Republic Day
-
న్యూయార్క్ లో నైటా ఆధ్వర్యంలో 76వ గణతంత్ర వేడుకలు
-
పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!
‘ఒక దేశ ఉజ్వల భవిష్యత్ ఆ దేశ గ్రామీణాభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది’ అనేది తిరుగులేని చారిత్రక సత్యం.పల్లెపచ్చగా కళ కళలాడాలంటే, ఆకలి డొక్కలతో పట్నానికి వలసపోకుండా ఉండాలంటే.. పల్లెతల్లిని కంటిపాపలా కాపాడుకోవాలి. ఈ మహిళా సర్పంచులు అదే పని చేశారు. గ్రామ ఆర్థికవృద్ధి నుంచి సర్వతోముఖాభివృద్ధి వరకు అంకితభావంతో పనిచేశారు. వారి సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడమే కాదు, అక్కడకు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ‘ఉత్తమ గ్రామ సర్పంచ్’ అవార్డ్ అందుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన వేదికపై ప్రసంగించారు.ఘనత అనేది ‘నేను ఈ ఊరి సర్పంచు(Sarpanch)ని’ అని ఘనంగా చెప్పుకోవడంలో ఉండదు. సర్పంచుగా ఆ ఊరికి ఎలాంటి మంచి పనులు చేశారనేదే అసలు సిసలు ఘనత. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మేజర్ పంచాయతీల్లో ఒకటైన ఈడుపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పి.ఇందిర ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులను చేపడుతోంది. సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే దిశగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది.అర్హులకు సంక్షేమ పథకాలు అందించటం, హర్ఘర్ జల్ యోజన, మిషన్ ఇంద్రధనుష్, ప్రధాన మంత్రి జెన్ ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, పీఎం మాతృవందన యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం పోషణ యోజన, పీఎం ముద్ర యోజన, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సద్వినియోగంలో 90 శాతానికి పైగా ప్రగతి సాధించారు.‘ఉత్తమ సర్పంచ్గా ఢిల్లీ(Delhi)లో రాష్ట్రప(President)తి సమక్షంలో అవార్డు అందుకోవడం, ప్రసంగించే అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నా బాధ్యతను రెట్టింపు చేసింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం దిశగా మరింత అంకితభావంతో పని చేస్తాను’ అంటోంది ఇందిర.మా అమ్మ ఎప్పుడూ బాగుండాలి...గ్రామ పంచాయతీలో లేబర్ కాంట్రాక్టరుగా, గుమస్తాగా పనిచేసిన తన భర్త అనుభవాన్ని కూడగట్టుకొని తన ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం లో విజయం సాధించింది ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం పొందుగల గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోతు కోటమ్మ. ఉత్తమ గ్రామ సర్పంచ్గా ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ(Republic day) వేడుకలలో అవార్డ్ అందుకుంది. వేదిక ఎక్కి ప్రసంగించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, టాటాట్రస్టు సహకారం, జలజీవన్ మిషన్ నిధులు... ఇలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రూ.40 కోట్లతో గ్రామ అభివృద్ధి, సంక్షేమంపై ఖర్చు చేసింది. జలజీవన్ మిషన్లో భాగంగా రెండు వాటర్ ట్యాంకులు, ఇంటింటికి సురక్షితమైన నీటిని అందించేందుకు గ్రామంలో 350 ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేసింది. టాటా ట్రస్టు సహకారంతో ఐఓటీ సిస్టమ్ ఏర్పాటు చేసి నీటి సరఫరా లెక్కింపుతోపాటు క్లోరినేషన్ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చేసిన మొదటి గ్రామంగా పొందుగలను నిలిపింది. నీటి వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తోంది. వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు, సేంద్రియ ఎరువుల తయారీలో విజయం సాధించింది. ‘ఊరు అంటే సొంత తల్లిలాంటిది. మా అమ్మ ఎప్పుడూ బాగుండాలి. అందుకోసం ఎంతైనా కష్టపడతాను’ అంటుంది గుగులోతు కోటమ్మ.– ఇ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, వేమిరెడ్డి రామకృష్ణారెడ్డి, సాక్షి, జి.కొండూరుకార్పొరేట్ వరల్డ్ నుంచి పల్లె ప్రపంచానికి...ఎంబీఏ(MBA) చేసిన చేబ్రోలు లక్ష్మీమౌనిక మెడికల్ ట్రాన్స్స్క్రిప్షన్(Medical Transcription) సంస్థలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత పంచాయితీ ఎన్నికల బరిలోకి దిగి పదివేల జనాభా, నాలుగు శివారు గ్రామాలతో కూడిన కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి మేజర్ గ్రామపంచాయతీకి సర్పంచ్గా ఎన్నికయ్యింది. హెచ్సీఎల్ క్యాంపస్ ఏర్పాటు, గృహసముదాయాల పన్నుల ద్వారా గ్రామపంచాయతీ వార్షిక ఆదాయాన్ని రూ. 45 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పెంచింది. గ్రామంలో పారిశుధ్య వ్యవస్ధను మరింత మెరుగు పరచడంతోపాటు సుమారు రూ. 2 కోట్లు వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, కొత్తగా తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేసింది. మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె సేవలను గుర్తించిన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు దిల్లీలో జాతీయస్థాయిలో జరిగిన గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై జరిగిన వర్క్షాప్కు ఆంధ్రప్రదేశ్ నుండి లక్ష్మీమౌనికను ఎంపిక చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఈ వర్క్షాపుకు హాజరైన లక్ష్మీమౌనిక తన అభిప్రాయాలను తెలియజేసింది. మైసూర్లో జరిగిన ‘పంచాయతీరాజ్ వ్యవస్థల్లో మహిళా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం’పై జరిగిన జాతీయ సదస్సుకు కూడా లక్ష్మీమౌనిక ఎంపికయింది.– కొడాలి ప్రేమ్చంద్, సాక్షి, గన్నవరం (చదవండి: వందేళ్ల నాటి పైథానీ చీరలో బరోడా మహారాణి రాధికా రాజే..! అచ్చమైన బంగారంతో..) -
‘మహా హారతి’లో అపశ్రుతి.. హుస్సేన్సాగర్లో బోట్లకు మంటలు (చిత్రాలు)
-
గవర్నర్ తో అసత్యాలు, అబాద్ధాలు చదివించింది కూటమి సర్కార్
-
రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం... రిపబ్లికే డే శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
సంస్కరణలతో తగ్గుతున్న పనిభారం
సాక్షి అమరావతి: న్యాయవ్యవస్థలో ఎప్పటికప్పుడు అమలు చేస్తున్న సంస్కరణల వల్ల న్యాయస్థానాలపై పనిభారం తగ్గుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తెలిారు. సంస్కరణల వల్ల కోర్టులు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా న్యాయవ్యవస్థ ఓ సంరక్షకుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తోందని తెలిపారు. దేశ నిర్మాణం అంటే బలమైన వ్యవస్థలు మాత్రమే కాదని, ప్రజల హక్కులు, విలు] లు, సమగ్రత కూడా అందులో భాగమని చెప్పారు.శాంతి, సౌభ్రాతృత్వం సాధించేందుకు ప్రజలంతా మమేకం కావాలని జస్టిస్ ఠాకూర్ ఆకాంక్షించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.ఆదివారం హైకోర్టులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అంతకుముందు బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడారు. స్వతంత్ర సమరంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, అదనపు అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందినప్పుడే సమాజంలోని అసమానతలు పూర్తిగా తొలగిపోతాయని రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్రాజు అన్నారు. ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం, సచివాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోషేన్ రాజు... జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి సందేశమిచ్చారు. అసెంబ్లీ భవనం వద్ద వేడుకల్లో స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. -
ప్రగతికి పది సూత్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రగతికి పది సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన 76వ గణతంత్ర దిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు. ఏడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక, పరిపాలనా గందరగోళంతో దెబ్బతిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం, వనరుల మళ్లింపుతో పాటు దుష్పరిపాలన సాగించడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలపై పడిందన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని, అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయని, నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాలనా వ్యవస్థ దెబ్బ తిన్నదన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, ప్రతి సవాలును అవకాశంగా మార్చడం మన బాధ్యతని, ఇందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 రోడ్మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొదట ఓట్–ఆన్–అకౌంట్ బడ్జెట్ను పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక అడ్డంకులను అధిగమించడం, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ రూ.16 లక్షల కోట్ల నుంచి 2047 నాటికి రూ.305 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.పది సూత్రాలు⇒ పేదరికం నిర్మూలనకు పీ 4 విధానం. ⇒ అందరికీ స్వచ్ఛమైన తాగునీరు.⇒ మహిళ, యువత సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి.⇒ యువతను రేపటి అవకాశాలకు సిద్ధం చేస్తూ వేగంగా నైపుణ్య గణన⇒ నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, నీటి నిర్వహణలో విప్లవాత్మక మార్పులు⇒ 2026 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి⇒ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు మామిడి, అరటి, మిర్చి, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు లాంటి పంట ఉత్పత్తులు ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం.⇒ మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీమోడల్ రవాణా కేంద్రాల అభివృద్ధి.⇒ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024తో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపు. 5వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు. పీఎం సూర్య ఘర్ రూఫ్టాప్ సోలార్ పథకం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రోత్సాహం.⇒ గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ పద్ధతిలో పండించే పంటలకు విలువ జోడింపు సౌకర్యాల కల్పన. -
కోల్కతా రిపబ్లిక్ డే పరేడ్.. స్పెషల్ ఎట్రాక్షన్గా రోబో డాగ్స్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day celebrations) ఘనంగా నిర్వహించారు. రెడ్ రోడ్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, బెంగాల్ పోలీసులు, కోల్కతా పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, విపత్తు నిర్వహణ బృందాలు కవాతు చేశాయి. పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.అయితే, ఈ పరేడ్లో ఆర్మీకి చెందిన రోబో శునకాలు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాయి. మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ (MULE)గా పేర్కొన్న రోబోటిక్ డాగ్కు సంజయ్గా నామకరణం చేశారు. ఈ రోబో డాగ్స్ మెట్లతో పాటు కొండలను నిటారుగా ఎక్కడంతో పాటు అడ్డంకులను దాటగలవు.జీవ, రసాయన, అణు పదార్థాలను పసిగట్టే సెన్సార్లు కలిగి ఉన్న ఈ రోబో డాగ్స్.. నిఘాతో పాటు బాంబులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం వంటి సేవల కోసం ఈ రోబో డాగ్స్ను ఆర్మీ ఉపయోగిస్తోంది.ఇదీ చదవండి: గుజరాత్ శకటాన్ని చూసి మురిసిపోయిన ప్రధాని మోదీ.. కారణమిదే15 కిలోల బరువును కూడా ఇవి మోయగలవు, అలాగే 40 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్లో కూడా పని చేస్తాయి. ఆర్మీలోని వివిధ యూనిట్లలో సుమారు వంద వరకు రోబో డాగ్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. #WATCH | West Bengal CM Mamata Banerjee takes part in #RepublicDay2025 celebrations at Kolkata.(Source: Mamata Banerjee Social Media) pic.twitter.com/1KUWOvFFvL— ANI (@ANI) January 26, 2025 -
Republic Day 2025: భారత రాజ్యాంగ రచనలో పాల్గొన్న మహిళలు వీరే..!
భారత నేతలు లాహోర్ వేదికగా జనవరి 26, 1930న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. ఆ రోజున నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర్య సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న జనవరి 26వ తేదీకి చిరస్థాయి కల్పించాలన్నసదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా, మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26నే దాన్ని అమల్లోకి తెచ్చారు. అలా జవరి 26, 1950న మన భారత్ గణతంత్ర దేశంగా అవతరించింది. అదే రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం. అంటే జనవరి 26, 1950తో బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది. ఈ దినోత్సవం అనేది నాటి మేధావులు వారి దూరదృష్టితో భారత రాజ్యంగా రచనకు ఎలా పాటుపడ్డారు, ఏవిధంగా రూపొందించారు అనేదానికి ప్రాముఖ్యతనిచ్చే రోజు. ఈ భారత రాజ్యంగం అమలులోకి వచ్చి నేటి 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా మన రాజ్యంగ రచనలో పాల్గొన్న మహిళలు, వారి నేపథ్యం గురించి తెలుసుకుందామా..!.భారత రాజ్యాంగాన్ని రాసిన మహిళలుఅమ్ము స్వామినాథన్ఆమె కేరళలోని ఒక ఉన్నత హిందూ కుటుంబంలో జన్మించారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహిళా హక్కుల కోసం న్యాయవాదిగా మారారు. ఆమె 1917లో ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ను సహ-స్థాపించారు.దాక్షాయణి వేలాయుధన్ఆమె భారతదేశంలో పట్టభద్రులైన మొదటి దళిత మహిళ. 1946లో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. ఆమె షెడ్యూల్డ్ కులాల హక్కుల గురించి చర్చలలో చురుకుగా పాల్గొనేవారు.బేగం ఐజాజ్ రసూల్రాజ్యాంగ సభలో ఏకైక ముస్లిం మహిళ. అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకురాలిగా పనిచేశారు ఆ తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ శాసనసభకు, రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె మైనారిటీ హక్కులు, విద్యకు గణనీయమైన కృషి చేశారు.దుర్గాబాయి దేశ్ముఖ్చిన్న వయసులోనే సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలలో చేరిన స్వాతంత్ర్య సమరయోధురాలు. విద్య, సంక్షేమం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడానికి ఆమె ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆ తర్వాత రాజ్యాంగ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె హిందూస్థానీని జాతీయ భాషగా ప్రతిపాదించారు, కుటుంబ కోర్టుల ఏర్పాటు కోసం వాదించారు. ఇక ఆ తర్వాత ఆమె ప్రణాళికా సంఘానికి మొదటి మహిళా చైర్పర్సన్ అవ్వడమే గాక సామాజిక సంక్షేమ చట్టాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.హంసా మెహతాఆమె సంస్కర్త, రచయిత్రి, విద్యావేత్త. బరోడాలోని ప్రగతిశీల కుటుంబంలో జన్మించారు. గాంధీ సూత్రాలకు అనుగుణంగా పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు. ఆమె బాంబే శాసనసభలో పనిచేశారు, మహిళల హక్కుల కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. అలాగే ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమె మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.కమలా చౌదరిఆమె శాసనోల్లంఘన ఉద్యమంలో చేరడానికి సంప్రదాయాన్ని ధిక్కరించారు. 1946లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. తర్వాత ఆమె తాత్కాలిక పార్లమెంటు, లోక్సభలో పనిచేశారు.లీలా రాయ్భారతదేశంలోని తొలి మహిళా పత్రిక సంపాదకురాలు. ఆమె జయశ్రీ అనే పత్రిక ఎడిటర్. లీలారాయ్ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. ఆమె సుభాష్ చంద్రబోస్కు కూడా అత్యంత సన్నిహితురాలు.మాలతి చౌదరిఆమె ఉప్పు సత్యాగ్రహం సమయంలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి గ్రామీణ వర్గాలకు విద్యను అందించడానికి తన భర్తతో కలిసి పనిచేశారు. సామాజిక సంస్కరణల కోసం అవిశ్రాంత న్యాయవాదిగా పనిచేశారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అట్టడుగు ఉద్యమాలను సమీకరించడంలో చౌదరి చేసిన ప్రయత్నాలు కీలకమైనవి.పూర్ణిమ బెనర్జీఆమె సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధురాలు. రాజ్యాంగ సభలో ఆమె లౌకిక విద్య గురించి మాట్లాడటమే గాక ప్రజల సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్పారు.రాజకుమారి అమృత్ కౌర్ఆమె భారతదేశపు మొట్టమొదటి ఆరోగ్య మంత్రి, రాజ్యాంగ సభలో యూనిఫాం సివిల్ కోడ్, సార్వత్రిక ఓటు హక్కు కోసం వాదించారు. ఆమె ఎయిమ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ను స్థాపించడంలో కూడా కీలక పాత్ర పోషించారు.రేణుకా రేఆమె మహిళల చట్టాల్లోని లోపాలను ఎండగడుతూ ఒక డాక్యుమెంట్ని రచించారు. ఆమె రాజ్యాంగ సభల సభ్యురాలుగా కీలక పాత్ర పోషించారు. తర్వాత పశ్చిమ బెంగాల్ సహాయ, పునరావాస మంత్రిగా, లోక్సభ ఎంపీగా పనిచేశారు.సరోజిని నాయుడుభారతదేశపు కోకిలగా పిలువబడే సరోజిని నాయుడు ఒక కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి మహిళ. ఆమె భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. మహిళల హక్కులు, సామాజిక సంస్కరణల కోసం వాదించింది. అలాగే రాజ్యాంగ సభ సభ్యురాలిగా ఎన్నికైంది. అంతేగాదు ఆమె లౌకికవాదం, సార్వత్రిక ఓటు హక్కుకు మద్దతుదారుగా భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసింది.సుచేతా కృపలానిఆమె భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో సహాయపడింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. పండిట్ నెహ్రూ "ట్రైస్ట్ విత్ డెస్టినీ" ప్రసంగానికి ముందు స్వాతంత్ర్య సమావేశంలో ఆమె వందేమాతరం కూడా పాడింది.విజయ లక్ష్మీ పండిట్పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి. ఆమె స్వాతంత్య్ర పూర్వ భారతదేశంలో మొట్టమొదటి మహిళా క్యాబినెట్ మంత్రి. 1937లో స్థానిక స్వపరిపాలన, ప్రజారోగ్య మంత్రి పదవిని నిర్వహించారు.అన్నీ మస్కరీన్ఆమె రాజ్యాంగ ముసాయిదాకు దోహదపడింది. హిందూ కోడ్ బిల్లుపై పనిచేసింది. 1949లో ట్రావెన్కోర్-కొచ్చిన్ ప్రభుత్వంలో ఆరోగ్యం, విద్యుత్ మంత్రిగా పనిచేసిన తొలి మహిళ మస్కరీన్.(చదవండి: సర్వ ఆహార సమ్మేళనం..!) -
గుజరాత్ శకటాన్ని చూసి మురిసిపోయిన ప్రధాని మోదీ.. కారణమిదే
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. గుజరాత్ శకటాన్ని పరిశీలనగా చూసి, మురిసిపోయారు. ఆ శకటం వెళుతున్నంత సేపూ ప్రధాని దానినే చూస్తూ ఉండిపోయారు.ఈసారి గుజరాత్ శకటంలో ప్రధాని మోదీ జన్మస్థలమైన వాద్నగర్కు స్థానం కల్పించారు. ఈ శకటంలో గుజరాత్ అభివృద్ధితో పాటు అక్కడి సంస్కృతి, వారసత్వం కనిపిస్తుంది. అహ్మదాబాద్లోని సబర్మతి నదిపై నిర్మించిన అటల్ వంతెనకు గుజరాత్ శకటంలో చోటు కల్పించారు. ద్వారక నగరం భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందబోతోందో కూడా చూపించారు. గత సంవత్సరం ఒడిశా ఉత్తమ శకట అవార్డును అందుకోగా, గుజరాత్ శకటానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో మొదటి స్థానం లభించింది. #WATCH 76वें गणतंत्र दिवस की परेड में गुजरात की 'स्वर्णिम भारत- विरासत और विकास' की झांकी ने कर्त्तव्य पथ पर मार्च किया। (सोर्स: डीडी न्यूज) pic.twitter.com/iGVGkctJQ1— ANI_HindiNews (@AHindinews) January 26, 2025గుజరాత్ శకటంలో 12వ శతాబ్దపు ‘కీర్తి తోరణ్’కు రూపమిచ్చారు. దీనిని గుజరాత్ సాంస్కృతిక ద్వారం అని పిలుస్తారు. అలాగే సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నమూనాను కూడా రూపొందించారు. శకటం వెనుక భాగంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేసిన సీ-295 విమాననపు ప్రతిరూపాన్ని ఉంచారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు -
‘ఆపిల్ చక్రవర్తి’కి పద్మశ్రీ.. జాతీయ వినూత్న వ్యవసాయవేత్తగానూ గుర్తింపు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపినవారు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాకు చెందిన హరిమాన్ శర్మ ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికై రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు.ఉద్యానవన రంగంలో కొత్త ప్రయోగాలు చేపట్టినందుకు హరిమాన్ శర్మను పద్మశ్రీ అవార్డుకు ఎంపికచేశారు. మైదాన ప్రాంతాల్లో ఆపిల్ను పండించడం ద్వారా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ నేపధ్యంలోనే ఆయనను ‘ఆపిల్ చక్రవర్తి’(సేబ్ సమ్రాట్) అని కూడా పిలుస్తారు. హరిమాన్ శర్మ 1998లో తన తోటలో ఆపిల్స్ను పండించడంపై ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. మొదట్లో శర్మ ప్లం చెట్టుకు ఆపిల్ చెట్టును అంటుకట్టారు.ఆపిల్ తోటల పెంపకంలో ఆయన చూపిన అంకితభావం ఈరోజు ఆయన ‘పద్మశ్రీ’ అందుకునేలా చేసింది. హరిమాన్ శర్మ గతంలో జాతీయ వినూత్న వ్యవసాయవేత్త అవార్డును కూడా అందుకున్నారు. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డుతో ఆయనను సత్కరించారు. ఆపిల్ పండ్లను చల్లని ప్రాంతాలలోనే కాకుండా వెచ్చని వాతావరణంలో కూడా పండించవచ్చని హరిమాన్ శర్మ నిరూపించారు.హరిమాన్ శర్మ హెచ్ఆర్ఎంఎన్-99 రకం ఆపిల్ను అభివృద్ధి చేశారు. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. ఆయన అభివృద్ధి చేసిన రకాన్ని పంజాబ్, బెంగళూరు, తెలంగాణలతో పాటు నేపాల్, దక్షిణాఫ్రికా, జర్మనీ, బంగ్లాదేశ్ మొదలైన రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ రకాన్ని పెంచడంలో కూడా ఆయన సహాయం చేశారు. ఈ ఆపిల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ రకం జూన్ నెలలో అందుబాటులోకి వస్తుంది. ఈ సమయంలో మార్కెట్లలో సిమ్లా ఆపిల్స్ అందుబాటులో ఉండవు. ఫలితంగా హెచ్ఆర్ఎంఎన్-99 రకం ఆపిల్ మంచి డిమాండ్ను అందుకుంటుంది.ఇది కూడా చదవండి: ట్రంప్ నిర్ణయం: అమాంతం పెరిగిన గుడ్ల ధరలు -
కర్తవ్యపథ్లో కొనసాగుతున్న గణతంత్ర వేడుకలు
ఢిల్లీ : క్తరవ్యపథ్ వేదికగా ఢిల్లీలో 76వ గణతంత్ర వేడుకలు (76th Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర వేడుకల్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు, ముఖ్య అతిథి, ఇండోనేషియా (Indonesia) అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) పాల్గొన్నారు.👉76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకతలు ఢిల్లీలో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలు 90 నిమిషాల పాటు నిర్విరామంగా కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదవి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకల్ని ప్రారంభించారు. #WATCH | President Droupadi Murmu unfurls the National Flag at Kartavya Path, on the occasion of 76th #RepublicDay🇮🇳National anthem and 21 Gun salute follows.(Source: DD News) pic.twitter.com/6969bmx2B4— ANI (@ANI) January 26, 2025ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రబోవోతో పాటు 352 మంది సభ్యుల ఇండోనేషియా కవాతు, బ్యాండ్ బృందం కవాతులో పాల్గొంటుంది.గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించడంతో గణతంత్ర దినోత్సవ పరేడ్ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ వేడుకల్ని వీక్షించేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ పేరుతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ సంస్థలకు చెందిన 15 శకటాలతో మొత్తం 31 శకటాలు కర్తవ్య పథ్ వేదికగా ప్రదర్శించనున్నాయి బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో సహా అత్యాధునిక రక్షణ శకటాలు ప్రదర్శించనున్నాయి. ఆర్మీకి చెందిన యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్’ డీఆర్డీవో ‘ప్రళయ్’ వ్యూహాత్మక క్షిపణి తొలిసారిగా ప్రదర్శించనుంది. ప్రదర్శనలో ఇతర సైనిక శకటాలలో టీ-90 ‘భీష్మ’ ట్యాంకులు, శరత్ పదాతిదళం వాహనాలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, మౌంటెడ్ పదాతిదళ మోర్టార్ సిస్టమ్ (ఐరావత్) ఉన్నాయి.దేశంలోని సాయుధ దళాల మధ్య ఐక్యత స్ఫూర్తికి ప్రతీకగా త్రివిద దళాల సేవలు ఉమ్మడిగా ప్రదర్శించనుండగా.. డీఆర్డీవో ‘రక్షా కవచ్’ థీమ్ను ప్రదర్శించనుంది.మౌంటెడ్ కాలమ్కు నాయకత్వం వహించే మొదటి ఆర్మీ దళం ఐకానిక్ 61 అశ్వికదళం. ఇది ప్రపంచంలోని ఏకైక గుర్రపు అశ్వికదళ రెజిమెంట్. నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రివిధ దళాల అనుభవజ్ఞులైన మహిళా అధికారులు ఉంటారు.కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ మోటార్సైకిల్ ప్రదర్శన 90 నిమిషాల నిడివి గల కవాతులో హైలైట్గా నిలవనుంది. కర్తవ్య పథంలో మొత్తం 5,000 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 300 మంది కళాకారులు సంగీత వాయిద్యాలపై ‘సారే జహాన్ సే అచ్ఛా’ ను వినిపించనున్నారు. ఢిల్లీలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మందికి పైగా పోలీసులు మోహరించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీని ఆరు లేయర్ల భద్రతా కొనసాగుతుంది. ఫేస్ రికగ్నైజన్ టెక్నాలజీతో 2,500 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు, యాంటీ-డ్రోన్ సిస్టమ్లు, రూఫ్టాప్ స్నిపర్లు పహారాకాస్తున్నాయి. -
Republic Day 2025: సర్వ ఆహార సమ్మేళనం..!
‘‘సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకుంటే అనారోగ్యమే. చక్కగా తినాలి... చక్కగా ఎక్సర్సైజ్లు చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం’’ అని ఉష మూల్పూరి(Usha Mulpuri)అన్నారు. నిర్మాతగా తన తనయుడు నాగశౌర్యతో ‘ఛలో, నర్తనశాల, కృష్ణా వ్రింద విహారి’ తదితర చిత్రాలను నిర్మించారు. తొలి చిత్రం ‘ఛలో’ తోనే నిర్మాతగా సక్సెస్ని టేస్ట్ చేసిన ఉష ఇప్పుడు తన రెస్టారెంట్ ‘ఉష మూల్పూరి’స్ కిచెన్(Usha Mulpuri's Kitchen)’ ద్వారా రుచికరమైన వంటకాలు అందిస్తున్నారు. ఇక గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా కొన్ని వంటకాలు(Recipes) తయారు చేశారు. ఆ వంటకాలు తెలుసుకుందాం. ‘‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్... ఆ మనుషుల ఆరోగ్యం మా బాధ్యత... అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా చేసిన వంటకాల్లోనూ పోషక విలువలు ఉండేలా చూసుకున్నాను’’ అంటూ దేశభక్తిని చాటుతూ, జెండా రంగులకు తగ్గట్టుగా తాను కూడా రెడీ అయి, కిచెన్లోకి ఎంటరయ్యారు ఉష. ముందుగా నాన్ వెజ్ స్టార్టర్ చేశారు.. ‘పండుమిర్చి కోడి వేపుడు, క్రీమ్ చికెన్, కరివేపాకు కోడి వేపుడు’ చేసి, ఆ కాంబోని అందంగా ప్రెజెంట్ చేశారు. ‘‘పండు మిర్చిలో విటమిన్ ఎ, బి, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే కేన్సర్తో పోరాడే ఔషద గుణాలు ఉంటాయి. కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ వంటివి ఉంటాయి. కంటికి, జుట్టుకి మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా కరివేపాకు బెస్ట్. అందుకే ఆహారం ఆరంభమే ఆరోగ్యంగా ఆరంభించాలని ఈ స్టార్టర్స్ చేశాను’’ అని వివరించారు ఉష. రైస్ ఐటమ్స్లో పుదీనా మాంసం పులావ్, చికెన్ ఫ్రైడ్ రైస్, పండుమిర్చి కోడి పులావ్ చేశారు. ‘‘పుదీనాకి మంచి వాసన ఉంటుంది. దాంతోపాటు రుచి కూడా బాగుంటుంది. అలాగే ఆహారం జీర్ణం కావడానికి పుదీనా మంచిది. ఐరన్ పుష్కలంగా ఉన్న పుదీనాని మీరు రోజూ తీసుకోవచ్చు. మనలో చాలామందికి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ టీలో కొన్ని పుదీనా ఆకులు వేసుకుని, తాగి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. ఇక నాన్వెజ్ తినేవారికి చికెన్లో ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయో తెలిసిందే’’ అని పేర్కొన్నారామె. మాంసాహారం మాత్రమే కాదు... శాకాహారం కూడా చేశారు ఉష. వెజ్లో కరివేపాకు వెజ్ పులావ్, పండుమిర్చి పనీర్ పలావ్, కర్డ్ రైస్ చేశారు.‘‘కరివేపాకు, పండుమిర్చి ఎంత మంచిదో ముందే చెప్పాను. పనీర్ మంచి ప్రోటీన్ ఫుడ్. నాన్వెజ్ తినేవారికి మాంసం రూపంలో ప్రోటీన్లు అందుతాయి. వెజిటేరియన్స్కి పనీర్ బెస్ట్. పనీర్లో తక్కువ కార్బోహైడ్రేట్స్... ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇక మన ఇండియన్స్లో చాలామందికి ఫైనల్గా పెరుగన్నం తింటేనే సంతృప్తిగా ఉంటుంది. పెరుగులో కావాల్సినంత కాల్షియం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొట్ట చల్లగా ఉండటానికి పెరుగన్నం కూడా చేశాను’’ అని తెలిపారు ఉష మూల్పూరి. ఎనిమిది పదుల వయసులవాళ్లకూ... ‘‘మనం ఆహారం తీసుకున్నాక పొట్ట బరువుగా ఉండకూడదు. తేలికగా అనిపించాలి. ఫుడ్ బిజినెస్ ఆరంభించాలనుకున్నప్పుడు నా మెయిన్ టార్గెట్ ఇదే. మా రెస్టారెంట్కి ఎనభై ఏళ్ల వయసు, ఆ పైన ఉన్నవాళ్లు కూడా వస్తారు. ‘పొట్ట చాలా తేలికగా ఉందమ్మా’ అని వారు చెప్పినప్పుడు హ్యాపీగా ఉంటుంది’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.సెలబ్రిటీలకూ... ‘‘మా కిచెన్ వంటకాలను ఎన్టీఆర్, రామ్చరణ్, ఉపాసన, కృష్ణారెడ్డి, హరీష్ శంకర్, బాబీ, బుచ్చిబాబు, కోటి, మెగా కృష్ణారెడ్డి, నందినీ రెడ్డిగార్లు వంటివారు ఇష్టపడతారు. మా దగ్గర బ్రొకోలీ కాషూనట్ చిల్లీ గార్లిక్ ఫేమస్. ఇవి ఎక్కువగా తెప్పించుకుంటారు’’ అని చెప్పారు ఉష. అవగాహన పెంచుకోవాలి ‘‘నేను రెస్టారెంట్ పెట్టాలనుకున్నప్పుడు నాకు పెద్దగా ఏమీ తెలియదు. జీతాలిచ్చి మనుషులను పెట్టుకుని, వాళ్లతో చేయించేయొచ్చు. కానీ అందులో పరిపూర్ణత ఉండదు. వంటకు కావల్సినవి కొనడం నుంచి వాటిని సరిగ్గా శుభ్రం చేసి వండటం వరకూ అన్నింటినీ దగ్గరుండి చేయించేదాన్ని. ‘సర్వ మత సమ్మేళనం’ అంటారు... ‘సర్వ ఆహారం సమ్మేళనం’ అంటాను. రెస్టారెంట్ అంటే రకరకాల వాళ్లు వస్తారు. వాళ్లకి తగ్గట్టుగా ఉండాలి కదా. నా కుటుంబ సభ్యులకు వండుతున్నట్లుగా భావించి వంట చేయిస్తాను. వీలున్నప్పుడల్లా అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్లి, అందర్నీ పలకరిస్తుంటాను. ‘మాకు ఇంటికి వచ్చినట్లుగా ఉంది’ అని అంటుంటారు. అందరికీ ‘సాక్షి’ ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను’’ అంటూ ముగించారు ఉష.– డి.జి. భవాని (చదవండి: నీ రీప్లేస్మెంట్ రోబో: సు'నీ'శితంగా శస్త్రచికిత్స) -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
-
Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు
గణతంత్ర వేడుకల సందర్భంగా దేశమంతా త్రివర్ణమయంగా మారిపోయింది. దీనిలో భాగంగా భారతీయ రైల్వే వివిధ రైల్వేస్టేషన్లను అందంగా ముస్తాబు చేసింది. వీటిని చూసిన ప్రయాణికులు మురిసిపోతున్నారు.అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ త్రివర్ణ పతాక కాంతిలో వెలుగొందుతోంది. రామాలయ నిర్మాణం తర్వాత, దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు.అస్సాంలోని కామాఖ్య జంక్షన్ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలివస్తారు.ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని రైల్వే స్టేషన్ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. ఇక్కడికి విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తారు. త్రివర్ణ పతాక కాంతిలో వారణాసి రైల్వే స్టేషన్ చాలా అందంగా కనిపిస్తోంది.దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు గణతంత్ర దినోత్సవ ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు.ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రైల్వే స్టేషన్ పూర్తిగా త్రివర్ణ లైట్లతో అలంకరించారు. రైల్వే స్టేషన్ మొత్తాన్ని త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల లైట్లతో అలంకరించారు.ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. త్రివర్ణ పతాక కాంతిలో ఝాన్సీ రైల్వే స్టేషన్ మిలమిలా మెరిసిపోతోంది.ప్రధాని మోదీ సొంత జిల్లా మెహ్సానాలోని రైల్వే స్టేషన్ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
Republic Day 2025: జెండా ఎగురవేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని తన అధికారిక నివాసంలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.ఈ రోజున భారతదేశం తన రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా సార్వభౌమ, సంపన్న, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత దేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రం దక్కించుకుంది. భారతదేశం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్ను రూపొందించే బాధ్యత బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్కు అప్పగించారు. ఆయన 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభకు ముసాయిదాను సమర్పించారు. 1950 జనవరి 26న భారతదేశం సొంత రాజ్యాంగాన్ని అమలు చేసిందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
Republic Day: ఇండోనేషియా ప్రతినిధి బృందం నోట ‘కుచ్ కుచ్ హోతాహై’ పాట
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్ వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందులో ఇండోనేషియా ప్రతినిధి బృందం పాల్గొంది.ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రతినిధి బృందం బాలీవుడ్ సినిమా 'కుచ్ కుచ్ హోతా హై'లోని పాటను ఆలపించింది. ఈ ప్రతినిధి బృందంలో ఇండోనేషియా సీనియర్ మంత్రులు ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. #WATCH | Delhi: A delegation from Indonesia sang Bollywood song 'Kuch Kuch Hota Hai' at the banquet hosted by President Droupadi Murmu in honour of Prabowo Subianto, President of Indonesia at Rashtrapati Bhavan. The delegation included senior Indonesian ministers. The… pic.twitter.com/VH6ZHRTbNS— ANI (@ANI) January 25, 2025కాగా భారతదేశం-ఇండోనేషియా రక్షణ, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో విస్తృతంగా చర్చలు జరిపారు. రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, రక్షణ తయారీ తదితర రంగాల్లో సంయుక్తంగా పనిచేయడానికి అంగీకరించాయి.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
Republic Day-2025: జమ్ము స్టేడియానికి బాంబు బెదిరింపు
శ్రీనగర్: నేడు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో జెండాను ఎగురవేయనున్నారు. ఇందుకు సన్నాహాలు జరుగున్నాయి. దీనిలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొననున్నారు. అయితే ఇంతలో జమ్ము పోలీసులకు ఎంఏఎం స్టేడియంపై బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్టేడియంలో అణువణువునా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ దొరకకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా కశ్మీర్ లోయలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కశ్మీర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వికె విర్ది మాట్లాడుతూ గణతంత్ర వేడుకలను సురక్షితంగా నిర్వహించడానికి భద్రతా సంస్థలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయని అన్నారు.దేశవ్యాప్తంగా నేడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 1950లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవాన్ని భారత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వానికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు. ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని రాజ్పథ్లో జరుగుతుంది.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
రిపబ్లికే డే శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో దేశంలో రిపబ్లిక్ డే వేడుకలు భిన్నత్వంలో ఏకత్వ బలాన్ని చాటి చెప్తాయని తెలిపారు.వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ‘రిపబ్లిక్ డే వేడుకలు భిన్నత్వంలో ఏకత్వ బలాన్ని చాటి చెబుతాయి. ఈ వేడుకలు సాంస్కృతిక వైవిద్యానికి అద్దం పడుతాయి. భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసే రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని అన్నారు. On this 76th Republic Day, let us celebrate the strength of our Unity in Diversity. Together, we pledge to uphold and reinforce the constitution that defines our great nation. Jai Hind!#RepublicDay— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2025 -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతీయ వేడుక రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాయకత్వంలో న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రధాన గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' లో ప్రధానమంత్రి ఒక పోస్ట్లో ‘అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతపై ఆధారపడి ఉండేలా మార్గాన్ని రూపొందించిన మహనీయులందరికీ మనం నివాళులు అర్పిస్తున్నాం’ అని అన్నారు. Happy Republic Day. Today, we celebrate 75 glorious years of being a Republic. We bow to all the great women and men who made our Constitution and ensured that our journey is rooted in democracy, dignity and unity. May this occasion strengthen our efforts towards preserving the…— Narendra Modi (@narendramodi) January 26, 2025నేటి గణతంత్ర దినోత్సవంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. గణతంత్ర దినోత్సవ కవాతు దేశ సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది. అయితే 1950 జనవరి 26న భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.ఇది కూడా చదవండి: Republic Day-2025: అందంగా ముస్తాబు.. అణువణువునా గాలింపు -
Republic Day-2025: అందంగా ముస్తాబు.. అణువణువునా గాలింపు
నేడు (జనవరి 26) దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలను అందంగా ముస్తాబు చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచారు. #WATCH | Delhi: On the eve of #RepublicDay, and the occasion of National Voters' Day as well as ahead of #DelhiElections2025, the iconic Qutub Minar illuminated in colours of the Tricolour and Voter Awareness Programme. pic.twitter.com/oRGtZO6ASu— ANI (@ANI) January 25, 2025దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో అత్యంత భారీగా పరేడ్ జరగనుంది. ఈ నేపద్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.#WATCH | Delhi | The Central Secretariat building complex illuminates with colourful lights and Tricolor on the eve of the 76th #RepublicDay pic.twitter.com/bSBTKWNClV— ANI (@ANI) January 25, 2025ఢిల్లీలోని ప్రతీ ప్రాంతంలో సైనికులు పహారా కాస్తున్నారు. దీనికి సంబంధించి అనేక వీడియోలు వెలువడ్డాయి.#WATCH | Delhi: Security personnel carry out foot patrolling at Sarojini Nagar Market on the eve of #RepublicDay pic.twitter.com/9OwyABwjBc— ANI (@ANI) January 25, 2025ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ నియంత్రణ కేంద్రం ద్వారా భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.#WATCH | Delhi: Security tightened at Sarojini Nagar Market on the eve of #RepublicDay pic.twitter.com/drBd5dnTRC— ANI (@ANI) January 25, 2025భద్రతా సిబ్బంది ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్లో పెట్రోలింగ్ నిర్వహించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.ఢిల్లీ లోని చారిత్రాత్మక ఇండియా గేట్ త్రివర్ణ పతాక కాంతితో వెలిగిపోతోంది. సెంట్రల్ సెక్రటేరియట్ భవన సముదాయం కూడా రంగురంగుల లైట్లు, త్రివర్ణ పతాకాలతో మెరుస్తోంది. కుతుబ్ మినార్ కూడా త్రివర్ణ పతాక రంగుల్లో కాంతివంతంగా మారింది.#WATCH | Delhi: Police monitor the security situation at Sarojini Nagar Market through the FRS (Facial recognition system) control centre here. pic.twitter.com/PsT4UNHDFO— ANI (@ANI) January 25, 2025ఒకవైపు జనవరి 26, మరోవైపు ఢిల్లీ ఎన్నికలు ఉన్నందున విరివిగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఢిల్లీ అదనపు డీసీపీ (సౌత్) అచింత్ గార్గ్ తెలిపారు. సున్నితమైన ప్రదేశాలు,మార్కెట్లలో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. ఇది కూడా చదవండి: Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు#WATCH | Odisha: Sand artist Sudarsan Pattnaik created sand art in Puri, on the eve of #RepublicDay pic.twitter.com/fD9KLPWqvr— ANI (@ANI) January 25, 2025 -
ప్రతిభా భూషణాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్,నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.పట్టుదలే పద్మభూషణ్ వరకూ...అజిత్ తండ్రి సుబ్రమణి తమిళనాడులో పుట్టారు. అయితే కేరళ మూలాలు ఉన్న కుటుంబం. తల్లి మోహినిదిపాకిస్థాన్ లోని కరాచీ. కోల్కతాలో స్థిరపడ్డ సింధీ కుటుంబం. కాగా కోల్కతాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మోహినితో ప్రేమలో పడ్డారు సుబ్రమణి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సికిందరాబాద్లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదేళ్లు ఉంది ఆ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు. అజిత్ రెండో కొడుకు. అజిత్కి ఏడాదిన్నర వచ్చాక చెన్నైలో స్థిరపడ్డారు. చదువులో లాస్ట్... అజిత్కి పెద్దగా చదువు అబ్బలేదు. అయితే క్రికెట్లో బెస్ట్. ఎన్ సీసీలోనూ మంచి ర్యాంకు సంపాదించాడు. కానీ సరిగ్గా చదవకపోవడంతో స్కూలు యాజమాన్యం అజిత్ని పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతోపాటు స్కూలు నుంచి పంపించేసింది. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు షోరూమ్లో మెకానిక్ అప్రెంటిస్గా చేరడం, తల్లిదండ్రుల ్రపోద్భలంతో గార్మెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో చేరడం, అవి చేస్తూనే రేసుల్లోపాల్గొనడం, ఇలా సాగింది. ఇక ఎవరో ఇచ్చిన సలహాతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు అజిత్. ప్రముఖ నటుడు–రచయిత–దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా ఆరంభమైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పడంతో నిర్మాత పూర్ణచంద్రరావు అజిత్ని హీరోగా తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మృతి చెందడంతో షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు.‘ఆశై’తో హిట్ ట్రాక్: ఎస్పీబీయే తమిళ దర్శకుడు సెల్వకి చెప్పి, అజిత్కి ‘అమరావతి’లో హీరోగా నటించే చాన్స్ ఇప్పించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు లుక్స్, నటన పరంగా అజిత్కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఓ రేసుకి సంబంధించిన ట్రయల్కి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెన్నెముకకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ‘ఆశై’ (1995)తో అజిత్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన ‘కాదల్ కోటై్ట’ (ప్రేమ లేఖ), ‘వాలి’ వంటివి సూపర్ హిట్. సినిమాలు చేస్తూనే బైక్, కారు రేస్లకూ వెళుతుంటారు. ఇటీవల కారు రేసులో అజిత్ టీమ్ విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రాల్లో ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’గా విడుదల కానుంది. జీవితంలోనూ అజిత్కి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలే నేడు ‘పద్మభూషణ్’ వరకూ తీసుకొచ్చింది. ఇక ‘అమర్కలమ్’ (1999) సినిమాలో నటించినప్పుడు అజిత్, హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.యాక్టివ్గా యాక్టింగ్ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ (76) గురించి నేటి తరానికి చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమా చాలు. ‘ప్రేమ లేఖలు’ (1977), ఆ తర్వాత ‘శాంతి క్రాంతి’, ‘శంఖారావం’ వంటి చిత్రాలతో నాటి తరం తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బాగా గుర్తింపు ఉంది. ఇక నేటితరం తెలుగు ప్రేక్షకులకు ‘కేజీఎఫ్’ (2018) ద్వారా దగ్గరయ్యారు అనంత్ నాగ్. ఈ సినిమాలో ఆయన రచయితపాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సంకల్ప’ (1973) చిత్రంతో కన్నడంలో నటుడిగా పరిచయం అయ్యారు అనంత్ నాగ్. ఆ చిత్రం పలు అవార్డులు సాధించడంతోపాటు నటుడిగానూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 50 ఏళ్ల నట జీవితంలో దాదాపు రెండువందల కన్నడ చిత్రాల్లోనూ, హిందీ, మరాఠీ, తెలుగు, మలయాళం, ఆంగ్లంలో దాదాపు వంద చిత్రాలు... మొత్తంగా మూడ వందల చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. పలు టీవీ షోల్లోనూ నటించారు. 76 ఏళ్ల వయసులోనూ యాక్టివ్గా ఉంటూ... సినిమాలు చేస్తున్నారు.కొత్త పంథాకి భూషణంశేఖర్ కపూర్ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా బాలీవుడ్కి మ్యాజికల్ టచ్ ఇచ్చిన నిన్నటి తరం దర్శక–నిర్మాత. చేసినవి కొన్ని సినిమాలే అయినా, సంపాదించిన కీర్తి, భారతీయ సినిమాకి తెచ్చిపెట్టిన గౌరవం గొప్పవి. ఇప్పటిపాకిస్థాన్లోని లాహోర్లో జన్మించారు. సినిమాల మీద మక్కువతో ముంబయి చేరుకున్నారు. మొదట నటుడుగా ప్రయత్నాలు చేశారు. దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లో నటించారు. దూరదర్శన్ తొలిదశలో వచ్చిన ‘ఖాన్ దాన్’ మొదలైన టీవీ సీరియల్స్లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే కొన్నిపాత్రలు చేశారు. ‘మాసూమ్’తో డైరెక్టర్గా...‘మాసూమ్’ సినిమాతో డైరెక్టర్గా తన కెరీర్ని కొత్త దారి పట్టించారు. ‘ది మేన్, విమెన్ అండ్ చైల్డ్’ అనే ఇంగ్లిష్ నవల ఆధారంగా శేఖర్ కపూర్ తీసిన సినిమా అది. భారతీయ సినిమాకి తెలియని కొత్త కథేమీ కాదు. కానీ సెన్సిబుల్గా కథని చెప్పారు. దాంతో శేఖర్ కపూర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్టయిల్ మార్చేశారుఇండియాలో అన్ని వర్గాల ఆడియన్స్కి శేఖర్ కపూర్ని ఓ బ్రాండ్గా మార్చిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. ‘ది ఇన్విజిబుల్ మేన్’ అనే కామిక్స్ స్ఫూర్తితో ‘మిస్టర్ ఇండియా’ కథ రూపొందింది. హిందీలో అదృశ్య వ్యక్తి హీరోగా అంతకు మునుపు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఐడియానిపాపులర్ పల్ప్ ఫిక్షన్ చేసిన ఘనత శేఖర్ కపూర్దే. కమర్షియల్ కథలను కొత్తగా చెప్పే డైరెక్టర్ వచ్చాడని బాలీవుడ్ మురిసిపోయినంత సేపు పట్టలేదు – శేఖర్ కపూర్ తన స్టయిల్ మార్చేశారు.బాండిట్ క్వీన్కి అడ్డంకులు... అవార్డులుచంబల్ లోయకి చెందిన బందిపోటు పూలన్ దేవి జీవిత గాథ ఆధారంగా ‘బాండిట్ క్వీన్’ సినిమా తీశారు శేఖర్. సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ అయ్యాక చాలా అవార్డులు గెలుచుకుంది. శేఖర్ కపూర్ దృక్పథాన్ని మార్చింది. బ్రిటన్ మహారాణి జీవితం ఆధారంగా ‘ఎలిజిబెత్’ సినిమా తీశారు. అంతర్జాతీయంగా శేఖర్ కపూర్ పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డ్స్లో ఏడు నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ‘ది ఫోర్ ఫెదర్స్’ (2002), ‘ఎలిజెబెత్’కి సీక్వెల్గా ‘ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్’ (2007)ని తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన శేఖర్ కపూర్ పద్మ భూషణుడు కావడం చిత్రసీమకు లభించిన గిఫ్ట్.– తోట ప్రసాద్, ప్రముఖ సినీ రచయితఆమె కెరీర్ శోభాయమానంకేరళలోని త్రివేండ్రంలో (ప్రస్తుతం తిరువనంతపురం) 1970 మార్చి 21న జన్మించారు శోభన. ఆమె పూర్తి పేరు శోభనా చంద్రకుమార్ పిళ్లై. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ (1986) సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు శోభన. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్బాబు, రజనీకాంత్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, కార్తీక్ వంటి హీరోల సరసన నటించారు.మాతృభాష మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసిన శోభన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘రుద్రవీణ, అభినందన, అల్లుడుగారు, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు’ వంటి పలు తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందిన ఆమె క్లాసికల్ డ్యాన్సర్గానూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోనూ, నాట్యంలోను శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను నెలకొల్పారు శోభన. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకు అంకితం చేశారు. ఓ వైపు దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తూ.. మరోవైపు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నారామె.నటసింహ కీర్తి కిరీటంలో...నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.‘సాహసమే జీవితం’తో హీరోగా1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానంలో...‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. -
Telangana: 4 పథకాలు నేడే షురూ
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కారు్డల జారీ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని యూనిట్గా తీసుకుని.. తొలిరోజున ఆ గ్రామంలో పూర్తి శాచురేషన్ పద్ధతిలో పథకాలను వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. లక్షల్లో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలను ఇవ్వాలని ఆలోచనతో ఉన్నామని.. దీనిపై ఎలాంటి పరిమితి లేదని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను మార్చి 31 కల్లా పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పథకాల అమలుకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి శనివారం పలువురు మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సచివాలయంలో సహచర మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సమావేశం వివరాలను వెల్లడించారు.అర్హత ఉన్న అందరికీ పథకాలు..‘‘లక్షల మంది తమ పేర్లు లేవంటూ గ్రామసభల్లో దరఖాస్తులు పెట్టుకోవడంతో పరిశీలన కోసం మార్చి వరకు సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరూ మిగిలిపోరు. రైతు భరోసా కింద వ్యవసాయోగ్యమైన ప్రతి ఎకరానికి సాయం చేస్తాం. ఉపాధి హామీ పథకం కింద ఏడాదిలో కనీసం 20 రోజులు పనిచేసిన కూలీలను గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేస్తాం. షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహిస్తున్నాం. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన లక్షలాది దరఖాస్తులను క్రోడీకరించి అర్హత ఉన్న వారందరికీ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పరమ పవిత్రమైన రోజు కావడంతో ఈ ఉదాత్తమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం..’’ అని భట్టి తెలిపారు. ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో పంచుకోవాలని ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. తనతో సహా సీఎం, మంత్రులు స్వయంగా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. భూమి లేని కూలీలందరూ ఉపాధి హామీ పనులకు వెళ్తారని ఓ ప్రశ్నకు బదులుగా భట్టి పేర్కొన్నారు.70శాతానికిపైగా జనాభాకు సన్నబియ్యం: ఉత్తమ్ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల మధ్య నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. గ్రామంలో అర్హులందరికీ పథకాలను అందిస్తామన్నారు. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గతంలో దరఖాస్తులిచ్చినా, సామాజిక ఆర్థిక సర్వే, గ్రామసభ, ప్రజాపాలనలో ఇచ్చినా అర్హత ప్రకారం పరిశీలించి రేషన్కార్డులు ఇస్తామని చెప్పారు. స్వతంత్ర భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి చొరవ తీసుకోలేదన్నారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలన్నింటికీ ఆహార భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నమని చెప్పారు. కొత్త రేషన్కార్డులిచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తామని.. రాష్ట్ర జనాభాలో 70–72శాతం మందికి ప్రతి నెలా ఉచితంగా ఇవ్వబోతున్నాని తెలిపారు.రబీకి ముందే రైతు భరోసా..: తుమ్మలతమ సర్కారు ఒకే ఏడాదిలో రైతుల ఖాతాల్లో రూ.40 వేల కోట్లను నేరుగా జమ చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. రబీ సీజన్కు ముందే వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చబోతున్నామని తెలిపారు.అనర్హులకు ఇళ్లు ఇస్తే రద్దు: పొంగులేటి శ్రీనివాసరెడ్డిఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తే వాటిని రద్దు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. అనర్హులు లబ్ధిపొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎక్కడా అవినీతి, పైరవీలకు స్థానం లేకుండా పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 606 మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇళ్లను ఇవ్వబోతున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారందరికీ జనవరి 26న ఒకేసారి పథకాలను ఇవ్వాలని అనుకున్నామని.. కానీ గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించాల్సి ఉండటంతో తొలుత ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. గ్రామసభల్లో కొంత మంది, కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్రలు పన్నాయని ఆరోపించారు. పథకాలను పూర్తిస్థాయిలో ఎప్పుడు, ఎక్కడ అమలు చేస్తారన్న షెడ్యూల్ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటిస్తామని తెలిపారు. -
లాంగ్ లివ్ ద రిపబ్లిక్
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్కు చేర్చిన టీమ్ క్యాప్టెన్ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్అండ్ బ్యాలెన్సెస్లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్ ది కాన్స్టిట్యూషన్’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్ ది స్టేట్’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్ ఆఫ్ ది స్టేట్స్’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్ హార్స్’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్’ (ఓఎన్ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం: రాష్ట్రపతి
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం అని.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశం మొత్తం గర్వించదగ్గ సందర్భం ఇదని.. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందన్న రాష్ట్రపతి.. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఎల్లప్పుడూ మన నాగరిక వారసత్వంలో భాగంగా ఉన్నాయి. మన వారసత్వ గొప్పతనానికి నిదర్శనం మహా కుంభమేళా. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకొన్నాం. వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నాం. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చాం. జమిలి ఎన్నికలు పాలనలో స్థిరత్వాన్ని అందించడంతో పాటు ఆర్థికపరమైన భారాన్ని కూడా తగ్గిస్తాయి’’ అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. -
HYD: పలు చోట్ల రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో ఆదివారం(జనవరి26) పలుచోట్ల ట్రాఫిక్ అంక్షలు అమల్లోకి రానున్నాయి. సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రాండ్స్లో రిపబ్లిక్ డే, రాజ్ భవన్ ఎట్ హోం కార్యక్రమాల దృష్ట్యా ట్రాఫిక్ అంక్షలు విధించనున్నారు. జనవరి 26న ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో, రాజ్ భవన్ పరిసరాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా పంజాగుట్ట, గ్రీన్ల్యాండ్స్, బేగంపేట్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో వచ్చే వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గ్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలైన టివోలీ థియేటర్ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాలను మూసివేయనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లే ప్రయాణికులు కాస్త ముందుగా బయల్దేరి రైల్వేస్టేషన్కు చేరుకోవాలని పోలీసులు సూచించారు. -
ప్రధాని మోదీతో ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో భేటీ
-
వాగ్దాన పూరిత ఎంపిక
మన రాజ్యాంగ అమృతో త్సవ సందర్భం తర్వాత జరుగుతున్న 2025 రిప బ్లిక్ దినోత్సవంలోఆంధ్రప్రదేశ్ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా తొలి కలెక్టర్ నిశాంత కుమార్ను ‘ప్రైమ్ మిని స్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ 2023’కి భారత ప్రభుత్వం ఎంపిక చేయడం ఒక వాగ్దానపూరిత ఎంపిక. ఒడిశాను ఆనుకుని ఉన్న ఏపీ సరి హద్దులోని ఆ గిరిజన ప్రాంతం అస్సలు జిల్లా ఎప్పుడు అయింది? అక్కడ కలెక్టర్ ఎందుకుఉంటాడు? అనేవి కొత్తవారికి ఈ వార్త విన్నప్పుడు కలిగే సందేహాలు. ఇక్కడే ‘లెజిస్లేచర్’ (శాసన వ్యవస్థ) పాత్ర కీలకమై, దాని రాజకీయ నిర్ణయాల చర్చకు ఈ ‘అవార్డు’ కేంద్రబిందువు అవుతున్నది.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్ళలో కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసింది. ‘లెజిస్లేచర్’ (శాసన వ్యవస్థ), ‘ఎగిక్యూటివ్’ (కార్యనిర్వాహక వర్గం) కలసి తీసుకున్న (ప్రభుత్వ) నిర్ణయంతో విజయనగరం జిల్లాలో భాగమైన పార్వతీపురం విడిపోయి 2022 ఏప్రి ల్లో అదొక కొత్తజిల్లా అయితే... దాని తొలి కలెక్టర్ నిశాంత కుమార్ 2022–24 మధ్య అక్కడ పనిచేశారు. అది జిల్లా కావడానికి కొంచెం ముందుగానే, ఒడిశా సరిహద్దున రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న 21 కొటియా గిరిజన గ్రామాల సమస్య విషయమై 2021 నవంబరులో జగన్ అప్పటి ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ను భువనేశ్వర్లో కలిసి మాట్లాడ్డంతో దాని పరిష్కారానికి ఒక రూపం వచ్చి, రెండు రాష్ట్రాల ‘ఎగ్జిక్యూటివ్’ల మధ్య చర్చ మొదలైంది.పదిహేను మండలాలకు అంటే ఒక ‘ఎస్సీ’, మూడు ‘ఎస్టీ’ అసెంబ్లీ నియోజక వర్గాల ‘ప్రజ లకు’ కొత్తగా ఒక ‘కలెక్టరేట్’ వచ్చింది. ఇక్కడ గమనించవలసిన నాలుగు అంశాలు ఉన్నాయి: ఒకటి ‘ప్రాంతం’ (పార్వతీపురం), రెండు‘ప్రజలు’ (గిరిజనులు), మూడు ‘ప్రభుత్వం’ (వైసీపీ), నాలుగోది ‘సార్వభౌమాధికారం’ (కలె క్టర్). ఈ నాలుగు ‘రాజ్యం’ ఉపాంగాలు. వీటిలో రాజ్యంగ ప్రతినిధిగా ‘కలెక్టరేట్’ రూపంలో ‘సార్వభౌమాధికారం’ (సావర్నిటీ) 75 ఏళ్లతర్వాత ఆ మన్య ప్రాంతంలో సూక్మస్థాయిలోకి ప్రవేశించింది.ఇక ఇక్కడ జరిగింది చూస్తే... జిల్లాయంత్రాంగం (వైద్య ఆరోగ్యశాఖ) వివరాల ప్రకారం 2022 ఏప్రిల్లో కలెక్టరేట్ వచ్చాక ‘ప్రిజం–10’ (‘ప్రాజెక్ట్ టు రెడ్యూస్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ బిలో 10’) అమలు అయ్యే నాటికి ఇక్కడి శిశు మరణాల రేటు 24, తల్లుల మరణాల రేటు 128, రోగ నిరోధకత 47.2 శాతం ఉంది. కలెక్టర్ తీసుకున్న ప్రత్యేక చొరవతో రెండేళ్లలో 2024 ఫిబ్రవరి నాటికి 97.77 శాతం రోగనిరోధకతతో ఏడాదికి 210 మంది శిశువుల జననంతో మర ణాల రేటు 8కి తగ్గింది. అలా ఈ ప్రాజెక్టు అమలులో పార్వతీపురం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రజలు, ప్రభుత్వ సిబ్బందిలో నమ్మకం కలిగించడానికి కలెక్టర్ నిశాంత్ కుమార్ తన భార్య కాన్పు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించారు. దాంతో ‘ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్’గా పార్వతీపురం జిల్లాను భారత ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డ్ ప్రకటించింది. ఆ మన్యప్రాంతంలో గాలిలో దీపంలా మారిన గిరిజన శిశువుల ప్రాణాలు నిలపడంతో అక్కడ ‘రాజ్యం’ పని మొదలైంది. పౌర సంక్షేమం విషయంలో రాజ్యం బాధ్యత–‘ఫ్రవ్ు క్రేడిల్ టు గ్రేవ్’ (ఊయల దశ నుండి సమాధి వరకూ...) అనేది రాజనీతి శాస్త్ర తొలి పాఠం.రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా పార్వతీపురం, పల్నాడు వంటి జిల్లాలు ఏర్పాటుచేసి, ‘కోటలో పాగా’ రాజకీయాలను మొదలుపెట్టిన జగన్ దీన్నే బహిరంగ సభల్లో జనరంజక భాషలో చెప్పే ప్రయత్నంలో– ‘ఇది పేదలకూ, పెత్తందార్లకూ మధ్య జరుగుతున్న యుద్ధం’ అనేవారు. కొందరి కిది సానుకూలంగా అర్థమైతే, మరికొందరికి ఇది ‘విధ్వంసం’ అనిపించింది. ఎవరికి ఏది ఎలా అర్థ మైనా, ఈ ‘అవార్డు’ అయితే సానుకూలంగా ఆలో చించేవారికి సంతోషం కలిగించేది అవుతుంది.-జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
కనువిందు చేస్తున్న రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ (ఫోటోలు)
-
రాజమండ్రిలో మధురపూడి ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్
-
Republic Day 2025: అందమైన ఈ శకటాలను చూసితీరాల్సిందే
జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ నేపధ్యంలో ప్రతీయేటా అదేరోజున రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఈ వేడుకల నిర్వహణకు ఇప్పుటికే దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన అందమైన శకటాలు అందరినీ అలరించనున్నాయి. ఇప్పటికే ఈ శకటాల రూపకల్పన పూర్తయ్యింది.లడఖ్ ఘనతను చూపే ఈ శకటం ఎంతో ప్రత్యేకంగా రూపొందింది. ఇది అత్యంత అందమైన శకటాలలో ఒకటి కానుంది. ఈ శకటాన్ని పాత్ ఆఫ్ డ్యూటీ ముందు నేషనల్ స్టేడియం క్యాంప్లో ప్రదర్శనకు ఉంచారు.గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ శకటం ఎంతగానో ఆకట్టుకుంటోంది. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో దీనిని మనం చూడవచ్చు.2025 గణతంత్ర దినోత్సవ పరేడ్లో పశ్చిమ బెంగాల్ శకటాన్ని కూడా చూడవచ్చు. ఈ అందమైన శకటం అందరి ప్రశంసలు అందుకోనుంది.జమ్ముకశ్మీర్ శకటం చాలా మంది హృదయాలను దోచుకోనుంది. జమ్ముకశ్మీర్ సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిందనే విషయం అందరికీ తెలిసిందే.జార్ఖండ్ శకటాన్ని ఎంతో అందంగా తయారు చేశారు. ఈ శకటం రాజ్పథ్లో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.ఉత్తరప్రదేశ్ శకటం జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ అందమైన శకటంలో ‘సముద్ర మథనం’ప్రాణం పోసుకుంది.బీహార్ శకటం ఆ రాష్ట్రంలోని స్వర్ణయుగాన్ని ప్రతిబింబిస్తోంది. బీహార్ అనేక శతాబ్దాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాన కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ శకటం కూడా అందరి దృష్టిని ఆకర్షించడంలో ముందుంటుంది. జనవరి 26న ఈ శకటాన్ని చూడవచ్చు.2025 గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొనబోతున్న గోవా శకట కళాకారులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ ఆదేశాలు.. బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం -
ఢిల్లీలో ఈనెల 26న రిపబ్లిక్ డే వేడుకలు
-
గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు
ఢిల్లీ: రిపబ్లిక్ డే-2025 వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరుకానున్నారు రిపబ్లిక్ డే పరేడ్లో ఇండోనేషియా బృందం పాల్గొనుంది. యుద్ధ వీరుల స్మారక స్తూపం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించనున్నారు. 300 మంది కళాకారులతో సారే జహాసే అచ్చా సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శించనున్నారు.స్వర్ణీం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్తో శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. 75 ఏళ్ల రాజ్యాంగానికి సంబంధించిన రెండు ప్రత్యేక శకటాలను రూపకల్పన చేశారు. కర్తవ్య పత్లో 11 నిమిషాల పాటు జయ జయ భారతం సాంస్కృతిక నృత్య ప్రదర్శన, ఈనెల 29న విజయ్ చౌక్లో బీటింగ్ రిట్రీట్, వివిధ బెటాలియన్లకు సంబంధించిన మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన, భారతీయ మ్యూజిక్ బ్యాండ్ను బెటాలియన్లు ప్రదర్శించర్శించనున్నారు. -
పుష్ప ప్రదర్శనలో సినీ నటి ప్రేమ సందడి (ఫొటోలు)
-
ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్కు పిలుపు..
ఘనం.. వారిరువురూ వృత్తి రిత్యా నగిషీ కళాకారులు.. వారసత్వంగా వచ్చిన వృత్తిపై మామకారాన్ని పెంచుకున్నారు. అంతటితో ఆగకుండా తమ వృత్తికి కళాత్మకతను జోడించి వివిధ కళారూపాలను తీర్చిదిద్దారు. తమ కళతో అందరినీ మెప్పించి అనేకమందిని ఆకర్షించారు. తమలోని భిన్నమైన కళతో ప్రముఖుల నుంచి శభాష్ అనిపించుకుంటున్నారు. వారే హైదరాబాద్లోని అంబర్పేట డీడీ కాలనీలో నివసించే కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు.. గత 30 ఏళ్లుగా వెండితో ఫిలిగ్రీ కళారూపాలను తయారు చేస్తూ తమదైన ముద్ర వేసుకున్నారు. వీరి కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను అందించి అభినందించింది. వీరి ఫిలిగ్రీ కళలో చేస్తున్న కృషికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటిప్పుడు గుర్తించి పలు అవార్డులను అందించి సత్కరిస్తున్నాయి. గణతంత్ర వేడుకలకు.. ఫిలిగ్రీ కళలో వీరి ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు వీరిని ఆహా్వనించింది. 2025 జనవరి 26న జరిగే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే కబురు అందింది. ఈ నెల 23న ఢిల్లీకి చేరుకోవాల్సిందిగా కోరింది. దీంతో కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ గణతంత్ర వేడుకలకు తమను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఎంతో గర్వంగా ఉందన్నారు. ఢిల్లీ వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నామని వారు సాక్షితో వెల్లడించారు. వివిధ కళారూపాలు.. వెండితో గత 30 ఏళ్లుగా వివిధ కళారూపాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అతిథుల జ్ఞాపికలు అందించేందుకు తమను సంప్రదించి ప్రత్యేక కళారూపాలను తయారు చేయించుకుని వెళ్తారన్నారు. వెండితో చార్మినార్, హైటెక్ సిటీ, చారిత్రాత్మక గుర్తులు, వీణ, రాట్నం, వెండి బుట్టలు వంటి కళారూపాలను రూపొందించామన్నారు. అవసరమైన వారికి తాము చెప్పిన రీతిలో అందిస్తామంటున్నారు. కళను గుర్తించి.. కృష్ణాచారి శ్రమ, కళను గుర్తించి 2006 అప్పటి రాష్ట్రపతి ప్రతిభపాటిల్ జాతీయ అవార్డు అందజేశారు. తన సతీమణ గౌరిదేవికి 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ అవార్డు అందజేశారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులను ఈ దంపతులు అందుకున్నారు. ఫిలిగ్రీ కళ తరపున రాష్ట్ర, దేశ బృందాల్లో వీరు చోటు సంపాదించుకుని తమదైన ముద్ర వేస్తున్నారు. మహేశ్వరం బీసీ హాస్టల్ విద్యార్థి గొల్ల అక్షయ్ మహేశ్వరం : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కర్తవ్య ఫరేడ్ విక్షించడానికి ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద తెలంగాణ నుండి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం బీసీ హస్టల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి గొల్ల అక్షయ్ ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కారులు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలిచన వారిని, ఇలా తెలంగాణ రాష్ట్రం నుండి 31 మందిని ఎంపిక చేశారు. ఇందులో మహేశ్వరం బీసీ హస్టల్లో ఉంటూ స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న గొల్ల అక్షయ్ని ఎంపిక చేశారు. అక్షయ్ స్వగ్రామం కొల్పూరు, మండలం మగనూర్, నారాయణపేట్ జిల్లా. నీరుపేద కుటుంబానికి చెందిన అక్షయ్ తల్లి చిన్న తనంలో మరణించడంతో గొర్లకాపరి అయిన తండ్రి రంగప్ప కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన ఇద్దరి పిల్లలనూ 2021లో మహేశ్వరం బీసీ హస్టల్లో చేర్పించారు. అక్షయ్ చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనభరుస్తున్నాడు. హస్టల్ వార్డెన్ కృష్ణ ప్రోత్సాహంతో ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద ఆర్థిక సాయాన్ని సంవత్సరానికి రూ.2 లక్షల ఉపకారవేతనం ప్రత్యేకంగా అందిస్తోంది. అక్షయ్ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మొయినాబాద్ నుంచి బాత్కు అశ్విని.. మొయినాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నుంచి బాత్కు అశ్విని ముఖ్య అతిథిగా ఆహా్వనితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీ హోంశాఖ విడుదల చేసిన స్పెషల్ కేటగిరి తెలంగాణ జాబితాలో 31 మంది ప్రత్యేక అతిథుల పేర్లల్లో అశ్విని ఆహా్వనం పొందారు. వివిధ రంగాలు, ప్రభుత్వ పతకాల వినియోగదారుల జాబితాలో మొయినాబాద్ మాడల్ మండల సమైక్యకు చెందిన బాత్కు అశ్విని ఆహా్వనం పొందడంతో ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘కాస్గంజ్’ కేసులో 28 మందికి యావజ్జీవం
లక్నో: సంచలనం సృష్టించిన కాస్గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది. మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది. -
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు విదేశీ ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దీనిలో భాగంగా 2025 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించనున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.సుబియాంటో భారతదేశం-ఇండోనేషియా సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు చేయడంతోపాటు పలు రక్షణ ఒప్పందాలపై ఆయన దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారైతే ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా అవతరిస్తుంది.1950లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాటి ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో మొదటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసారి ప్రబోవో భారత గణతంత్ర వేడుకలకు హాజరైన పక్షంలో ఇండోనేషియా సైనిక బృందం కూడా రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటుంది. ఈ నెలాఖరులో బ్రెజిల్లో జరగనున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రబోవో, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్గా అబ్దుల్ రహీమ్ రాథర్ -
న్యూయార్క్ లో సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలు
-
AP: రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి అవార్డు
న్యూఢిల్లీ: భారత 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన శకటానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్అగర్వాల్, ఏపీ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ గణతంత్ర శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు తృతీయ బహుమతి లభించింది. పీపుల్ ఛాయస్ కేటగిరీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటం మూడో స్థానంలో నిలిచింది. డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్,ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఆంధ్రప్రదేశ్ శకటం అకట్టుకుంది.ఇక.. తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం, ద్వితీయ స్థానంలో ఉత్తర ప్రదేశ్ చెందిన శకటం నిలిచాయి. -
దేశంలోనే తన సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ
-
డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్రంలో, డాలస్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎందరో మేధావులు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని తయారుచేసి మనకు అందించారని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిమీద ఉంది” అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రూపొందించిన నేతలకు, మన భారతదేశ స్వాతంత్య్రసిద్ధికి పాటుపడిన మహాత్మాగాంధీ, జవహార్లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదలైన నాయకులకు, దేశ స్వాతంత్య్రం కోసం అశువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రవాసభారతీయులు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వాల, రాజీవ్, బీ.ఎన్ జగదీష్, నవాజ్, జస్టిన్, షబ్నం మోడ్గిల్, వివిధ భారతీయసంస్థల నాయకులతో పాటు ఎంతోమంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇవి చదవండి: అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం -
రిపబ్లిక్ డే కి రిలయన్స్ జియో అద్దిరిపోయే ఆఫర్
-
సందడిగా రాజ్భవన్లో ‘ఎట్ హోమ్’
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ప్రముఖులకు రాజ్భవన్లో తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, గుడియా ఠాకూర్ దంపతులతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్భవన్కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతులకు గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు వివిధ అంశాలపై కొద్దిసేపు సంభాíÙంచుకున్నారు. రాజ్భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ మీద ప్రదర్శించిన దేశ స్వాతంత్య్ర పోరాట చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులు అందరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు జోగి రమేశ్, ఆర్ కే రోజా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమర యోధులు, పద్మ అవార్డు గ్రహీతలు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. -
‘గ్యారంటీ’గా ముందుకెళ్తున్నాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ ప్రజల కు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని.. ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. మిగతా గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత పాలకుల నిర్వాకంతో చిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితి, వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్యానించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించినప్పుడు.. పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి, హక్కులతోనే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగినప్పుడు, దీనికి చరమగీతం పాడే అవకాశాన్ని కూడా రాజ్యాంగం ఇచ్చింది. గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం.. ఇటీవలి ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నాం గత పదేళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలను ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నాం. సమాజంలోని అన్నివర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజాపాలనలో 1.25 కోట్ల దరఖాస్తులు ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుంచి పథకాల అమలు కోసం 1,25,84,383 దరఖాస్తులను స్వీకరించగా.. అందులో ఐదు గ్యారెంటీల కోసం దరఖాస్తులు 1,05,91,636, ఇతర దరఖాస్తులు 19,92,747 వచ్చాయి. వీటిని శాఖలవారీగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. యువతలో అపోహలు వద్దు గత పదేళ్లు యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఈ విషయంలో గట్టి దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికలో రూ.40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం రాష్ట్ర పురోగమనానికి సంకేతం. ముఖ్యమంత్రి, వారి బృందాన్ని అభినందిస్తున్నాను. రూ.2లక్షల రుణమాఫీకి చర్యలు రైతులకు మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నాం. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమచేశాం. రూ.2 లక్షల రుణమాఫీ కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. సామాన్యులు సైతం సీఎంను కలవచ్చు గత ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో లేదు. ఇప్పుడు ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రభుత్వం ప్రజాసమస్యలను వింటోంది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రజాస్వామ్య పాలన తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన, ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన మొదలైంది. అంబేడ్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాపాలన అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని, సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకుంటున్నాను..’’ అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గణతంత్ర దినోత్సవం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయం, ఏపీ సచివాలయం, మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, ఆర్టీసీ హౌస్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన: మోషేన్రాజు, తమ్మినేని రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగడం చాలా సంతోషంగా ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో వారిద్దరూ జాతీయ జెండాలను ఎగురవేశారు. మోషేన్రాజు, తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నేడు పరిపాలన ఇంత సాఫీగా సాగుతోందంటే అందుకు రాజ్యాంగమే కారణమన్నారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు, ఉప కార్యదర్శులు సుబ్బరాజు, విజయరాజు, చీఫ్ మార్షల్ డి.ఏడుకొండలరెడ్డి, లీగల్ అడ్వైజర్ ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం: సీఎస్ సమాజంలోని అందరం కలిసి బాధ్యతతో మెలుగుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని.. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. సచివాలయ ముఖ్య భద్రతాధికారి కె.కృష్ణమూర్తి, జీఏడీ ఉప కార్యదర్శి రామసుబ్బయ్య, శ్రీనివాస్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో... తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తా, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ భవన్లో... విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 24 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బహ్మానందరెడ్డి, కోటేశ్వరరావుతోపాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ సౌధలో... విజయవాడలోని విద్యుత్ సౌధలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్కో సీఎండీ కె.విజయానంద్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏపీ ట్రాన్స్కో మాజీ (థర్మల్) జి.విజయకుమార్కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. విద్యుత్ సౌధ వద్ద నిర్మించిన 100 కిలోవాట్ల సోలార్ పార్కింగ్ను విజయానంద్ ప్రారంభించారు. ఏపీజెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, చీఫ్ ఆఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ టి.పనాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఏపీ భవన్లో గణతంత్ర వేడుక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఏపీ భవన్లో జరిగిన కార్యక్రమంలో రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ పాల్గొన్నారు. హెచ్ఆర్సీ కార్యాలయంలో... కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో హెచ్ఆర్సీ చైర్మన్ సీతారామమూర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. లోకాయుక్తలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వరరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ నరసింహారెడ్డి, డిప్యూటీ రిజి్రస్టార్ పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకం రిపబ్లిక్డే వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ సాక్షి, అమరావతి: రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ తెలిపారు. హైకోర్టులో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవానికి జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని విభిన్న సంస్కృతుల కారణంగా ప్రజలకు న్యాయ సేవలను, సత్వర న్యాయాన్ని అందించడం సవాళ్లతో కూడుకున్న పని అని అన్నారు. సవాళ్లను అధిగమించి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పేదరికం, అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ కొన్ని వర్గాలకు న్యాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయాన్ని పేదల ముంగిటకు తీసుకువెళ్లేందుకు న్యాయసేవాధికార సంస్థ ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. మన న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 8,960 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి ప్రజలకు అవగాహన కలిగించిందని వివరించారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం న్యాయమూర్తులు హైకోర్టు వద్ద మొక్కలు నాటారు. -
రాజ్యాంగ స్ఫూర్తితో చరిత్రాత్మక పాలన
మా ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావిస్తూ 99.5 శాతం హామీలను అమలు చేసింది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ మన రాష్ట్రాన్ని దేశంలో ప్రత్యేకంగా నిలిపింది. విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో మా ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనను పునరుద్ఘాటించింది. సామాజిక సాధికారత నినాదం కాదు.. మార్గదర్శక విధానమని నిరూపించింది. – గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తితో సంక్షేమ ప్రగతి దిశగా పయణిస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గత 56 నెలలుగా లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర విలువలను ప్రతిబింబిస్తూ పాలన సాగిస్తోందన్నారు. అణగారిన వర్గాల్లో ఆనందాన్ని నింపడమే లక్ష్యంగా మారుమూల ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలను చేరవేస్తున్నట్లు చెప్పారు. సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పౌర సేవలను చేర్చి గ్రామ స్వరాజ్య భావనకు జీవం పోశామన్నారు. ఇప్పటివరకు డీబీటీ ద్వారా రూ.2,52,943.48 కోట్లు, నాన్–డీబీటీ ద్వారా మరో రూ.1,68,151.08 కోట్లు కలిపి మొత్తం రూ.4,21,094.56 కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చినట్లు తెలిపారు. సంక్షేమంతో పాటు సామాజిక విప్లవాన్ని తెస్తూ నామినేటెడ్ పనులు, పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళలకు ప్రత్యేకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. విద్య, వైద్య రంగాల్లో చరిత్రాత్మక మార్పులు తెచ్చిందని చెప్పారు. పుష్కలమైన వనరులు, అపార అవకాశాలతో ఏపీ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందన్నారు. యువత నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా నిరుద్యోగం రేటు వేగంగా తగ్గిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ స్వరాజ్యం సాకారం.. రాష్ట్రంలో 15,004 గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గొప్ప పాలన సంస్కరణలు తెచ్చాం. 540కిపైగా ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దే అందుతున్నాయి. సొంత ఊరిలోనే యువతకు 1.35 లక్షలకుపైగా శాశ్వత ఉద్యోగాలు, 2.66 లక్షల మందికి వలంటీర్లుగా పని చేసే అవకాశం దక్కింది. 9,260 ఎండీయూలతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ జరుగుతుండగా వలంటీర్ల ద్వారా ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు అందిస్తున్నాం. రూ.3 వేలు చొప్పున సామాజిక పింఛన్లు అందిస్తూ ఏపీ దేశానికే రోల్మోడల్గా నిలుస్తోంది. ప్రతి నెలా 66.34 లక్షల మంది లబ్దిదారులకు రూ.1,968 కోట్లు అందిస్తోంది. గత 56 నెలల్లో సామాజిక భద్రతా పింఛన్ల కోసమే రూ. 84,731 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న సురక్ష ద్వారా కోటి సర్టిఫికెట్లను పౌరులకు ఉచితంగా అందచేసింది. ప్రపంచ స్థాయి విద్య.. మన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. జగనన్న అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున 44 లక్షల మంది తల్లులకు రూ.26,067 కోట్లు అందించాం. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ బోధనా పద్ధతులను ప్రవేశపెడుతూ నాడు–నేడు ద్వారా రూ.17,805 కోట్లతో 56,703 ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాం. రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుక కిట్లను ఉచితంగా అందిస్తున్నాం. దీని కోసం ఇప్పటి వరకు రూ.3367 కోట్లు ఖర్చు చేశాం. విద్యార్థులకు రోజుకో మెనూతో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం రూ.4,417 కోట్లు వ్యయం చేసింది. జగనన్న విద్యాదీవెన కింద 26,98,728 మంది లబ్దిదారులకు రూ.11,901 కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించగా వసతి దీవెన కింద 25,17,245 మంది లబ్ధిదారులకు రూ.4,276 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో మన విద్యార్థులు ఉచితంగా చదువుకునేందుకు రూ.107.08 కోట్లు వెచ్చించింది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ సిలబస్తో పాటు ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 8వ తరగతి నుంచి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్ల పంపిణీకి రూ.1,306 కోట్లు ఖర్చు చేసింది. 62 వేలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 45 వేల స్మార్ట్ టీవీలను సమకూర్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు టోఫెల్కు సన్నద్ధం చేస్తూ శిక్షణ అందిస్తోంది. ఉన్నత విద్యలో సమున్నతం.. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ విద్యా వేదిక ఎడెక్స్తో ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ వర్సిటీల్లో లభించే 2 వేల వర్టికల్స్ను మన విద్యార్థులకు అందించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు జాబ్ ఓరియెంటెడ్ మాడ్యూల్స్, 30 శాతం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కరిక్యులమ్లో ప్రవేశపెట్టింది. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఒకే ఏడాది ఇంటర్న్షిప్లలో 3 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 18 విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టులను భర్తీ చేస్తోంది. ప్రజారోగ్యానికి పెద్ద పీట.. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని రూ.25 లక్షలకు పెంచడంతో పాటు క్యాన్సర్ లాంటి క్లిష్టమైన వ్యాధులకు పరిమితి లేని వైద్యాన్ని అందిస్తోంది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను 1,059 నుంచి 3,257కి పెంచింది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కింద రూ.12,150 కోట్లు ఖర్చు చేయగా 4.25 కోట్ల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరికి విశ్రాంతి సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద రూ.1,366 కోట్లు్ల అందించింది. వైద్య రంగంలో ఖాళీలు లేకుండా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించింది. రూ.1,208 కోట్లతో 1,704 వాహనాలు (108, 014లు), రూ.71 కోట్లతో 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు, డబ్ల్యూహెచ్ఓ/జీఎంపీ ప్రమాణాలతో 562 ఔషధాలను ప్రతి పీహెచ్సీలో అందుబాటులో ఉంచింది. నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, బోధనాస్పత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చింది. 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తుండగా ఇప్పటి వరకు 5 నూతన కళాశాలల్లో ఎంబీబీఎస్ తరగతులను ప్రారంభించింది. రూ.700 కోట్లతో ‘వైఎస్సార్ సుజలధార’ ప్రాజెక్టు ద్వారా ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలను తీర్చింది. 5 గిరిజన ప్రాంతాల్లో మల్టిస్పెషాలిటీ ఆస్పత్రులు, తిరుపతి (చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్), కడప (మానసిక ఆరోగ్య కేంద్రం, క్యాన్సర్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ బ్లాక్) పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.96 కోట్ల మందికి ఇంటి వద్దే నాణ్యమైన వైద్యాన్ని అందించింది. హృద్రోగ బాధితులకు సేవలందించేందుకు విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో 3 మెడికల్ హబ్లను ఏర్పాటు చేస్తోంది. గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్లు నెలకొల్పుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా వైద్యులను గ్రామాలకే పంపిస్తుండగా ప్రివెంటివ్ హెల్త్కేర్లో కొత్త అధ్యాయంగా జగనన్న ఆరోగ్య సురక్షను చేపట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలలో రక్తహీనత నివారణకు రూ.6,688 కోట్లతో 35.70 లక్షల మంది లబ్దిదారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కిట్లను అందిస్తోంది. సులభతర వాణిజ్యంలో అగ్రస్థానం దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు రూ.30 వేల కోట్లతో 3.94 లక్షల కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించింది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.2,087 కోట్ల మేర ప్రోత్సాహకాలను అందించింది. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే వద్ద రూ.16 వేల కోట్లతో 110 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యంతో 4 కొత్త ఓడరేవులను నిర్మిస్తోంది. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రూ.3,200 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుండగా గన్నవరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్పోర్టులను విస్తరిస్తోంది. వీటి ద్వారా సుమారు 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో గత 56 నెలల్లో 311కి పైగా భారీ, మెగా పరిశ్రమలు స్థాపించగా 1.30 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నాయి. విశాఖలో జరిగిన జీఐఎస్ సదస్సులో రూ.13.11లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయానికి ‘భరోసా’ సొంత భూమిని సాగుచేసుకుంటున్న రైతులకే కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ (అటవీ), ఎండోమెంట్ భూముల సాగుదారులకు సైతం వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.33,300 కోట్లు జమ చేమ చేసింది. 10,778 ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే విత్తనం నుంచి పంట ఉత్పత్తుల అమ్మకం వరకు అన్ని వ్యవసాయ సేవలను అందిస్తోంది. ఉచిత పంటల బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు అందించగా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 22.85 లక్షల మందికి రూ.1977 కోట్లు అందించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాల కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1835 కోట్లు వడ్డీ రాయితీ జమ చేసింది. మరో 25ఏళ్ల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత వ్యవసాయ విద్యత్ అందించేందుకు సెకీతో ఒప్పందం చేసుకుంది. ఉచిత విద్యుత్తో 39.77లక్షల మంది రైతులు రూ.43,066 కోట్లు లబ్ధి పొందారు. ఆక్వా రంగంలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా ఏకంగా 30 శాతం ఉంది. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందించేందుకు రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్లను నిర్మించింది. 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న ఆక్వా రైతులకు యూనిట్కు కేవలం రూ.1.50 చొప్పున విద్యుత్ను సరఫరా చేస్తూ 3,250 కోట్లు సబ్సిడీ భారాన్ని భరించింది. రూ.1,052 కోట్లతో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థను రూపుమాపి ఇప్పటి వరకు 36.60లక్షల మంది రైతుల నుంచి రూ. 63,827 కోట్ల విలువైన 3.34 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సంపూర్ణ మద్దతు ధర అందించింది. మూతపడిన సహకార డెయిరీలను పునరుజ్జీవం పోస్తూ అమూల్ సహకారంతో జగనన్న పాలవెల్లువను కొత్త పుంతలు తొక్కిస్తోంది. మహిళకు సాధికారత.. ఎన్నికల హామీలో భాగంగా స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలను ప్రభుత్వం తిరిగి చెల్లించింది. నాలుగు దశల్లో 78.94 లక్షల మంది మహిళలకు మొత్తం రూ.25,571 కోట్లను జమ చేసింది. సున్నా వడ్డీ కింద రూ.4969 కోట్లు అందించింది. వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహిళలకు రూ.14,129 కోట్ల సాయాన్ని అందించింది. కాపు నేస్తం కింద రూ.2,029 కోట్లు, ఈబీసీ నేస్తం కింద ఆర్థికంగా వెనుకబడిన వారికి రూ.1257 కోట్లు పంపిణీ చేసింది. మహిళల భద్రత కోసం దిశ యాప్, సచివాలయాల్లో మహిళా పోలీసు కానిస్టేబుళ్లను నియమించింది. నిరుపేదల కలను నెరవేరుస్తూ 31.19 లక్షల మందికి మహిళల పేరిట ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతోపాటు 22 లక్షల గృహాలను నిర్మిస్తోంది. సుమారు రూ.మూడు లక్షల కోట్ల సందపను సృష్టించి మహిళలకు అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా ద్వారా అండగా నిలుస్తోంది. బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఈ పథకాలకు కనీసం 10వ తరగతి విద్యార్హతను ప్రామాణికంగా నిర్ణయించి ఇప్పటివరకు 46,062 మంది లబ్దిదారులకు రూ.349 కోట్లు పంపిణీ చేసింది. జలయజ్ఞం ఫలాలు.. నీటిపారుదల రంగంలో ప్రభుత్వ దార్శనికత కోట్లాది మంది ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తోంది. కరువు పీడిత రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాల్లో చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలు పూర్తి కాగా రూ.600 కోట్లతో బ్రహ్మం సాగర్ లీకేజీ సమస్యను పరిష్కరించింది. చిత్రావతి కోసం రూ.280 కోట్లతో భూసేకరణ, ఆర్అండ్ఆర్ పూర్తి చేసి 10 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని సాధించింది. గండికోట నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం రూ.925 కోట్లు వెచ్చించింది. అవుకు 2వ సొరంగం పనులు పూర్తి చేసి ఎస్ఆర్బీసీ సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కులకు పెంచింది. 3వ సొరంగం పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.253 కోట్లతో లక్కసాగరం ఎత్తిపోతల పూర్తి కావడంతో కర్నూలు, నంద్యాల జిల్లాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఖరీఫ్ వర్షాలతో నల్లమల సాగర్లో నీటిని నిల్వ చేయనుంది. రూ.240 కోట్లతో మడకశిర బైపాస్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీటి పంపిణీ దిశగా అడుగులు వేస్తోంది. కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసింది. రూ.340 కోట్లతో వరికపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించింది. మార్చి నాటికి నాగావళి, వంశధార అనుసంధానం, జూన్ నాటికి వంశధార ప్రాజెక్ట్ 2వ దశ పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తాం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి 800 అడుగుల్లో 3 టీఎంసీల నీటిని మళ్లిస్తాం. పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, కుందూ నది, నిప్పుల వాగు సామర్థ్యం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాం. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ధర్మవరం నియోజకవర్గానికి నీరందించేందుకు జిల్లెడు బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను చేపట్టాం.హెచ్ఎన్ఎస్ఎస్ పనులు ప్రారంభించగా తారకరామ తీర్థ సాగర్, తోటపల్లి కెనాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ♦ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారంగా దేశంలో వందేళ్ల తర్వాత చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా ఇప్పటికే రెండు దశల్లో 17,460 రెవెన్యూ గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల రీ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయడంతో పాటు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ♦ వర్క్ఫ్రమ్ హోమ్, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం వైఎస్సార్ గ్రామ డిజిటల్ లైబ్రరీలను 12,979 పంచాయతీల్లో నిర్మిస్తూ అపరిమిత బ్యాండ్విడ్త్ సౌకర్యం కల్పిస్తోంది. ♦ వైఎస్సార్ వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు, నేతన్న నేస్తం కింద రూ.983 కోట్లు, జగనన్న చేదోడు కింద నాయీబ్రహ్మణులు, దర్జీలకు రూ.1268 కోట్లు, మత్స్యకార భరోసా కింద రూ.540 కోట్లు అందించింది. ♦ జగనన్న తోడు కింద 16.73 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.3374 కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు రూ.88.33 కోట్లు రీయింబర్స్ చేసింది. ♦ ప్రమాదాల్లో మరణించినవారు, దివ్యాంగులకు వైఎస్సార్ బీమా ద్వారా రూ.1582 కోట్లు అందించింది. ♦ ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుతో పారదర్శకంగా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందిస్తోంది. ♦ టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్ట్తో కలిసి రూ.1,695 కోట్లతో 3,967 ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అర్చక సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా 3వేల మంది అర్చకులకు రూ.48.33 కోట్ల మేర ఆర్థిక భరోసా అందించింది. ధూపదీప నైవేద్యం పథకం కింద ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేస్తోంది. 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించింది. ♦ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసింది 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించింది. ♦ గ్రామాల్లో యువతను క్రీడలవైపు ప్రోత్సహించడం, సమాజంలో ఆరోగ్యకర జీవనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఏటా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టింది. -
కంటోన్మెంట్ నియోజకవర్గంలో పొడవైన జాతీయ జెండా!
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని గార్డెన్ నంబర్ 95 శ్రీవేణుగోపాలస్వామి టెంపుల్ ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 54 అడుగుల ఎత్తైన జాతీయ పతాక పోలుపై 12 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నైతిక నిర్వాహణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గణతంత్ర వేడుకల్లో పిల్లలు ,మహిళలకు ఆట పోటీలు నిర్వహించి వారికి సంస్థ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం పిల్లల్లో దేశభక్తి జాతీయ సమైక్యత పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని నైతిక నిర్వాహణ సభ్యుడు ఆడిటర్ జగన్నాథం, ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త నర్ర భూపతి రెడ్డి, సామాజిక కార్యకర్త పూస యోగేశ్వర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా స్వాతంత్ర, గణతంత్ర కార్యక్రమాల్ని నిర్వహిస్తామని తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తగిన అన్ని సౌకర్యాలు కల్పించిన కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుకర్ నాయక్కు నిర్వాహణ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: తల్లిగా కవితకు ఆ బాధ తెలియదా..? జీవన్ రెడ్డి ఫైర్ -
రిపబ్లిక్ డే స్పెషల్.. 'మూడు రంగుల ముస్తాబు'
దేశీయ స్ఫూర్తి కోసం ఈ రోజు ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు తిరంగా రంగులను ట్రై చేయచ్చు. అయితే ఆరెంజ్, తెలుపు, పచ్చ మూడు రంగులను ఒకే డ్రెస్లో ఉండాలనుకునేవారు కొందరైతే, ఒకే కలర్ కాన్సెప్ట్తో స్పెషల్గా వెలిగిపోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాగని, గాఢీగా కాకుండా లేత రంగుల ప్రత్యేకతతోనూ మెరిసిపోవాలనుకుంటారు. అభిరుచికి తగినట్టుగా డ్రెస్ను ఎంపిక చేసుకునే స్పెషల్ డే కి స్పెషల్ లుక్. యాక్ససరీస్.. ► ఔట్ఫిట్స్లో ట్రై కలర్స్కి నో చెప్పేవాళ్లు ఇతర అలంకరణలో ప్రత్యేకతను చూపవచ్చు. అందుకు ట్రై కలర్ గాజులు, బ్రేస్లెట్స్ మంచి ఎంపిక అవుతుంది. ట్రై కలర్స్లో నెయిల్పాలిష్ డిజైన్నూ ఎంచుకోవచ్చు. ► వైట్ కుర్తా మీదకు ట్రై కలర్ దుపట్టా ఒక మంచి ఎంపిక అవుతుంది. ప్రత్యేకంగానూ ఉంటుంది. ► పూర్తి వైట్ గాగ్రా చోళీ లేదా మూడు రంగుల కలబోతగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయచ్చు. ► ఆరెంజ్ కలర్ శారీ, వైట్ కలర్ బ్లౌజ్ లేదా సేమ్ ఆల్ ఓవర్ ఒకే కలర్ని ఎంచుకోవచ్చు. ► జీన్స్ మీదకు గ్రీన్ కలర్ కుర్తా లేదా లాంగ్ ఓవర్ కోట్, ట్రై కలర్ జాకెట్ ధరించినా చాలు. ప్రఖ్యాత డిజైనర్స్ సైతం తమ డిజైన్స్లో తెలుపు, పచ్చ, ఆరెంజ్ల ఒకే కలర్ కాన్సెప్ట్తో డిజైన్ చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ఔట్ఫిట్ను మనమే సొంతంగా రీ డిజైన్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
రిపబ్లిక్ డే వేడుకలు: ఆకట్టుకున్న 1900 చీరల ప్రదర్శన
న్యూఢిల్లీ: కర్తవ్యపథ్లో శుక్రవారం 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన పరేడ్లో వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన సీటింగ్ ఏరియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వీక్షకులను ఆకట్టుకుంది. సీటింగ్ ఏరియాలో సుమారు 1900 చీరలను ప్రదర్శించారు. ‘అనంత్ సూత్ర’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన చీరలను ప్రదర్శనకు పెట్టారు. Here’s a special look at the 'Anant sutra- The Endless Thread' textile installation at #KartavyaPath as a part of the 75th #RepublicDay celebrations!#CultureUnitesAll #AmritMahotsav #BharatKiNariinSaree #RepublicDay2024 pic.twitter.com/DoFQCJuFRm — Ministry of Culture (@MinOfCultureGoI) January 26, 2024 చెక్క ఫ్రేమ్స్కు రంగరంగు చీరలను అమర్చి ప్రదర్శించారు. దీంతో సీటింగ్ ఏరియాలో కూర్చన్న వీక్షకులను వాటిని చూసి సందడి చేశారు. ఇక.. ఆ చిరలను ఎక్కడ నేశారో? వాటి వెరైటీ ఎంటో? చీరల ఎంబ్రైడరీకి సంబంధించిన పలు విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రతి చీరకు యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయటం విశేసం. దీనికి సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తన ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకేసారి దేశంలో ఉన్న పలు వెరైటీ చీరలు చూడటం బాగుంది.. యూఆర్ కోడ్ ఐడియా సూపర్’ అని కామెంట్లు చేస్తున్నారు. -
'ఇంటింటా ఇన్నోవేటర్' అవార్డుల ప్రదానం
హైదరాబాద్: 'ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024' కార్యక్రమంతో తెలంగాణలోని 20 జిల్లాల్లోని 41 గ్రామాలలో ఇన్నోవేషన్ స్ఫూర్తి ప్రతిధ్వనించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంతో గ్రామ పంచాయితీల పరిధిలో 44 మంది ఆవిష్కర్తలకు గుర్తింపు దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో అవార్డుల ప్రదానోత్సవం నేడు జరిగింది. 2023 ఏడాదికి 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమం కింద టీఎస్ఐసీ ద్వారా స్థానిక ఆవిష్కర్తలకు గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు సన్మానాలు అందించారు. ఈ కార్యక్రమం స్థానికంగా సవాళ్లను గుర్తించి పరిష్కరించడంలో గ్రామస్తులను ప్రోత్సహించడమే కాకుండా యువ తరాలకు స్ఫూర్తినిస్తుంది. 44 మంది ఆవిష్కర్తల్లో గృహిణులు, పాఠశాల పిల్లలు, కళాశాల విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వారి వినూత్న సహకారానికి నేడు(జనవరి 26)న అవార్డులు లభించాయి. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఉజ్వల భవిష్యత్తు వైపు తమ సొంత మార్గాన్ని రూపొందించుకోవడానికి సమాజాన్ని చైతన్యపరుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 'విలేజ్ ఇన్నోవేషన్ అవార్డులు' అందించారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఆహార సాంకేతికత, పర్యావరణం, ఆటోమొబైల్స్, ఆక్వాకల్చర్, సాంకేతికత, పారిశుధ్యం వంటి వివిధ రంగాలలో విస్తృతమైన ఆవిష్కరణలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే అద్భుతమైన సాధనాల నుండి నీటి సంరక్షణ కోసం తెలివిగల పరిష్కారాల వరకు, సమస్యలను పరిష్కరించడంలో అట్టడుగు స్థాయి ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం గుర్తిస్తుంది. "ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024" ద్వారా కేవలం ఆవిష్కర్తల గుర్తింపు మాత్రమే కాదు.. సమాజాన్ని పురోగతి వైపు నడిపించే స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని టీఎస్ఐసీ డైరెక్టర్ అజిత్ రంగ్నేకర్ అన్నారు. ప్రతి గ్రామం సృజనాత్మకతతో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సానుకూల మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మూసీ సుందరీకరణే లక్ష్యం -
భారత్లో ఆ దేశాధ్యక్షుడు.. కీలక ప్రకటన చేసిన టీసీఎస్
భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశంలో పర్యటిస్తున్న వేళ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్లో వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అతిపెద్ద భారతీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్కు ప్రస్తుతం ఫ్రాన్స్లోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో 1,600 మంది ఉద్యోగులు ఉన్నారు. టీసీఎస్కు యూరప్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఫ్రాన్స్ కూడా ఒకటి. యూరప్లోని ఇతర దేశాల కంటే ఫ్రాన్స్లో కంపెనీ వేగంగా వృద్ధి చెందుతోందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ సప్తగిరి చాపలపల్లి పీటీఐతో పేర్కొన్నారు. ఫ్రాన్స్లో టీసీఎస్ మూడు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉందని రానున్న రోజుల్లో వ్యాపారాన్ని మరింత వేగవంతంగా వృద్ధి చేసేందుకు గ్రౌండ్వర్క్ సిద్ధమైనట్లు సప్తగిరి చెప్పారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అన్ని ప్రధాన రంగాలలో 80 ఫ్రెంచ్ క్లయింట్లతో టీసీఎస్ పని చేస్తోందని, పారిస్లో ఒక ఆవిష్కరణ కేంద్రాన్ని కూడా నడుపుతోందని వివరించారు. టీసీఎస్కు ఫ్రాన్స్లో ఉన్న 1,600 మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది పారిస్లో ఉన్నారు. వీరిలో 60 శాతం వరకు ఫ్రెంచ్ పౌరులు. కాగా అక్కడే ప్రధాన కార్యాలయం ఉన్న ప్రత్యర్థి కంపెనీ క్యాప్జెమినీ ఫ్రెంచ్ మార్కెట్లో బలంగా ఉంది. అయితే టీసీఎస్ తన సొంత బలంతో అభివృద్ధి చెందుతుందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ పేర్కొన్నారు. -
ఎర్రకోట వద్ద రిపబ్లిక్ డే వేడుకలు
-
భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్లో చదువుకోవడానికి మరింత మంది భారత విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. "ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్" అనే చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫ్రెంచ్ రాని విద్యార్థులకు అంతర్జాతీయ తరగతులను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో చదివిన భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుందని మాక్రాన్ వెల్లడించారు. 2025 నాటికి 20,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకోగా.. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తామని ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. భారత్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం జైపుర్ శివారులోని ఆమెర్ కోటను మాక్రాన్ సందర్శించారు. ప్రధాని మోదీ ఆయనకు అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. ఇదీ చదవండి: Republic Day 2024: జైపూర్లో మోదీ, మేక్రాన్ రోడ్ షో -
విజయవాడ గణతంత్ర వేడుకల్లో ఉత్సాహంగా సాగిన మార్చ్ ఫాస్ట్
-
'రిపబ్లిక్ డే' పరేడ్లో ప్రధాన ఆకర్షణగా ఏఐ శకటం!
'ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శకటాన్ని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. కృత్రిమ మేధ(ఏఐ)లో మన దేశం సాధించిన పురోగతికి అద్దం పట్టేల, హెల్త్కేర్, లాజిస్టిక్స్, విద్య, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ప్రతిఫలించేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.' శకటంలో ఒక మహిళా రోబోట్ కృత్రిమ మేధస్సును ప్రతిబింబించేలా ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన సెమీకండక్టర్ చిప్ 3డీ మోడల్ను శకటంలోఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాన్ని తెలియజేసేలా శకటానికి ఇరువైపులా ఎల్ఈడీ లైట్లతో అలంకరించిన సర్క్యూట్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్ఐ) లాంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్లో మన దేశం సాధించిన పురోగతిని కూడా ఈ శకటం హైలెట్ చేస్తుంది. శకటం మధ్య విభాగంలో లాజిస్టిక్స్పై దృష్టి పెట్టారు. కలర్ కోడింగ్ ఆధారంగా పార్శిల్ గుర్తింపు, విభజనకు సాంకేతికత ఎలా సహాయపడుతుందో తెలియజేసేలా ఉంటుంది. శకటం వెనుక భాగం విద్యారంగంపై దృష్టిని మళ్లిస్తుంది. వీఆర్ హెడ్సెట్ ధరించి వర్చువల్ రియాలిటీ ద్వారా రిమోట్ క్లాసును నిర్వహించే ఉపాధ్యాయుడి లార్జర్ దెన్ లైఫ్ స్టాచ్యూ ఉత్తేజకరంగా ఉంటుంది. పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సెన్సర్ల ద్వారా ఏఐ అప్లికేషన్ల ఉపయోగం, నావిగేషన్కు సంబంధించి దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు సహాయపడే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారాన్ని ఈ ఏఐ శకటం హైలెట్ చేస్తుంది. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా!
రిపబ్లిక్డే జనవరి 26న ఎందుకు జరుపుకుంటామో తెలుసా?’ అనే ప్రశ్నకు...‘1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి’ అని చెబుతాం. ఇది నిజమే అయినప్పటికీ అసలు కారణం వేరు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. అయితే రాజ్యాంగాన్ని అమలు చేసే తేదీకి ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో జనవరి 26ని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు. జనవరి 26 ప్రాముఖ్యత ఏమిటి? 1930 జనవరి 26న లాహోర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ‘జనవరి 26’కి చిరస్థాయి కల్పించాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారి నారాయణ్ రైజాదా తన అందమైన చేతి రాతతో హిందీ, ఇంగ్లీష్లలో రాశారు. రాయడానికి ఆరు నెలల సమయం తీసుకుంది. తొలి రిపబ్లిక్ పరేడ్ (1950) దిల్లీలోని ఇర్విన్ యాంఫీథియేటర్ (ప్రస్తుతం మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం)లో జరిగింది. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న తొలి విదేశీ సైనిక బృందం...ఫ్రెంచ్ ఆర్మీ సైనికులు (2016). ఫస్ట్ రిపబ్లిక్ డే పరేడ్కు హాజరైన ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్ణో. (చదవండి: ఈసారి 'కర్తవ్య పథ్'లో దేశంలోని 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!) -
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
-
ఏపీ విద్యా సంస్కరణలు.. దేశానికి దిక్సూచిగా..
సాక్షి, అమరావతి : సాధారణంగా ఏ ప్రభుత్వమైనా విద్యా రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. ఇందుకు చెప్పుకోదగ్గ మొత్తం కూడా ఖర్చుపెట్టదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో గత నాలుగున్నరేళ్లుగా విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమేగాక, ఖరీదైన ఇంటర్నేషనల్ బాకలారియెట్ వంటి సిలబస్ను ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయాలని సంకల్పించింది. ఈ కాలంలో రాష్ట్రంలో విద్యా రంగం సమూలంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రతి పల్లెకు చేరువయ్యాయి. కొద్దిమందికి మాత్రమే పరిమితమైన సీబీఎస్ఈ సిలబస్ సైతం ఇప్పుడు పేద పిల్లలకు అందుతోంది. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ విద్య అందుబాటులోకి వచ్చింది. త్వరలో అత్యంత ఖరీదైన ఐబీ సిలబస్ సైతం ఉచితంగా అందించనున్నారు. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. ఇలా పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సంస్కరణలకు అద్దంపట్టేలా గణతంత్ర దినోత్సవ వేడుల్లో ప్రదర్శించే శకటాన్ని విద్యాశాఖ రూపొందించింది. ఈ నేపథ్యంలో.. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత.. అమలుచేస్తున్న సంస్కరణలపై ప్రత్యేక కథనం.. విద్యా సంక్షేమానికి భారీగా నిధులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచింది. ఇందులో భాగంగా.. ► పేద తల్లులు తమ పిల్లలను బడికి పంపినందుకు గాను గత నాలుగేళ్లలో ‘జగనన్న అమ్మఒడి’ ద్వారా 42,61,965 మంది ఖాతాల్లో రూ.26,349.50 కోట్లు ప్రభుత్వం జమచేసింది. ►మనబడి నాడు–నేడు పథకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.17,805 కోట్ల వ్యయంతో, మూడు దశల్లో 12 మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో దాదాపు 32 వేల పాఠశాలల రూపురేఖలు మారాయి. ►పాఠశాల తెరిచిన మొదటిరోజే ప్రతి విద్యార్థికి ‘జగనన్న విద్యాకానుక’గా ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, కుట్టు కూలీతో మూడు జతల యూనిఫాం క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగుతో పాటు హైస్కూల్ విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఎలిమెంటరీ విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ అందించి ప్రైవేటు స్కూలు విద్యార్థుల కంటే మిన్నగా బడికి వెళ్లేలా ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. ►బాలికా విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేసి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసి అందులో ఒకటి బాలికలకు కేటాయించింది. ఇటు ‘గోరుముద్ద’.. అటు డిజిటల్ చదువులు.. ► దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు చిక్కీ, రాగిజావతో సహా 16 రకాల పదార్థాలతో ‘జగనన్న గోరుముద్ద’ను అందిస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,910 కోట్లు అదనంగా ఖర్చుచేస్తోంది. గోరుముద్ద పథకం కింద ఇప్పటిదాకా రూ.6,262 కోట్లు ఖర్చుచేశారు. ►అలాగే, ఏటా 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రూ.15 వేల విలువైన బైజూస్ కంటెంట్తో రూ.17,500కు పైగా మార్కెట్ విలువగల ట్యాబ్ను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. గత రెండేళ్లలో మొత్తం 9,52,925 ట్యాబులు ఉచితంగా అందించిన ఘనత దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. ► 62 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను, స్మార్ట్ టీవీలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లోను, తరగతి గదుల్లో అమర్చిన ఐఎఫ్బీలు, స్మార్ట్ టీవీల్లో బైజూస్ కంటెంట్ ద్వారా బోధన చేపట్టారు. ఫలితాన్నిచ్చిన విద్యా సంస్కరణలు.. ఈ సంస్కరణల ఫలితంగా గత విద్యా సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే పది, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించారు. ఇలా ప్రతిభ కనబరిచిన 22,710 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’గా గుర్తించి వారిని సత్కరించి ప్రభుత్వం ప్రోత్సహించింది. విద్యా సంస్కరణల శకటం ఆంధ్రప్రదేశ్లో అమలుచేస్తున్న విద్యా సంస్కరణలను చాటిచెబుతూ పాఠశాల విద్యాశాఖ రూపొందించిన శకటం శుక్రవారం విజయవాడలో జరిగే గణతంత్ర వేడుకల్లో సందడి చేయనుంది. గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లోను, విద్య, విద్యార్థుల్లో తీసుకొచ్చిన మార్పులతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక శకటాన్ని రూపొందించింది. అలాగే, ఢిల్లీలో జరిగే వేడుకల్లో సైతం ఏపీ విద్యా సంస్కరణల ఆధారంగా రూపొందించిన శకటం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది. ‘డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ విధానంతో ఈ వాహనం దేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని పరిచయం చేయనుంది. -
రాష్ట్రానికి 2 రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ సేవల్లోని మొత్తం 1,132 మంది అధికారులకు కేంద్రప్రభుత్వం నాలుగు కేటగి రీల్లో పతకాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 2 రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 మంది పోలీసులకు ప్రతిభా సేవాపతకాలు, ఇద్దరు జైలు అధికారులకు ప్రతిభా సేవా పతకాలు, ఆరుగురికి మెడల్ ఫర్ గ్యాలెంట్రీ లభించాయి. అడిషనల్ డీజీపీలు దేవేంద్ర సింగ్ చౌహాన్, సౌమ్యా మిశ్రాకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు దక్కాయి. మెడల్ ఫర్ గ్యాలెంట్రీ వీరికే వాడిచెర్ల శ్రీనివాస్, నలివేణి హరీశ్, గడ్డిపోగుల అంజయ్య, బూర్క సునీల్ కుమార్, ఎండీ.అయూబ్, పి.సతీష్లు గ్యాలెంట్రీ పతకాలకు ఎంపికయ్యారు. ప్రతిభా సేవా పతకాలు వీరికి డీఐజీ జాకబ్ పరిమళ హన నూతన్, ఏఎస్పీ డి.చంద్రయ్య, 8వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ కొక్కు వీరయ్య, కమాండెంట్ నరుకుళ్ల త్రినాథ్, ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు, ఏసీపీ పింగిళి నరేష్ రెడ్డి, ఏసీపీ శ్రీరాముల మోహన్ కుమార్, ఎస్ఐ బెల్లం జయచంద్ర, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ ఎనుముల వెంకట్రెడ్డి, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ గండిపూ డి ఏసుపాదం, హెడ్ కానిస్టేబుల్ జంగయ్య, ఎస్ఐ మంచిరేవుల సురేందర్ రెడ్డికు పోలీసు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. తెలంగాణకు చెందిన ఇద్దరు.. కరెక్షనల్ సర్వీసు కేటగిరీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ అర్కోట్ శ్రీధర్, జైలర్ యాదరి రమణయ్య ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. మొత్తం 1,133 పతకాలు: కాగా ఈఏడాది ప్రకటించిన మొత్తం 1,132 పతకాల్లో బీఎస్ఎఫ్కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు రాష్ట్రపతి శౌర్య పతకాలు వారి మరణానంతరం లభించాయి. మిగతా 275 మందికి శౌర్యపతకాలు, 102 మందికి రాష్ట్ర పతి విశిష్ఠ సేవా పతకాలు, 753 మందికి ప్రతిభా సేవా పతకాలను గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. గ్యాలెంట్రీ పతకా లు దక్కించుకున్న 275 మందిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 72 మంది, ఛత్తీస్గఢ్ నుంచి 26, ఝార్ఖండ్ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది పోలీసులు ఉన్నారు. సీ ఆర్పీఎఫ్ నుంచి 65, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మంది శౌర్య పతకాలకు ఎంపికయ్యారు. ఏపీకి చెందిన 9మంది అధికారులకు ప్రతిభా సేవా పతకాలు ఆంధ్రప్రదేశ్కు చెందిన తొమ్మిదిమంది పోలీసు అధికారులకు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. కమాండెంట్ కోటనాని వెంకట ప్రేమ్జిత్, ఆర్ఎస్ఐ ఆవుల చెన్నయ్య, ఏఎస్ఐ ఆర్.రమణారెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అద్దంకి, ఏఎస్ఐ బి.ప్రకాశ్రావు, ఏఎస్ఐ కరి మస్తాన్రావ్, అసిస్టెంట్ కమాండెంట్ పుల్లభొట్ల వెంకట సత్య అనంత దుర్గ ప్రసాద్ రావు, ఇన్స్పెక్టర్ అక్కిశెట్టి శ్రీహరి రావు, డీఎస్పీ కోటిరెడ్డి పోలీసు ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పెనికలపాటి వెంకట రమణ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జాస్తి రమణయ్య, లీడింగ్ ఫైర్మ్యాన్ షేక్ ఘనీలకు ఫైర్ సర్వీసెస్ కేటగిరీలో ప్రతిభా సేవా పతకాలు దక్కాయి. చౌహాన్కు డబుల్ ధమాకా రాష్ట్రపతి మెడల్తో పాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ పోలీస్ అధికారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్కు ఒకేసారి రెండు అవార్డులు లభించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కేంద్రం ప్రకటించే రాష్ట్రపతి మెడల్కు డీఎస్ చౌహాన్ ఎంపికయ్యారు. దీంతోపాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు(2024) కూడా ఆయనకు లభించింది. రాచకొండ పోలీస్ కమిషనర్గా 2023 శాసన సభ ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకుగానూ ఎన్నికల సంఘం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును గురువారం జేఎన్టీయూలో జరిగిన ఓటర్స్డే సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేతులమీదుగా డీఎస్ చౌహాన్ అందుకున్నారు. ఒకే రోజు రెండు అవార్డులు రావడం పట్ల పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆయ నకు అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యం అయిందని ఈ సందర్భంగా డీఎస్ చౌహాన్ వ్యాఖ్యానించారు. -
రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగంలో అయోధ్య ప్రస్తావన
ఢిల్లీ: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం, భారతరత్న పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గురించి ప్రస్తావించారు. అయోధ్యలో మహిమాన్వితమైన రామ మందిర ప్రారంభోత్సవాన్ని ముర్ము ప్రశంసించారు. అయోధ్యను భారతదేశ నాగరికత వారసత్వానికి మైలురాయిగా చరిత్రకారులు భావిస్తారని చెప్పారు. భారతరత్న అవార్డు పొందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు ముర్ము నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాలు ముగిశాయని పేర్కొన్న ముర్ము.. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి తల్లి.. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా పురాతనమైనదని చెప్పారు. భారతదేశం అమృత్కాల్ దశలో ఉందని పేర్కొన్న ముర్ము.. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సువర్ణావకాశం దేశ ప్రజలకు ఉందని పేర్కొన్నారు. 'దేశం అమృత్ కాల్ ప్రారంభ సంవత్సరాల్లో ఉంది. ఇది పరివర్తన సమయం. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మనకు సువర్ణావకాశం లభించింది. మన లక్ష్యాలను సాధించడంలో ప్రతి పౌరుడి సహకారం చాలా కీలకం.’’ అని ఆమె అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ గురించి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. టెక్నాలజీ మన జీవితంలో ఎలా భాగమైందో కూడా వివరించారు. 'అమృత్ కాల్' కాలం అపూర్వమైన సాంకేతిక మార్పుల కాలం అని ముర్ము పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పురోగతులు మన దైనందిన జీవితంలో భాగమవుతున్నాయని చెప్పారు. యువత కొత్త సరిహద్దులను అన్వేషిస్తోందని తెలిపిన ముర్ము.. వారి మార్గం నుండి అడ్డంకులను తొలగించడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని అన్నారు. ఇదీ చదవండి: జైపూర్లో మోదీ, మాక్రాన్ రోడ్ షో -
‘కర్తవ్య పథ్’లోనే గణతంత్ర వేడుకలు ఎందుకంటే..
భారతదేశం రేపు (జనవరి 26) 75వ గణతంత్ర దినోత్సవాలను చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర బిందువు న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్ (గతంలో రాజ్పథ్). ఇక్కడ జరిగే రిపబ్లిక్ డే పరేడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పరేడ్లో సాయుధ బలగాలకు చెందిన మూడు శాఖల బృందాలు చేసే కవాతు, ఆయుధాలు, సైనిక పరికరాల ప్రదర్శనలు, మోటార్ సైకిల్ విన్యాసాలు భారతదేశ సైనిక సత్తాను చాటుతాయి. ఈ సంవత్సరం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ను ఆహ్వానించారు. ‘కర్తవ్య పథ్’ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రదేశానికి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1911లో బ్రిటిష్ సర్కారు తన రాజధానిని కలకత్తా (ఇప్పుడు కోల్కతా) నుండి ఢిల్లీకి మార్చిన తర్వాత ఈ రహదారిని నిర్మించి, ‘కింగ్స్వే’ అనే పేరు పెట్టింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రహదారిని ‘రాజ్పథ్’గా మార్చారు. ఆ తరువాత దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరుపెట్టారు. ఇది కూడా చదవండి: గణతంత్ర దినోత్సవ థీమ్ ఏమిటి? ముఖ్య అతిథి ఎవరు? గత ఏడు దశాబ్దాలుగా అంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వార్షిక గణతంత్ర దినోత్సవ వేడుకలను ‘కర్తవ్య పథ్’లోనే నిర్వహిస్తున్నారు. ఈ రహదారి వలస పాలన నుంచి సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం వరకు సాగిన భారతదేశ ప్రయాణానికి చిహ్నంగా నిలిచింది. 2022లో ‘రాజ్పథ్’ను ‘కర్తవ్య పథ్’గా మార్చారు. అనంతరం దీనికి సెంట్రల్ విస్టా అవెన్యూలో చేర్చారు. ఒకప్పడు ‘రాజ్పథ్’ అధికార చిహ్నంగా ఉండేది. దానిని ‘కర్తవ్య పథ్’గా మార్చాక ఈ రహదారి సాధికారతకు చిహ్నంగా మారింది. ‘కర్తవ్య పథ్’ ప్రారంభోత్సవాన ప్రధాని మోదీ మాట్లాడుతూ నాటి ‘కింగ్స్వే’ లేదా ‘రాజ్పథ్’ బానిసత్వానికి చిహ్నంగా నిలిచిందని, ఇటువంటి గుర్తింపును శాశ్వతంగా తుడిచివేయడానికే దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. -
రిపబ్లిక్ డే 2024: ఈసారి థీమ్ ఏంటంటే..
భారతదేశం జనవరి 26న (శుక్రవారం) 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో గణతంత్ర దినోత్సవ చరిత్ర, పరేడ్, థీమ్ తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు ‘రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదు. ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనం. దీని స్ఫూర్తి ఎల్లప్పటికీ నిలచి ఉంటుంది’ అని అన్నారు. 1950లో భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది. నేడు మనం భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకునేందుకు సిద్ధమవుతున్నాం. గణతంత్ర దినోత్సవాలలో భారతదేశ గొప్పదనాన్ని, సాంస్కృతిక వారసత్వం, దేశ పురోగతి, విజయాలను గుర్తుచేసుకోనున్నాం. ఢిల్లీలో జరిగే పరేడ్లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే ప్రదర్శనలను మనం చూడబోతున్నాం. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జరిగాయి. భారతదేశ రాజ్యాంగానికి 1950, జనవరి 26న ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతియేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్వారి నుండి స్వాతంత్ర్యం లభించినప్పటికీ, 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారత్ ఒక సార్వభౌమ అధికారం కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. ప్రతీయేటా జరిగే గణతంత్ర దినోత్సవం.. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని గుర్తుచేస్తుంది. ప్రతీ సంవత్సరం దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుగుతుంటాయి. ఆ రోజు రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. గణతంత్ర దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి దేశంలోని అర్హులైన పౌరులకు పద్మ అవార్డులను అందిస్తారు. వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక్ష ప్రసారాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. జనవరి 26.. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఇవి 90 నిమిషాల పాటు జరుగుతాయి. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు. -
విద్యా సంస్కరణలకు అద్దంపట్టేలా రాష్ట్ర శకటం
సాక్షి, న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో భాగంగా జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దంపట్టేలా ‘‘ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను మార్చడం – విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం’’ అనే ఇతివృత్తంతో శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలను తీసుకురావడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తోందని, తద్వారా విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. ఇప్పటికే 62 వేల డిజిటల్ క్లాస్రూమ్ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించింది. ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ఇంగ్లిష్ ల్యాబ్, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, స్మార్ట్ టీవీ, డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్లే గ్రౌండ్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఈ అంశాన్ని అందరినీ ఆకట్టుకునేలా శకటంలో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించి 55 సెకెన్ల నిడివిగల థీమ్ సాంగ్ రూపొందించామని, శకటం పరేడ్లో ప్రదర్శనకు సిద్ధమైందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
Republic Day: జెండాల గౌరవం కాపాడండి : కేంద్రం
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సమీపిస్తుండటంతో మువ్వన్నెల జెండాల వాడకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. జెండా వందన కార్యక్రమాలు పూర్తయ్యాక కాగితపు జెండాలను ఇష్టం వచ్చినట్లుగా నేలపై పారేయకూడదని కోరింది. జెండా గౌరవానికి భంగం కలగకుండా వాటిని గౌరవ ప్రదంగా, రహస్యంగా డిస్పోజ్ చేయాలని సూచించింది. ఈ విషయంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అన్ని ఇతర ఈవెంట్లలో వాడే జెండాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. జనవరి 26న దేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీచదవండి.. సభలో మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య -
ఢిల్లీ పరేడ్కు అసామాన్యులు
ఈసారి గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు తెలంగాణ నుంచి ‘అసామాన్యులు’ హాజరై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒకరు హైదరాబాద్ స్వీపర్ నారాయణమ్మ. మరొకరు కోదాడ మొబైల్ షీ టాయిలెట్ నిర్వహిస్తున్న నాగలక్ష్మి. ప్రజల కోసం భిన్నమైన ఉపాధుల్లో అంకితభావంతో పని చేస్తున్న వీరిద్దరూ ‘శ్రమయేవ జయతే’కు నిజమైన ప్రతీకలు. నారాయణమ్మ, నాగలక్ష్మిల పరిచయం. నారాయణమ్మ దినచర్యను చూస్తే కర్మయోగుల దినచర్యలా అనిపిస్తుంది. తెల్లవారుజాము నాలుగ్గంటలకు నిద్ర లేస్తుందామె. స్నానపానాదులు ముగించుకుని గంటసేపు గురుధ్యానం చేసి కొద్దిగా టీ తాగి ఆరు గంటలకంతా బంజారాహిల్స్లోని కాలనీలో రోడ్లు ఊడ్చే పనిలోకి వస్తుంది. పెదాల మీద ఏదో ఒక జానపదగీతమో, గురు తత్వమో, స్మరణో లేకుండా నారాయణమ్మ కనిపించదు. అందుకే ఆమెను అందరూ ‘సింగింగ్ స్వీపర్’ అంటారు. 22 సంవత్సరాలుగా నగరాన్ని తన చేతులతో శుభ్రం చేస్తూ స్వస్థతనిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా భజనలకు, భక్తి కార్యక్రమాలకు హాజరయ్యి ముక్తిమార్గాన్ని చూపుతూ నారాయణమ్మ చేస్తున్న సేవ సామాన్యం కాదు. అందుకే ఆమెను రిపబ్లిక్ డేకి ఢిల్లీ పంపాలని జి.హెచ్.ఎం.సి. అధికారులు నిశ్చయించారు. ‘ఇది విని మావాళ్లంతా చాలా సంతోషించారు. మంచి కర్మల ఫలితం ఇది’ అంటుంది నారాయణమ్మ. బావులు తవ్వుతూ రంగారెడ్డి జిల్లా యాచారంకు చెందిన నారాయణమ్మ భర్తతో కలిసి బావులు తవ్వే పనికి వెళ్లేది. అది చాలా శ్రమతో కూడిన పని. అయినా పదిహేను ఇరవై రోజుల్లో బావిని తవ్వి జలను బయటకు తేవడంలో ఆమెకు తృప్తి కలిగేది. తర్వాత జెసీబీలు వచ్చాయి. బావుల స్థానంలో బోర్లు వచ్చాయి. దాంతో పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాద్ చేరుకుంది నారాయణమ్మ. అప్పటికే తల్లి స్వీపర్గా చేస్తుండంతో తన పని కూతురికి అప్పజెప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే పనిలో కొనసాగుతూ ఉంది నారాయణమ్మ. నెలకు 14 వేలు వస్తాయి. కొడుకు లారీ డ్రైవర్గా చేస్తున్నాడు. కూతురిని స్వీపర్ ఉద్యోగంలోనే పెట్టించింది. జీవుడే దేవుడు నారాయణమ్మకు భక్తి ఎక్కువ. పెళ్లయినప్పటి నుంచి భర్తతో కలిసి దేశంలోని గుళ్లన్నీ తిరిగేది. సంపాదించినది అంతా తీర్థయాత్రలకే ఖర్చు పెట్టింది. ‘కాని గుళ్లన్నీ తిరిగాక జీవుడిలోనే దేవుడు ఉన్నాడని గ్రహించాను. కరీంనగర్ జిల్లాకు చెందిన నిత్యానంద రాజేశ్వరాచార్యుల దగ్గర గురుబోధ తీసుకున్నా. నన్ను నేను ఆత్మజ్ఞానిగా మార్చుకున్నా. మనిషి చిత్తం విచిత్రం. అతను లోకాన్ని తరచి చూసి ముక్తిపొందాలంటే గురువును తెలుసుకుని గురుబోధతో నడుచుకోవాలి. అజ్ఞానాన్ని తవ్వి బయట పారేయాలి’ అంటుంది నారాయణమ్మ. ఆమెకు రోకటి పాటల దగ్గరి నుంచి మంగళహారతి పాటల వరకూ కరతామలకం. రామయణ, భారతాలను కూడా పాటలుగా పాడుతుంది. వేమన పద్యాల నుంచి సంస్కృత పద్యాల వరకూ అన్నీ చెబుతుంది. ఆమె ధారణకు, ఆధ్యాత్మిక అవగాహనకు ఎవరైనా నమస్కరించాల్సిందే. కోదాడలో అమూల్యసేవ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాగలక్ష్మి నిర్వహించే మొబైల్ షీ టాయిలెట్ కనిపిస్తుంది. 30 ఏళ్ల ఈ డబుల్ డిగ్రీ హోల్డర్ కోదాడ మునిసిపల్ ఉద్యోగిగా మొబైల్ టాయిలెట్ను నిర్వహించడానికి, తిప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడదు. ‘ఐదేళ్లుగా ఈ టాయిలెట్ను నిర్వహిస్తున్నాను. ఆటోకు బిగించిన టాయిలెట్ను రోజూ నేను ఉదయం ఎనిమిదన్నర నుంచి పట్టణంలో తిప్పుతాను. గుళ్ల దగ్గర, బస్టాండ్ దగ్గర, మార్కెట్ దగ్గర అవసరాన్ని బట్టి ఉంచుతాను. పనుల కోసం పల్లెల నుంచి వచ్చిన స్త్రీలు తగిన టాయిలెట్లు లేక ఇబ్బంది పడతారు. వారు నా మొబైల్ టాయిలెట్ను చూడగానే ఎంతో రిలీఫ్ ఫీలవుతూ ఉపయోగిస్తారు. నేను గమనించేదేమిటంటే ఆ ఒత్తిడి తీరాక వారు చల్లగా బతకమ్మా ఆని ఆశీర్వదించడం. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ఎంతో సంతోషపడతారు’ అంటుంది నాగలక్ష్మి. ఈ మొబైల్ టాయిలెట్ ఉపయోగించుకోవడానికి ఏమీ రుసుము చెల్లించనక్కర లేదు. మధ్యాహ్నం వరకూ ఈ వాహనాన్ని నడిపే నాగలక్ష్మి మధ్యాహ్నం భోజన విరామం తీసుకుని మళ్లీ సాయంత్రం వరకూ తిప్పుతుంది. ‘మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది’ అంటుందామె. ఆమె అంకితభావాన్ని గమనించిన జి.హెచ్.ఎం.సి. అధికారులు ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రతినిధిగా ఢిల్లీకి పంపుతున్నారు. -
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను ఈ రిపబ్లిక్ డే రోజు హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు. జనవరి 26న భగవంత్ మాన్పై గ్యాంగ్స్టర్లు ఏకమై దాడికి దిగాలని పన్నూ కోరారు. గ్యాంగ్స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నదని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్ బాంబు షెల్స్తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ మరొక బెదిరింపు వీడియో ఇటీవల బయటపడింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు చేశాడు. ఎయిరిండియా బెదిరింపు వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పన్నూపై కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు బంపరాఫర్!
వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ శుభవార్త చెప్పింది. ఫ్లిప్కార్ట్ తర్వలో ఈ ఏడాది తన తొలి ప్రత్యేక సేల్ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14 నుంచి జనవరి 19 వరకు కొనసాగనుంది. ఇక ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ ఐఫోన్15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12, పిక్సెల్ 7ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్, పోకో ఎక్స్ 5, రియల్ మీ 11, రెడ్మీ 12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఇస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900 నుండి ఉండగా ఫ్లిప్కార్ట్ రూ.72,999కే అమ్ముతుంది. విజయ్ సేల్స్ ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 70,900కి అమ్ముతుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు పొందవచ్చు. తద్వారా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లపై కూడా వరుసగా 75 శాతం, 65 శాతం తగ్గింపు ఉండనుంది. ఈ డిస్కౌంట్లపై ఫ్లిప్కార్ట్ మరిన్ని వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. -
గణతంత్ర వేడుకల్లో ఈశాన్య విద్యార్థినుల బ్యాండ్!
ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) క్యాంప్లో మొత్తం 2,274 మంది క్యాడెట్లు పాల్గొననున్నారు. వీరిలో యువతుల భాగస్వామ్యం అధికంగా ఉండనుంది. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ ఈ వివరాలను తెలియజేశారు. ఎన్సీసీలో యువతుల భాగస్వామ్యం ప్రతి సంవత్సరం పెరుగుతోందని అన్నారు. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శిబిరానికి హాజరవుతున్న క్యాడెట్లలో జమ్మూ కాశ్మీర్, లడఖ్కు చెందిన 122 మంది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 177 మంది ఉన్నారని సింగ్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 45 మంది యువతుల బృందం తొలిసారిగా ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్లో పాల్గొంటున్నదన్నారు. వీరి బ్యాండ్ తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో అలరించనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ టీమ్, బెస్ట్ క్యాడెట్, హార్స్ రైడింగ్ మొదలైన పోటీలు నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ తెలిపారు. కాగా 2023లో దాదాపు నెల రోజులపాటు జరిగిన ఎన్సీసీ శిబిరంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 710 మంది యువతులతో సహా మొత్తం 2,155 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయబోతున్నాయి. ఒక్కో బృందంలో 144 మంది మహిళా సైనికులు ఉండనున్నారు. వీరిలో 60 మంది ఆర్మీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి చెందిన వారు ఉంటారని రక్షణ అధికారులు తెలిపారు. ఈ బృందంలో నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన మహిళా అగ్నివీర్ సైనికులు కూడా ఉండనున్నారు. -
రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ నుంచి హాజరవుతున్న ఆరవ అధ్యక్షునిగా మాక్రాన్ నిలవనున్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్లో జరిగిన బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ ఆయన హాజరుకాలేనని వెల్లడించారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ను ఆహ్వానించినట్లు సమాచారం. ఫ్రెంచ్ మాజీ ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ 1976, 1998లో రెండుసార్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిస్ హోలాండ్ వరుసగా 1980, 2008, 2016లో ఈ వేడుకలకు హాజరయ్యారు. STORY | French President Macron set to be Republic Day chief guest READ: https://t.co/P8euyRpHkB pic.twitter.com/cMuCijvqcl — Press Trust of India (@PTI_News) December 22, 2023 భారత్లో జరిగిన జీ-20 మీటింగ్కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరయ్యారు. ప్రధాని మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు. మధ్యాహ్న భోజన సమావేశంలోనూ పాల్గొన్నారు. భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై పురోగతి దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. గతేడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలను ఆహ్వానిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021, 2022లో విదేశీ నేతలను ఆహ్వానించలేదు. ఇదీ చదవండి: ఎంపీల సస్పెన్షన్పై నేడు దేశవ్యాప్త నిరసనకు విపక్ష నేతల పిలుపు -
నేడు జెండా ఎగరేస్తాం! జనవరి 26న ఆవిష్కరిస్తాం! ఏంటీ తేడా అంటే..
నేడు జెండా ఎగరేయడానికి జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకిలా? ఈ రోజు ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద జెండా ఎగరేస్తే..జనవరి 26న మాత్రం రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. నేడు జెండా ఎగరేసాం అంటాం. మరీ గణతంత్ర దినోత్సవం రోజున మాత్రం జెండా ఆవిష్కరిస్తున్నాం అని అంటాం ఎందుకని? వాటి మధ్య ఉన్న తేడా ఏంటంటే.. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు... అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు... కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. ( గమనిక: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ). నేడు ప్రధాని.. ఆ రోజు రాష్ట్రపతి చేయడానికి ప్రధాన కారణం దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). (చదవండి: అక్కడ మాత్రం అర్థరాత్రే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు) -
లయ తప్పిన రిట్రీట్ ధ్వని
గణతంత్ర దినోత్సవ ముగింపులో చేసే ‘బీటింగ్ రిట్రీట్ మార్చ్’లో సంగీతం మారి ఉండవచ్చు, కానీ బీటింగ్ రిట్రీట్ భావనను మనం పరిరక్షించుకుంటూ వచ్చాము. దాన్ని ఎన్నడూ విదేశీయమైనదిగా మనం భావించలేదు. అది భారతీయ సైన్యంలాగే భారతీయతతో కూడి ఉండేది. మనకు ఈరోజు ఉన్న సైన్యం కూడా బ్రిటిష్ వారు రూపొందించిందే. బీటింగ్ రిట్రీట్కి ఉన్న బ్రిటిష్ మూలం కారణంగా అది మనకు చీకాకు కలిగించలేదు. నిజానికది వారసత్వంగా వచ్చిన విలువలకు, సంప్రదాయాలకు ప్రతీకగా గౌరవం పొందుతోంది కూడా. అయితే ఎప్పటికీ ఈ ప్రాధాన్యం ఉంటుందా? మీరు ఎంత ముసలివాళ్లయితే, అంత ఎక్కు వగా గతాన్ని పట్టుకుని వేళ్లాడతారని చెబు తుంటారు. అది తప్పకుండా నిజమేనని నేను తలుస్తున్నాను. గత వారం గణతంత్ర దినోత్సవ ముగింపు వేళ జరిపే ‘బీటింగ్ రిట్రీట్’పై నా చికాకుతో కూడిన స్పందనకు ఇది ఒక విశ్వస నీయ వివరణలా కనిపిస్తుంది. నేను దాన్ని ఇష్టపడలేదు. కానీ నేను ఈ విషయాన్ని తర్వాత పేర్కొంటాను. ఓ వారం క్రితం నేను చూసిన ఆ కార్యక్రమం నేపథ్యం గురించి మొదట నన్ను వివరించనీయండి. నేను దానిపై ఇలా అనుభూతి చెందుతున్నాను. బీటింగ్ రిట్రీట్ ఒక మిలిటరీ వేడుక. బహుశా రెండవ జేమ్స్ ఇంగ్లండ్ రాజుగా ఉన్నప్పుడు 17వ శతాబ్దంలో ఇది ప్రారంభమైంది. ఒక రాత్రిపూట సైనిక దళాలు తిరోగమిస్తున్నప్పుడు యుద్ధ ముగింపు నకు సంకేతంగా బీటింగ్ రిట్రీట్ని మొదలెట్టారు. 1950లలో భారత దేశం కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలకు సంబంధించి మూడురోజుల ముగింపు సందర్భంగా ఈ భావనను బ్రిటిష్ సంప్రదాయం నుంచి అరువు తెచ్చుకుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంగ్లిష్ కవాతుల నుంచి భారతీయులే స్వయంగా స్వరపర్చడం వరకు ‘బీటింగ్ రిట్రీట్ మార్చ్’లో సంగీతం మారి ఉండవచ్చు, కానీ బీటింగ్ రిట్రీట్ భావ నను మాత్రం మనం పరిరక్షించుకుంటూ వచ్చాము. నిజానికి దాన్ని మనం ఆదరిస్తూ వచ్చాము. దాన్ని ఎన్నడూ విదేశీయమైనదిగా మనం భావించలేదు. అది భారతీయ సైన్యంలాగే భారతీయతతో కూడి ఉండేది. పైగా గుర్తుంచుకోండి. మనకు ఈరోజు ఉన్న సైన్యం కూడా బ్రిటిష్ వారు రూపొందించిందే. బీటింగ్ రిట్రీట్కి ఉన్న బ్రిటిష్ మూలం కారణంగా అది మనకు చికాకు కలిగించలేదు. నిజానికది వారసత్వంగా వచ్చిన విలువలకు, సంప్రదాయాలకు ప్రతీకగా గౌరవం పొందుతోంది కూడా. గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీటింగ్ రిట్రీట్కే నేను ఎల్ల ప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంటాను. నిస్సందేహంగా, సైనికుల కవాతు కచ్చితత్వం చూసి ఆశ్చర్యపడుతుంటాను. భూమ్యాకర్షణ శక్తిని సైతం డేర్ డెవిల్స్ ధిక్కరించడాన్ని చూస్తూ ఆశ్చర్య చకితుడినవుతుంటాను. నేను దాన్ని తోసిపుచ్చలేను. కానీ రిట్రీట్ సంగీతం; నార్త్, సౌత్ బ్లాక్ వెనుక నిలిపి ఉంచిన బ్యాండ్ల వర్ణరంజితమైన యూనిఫాంలు, రక్షణ గోడ వద్ద ఉన్న ఒంటెలు, చివరగా దిగంతాల వద్ద సూర్యుడు అస్తమించే సమయం ఎల్లప్పుడూ నన్ను వెంటాడుతుంటుంది. నా జ్ఞాపకాల్లో ఎన్నటికీ నిలిచి ఉండిపోయింది ఏమిటంటే రైసినా హిల్స్ని అధిరోహిస్తూ, ‘సారే జహాసే అచ్ఛా... హిందూ సితా హమార హమారా’ అని ఆలపిస్తూ ఉండే రిట్రీటింగ్ బ్యాండ్లు. వారు శిఖరాన్ని సమీపిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమించడం ప్రారంభమవుతుంది. వెంటనే లెక్కలేనన్ని పసుపు పచ్చ దీపాలు మొత్తం విస్టాను ప్రకాశవంతం చేసేవి. ఇది ప్రతి ఒక్కరినీ ఆనందంలో ముంచెత్తేది. నేటి పద జాలాన్ని ఉపయోగించి చెప్పాలంటే... అదొక విస్మయం కలిగించే క్షణం. అయ్యో... అది చాలావరకు ఇప్పుడు ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఇక అది జరగని పని. ప్రారంభ ప్రయత్నంగా మార్పు చేసిన సంగీతం భయానకమైనది కాకున్నా, కఠోరంగా ఉంటోంది. భార తీయ లేదా బ్రిటిష్ మూలానికి చెందినవైనా సరే పాదతాడనంతో చేసే సైనిక కవాతుల సంగీతం ఇకపై వినిపించదు. దీని స్థానంలో రాగాలు వచ్చి చేరాయి. సైనిక వేడుకల్లో వాటికి తావులేదు. వీటిని ఇంట్లో లేదా కాన్సర్ట్ హాల్లో అయితే బాగా ఆస్వాదించవచ్చు. విజయ్ చౌక్లో సైనిక బ్యాండ్లు ఆలపించేవి కాదు. మరీ ఘోరమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం ఆలపించిన బీటింగ్ రిట్రీట్ రాగం (ఇది సరైన పదమే అయితే) ఏమాత్రం లయబద్ధంగా లేదు. మాధుర్యంతోనూ లేదు. దీంట్లో సంగీతం కంటే రొద మాత్రమే ఎక్కువగా ఉండింది. అది నరకద్వారంలో ఎవరైనా ఊహించే రొదలా ఉండింది కానీ స్వర్గ లోకపు ద్వారాల వద్ద వినిపించే సంగీతంలా లేదు. ఈ ఒక్క మార్పు దాని అర్థాన్ని మాత్రమే కాదు, బీటింగ్ రిట్రీట్ తక్షణ సారాన్నే ధ్వంసం చేసిపడేసింది. అయినా సరే ఎవరైనా దీన్ని పరిగణిస్తారా? దీనిలోని ఇతర అంశాలు కూడా అదృశ్యమైపోయాయి. ఎత్తయిన ప్రాంతంలో ఉన్న గంటల నుంచి వినిపించే దాని శ్రావ్యమైన మాధుర్యం కూడా పరిత్యజించబడింది. భవనాలను వెలిగించే లక్ష లాది పసుపుపచ్చ బల్బుల స్థానంలో బహుళరంగులు గోడలపై ప్రదర్శితమవుతున్నాయి. అంతకు ముందున్నవి ధ్వనింపజేసే ఆశ్చర్యం, ఆనందం స్థానంలో ఇప్పుడు ఒక యాంటీ క్లైమేట్ని తలపించే నీరస మైన అసంతృప్తి చోటు చేసుకుంది. బీటింగ్ రిట్రీట్లోని ఆనాటి మ్యాజిక్ కనుమరుగైనట్లు కనిపిస్తోంది. ఒక సాధారణమైన, ఉత్తేజపూరితం కానిది మాత్రమే మనకు ఇప్పుడు మిగిలింది. ఒకప్పుడు బీటింగ్ రిట్రీట్కి చెందిన అద్భుతం కానీ, మనోహర దృశ్యం కానీ ఇప్పుడు లేవు. మనకు జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. కాలంతోపాటు అవి కనుమరుగైపోతాయి. గత వారం రిట్రీట్ సందర్భంగా వర్షం కురిసినప్పుడు, దేవుళ్లు సైతం విలపిస్తున్నట్లుగా నేను అనుభూతి చెందాను. అది తగిన స్పందనలాగే కనిపించింది. ప్రపంచం మారుతోందనీ, ఆ మార్పు వెనకాలే నేను మిగిలిపోయాననీ గుర్తించాను. అందుకే నేను విషాదంతో ఉన్నాను. అందుకే నేను ఇంత ప్రతికూల దృక్పథంతో ఉంటుండవచ్చు. చివ రగా, నేను ముందుకేసి చూస్తున్నప్పుడు, నా మనస్సును రెండు ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఇక్కడ చుట్టుముట్టడం అనేది సరైన పదం. ఎందుకంటే వాటికి నేను సమాధానం చెప్పలేను మరి. సారే జహా సే అచ్ఛా పాట పాడి ఎంతకాలమైంది! కచ్చితంగా దాని మూలాలే ఆ పాటను అనుమానించేలా చేశాయా? అలాగయితే బీటింగ్ రిట్రీట్ ఎప్పుడు ముగిసిపోతుంది? ఏమైనా దాని వలసవాద చరిత్రను మీరు తోసిపుచ్చలేరు కదా. పైగా అది ఆత్మనిర్భర్ కాదు కూడా మరి. కరణ్ థాపర్ ,వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
దేశభక్తి గీతాన్ని ఆలపించిన మమత!: వీడియో వైరల్
గురువారం 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించకుని అన్ని చోట్ల చాలా ఘనంగా వేడుకలు జరిగాయి. అలానే పశ్చిమ బెంగాల్లో కూడా చాలా వైభవంగా జరిగింది. ఐతే ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించకుని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశభక్తి గీతాన్ని ఆలపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తెల్లటి కాటన్ చీరలో బెంగాల్ కవి ద్విజేంద్రలాల్ సరే రాసిన 'ధోనో ధన్నే పుష్పే భోరా' అనే పాటను ఇతర గాయకులతో కలిసి ఆలపించారు. ఈ పాట బెంగాల్లో ఉన్న వనరులను, అక్కడి వారసత్వాన్ని తెలియజేస్తుంది. మమత ఈ పాటను ఆలపించి తన దేశభక్తిని చాటుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన పశ్చిమబెంగాల్లో కోల్కతాలోని ప్రసిద్ధ దుర్గాపూజా ఢిల్లీలోని నిర్వహించిన కవాతులో ప్రదర్శించారు. ట్రాక్టర్ ముందు భాగంలో నారికేళంతో ఉన్న పూర్ణ కలశం దాని ముందు మాతృదేవతా ఆరాధన నమునా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. (చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్లైన్కు భారీ పెనాల్టీ) -
డల్లాస్లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత 74వ గణతంత్ర దినోత్సవాలు అమెరికాలోని డల్లాస్లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్లోని ఇర్వింగ్లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్లోని ప్రసాద్ తోటకూర, ఛైర్మన్, రావు కల్వల సెక్రటరీ & బోర్డు సభ్యుడు, దినేష్ హుడా బోర్డు సభ్యుడు & కో-చైర్, ఐఏఎన్టీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. -
ఢిల్లీలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
దసరా నుంచి నాని మాస్ పోస్టర్ రిలీజ్.. టీజర్ అప్డేట్ వచ్చేసింది
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి బజ్ను క్రియేట్ చేస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రిపబ్లిక్ డే సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నాని ఊరమాస్ లుక్లో కనిపిస్తున్నారు.తెలుగు తో పాటుగా, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది. టీజర్ను ఈనెల 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. Get ready for the Mass Blast 💥#DasaraTeaser on January 30th 🔥🔥 In Telugu, Tamil, Kannada, Malayalam & Hindi 💥#Dasara in cinemas from March 30th 💥 Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @sathyaDP @saregamasouth pic.twitter.com/KrkxuM3GVe — SLV Cinemas (@SLVCinemasOffl) January 26, 2023 -
కమల్ కామరాజు 'సోదర సోదరీమణులారా...' ఫస్ట్లుక్ అవుట్
కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సోదర సోదరీమణులారా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టాగ్ లైన్. ఈ సినిమాతో రఘుపతి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 9 ఈఎమ్ ఎంటర్టైన్మెంట్స్, ఐఆర్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. పక్కా స్క్రిప్ట్తో కేవలం 35రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా కథాంశంతో తెరకెక్కింది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ విడుదలైంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి.. చిరంజీవి ట్వీట్
యావత్ దేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. 1950లో భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 73 సంవత్సరాలు పూర్తైంది. ఇవాళ 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా దేశభక్తిని చాటుకుంటూ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 'మన భారతీయులందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమూల్యమైన స్వాతంత్ర్య బహుమతి కోసం మరియు ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాలలో ఒకటైన మా వ్యవస్థాపక తండ్రులను ప్రేమగా స్మరించుకుంటూ సెల్యూట్ చేస్తున్నాము.మన మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి' అంటూ చిరు ట్వీట్లో రాసుకొచ్చారు. Fondly Remembering & Saluting our founding fathers for the invaluable gift of independence and for one of the greatest constitutions of the world! 🙏🙏 May our Motherland 🇮🇳 be prosperous forever!! 💐 Happy 74th Republic Day to All of us Indians!! 💐🇮🇳🇮🇳 — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2023 -
రిపబ్లిక్ డే 2023: మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకల ఫొటోలు
-
పాటల్లో దేశభక్తి స్ఫూర్తి.. ఈ పాటలు ఎవర్గ్రీన్!
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గుండెల నిండా దేశభక్తితో జరుపుకునే పండగే ఈ గణతంత్ర దినోత్సవం.బ్రిటీష్ పాలనలో మగ్గిన మన దేశానికి స్వాతంత్ర్యం అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశ వ్యాప్తంగా పండగలా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గుండెనింగా దేశభక్తి, మనసు ఉప్పొంగేలా అమరవీరుల పోరాటాన్ని వివరించేలా ఎన్నో దేశభక్తి గీతాలు ప్రేక్షకులను సమ్మోహన పరిచాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి జూ. ఎన్టీఆర్, రామ్చరణ్ల వరకు ఎంతో మంది స్టార్ హీరోలు దేశభక్తి కలిగిన సినిమాల్లో నటించారు. తరాలు మారినా ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తిని ఉప్పింగించే కొన్ని సినీ పాటల్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ‘మేమే ఇండియన్స్’ గణతంత్ర దినోత్సవ రోజుల్లో టీవీల్లో మనం ఎక్కువగా చూసే సినిమా ‘ఖడ్గం’. ఈ సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో పోషించారు. దేశభక్తి చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పటికీ ఎవర్గ్రీన్గానే రన్ అవుతోంది. ఇందులోని దేశభక్తి సాంగ్ ‘మేమే ఇండియన్స్’ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని దేశభక్తి పాటలివే.. -
రిపబ్లిక్ డే రోజు టీమిండియా గెలిచిన ఏకైక వన్డే ఏదో గుర్తుందా..?
గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజు భారత క్రికెట్ జట్టు ఏదైన మ్యాచ్ గెలిచిందా..? గెలిచి ఉంటే.. ఆ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపై గెలిచింది..? ఈ వివరాలు 2023 రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని భారత క్రికెట్ అభిమానుల కోసం. వివరాల్లోకి వెళితే.. 2019 న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా భారత జట్టు రిపబ్లిక్ డే రోజున ఓ వన్డే మ్యాచ్ గెలిచింది. చరిత్రలో ఈ రోజున టీమిండియా గెలిచిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం విశేషం. 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా మౌంట్ మాంగనూయ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా.. ఆతిధ్య జట్టుపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఒక్క విజయం మినహాయించి రిపబ్లిక్ డే రోజు ఇప్పటివరకు టీమిండియాకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా లభించలేదు. ఈ మ్యాచ్కు ముందు 3 సందర్భాల్లో ఇదే రోజున టీమిండియా వన్డే మ్యాచ్లు ఆడినప్పటికీ, విజయం సాధించలేకపోయింది. Another brilliant performance by the Men in Blue. #TeamIndia wrap the second ODI, win by 90 runs. 2-0 🇮🇳🇮🇳 #NZvIND pic.twitter.com/2fTF9uQ5JM — BCCI (@BCCI) January 26, 2019 1985-86 వరల్డ్ సిరీస్లో భాగంగా తొలిసారి రిపబ్లిక్ డే రోజున అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా.. ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతర్వాత 2000 సంవత్సరంలో ఇదే రోజు, అదే అడిలైడ్లో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఆసీస్ చేతిలోనే రెండోసారి కూడా ఓడింది (152 పరుగుల తేడాతో). 2015 సిడ్నీ వేదికగా రిపబ్లిక్ డే రోజున ఆస్ట్రేలియాతోనే జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. ఇలా.. చరిత్రను తిరగేస్తే, భారత క్రికెట్ జట్టు 2019లో న్యూజిలాండ్పై విజయం మినహాయించి రిపబ్లిక్ డే రోజున ఒక్క విజయం కూడా సాధించలేదు. అందుకు ఈ విజయానికి అంత ప్రత్యేకత. ఇక, ఆ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (87), శిఖర్ ధవన్ (66) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఖర్లో ధోని (48 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్.. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/45), చహల్ (2/52) మాయాజాలం దెబ్బకు 40.2 ఓవర్లలో 234 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్ ఇన్నింగ్స్లో డౌగ్ బ్రేస్వెల్ (57) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
రిపబ్లిక్ డే స్పెషల్: దేశభక్తి చాటే బాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు
భారత రిపబ్లిక్ డే జనవరి 26న వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది జరిగే గణతంత్ర సంబరాలు చేసుకునేందుకు కోట్లాది ప్రజలు సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారి స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వారి చరిత్రలు గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో పుస్తకాలు చదివే సమయం లేకపోయినా.. చరిత్రను తెరపై ఆవిష్కరించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఎంచక్కా కుటుంబంతో కలిసి చూడాల్సిన స్వాతంత్ర్య పోరాట సినిమాలను కొన్నింటిని మీకు గుర్తు చేస్తున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశభక్తితో పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాలీవుడ్ టాప్ టెన్ చిత్రాలపై ఓ లుక్కేయండి. అమీర్ ఖాన్ లగాన్ అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన చిత్రం లగాన్. ఈ సినిమాలో అధిక మొత్తంలో బ్రిటీష్ పన్నుల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి రైతు చేస్తున్న పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం పొందేందుకు బ్రిటిష్ వారికి ఇష్టమైన క్రీడ అయిన క్రికెట్లో ఓడించడం ఈ చిత్రంలో చూపించారు. షారుఖ్ ఖాన్ స్వదేశ్ షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం స్వదేశ్. నాసాలో పనిచేసే శాస్ర్తవేత్తగా ఇందులో కనిపించారు. ఈ చిత్రంలో హీరో తన అమ్మను చూసేందుకు భారతదేశానికి వచ్చే వస్తాడు. ఆ తరువాత ఇక్కడి పరిస్థితులకు చలించిపోయి స్వేదేశంలోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. నాసా ప్రధాన కార్యాలయంలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం స్వదేశ్. రంగ్ దే బసంతి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన సినిమా రంగ్ దే బసంతి. ఈ చిత్రంలో భారతదేశంలోని సామాజిక సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇండియాలోని ఐదుగురు స్వాతంత్ర్య సమరయోధుల కథను డాక్యుమెంట్ చేయడానికి ఒక బ్రిటిష్ విద్యార్థి భారత్కు వస్తాడు. ఇందులో ఐదుగురు భారతీయ విప్లవకారుల పాత్రలు చూపించారు. ఇది బ్రిటీష్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాటం చక్కగా తెరకెక్కించారు. చక్ దే ఇండియా కబీర్ ఖాన్ తెరకెక్కించిన మూవీ చక్ దే ఇండియా. ఈ సినిమాలో దేశభక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో షారూక్ ఖాన్ భారత మహిళా హాకీ జట్టు కోచ్ పాత్రలో కనిపిస్తారు. ఇండియా కోల్పోయిన తన ఖ్యాతిని తిరిగి కాపాడుకోవాలనే సందేశంతో తెరకెక్కించారు. అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత జట్టు హాకీ జట్టు గెలవాలనే కోరికను బలంగా చూపించారు. రాజీ- ఆలియా భట్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాజీ. రా ఎజెంట్ పాత్రలో ఆలియా భట్ నటించింది. ఈ చిత్రంలో ఇండియాకు కీలకమైన విలువైన సమాచారాన్ని సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఆమె ఒక పాకిస్తాన్ సైనికుడిని వివాహం చేసుకుని ఆ దేశానికి వెళ్లిపోతుంది. దేశం పట్ల ఆమెకున్న ప్రేమతో కుటుంబాన్ని కోల్పోతుంది. ఈ సినిమాలో అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేసరి- సిక్కు సైనికుల కథ సారాంఘరి యుద్ధంలో పోరాడిన వీర సిక్కు సైనికుల కథను ఈ సినిమాలో చూపించారు. అమరులైన వీరికి కేసరి నివాళులు అర్పించారు. పదివేల మంది పష్టూన్ ఆక్రమణదారులతో జరిగిన పోరాటాలను చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 21 మంది సిక్కు సైనికులకు నాయకత్వం వహించిన హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలోని యుద్ధాన్ని ఈ కథలో ఆవిష్కరించారు. భారతదేశ చరిత్రలో గొప్ప యుద్ధాలలో ఇది ఒకటిగా నిలిచింది. మణికర్ణిక- కంగనా రనౌత్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మణికర్ణిక. ఈ చిత్రంలో ఝాన్సీ రాణి పాత్రను ఆమె పోషించింది. ఈస్ట్ ఇండియన్ కంపెనీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఝాన్సీ రాణి చేసిన పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. ఆమె తిరుగుబాటు బ్రిటీష్ వారిపై విపరీతమైన స్వాతంత్ర్య యుద్ధంగా మారింది. ఝాన్సీ రాణి మణికర్ణిక పాత్రలో కంగనా రనౌత్ మెప్పించింది. యూరి -ది సర్జికల్ స్ట్రైక్ యూరిలో జరిగిన దాడికి ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2016లో కాశ్మీర్లోని ఒక భాగమైన సైనిక స్థావరం యూరీపై మిలిటెంట్లు దాడి చేశారు. ఆ తర్వాత భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆధారంగా రూపొందించబడింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా రూపంలో అమరులైన భారత సైనికులకు ఘన నివాళి అర్పించారు. విక్కీ కౌశల్లో మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రలో కనిపించారు. షేర్షా- కార్గిల్ యుద్ధం షేర్షా పాకిస్తాన్పై కార్గిల్ యుద్ధం నాటి సంఘటనల ఆధారంగా షేర్షా మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా కెప్టెన్ విక్రమ్ బాత్రా త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించారు. కెప్టెన్ బాత్రా పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. సర్దార్ ఉధమ్ సింగ్- 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం బ్రిటీష్ పాలనలోని 1919 కాలంలో జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ ఉదంతం. ఈ మారణకాండకు ప్రతీకారంగా మైఖేల్ ఓ డయర్ను భారతీయ విప్లవకారుడు సర్దార్ ఉధమ్ సింగ్ హత్య చేశారు. అతని జీవిత ప్రయాణాన్ని షూజిత్ సిర్కార్ ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ భారతీయ విప్లవకారుడు ఉధమ్ సింగ్ పాత్రను పోషించాడు. భారతీయ చరిత్రలో నిలిచిపోయిన వీరుడికి ఈ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పించారు. -
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ప్రకటించిన కేంద్రం.. ఏపీకి విశిష్ట సేవా అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ను కేంద్రం ప్రకటించింది. ఏపీకి రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. తెలంగాణకు రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 13 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కాగా, జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. అనేక రాష్ట్రాల పోటీ మధ్యలో ఏపీ శకటం ప్రబల తీర్థం పరేడ్కు ఎంపికైంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొత్తం 17 శకటాలు ఎంపికయ్యాయి. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. చదవండి: రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్ -
Republic Day: విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు.. వాహనాల రూట్ ఇలా..
విజయవాడ స్పోర్ట్స్: ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలు జరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో బెంజిసర్కిల్ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వరకు, రెడ్సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ జంక్షన్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించమన్నారు. బెంజిసర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా వరకు ఆహా్వనితులను మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ ఆంక్షలు విధిస్తున్నామన్నారు. వాహనాల రూట్ ఇలా.. ♦ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బెంజిసర్కిల్ రాకపోకలు సాగించే బస్సులు, ఇతర వాహనాలు ఏలూరు రోడ్డు, స్వర్ణప్యాలెస్, దీప్తిసెంటర్, పుష్పాహోటల్, జమ్మిచెట్టు సెంటర్, సిద్ధార్థ జంక్షన్ మార్గాన బందరులాకులు, రాఘవయ్యపార్క్, పాతఫైర్ స్టేషన్రోడ్, అమెరికన్ ఆస్పత్రి, మసీద్రోడ్, నేతాజీబ్రిడ్జి, గీతానగర్, స్క్యూ బ్రిడ్జి మార్గాన్ని అనుసరించాలి. ♦ఐదో నెంబర్ రూట్లో ప్రయాణించే సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ నుంచి బెంజిసర్కిల్కు చేరుకోవాలి. ♦హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే భారీ, మధ్యతరహా వాహనాలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్జంక్షన్ మార్గాన్ని అనుసరించాలి. ♦విశాఖపట్నం నుంచి చెన్నైకి రాకపోకలు సాగించే భారీ, మధ్యతరహా వాహనాలు హనుమాన్జంక్షన్, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గాన్ని అనుసరించాలి. ♦గుంటూరు నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే వాహనాలు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడిబ్రిడ్జి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్జంక్షన్ మార్గాన్ని అనుసరించాలి. ♦చెన్నై నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగించే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నాల్గొండ, నార్కెట్పల్లి మార్గాన్ని అనుసరించాలి. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు.. గణతంత్ర వేడుకలకు విచ్చేసే ఆహా్వనితులు వారి వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేక స్థలాలను కేటాయించినట్లు సీపీ తెలిపారు. ♦అ అ పాస్లు కలిగిన వారు స్టేడియం గేట్–2 నుంచి లోపలికి ప్రవేశించి, అక్కడే నిర్ధేశిత ప్రాంతంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ♦అ1, అ2 పాస్లు కలిగిన వారు గేట్–4 నుంచి ప్రవేశించి హ్యాండ్బాల్ గ్రౌండ్ నందు వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ♦ఆ1, ఆ2 పాస్లు కలిగిన వారు గేట్–6 నుంచి ప్రవేశించి ఫుట్బాల్ గ్రౌండ్ నందు, స్టేడియానికి ఎదురుగా ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్ నందు వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ♦మీడియా ప్రతినిధులు గేట్–2 నుంచి స్టేడియం లోపలికి ప్రవేశించాలి. ♦నున్న, సింగ్నగర్, సత్యనారాయణపురం, మాచవరం వైపు నుంచి వచ్చే స్కూల్, కాలేజీ బస్సులు సీతారామపురం జంక్షన్ మీదుగా పుష్పా హోటల్ వరకు చేరుకుని అక్కడ విద్యార్థులను దింపి బస్సులను మధుచౌక్, జమ్మిచెట్టు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్నందు పార్కింగ్ చేసుకోవాలి. ♦పటమట వైపు నుంచి స్కూల్, కాలేజీ బస్సులు బెంజిసర్కిల్ మీదుగా వెటర్నరీ జంక్షన్ వరకు వచ్చి అక్కడే విద్యార్థులను దింపి బస్సులను నేతాజీ బ్రిడ్జి, స్క్యూబ్రిడ్జి, బెంజిసర్కిల్, నిర్మలజంక్షన్, పాలిక్లినిక్రోడ్డు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నందు పార్కింగ్ చేసుకోవాలి. ♦వన్టౌన్, కొత్తపేట, భవానీపురం, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే స్కూల్, కాలేజీ బస్సులు స్వరాజ్ మైదానంలో పార్కింగ్ చేసుకోవాలి. చదవండి: టీడీపీ నేత గోడి అరుణకు పార్టీలో లైంగిక వేధింపులు.. రాజీనామా ప్రకటన -
Republic Day 2023: ఢిల్లీ కర్తవ్యపథ్లో భారీగా రిపబ్లిక్ డే రిహార్సల్స్ (ఫోటోలు)
-
రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ శకటం ప్రబల తీర్థం
న్యూఢిల్లీ: జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. అనేక రాష్ట్రాల పోటీ మధ్యలో ఏపీ శకటం ప్రబల తీర్థం పరేడ్కు ఎంపికైంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొత్తం 17 శకటాలు ఎంపికయ్యాయి. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ కార్యాలయం వెల్లడించింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మకర సంక్రాంతి సందర్భంగా వీటిని ప్రదర్శిస్తారని.. సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా ప్రబల తీర్థం శకటం ఉందని తెలిపింది. గ్రీన్ హరిత విప్లవానికి ఇది ఉదాహరణగా పేర్కొంది. ఏపీ దేశానికి అన్నపూర్ణ, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించింది. కాగా విలువైన సంస్కృతికి నిలయం ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్ డే పరేడ్కు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తుంది. దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాలకు అవకాశం వచ్చింది. సాక్షి, ఢిల్లీ: రైతే రారాజు అనే ఇతివృత్తంతో రూపొందించిన శకటం.. ప్రభల తీర్థం అని రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కోనసీమ ప్రబల తీర్థం రిపబ్లిక్ డే వేడుకలకు ఎంపికైందని, 400 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్న సంస్కృతికి ప్రబల తీర్థం ఒక నిరద్శనమని పేర్కొన్నారాయన. చదవండి: AP: దేశంలో పెద్ద మంచినీటి సరస్సు మన రాష్ట్రంలోనే.. ప్రత్యేకతలివే! -
షావోమి 12 ప్రొపై భారీ తగ్గింపు, ఎక్కడంటే!
సాక్షి, ముంబై: షావోమి రిపబ్లిక్ డే సేల్ భాగంగా స్మార్ట్టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్ సహా ఇతర ఉత్పత్తులను భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా షావోమి 12 ప్రొ 5జీ ధరపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు ICICI బ్యాంక్ ,ఇండస్ఇండ్ బ్యాంక్ వినియోగదారులు వరుసగా రూ. 3,000 , రూ. 2,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఐదు రోజుల ఈ సేల్లో రోజువారీ 12 గంటల పరేడ్లో నిర్దిష్ట గాడ్జెట్లపై కస్టమర్లు ఈ ఆఫర్ల ప్రయోజనాన్ని పొందగలరు. డీల్లో భాగంగా, వినియోగదారులు షావోమి 12 ప్రొ రూ. 10,000 తగ్గింపు తరువాత రూ. 44,999కి సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లో దీని అసలు ధర రూ. 54,999 (8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్). అలాగే 12 జీబీ ర్యామ్, 254 జీబీ స్టోరేజ్ టాప్-ఎండ్ వేరియంట్ను భారీ తగ్గింపుతో రూ.58,999కి కొనుగోలు చేయవచ్చు. షావోమి అధికారిక భారతదేశ వెబ్సైట్లో ఈసేల్ అందుబాటులో ఉంది. 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తున్న భారతదేశంలోని ఏకైక ఫోన్ ఇదే. ఇంకా 6.7-అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్ షావోమి 12 ప్రొ లోని ప్రధాన స్పెసిఫికేషన్స్. అలాగే 10వేల ధర ఉన్న రెడ్ మీ 10ను 8వేలకే లభ్యం. రూ. 4 వేల తగ్గింపుతో షావోమి నోట్బుక్ను ఈ సేల్ 72999లకే కొనుగోలు చేయవచ్చు. -
10వేలకే స్మార్ట్టీవీ, రెడ్మీ స్మార్ట్టీవీ 32 ఉచితంగా పొందే లక్ మీదే!
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ షావోమీ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. 74వ గణతంత్ర సంవత్సరం సందర్భంగా, అధికారిక వెబ్సైట్ ప్రత్యేకమైన డీల్స్, ప్రమోషన్లను అందిస్తోంది. రోజువారీ 12 గంటలకు పరేడ్, 3 గంటలకు ఫ్లాష్ సేల్, ఎక్స్చేంజ్ అవర్ లాంటివి ప్రకటించింది. అంతేకాకుండా, వినియోగదారులు ప్లే అండ్ విన్ ఆఫర్ ద్వారా రెడ్మీ స్మార్ట్ టీవీ 32, రెడ్మి నోట్ ప్రోలాంటి అద్భుతమైన ఉచిత ఉత్పత్తులను గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. జనవరి 20 వరకు, 23న ఈ సేల్ అందబాటులో ఉంటుంది.ఈ సేల్లో షావోమీ స్మార్ట్ఫోన్లు స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, ఇతర ప్రొడక్టులు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇండస్ఇండ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పాటు యూపీఐ పేమెంట్లపై కూడా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్లో కొన్ని షావోమీ, రెడ్మీ, ఎంఐ టీవీలు మంచి తగ్గింపుతో స్మార్ట్టీవీలనుకొనుగోలు చేయవచ్చు. రెడ్మీ స్మార్ట్ టీవీ 32 హెచ్డీ రెడీ రెడ్మీ 32 ఇంచుల ఈ స్మార్ట్ టీవీ రూ.10,999గా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు. అంటే రూ.9,999కే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో సింగిల్ పేమెంట్లో కొంటే రూ.1,500 తగ్గింపు ఉంటుంది. పేటీఎం వ్యాలెట్, ఏదైనా యూపీఐ ద్వారా పేమెంట్లపై రూ.1,000 డిస్కౌంట్ లభ్యం. షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ రూ.12,499 ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ పేమెంట్లపై రూ.1,000, పేటీఎం వ్యాలెట్తో చెల్లింపులు చేస్తే మరో రూ.1,000, ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డు ఆఫర్లు వినియోగించుకుంటే ఈ 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. -
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్: స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్పై బ్లాక్బస్టర్ డీల్స్
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ మేజర్ అమెజాన్ ఇండియా రిపబ్లిక్ డే సేల్ 2023 తేదీలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో భాగంగా జనవరి 19 నుండి జనవరి 22 వరకు తగ్గింపు ధరల్లో పలు ఉత్పత్తులను అందించనుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్స్పై 40 శాతం వరకు తగ్గింపును, ల్యాప్టాప్లు , స్మార్ట్వాచ్లపై 75 శాతం తగ్గింపును అందిస్తుంది. అలాగే ఎప్పటిలాగానే అమెజాన్ ప్రైమ్ మెంబర్లు జనవరి 18 నుండే ఈ సేల్లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో బ్లాక్బస్టర్ డీల్స్, బడ్జెట్ బజార్, ప్రీ-బుకింగ్, రాత్రి 8 గంటల డీల్స్తో పాటు కొత్త లాంచ్లు కూడా ఉంటాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 సందర్భంగా ఆపిల్, శాంసంగ్, వన్ప్లస్, వివో, రియల్మీ, ఒప్పో, షావోమీ లాంటి బ్రాండ్ల బెస్ట్ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ను సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎలక్ట్రానిక్స్, దుస్తులు తదితరాలపై కూడా తగ్గింపు ఉంటుంది. ప్రస్తుతం ప్రైమ్ ఫోన్ పార్టీ" సేల్ నడుస్తోంది. బ్యాంకు కార్డ్ వినియోగదారులకు ఆఫర్లు ఎస్బీఐ కార్డ్ యూజర్ల EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ కార్డ్ లావాదేవీలపై 10 శాతం (రూ. 1,000 వరకు) తక్షణ క్యాష్బ్యాక్ను అందించనుంది. -
పంత్ను కాపాడిన బస్సు డ్రైవర్కు సత్కారం.. ఎప్పుడంటే?
రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిలో హమ్మద్పూర్ ఝల్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ మాన్ తన వాహనాన్ని నిలిపివేసి.. అప్పటికే కారు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పంత్ను కాపాడాడు. దీంతో ఇప్పటికీ సుశీల్ మాన్ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంత్ను కాపాడిన సుశీల్ మాన్ను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా పంత్ ప్రస్తుతం రిషికేష్ లోని ఏయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో అతడు స్వదేశంలో జరిగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లతో పాటు ఐపీఎల్కు కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: IPL 2023: ఐపీఎల్కు పంత్ దూరం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అతడే? -
గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు ఫొటోలు
-
గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు.. వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు(శనివారం) రిపబ్లిక్ డే ముగింపు వేడుకల్లో భాగంగా బీటింగ్ రిట్రీట్లో డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వదేశీ సాంకేతికత ద్వారా రూపొందించబడిన 1,000 డ్రోన్లతో 10 నిమిషాల పాటు ప్రదర్శన ఏర్పాటు చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకునే వేడుకలో భాగంగా డ్రోన్ షో, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో కనువిందు చేసింది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి సహా కేంద్రమంత్రులు, ప్రముఖులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్ను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా అనేక కొత్త ట్యూన్లను చేర్చారు. రక్షణ శాఖ సహాయంతో కొత్త ట్యూన్లు చేర్చబడ్డాయి.‘హింద్ కి సేన’, కేరళ’, ‘ఏ మేరే వతన్కే లోగోన్’ ట్యూన్లు ఉన్నాయి. ‘సారే జహాన్ సే అచ్చా’ ట్యూన్తో బీటింగ్ రిట్రీట్ పరేడ్ ముగియనుంది. ఇక డ్రోన్ ప్రదర్శనను ఢిల్లీకి చెందిన బోట్ల్యాబ్స్ డైనమిక్స్ స్టార్టప్ సంస్థ నిర్వహించింది. -
విరాట్కు వీడ్కోలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అంగరక్షక దళంలో సేవలందించిన నల్ల గుర్రం విరాట్ రిపబ్లిక్ డే రోజున రిటైర్మెంట్ తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి విరాట్కు ఘనంగా వీడ్కోలు జరిపారు. ఇది ఇప్పటికి 13 సార్లు గణతంత్ర దినోత్సవ పరేడ్లలో పాల్గొంది. వయసు మీద పడటంతో ఇప్పుడు దీని సేవలకు ముగింపు పలికారు. జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా విరాట్కు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ లభించింది. ఈ సత్కారం అందుకున్న తొలి అశ్వం ఇదే! 2003లో హనోవేరియన్ జాతికి చెందిన ఈ గుర్రం అంగరక్షక దళంలో చేరింది. వయసు మీద పడినా, 2021లో గణతంత్ర దినోత్సవ వేడుక, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో విరాట్ అద్భుతంగా రాణించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. -
తమిళ గీతాన్ని అవమానపరిచారంటూ ఆర్బీఐ సిబ్బందిపై కేసు నమోదు
చెన్నై: మన దేశంలోనే తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల కంటే.. తమిళులు చాలా భిన్నమైన వాళ్లు. సమస్య వస్తే.. అందరూ ఒకే తాటిపైకి వచ్చి సమస్యలపై పోరాటం చేస్తారు. ముఖ్యంగా తమిళనాడు పద్ధతులు, సంస్కృతుల పట్ల రాష్ట్ర ప్రజలు చాలా సీరియస్గా ఉంటారు. అయితే తాజాగా మరోసారి తమిళ వాసులకు కోపం వచ్చింది. బుధవారం దేశ వ్యాప్తంగా 73వ రిపబ్లిక్ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్రీయ గీతం తమిళ్తాయ్ వాళ్తు ఆలపిస్తారు. అచ్చం మనం జాతీయ గీతం పాడేటప్పుడు ఎలాగ నిలబడతామో... వారు కూడా అలాగే నిలబడి తమిళ గీతాన్ని ఆలపిస్తారు. కానీ నిన్న తమిళ గీతం పాడేటప్పుడు మాత్రం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు లేచి నిలబడలేదు. ఈ సంఘటన తమిళ నాడు ఆర్బీఐ కార్యాలయంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రంలో వివాదస్పదంగా మారింది. అంతేకాదు.. రాష్ట్రీయ గీతం పాడేటప్పుడు నిలబడని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల పై హైకోర్టు న్యాయవాది జి రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మద్రాసు కోర్టు పిటీషన్ కూడా దాఖలు చేశారు. చదవండి: కరోనా: మరోసారి 3 లక్షలకు దిగువన కేసులు.. కొత్తగా ఎన్నంటే ఇక ఈ కేసుపై విచారణ చేసిన కోర్టు.. తమిళ గీతం పాడేటప్పుడు ఆ అధికారులు నిలబడటం ఏ మాత్రం తప్పు కాదని పేర్కొంది. వారికి ఈ రూల్స్ తేలియదని మేం అనుకుంటున్నామని, దీనిపై ఇంత రాద్ధాంతం అవసరం లేదు అంటూ తీర్పు ఇచ్చింది. అయితే అటు కోర్టు తీర్పును రాష్ట్ర ఆర్థిక మంత్రి పీటీఆర్ త్యాగరాజన్, ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్లు ఖండించారు. అంతేకాదు ఆర్బీఐ కార్యాలయ ముట్టడికి తమిళ సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో పోలీసులు ఆర్బీఐ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. చదవండి: Uttar Pradesh Assembly Election 2022: ఏదో తేడా కొడుతోంది..! -
వివాదంలో మెగా కోడలు ఉపాసన.. ఆ పోస్ట్పై నెటిజన్స్ ఫైర్
మెగా కోడలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ భార్యగా, అపొలో అధినేత మనవరాలిగా కాకుండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ.. ఫిట్ నెస్, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఇలా సోషల్ మీడియాను మంచి విషయాల కోసం వాడే ఉపాసన.. తాజాగా నెటిజన్ల ఆగ్రహానికి గురైయ్యారు. దానికి కారణం ఆమె షేర్ చేసిన ఒక ఫోటోనే. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ గుడి గోపురం ఫోటోని షేర్ చేసింది ఉపాసన. అందులో దేవుళ్ల ఫోటోలకు బదులు.. కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ఫోటోలో తనతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారని, ఎక్కడో కనిపెట్టండి అంటూ ఉపాసన ఫాలోవర్స్ని కోరారు. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటి పోస్టులు పెట్టి మీపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
ప్రత్యేక ఆకర్షణగా సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాల ప్రదర్శనను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఈ క్రమంలో శకటాలపై ఉన్న చిన్నారుల అభివాదానికి చిరునవ్వుతో తిరిగి అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. ముందుగా అక్కడికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వస్తున్నారని తెలిసి కారు దగ్గరే వేచి ఉండి, గవర్నర్ను సాదరంగా ఆహ్వానించి కార్యక్రమానికి తోడ్కోని వచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, శాసన మండలి చైర్మన్ మోషేన్రాజు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రిపబ్లిక్ డే వివాదంలో అనసూయ.. ఫైనల్గా
Anasuya Trolled On Republic Day For Singing National Song: బుల్లితెర యాంకర్గా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్ అయింది అనసూయ భరద్వాజ్. ఓ పక్క గ్లామరస్ యాంకర్గా రాణిస్తూనే మరోపక్క వెండితెరపై తళుక్కుమంటుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో దాక్షాయణిగా అలరించి మరింత పాపులర్ అయింది. అలాగే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అప్పుడుప్పుడు పలు వివాదాలు కూడా అనసూయను పలకరిస్తూ ఉంటాయి. నెటిజన్లు ట్రోల్ చేయడం, వారికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడం పరిపాటే. అయితే తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. క్లారిటీ ఇద్దామనుకున్న ట్రోలింగ్ ఆగట్లేదు. ఇంతకీ అనసూయ చేసిన పని ఏంటంటే.. అనసూయ జాతీయ గేయాన్ని నిలుచుని పాడకుండా కుర్చీలో కూర్చొని పాడింది. జాతీయ గీతం, జాతీయ గేయం ఏదైనా సరే మనం గౌరవిస్తూ ఆ రెండు పాడే సమయాల్లో లేచి నిల్చుంటాం. అనసూయ అలా చేయకుండా కూర్చొని పాడేసరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అలాగే అనసూయ వేసుకున్న టీషర్ట్ మీద గాంధీ బొమ్మ ఉండటంతో గాంధీ బొమ్మ ఎందుకు వేసుకున్నావ్.. ఈరోజు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి గాంధీకి సంబంధం ఏంటని కామెంట్ పెట్టారు. ఈ కామెంట్లకు విసిగిన అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఒక యూజర్ కామెంట్కు 'లేదు.. నేనే సారీ చెబుతున్నా. ఇదంతా చూస్తుంటే నేను నిల్చోకుండా పాడినందుకు చాలా మంది హర్ట్ అయినట్టున్నారు.' అలాగే టీ షర్ట్పై గాంధీ బొమ్మపై వచ్చిన కామెంట్లకు 'అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు. మరి జనగణమణ ఏంది.. ఆగస్ట్ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడండి. హ్యాపీ రిపబ్లిక్ డే' అని చెప్పింది అనసూయ. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
పునీత్ రాజ్కుమార్ చివరి చిత్రం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
Puneeth Rajkumar James Movie Army Officer Look Released: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ ఆకస్మిక మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో గతేడాది అక్టోబర్ 29న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఈ ఏడాది మార్చి17న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు(జనవరి26)న స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఆయన సైనికుడిలా కనిపించారు. చేతన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించింది.హీరో శ్రీకాంత్ విలన్గా నటించగా, అను ప్రభాకర్ ముఖర్జీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా మార్చి 17న పునీత్ జయంతి సందర్భంగా అదే రోజున ఈ సినిమా విడుదల చేయనున్నారు. దీంతో మార్చి 17-23 మధ్యలో ఎలాంటి సినిమాలు విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమానుకన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. -
రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం..
తిరువనంతపురం: గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాకు అవమానం ఎదురైంది. ఈ ఘటన కేరళలోని కాసర్గడ్ జిల్లాలో చోటుచేసుకుంది. కాసర్గఢ్లోని మున్సిపల్ స్టేడియంలో పోర్టులు,ఆర్కియాలజీ శాఖ మంత్రి అహ్మద్ దేవరకోవిల్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెండాను తలకిందులుగా ఎగరవేశారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, అక్కడే ఉన్న కొంత మంది మీడియా సిబ్బంది, ఇతర కార్యకర్తలు దీన్ని గమనించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జెండాను అవనతం చేసిన మంత్రి.. తిరిగి దాన్ని సరిచేసి మళ్లీ ఎగరేశారు. ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. కాగా, సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డిఎఫ్ మిత్రపక్షమైన ఇండియన్ నేషనల్ లీగ్(ఐఎన్ఎల్) మంత్రి అయిన దేవర్కోవిల్ జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హజరయ్యారు. అయితే, అధికారులు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో చేశారు. చాలా సేపటికి ఎవరు కూడా జాతీయ జెండా తలకిందులుగా ఎగరడం గమనించకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే, దీనిపై ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. అహ్మద్ దేవరకోవిల్ వెంటనే రాజీనామా చేయాలని.. కేరళ బీజేపీ రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ డిమాండ్ చేశారు. అదే విధంగా జెండాను అవమానపర్చిన మంత్రి దేవరకోవిల్ పై పోలీసులు కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసి.. కనీసం గమనించకుండా సెల్యూట్ చేసి వెళ్లిపోవడం మంత్రి బాధ్యతారాహిత్యానికి అద్దంపడుతుందని, అధికారులు కూడా లోపాన్ని గుర్తించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఇదే ఘటనపై కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాజ్మోహన్ ఉన్నితాన్ స్పందించారు. జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయడం దురదృష్టకరమన్నారు. చదవండి: రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు -
అమితాబ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. 3 రంగుల గడ్డంతో ఫొటో వైరల్
Amitabh Bachchan Republic Day Wishes With Tricolour Beard: బుధవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవ సందర్భంగా సామాన్యులు, రాజకీయ నాయకులతోపాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియా వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా విష్ చేశారు బిగ్బీ. గణతంత్ర దినోత్సవం రోజున ముచ్చట గొలిపే మూడు రంగుల మువ్వన్నల జెండాను ఎగరవేసి జెండా వందనం చేస్తాం. అయితే అమితాబ్ జాతీయ పతాకంలోని మూడు రంగుల గడ్డంతో విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పారు. మూడు రంగులతో ఉన్న గడ్డం ఫొటోను తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు అమితాబ్ బచ్చన్. అంతేకాకుండా ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని క్యాప్షన్ ఇచ్చారు బిగ్బీ. ఈ పోస్ట్పై నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. 'శుభాకాంక్షలు ఎంతో గొప్పగా చెప్పారు' అని పులువురు కామెంట్ చేస్తే మరికొందరు నవ్వుతున్న ఎమోజీస్ను పెడుతున్నారు. అలాగే ఈ పోస్ట్కు కొన్ని గంటల్లోనే 1.9 లక్షల మందికిపైగా లైక్ చేశారు. View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
అదిరిపోయిన ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్.. ఇక కుర్రకారు తగ్గేదె లే!
దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో ఇప్పుడు అనేక దిగ్గజ కంపెనీలతో సహ స్టార్టప్ కంపెనీలు కూడా వాహనాలను ఆటోమొబైల్ మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు పోటీ పడుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ వన్ కంపెనీలు తమ వాహనాలను విడుదల చేస్తే, ఇప్పుడు ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా పూణేకు చెందిన టోర్క్ మోటార్స్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ను లాంచ్ చేసింది. ఈ టోర్క్ క్రాటోస్ బైక్ను రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ధర కంపెనీ టోర్క్ క్రాటోస్ బైక్ను రెండు వేరియంట్స్లో లాంచ్ చేసింది. ఒకటి టోర్క్ క్రాటోస్ కాగా, మరొకటి టోర్క్ క్రాటోస్ ఆర్ బైక్. టోర్క్ క్రాటోస్ బైక్ ఢిల్లీ ఎక్స్ షో రూమ్ ధర రూ.1,02,500 అయితే, టోర్క్ క్రాటోస్ ఆర్ బైక్ ధర రూ.1,17,500గా ఉంది. వీటి ధరలు ఆ రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీ బట్టి మారుతూ ఉంటాయి. ఈ బైక్ చూడాటానికి అచ్చం స్పోర్ట్స్ బైక్ మాదిరిగానే ఉంది. దీనిన్ హెడ్ ల్యాంప్ అనేది త్రిభుజాకారంలో కనిపిస్తుంది. ఈ బైక్ మధ్య భాగంలో ఫ్యూయల్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. టోర్క్ మోటార్ సైకిల్స్ నుంచి వచ్చిన క్రాటోస్ ఆర్ బైక్లో ఎన్నో అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడి లైటింగ్, పూర్తిగా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ జీపీఎస్, నేవిగేషన్ ఫీచర్లతో పాటు క్లౌడ్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇందులో కొత్త ఆక్సియల్ ఫ్లక్స్ మోటార్ ఉండటంతో పాటు ఐపీ67 రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఎలక్ట్రిక్ బైక్ పరంగా ఇది అత్యధిక పీక్ పవర్ ఉత్పత్తి చేయడంతో పాటు అధిక రేంజ్ కూడా అందిస్తుంది. టోర్క్ క్రాటోస్ బ్యాటరీ ప్యాక్ ట్యాంక్ కింద ఉన్నప్పటికీ 165 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. రేంజ్ ఈ క్రాటోస్ బైక్ మోటార్ గరిష్టంగా 12 బిహెచ్పి పవర్ అవుట్ పుట్, 38 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టోర్క్ మోటార్స్ ఈ బైక్ 3.5 సెకండ్లలో సున్నా నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టోర్క్ క్రాటోస్ ఆర్ బైక్ గరిష్ట వేగం 105 కిలోమీటర్లు. దీని బ్యాటరీ ప్యాక్లో 4 కెడబ్ల్యుహెచ్ లియాన్ 21700 సెల్ ఉంటుంది. టోర్క్ క్రాటోస్ రెండు వేరియంట్స్ కూడా 180 కిలోమీటర్ల/సింగిల్ ఛార్జ్(ఐడిసి) సర్టిఫైడ్ రేంజ్, రియల్ రేంజ్ 120 కిలోమీటర్లు/ సింగిల్ ఛార్జ్ కు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ బైక్ మొదటి ఫేజ్లో కేవలం 6 నగరాల్లో మాత్రమే లభిస్తుంది. సెకండ్ ఫేజ్లో 100 నగరాల్లో లాంచ్ చేయనున్నారు. -
Republic Day 2022: జిగేల్ మువ్వన్నెల్!
-
గడ్డకట్టే చలిలో 1500 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ
భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది బుధవారం మంచుతో కప్పబడిన లడఖ్ సరిహద్దుల్లో జాతీయ జెండాను ఎగరువేసింది. దాదాపు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 15000 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు భారత్లో వివిధ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న జవాన్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతేకాదు వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సైనికులు గడ్డకట్టే చలిలో ధైర్యంగా ఎలా ఎదుర్కొంటున్నారో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సైనికులను ఇండో టిబెటన్ హిమవీర్స్ అని కూడా పిలుస్తారు. సైనిక సిబ్బంది భారత్ మాతాకి జై, వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ మేరకు 73వ గణతంత్ర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గౌరవ వందనంతో రాజ్పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. దేశ సామార్థ్యాన్ని, గౌరవాన్ని, సాంస్కృతిని చాటి చెప్పేలా కవాతు ప్రదర్శన, శకటాల ప్రదర్శన వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. -
ప్రధాని మోదీ నుంచి పర్సనల్ మెసేజ్: క్రిస్ గేల్
విండీస్ హార్డ్ హిట్టర్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్కు ఇండియా అంటే ప్రత్యేకమైన అభిమానం.ఈ విషయాన్ని ఇంతకముందు చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా గేల్ భారత క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తాజాగా జనవరి 26న భారత్ 73వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా క్రిస్ గేల్ భారతీయులకు తన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపాడు. చదవండి: Kohli Vs BCCI: కోహ్లి,గంగూలీ ఒకసారి ఫోన్లో మాట్లాడుకోండి: కపిల్ దేవ్ ''భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన పర్సనల్ మెసేజ్తో ఈరోజు నిద్ర లేచా. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతీయులకు ఇవే నా శుభాకాంక్షలు. మోదీతో పాటు దేశ ప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ దేశ క్రికెటర్లతో కలిసి ఐపీఎల్ సహా ఇతర క్లబ్ క్రికెట్లో కలిసి ఆడడం గౌరవంగా భావిస్తుంటా. కంగ్రాట్స్ ఫ్రమ్ యునివర్సల్ బాస్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్కు ఆడాడు. దీనిలో ఆర్సీబీ తరపున 91 మ్యాచ్ల్లో 3420 పరుగులు సాధించాడు. కోహ్లి, డివిలియర్స్ తర్వాత ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా గేల్ నిలిచాడు. అయితే ఈసారి ఐపీఎల్లో మాత్రం గేల్ మెరుపులు మిస్ కానున్నాయి. ఐపీఎల్ మెగావేలానికి సంబంధించి ప్లేయర్ల వేలం జాబితాలో గేల్ రిజిస్టర్ చేసుకోలేదు. ఈ కారణంగా గేల్ వేలానికి దూరమయ్యాడు. ఇక క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ తరపున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టి20లు ఆడాడు. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం I would like to congratulate India on their 73rd Republic Day. I woke up to a personal message from Prime Minister Modi @narendramodi reaffirming my close personal ties with him and to the people of India. Congratulations from the Universe Boss and nuff love 🇮🇳🇯🇲❤️🙏🏿 — Chris Gayle (@henrygayle) January 26, 2022 -
గులాం నబీ ఆజాద్కు పద్మ భూషణ్.. ‘ఆయన గులాంగా ఉండాలనుకోవడం లేదు’
న్యూఢిల్లీ: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సహచరుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మేరకు లోక్సభ ఎంపీ శశిథరూర్ మాత్రం అజాద్కు అభినందనలు తెలిపారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ మాత్రం బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య పద్మ అవార్డును తిరస్కరించారనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అతను అజాద్గా ఉండాలనుకుంటున్నాడు గులాం అవ్వాలను కోవట్లేదంటూ గులాం నబీ ఆజాద్పై పరోక్ష విమర్శలు గుప్పించారు. అంతేకాదు మాజీ బ్యూరోక్రాట్ పీఎన్ హస్కర్ పద్మ అవార్డును తిరస్కరించడం గురించి ఒక పుస్తకంలో వివరించిన భాగాన్ని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు 1973లో మన దేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వోద్యోగి హస్కర్ పీఎంఓ నుండి నిష్క్రమించినప్పుడు అతనికి పద్మవిభూషణ్ను అందజేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దానిని ఆయన తిరస్కరించారు. హస్కర్ పుస్తకంలోని ఆ భాగం అత్యత్తుమమైనది, అనుకరణ అర్హమైనది అనే క్యాప్షన్ జోడించి మరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అయితే పద్మ అవార్డులను బహిరంగంగా తిరస్కరించడం చాలా అరుదు. ఎందుకంటే అవార్డు గ్రహీతలకు అవార్డు గురించి ముందుగానే తెలియజేయడమే కాక వారు అంగీకరించిన తర్వాత మాత్రమే జాబితాను ప్రకటిస్తారు. అయితే పద్మభూషణ్పై నిర్ణయాన్ని భట్టాచార్య భార్యకు తెలియజేసినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కానీ, బుద్ధదేవ్ మాత్రం తనకు పద్మభూషణ్ గురించి ఏమి తెలియదని ఒకవేళ వారు పద్మభూషణ్ ఇచ్చినట్లయితే తిరస్కరిస్తున్నాను అని అన్నారు. In Jan 1973, the most powerful civil servant of our country was told he was being offered the Padma Vibhushan on his leaving the PMO. Here is PN Haksar's response to it. It is a classic, and worthy of emulation. pic.twitter.com/H1JVTvTyxe — Jairam Ramesh (@Jairam_Ramesh) January 25, 2022 (చదవండి: యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్ సినిమా రేంజ్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్) -
మైండ్బ్లోయింగ్ మోటర్ స్టంట్స్.. ‘సీమా భవాని’ గురించి తెలుసా?
సెల్యూట్ టు ప్రెసిడెంట్.. ఫిష్ రైడింగ్.. పీకాక్.. శక్తిమాన్ విండ్ మిల్....మొదలైన విన్యాసాలు ఆహా అనిపిస్తాయి! మనల్ని మరో లోకంలోకి తీసుకువెళతాయి. మన చేత ఆగకుండా చప్పట్లు కొట్టిస్తాయి. చలిపులి తోకముడిచి ఎక్కడికో పారిపోతుంది. రిపబ్లిక్ డే పరేడ్ (రాజ్పథ్, దిల్లీ) విన్యాసాల్లో ‘సీమ భవాని’ బృందం 350 సీసీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటర్సైకిళ్లపై చేసే విన్యాసాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పదహారు రకాలైన డేర్ డెవిల్ స్టంట్స్తో ఆబాలగోపాలం చేత వహ్వా అనిపిస్తుంది బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) లో భాగమైన ఈ ఆల్–వుమెన్ యూనిట్. 2016లో మధ్యప్రదేశ్లోని టెకన్పూర్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ మోటర్ ట్రాన్స్పోర్ట్ (సీఎస్ఎంటీ)లో ‘సీమ భవానీ’కి అంకురార్పణ జరిగింది. అంతకుముందు రిపబ్లిక్ డే వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ నుంచి మహిళలు పాల్గొని తన నైపుణ్యాలను ప్రదర్శించేవారు. 2018తో ఒక అధ్యాయం మొదలైంది... ఆ సంవత్సరం తొలిసారిగా ‘సీమ భవాని’ బృందం చేసిన మైండ్బ్లోయింగ్ మోటర్ స్టంట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ‘అపురూపం, అసాధారణం’ అని వేనోళ్ల పొగిడేలా చేశాయి. మొదట్లో ‘సీమ భవాని’లో 27 మంది ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 110కి చేరింది. ‘సీమ భవాని’ టీమ్ కోసం 25–30 ఏళ్ల వయసు ఉన్నవారిని ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. ఈ టీమ్కు ఎంపిక కావడం పెద్ద గౌరవంగా భావిస్తారు. ‘గతంలో ఎక్కడైనా మోటర్ సైకిల్ స్టంట్స్ చూసినప్పుడు కలా? నిజమా? అనుకునేదాన్ని. సీమ భవాని టీమ్ లో నేను భాగం కావడం సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది హిమాన్షు శిర్హోయి. ‘అసాధారణమై బృందానికి ఎంపిక కావడం నా జీవితంలో మరచిపోలేని రోజు. రోజూ ఎన్నో గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నప్పుటికీ కష్టం అనిపించలేదు’ అంటుంది సోనియా భన్వీ. ఈ ఇద్దరూ బీఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్స్గా పనిచేస్తున్నారు. 110 మందితో కూడిన ‘సీమ భవానీ’కి కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన జయంతి ఎంపికైంది. బీఎస్ఎఫ్లో గత ఏడేళ్లుగా కానిస్టేబుల్గా పనిచేస్తోంది జయంతి. పిరమిడ్ ఫార్మేషన్తో సహా కఠినతరమైన ఎన్నో విన్యాసాలలో గత ఏడు నెలలుగా శిక్షణ తీసుకుంది జయంతి. ‘రిపబ్లిక్ డే పరేడ్లో నాకు బాగా ఇష్టమైనవి మోటర్సైకిల్ విన్యాసాలు. ఎలా చేస్తున్నారో కదా! అని బోలెడు ఆశ్చర్యపోయేవాడిని. ఆ బృందంలో మా అమ్మాయి కూడా భాగం అయినందుకు గర్వంగా ఉంది’ అంటున్నాడు జయంతి తండ్రి జయదేవ్ పిళ్లై. నిజానికి ‘సీమ భవాని’ తల్లిదండ్రుల సంతోషమేకాదు యావత్ దేశ సంతోషం. చదవండి: ఆత్మగౌరవ వజ్రాయుధం... దాక్షాయణి వేలాయుధం #WATCH | Border Security Force's women contingent 'Seema Bhawani' is set to showcase its stunts at Rajpath on Republic Day parade This is the 2nd time when the Seema Bhawani team will showcase its stunts at Rajpath during the R-Day parade pic.twitter.com/3KzU7Em2EI — ANI (@ANI) January 3, 2022 -
ఉగాది నుంచి 26 కొత్త జిల్లాల్లో పరిపాలన: గవర్నర్
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో విజటర్స్కు అనుమతి నిరాకరించారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. 'నవరత్నాల ద్వారా అభివృద్ధి ఫలాలు అందరికి అందుతున్నాయి. డీబీటి ద్వారా ఇప్పటి వరకు 1,67,798 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు క్షేత్ర స్థాయిలో విత్తన, ఎరువుల సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.19,126 కోట్ల రైతు భరోసా ద్వారా ఆర్ధిక సాయం అందించినట్టు గవర్నర్ పేర్కొన్నారు. అమూల్ పాల వెల్లువ ద్వారా 9,899 పాల కేంద్రాల ద్వారా పాల సేకరణ చేస్తున్నట్టు తెలిపారు. రూ.3,177 కోట్ల వ్యయంతో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. విద్యారంగానికి ప్రథమ ప్రాధాన్యం 'విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. విద్యను భవిష్యత్కు పాస్ పోర్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు రూ. 34,619 కోట్లు వ్యయం చేసింది. మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూళ్లు, కాలేజీలు అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను తీసుకొచ్చారు. పేద విద్యార్థులకు బాసటగా జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు. జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన,గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. జనవరి 21 నాటికి 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ ఆరోగ్య పరిరక్షణ కు గ్రామ స్థాయిలో 10,032 వైఎస్సార్ క్లినిక్లు, ఏర్పాటు చేసింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలోని 138 ఆస్పత్రుల్లోను ఆరోగ్యశ్రీ పధకాన్ని అందిస్తున్నాం. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు 3.2 కోట్ల నిర్దారణ పరీక్షలు చేసింది. రాష్ట్రంలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పడకలు, ఐసీయూ సౌకర్యం, ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాము. జనవరి 21 నాటికి 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి అయ్యింది. 15-18 ఏళ్ల వయసు ఉన్న వారికి 93 శాతం మేర వ్యాక్సిన్ పూర్తి చేశారు. ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందిస్తున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను నెరవేర్చాం. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది' అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఉద్యోగుల సంక్షేమం మా ప్రభుత్వ ప్రాధాన్యత. 11వ పీఆర్సీలో భాగం గా 23 శాతం పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచింది. సంక్షేమ ఫలాలు పేద ప్రజలతో పాటు ఉద్యోగులకు చెందాల్సిన అవసరం ఉంది. 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పడుతాయి. రెండు జిల్లాలు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయి. సమీకృత అభివృద్ధి కోసం, పౌర సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. -
రిపబ్లిక్ డే రోజు రిలీజవుతున్న సినిమాలు
పండగరోజు సినిమాలు రిలీజ్ చేయడం చాలామందికి సెంటిమెంట్. అలా చాలామంది సంక్రాంతి, దసరా, దీపావళికి సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. వీటితో పాటు మిగతా పండగ రోజుల్లో కూడా అనేక సినిమాలు విడుదలవుతుంటాయి. నేడు గణతంత్ర దినోత్సవం. మరి ఈ సందర్భంగా బుధవారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్సిరీస్లేంటో చూసేద్దాం.. హాట్స్టార్ బ్రో డాడీ (మలయాళ చిత్రం) దిస్ ఈజ్ అస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) ద బుక్ ఆఫ్ బాబా ఫెట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) ఆహా అర్జున ఫల్గుణ జీ5 ఎల్లం షెరియకుమ్ (మలయాళ చిత్రం) ఆహా (మలయాళ చిత్రం) ముక్తి ( బెంగాలీ వెబ్ సిరీస్) నెట్ఫ్లిక్స్ ద సిన్నర్ నాల్గో సీజన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) వూట్ సెలక్ట్ బడవ రాస్కెల్ (కన్నడ సినిమా) ఇవే కాకుండా సామాన్యుడు, గ్యాంగ్స్ ఆఫ్ 18: నా స్కూల్ డేస్ సినిమాలు నేడు థియేటర్లలో రిలీజయ్యాయి. -
దవాఖానాలకు ‘చికిత్స’ అవసరం
సాక్షి, హైదరాబాద్: ‘‘కరోనా మహమ్మారి ఎన్నో పాఠాలు నేర్పింది. మనకు గర్వకారణమైన ఉస్మా నియా ఆస్పత్రి సహా మన ప్రభుత్వ ఆస్ప త్రుల పనితీరు, మౌలిక సదుపాయాలను మెరుగు పర్చా ల్సిన అవసరముంది. ప్రధాని మోదీ దేశంలో ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాలను మంజూరు చేశారు. తెలంగాణకు సైతం 8 వైద్య కళాశాలలు రాను న్నా యి. సామాన్యుల చివరి ఆశ అయిన ప్రభుత్వా స్పత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చడం మన విధి’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. 73వ గణతంత్ర దినం సందర్భంగా బుధవారం రాజ్భవన్లో వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలి: ‘‘తెలంగాణ అనేక రంగాల్లో దూసుకు పోతోంది. ఫార్మాహబ్, ఐటీ హబ్, మెడికల్ హబ్గా హైద రాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రం లో సమృద్ధిగా పంటలు పండుతు న్నాయి. రాష్ట్రం ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా అవతరించింది. రైతుల శ్రమకు వందనాలు. కోట్లాది మంది ప్రజ లకు ఆహార భద్రత కల్పించారు. నాణ్యమైన ఉన్నత విద్యలో రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలి. కొత్త ఆవిష్క రణలను ప్రోత్సహించడం ద్వారా ఇన్నో వేషన్ హబ్గా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. నిజమైన చరిత్రను గుర్తించుకుంటున్నాం ఇప్పటిదాకా గుర్తింపునకు నోచుకోని జాతీయవీరు లను తగిన రీతిలో గౌరవించుకోవడం ద్వారా దేశం తన నిజమైన చరిత్ర, వారసత్వాన్ని పునః కైవసం చేసుకుంటోంది. వలసవాద వార సత్వం స్థానంలో నిజమైన దేశభక్తి, జాతీయ వీరుల వారసత్వాన్ని నిలబెట్టేందుకు చరిత్రాత్మక ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నెలకొల్పా లని (ప్రధాని మోదీ) నిర్ణయించడం దీనికి ఓ ఉదాహరణ. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అనేక రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తి, ఉచిత పంపిణీ దీనికి నిదర్శనం. అంతర్గతంగా, సరిహద్దుల్లో అనేక సవాళ్లను దేశం విజయవంతంగా ఎదు ర్కొంటోంది. రక్షణ వ్యవస్థల నిరంతర ఆధునీ కరణతో దేశభద్రత పటిష్టమైంది. కరోనా, అడ్డంకు లను అధిగమించి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందాల్సి ఉంది. అణగారిన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి సమాన అవకాశాలు కల్పించాలి. రాజ్భవన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, భద్రాద్రి–కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లోని గిరిజనుల పోషకాహార స్థితిని మెరుగు పరచడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. స్వయం ఉపాధితో మహిళలను ఆర్థికంగా బలోపే తం చేసేందుకు కృషి చేస్తున్నాం. జాతీయ విద్యా విధానం–2020ని ప్రోత్సహించడం, ఉన్నత విద్యను బలోపేతానికి తీసుకున్న చర్యలు భవిష్య త్తులో సత్ఫలితాలు ఇస్తాయని భావిస్తున్నాం.’’ వేడుకలకు సీఎం, మంత్రుల గైర్హాజరు రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు పాల్గొనలేదు. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం మేరకు వేడుకలను నిరా డంబరంగా నిర్వహించినట్టు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. కాగా, కోవిడ్ నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని కేబినెట్లో నిర్ణయించారని, ఆ నేపథ్యంలోనే రాజ్భవన్ కార్యక్రమానికి పార్టీ ప్రముఖులు హాజరు కాలేదని టీఆర్ఎస్ వర్గాలతోపాటు అధికారులు చెబుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లపాటు రాష్ట్రస్థాయి గణతంత్ర దిన వేడుకలను నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వ హించగా.. మూడోవేవ్ నేపథ్యంలో ఈసారి రాజ్ భవన్కు మార్చారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విశిష్ట సేవలకు..రాష్ట్రపతి పోలీస్ పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి అమరావతి/నెట్వర్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విశిష్ట, ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్రప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీటిలో ఏపీకి ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం, పలు రాష్ట్రపతి పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం లభించింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారికి కూడా పలు పతకాలు లభించాయి. పోలీసు ప్రతిభా పతకాలు 1. ఎస్.వి.రాజశేఖర్బాబు, డీఐజీ (లా అండ్ ఆర్డర్) 2. ఎం.రవీంద్రనాథ్బాబు, ఎస్పీ తూర్పు గోదావరి జిల్లా 3. శ్రీరాంబాబు వాక, డీఎస్పీ, సీఐడీ, నెల్లూరు 4. విజయపాల్ కైలే, ఏసీపీ, ఈస్ట్ జోన్, విజయవాడ 5. విజయ్కుమార్ బుల, అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్, విశాఖపట్టణం 6. సుబ్రహ్మణ్యం కొలగాని, అదనపు డీసీపీ, విశాఖపట్టణం 7. శ్రీనివాసరావు చుండూరు, డీఎస్పీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్, గుంటూరు 8. వీరరాఘవరెడ్డి, డీఎస్పీ, అనంతపురం 9. రవీందర్రెడ్డి ఎర్రమోరుసు, డీఎస్పీ, కర్నూలు 10. కృష్ణారావు గొల్ల, ఎస్ఐ, సీసీఎస్, విజయవాడ 11. సత్తారు సింహాచలం, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ, కాకినాడ 12. నరేంద్రకుమార్ తుమాటి, ఏఎస్ఐ, గుంటూరు అర్బన్ 13. పేరూరు భాస్కర్, ఏఎస్ఐ, కడప 14. నాగశ్రీనివాస్, ఏఎస్ఐ, కొవ్వూరు రూరల్ 15. వీర ఆంజనేయులు సింగంశెట్టి, ఏఎస్ఐ, ఏసీబీ, విజయవాడ రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం భావనా సక్సేనా, రెసిడెంట్ కమిషనర్, ఏపీ భవన్, న్యూఢిల్లీ కేంద్ర జీఎస్టీ విభాగంలో.. 1. డబ్లు్య.డి.చంద్రశేఖర్, అదనపు సహాయ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ కార్యాలయం, విశాఖపట్నం 2. కర్రి వెంకటమోహన్, అదనపు సహాయ డైరెక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సీబీఐలో.. 1. సుబ్రహ్మణ్యం దేవేంద్రన్, అదనపు న్యాయసలహాదారు 2. కె.వి.జగన్నాథరెడ్డి, హెడ్ కానిస్టేబుల్, ఏసీబీ రైల్వే పోలీసుల్లో.. మస్తాన్వలి షేక్, ఏఎస్ఐ, ఆర్పీఎఫ్, తాడేపల్లి జైళ్లశాఖలో 1. అయినపర్తి సత్యనారాయణ, హెడ్ వార్డర్, ఆంధ్రప్రదేశ్ 2. పోచ వరుణారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ 3. పెదపూడి శ్రీరామచంద్రరావు, డిప్యూటీ సూపరింటెండెంట్, విశాఖపట్నం కేంద్రకారాగారం 4. మహ్మద్ షఫీ ఉర్ రెహమాన్, డిప్యూటీ సూపరింటెండెంట్ 5. సముడు చంద్రమోహన్, హెడ్ వార్డర్ 6. హంసపాల్, సూపరింటెండెంట్, కృష్ణాజిల్లా జైలు జీవన్ రక్షాపథక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్–2021 1. జి.సంజయ్కుమార్ 2. టి.వెంకటసుబ్బయ్య 3. నిర్జోగి గణేశ్కుమార్ -
సీఎం వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చి 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని, ప్రపంచ రాజ్యాంగాల్లో మనది అతిపెద్దది, అత్యుత్తమమైనది అన్నారు. రాజ్యాంగ పీఠికలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని పేర్కొన్నారు. ‘మనది సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య దేశం. రిపబ్లిక్, సామాజిక న్యాయంతో పాటు, రాజ్యాంగం ప్రతి పౌరుడికీ భావ ప్రకటనా స్వేచ్ఛనూ, విశ్వాసాన్నీ కల్పిస్తోంది. మన రాజ్యాంగం అందరికీ సమాన హోదాతో పాటు సమాన అవకాశాలు అనే ఆదేశాన్ని కూడా ఇచ్చింది. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న మార్గదర్శక సూత్రాలను గౌరవిస్తూ 31 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిజమైన స్ఫూర్తితో ముందుకు తీసుకువెళుతోంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
దేశ సమగ్రత, పరిరక్షణకు పునరంకితం కావాలి
సాక్షి, అమరావతి: సత్యం, అహింస, సమగ్రత, సార్వభౌమాధికారాల పరిరక్షణకు పునరంకితం కావాలని ప్రజలకు గవర్నర్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక విలువలే దిక్సూచిగా దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని గవర్నర్ సూచించినట్లు రాజ్భవన్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. -
ఇది ఘన ‘తంత్ర’మా?
భారతావనికి 73వ గణతంత్ర దినోత్సవ ఘడియలివి. సర్వసత్తాక, సార్వభౌమాధికార దేశంగా ఈ సంతోష వేళలోనూ అనవసర వివాదాలు రాజుకోవడమే విచారకరం. ఇండియా గేట్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం, పాకిస్తాన్పై యుద్ధంలో గెలిపించి ప్రాణాలర్పించిన 3,483 మంది జవాన్ల గౌరవార్థం 1972లో ఇందిరా గాంధీ ఏర్పాటుచేసిన ‘అమర్ జవాన్ జ్యోతి’ని ఆ దగ్గరే కొత్తగా 2019లో మోదీ సర్కారు పెట్టిన నేషనల్ వార్ మెమోరియల్ జ్యోతిలో విలీనం చేయడం, గణతంత్ర ఉత్సవాల నుంచి మహాత్మా గాంధీకి నచ్చిన ‘ఎబైడ్ విత్ మి’ పాట తొలగింపు – ఇలా ఒకటికి మూడు ప్రభుత్వ నిర్ణయాలు జరిగాయి. వీటన్నిటి కన్నా ముందే తమ రాష్ట్రాల ప్రత్యేక శకటాలకు ఉద్దేశపూర్వకంగా రిపబ్లిక్ డే కవాతులో అనుమతి నిరాకరించారంటూ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ఆరోపించాయి. వెరసి, ఈసారి ప్రతిదీ ఏదో ఒక రకంగా వివాదాస్పదమైంది. ఏటా గణతంత్ర వేడుకల ముగింపుగా జనవరి 29 సూర్యాస్తమయ వేళ సైనిక సంప్రదాయంగా బ్యాండ్ వాద్యవిన్యాసాల ‘బీటింగ్ రిట్రీట్’ ఆనవాయితీ. ఇంగ్లండ్లో 17వ శతాబ్దిలో మొదలైన ఈ శతాబ్దాల కాలపు వేడుక పద్ధతిని ఇప్పటికీ బ్రిటన్, అమెరికా, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాలతో పాటు మనమూ అనుసరిస్తున్నాం. మన దేశపు వేడుకలో మహాత్మా గాంధీకి ప్రియమైన క్రైస్తవ ప్రార్థన ‘ఎబైడ్ విత్ మి’ ఏళ్ళుగా వస్తోంది. కానీ, ఈసారి మోదీ ప్రభుత్వం ఆ పాట తీసేసి, దాని బదులు 1962 భారత – చైనా యుద్ధంలో ఓటమి తర్వాత వీరజవాన్లలో స్థైర్యం నింపుతూ, హిందీ సినీకవి ప్రదీప్ రాసిన పాపులర్ దేశభక్తి గీతం ‘యే మేరే వతన్ కే లోగోం...’ పెట్టింది. గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు సి. రామచంద్రల మధ్య కొన్నేళ్ళ ప్రచ్ఛన్న యుద్ధానికి తెర దించిన ఘనత ఆ పాటదే. ప్రధాని నెహ్రూని కదిలించి, నేటికీ మనసులు కరిగించే ఆ పాట గొప్పదే. కానీ గాంధీకి ప్రియమైన ప్రార్థన మార్చి, దాన్ని పెట్టాల్సిన అత్యవసరమేంటి? ఇప్పటి దాకా మరుగునపడిన చరిత్రను జనానికి చాటి, జరిగిన లోపాన్ని సరిచేయడానికే ఈ ప్రయత్నమన్నది ప్రధాని మోదీ ఉవాచ. చరిత్రలో ప్రాధాన్యం దక్కకుండా పోయిన ఘటనలకూ, వ్యక్తులకూ తగిన గుర్తింపు తేవాల్సిందే. అందుకోసం ఇప్పటికే జనంలో జ్ఞాపకంగా మిగిలినవాటిని గుర్తులే లేకుండా చేయాలా అన్నది విమర్శ. అందరికీ ప్రేరణ అయిన కొందరిని తమ వారిగా మలుచుకొని, సంఘ్పరివార్ భావజాలానికి సర్వజన అంగీకారం తేవడమనే కుట్ర దీనిలో ఉందని ఆరోపిస్తున్నవారూ ఉన్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ఆవిర్భావ స్వర్ణోత్సవ సందర్భంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని నేటి పెద్దలు కనీసం స్మరించుకోలేదు. దానిపైనా విమర్శలు రేగాయి. ఎవరి ఘనత, ఎవరి స్థానం వారిదే. కానీ, గాంధీని కాదని లాల్ బహదూర్నీ, నెహ్రూను వద్దని పటేల్నూ ఇతరేతర కారణాలతో తలకెత్తుకోవడం ఎలా సమర్థనీయం? కొందరు ఆరోపిస్తున్నట్టు ఇందిరా గాంధీ హయాంలో వచ్చింది కాబట్టి అమర జ్యోతిని ఆర్పేశారన్నది నిజమే అయితే, ఆ చర్య ఏ రకంగా హర్షణీయం? స్వాతంత్య్రానంతర యుద్ధాల్లో మరణించిన జవాన్ల పేర్లున్న వార్ మెమోరియల్ సరే, అంతకు మునుపటి యుద్ధాల్లో అమరులైన 15 వేల మందికి పైగా వీరుల గౌరవం మాటేమిటి? ఇది చరిత్ర నిర్మాణమా, వినిర్మాణమా అన్న విమర్శ వినిపిస్తోంది అందుకే. కేంద్రం పెట్టాలనుకుంటున్న పాతికడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పు గ్రానైట్ విగ్రహానికి మించి సమున్నతమైనది నేతాజీ చరిత్ర. ఆ వీరుడి 125వ జయంతి వేళ గణతంత్ర ఉత్సవం మూడు రోజుల ముందుగా జనవరి 23 నుంచే జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గాంధీ, నెహ్రూలతో విభేదాలుండి, జర్మనీ, జపాన్ల సాయంతో బ్రిటీషు పాలకులపై యుద్ధానికి దిగిన నేతాజీ నామస్మరణను కేంద్రం ఇప్పుడే ఎందుకు చేస్తోంది? నిరుడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పాలకపక్ష నేతలకు ఈ బెంగాలీ బిడ్డపై ప్రేమ పొంగుకు రావడంలో అంతరార్థమేంటి? ప్రతిపక్షాలపై పైచేయి కోసం చరిత్రను మార్చేందుకు పాలకపార్టీ ప్రయత్నిస్తోందని కొన్నేళ్ళుగా ఓ ఆరోపణ. ఈ నేపథ్యంలో హడావిడి నిర్ణయాల బదులు నిపుణులతో సంప్రతించాల్సింది. ప్రజాభి ప్రాయం తెలుసుకోవాల్సింది. అలా చేస్తే వివాదం ఉండేది కాదు. చివరకు ఇటు నేతాజీ, అటు కవి ప్రదీప్ల వారసులు తమ వారికి దక్కిన అనూహ్య గౌరవానికి సంతోషిస్తూనే, మతనిగ్రహం లేకుండా విగ్రహాలు, గాంధీని కాదని కొత్త పాట పెట్టడాలను వ్యతిరేకిస్తుండడం కొసమెరుపు. సంక్షుభిత కాలంలో పరిష్కరించాల్సిన సమస్యలెన్నో ఉండగా, ఈ వివాదాస్పద చర్యల అవసరమేంటో అర్థం కాదు. వలసవాద కాలం నాటి పద్ధతులను మార్చాలని చెబుతున్న పాలకులు ముందుగా తమలోని వలసవాద పాలక మనస్తత్వాన్ని మార్చుకొనే ప్రయత్నం చేయాలి కదా అన్న సోషల్ మీడియా ప్రశ్నకు జవాబు లేదు. ప్రపంచమంతటా పాలకులు తమకు అనుకూల కథనాలే మిగలాలనీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమ హీరోలను నిలపాలనీ తాపత్రయపడడం తరతరాలుగా తెలిసిందే. కానీ, భిన్న సంస్కృతులు, విభిన్న ఆలోచనల సంగమమైన భారతావనిలో ఏకరూప అజెండాను సాధించాలనుకోవడం సరికాదు. ‘చరిత్ర అడగకు... చేస్తున్నది చూడు’ అనేది అధికారంలో ఉన్నవారి ధోరణి అయితే, అది ప్రజలకూ, దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికీ నష్టమే. అలా ఎవరైనా ప్రవర్తిస్తే, ఆనక వారి స్థానమేంటో కాలమే తేలుస్తుంది. ఎందుకంటే, అందరి కన్నా అతి నిరంకుశమైనది కాలం! అది వలసవాద కాలానికి ముందెప్పటి నుంచో చరిత్ర చెప్తున్న పాఠం! -
కాగితపు జాతీయ పతాకాలనే వినియోగించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జాతీయ దినోత్సవాలు, క్రీడలు, సాంస్కృతిక దినోత్స వాలను పురస్కరించుకుని అలంకరణ కోసం వినియోగించే జాతీయ పతాకాలను కాగితం తో తయారు చేసిన వాటినే ఉపయోగించాలని ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002 (2021 సవరణ) స్పష్టం చేస్తోంది. జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడేలా కాగితపు పతాకాలను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, పోలీసు విబాగాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్తో రూపొం దించిన జెండాలను తొలగించి డిస్పోజ్ చేసే క్రమం కాస్త కఠినంగా ఉందని, అందువల్లే కాగితపు జెండాలను వాడితే గౌరవ ప్రదంగా వాటిని డిస్పోజ్ చేయవచ్చని అందులో పేర్కొన్నారు. వి విధ సంస్థలు, యాజమాన్యాలు జెండా కార్యక్రమం ముగి సిన తర్వాత తొలగించేటప్పుడు జాతీయ పతాక గౌర వాన్ని భంగం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని, జా తీయ పతాక నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. -
ఆత్మగౌరవ వజ్రాయుధం... దాక్షాయణి వేలాయుధం
రాజ్యాంగ రూపకల్పన ఒక మహాయజ్ఞంలా సాగింది. ఆనాటి రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 299 కాగా, అందులో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఒకరైన దాక్షాయణి వేలాయుధం రాజ్యాంగ సభకు ఎంపికైన తొలి దళిత మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. కొచ్చి (కేరళ)లోని ములవుకాడ్ అనే లంక గ్రామంలో పులయార్ కమ్యూనిటికీ చెందిన ఒక కుటుంబంలో 1912లో జన్మించింది దాక్షాయణి. పులయార్లు ప్రధానంగా వ్యవసాయకూలీలు. శ్రమదోపిడికి, అవమానాలకు గురయ్యేవాళ్లు. వాళ్ల చుట్టూ ఎన్నో ముళ్లకంచెలు ఉండేవి. ‘అందరూ నడిచే బాటలో నడవకూడదు’ ‘అందరూ వెళ్లే బావిలో నుంచి నీళ్లు తీసుకోకూడదు’ ‘ఖరీదైన దుస్తులే కాదు ఒక మాదిరి దుస్తులు కూడా ఒంటి మీద కనిపించకూడదు’... వంటివి. అయితే, దాక్షాయణి పుట్టిన కాలంలోనే ఒక ప్రశ్న కూడా పుట్టింది.‘అయ్యా! మేమూ మీలాగే మనుషులం కదా. మమ్మల్ని ఇలా ఎందుకు హీనంగా చూస్తున్నారు?’ అని అడిగింది ఆ ప్రశ్న.పులయార్ల సంస్కర్త అయ్యన్కాలీ ఉద్యమ గొంతు సవరించడానికి సిద్ధమవుతున్న కాలం అది. సాధారణంగా పులయార్ల ఇండ్లలో అమ్మాయి పుడితే అజ్కి, పుమల, చక్కి, కిలిపక్క.. అనే పేర్లు మాత్రమే పెట్టేవారు. అయితే ఒక అమ్మాయికి ‘దాక్షాయణి’ అని నామకరణం చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నామకరణ సరళిలో మార్పు తీసుకువచ్చింది. ‘ఆమె జీవితంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో చారిత్రక అస్తిత్వాలు ఉన్నాయి’ అంటారు దాక్షాయణి కూతురు మీరా వేలాయుధం. ఆరోజుల్లో నిమ్నవర్గాలకు చెందిన పిల్లలు స్కూలు గడప తొక్కడం అనేది ఊహకు అందని విషయం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అవమానాలను తట్టుకొని ఉన్నత చదువులు చదువుకుంది దాక్షాయణి. 1945లో కొచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎంపికైంది. విశిష్టమైన రాజ్యాంగ నిర్మాణంలో భాగమై తన సమకాలీన తరానికి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది దాక్షాయణి వేలాయుధం. -
బాయ్కాట్ అమెజాన్.. జాతీయ పతాకానికి అవమానం!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మన దేశ జాతీయ పతాకాన్ని తీవ్రస్థాయిలో అవమానించింది. రిపబ్లిక్ డేకి ముందు భారత జాతీయ జెండా ముద్రలతో ఉన్న పలు ఉత్పత్తులను తన వెబ్సైట్లో విక్రయానికి పెట్టింది. ఈ అంశంపై స్పందించిన నెటిజన్లు ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #BoycottAmazon అనే ట్యాగ్ ఇప్పుడు ట్విటర్లో ట్రెండ్ అవుతుంది. అమెజాన్లో భారత జాతీయ పతాకాల ముద్ర ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తున్న ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ అమెజాన్ను బాయ్కాట్ చేయలని కోరుతున్నారు. జాతీయ పతాకం ముద్రతో ఉన్న కమర్షియల్ ఉత్పత్తులను అమ్ముతున్నందుకు అమెజాన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అమెజాన్పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చాక్లెట్లు, ఫేస్ మాస్క్ లు, సిరామిక్ మగ్స్, కీచైన్, పిల్లల దుస్తులు వంటి ఉత్పత్తులు జెండా ముద్రను కలిగి ఉన్నాయని ట్విట్టర్ వినియోగదారులు తెలిపారు. 2017లో కూడా కెనెడాలోని అమెజాన్ వెబ్సైట్లో భారత జాతీయ పతాకం ముద్రతో ఉన్న పలు డోర్ మ్యాట్లను విక్రయానికి పెట్టింది. అయితే దీన్ని గమనించిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. Our National Flag Our Pride. #BoycottAmazon pic.twitter.com/RwpuCSCyd7 — Vikash Ahir (@team_hyv) January 25, 2022 Amazon should not only boycott but it should be made in India#boycottamazon pic.twitter.com/MuzvOfx4VW — Ankur Srivastava (@AnkurSr12580270) January 25, 2022 This #RepublicDay nationalist Indians have given a call to #BoycottAmazon How about you ? pic.twitter.com/o3LRDtxtjU — Guruprasad Gowda (@Gp_hjs) January 25, 2022 #BoycottAmazon T-shirts with tricolor flag are being sold on e-commerce site Amazon. Even before this, Amazon has insulted the tricolor of India many times by selling shoes, footwear and toilet seat covers, masks etc. of India.@PMOIndia @CimGOI @sambitswaraj @HJS_Convener pic.twitter.com/s73WjCdEHS — Madan Tanaji Sawant (@MadanTanajiSaw1) January 25, 2022 (చదవండి: టెక్ దిగ్గజ సీఈఓలకు పద్మభూషణ్ అవార్డ్స్..!) -
దేవేంద్ర ఝఝరియాకు పద్మభూషణ్.. నీరజ్ చోప్రాకు పద్మశ్రీ
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది.128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించగా.. క్రీడారంగంలో 9 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో పారాఒలింపిక్ అథ్లెట్ దేవేంద్ర జజేరియా భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాను పద్మశ్రీ వరిచింది. మిగతావారిలో సుమిత్ అంటిల్(పారాఅథ్లెట్), ప్రమోద్ భగత్(షూటింగ్), శంకర్నారాయణ్ మీనన్, ఫసల్అలీ దార్, వందన కటారియా(హాకీ), అవనీ లేఖరా(షూటింగ్), బ్రహ్మానంద్ సంక్వాల్కర్లను కూడా పద్మశ్రీ వరించింది. దేవేంద్ర ఝఝరియా: దేవేంద్ర ఝఝారియా ..2004 పారాలింపిక్స్లో స్వర్ణం...2021లో రజతం... ఈ రెండింటి మధ్య 2016లో మరో ఒలింపిక్ స్వర్ణం... ఇది అతని గెలుపు ప్రస్థానం. ఒక్క మాటలో చెప్పాలంటే పారాలింపిక్స్లో భారత్కు పర్యాయదంగా ఝఝారియా నిలిచాడు. 2004లో అతను స్వర్ణం సాధించిన రోజు దేశంలో ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఎన్ని కోట్ల మంది పారాలింపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పురోగతిలో అతను పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత డబ్బులు పెట్టుకొనని ఒలింపిక్స్కు: సొంత డబ్బులు పెట్టుకొని ఝఝారియా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్కు వెళ్లాల్సి వచ్చింది.అందుకోసం అతని తండ్రి అప్పు కూడా చేశాడు. ఒక గొడ్డలి, ఒక సైకిల్ ట్యూబ్ అతని ప్రాక్టీస్ కిట్ అంటే నమ్మగలరా! భుజాలను బలంగా మార్చేందుకు గొడ్డలిని ఉపయోగించడం, చేతిలో బలం పెరిగేందుకు సైకిల్ ట్యూబ్ను వాడటం... ఇలాంటి స్థితిలో స్వర్ణం సాధించిన రోజుల నుంచి టోక్యోలో మూడో పతకం సాధించే వరకు దేవేంద్ర భారత పారా క్రీడలకు ప్రతినిధిగా వ్యవహరించగలిగాడంటే ఆ విజయాల వెనక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుంటే కరెంట్ షాక్ తగిలి ఝఝారియా తన ఎడమ చేతిని కోల్పోయాడు. అయితే పెరిగి పెద్దవుతున్న సమయంలో అతని చేతిని చూసి చుట్టుపక్కల పిల్లలు ‘కమ్జోర్’ అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. తాను బలహీనుడిని కాదని చూపించాలనే కసితో బల్లెం పట్టిన అతను మూడు ఒలింపిక్ పతకాలు అందుకునే వరకు ఎదగడం అసాధారణం. 2008, 2012 పారాలింపిక్స్లో దేవేంద్ర పాల్గొనే ఎఫ్–46 కేటగిరీ లేకపోవడంతో అతనికి మరో రెండు పతకాలు దూరమయ్యాయని కచ్చితంగా చెప్పవచ్చు. నీరజ్ చోప్రా: టోక్యో ఒలింపిక్స్లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. తద్వారా 100 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అథ్లెటిక్స్ ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్లోని డీఏవీ కాలేజ్లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్ గేమ్స్లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్వెల్త్ గేమ్స్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. -
‘మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి’
న్యూఢిల్లీ: మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. బుధవారం రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ఈరోజు రాత్రి(మంగళవారం) సందేశం ఇచ్చారు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. ‘మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల్ని జరుపుకోవడం మన ఐక్యతకు నిదర్శనం. సరికొత్త ఆర్థిక విధానాలు చేపట్టిన టాప్-50 దేశాల జాబితాలో భారత్ చోటు సంపాదించడం గర్వకారణం. ప్రస్తుతం కోవిడ్ కష్టకాలం నడుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోటోకాల్ను ప్రతీ ఒక్కరూ విధిగా పాటించాలి .ప్రతీ ఒక్కరూ కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు, హెల్త్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ రోగులను రక్షించిన విషయాన్ని స్మరించుకోవాలి. కోవిడ్ మహమ్మారి వచ్చిన తొలి ఏడాదిలోనే మన హెల్త్ కేర్ సిస్టమ్ను బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆ మరుసటి ఏడాది వ్యాక్సిన్ డ్రైవ్ను సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడం మన బలానికి సంకేతం’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నీరజ్ చోప్రాను పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించనుంది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నీరజ్చోప్రాకు పతకం అందించనున్నాడు. ఇక ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా నీరజ్ చోప్రా నిలిచాడు. చదవండి: Australian Open Grandslam 2022: సెమీస్కు దూసుకెళ్లిన నాదల్, యాష్లే బార్టీ గతంలో 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత నీరజ్ సాధించిన స్వర్ణమే రెండోది. నీరజ్ గత సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. ఇక ఇండియన్ ఆర్మీలో నీరజ్ చోప్రా జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 384 మంది రక్షణ సిబ్బందిని గ్యాలంటరీ మరియు ఇతర అవార్డులతో సత్కరించనున్నారు. అవార్డులలో 12 శౌర్య చక్రాలు, 29 పరమ విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 53 అతి విశిష్ట సేవా పతకాలు, 13 యుద్ధ సేవా పతకాలు, మూడు బార్ టు విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 122 విశిష్ట సేవా పతకాలు, 81 సేన పతకాలు, రెండు వాయు సేన పతకాలు, 40 సేన పతకాలు, ఎనిమిది నేవీసేన పతకాలు, 14 నావో సేన పతకాలతో విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు. చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ' -
గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్.. రూ.926కే విమాన టికెట్!
ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ గో ఫస్ట్ విమాన ప్రయాణికులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు.. విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. 'రైట్ టూ ఫ్లై' పేరుతో గో ఫస్ట్ ఈ ఆఫర్ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.926కే దేశీయ విమాన ప్రయాణానికి టికెట్లు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది లిమిటెడ్ ఆఫర్ అని స్పష్టం చేసింది. రౌండ్ ట్రిప్పుల కోసం ఈ ఆఫర్ని వీనియోగించుకోలేరు, ఇతర ఆఫర్లతో క్లబ్ చేయలేరు. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకోవాలంటే కొన్ని నియమనిబంధనలు వర్తిస్తాయి. జనవరి 22 నుంచి 27 జనవరి 2022 మధ్య కాలంలో టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31, 2022 మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా విమాన ప్రయాణం చేసే వారికి 15 కిలోల వరకు లగేజీ ఛార్జీలు ఉండవు. క్యాన్సిలేషన్ ఫీజు: ప్రామాణిక నియమనిబంధనల ప్రకారం. ఈ ఆఫర్ ప్రత్యక్ష దేశీయ విమానాలలో మాత్రమే వర్తిస్తుంది. బ్లాక్ అవుట్ తేదీలు వర్తిస్తాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాలలో విమానయాన రంగం ఒకటిగా ఉండగా, గో ఎయిర్ డిసెంబర్ 2021 నెలలో మంచి అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ అధికారిక వెబ్సైట్తో పాటు ఇతర అన్ని ఛానెల్స్ ద్వారా బుక్ చేసుకున్నా ఈ ఆఫర్ను పొందొచ్చని కంపెనీ పేర్కొంది. Sale-brations in the air with #RightToFlySALE offer!🛩️🇮🇳 Book flights with GO FIRST at fares starting at just ₹926* on bookings before 27th January, 2022. Know more - https://t.co/EABrFEhAsb pic.twitter.com/ZdWhHNQGt4 — . (@GoFirstairways) January 23, 2022 (చదవండి: Google: టీనేజర్ల బ్రౌజింగ్.. గూగుల్ కీలక నిర్ణయం) -
బీటింగ్ రిట్రీట్లో గాంధీకి ఇష్టమైన పాట తొలగింపు.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఈ నెల 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్లో ఈసారి గాంధీజీకి ఇష్టమైన ‘అబిడ్ విత్ మీ’ పాటని తొలగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ ఏడాది దేశీ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ' ఈ పాట స్థానంలో ప్రముఖ దేశభక్తి గీతం ‘ఏ మేరే వతన్ కే లోగో’ను వాయించనున్నారు. 1962 ఇండో–చైనా యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ కవి ప్రదీప్ ఈ గీతాన్ని రాశారు. దేశ భద్రత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ ఈ గీతాన్ని ఆలపిస్తారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్ను నిర్వహిస్తారు. (చదవండి: పొలిటికల్ ప్లేయర్: ప్రత్యర్థులతో ఫుట్బాల్ ఆడేయగలరు) 2020లోనే తొలగించాలనుకున్నా.. ‘అబిడ్ విత్ మీ’ని 1847లో స్కాటిష్ ఆంగ్లికన్ కవి హెన్రీ ఫాన్రిస్ లైట్ రాశారు. 1950 నుంచి బీటింగ్ రిట్రీట్ వేడుకలో దీన్ని వాయిస్తున్నారు. తాజాగా దీన్ని విరమిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. 2020లోనూ అబిడ్ విత్ మీ పాటను తొలగిం చాలని అనుకున్నా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. తాజాగా అబిడ్ విత్ మీని బీటింగ్ రిట్రీట్ వేడుక నుంచి తొలగించడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వారసత్వాన్ని తుడిచేసే పనిలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడింది. వలస పాలనను గుర్తు చేసే పాట కన్నా దేశీయులకు బాగా తెలిసిన పాటను చేర్చడం మేలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏ మేరే వతన్ లోగోతో పాటు 26 పాటనలు భారతీయ ఆర్మీ రిపబ్లిక్ డే పెరేడ్లో వాయించనుంది. (చదవండి: తన పేరు మార్పుపై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు రిహర్సల్స్ ఫొటోలు
-
ఫ్లిప్కార్ట్ 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్'లో వాటిపై అదిరిపోయే ఆఫర్స్..!
తాజాగా ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తూ ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ పేరుతో మరో ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. నిన్ననే ముగిసిన బిగ్ సేవింగ్ డేస్ తర్వాత ఈ సేల్ ప్రకటించడం విశేషం. ఫ్లిప్కార్ట్ 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్' జనవరి 23 నుంచి 26 వరకు కొనసాగుతుంది. అయితే, ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్లో మీకు మొబైల్ కవర్, స్మార్ట్ వాచ్, టీడబ్ల్యుఎస్, ల్యాప్ టాప్, కెమెరాల వంటి వాటి మీద అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా సేల్కు పోటీగా ఈ సేల్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఈ రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ కూడా జనవరి 26 వరకు కొనసాగనుంది. ఈ సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్ ల్యాప్ టాప్స్ మీద 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. డెల్ ఇన్ స్పిరాన్ రైజెన్ 5, డెల్ ఇన్ స్పిరాన్ వోస్ట్రో కోర్ ఐ3 11వ-జెన్, ఇన్ స్పిరాన్ కోర్ ఐ3 11వ జెన్ మోడల్స్ మీద ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. హెచ్పీ, ఎంఎస్ఐ, ఎల్జి, డెల్, ఏసర్, లెనోవోతో సహా కొన్ని ప్రముఖ బ్రాండ్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే,యాపిల్,శామ్ సంగ్ కంపెనీలకు చెందిన టాబ్లెట్లపై కూడా ఆఫర్స్ అందిస్తుంది. బోస్ ఆడియో ప్రోడక్ట్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్, సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు, బ్లూటూత్ స్పీకర్ల మీద వరుసగా 30 శాతం, 40 శాతం, 60 శాతం, 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాలు, స్మార్ట్ వాచ్ మీద కూడా ఆఫర్స్ లభిస్తున్నాయి. డిఎస్ఎల్ఆర్ & మిర్రర్ లెస్ కెమెరాలపై రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ సేల్లోఫిట్ నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్లను రూ.1,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.699 నుంచి పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. చివరగా, మొబైల్ కేసులు మరియు కవర్లు కేవలం రూ.99 నుండి అందుబాటులో ఉంటాయి. (చదవండి: టాటా మోటార్స్ దూకుడు.. ఇక ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గేదె లే!) -
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహర్సల్స్.. ఫోటోలు మీకోసం
-
బిగ్ బజార్ బంపర్ ఆఫర్.. వాటి మీద 50 శాతం డిస్కౌంట్..!
ప్రముఖ రిటైల్ బ్రాండ్ సంస్థ ‘బిగ్ బజార్’ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ‘సబ్సే సస్తా దిన్’ ప్రత్యేక సేల్ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 19 నుంచి 26 వరకు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక సేల్లో భాగంగా ఫుడ్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫుట్వేర్, లగేజ్, కిచెన్వేర్, హోమ్ డెకోర్ వంటి తదితర వస్తు ఉత్పత్తులపై పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో జరిగే ప్రముఖ సేల్లో తమ ‘సబ్సే సస్తే దిన్’ కూడా ఒకటని, ఇందులో వినియోగదారులు పలు ఆఫర్లను పొందొచ్చని బిగ్ బజార్ పేర్కొంది. ఈ సేల్లో భాగంగా ప్రతి బిగ్ బజార్ స్టోర్ కూడా ఉదయం 9 గంటలకే ప్రారంభంకానుంది. ఈ ఏడాది, కేవలం స్టోరుల్లో మాత్రమే కాకుండా బిగ్ బజార్ యాప్, వెబ్ సైట్ ద్వారా కూడా ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసిన 2 గంటల్లోగా ప్రోడక్ట్స్ ఉచిత హోమ్ డెలివరీ చేయనున్నారు. కస్టమర్లు ₹ 2,500 విలువైన ఫ్యాషన్ వోచర్లను ₹2,500 విలువైన షాపింగ్ పొందవచ్చు. అంటే, ఫ్యాషన్ మీద 50 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు కనీసం స్టోరులో ₹3,500 షాపింగ్ చేస్తే అదనంగా 7.5% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. సబ్సే సస్తా దిన్ షాపింగ్ ఫెస్టివల్స్లో భాగంగా ఫుడ్, ఫ్యాషన్, హోమ్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచ్ లను తక్కువ ధరకు వినియోగిస్తుంది. Ab India Har Ghar Mein #SabseSasteDin. LIVE NOW at https://t.co/GQ7cytNsyu pic.twitter.com/JAyVFzhmc2 — Big Bazaar (@BigBazaar) January 19, 2022 (చదవండి: 5G Issue: 5జీతో నిజంగానే విమానాలకు ఇబ్బందా?) -
గణతంత్ర వేడుకలకు ఉగ్రవాద ముప్పు?
-
గణతంత్ర వేడుకలపై ఉగ్ర కుట్ర.. ప్రధాని ప్రాణాలకు ప్రమాదం!
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్ని భగ్నం చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రతినిధులు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రమూకలతోనే ముప్పు పొంచి ఉందని, రద్దీ ప్రాంతాలు, ప్రముఖ కట్టడాలు, బహిరంగ ప్రదేశాల్లో దాడులు జరపడానికి ఉగ్ర సంస్థలు పన్నాగాలు పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు తొమ్మిది పేజీల నివేదికని కేంద్రానికి పంపారు. డ్రోన్లతో దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. దీంతో ఢిల్లీలో భద్రతని కట్టుదిట్టం చేశారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు హాట్ ఎయిర్ బెలూన్లు, పారాగ్లైడ్, యూఏవీలను రాజధాని పరిధిలో నిషేధించినట్టుగా మంగళవారం ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా చెప్పారు. డ్రోన్లను ఎదుర్కొనే సామర్థ్యమున్న వ్యవస్థలను రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అదనపు భద్రత కోసం అత్యంత ఎల్తైన భవంతులపై పోలీసు సిబ్బందిని మోహరిస్తారు. వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో భారీ ఆంక్షల మధ్య గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది 5,000–8,000 మందికి మాత్రమే వేడుకలకు అనుమతించాలని భావిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రత్యేక అతిథులెవరూ లేకుండానే వేడుకలు నిర్వహించాలని యోచిస్తున్నట్టుగా రక్షణ శాఖ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే వేడుకలకి హాజరవడానికి అనుమతి ఉంటుంది. చిన్నారుల్ని వేడుకలకి దూరంగా ఉంచనున్నారు. ఈసారి పరేడ్ను అరగంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు బదులుగా 10.30కి వేడుకలు మొదలవుతాయి. రాజ్పథ్లో 10 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. చదవండి: జంతువులపై ప్రేమ.. ప్రధాని వరకు తీసుకెళ్లింది శకటాల ఎంపిక నిపుణుల కమిటీదే : రాజ్నాథ్ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ శకటాల ప్రదర్శనకు ఈ ఏడాది అనుమతి లభించకపోవడంపై వివాదం నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఉద్దేశపూర్వకంగానే తమ రాష్ట్రాల శకటాలను తిరస్కరించారన్న ఆరోపణలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. శకటాల ఎంపికను నిపుణుల కమిటీ చేస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాలిన్, మమతలకు లేఖ రాశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 29 ప్రతిపాదనలు వస్తే 12 మాత్రమే ఆమోదం పొందాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ థీమ్పై శకటాన్ని రూపొందిస్తే తిరస్కరించారంటూ ఘాటుగా విమర్శించిన మమతకు బదులిస్తూ నేతాజీకి నివాళిగా ఆయన జయంతి జనవరి 23 నుంచి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. చదవండి: ఈడీ దాడుల కలకలం.. పంజాబ్ సీఎం మేనల్లుడి ఇళ్లల్లో సోదాలు -
Republic Day Sale: ఈ ఆఫర్లు అస్సలు మిస్ చేసుకోవద్దు!
దేశంలో ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లు అందిస్తున్న భారీ డిస్కౌంట్ సేల్ కొనసాగుతుంది. రిపబ్లిక్డే సందర్భంగా జనవరి 17 నుంచి ప్లిప్ కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్', అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులపై 70 నుంచి 80 శాతం భారీ డిస్కౌంట్ను అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో అమెజాన్ ఫ్యాషన్పై 80 శాతం, గృహోపకరణాల వస్తువులపై 70 శాతం వరకు తగ్గింపుతో అందిస్తుంది. ప్లిప్కార్ట్ సైతం అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్లు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈజాబితాలో టీవీలు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్స్పీకర్లు, స్ట్రీమింగ్ ప్రొడక్ట్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఎంపిక చేసిన వస్తువులపై గరిష్టంగా 10శాతం తగ్గింపు పొందవచ్చు. 43అంగుళాల స్క్రీన్ 4కే రిజల్యూషన్తో స్మార్ట్ టీవీల కోసం చూస్తున్నట్లయితే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో షియోమీ, శాంసంగ్ నుండి చాలా టీవీలు తగ్గింపు ధరలతో సొంతం చేసుకోవచ్చు. టీవీలు ఎంఐ 4ఎక్స్ 108 సీఎం(43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ (4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 29,999 శాంసంగ్ క్రిస్టల్ 4కే 108 సీఎం (43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ (4కే ) ఎల్ఈడీ స్మార్ట్ టీవీ: రూ. 36,999 రియల్మీ 108 సీఎం (43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ (4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 29,999 వీయూ ప్రీమియం 108 సెం.మీ (43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ(4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 25,999 స్మార్ట్ స్పీకర్లు యాపిల్ హోమ్ పాడ్ మినీ ధర రూ. 7,999 గూగుల్ నెస్ట్ హబ్ ధర రూ. 5,999 గూగుల్ నెస్ట్ ఆడియో ధర రూ. 5,999 లెనోవో స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్ ధర రూ. 3,999 స్ట్రీమింగ్ పరికరాలు అదేవిధంగా ప్రస్తుత టీవీని అప్ డేట్ చేయాలనుకుంటే బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022లో అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు హెచ్డీఎంఐ పోర్ట్ లేదా యూఎస్బీ పోర్ట్ ద్వారా హార్డ్వేర్ను మీ టీవీకి కనెక్ట్ చేయవచ్చు. ఎంఐ బాక్స్ 4కే మీడియా స్ట్రీమింగ్ ధర రూ.3,499 రియల్మీ 4కే స్మార్ట్ గూగుల్టీవీ స్టిక్ ధర రూ. 3,499 ఇంటర్నల్ క్రోమాకాస్ట్తో నోకియా మీడియా స్ట్రీమర్ ధర రూ. 2,999 యాపిల్ టీవీ 4కే 32జీబీ ధర రూ.17,999 స్మార్ట్ఫోన్లు యాపిల్ ఐఫోన్ 12మినీ (64జీబీ) రూ. 41,999 మోటరోలా జీ60 (128జీబీ) ధర రూ.17,999 వివో ఎక్స్60 (128జీబీ) ధర రూ.34,990 మి11 లైట్ (128జీబీ) రూ.23,999 రియల్మీ జీటీ 5జీ ధర రూ.37,999గా ఉంది. చదవండి: వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు! -
రిపబ్లిక్ డే టార్గెట్గా భారీ కుట్ర.. దేశ రాజధానిలో బాంబు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీలో గుర్తుతెలియని దుండగులు బాంబును అమర్చారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది. స్థానిక ఘాజీపూర్ ఫ్లవర్ మండీలో ఒక బ్యాగ్ ఉండటాన్ని స్థానికులు గమనించారు. చాలాసేపటి నుంచి బ్యాగ్ మార్కెట్లోనే ఉండటంతో అనుమానంతో.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నేషనల్సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక పరికంతో బ్యాగ్ స్కాన్ చేసి పరిశీలించారు. ఆ బ్యాగ్లో పేలుడు పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రత దళాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాగ్లో 3 కిలోల ఐఈడీ పేలుడు పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత.. ఒక రోబో సహయంతో ఆ బ్యాగ్ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో ఎనిమిదడుగుల లోతులో ఆ పరికరంను ఉంచి బాంబ్ను నిర్వీర్యం చేశారు. నేషనల్ సెక్యురీటి గార్డు అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ముప్పుతప్పింది. ఇంకా ఎక్కడైన బాంబులు ఉన్నాయా.. అన్న కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లవర్ మండీ మార్కెట్ భోగి పండుగ నేపథ్యంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు చేపట్టిన దీక్షా స్థలం కూడా ఘాజీపూర్ మండీకి సమీపంలోనే ఉంది. గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందే బాంబు ఘటన వెలుగుచూడటంతో నేషనల్ సెక్యూరిటీ గార్డు సిబ్బంది, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం డీసీపీ ప్రమోద్ కుష్వాహ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హై అలెర్ట్ కొనసాగుతుంది. చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో అదిరిపోయే ఆఫర్స్..! వాటిపై 80 శాతం డిస్కౌంట్
ఈ ఏడాదిలో తొలి సేల్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్లపై భారీ డిస్కౌంట్లు అందించేందుకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022ను ప్రకటించింది. దీని కోసం వెబ్సైట్లో ఒక ప్రత్యేక పేజీని క్రియేట్ చేసింది. ఈ సేల్ జనవరి 17 నుంచి 22 వరకు కొనసాగుతుంది. అమెజాన్ కూడా 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో ప్రత్యేక సేల్ను తీసుకొస్తుంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుంచి 20 వరకు కొనసాగనుంది. ఈ ఫ్లిప్కార్ట్ సేల్లో స్మార్ట్ ఫోన్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఐటమ్, దుస్తులపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కొంత సేల్ను తీసుకువస్తాయి. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులు జనవరి 16 నుంచి ఈ సేల్లో పాల్గొనవచ్చు. ఈ ఫ్లిప్కార్ట్ సేల్లో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు తమ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% డిస్కౌంట్ పొందుతారు. ఏ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ మీద ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారో ఇంకా వెల్లడించలేదు. వీటిపై 80% వరకు డిస్కౌంట్ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022లో ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 80% వరకు డిస్కౌంట్ అందిస్తే, హెడ్ ఫోన్లు & స్పీకర్లు 70 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. మరోవైపు స్మార్ట్ వేరియబుల్స్ మీద 60% వరకు డిస్కౌంట్, ల్యాప్ టాప్ & డెస్క్ టాప్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్, మొబైల్ యాక్ససరీల మీద 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. అలాగే, టాప్ స్మార్ట్ వాచీల మీద 60% వరకు డిస్కౌంట్, టీవీ & గృహోపకరణాల మీద 75% వరకు డిస్కౌంట్, దుస్తుల మీద 60 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. త్వరలో ఏ ప్రొడక్ట్ మీద ఎంత డిస్కౌంట్ ఇవ్వనున్నారో ప్రకటించనుంది. (చదవండి: 2021లో దేశంలో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన మొబైల్ యాప్ ఇదే..!) -
‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం 2022 ఏడాదికిగాను పద్మ అవార్డులకు గాను నామినేషన్లు, సిఫారసుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దఖాస్తులను ఆహ్వానిస్తోంది. నామినేషన్లకు స్వీకరించేందుకు తుది గడువును సెప్టెంబర్ 15గా కేంద్రం తాజాగా ప్రకటించింది. నిర్దేశిత ఫార్మాట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపర్చినట్టు పేర్కొంది. పద్మ అవార్డులను "ప్రజల పద్మ" గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈనేపథ్యంలో మహిళలు, ఎస్సీ/ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిని గుర్తించి సిఫారసు చేయాలని కేంద్రం కోరింది. వారి ప్రతిభ, విజయాల ఆధారంగా, కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ అవార్డులు అందజేయనున్నామని తెలిపింది. . ఆసక్తి, అర్హతగల వారు వచ్చే నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది. కాగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అసాధారణ కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులను ‘పీపుల్స్ పద్మ’ అవార్డులకు నామినేట్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే (జూలై ,11న) దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: పద్మ అవార్డు: ట్రెండింగ్లో సోనూసూద్ -
గ్రెటా టూల్కిట్: బెంగళూరు యువతి అరెస్ట్
సాక్షి, బెంగళూరు : దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన రిపబ్లిక్ డే హింసాత్మక ఘటనలో పోలీసులు మరో ముందడుగు వేశారు. గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చెలరేగిన హింసకు సంబంధించి బెంగుళూరుకు చెందిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో హింస చెలరేగే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 21 ఏళ్ల దిశరవి అనే పర్యవరణ ఉద్యమకారినిని ఆదివారం అరెస్ట్ చేశారు. స్వీడన్కు చెందిన పర్యవరణ యాక్టివిస్ట్ గ్రెటా థన్బర్గ్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న దీక్షలకు గ్రేటా మద్దతు తెలపడం, ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ దేశంలో పెను ప్రకంపనలు రేపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు గ్రేటా షేర్ చేసిన టూల్కిట్ ఖలికిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తయారు చేసినట్లు ఉందంటూ ఢిల్లీ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రైతు దీక్షలకు మద్దతు తెలుపుతూ.. దేశ అంతరిక వ్యవహారాల్లో తలదూర్చారని ఆరోపిస్తూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే గ్రెటా టూల్కిట్తో సంబంధముందని భావిస్తున్న బెంగళూరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యవరణ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఆమెపై ఢిల్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఢిల్లీలో 26నాటి ఘటనపై న్యాయ విచారణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అప్పటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వం రైతులపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయించిందని ఆరోపించాయి. సింఘు వద్ద సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసు నోటీసులు అందుకున్న రైతులు నేరుగా వారి వద్దకు వెళ్లకుండా, అవసరమైన సాయమేదైనా రైతు సంఘాల న్యాయ విభాగాల నుంచి పొందాలని సూచించారు. జనవరి 26వ తేదీ నాటి హింసాత్మక ఘటనలకు, రైతులపై తప్పుడు కేసులు నమోదు చేయడం వెనుక కుట్ర దాగుందని ఎస్కేఎం న్యాయ విభాగం సభ్యుడు కుల్దీప్ సింగ్ ఆరోపించారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న 16 మంది రైతుల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదన్నారు. ఆ ఘటనలపై నమోదైన మొత్తం 44 ఎఫ్ఐఆర్లలో 14 ఎఫ్ఐఆర్లకు సంబంధించి 122 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారని, వారందరికీ న్యాయ, ఆర్థిక సాయం అందజేస్తామని మరో నేత రవీందర్ సింగ్ తెలిపారు. కొందరు రైతులపై దోపిడీ, హత్యాయత్నం వంటి కేసులు కూడా పెట్టారన్నారు. భోజనం ఖర్చుల కోసం జైలులో ఉన్న రైతులకు రూ.2 వేల చొప్పున ఎస్కేఎం అందజేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు జైలులో ఉన్న 10 మంది రైతులకు బెయిల్ మంజూరు కాగా, మరో ఐదుగురి బెయిల్కు దరఖాస్తు చేశామన్నారు. తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు కాని వారిపై మొదట దృష్టి పెట్టినట్లు చెప్పారు. తీహార్ జైలులో ఉన్న 112 మంది రైతులను తమ న్యాయ విభాగం కలిసిందని వెల్లడించారు. ఇలా ఉండగా, ట్రాక్టర్ పరేడ్ సమయంలో ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలకు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న నటుడు దీప్ సిద్దు, ఇక్బాల్ సింగ్ అనే మరో వ్యక్తిని దర్యాప్తులో భాగంగా ఢిల్లీ నేర విభాగం పోలీసులు శనివారం ఘటనాస్థలికి తీసుకువచ్చి, సీన్ రిక్రియేట్ చేయించారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 500 మంది పోలీసులు గాయపడగా, ఒక ఆందోళనకారుడు చనిపోయిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు గాంధీజీ మనవరాలు మద్దతు ఘజియాబాద్: మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్జీ(84) రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. గాంధీ నేషనల్ మ్యూజియం చైర్ పర్సన్ కూడా అయిన భట్టాచార్జీ శనివారం ఘాజీపూర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో మాట్లాడారు. నిరసనలు శాంతియుతంగా కొనసాగించాలని వారిని కోరిన ఆమె.. రైతులపట్ల శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ కార్యక్రమంలో భాగంగా మేం ఇక్కడికి రాలేదు. మనల్ని పోషిస్తున్న రైతుల కోసం మాత్రమే వచ్చాం. అన్నదాతల కష్టాన్ని విస్మరించరాదు. రైతులకు లబ్ధి దేశానికే లబ్ధి’అని ఆమె అన్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తెలిపింది. ఆమె వెంట మహాత్మా స్మారక్ నిధి చైర్మన్ రామచంద్ర రాహి, ఆల్ ఇండియా సర్వ్ సేవా సంఘ మేనేజింగ్ ట్రస్టీ అశోక్ సరన్, గాంధీ స్మారక్ నిధి డైరెక్టర్ సంజయ్ సింఘా, నేషనల్ గాంధీ మ్యూజియం డైరెక్టర్ అన్నామలై ఉన్నారు. -
రైతు ఉద్యమం : దీప్ సిద్దూ అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రైతుల ఆందోళనలో హింసకు కారణమైన పంజాబీ నటుడు, గాయకుడు, కార్యకర్త దీప్ సిద్దూను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి ఎర్రకోటలో జెండా ఎగుర వేయడం, ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో ప్రధాన నిందితుడు సిద్దూను పంజాబ్లో అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం ప్రకటించారు. దీనిపై ఈ రోజు 12 గంటలకు పోలీసులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు సుదీర్ఘ ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం రోజు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొంతమంది నిరసనకారులు అంగీకరించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ఎర్రకోట లోపలికి బలవంతంగా ప్రవేశించి సిక్కు మత జెండాలను ఎగువేయడం వివాదానికి దారి తీసింది. ఈ కేసులో దీప్ సిద్దూతోపాటు పలువురిపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. దీంతో సిద్ధూ గతనెల 26 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. దీప్ సిద్ధూ, మరో ముగ్గురు నిందితులపై పోలీసులు లక్షరూపాయల రివార్డును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దీప్ సిద్ధు ఆచూకీ తెలిపితే రూ. లక్ష
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు రెండు నెలలకు పైగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 60 రోజులపాటు ప్రశాంతంగా సాగిన అన్నదాతల నిరసన.. గణతంత్ర దినోత్సవం నాడు ఉద్రిక్తంగా మారింది. హింస చోటు చేసుకుంది. అప్పటి వరకు రైతులకు మద్దతుగా నిలిచిన వారు వెనకంజ వేశారు. రైతు సంఘాల మధ్య కూడా చీలకలు వచ్చాయి. రైతు గణతంత్ర పరేడ్ పేరిట రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో తలెత్తిన విధ్వంసానికి నటుడు, సింగర్ దీప్ సిద్ధునే ప్రధాన కారకుడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: రైతుల కోసం రిహన్నా.. ఫూల్ అన్న కంగనా) ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దీప్ సిద్ధుపై బుధవారం నాడు లక్ష రూపాయాల రివార్డును ప్రకటించారు. రైతు గణతంత్ర పరేడ్ నాడు దీప్ సిద్ధు ఎర్రకోటపై జెండా ఎగురవేయడమే కాక ఫేస్బుక్ లైవ్లో జనాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఉద్రిక్తతలు చేలరేగాయి. ఇక నాటి నుంచి ఆయన కన్పించకుండా పోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ పోలీసులు దీప్ సిద్ధు ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు. దీప్ సిద్ధుతో పాటు మరో ముగ్గురిపై కూడ పోలీసులు రివార్డు ప్రకటించారు. దీప్ సిద్ధు కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. -
తిరంగాకు అవమానం.. తీవ్ర విచారకరం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధాని ఢిల్లీలో మువ్వన్నెల జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని చూసి దేశం యావత్తూ తీవ్ర విచారంలో మునిగిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఎర్రకోట వద్ద మత జెండాను ఎగురవేయడాన్ని ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. వ్యవసాయ రంగం ఆధునీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని కూరగాయల మార్కెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. మన వ్యాక్సినేషన్.. ప్రపంచానికి ఆదర్శం ‘‘మనం గత ఏడాది అంతులేని సహనం, ధైర్యం ప్రదర్శించాం. అదే కొనసాగించాలి. లక్ష్యాలు, తీర్మానాలను సాధించడానికి కష్టపడి పనిచేయాలి. మన దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లో అమలవుతోంది. ఇతర దేశాల కంటే మిన్నగా మన ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నాం. 15 రోజుల్లో 30 లక్షల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్ ఇచ్చాం. 30 లక్షల మందికి ఈ టీకా ఇవ్వడానికి అమెరికాకు 18 రోజులు, యూకేకు 36 రోజులు పట్టింది. కరోనా మహమ్మారిపై మన పోరాటం ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న కరోనా టీకాలను చాలా దేశాలకు సరఫరా చేస్తున్నాం. ప్రాణాధార ఔషధాలు, టీకాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర వేడుకలను అమృత్ మహోత్సవ్గా దేశం జరుపుకోనుంది. మీ ప్రాంతంలో జరిగిన పోరాట ఘట్టాలను వెలుగులోకి తీసుకురండి. పుస్తకాలు రాయండి. మీ రచనలే మన స్వాతంత్య్ర పోరాట యోధులకు గొప్ప నివాళి. అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో పుస్తకాలు రావాలి. ఈ దిశగా యువతను ప్రోత్సహిస్తాం’’అని ప్రధాని తెలిపారు. ‘‘రోడ్డు ప్రమాదాలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. రహదారి భద్రత కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘లేట్ మిస్టర్’గా కాకుండా ‘మిస్టర్ లేట్’గా ఉండడమే ఉత్తమం అంటూ రహదారులపై కనిపిస్తున్న నినాదాలు చాలా ప్రభావవంతంగా ఉంటున్నాయి. రహదారి భద్రతపై ఇలాంటి నినాదాలను ప్రభుత్వానికి పంపించండి. మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. చిలీ దేశ రాజధాని శాంటియాగోలో 30కి పైగా యోగా స్కూళ్లు ఉన్నాయని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. చిలీ సెనేట్లోని ఉపాధ్యక్షుడి పేరు రవీంద్రనాథ్ క్వింటేరోస్. మన రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితోనే ఆయనకు ఆ పేరు పెట్టారు’’ అని తెలిపారు. బోయిన్పల్లి మార్కెట్ భేష్ హైదరాబాద్లోని బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ బాధ్యతలు నెరవేర్చే విధానం చాలా సంతృప్తినిచ్చింది. మార్కెట్లలో చాలా కారణాల వల్ల కూరగాయలు చెడిపోవడం మనం చూశాం. వీటితో మార్కెట్లలో అపరిశుభ్రత నెలకొంటోంది. కానీ, బోయిన్పల్లి మార్కెట్లో ఇలా రోజువారీ పాడైన కూరగాయలతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేయడం వినే ఉంటారు. ఇది నవకల్పన శక్తి. బోయిన్పల్లి మార్కెట్లో వ్యర్థాల నుంచి సంపద సృష్టి జరుగుతోంది. ఇది వ్యర్థాల నుంచి బంగారం తయారు చేసే దిశగా సాగుతున్న ప్రయాణం. అక్కడ రోజుకు 10 టన్నుల వ్యర్థాలు తయారవుతున్నాయి. వాటిని సేకరించి, ప్లాంట్లో రోజూ 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది మార్కెట్కు వెలుగులు పంచుతోంది. దాదాపు 30 కిలోల జీవ ఇంధనం కూడా ఉత్పత్తి అవుతోంది. దీంతో మార్కెట్ క్యాంటీన్లో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. -
భర్తకు చెప్పి ఎక్కడం మొదలుపెట్టాను
ఎవరికైనా ఒక్కసారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తే చాలు అనే కల ఉంటుంది. కానీ, 41 ఏళ్ల అన్షు జమ్సేన్పా మాత్రం ఒకే సీజన్లో రెండుసార్లు పర్వతారోహణ పూర్తి చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచింది. ఆమె సాధించిన ఘనతకు మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ‘వేగం’ అత్యవసరం అని నిరూపిస్తుంది అన్షు జమ్సేన్పా. ఆ వేగం వల్లే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. భర్త, అత్తమామ, పిల్లలు ఇంట్లో అన్ని బాధ్యతలనూ ఓ చేత్తో మోస్తూనే తన కలల జెండాను ఎవరెస్ట్ శిఖరం అంచున రెపరెపలాడించింది. ఐదు సార్లు అధిరోహణ.. జీవితంలో ఒక్కసారయినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని కలలు కనేవారు ప్రపంచం లో చాలా మంది ఉన్నారు. కానీ, అందరి కలలు నెరవేరవు. వారి శ్రమ, పట్టుదల కూడా అంతే వెనకంజలో ఉంటాయి. కానీ, అన్షు జమ్సేన్పా ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక్కసారి కాదు ఐదుసార్లు అధిరోహించింది. అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్ ఆమె జన్మస్థలం. ఇద్దరు పిల్లల తల్లి అయిన అన్షు 2009లో పర్వతారోహణ ప్రారంభించింది. తాను సాధించిన విజయం గురించి అన్షు మాట్లాడుతూ– ‘నేను అడ్వెంచర్ స్పోర్ట్స్లో రాణించేదాన్ని. రాక్ క్లైంబింగ్ చేసేదాన్ని. ఆ సమయంలో అరుణాచల్ పర్వతారోహణ, అడ్వెంచర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్లు నా ప్రతిభ గుర్తించి నా భర్తకు చెప్పి, ఒప్పించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించమని నన్ను ప్రోత్సహించారు. ఒకసారి నేను ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టాను, మరలా వెనక్కి తిరిగి చూడలేదు’ అని వివరించింది అన్షు. అధిరోహణ కష్టమే.. అయినా ఇష్టం.. శిక్షణా సమయంలో పర్వతాలను అధిరోహించడం తనకు చాలా ఇష్టమని గ్రహించిన అన్షు ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి జయించిన రోజు ఇప్పటికీ గుర్తుంది అని సంతోషం వ్యక్తం చేస్తుంది. అన్షుకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుతూ ‘నేను దేవుని దగ్గరికి చేరుకున్నట్టే అనిపించింది. నా కలలో నేను చూసిన సన్నివేశం నా కళ్ల ముందు నిలిచింది. ఆ సమయంలో నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అని సంబరంగా చెబుతుంది అన్షు. ఆమె తండ్రి ఇండోటిబెట్ సరిహద్దులో ఒక పోలీసు అధికారి, తల్లి నర్సు. ఎవరెస్టును జయించటానికి అన్షు రన్నింగ్, జిమ్, యోగా, ఏరోబిక్స్ వంటివి నేర్చుకుంది. మొదట చిన్న చిన్న పర్వతాలను అధిరోహించడం ద్వారా తన లక్ష్యాన్ని చేరుకుంది. -
రైతు పోరాటం ఉధృతం
ట్రాక్టర్ పరేడ్లో హింస తర్వాత కొంత వెనక్కు తగ్గినట్లు కనిపించిన రైతు పోరాటం మళ్లీ ఉధృతం అవుతోంది. ఇప్పటివరకు పంజాబ్, హరియాణా రైతులే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించగా.. ఇప్పుడు పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ రైతులు కూడా వీరికి జత కలిశారు. ఘజియాబాద్/న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ పరేడ్లో హింస చోటుచేసుకున్న తర్వాత కొంత బలహీనపడినట్లు కనిపించిన రైతు పోరాటం మళ్లీ తీవ్రతరమవుతోంది. ప్రధానంగా పంజాబ్, హరియాణా రైతులే ఇప్పటివరకు ఈ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తుండగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ రైతులు కూడా తోడవుతున్నారు. ఢిల్లీ–మీరట్ రహదారిపై ఉన్న ఘాజీపూర్ మరో ప్రధాన కార్యక్షేతంగా మారిపోయింది. ఢిల్లీలో హింస తర్వాత స్వస్థలాలకు తిరిగి వెళ్లిన పంజాబ్, హరియాణా రైతులు మళ్లీ వెనక్కి వస్తున్నారు. సింఘు, టిక్రీ బోర్డర్ పాయింట్లకు చేరుకుంటున్నారు. రైతుల నిరసన కేంద్రాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పారా మిలటరీ దళాలనుమోహరించారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ముజఫర్నగర్లో శనివారం మహాపంచాయత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా రైతు సంఘాల నాయకులు శనివారం ‘సద్భావన దివస్’గా పాటించారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. ఘాజీపూర్లో బీకేయూ నేత రాకేశ్ తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు నెలలకుపైగా తమ పోరాటం కొనసాగుతోందని, ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల ఉద్యమం బలంగా ఉందని బీకేయూ మీరట్ జోన్ అధ్యక్షుడు పవన్ ఖటానా చెప్పారు. రైతుల శాంతియుత పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ఇది రాజకీయ పోరాటం కాదని స్పష్టం చేశారు. సర్కారు వైఖరి మారాలి రైతుల ఆందోళన నానాటికీ బలం పుంజుకుంటోందని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంతోమంది తమ పోరాటంలో భాగస్వాములవుతారని చెప్పారు. ఫిబ్రవరి 2వ తేదీ నాటికి భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీకి చేరుకుంటారని అంచనా వేస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్సింగ్ రాజేవాల్ పేర్కొన్నారు. ఆయన చండీగఢ్లో మీడియాతో మాట్లాడారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్ నుంచి రికార్డు స్థాయిలో రైతులు దేశ రాజధానికి వస్తారని వెల్లడించారు. తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతోందని ఉద్ఘాటించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం దారుణమని విమర్శించారు. జనవరి 26 నాటి హింసాత్మక దృశ్యాలను ప్రభుత్వం పదేపదే చూపుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని రాజేవాల్ మండిపడ్డారు. కేంద్ర సర్కారు ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలని, కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని హితవు పలికారు. మళ్లీ చర్చల కోసం ప్రభుత్వం పిలిస్తే తప్పకుండా వెళ్తామన్నారు. ఢిల్లీలో జరిగిన హింసపై పోలీసులు జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇస్తామని చెప్పారు. తికాయత్ కన్నీళ్లు కదిలించాయి ప్రముఖ రైతు, ఉద్యమ నాయకుడు మహేంద్రసింగ్ తికాయత్ తనయుడు, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ నేతృత్వంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతాంగం సంఘటితమవుతోంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అవిశ్రాంతంగా సాగిస్తున్న ఆందోళనలు, నిరసనలు, ఢిల్లీలో హింస తదితర పరిస్థితుల నేపథ్యంలో గురువారం రాత్రి ఘాజీపూర్ వద్ద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కన్నీళ్లు వేలాది మంది రైతులను కదిలించాయి. తికాయత్కు మద్దతుగా శనివారం ఆయన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్తోపాటు పంజాబ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్ నుంచి భారీ సంఖ్యలో రైతులు ఘాజీపూర్కు తరలివచ్చారు. గురువారం రాత్రి తికాయత్ విలపించిన తర్వాత తమ కళ్లల్లోనూ నీళ్లు వచ్చాయని, ఆ రాత్రంతా తాము నిద్రపోలేదని, టీవీలకే అతుక్కుపోయామని చారౌర గ్రామ పెద్ద పంకజ్ ప్రధాన్ చెప్పాడు. తికాయత్ కన్నీళ్లే తనను ఇక్కడికి తీసుకొచ్చాయని యూపీలోని బులంద్షహర్కు చెందిన అనిల్ చౌదరి తెలిపాడు. 1,700 వీడియో క్లిప్స్, సీసీటీవీ ఫుటేజీ రిపబ్లిక్ డే రోజు రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో హింసాకాండపై ప్రజల నుంచి పోలీసులకు ఇప్పటిదాకా 1,700 వీడియో క్లిప్స్, సీసీటీవీ ఫుటేజీ అందాయి. ఫోరెన్సిక్ నిపుణులు వీటిని విశ్లేషిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ హింసాకాండకు సంబంధించి 9 కేసులు నమోదుచేశారు. వీటిపై క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఫోన్ కాల్స్ డేటాను పరిశీలిస్తున్నారు. ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాక్టర్ పరేడ్ను 9 డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. వీటిపై అధికారులు దృష్టి పెట్టారు. ఇంటర్నెట్ బంద్ దేశ రాజధానిలో జనవరి 26న హింస చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా ఢిల్లీ సరిహద్దులోని రైతుల నిరసన కేంద్రాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్లతోపాటు సమీప ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. జనవరి 29 రాత్రి 11 గంటల నుంచి 31వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హరియాణా ప్రభుత్వం 14 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే రద్దు చేసింది. -
10కోట్ల మంది రైతులకు లబ్ధి
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలతో దేశవ్యాప్తంగా రైతులకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాలను ఆయన గట్టిగా సమర్థించారు. వీటి అమలుతో 10 కోట్ల మంది సన్నకారు రైతులు తక్షణమే ప్రయోజనం పొందుతారని తెలి పారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రా జధాని ఢిల్లీలో హింస చోటుచేసుకోవడం, రై తుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా మువ్వన్నెల జాతీయ జెండాకు అవమానం జరగడం చా లా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏ సీ) వద్ద శాంతికి పొరుగు దేశం విఘాతం కలి గిస్తోందంటూ పరోక్షంగా చైనాపై మండిపడ్డా రు. కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ► సరిహద్దులో యథాతథ స్థితిని మార్చడానికి కొన్ని దేశాలు చేస్తున్న కుట్రలను మన సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ►పేదలు, సన్నకారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల పురోగతికి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ► కొత్త సాగు చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. గతంలో వివిధ పార్టీలు ఈ చట్టాలకు మద్దతునిచ్చాయి. ► రాజ్యాంగం మనకు భావప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది. అదే సమయంలో చట్టాలను గౌరవించాలని, రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించాలని రాజ్యాంగం బోధించిందన్న సంగతి మరచిపోవద్దు. ► మూడు కొత్త సాగు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా గౌరవిస్తుంది. కోర్టు ఆదేశాలతో ఈ చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ► సన్న, చిన్నకారు రైతుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారి పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.13 లక్షల కోట్లను బదిలీ చేసింది. ► కరోనా వ్యాప్తి సమయంలో ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు 8 నెలలపాటు ఉచి తంగా నిత్యావసరాలను సరఫరా చేసింది. ► కరోనా కల్లోల సమయంలోనూ భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. బహిష్కరించిన ప్రతిపక్షాలు రాష్ట్రపతి తన ప్రసంగంలో గత ఏడాది మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 20 ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. పార్లమెంట్లో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతుండగా కొందరు ప్రతిపక్ష ఎంపీలు జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. -
‘బీజేపీ ప్లాన్ ప్రకారమే దారి మళ్లించింది’
ముంబై: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమం గణతంత్ర దినోత్సవం నాడు ఉద్రిక్తంగా మారింది. హింస చోటు చేసుకుంది. ఆ తర్వాత రైతు సంఘాల మధ్య చీలికలు ఏర్పడి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఓ పథకం ప్రకారమే రైతుల ఉద్యమం హింసాయుతంగా మారేలా చేశాయని శివసేన ఆరోపించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నాలో కేంద్రం తీరును ఎండగడుతూ పలు విమర్శలు చేసింది. ‘‘కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. దాదాపు 60 రోజుల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమంలో ఎలాంటి చీలికలు రాలేదు.. వారు సహనం కోల్పోలేదు. రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభించడం.. విదేశాల్లో సైతం మోదీ ప్రభుత్వం పట్ల విమర్శలు రావడంతో కేంద్రం ఈ ఉద్యమాన్ని నీరు కార్చాలని చూసింది. దాంతో ఉద్యమంలో హింస చేలరేగేలా చేసి దారి మళ్లేలా చూసింది’’ అంటూ శివసేన ఆరోపించింది. ‘‘కర్రలతో ఉన్న రైతులను మోదీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుంది.. మరి ‘‘గోలీ మారో’’, ‘‘ఖతం కరో’’ అని నినాదాలు చేసిన వ్యక్తులు మాత్రం ఇంకా మోదీ క్యాబినేట్లోనే ఉన్నారు.. వారి సంగతి ఏంటి’’ అని ప్రశ్నించింది. (చదవండి: నేతాజీ జయంతి.. వేడెక్కిన రాజకీయం) ఇక ‘‘గణతంత్ర దినోత్సవం నాడు చెలరేగిన హింసలో బీజేపీ పాత్ర ఉంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీ రైతులు ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి.. దారి మళ్లించింది. ఉగ్రవాదులు ఆందోళన చేపట్టారు. ఇక ఎర్రకోట వద్ద హింస చేలరేగడానికి ప్రధాన కారకుడు దీప్ సిధు. అతడికి బీజేపీతో సంబంధం ఉంది. పంజాబ్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్కి, దీప్ సిధుకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. సిధు గత రెండు నెలలుగా రైతులను రెచ్చగొడుతున్నాడని.. కానీ వారు సమన్వయం కోల్పోలేదని రైతుల సంఘాల నాయకులు పలువురు వెల్లడించారు’’ అంటూ శివసేన సామ్నాలో రాసుకొచ్చింది. ఇక ఎర్రకోట వద్ద చేలరేగిన హింసకు కేవలం రైతుల్ని మాత్రమే బాధ్యుల్ని చేయడం సరైంది కాదని శివసేన అభిప్రాయ పడింది. ప్రభుత్వం తాను ఏం చేయాలనుకుందో అదే చేసి చూపింది. ఫలితంగా రైతులు, పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా హింసను ప్రోత్సాహించలేము అని తెలిపింది. -
ఎవరినీ వదలం: ఢిల్లీ పోలీస్ చీఫ్
‘ట్రాక్టర్ పరేడ్ను అనుమతించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో నిర్వహించలేదు. హింసకు, విధ్వంసానికి పాల్పడ్డారు. దోషులెవరినీ వదలం’అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు. ఢిల్లీ ఆందోళనలకు సంబంధించి ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామన్నారు. ఢిల్లీ పోలీసులు అత్యంత సంయమనం పాటించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఆందోళనకారులు పోలీసుల నుంచి టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించేందుకు వాడే తుపాకులను లాక్కున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ తరహా తుపాకీ ఎర్రకోటలో ఒక ఆందోళనకారుడి దగ్గర కనిపించిందన్నారు. ఎర్రకోటలోకి ఒక్కసారిగా ప్రవేశించిన ఆందోళనకారుల్లో కొందరు మద్యం సేవించారని, కత్తులు, పదునైన ఆయుధాలతో తమపై దాడి చేశారని కేసు విచారిస్తున్న నార్త్ ఢిల్లీ డీసీపీ సందీప్ తెలిపారు. అక్కడ హింసకు పాల్పడుతున్న సమూహాన్ని నియంత్రించడం తమకు కష్టమైందన్నారు. అయితే, ఎర్రకోటలోకి ప్రవేశించిన ఆందోళనకారులను 3 గంటల్లో అక్కడి నుంచి పంపించివేశామన్నారు. కాగా, తాజాగా ఎర్రకోట వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా ఇతర భద్రతా దళాలను బుధవారం భారీగా మోహరించారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నకిలీవార్తల కట్టడికి ట్విట్టర్ రంగంలోకి దిగింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నాయన్న అనుమానంతో సుమారు 550 ఖాతాలను ట్విట్టర్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రజా ఉద్యమంగా మారింది: బి. వెంకట్ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతు ఉద్యమం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ఈ చట్టాలతో రైతులతో పాటు యావత్తు ప్రజానీకానికి నష్టం కలుగుతుందని ఆయన బుధవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో వ్యాఖ్యానించారు. చట్టాల రద్దుకై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శాసనసభలో తీర్మానాలు చేస్తే కేంద్రప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని, అలాగే ఈనెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులంతా ఈ చట్టాల రద్దు కోసం కృషి చేయడం రైతు ఉద్యమానికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
రైతు ఆందోళనలో చీలిక కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల సుదీర్ఘ పోరాటంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ఆందోళన నుంచి తక్షణమే తాము తప్పుకుంటున్నామని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ (ఏఐకేఎస్సీసీ) వీఎం సింగ్ బుధవారం ప్రకటించడం కలకలం రేపుతోంది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం మరోలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ ఆందోళనను ఇకపై తాము కొనసాగించలేమని పేర్కొన్నారు. రిపబ్లిక్ డే రోజున జరిగిన హింస, ఘర్షణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. (హింసను ఖండించిన రైతు సంఘాలు) ఎర్రకోట మీద జెండా ఎగరేసి సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. జాతీయ జెండా కోసం మన తాతలు తండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఎర్రకోటపై ఎగిరే జాతీయజెండా మన తాతల తండ్రుల త్యాగఫలం..ఆ ప్రదేశంలో నిషాద్ సాహెబ్ జెండా ఎగురవేసి దేశ గౌరవాన్ని మంట కలిపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన సమయం కంటే ముందుగానే ఎందుకు బయలుదేరడంతోపాటు, అనుమతించిన మార్గాన్ని ఎందుకు ఉల్లంఘించారని మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాము ఈ ఆందోళననుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీనిపై రాకేష్ తికాయత్ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే రైతుల హక్కులు, కనీస మద్దతు ధర, గిట్టు బాటు ధర కోసం తమ ఉద్యమం కొనసాగుతుంది. కానీ ఈ ఫార్మాట్లో కాదని స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతు ట్రాక్టర్ మార్చ్ సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి తనకు, తన సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు. (ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా) కాగా 72వ గణతంత్ర దినోత్సవంగా సందర్భంగా రైతు ఉద్యమకారులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ర్యాలీగా వచ్చిన కొంతమంది ఎర్రకోటవైపు దూసుకురావడం, అక్కడ జెండా ఎగురవేయడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర హోంశాఖ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు 200మంది ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ముఖ్యంగా స్వరాజ్ అభియాన్నేత యోగేంద్ర యాదవ్తో పాటు దర్శన్ పాల్, రజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటా సింగ్ బుర్జ్గిల్, జోగిందర్ సింగ్ సహా మరికొందరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జరిగిన హింసాకాండలో 300 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. -
విషాదకరం...దురదృష్టకరం
మువ్వన్నెల జెండా రెపరెపలాడాల్సిన గణతంత్ర దినోత్సవంనాడు దేశ రాజధాని నగరం చవి చూసిన హింస కనీవినీ ఎరుగనిది, దురదృష్టకరమైనది. సాగు సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలంటూ గత రెండు నెల లుగా ఢిల్లీ నగరం వెలుపల బైఠాయించి ఉద్యమిస్తున్న రైతులు కూడా వాంఛించని పరిణామం ఇది. ‘జై జవాన్... జై కిసాన్’ అన్న నినాదాలు ప్రతిధ్వనించాల్సిన రోజున జవాన్లు, కిసాన్ల మధ్య ఘర్ష ణలు చోటుచేసుకోవటం ఎంతో విషాదకరం. ఒకచోట ఆందోళనకారులు పోలీసులను లోతైన గొయ్యిలోకి నిర్దాక్షిణ్యంగా నెట్టడం, మరోచోట వారిపైకి ట్రాక్టర్లను శరవేగంతో పోనిచ్చి భయ భ్రాంతులకు గురిచేయటం లాంటి దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ర్యాలీలోకి పాకిస్తాన్ ప్రేరేపిత ఖలీస్తానీ శక్తులు చొరబడే ప్రమాదం వున్నదని నాలుగురోజులక్రితం పోలీసులు తెలిపారు. కానీ ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించుకుంటామన్న హామీపై షరతులతో అనుమతించారు. వాటి ప్రకారం పెరేడ్ ముగిశాకగానీ ర్యాలీ ఢిల్లీలో ప్రవేశించకూడదు. అంటే ఢిల్లీ వెలుపల ఏడు ప్రాంతాల్లో బైఠాయించిన ఉద్యమకారులు ఉదయం 11 గంటలకు మాత్రమే తమ తమ స్థానాల నుంచి బయ ల్దేరాలి. కానీ అందుకు భిన్నంగా 8 గంటల ప్రాంతంలోనే ర్యాలీలు ఎలా మొదలైనాయో, పోలీసులు ఎక్కడికక్కడ ఎందుకు నిలువరించలేకపోయారో అనూహ్యం. ముందనుకున్న విధంగా జరిగివుంటే అంతా ప్రశాంతంగా ముగిసిపోయేది. కానీ అది కాస్తా అదుపు తప్పి పోలీసులకూ, ఉద్యమకారులకూ మధ్య ఘర్షణలుగా పరిణమించింది. దాదాపు డజను చోట్ల నిర్దేశించిన మార్గాన్ని కాదని ఉద్యమకారుల్లో కొందరు బారికేడ్లను ధ్వంసం చేశారని పోలీసులు అంటుండగా... అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అడ్డంకులు సృష్టించారని రైతుల ఆరోపణ. నిజానిజాల మాటెలావున్నా ఆందోళనకారులను నిలువరించటం పోలీసు బలగాలకు సాధ్యం కాలేదు. అనేకచోట్ల లాఠీచార్జిలు జరిగాయి. బాష్పవాయుగోళాలు ప్రయోగించాల్సివచ్చింది. వీటన్నిటినీ దాటుకుని ఆందోళనకారులు ఎర్రకోటలోకి ప్రవేశించి బురుజులెక్కి రైతు ఉద్యమ పతాకనూ, ఖల్సా జెండాను ఎగరేసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. వేగంగా ట్రాక్టర్ నడిపి బారికేడ్లను ఢీకొట్టి, ఆ క్రమంలో ప్రమాదం జరిగి ఒక యువకుడు మరణించగా, రాళ్లు రువ్విన ఘటనలు, ఇతరత్రా దౌర్జన్యాల్లో 86మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు సంయమనం పాటించకపోయివుంటే మరెన్ని దుర దృష్టకర ఘటనలు చోటుచేసుకుని వుండేవో ఊహించలేం. ముందు పోలీసులే రెచ్చగొట్టే చర్యలకు దిగారని కొందరు ఆందోళనకారులు చేస్తున్న వాదన సమంజసం కాదు. అదే నిజమైతే, తమలో ఎవరూ రెచ్చిపోకుండా చూడవలసిన బాధ్యత ర్యాలీకి నాయకత్వంవహిస్తున్నవారిదే. కొన్ని రోజుల క్రితం ఉద్యమ నేతలు కూర్చున్న ప్రాంతంలోకి చొరబడి ఒక వ్యక్తి ఖలిస్తాన్ అనుకూల నినాదా లిచ్చినప్పుడు వారిలో కొందరు వెంటనే అతన్ని గుర్తించి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు కూడా అదే మాదిరి అప్రమత్తత పాటిస్తూ అవాంఛనీయ ఘటనలు జరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఎక్కువుంది. హింసకు పాల్పడిన బృందాలకు నాయకత్వంవహించిన కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ(కెఎంఎస్సీ) నేతలు తమ కమిటీలో ఎప్పుడూలేరని ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న 40కి పైగా రైతు ఉద్యమ సంస్థలకు చెందిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నాయకులు అంటున్నారు. ఇలాంటివి జరిగే అవకాశమున్నదని అంచనా వేసుకుని ఎస్కేఎం నేతలు తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ విషయంలో వారు విఫలమయ్యారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూల స్తంభాలుగా రూపొందిన రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకుని, గణతంత్ర వ్యవస్థగా ప్రకటించుకున్నరోజైన జనవరి 26 జాతి యావత్తుకూ అత్యంత ప్రాముఖ్యమైన సందర్భం. దీన్ని పురస్కరించుకుని ఏటా అత్యంత ఘనంగా త్రివిధ దళాల పాటవ ప్రదర్శన, విన్యాసాలు వుంటాయి. దేశ చరిత్ర, సంస్కృతి, వైవిధ్యత చాటేలా శకటాలను ప్రదర్శిస్తారు. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావలసివున్నా స్వదేశంలో కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఆయన విరమించుకున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా యధావిధిగా వేడుకలు జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గౌరవవందనం స్వీకరించారు. ప్రధాని మొదలుకొని మంత్రులు, అధికారులు, వివిధ పార్టీల నేతలుసహా 25,000మంది జనం ఈ పెరేడ్ను తిలకించారు. కానీ పెరేడ్ అనంతరం జరిగిన ఘటనలు ఈ వేడుకలను మసకబార్చాయి. సాధారణ దినాల్లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే ఎర్రకోట ప్రాంతానికి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి జాతీయ వేడుకల సందర్భాల్లో మరింత భద్రత వుంటుంది. అయినా కూడా ఇవి చోటుచేసుకోవటం నిఘా విభాగాల వైఫల్యమే. ఇంతవరకూ ఏ ఉద్యమమూ హింస, దౌర్జన్యాలతో విజయం సాధించిన ఉదంతాలు మన దేశంలో లేవు. స్వాతం త్రోద్యమం మొదలుకొని ఇందుకెన్నో ఉదాహరణలున్నాయి. గత నాలుగైదు నెలలుగా కేంద్రం తీసు కొచ్చిన సాగు బిల్లులపై గానీ, ఆ తర్వాత వాటిని చట్టాలుగా మార్చటంపైగానీ రైతులోకం ఆందోళన చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల రైతులు ఈ చట్టాలు రద్దు చేయాల్సిందేనని గత రెండు నెలలుగా ఢిల్లీ వెలుపల బైఠాయించి ఆందోళన సాగిస్తున్నారు. అదెంతో క్రమశిక్షణతో, సంయమనంతో సాగటం అన్ని వర్గాల ప్రశంసలూ పొందుతోంది. కానీ గణ తంత్ర దినోత్సవంనాడు చోటుచేసుకున్న ఘటనలు ఆ ఉద్యమం ఇన్నాళ్లూ సాధించుకున్న ప్రతి ష్టనూ, విశ్వసనీయతనూ దెబ్బతీశాయి. దీనిపై ఉద్యమ నేతలు సమీక్షించుకోవాలి. ప్రభుత్వం సైతం అవసరమైతే మరొక మెట్టు దిగైనా ఈ సమస్య పరిష్కారానికి పూనుకోవాలి. -
అట్టుడుకుతున్న ఢిల్లీ.. అమిత్ షా కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే రోజున రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారడంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. ఘటనపై వెంటనే సమీక్షించేందుకు ఆ శాఖ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. హోంశాఖ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులు ఈ సమావేశంలో రైతుల ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై చర్చించనున్నారు. అలాగే ఎర్రకోటపై రైతు జెండాను ఎగరేయడంపై కూడా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా హింసాత్మక ఘటనలో ఓ రైతు మృతిచెందగా.. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసుల వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బారికేడ్లు, బస్సులు, కంటైనర్లను తోసుకుంటూ ఎర్రకోట వైపు దూసుకెళ్లారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేశారు. హింసాత్మక చర్యలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను సైతం నిలుపుదల చేశారు. (ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా ) -
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
-
రణరంగంగా రాజధాని.. ఒకరు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న నిరసనతో దేశ రాజధాని నగరం రణరంగంగా మారింది. ముఖ్యంగా రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. వేలాదిగా ట్రాక్టర్లు దేశ రాజధాని వైపు తరలి రావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మంగళవారం కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేసింది. తాజాగా మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖాజీపూర్, తిక్రిత్, సింగ్ నంగ్లోయి తదితర ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. 72వ గణతంత్ర దినోత్సవంరోజు (జనవరి 26, మంగళవారం) రైతుల ట్రాక్టర్ రిపబ్లిక్ డే ర్యాలీలో ఢిల్లీ ఐటీఓ సమీపంలో ఒక నిరసనకారుడు మరణించడం మరింత ఆందోళనకు దారి తీసింది. నగరంలోకి చొచ్చుకొచ్చిన రైతులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీలు ఝళిపించారు. ఈ ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతు మృతి చెందారని రైతు ఉద్యమకారులు తెలిపారు. మృతుడిని ఉత్తరాఖండ్లోని బాజ్పూర్కు చెందిన నవనీత్ సింగ్గా గుర్తించినట్టు చెప్పారు. అయితే ట్రాక్టరు తిరగబడటంతో రైతు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. మరోవైపు బారికేడ్లు, లాఠీచార్జ్, బాష్పవాయులను దాటుకొని రైతు ఆందోళనకారులు కొంతమంది ఎర్రకోట వైపు దూసుకొచ్చి రైతు జెండాను ఎగరవేశారు. దీంతో మరోసారి పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చెరేగింది. అయితే ఎర్రకోటలోజెండా ఎగురవేయడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో రైతుల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదని రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు ర్యాలీ రూటు మార్పులో తమ పాత్ర ఏదీ లేదని సంయుక్త కిసాన్ మోర్చ నాయకులు పేర్కొన్నారు. కొంతమంది అరాచకవాదులు, అసాంఘిక శక్తులు తమ శాంతియుత ఉద్యమంలోకి చొరబడ్డాయని ఆరోపించారు. -
అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన
లక్నో: 72వ గణతంత్ర దినోత్సవం నాడు అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మంగళవారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటి.. మసీదు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. 2019 సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దాదాపు 5 ఎకరాల విస్తీరణంలో మసీదు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మాట్లాడుతూ.. మసీదు నిర్మాణ స్థలిలో భూసార పరీక్షలను ప్రారంభించామని, దానికి సంబంధించిన నివేదికలు అందగానే పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన నమూనాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే మసీదు నిర్మాణం కోసం విరాళాల సేకరణకు పిలుపునిచ్చామని, ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. గత నెలలోనే ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మసీదు నమూనాను ఆవిష్కరించిందని, సుందరమైన తోట మధ్యలో మసీదు నిర్మాణం జరుగుతుందని, మసీదు నిర్మాణంపై భారీ గాజు గోపురం కలిగివుంటుందని ఆయన వివరించారు. మసీదు వెనుక భాగంలో అత్యాధునిక డిజైన్తో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. మసీదు పేరును ఇంకా ఖరారు చేయలేదని, త్వరలోనే ట్రస్ట్ సభ్యులందరూ సమావేశమై మసీదు పేరును నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, మసీదు నిర్మించబోయే స్థలం.. రామ జన్మభూమిలోని రామ మందిర నిర్మాణ స్థలికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామమందిరం, మసీదు రెండూ ఒకే జిల్లాలో ఉండటం విశేషం. -
వాళ్లను ఉరితీసింది ఇక్కడే!
పూనా ఒప్పందం జరిగింది ఎప్పుడు జరిగింది? 1932లో. ఆ ఒప్పందం మీద సంతకం చేసింది ఎవరు? మహాత్మా గాంధీ– బాబా సాహెబ్ అంబేద్కర్. ఆ ఒప్పందం ఎక్కడ జరిగింది? ఇదీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన సమాచారం. ఆ ఒప్పందం యరవాడ సెంట్రల్ జైల్లో జరిగింది. ఆ రోజున మహాత్మా గాంధీజీ– అంబేద్కర్ ఏ చెట్టు కింద అయితే కూర్చుని ఒప్పందం మీద సంతకం చేశారో... ఆ చెట్టు జైలు ప్రాంగణంలో ఇప్పటికీ ఉంది. అలాగే గాంధీజీ, లోకమాన్య బాలగంగాధర తిలక్ శిక్ష అనుభవించిన జైలు వార్డులు కూడా నాటి స్వాతంత్య్ర సమరానికి మౌన సాక్షులుగా నిలిచి ఉన్నాయి. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మోతీ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ భరత మాత సంకెళ్లు తెంచే యజ్ఞంలో అరెస్టయి ఇదే జైల్లో శిక్షను అనుభవించారు. చాపేకర్ సోదరుల ఉరితీత ఇక్కడే. అంతేకాదు.. 2008, ముంబయి అల్లర్లకు పాల్పడిన ఉగ్రవాది కసబ్ను ఉరి తీసింది కూడా ఇక్కడే. జైలు... అనగానే నేరగాళ్లు శిక్ష అనుభవించే ప్రదేశంగానే చూస్తున్నాం. నిజానికి యరవాడ జైలు దేశ చరిత్రను అవగతం చేసే ప్రాంగణం. అసలే... ఈ తరం విద్యార్థులకు చరిత్ర పాఠాలు పెద్దగా తలకెక్కడం లేదు. ఇక్కడ పర్యటిస్తే స్వాతంత్య్ర సమరం కళ్లకు కడుతుంది. అందుకే స్కూలు, కాలేజ్ విద్యార్థుల కోసం ‘జైలు పర్యటన’కు తలుపులు తెరిచింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా జైల్ టూరిజాన్ని ప్రారంభించనుంది. రోజుకు యాభైమందిని మాత్రమే అనుమతిస్తారు. ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జైలు పర్యటనకు వచ్చిన విద్యార్థులకు గైడ్లుగా జైలు సెక్యూరిటి గార్డులు వ్యవహరిస్తారు.(చదవండి: మీ భంగిమలను ఇలా చెక్ చేసుకోండి!)