (22.5 లక్షల గ్యాలన్లు) తెలుగుగంగ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా అది అమలు కావటం లేదు. దీనిపై ప్రభుత్వంతో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు చర్చలు జరుపుతూ తెలుగుగంగ కోటాను పెంచే చర్యలు చేపట్టారు. దీంతోపాటు కల్యాణిడ్యామ్లో వేసిన బోర్ల ద్వారా మరికొంత నీటిని సేకరిస్తున్నారు. గతంలో ఇక్కడ వేసిన 25 బోర్లలో 13 ఎండిపోయాయి. వర్షంపై టీటీడీ గంపెడాశ నైరుతి రుతుపవనాలు మొహం చాటేయగా, ఈశాన్య రుతుపవనాలపై టీటీడీ గంపెడాశతో ఉంది. ఈనెల 11వ తేది నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో తిరుమలలో వర్షం కురిసే అవకాశం ఉందని టీటీడీ వాటర్వర్క్స్ ఇంజనీరు నర సింహమూర్తి తెలిపారు. ఆ మేరకు వర్షాలు పడకుంటే తిరుమల భక్తులకు తాగునీటి కష్టాలు మరింతగా పెరిగే ప్రమాదముంది. -
మంజీరాపై తొలి ‘నీటి వంతెన’
- 350 మీటర్ల పొడవు.. రూ.50 కోట్లతో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: ఒకే నిర్మాణం.. రెండు ప్రయోజనాలు.. ఈ తరహాలో తొలి భారీ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. నది దాటేందుకు రోడ్డుతోపాటు, నది నీటిని నిల్వ చేసే డ్యామ్ తరహా ఏర్పాటుకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకర తొలి భారీ వంతెన సిద్ధం కాబోతోంది. నిజామాబాద్-మెదక్ సరిహద్దులో వెంకంపల్లి వద్ద మంజీరా నదిపై దీనిని నిర్మించనున్నారు. దాదాపు 350 మీటర్ల పొడవుండే ఈ వంతెనకు దాదాపు రూ.50 కోట్లకుపైగా వ్యయం కానుంది. దీని ద్వారా నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట్ మండలం-మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలాలను అనుసంధానించటంతోపాటు ఆ ప్రాంతాల్లోని గ్రామాలకు సాగు, తాగునీటిని అందించేందుకు అవకాశం కలుగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో సత్ఫలితాలనిస్తున్న ఈ తరహా నిర్మాణాలను తెలంగాణలో చిన్న నదీ పాయలు, పెద్ద వాగులపై నిర్మించాలని తొలుత నిర్ణయించారు. కానీ మంజీరా నదిపై కూడా చేపట్టాలని తాజాగా రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించటంతో ఆ శాఖ అధికారులు దీనిని ఎంపిక చేశారు. ఇక్కడ రోడ్డు కోసం వంతెన నిర్మించే ప్రతిపాదన మాత్రమే ఉంది. మంత్రి ఆదేశాలతో ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి వంతెన డిజైన్ మార్చి టెండర్లు పిలవాలని నిర్ణయించిన అధికారులు.. దీనికి సంబంధించి సర్వే పని మొదలుపెట్టారు. గతంలో మాటూరు వద్ద వంతెన నిర్మాణానికి ప్రయత్నించినా.. ఆ ప్రాంతం అనువైంది కాదని మట్టి పరీక్షలో తేలడంతో.. ఇప్పుడు వెంకంపల్లిని ఎంపిక చేశారు. -
డెడ్స్టోరేజీ దిగువన సాగర్
నాగార్జునసాగర్(నల్గొండ): నాగార్జునసాగర్ జలాశయం మంగళవారం సాయంత్రానికి కనిష్ట నీటిమట్టానికన్నా దిగువకు వెళ్లింది. సాగర్ జలాశయం కనిష్ట నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 509.80 అడుగులకు వెళ్లింది. దీంతో హైదరాబాద్కు తాగు నీరందించడానికి ఏఎమ్మార్పీలో భాగమైన పుట్టంగండి వద్ద ఏర్పాటు చేసిన మోటార్లలో ఒకదానికి నీరందక నిలిపివేశారు. కేవలం ఒక మోటరు ద్వారానే నీటిని పంప్ చేస్తున్నారు. నేడోరేపో ఈ మోటారును కూడా నిలిపివేసే అవకాశం ఉంది. నిన్నటి వరకు శ్రీశైలం-సాగర్ జలాశయాల మధ్య ఉన్న కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన చిన్నపాటి జల్లులకు సాగిన వాగులు, వంపుల ద్వారా వచ్చి చేరిన నీటితో వారం రోజులు నెట్టుకువచ్చారు. ఇక వరదనీరు పూర్తిగా తగ్గడంతో సాగర్ జలాశయంలో నీరు తగ్గుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 802.70 అడుగులుంది. ఇది 30.3577 టీఎంసీలతో సమానం. -
నిర్వాసితులకు అండగా ఉంటాం!
ఎమ్మెల్యే : పెద్దాయనా.. మీకేమైనా సమస్యలున్నాయా? బక్క కుర్మన్న : సారూ..! మాకు కొత్తగా ఇండ్లు ఎక్కడ ఇస్తరోనని తిప్పలు. ఒకసారి కలెక్టరమ్మ ఊర్నె లేప్కపొమ్మని సెప్పింది. ఇండ్లకోసం 40 ఎకరాలిచ్చిన గూడ్క.. అడివిల ఉండలేం. ఊరంతా ఒక్కసారి లేప్క పోవాలంటె ఎట్లయితది! మేమంతా యాడ ఉండేది. ఎకరాకు రూ.70 వేలు, రూ.90 వేలు పరిహారం ఇచ్చిండ్రు. బాగనే ఉంది.. పదేండ్ల కింద ఇచ్చిన పరిహారం యాడ సరిపోతది? ఇండ్లు కట్టియ్య పోయిరి. ఇప్పుడు మేం ఏడ ఉండాలె చెప్పుండ్రు. ఎమ్మెల్యే : పెద్దాయనా! శంకరసముద్రం నిర్వాసితులకు ఇళ్లు కట్టించేందుకు 119 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. మీకే కాదు. ఇతర గ్రామాల వారికీ ఇళ్లు కట్టించాల్సి ఉంది. ఒక్కసారే ఇళ్లన్నీ పోవు. డ్యాం కట్టే స్థలాన్ని బట్టి విడతలుగా వెళ్లాలి. మిగతావి డ్యాం పూర్తయినంక వెళ్లాలి. మీ ఇంటికి పరిహారమెంత వచ్చింది? బక్క కుర్మన్న: మా ఇంటికి నష్టపరిహారం కింద రూ. 7.50 లక్షలు మంజూరైనయి. వాటిని ఇప్పించేందుకు కష్టపడిన వకీలు 30శాతం డబ్బులు తీసుకోగా, మిగిలిన రూ.5.30 లక్షలు చేతికి వచ్చినయ్. ఎమ్మెల్యే: అన్నా.. నీపేరేంటి? రిజర్వాయర్ నిర్మాణం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బాధిత రైతు : నా పేరు బాలస్వామి. శంకరసముద్రం రిజర్వాయర్ను నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది రైతులకు ప్రయోజనం కలిగించే ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు మేం పొలాలు, ఇళ్లు త్యాగం చేశాం. నష్టపరిహారం కూడా ఇచ్చారు. కానీ ఇండ్లు నిర్మించేందుకు రోడ్డు పక్కన్నస్థలాన్ని అడుగుతున్నాం. ఎమ్మెల్యే : నష్టపరిహారం అందజేయడంలో ఆలస్యానికి కారణం ఏమనుకుంటున్నారు? శేఖర్గౌడ్ : గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ముగ్గురు కలెక్టర్లు మారారు. నిర్వాసితులకు ఇళ్లు నిర్మించేందుకు స్థలం కూడా కేటాయించడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. మాకు రోడ్డుపక్కన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. మీ నుంచి పరిష్కారం అవుతదని ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే: శంకరసముద్రం నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు గతనెల రాష్ట్ర మంత్రి హరీష్రావు వచ్చి వెళ్లినంకా పనులు ఏమైనా జరిగాయా? శేఖర్గౌడ్ : గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిర్వాసితులకు కొంతఊరట కలుగుతోంది. ఈ మధ్య మంత్రి హరీష్రావు సారూ.. కానాయిపల్లికి వచ్చిన సందర్భంలో మా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే: మంత్రి హరీష్రావు వచ్చిపోయినంక సమస్య ఏమైనా పరిష్కారమైందా? బందెన్న: గత ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఇళ్లు నిర్మించుకునేందుకు అనువుగా లేదు. ఈ విషయాన్ని మంత్రి హరీష్రావుకు విన్నవించాం. ఆయన అప్పటికప్పుడు మాకోసం కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. గ్రామస్తుల కోరిక మేరకురోడ్డు పక్కనే నిర్వాసితులకు ఇళ్లు నిర్మించాలనిఅధికారులను ఆదేశించారు. మాకోసం కేటాయించిన 40 ఎకరాల్లో 20 ఎకరాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తూ మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే : మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంజన్న: రిజర్వాయర్ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ మా పొలాల వద్ద సామాను వేసుకుంటున్నారు. దీంతో రిజర్వాయర్ పూర్తయ్యే వరకైనా పంటలు వేసుకోవాలంటే వీల్లేకుండా పోయింది. రిజర్వాయర్ నీటిముంపు పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఒడ్డున ఉన్న పొలాలకు అక్కడి నుంచి విద్యుత్ సరఫరా కావడం లేదు. పొలాలకు బండ్లబాట కూడా లేకుండా పోయింది. నీట మునిగిన 11 ట్రాన్స్ఫార్మర్లు బయటకు తీసి గడ్డ మీద ఉన్న పొలాలకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. విద్యుత్శాఖ అధికారులు దీన్ని పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే : విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తా! ఇళ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొత్త శ్రీనివాసులు: శంకరసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో పరిహారం కింద పదేళ్ల క్రితం రూ.78వేలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు గోడలు కూడా నిర్మించుకోలేని పరిస్థితి. దీని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయాలని మంత్రి హరీష్రావుకు విన్నవించాం. మీ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేయాలి. నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకునేందకు స్థలం కేటాయించడంతో పాటు రూ.3.50లక్షల ప్యాకేజీ ఇవ్వాలి. ఎమ్మెల్యే : మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనిచేస్తున్నాడని మీరు భావిస్తున్నారా? కొత్త శ్రీనివాసులు: మీరు ఎమ్మెల్యే అయ్యాక మా వద్దకు రావడం ఇది మూడోసారి. గతంలో ఎవరూ ఇక్కడకు రాలేదు. ఇక్కడి నిర్మాణం పనులే కాకుండా, నిర్వాసితులకు సైతం మీ ఆధ్వర్యంలో వేగంగా సాయం అందుతుందా? ఎమ్మెల్యే : అన్నా..! మీ సమస్య ఏంటి? ఆంజనేయులు: మా తండాకు చుట్టుతా నీళ్లొస్తున్నయి. దీంతో మేం తండాలో నివాసం ఉండలేకపోతున్నం. మావి మొత్తం 60ఇళ్లు ఉన్నాయి. మా తండాకు పొయ్యే బాట కూడా మునిగిపోయింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మా తండా పూర్తిగా మునిగిపోతది. మా ఊరికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా రోడ్డు వేయండి. లేదంటే తండాను మరోచోటుకు మార్చండి. -
నాగార్జునసాగర్ లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్
-
ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద యువకుడు గల్లంతు
నీటిలో చిక్కుకున్న మరో యువకుడిని కాపాడిన పోలీసులు వల్లూరు: పెన్నానదిలో ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఎస్ఐ కొండారెడ్డి కథనం మేరకు... చెన్నూరు మండలం ఉప్పరపల్లె ఎస్సీ కాలనీకి చెందిన సగినాల ఓబులేసు(35) ,తప్పెట వెంకటరమణ మరో ముగ్గురు యువకులతో కలసి ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్దకు సరదాగా గడపడానికి వచ్చారు. ఆనకట్ట సమీపంలో నదిలో ఈత ఆడుతుండగా ప్రమాదవశాత్తూ ఓబులేసు, వెంకట రమణలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఓబులేసు నీటిలో పూర్తి మునిగి కొట్టుకుని పోయాడు. వెంకట రమణ మాత్రం కొద్ది దూరం నీటిలో కొట్టుకుని పోయి నది మధ్యలోని ఒక బండ రాయిని ఆసరాగా చేసుకుని నిలబడ్డాడు. రక్షించమని కేకలు వేశాడు. స్నేహితులు రక్షించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ కొండారెడ్డి సంఘటనా స్థలానికి సిబ్బందితో వెంటనే చేరుకున్నాడు. స్థానికంగా ఉన్న గజ ఈతగాల్ల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. ఎన్ .ఆంజనేయరెడ్డి, వాసు, జీ. ఆంజనేయరెడ్డి, విజయ్, శ్రీను అనే యువకులు తాడు సహాయంతో నదిలోకి దిగి నీటిలో చిక్కుకున్న వెంకట రమణను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. కాగా గల్లంతైన ఓబులేసు దాదాపు 10 సంవత్సరాల క్రితం రాజంపేటకు చెందిన పద్మావతిని వివాహం చేసుకున్నాడు. సంతానం లేక పోవడంతో తన సోదరుని కుమార్తెను పెంచుకుంటున్నట్లు బంధువులు తెలిపారు. ఓబులేసు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా రోధించారు. మద్యం మత్తుతోనే.. చెన్నూరుకు చెందిన యువకులు మద్యం సేవించి నదిలోకి దిగడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. నదిలో పెద్ద ప్రవాహమేమీ లేదు. మద్యం సేవించి నదిలోకి దిగిన యువకులు అదుపు తప్పి ప్రవాహంలో కొట్టుకుని పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ వెంకటేష్ సందర్శించారు. ఎస్ఐ కొండారెడ్డితో మాట్లాడి ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు. -
ఎక్కడైనా డ్యాం గేట్లు ఎలా తీస్తారు?
-
తుంగభద్ర నదిపై ఆనకట్ట నిర్మాణానికి కదలిక
కర్నూలు రూరల్, న్యూస్లైన్: నగర సమీపంలో తుంగభద్ర నదిపై ఆనకట్ట, రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. డీటైల్ ప్రాజెక్టు సర్వే చేసేందుకు నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నిర్మాణంతో నదికి అవల వైపు గ్రామాల ప్రజలు గ్రామాలకు రాకపోకలు సులభం కానున్నాయి. ఈ.తాండ్రపాడు, గొందిపర్ల, దేవమడ, పూలతోట, సుందరయ్య నగర్, వసంతనగర్, దొడ్డిపాడు, మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్ద శింగవరం, అలంపూర్, చిన్న శింగవరం, భైరాపురం, కాశాపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం లాంచీలు, పుట్టిల సహాయంతో తుంగభద్ర నదిపై కర్నూలు నగరానికి చేరుకుంటున్నారు. ఆయా గ్రామాల ప్రజలు నగరానికి రోడ్డు మార్గంలో నగరానికి రావాలంటే 18 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. బస్సు చార్జీలు ఖర్చు అధికమవుతుండటంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నదిపైనే ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. 2009లో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు నదీ తీర గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించగా సానుకూలంగా స్పందించారు. ప్రజల మాటున ప్రజాప్రతినిధి కోసం: నదీ తీర ప్రాంత ప్రజల అవసరాల కోసమైతే వంతెన మాత్రమే నిర్మించాల్సి ఉంది. అయితే ఓ ప్రజాప్రతినిధి తన ఫ్యాక్టరీలకు శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కోసమే ఆనకట్ట, రోడ్డు నిర్మిస్తున్నారని ప్రతి పక్షపార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆనకట్ట నిర్మాణంపై నదీ తీర గ్రామాల ప్రజలు, ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పంతాన్ని నెగ్గించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నదిపై రూ. 64 కోట్లతో ఆనకట్ట, రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు మే నెలలో కర్నూలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రకటించారు. ఈమేరకు సర్వే చేసేందుకు జూలైలో నీటిపారుదల శాఖ అంచనా వేసింది. దీంతో ప్రభుత్వం రూ. 30 లక్షలు మంజూరు చేసి టెండర్లు ఆహ్వానించింది. ఇటీవల హైదరాబాద్కి చెందిన ఐడియల్ ఏజెన్సీ రూ.27 లక్షలకే సర్వే టెండరును దక్కించుకుంది. సర్వే చేసేందుకు ప్రభుత్వం మూడు నెలలు మాత్రమే గడువు విధించినట్లు ఇరిగేషన్ ఎస్ఈ ఆర్. నాగేశ్వరరావు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ కంటే ముందుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా గుండ్రేవుల ప్రాజెక్టు సర్వే, సుంకేసుల జలాశయ పూర్తి స్థాయి మరమ్మతులకు నిధులు రెండులు మంజూరు చేయడం లేదు. -
నిండుకుండలా మానేరు డ్యామ్