నేడు జిల్లాలో హరీష్రావు పర్యటన
Published Fri, Sep 16 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్రావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకున్న తర్వాత ఆయన హన్మకొండ మండలం పలివేల్పులలో హరితహారం మొక్కలు నాటనున్నారు. 11 నుంచి 2 గం టల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement