బస్సును ఢీకొట్టిన లారీ: 40 మందికి గాయాలు | 40 injured in road accident in visakhapatnam district | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొట్టిన లారీ: 40 మందికి గాయాలు

Published Wed, Jul 20 2016 6:54 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

40 injured in road accident in visakhapatnam district

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం బయ్యారం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బాండ్రెక్స్ కంపెనీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది కార్మికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను అనకపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement