హార్సిలీహిల్స్లో కొవ్వొత్తుల ర్యాలీ
బి.కొత్తకోట: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని పర్యాట కేంద్రం హార్సిలీహిల్స్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. టూరిజం మేనేజర్ మురళి ఆధ్వర్యంలో టూరిజం, రెవెన్యూ, అటవీ, రైల్వే, పోలీసుశాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది 2 కె రన్లో పాల్గొన్నారు. గవర్నర్ బంగ్లా ప్రవేశ ద్వారం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వశాఖకు చెందిన సిబ్బంది, అధికారులతో ప్రైవేటు హోటళ్లు, అతిథి గృహాల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నాను.