కడప (వైఎస్సార్ జిల్లా) : కడప కేంద్ర కారాగారం నుంచి మంగళవారం 47 మంది జీవిత ఖైదీలను విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన 58 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కడప కేంద్ర కారాగార అధికారులకు లేఖ ద్వారా తెలియజేసింది.
వారిలో 8 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. మహిళలను కొద్ది రోజుల క్రితమే నెల్లూరు జైలుకు తరలించారు. అక్కడ వారు విడుదల అవుతున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 50 మందిలో 47 మందిని మంగళవారం విడుదల చేయగా..మరో ముగ్గురికి వేరే కేసులతో సంబంధం ఉండటంతో విడుదల నిలిపివేశారు.
కడప సెంట్రల్ జైలు నుంచి 47 మంది ఖైదీల విడుదల
Published Tue, Jan 26 2016 4:08 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM
Advertisement
Advertisement