harishrao
-
గ్యారెంటీలలోనే కాంగ్రెస్ సమాధి: హరీశ్రావు
సాక్షి,సిద్దిపేట:సన్నవడ్లు అమ్ముకున్న రైతులకు రెండు నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.ఈ విషయమై హరీశ్రావు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఆదివారం(ఫిబ్రవరి 9) బహిరంగ లేఖ రాశారు. ‘అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసింది. రూ2 లక్షల రుణమాఫీ,రైతు భరోసాను మోసం చేశారు.వరంగల్ రైతు డిక్లరేషన్ను తుంగులో తొక్కారు.రుణమాఫీ,రైతు భరోసా,వడ్ల బోనస్ పైసలు కూడా ఇవ్వలేదు. ఇక రైతులు రెండో పంట ఎలా వేస్తారు.బోనస్ ఇంకా రూ. 432 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు.ఉత్తమ్కుమార్రెడ్డి మాటలు,ఉత్తర మాటలు అయ్యాయి.చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పైన ఎందుకు మాట్లాడతావ్. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి.రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు. కంది రైతుల మీద ఎందుకు పగ మీకు.క్రాప్ బుకింగ్లో మిస్సయిన రైతులకు అనుమతి ఇవ్వండి.రేవంత్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి.విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.కాంగ్రెస్ కోతల ప్రభుత్వం. ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతదా.సీఎం ఇచ్చిన రూ 250 కోట్ల రూపాయల చెక్కు ఎందుకు పడడం లేదు.ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా.కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు.ప్రభుత్వం మోసం చేసిందని అన్ని గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు.తాను తవ్వుకున్న గ్యారంటీల సమాధిలోనే కాంగ్రెస్ సమాధి అవుతుంది.ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ను గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంతా పాలన,కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన.మాది అసలు పాలన మీది కొసరు పాలన.సంతృప్తి, సంక్షేమం బిఆర్ఎస్ పాలన,సంక్షోభం,అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం’అని హరీశ్రావు మండిపడ్డారు. -
ఆదిలాబాద్లో రైతు ఆత్మహత్య.. హరీశ్రావు కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి హరీశ్రావు స్పందించారు. రైతు మామిళ్ల నర్సయ్య ఆత్మహత్యపై హరీశ్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్రావు శనివారం(జనవరి25)ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నడు. అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నది. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న సీఎం రేవంత్రెడ్డి అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదాం. అధైర్య పడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’అని హరీశ్రావు తెలిపారు. -
ఇదేనా సో కాల్డ్ ప్రజాపాలన: హరీశ్రావు సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇది ప్రజాపాలన కాదు,నిర్బంధ పాలన అన్నారు. ఈ విషయమై హరీశ్రావు సోమవారం(జనవరి20) మీడియాతో మాట్లాడారు.‘ఆంక్షలు,కంచెలు,అరెస్టులు,నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యమయ్యాయి. అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూల్ జిల్లా,మైలారంలో మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరగోపాల్ను అరెస్టు చేయడం అమానుషం.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా పాలన,ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి,ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ..ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన. ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు,ఆంక్షలు,అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే,రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలి’అని హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కేసీఆర్, హరీశ్రావులకు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్(kcr), మాజీ మంత్రి హరీశ్రావు(HarishRao)కు తెలంగాణ హైకోర్టులో మంగళవారం(డిసెంబర్24) ఊరట లభించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంలో తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, మేడిగడ్డ(Medigadda) బ్యారేజీలో పగుళ్లకు కేసీఆర్,హరీశ్రావే కారణమని భూపాలపల్లి కోర్టు(Bhupalapalli Court)లో స్థానిక న్యాయవాది ఒకరు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన భూపాలపల్లి సివిల్ కోర్టు కేసీఆర్,హరీశ్రావులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను క్వాష్ చేయాల్సిందిగా కేసీఆర్,హరీశ్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు భూపాలపల్లి కోర్టు నోటీసులపై కేసీఆర్,హరీశ్రావులకు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారునికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కేటీఆర్ తొలి విజయం సాధించారు: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసుల కేసు వ్యవహారంలో సీఎం రేవంత్రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి,బీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావు విమర్శించారు. శుక్రవారం(డిసెంబర్ 20) హరీశ్రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాం.రేవంత్ అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టు చేయవద్దని హైకోర్టు చెప్పింది. ఇది డొల్ల కేసు అని హైకోర్టు చెప్పింది. ఈ కార్ రేసుల వల్ల తెలంగాణకు లాభం జరిగింది.రూ.600 కోట్ల నష్టం కాదు..రూ.600 కోట్ల లాభం జరిగింది. అవినీతి జరగలేదని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినప్పుడు ఇక ఏసీబీ కేసు ఎందుకు. హామీలపై ప్రజల దృష్టిని మరల్చి జిమ్మిక్కులు చేస్తున్నారు’అని హరీశ్రావు మండిపడ్డారు. కాగా, ఫార్ములా ఈ కార్ రేసుల కేసులో ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏ1 చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో కేటీఆర్ కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో హైకోర్టు కేటీఆర్కు ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. -
రేవంత్కు అదానీతో ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్:రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోందని, అదానీతో ఆయన ఢిల్లీలో దోస్తీ,గల్లీలో కుస్తీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ిమర్శించారు. బుధవారం(డిసెంబర్ 18) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.‘రాజ్ భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు. మేము అదానీ ఫొటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న 12 వేల కోట్ల రూపాయల ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. అదానీపై రేవంత్ పోరాటం నిజమైతే ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకోవడం లేదు. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రేవంత్ అనుమతులు ఇస్తున్నారు. అదానీకి రేవంత్ కొమ్ముకాస్తున్నారు.రోడ్డుపై రేవంత్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారు.రేవంత్ అదానీకి ఏజెంట్లా పని చేస్తున్నారు.అదానీకి రెడ్కార్పెట్ వేసి తెలంగాణ పరువును రాహుల్ గాంధీ పరువును రేవంత్ రెడ్డి మంటకలిపారు. రేపు అసెంబ్లీలో అదానీ,రేవంత్రెడ్డి లింకుపై చర్చ పెట్టాలి. రాజ్ భవన్ ముట్టడిలో అదానీ గురించి రేవంత్ మాట్లాడలేదు. రేవంత్రెడ్డిని పార్టీ తిడితే 100 కోట్లు అదానీకి వాపస్ ఇచ్చారు.చట్టం అందరికీ సమానం అయితే రోడ్డుపై ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలపై సీవీ ఆనంద్ కేసులు పెట్టాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు.మీడియాతో చిట్చాట్లో హరీశ్రావు కామెంట్స్..సీఎం ప్రకటన చేస్తే అమలు చేయాలి కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు..నవంబర్ 30 న 3 లక్షల 13 వేల మంది రైతులకు రెండో సారి రుణ మాఫీ చేసున్నం అన్నాడుఇంత వరకు 3 లక్షల 13 మంది రైతులకు 2474 కోట్లు ఖాతాలో పడలేదు19 నవంబర్ వరంగల్ స్వయం సంఘాల ఖాతాల్లో నగదు పడలేదుఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరిలో రూ.281 పీఆర్సీ బకాయిలు కూడా జమ కాలేదుఅది చివరకు ఆర్టీసీ సంస్థనే మళ్ళీ వారి ఖాతాలో వేసిందిలక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తాం అని చాలా సార్లు చెప్పారు.కానీ ఇదో పెద్ద బోగస్ అని తేలిపోయింది.2015లోనే బీఆర్ఎస్ 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చినం..ఇప్పుడు కాంగ్రెస్ ఇదే ఇస్తోంది.రూ.5 లక్షల వరకు మాత్రమే వడ్డీలేని రుణాలు. మిగత వాటికి వడ్డీ కట్టాల్సిందే.లక్ష కోట్లు అని చెప్పింది అంత అబద్ధంఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ ఒక్కటీ ఇవ్వడం లేదుతులం బంగారంలేదు,స్కూటీ లేదు,న్యూట్రిషన్ కిట్ లేదుఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు.అన్ని ఉత్త మాటలేబతుకమ్మ చీరలు లేవురూల్స్ ప్రకారం సభను నడపడం లేదు.నాడు భట్టి,శ్రీధర్ బాబు ప్లకార్డులు పట్టుకోలేదా..ఇవాళ ఇదేం న్యాయం.పార్లమెంట్ లో మాత్రం ప్రియాంక గాంధీ రోజు ఒక బ్యాగ్ వేసుకోవచ్చు,రాహుల్ గాంధీ రోజు టీ షర్ట్ వేసుకోవచ్చు -
‘చాయ్ బిస్కట్’ సమావేశాలు కాదు: హరీశ్రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎన్ని రోజులు సభ నడుపుతారో క్లారిటీ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసినట్లు బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. బీఏసీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని ఎద్దేవా చేశారు.‘అసెంబ్లీ సమావేశాలపై ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం.ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. రేపు లగచర్ల అంశంపై చర్చకు బీఅర్ఎస్ పట్టు పట్టింది. ఒక రోజు ప్రభుత్వానికి,మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాల కీలకం.కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే.బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హౌస్ కమీటీ ఏర్పాటుచేయాలి. బీఏసీపైన తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసకుంటారని స్పీకర్ను అడిగాం. బీఏసీలో లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశాం’అని హరీశ్రావు చెప్పారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగి సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. -
రేవంత్కు మాటలెక్కువ..పని తక్కువ: హరీశ్రావు
సాక్షి,మహబూబ్నగర్:రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాలకుడు ప్రజలను మోసం చేయకుండా చేయాలని కురుమూర్తి స్వామిని కోరుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం(నవంబర్ 20) హరీశ్రావు మహబూబ్నగర్లోని కురుమూర్తిస్వామిని దర్శించుకున్నారు.‘కురుమూర్తి స్వామి సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసగించారు.రేవంత్రెడ్డికి పని తక్కువ మాటలెక్కువ. ఆయనకు సీఎం కేసీఆర్ భయం పట్టుకుంది. పాలకుడే మాటతప్పితే రాజ్యానికి అరిష్టం. రాష్ట్రంలో సగానికి పైగా మంది రైతులకు రుణమాఫీ చేయలేదు.వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్క గ్యారెంటీపైన ప్రకటన చేయని సీఎం వరంగల్లో కేసీఆర్ మీద తిట్ల పురాణం పెట్టాడు. రేవంత్కు తెలిసింది ఒట్లు లేకుంటే తిట్లు. రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారు. అబద్దాలు,మోసం చేయడం సీఎం రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది. ప్రతిపక్షాల మీద పగ..రైతులు,ప్రజలకు దగా..తప్ప రేవంత్ చేసిందేమీ లేదు. రేవంత్రెడ్డి వచ్చాకా బీ ట్యాక్స్ వచ్చింది.బిల్లుల చెల్లింపులకు కమిషన్లు వసూలు చేస్తున్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేసేంత వరకు రేవంత్ మెడలు వంచుతాం. ఏడాది పాలనలో ఒక్క ఇల్లు నిర్మించలేదు.మూడునాలుగు నెలలు పనులు చేయిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయి రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది.66 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీలు పాలమూరు జిల్లాను దగా చేశాయి. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశాడు.గత పాలనలో ఇచ్చిన పథకాలను రేవంత్ ఎగ్గొడుతున్నాడు.కేసీఆర్ కలుపు మొక్కకాదు..కల్ప వృక్షం.రేవంత్రెడ్డి గురించి ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి.రియల్ఎస్టేటను కుప్పకూల్చాడు’అని హరీశ్రావు ఫైరయ్యారు. -
లిక్కర్ అమ్మకాలపై రేవంత్రెడ్డికి ప్రేమ ఎక్కువైంది: హరీశ్రావు
సాక్షి,నల్గొండజిల్లా: ాన్యం సకాలంలో కొనుగోలు చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.నల్గొండ జిల్లాలోని మర్రిగూడలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని హరీశ్రావు బుధవారం(నవంబర్ 13) పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘రైతులు రూ.1800లకు క్వింటాల్ చొప్పున ధాన్యం దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రైతుల ధాన్యం లోడ్ ఎత్తమంటే మహారాష్ట్రకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నాడు ముఖ్యమంత్రి. ధాన్యానికి మద్దతుధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేశారు.కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా తరుగు పేరుతో రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు.ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో ఒక కిలో సన్న ధాన్యాన్ని కొనలేదు.ముఖ్యమంత్రికి మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది.మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారు.25 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేశారు.తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.మహిళల పుస్తెలు తెంపుతున్నారు.రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసావ్.రేవంత్రెడ్డి రాజ్యంలో రైతులు దుఃఖపడుతున్నాడు.ధాన్యం కొనుగోలులోనే కాదు పత్తి కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 15000 రూపాయల రైతుబంధు రైతులకు వెంటనే ఇవ్వాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: మంత్రి కోమటిరెడ్డి -
సీఎం రేవంత్ మహారాష్ట్రలో చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్:హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు సవాల్ విసిరారు.ఆదివారం(నవంబర్ 10) తెలంగాణభవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.‘మహారాష్ట్రలో కూడా సీఎం రేవంత్ అబద్ధాలాడుతున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతుకైనా బోనస్ వచ్చిందా. రైతుబంధు ఇవ్వడం లేదని రేవంత్రెడ్డి మహారాష్ట్రలో ఎందుకు చెప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలి.రేవంత్రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ అయిందని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కట్టలేదు.ఉన్న ఇళ్లు కూలగొట్టింది’అని హరీశ్రావు విమర్శించారు.ఇదీ చదవండి: ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణలో బతుకులు చీలికలు పీలికలే: కేటీఆర్ -
రాహుల్.. ‘శోక్’నగర్కు వెళ్లండి: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీశ్రావు ఫైరయ్యారు.ఈ మేరకు హరీశ్రావు మంగళవారం(నవంబర్ 5) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించింది.రాహుల్ గాంధీ మీరు సందర్శిస్తున్న ప్రదేశంలోనే విద్యార్థులను మీ ‘ప్రజా సర్కార్’ కొట్టిందని మీకు తెలుసా? వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం కూడా భర్తీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చారు. అలాగే జాబ్ క్యాలెండర్ను ఉద్యోగం లేని క్యాలెండర్గా మార్చితే సరిపోయేది.యువ వికాసం కింద రూ.5 లక్షల హామీ ఖాళీ గ్యారెంటీగా మారడంతో తెలంగాణ యువతకు అభద్రతాభావం ఏర్పడింది.అశోక్ నగర్ని మళ్లీ సందర్శించండి.కాంగ్రెస్ ప్రభుత్వం అశోక్ నగర్ ను 'శోక్ నగర్’గా ఎలా మార్చిందో కళ్లారా చూడండి’అని హరీశ్రావు రాహుల్ హైదరాబాద్ పర్యటనపై సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: రాహుల్ రెండు గంటల పర్యటన -
సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైర్లు
సాక్షి,కరీంనగర్జిల్లా: ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాల్సిందేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం(అక్టోబర్20) తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు.‘కాంగ్రెస్ వాళ్లు మోసపూరితంగా అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ప్రజలను గోస పెడుతున్నారు. కరోనా సమయంలోనూ రైతులకు రైతుబంధు పడాలన్న ఆశయంతో నడిచింది కేసీఆర్ ప్రభుత్వం.రూ.10వేలు వద్దు..రూ.15వేలు ఇస్తా అన్న రేవంత్ ఏం చేస్తున్నాడు.రేవంత్ రైతు వ్యతిరేకి. యాసంగికైనా రైతుబంధు కావాలంటే అందరూ సంఘటితం కావాలి.ఆరు గ్యారెంటీ పథకాలు ఏమయ్యాయి రేవంత్. ఫించన్లో కూడా దగా చేస్తుండు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ కాదు చీటింగ్ మ్యాన్. బోనస్ ఇస్తా అంటివి..ఏడపోయింది? దేవుడి మీద ఒట్టు పెట్టి రాజకీయం చేసే నాయకుడిని ఇప్పటి వరకు నేను చూడలేదు.రేవంత్ రెడ్డి చేసిన పాపాలకు ప్రజల్ని కాపాడు అని లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వెళితే నాపై కేసు పెట్టారు. నిరుద్యోగులను దేశ ద్రోహుల్లా చూస్తున్నారు.2లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి ఏమయ్యాయి. జీఓ 29 రద్దు చేయడమే గ్రూప్ 1 సమస్యకు పరిష్కారం.రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్న రాహుల్ గాంధీ ఏడబోయిండు.?ఎన్నికల ముందు వచ్చిన గాంధీలు ఏడబోయారు’అని హరీశ్రావు ప్రశ్నించారు. ఇదీ చదవండి: రేవంత్ నువ్వు రాహుల్ కాంగ్రెస్లో లేవా -
కేటీఆర్,హరీశ్రావులకు సీతక్క కౌంటర్
సాక్షి,హైదరాబాద్:కేటీఆర్,హరీశ్రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రియల్ఎస్టేట్ చేస్తున్నారన్న కేటీఆర్,హరీశ్రావు వ్యాఖ్యలపై సీతక్క అక్టోబర్ 18(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ పేరుతో కేటీఆర్ ప్లాట్లు అమ్ముకున్నారు. అప్పుడు ఫ్లాట్లు అమ్ముకోవడం వల్లే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ పునర్జీవనం అని మాట్లాడినటువంటి హరీశ్రావు అది ఎక్కడ చేశారో చెప్పాలి.హరీష్ రావు ఏ చెరువుకు పునర్జీవనం పోశారో చూపించాలి. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.సీఎం రేవంత్ ఏం చూపించినా ఏం చేసినా పేదల కోసమే ఆలోచిస్తారు’అని సీతక్క అన్నారు.ఇదీ చదవండి: సెక్యూరిటీ లేకుండా రండి: హరీశ్రావు సవాల్ -
TG: ప్రభుత్వంపై హరీశ్రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:ఉన్న పథకాలు బంద్ పెట్టడమే తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్లో బుధవారం(అక్టోబర్ 16) మీడియాతో హరీశ్రావు చిట్చాట్గా మాట్లాడారు.‘ఒక చీర కాదు..రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు.దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సహపరిచింది.రూ.15వేలు రైతుబంధు అన్నాడు..గుండు సున్నా చేశాడు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడు.ముదిరాజ్,గంగపుత్రులంటే సీఎం రేవంత్కు చిన్నచూపు.ఆగస్టులో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదు.మేం రూ. 100కోట్లు ఖర్చు చేస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్లో పెట్టిందే రూ.16కోట్లు.ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు’అని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా -
కేటీఆర్,హరీశ్రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,నల్గొండజిల్లా:కేసీఅర్ ఫామ్హౌస్లో పడుకుంటే కేటీఆర్,హరీష్రావు అనే పిల్లలు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని గందంవారి గూడెంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు కోమటిరెడ్డి శుక్రవారం(అక్టోబర్11) శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ‘నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ పదో తరగతి చదువుతున్నాడు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. పదేళ్లలో తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేశాడు.రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే మాఫీ చేస్తాం. రెండేళ్లలో ఎస్ఎల్బీసీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తానని కేసీఆర్ మాట తప్పాడు. కేసీఆర్ మాటల్ని మేం నిజం చేస్తున్నాం. వైఎస్సార్ హయాంలో ఇచ్చినట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం’అని కోమటిరెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: ఆశపెట్టి నిరుద్యోగితో ఆడుకున్నారు -
పరువునష్టం దావాకు సిద్ధం కండి: హరీశ్రావు వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: తనపై తప్పుడు ఆరోపణలు, బురద జల్లే ప్రయత్నాలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసినవారు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని సోమవారం(సెప్టెంబర్30) ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టులో హెచ్చరించారు.‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న నా పై బురద చల్లె వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత ను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లున్నారు.గోల్కొండ కోట, చార్మినార్లో కూడా హరీశ్రావుకు వాటాలు ఉన్నాయి అని అంటారేమో?అబ్బద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నా.బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’అని హరీశ్రావు ట్వీట్లో పేర్కొన్నారు.కాగా, ఆనంద కన్వెన్షన్ సెంటర్లో హరీశ్రావుకు వాటాలున్నాయని, దానిని కూల్చకుండా అడ్డుకోవడానికే పేద ప్రజలను అడ్డం పెట్టుకుని వారిని రెచ్చగొడుతున్నారని రాజ్యసభ ఎంపీ అనిల్యాదవ్ ఎక్స్లో పోస్టు చేశారు. దీనికి కౌంటర్గా హరీశ్రావు పరువునష్టం దావా పోస్టు పెట్టారు. -
TG: ప్రభుత్వానికి హరీశ్రావు డెడ్లైన్
సాక్షి,సిద్ధిపేటజిల్లా:రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్రావు డెడ్లైన్ విధించారు.దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం(సెప్టెంబర్27) సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రైతులతో కలిసి హైదరాబాద్లోని సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఇదీచదవండి: నిజాం కన్నా దుర్గార్గుడు సీఎం రేవంత్: ఈటల -
‘ఎల్ఓపీ’ సీటు కోసం కేటీఆర్, హరీశ్ ఫైట్: విప్ ఐలయ్య
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షహోదా కోసం బావబామ్మర్దులు హరీశ్రావు,కేటీఆర్ కొట్టుకుంటున్నారని ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. సోమవారం(సెప్టెంబర్23) ఐలయ్య మీడియాతో చిట్చాట్ మాట్లాడారు.‘కేసీఆర్ రైతులను ముంచాడు.హరీష్ డెయిరీలను నాశనం చేశాడు.ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం బావబామ్మర్ధులు కొట్టుకుంటున్నారు. ప్రజారోగ్యంపై కేటీఆర్ కమిటీ వేయడం సిగ్గుమాలిన పని.ప్రజాపాలనకి వస్తున్న ఆదరణ చూసి రంగా,బిల్లాలు ఓర్వలేకపోతున్నారు.గాంధీ హాస్పిటల్ సిబ్బంది మనోధైర్యం దెబ్బతీసేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.పడేండ్లలో ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ గురించి ఆలోచించారా? డీప్యూటీ సీఎం గా పనికిరాని రాజయ్య ఈరోజు అవసరం వచ్చారా? దళితున్ని ముందు పెట్టి డ్రామాలాడుతున్నారు. పదేండ్లలో ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోయారు?స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారు.హరీశ్రావు డెయిరీ కోసం విజయ డైరీ,మదర్ డైరీని గత పదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారు.గత పదేళ్లలో డెయిరీల్లో బీఆర్ఎస్ నాయకులు పంది కొక్కుల్లా మెక్కారు.డెయిరీల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపిస్తాం’అని తెలిపారు.ఇదీ చదవండి.. హైడ్రా పేరుతో హైడ్రామాలు: హరీశ్రావు -
‘పొన్నం’కు అవగాహన లేదు: హరీశ్రావు
సాక్షి,సిద్దిపేటజిల్లా: తనను విమర్శించే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహనారాహిత్యం బయటపడిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రాజెక్టుపై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం వృథా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందని హరీశ్రావు పునరుద్ఘాటించారు. కాగా, శనివారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ హరీశ్రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. దీనికి హరీశ్రావు కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి.. హరీశ్హార్డ్వర్కర్.. మాకు సలహాలివ్వొచ్చు: పొన్నం ప్రభాకర్ -
27న సిద్దిపేటలో బీఆర్ఎస్ రైతుధర్నా
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో రైతన్నకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది.రుణమాఫీ,రైతు బంధు,పంట బోనస్ కోసం రైతుధర్నా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయనుంది.సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం నాడు సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి హరీశ్రావు తెలిపారు.రైతు ధర్నాకు పెద్ద ఎత్తున కదిలి రావాలని రైతన్నలకు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టబోమని చ్చరించారు.రైతు ధర్నాపై హరీశ్రావు శనివారం(సెప్టెంబర్21) రైతులు,పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదీ చదవండి.. హరీశ్ హార్డ్వర్కర్..సలహాలివ్వొచ్చు: మంత్రి పొన్నం -
నెల జీతం విరాళంగా ఇస్తాం: హరీశ్రావు
సాక్షి,సిద్దిపేట: కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీల అందరి నెల జీతం వరద బాధితులకు ఇస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ల నెల జీతం కూడా ఇస్తామని చెప్పారు. ‘ఖమ్మం వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలి. సిద్దిపేట మున్సిపల్ కమిషర్ రూ.11 వేల విరాళం ఇచ్చారు. రేపు సిద్దిపేట నుంచి వెళ్లే సరుకులను ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తాం. 6 లారీల్లో ఖమ్మంకు సరుకులను పంపుతున్నాం. రాష్ట్రంలో వరదలు వచ్చాయి. నేను ఖమ్మం వెళ్ళాను. వరద బాధితులు 24 గంటలు నీటిలో ఉన్నారు. వాళ్ళను చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. వాళ్లకు ఏమి లేవు. అన్నీ కొట్టుకుపోయాయి. వాళ్లకు మన సిద్దిపేట నుంచి 500 గ్రాసరి కిట్లు పంపించడానికి అమర్ నాథ్ సేవా సమితి ముందుకు వచ్చింది. అమర్నాథ్ సేవా సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సిద్దిపేట నిలయం. చెరువులను కాపాడం మన అందరి బాధ్యత. ఆకర్షణ కన్నా ఆధ్యాత్మికత ముఖ్యం..మట్టి వినాయకులను పూజిద్దాం’అని హరీశ్రావు పిలుపునిచ్చారు. -
రుణమాఫీపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్కు హరీశ్రావు సవాల్
సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణలో ఏ ఊరికైనా వెళ్లి రుణమాఫీ జరిగిందా లేదా అనే చర్చ పెడదాం. సంపూర్ణ రుణమాఫీ అయిందని తేలితే నేను దేనికైనా సిద్ధం. నా సవాల్కు సీఎం రేవంత్రెడ్డి సిద్ధమేనా’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు సవాల్ విసిరారు. తెలంగాణభవన్లో శనివారం(ఆగస్టు17) జరిగిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. ‘రూ.31 వేల కోట్లని చెప్పి రూ.17 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టారు. రూ.14 వేల కోట్లు కోత పెట్టారు. రైతులను నిట్టనిలువునా ముంచారు. పంచపాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ ఉంది’అని హరీశ్రావు ఫైర్ అయ్యారు. హరీశ్రావు ప్రెస్మీట్ ముఖ్యాంశాలు.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం.. కుల్లం కుల్లా రైతులను అడుగుదాంసిద్దిపేట మండలం తడకపల్లిలో రుణమాఫీకి అర్హులు 720 మంది రైతులు కాగా.. రుణమాఫీ అయ్యిందికేవలం 350 మంది రైతులకేరుణమాఫీ పై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు లక్షా 16 వేల 460 మంది రైతులు ఫిర్యాదు చేశారుమాట తప్పింది రేవంత్రెడ్డినాడు కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారురేవంత్ నాడు మాట నిలబెట్టుకున్నారా ? రైతుల నెత్తిన టోపీ పెడుతున్నారు రేవంత్ రెడ్డిఅధికారం దక్కించుకోవడానికి మోసం.. వచ్చిన అధికారం కాపాడుకోవడానికి రేవంత్ మోసం చేస్తున్నారు ఆగష్టు 20వ తేది వచ్చింది ఇప్పటి వరకు రైతు భరోసా పై నిర్ణయం తీసుకోలేదు రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి రుణ మాఫీ సగం చేశారు రుణ మాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలినీటి పారుదల, అప్పుల మీద శ్వేత పత్రాలు పెట్టిన రేవంత్రెడ్డి.. రుణ మాఫీ పై ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయడం లేదుసాక్షి పత్రికలో వచ్చిన రుణం తీరలే అన్న వార్త కథనాన్ని చూపిన హరీష్ రావురేవంత్ రెడ్డి పరిపాలన లో ప్లాప్ తొండి చేయడంలో తోపుబూతులు తిట్టడంలో టాప్ రంకెలు వేస్తే అంకెలు మారిపోవు పాలకుడిగా రేవంత్ రెడ్డి పాపాలు మూట కట్టుకున్నారు దేవుళ్ళ మీద ఒట్ట్లు పెట్టారు.. తెలంగాణ ప్రజలకు శాపం కావొద్దని కోరుకుంటున్న అన్ని దేవాలయాల దగ్గరకు వెళ్ళి తెలంగాణ ప్రజలకు పాపం తగలవద్దని కోరుకుంటున్న దేవుళ్ళను పాపాల రేవంత్ రెడ్డిని క్షమించమని కోరుకుంటా ముఖ్యమంత్రి నన్ను తాటిచెట్టులా పెరిగావని నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు రుణ మాఫీ పై రేవంత్ ది ప్లాప్ షో భౌతిక దాడులకు పురి గొల్పుతున్నారు రేవంత్ గాడ్ ఫాదర్లకే భయపడలేదు చావాలని కోరుకుంటున్న వారు.. రేపు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారేమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు రైతుల పక్షాన పోరాటం చేస్తాం రుణ మాఫీ పై బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం త్వరలో ప్రకటన చేస్తాం -
కాంగ్రెస్VSబీఆర్ఎస్..సిద్దిపేటలో హైటెన్షన్
సాక్షి,హైదరాబాద్: సిద్దిపేట పట్టణంలో శనివారం(ఆగస్టు17) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యే హరీశ్రావు క్యాంపు ఆఫీసుపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. దాడిని నిరసిస్తూ క్యాంప్ఆఫీస్ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. హరీశ్రావుపై వెలసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చింపివేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోటీగా నగరంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ హై టెన్షన్కు దారితీసింది.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ హై టెన్షన్కు దారితీస్తోంది. దీంతో పట్టణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్పై హరీశ్రావు ఫైర్..తన సిద్దిపేట క్యాంప్ఆఫీస్పై శుక్రవారం(ఆగస్టు16) అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఈ మేరకు శనివారం హరీశ్రావు ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని, వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
రాజీనామా ఏది..? హరీశ్రావుపై వెలసిన ఫ్లెక్సీలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్రావుపై హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ ఫ్లెక్సీల్లో హరీశ్రావును ప్రశ్నించారు. ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేర్లున్నాయి. కాగా, ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో హరీశ్రావు ప్రకటించారు. తుదివిడత రూ.2 లక్షల రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా హరీష్రావు రాజీనామా అంశాన్ని సీఎం రేవంత్రెడ్డి గురువారం వైరా సభలో ప్రస్తావించారు. మొత్తం 3 విడతల్లో రూ. 2లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కుక్కలదాడి ఘటనలపై హరీశ్రావు కీలక ట్వీట్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా కుక్కల దాడి ఘటనలు జరిగినా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ మేరకు శనివారం(ఆగస్టు 10) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘బతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతిన్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గం. కుక్క కాటు కేసులు నమోదైన వెంటనే తగిన చర్యలు తీసుకొని ఉంటే రాష్ట్రంలో గడిచిన 8 నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఇప్పటికే ఈ విషయంలో పలుమార్లు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రభుత్వం వెంటనే కుక్కల దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
కేసీఆర్, హరీశ్రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు
సాక్షి,భూపాలపల్లి: బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు సోమవారం(ఆగస్టు5) నోటీసులు జారీ చేసింది. కేసీఆర్తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులు సెప్టెంబరు 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు వారందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్ను భూపాలపల్లి కోర్టు విచారించింది. అనంతరం కేసీఆర్, హరీశ్రావులకు నోటీసులిచ్చింది. -
సీఎం రేవంత్పై ప్రివిలేజ్ మోషన్: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. సోమవారం(జులై 29) అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ‘గవర్నమెంట్ డిఫెన్స్లో పడినప్పుడు సీఎం ఏదో పేపర్ పట్టుకొని సభలోకి వచ్చి డైవర్ట్ చేస్తున్నారు. సభా నాయకుడు మిస్ లీడ్ చేస్తున్నారు. మోటార్లకు మీటర్ల అంశంలో మెటీరియల్లో అదర్ దేన్ అగ్రికల్చర్ మీటర్స్ అనే పదాలను కావాలని ఎగరగొట్టి చదివారు. అప్పులు 7 లక్షల కోట్లు అని తప్పుగా చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయలేదని చెప్పే ప్రయత్నం నేను చేస్తుండగా... మోటర్లకు మీటర్లు పెట్టడానికి సంతకం చేశారని రేవంత్ లేచి సభను మిస్ లీడ్ చేశారు.దబాయింపు చర్యలకు సీఎం పాల్పడుతున్నారు. ఇండియా కూటమి 28 పార్టీల కలయికతో కాంగ్రెస్కు ఆ మాత్రం ఎంపీ సీట్లు వచ్చాయి. 28 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కు 21 శాతం ఓట్లు వచ్చాయి. రేవంత్ పనితీరు బాగోలేకపోవడంతోనే మహబూబ్ నగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి పార్లమెంట్లో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రేవంత్ సొంత జిల్లాలో లోకల్ బాడి ఎమ్మెల్సీ స్థానం కూడా ఓడిపోయారు.గతంలో 20 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాలేదా ? చీమలు పెట్టిన పుట్టలో పాము దురినట్లు రేవంత్ కాంగ్రెస్లతో చేరి సీఎం అయ్యారు. అసలు కాంగ్రెస్లో హనుమంత్ రావు లాంటి నేతలు ఏమయ్యారు ? జైపాల్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వలేదు’అని హరీశ్రావు అన్నారు. -
బడ్జెట్లో తెలంగాణకు గుండుసున్నా: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదని, కాంగ్రెస్,బీజేపీ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మంగళవారం(జులై 23) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో వెనుకబడిన జిల్లాలపై కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు. కిషన్రెడ్డి,బండి సంజయ్ ఏం చేస్తున్నారు ? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ లేదు. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసింది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా’అని హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కనీసం 15 రోజులు జరపాలని కోరితే ప్రభుత్వం దానిని కేవలం 4 రోజులకు కుదించిందని మండిపడ్డారు. తమ హయాంలో బడ్జెట్ సమావేశాలు 9 రోజులు నిర్వహించి డిమాండ్లపైనా చర్చించేవాళ్లమని గుర్తుచేశారు. -
‘రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన రైతు బోజడ్డ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి చనిపోతున్నానని చెప్పాడని, సీఎం పేరు ప్రస్తావిస్తూ రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.ప్రభాకర్ ఆత్మహత్య కారకులను వదిలేసి, వీడియో తీసినవారిపై కేసు పెట్టడం విడ్డూరమన్నారు హరీష్రావు. ప్రభాకర్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్రావు.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అదే సమయంలో ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలన్నారు.రైతు ఆత్మహత్యపై స్పందించిన సీఎం రేవంత్రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్(ట్విటర్)లో హరీశ్రావు ట్వీట్ చేశారు.‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
Ts: ప్రభుత్వానిది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్పేపర్: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించబోని బీఆర్ఎస్ చెప్పించిందని, ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియాపాయింట్లో హరీశ్రావు మాట్లాడారు. తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో కేఆర్ఎంబీపై ప్రభుత్వం తీర్మానం చేసిందని చెప్పారు. ‘ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై నిలదీశాం. ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వారి ప్రెజెంటేషన్లన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయి. మేము కూడా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నం. మీడియా ప్రచారం చేయాలి. వాస్తవాలు తెలియజేయాలి.మీరు చెప్పింది తప్పు అని ప్రొటెస్ట్ చెప్తామంటే వినడం లేదు. కాగ్ పనికి రాదు అని మేము అనలేదు. మాజీ ప్రధాని మీ మన్మోహన్ సింగ్ గారే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వైఎస్రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కాగ్ను తప్పుపట్టారు. ఇదే కాగ్ మమ్మల్ని ఎన్నో సార్లు మెచ్చుకున్నది. ప్రాణహిత టెండర్లు కూడా వేయకుండా పనులు ప్రారంభించారని కాగ్ మిమ్మల్ని తిట్టింది. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్. నాలుగు ఎంపీ సీట్ల కోసం చిన్న పొరపాట్లను భూతద్దం పెట్టీ చూపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల సంక్షేమం చూడాలి. లేదంటే ఆగం అవుతారు. మీకు పుట్టగతులు ఉండవు. పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మమల్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక మేడిగడ్డ అంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీ హయాంలో నీళ్ళు, కరెంట్, రైతు బంధు రావడం లేదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. ఏనాటికైనా కంచు కంచే. మేము ప్రజల మధ్య ఉన్నాం. మంద బలంతో తిట్టించే ప్రయత్నం చేశారు. నేను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకున్నరు. ప్రజలు చూశారు. మీదగ్గర సమాధానం లేక తప్పించుకున్నారు. వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారు. సభలో అడ్డుకున్నా ప్రజల్లో అడ్డుకోలేరు’ అని హరీశ్రావు మండిపడ్డారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్లో చేరిక.. బీజేపీ నేత ఈటల క్లారిటీ -
ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం
సాక్షి, హైదరాబాద్: ఆటో డ్రైవర్లను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టి తెచ్చే లక్ష్యంతో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ చేరుకున్నారు. సుమారు 20కి పైగా ఆటోల్లో మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, సబిత, సునీత లక్ష్మారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి తదితరులు అసెంబ్లీకి వచ్చారు. ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పబ్లిక్ గార్డెన్స్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలను లోపలికి అనుమతించేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పడంతో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులను లాక్కునే క్రమంలో కేపీ వివేకానందతో జరిగిన తోపులాటలో కారు అద్దం పగిలింది. ఆటో కార్మి కుల కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభకు, ఎమ్మెల్సీలు శాసనమండలికి కాలినడకన చేరుకున్నారు. నల్ల కండువాలతో శాసనమండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. -
Ts: బీఏసీ మీటింగ్ వివాదం.. హరీశ్రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గురువారం మాజీ మంత్రి హరీశ్రావుకు అసెంబ్లీలో వింత అనుభవం ఎదురైంది. బీఏసీ సమావేశానికి హాజరయ్యే విషయంలో ఏర్పడిన గందరగోళంపై హరీశ్రావు మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ‘గతంలో లేని సంప్రదాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తోంది. జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు అంటున్నారు. కడియం శ్రీహరితో పాటు హరీశ్రావు బీఏసీకి వస్తారని నిన్ననే స్పీకర్కు బీఆర్ఎస్ఎల్పీ లీడర్ కేసిఆర్ తెలియజేశారు. స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను. ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు’ అని హరీశ్రావు మీడియాకు తెలిపారు. అంతకుముందు బీఏసీ సమావేశానికి వెళ్లిన హరీశ్రావు సమావేశం మధ్యలో నుంచే బయటికి వచ్చేశారు. జాబితాలో పేరున్న కేసీఆర్కు బదులుగా పేరున్న హరీశ్రావు బీఏసీకి వెళ్లారు. హరీశ్రావు బీఏసీ సమావేశానికి రావడంపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు అభ్యంతరం తెలపడంతో హరీశ్రావు మధ్యలోనే బయటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై మంత్రి శ్రీధర్బాబు స్పందించారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా బీఏసీ నుంచి బయటికి వెళ్లమని కోరలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకే బీఏసీ నడిచిందని, పార్టీల నుంచి ముందుగా ప్రతిపాదించిన సభ్యులే బీఏసీకి రావాలని స్పీకర్ కోరారని చెప్పారు. జాబితాలో పేరున్న కేసీఆర్కు బదులుగా హరీశ్రావు వస్తారని బీఆర్ఎస్ తెలిపిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో గ్యారెంటీల జాడ లేదు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీశ్రావు స్పందించారు. ఒక విజన్లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచిందన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా లేదని విమర్శించారు. ‘కొత్త ఆసరా పెన్షన్లు, మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పుడిస్తారో తెలియని ప్రసంగం నిరాశపరిచింది. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేనేలేదు. ప్రజావాణి కార్యక్రమం తుస్సుమంది. మంత్రులు, ఐఏఎస్లు తీసుకోవాల్సిన అప్లికేషన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీలు అమలవ్వడం లేదు. త్వరలో ఎన్నికల కోడ్ అమలవనుంది. అప్పుడు ఈ కొత్త హామీలు ఎలా అమలు చేస్తారు’ అని హరీశ్రావు ప్రశ్నించారు. ఇదీచదవండి.. ప్లీజ్ కేటీఆర్..కాంట్రవర్సీ వద్దు -
నెల రోజుల్లో కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబీ రెండో మీటింగ్ మినట్స్లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో రేవంత్రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు మితి మీరిన భాష కనిపించాయన్నారు. ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీశ్రావు మండిపడ్డారు. ఇదీచదవండి.. లిక్కర్ స్కాం కేసు.. కవిత పిటిషన్పై విచారణ వాయిదా -
TS: బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’లో ఏముంది?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ రిలీజ్ చేయనున్న స్వేద పత్రం ఆసక్తి రేపుతోంది. తమ తొమ్మిదేళ్ల తమ పాలనలో తెలంగాణలో అభివృద్ధి చేసిన ఆస్తులు, అప్పులపై గులాబీ పార్టీ కాసేపట్లో స్వేదపత్రం పేరిట వైట్పేపర్ రిలీజ్ చేయనుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషేన్ ద్వారా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్తులు, అప్పులను వివరించనున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా బీఆర్ఎస్ ఈ స్వేద పత్రం విడుదల చేయనుంది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వంలో తాము,తెలంగాణప్రజలు కలిసి చెమటోడ్చి ఆస్తులు సృష్టించుకున్నందునే వైట్పేపర్కు స్వేదపత్రం అని పేరు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సృష్టికే అప్పులు చేశామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. నిజానికి శనివారమే స్వేదపత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ కేటీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి నేటికి వాయిదా వేశారు. స్వేదపత్రం రిలీజ్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు పలువురు హాజరవనున్నారు. ఇదీచదవండి..లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్! -
రేవంత్ ప్రసంగానికి అడ్డు తగిలిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. రేవంత్రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తుండటంతో రెండుసార్లు మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశిస్తూ ‘సిగ్గుతో తలదించుకోవలసిందే’నని రేవంత్ వ్యాఖ్యానించగా హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాగంటి గోపీనాథ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. మీకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ప్రసాద్కుమార్ తెలపడంతో సీట్లలో కూర్చున్నారు. ► రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ను, కేసీఆర్ను విమర్శిస్తున్నప్పుడు సభ్యులు పాడి కౌశిక్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ పలుమార్లు అరుస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ► రేవంత్ మాటలకు కౌశిక్రెడ్డి అడ్డు తగులుతుంటే స్పీకర్ ప్రసాద్కుమార్ జోక్యం చేసుకుంటూ ‘కౌశిక్రెడ్డి.. కొత్త సభ్యుడివి. సభ నాయకుడు మాట్లాడుతుంటే వినాల్సిందే’అని స్పష్టం చేశారు. ► డ్రగ్స్ మాఫియా గురించి రేవంత్ మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటే సపోర్ట్ చేసేందుకు మనసు రాలేదా అని ప్రశ్నించగా, ‘వుయ్ సపోర్ట్ యూ’అని పాడి కౌశిక్రెడ్డి అరిచారు. దానికి రేవంత్ స్పందిస్తూ ‘ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. తరువాత ఆయన కష్టాలు ఆయనకుంటాయి’అని వ్యాఖ్యానించారు. కాగా తమ ప్రభుత్వ హయాంలో కూడా డ్రగ్స్ కట్టడికి సీవీ ఆనంద్ నేతృత్వంలో చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ► రేవంత్ మాటలకు కౌశిక్రెడ్డి అడ్డు తగిలిన సమయంలో ‘గట్టిగా అరుస్తున్న ఆయన కూడా మేనేజ్మెంట్ కోటానే’అని వ్యాఖ్యానించారు. -
కరెంట్ కావాలా..కాంగ్రెస్ కావాలా: హరీశ్రావు
సాక్షి, నారాయణఖేడ్: బీఆర్ఎస్ ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తే కాంగ్రెస్ వాళ్లకు గుండెలో గుబులు పుడుతోందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ ఖేడ్ రోడ్ షోలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ భూపాల్ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. కర్ణాటకలో 9 గంటలు ఉన్న కరెంటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 గంటలకు వచ్చిందని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ వాళ్లు వెళ్లేటపుడు స్వాతంత్రం ఇచ్చిపోయారని, కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే అది బ్రిటీష్ వాళ్ల భిక్షేనన్నారు. ‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా తేల్చుకోండి. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు. కర్ణాటకలో ఖజానా ఖాళీ అయింది. కరెంట్ బంద్ అయ్యింది. కేసీఆర్ వచ్చిన తరువాత తెలంగాణలో కర్ఫ్యూ లేదు. 30 వ తేదీన కాంగ్రెస్ వాళ్ళకు దిమ్మ తిరగాలె. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన భూములను పట్టా భూములుగా మారుస్తాం. కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉంటే ,ప్రభుత్వ ఆస్పత్రులు మూతపడతాయి. ప్రైవేట్ ఆస్పత్రులు ఓపెన్ అవుతాయి. నారాయణఖేడ్ మున్సిపాలిటీ లో పెరిగిన టాక్స్లను తగిస్తాం. బీఆర్ఎస్ పవర్లోకి వస్తే తెల్లకార్డుపై సన్నబియ్యం ఇస్తాం’ అని హరీశ్రావు తెలిపారు. ఎల్లారెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ.. ‘ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అమెరికా నుంచి వచ్చి సంతలో పశువులను కొన్నట్టు నాయకులను కొంటున్నాడు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని ఊదర గొట్టారు. ఇప్పుడు అక్కడ జనాలు లబో దిబో మొత్తుకుంటున్నారు. రెండు మూడు గంటలు మించి అక్కడ కరెంట్ రావటం లేదట. రేవంత్రెడ్డి 10 హెచ్పీ మోటార్ పెడితే 3 గంటల కరెంట్ చాలంటున్నాడు. 10 హెచ్పీ ఆయన తాత కొనిస్తాడ రైతులకు. కాంగ్రెస్ వాళ్లు రైతు బంధు కాపీ కొట్టిండ్రు. ఖర్గే కర్ణాటకలో నీ ఊళ్ళో మంచి నీళ్లు వస్తున్నయా? యువశక్తి కింద ఒక్క రూపాయి ఇస్తున్నవా? కబర్దార్ నోరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు’ అని హరీశ్రావు హెచ్చరించారు. ఇదీచదవండి..కొల్లాపూర్లో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు -
సీఎం కేసీఆర్, హరీశ్రావులపై ఈసీకి ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై చర్యలు తీసవుకోవాలని కోరింది. ప్రజా ఆశీర్వాద సభల పేరిట బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. వరంగల్ బహిరంగ సభలో కాంగ్రెస్ను దోకేబాజి పార్టీ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ఫిర్యాదులో కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను 420 మేనిఫెస్టో అంటూ హరీష్ రావు విమర్శలు చేశారని, ఇది కూడా కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని కంప్లయింట్లో తెలిపింది. కాగా, ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఈవోకు బీఆర్ఎస్ లీగల్ సెల్ కంప్లయింట్ ఇచ్చింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఇంతేగాక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అడ్వర్టైజ్మెంట్లపైనా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ అడ్వర్టైజ్మెంట్లలో కేసీఆర్ను కించపరుస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే ఈ యాడ్లు ఆపాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఇదీచదవండి.. ఆయన రేవంత్ రెడ్డి కాదు..రైఫిల్ రెడ్డి : సీఎం కేసీఆర్ ఫైర్ -
సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, ఆమెకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణభవన్లో ములుగుకు చెందిన బీజేపీ నేత రాములు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు హరీశ్రావు కండువా కప్పి ఆహ్వానించారు. చేరికల సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘ నిరుపేద అమ్మాయి నాగజ్యోతి. ములుగులో ఈసారి ఆమెను గెలిపించాలని కోరుతున్న. ఓడిపోతున్నానని తెలిసి కోపంతో సీతక్క ఇష్టం వచ్చినట్లు నోరు జారుతోంది. ఆమె ఓటమి ఖాయం. 5 గంటల కరెంట్ ప్రచారంతో అబాసుపాలైంది. ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వ్యవసాయానికి ఎంత హెచ్పీ మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి. కర్ణాటక లో రెండు గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్తున్నాడు. వంద అబద్ధాలు ఆడైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 11సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వడం కాంగ్రెస్కు చేతకాలేదు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం పక్కా. కేసీఆర్ను కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మేం తిట్టలేమా’ అని హరీశ్రావు ఫైర్ అయ్యారు. ఇదీ చదవండి.. నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య -
ఆ పార్టీ మాయమాటలు నమ్మొద్దు! : మంత్రి హరీశ్రావు
సాక్షి, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉందని, కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమవుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. శుక్రవారం నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి మంత్రి హరీశ్రావుతో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు భారీ ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే వంచన.. మోసమని, కేసీఆర్ అంటే నమ్మకం అని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం ఆగమైతదని, ఆ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్తారని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అవుతుందని విమర్శించారు. కొడంగల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో చెప్పిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే తాను గడ్డం తీసుకోనని ఆ పార్టీ నాయకుడు ఉత్తంకుమార్రెడ్డి ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. మాట తప్పే నాయకులు కావాలా మాట మీద ఉండే కేసీఆర్ అవసరమా ఆలోచించాలని కోరారు. రేవంత్రెడ్డి పట్టపగలు రూ.50లక్షలు లంచం ఇస్తూ దొరికారని ఆరోపించారు. రైతులను కేసీఆర్ రాజులుగా చేస్తే రైతు బంధు బిచ్చమేసినట్లుగా ఉందని రేవంత్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఉత్తదేనని, కేసీఆర్ మాట మీద ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్ రనౌట్ అవుతుందని, కేసీఆర్ సెంచరీ చేస్తారని హరీశ్ జోస్యం చెప్పారు. నర్సాపూర్ను మరింత అభివృద్ధి చేస్తాం! నర్సాపూర్ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులు ఈలవేస్తే కొండపోచమ్మ గేట్లు ఎత్తి నీళ్లు అందిస్తున్నారని, హల్దీవాగు నిండటంతో ఎకరం పొలం ఎండటం లేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి మంత్రిగా పనిచేశారని, ఆమెను గెలిపిస్తే నర్సాపూర్ అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నర్సాపూర్ వచ్చినప్పుడు పట్టణ అభివృద్ధికి రూ.65 కోట్లు విడుదల చేశారని గుర్తుచేస్తూ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఇంతవరకు గ్రామ పంచాయతీ వార్డు మెంబరుగా గెలవలేదని, ఆయన ఏమి చేస్తారని ప్రశ్నించారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా సునీతారెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. నర్సాపూర్లో సునీతారెడ్డిని గెలిపిస్తే అక్కడ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తామని చెప్పారు. సునీతారెడ్డిని 60 వేల మెజారిటీతో గెలిపించే బాధ్యత మదన్రెడ్డితో పాటు నియోజకవర్గంలోని కార్యకర్తలదన్నారు. అలాగే ఎంపీ ఎన్నికల్లో నర్సాపూర్లో లక్ష మెజార్టీ తేవాల్సిన బాధ్యత సునీతారెడ్డిపై ఉంటుందన్నారు. తాను సిద్దిపేటలో లక్ష మెజార్టీ ఇస్తానని ప్రకటించారు. అనంతరం సునీతారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం సేవ చేస్తానన్నారు. ర్యాలీలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర కార్మిక బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే.. : ఎంపీ బండి సంజయ్కుమార్ -
హుజురాబాద్లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్రావు
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం. ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్ హుజురాబాద్లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు. ఇదీ చూడండి.. మిషన్ తెలంగాణ -
ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కత్తిదాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయనతో కొద్దిసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్రావు విలేకరులతో మాట్లాడుతూ.. కత్తితో పొడవడంతో కత్తి 3 అంగుళాలు లోపలికి వెళ్లగా 4 చోట్ల చిన్నపేగుకు గాయమైందన్నారు. 15 సెం.మీ. చిన్న పేగును తొలగించి, మూడున్నర గంటలపాటు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చెప్పారు. ఇటువంటి సమయంలో సీనియర్ నాయకులు కూడా దీన్ని అపహాస్యం చేసేలా కోడి కత్తి అంటూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దివాళాకోరు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వ్యక్తులను నిర్మూలించి రాజకీయాలు చేయాలనుకోవడం తెలంగాణలో ఎప్పుడూ లేదని, తాము అధికారంలో ఉన్న ఏ రోజూ పగతో వ్యవహరించలేదన్నారు. పగతో రాజకీయాలు చేస్తే గతంలో హౌజింగ్ స్కీముల్లో స్కాములు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఓటుకు నోటుకు కేసులో దొరికిన వాళ్లు ఎప్పుడో జైలుకు వెళ్లేవారని చెప్పారు. రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు చేయాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని, ప్రజలు వీటిని గమనించాలని సూచించారు. ప్రచారంలో ఉన్న అభ్యర్థులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అభ్యర్థులకు భద్రత పెంచాలని ఎన్నికల కమిషన్ను కోరారు. ఈ కేసులో కుట్రకోణం రెండు మూడు రోజుల్లో బయటకు వస్తుందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రభాకర్రెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మర్రి జనార్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. మరో నాలుగు రోజులు ఐసీయూలో మరో నాలుగు రోజుల పాటు ప్రభాకర్రెడ్డిని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి హెడ్ డాక్టర్ విజయ్కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు ప్రసాద్బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నాడని, మరో మూడు నాలుగు రోజులు గడిస్తేనే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందో లేదో చెప్పగలమన్నారు. -
‘నిమ్స్ ది గ్రేట్’ : మంత్రి హరీష్రావు ప్రశంసలు..!
హైదరాబాద్: అవయవ మార్పిడి ఆపరేషన్లలో నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. గతంలో ఎన్నో విజయాలను పదిలపర్చుకున్న నిమ్స్ తాజాగా మారో అరుదైన రికార్డు సృష్టించి వైద్య రంగాలలోనే సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేసి అరుదైన రికార్డును వైద్యులు సొంతం చేసుకున్నారు. ఇందులో 61 లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా, 39 దాతల ద్వారా సేకరించినవి.. గ్రహీతల్లో 11, 12 ఏళ్ల వయసువారు కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం వందో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలో యూరాలజీ వైద్యనిపుణులు ప్రొఫెసర్ రామ్రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, తదితరులు ఉన్నారు. వీరంతా యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స మార్పిడిలు చేస్తున్నారు. గత నెలలో రూ.32 కోట్లతో సమకూర్చుకున్న అడ్వాన్స్డ్ పరిజ్ఞానం ఉన్న రోబోటిక్స్ సాయంతో యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంక్లిష్టమైన నెల రోజుల వ్యవధిలోనే 30 అపరేషన్లను చేశారు. గాల్బ్లాడర్, హెర్నియా, ఆచలాసియా కార్డియా సర్జరీలను చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తున్నారు. సాధారణ పద్దతుల్లో చేసే సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలు కూడా చాలా కచ్చితంగా జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే రోగి డిశ్చార్జి కావడం విశేషం. హరీష్రావు మంత్రి ప్రశంసలు.. అత్యధిక మార్పిడి ఆపరేషన్లు చేసి నిమ్స్ వైద్యులు చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ప్రశంసించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల్లో రికార్డు బ్రేక్ చేసి యూరాలజీ వైద్యులను మంత్రి ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు. ఈ అసాధారణ అవయవ మార్పిడి ద్వారా ప్రాణాలను కాపాడాలనే తమ అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తోందన్నారు. ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా.. ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో విజయవంతంగా ఆపరేషన్లు చేయడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు తార్కాణం. ఇప్పడు ఆస్పత్రిలో నొప్పి తక్కువతో.. ఇన్ఫెక్షన్లకు తావులేకుండా చేస్తున్నాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, సంచాలకులు, నిమ్స్ -
పిల్లలు తక్కువుంటే విలీనమే..!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మెస్ చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాలను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సమీక్షించడంతో పాటు సమీపంలో ఉన్న హాస్టళ్లలో సర్దుబాటు చేసే అవకాశాలపై నివేదిక తయారు చేయాల ని సంక్షేమ శాఖలను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం సంక్షేమ వసతిగృహాలు, గురుకుల వి ద్యా సంస్థలతో పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో డైట్ చార్జీల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ పా ల్గొన్నారు. డైట్ చార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఇదే క్రమంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేసి మెరుగైన వసతులు కల్పించే అంశంపైనా చర్చించారు. కనీసం 50 మంది విద్యార్థులుంటే.. సగటున ఒక సంక్షేమ హాస్టల్లో కనీసం 50 మంది విద్యార్థులుండాలి. దాదాపు వంద మందికి వసతులు కల్పిస్తూ హాస్టల్ను అందుబాటులోకి తెచ్ఛినప్పటికీ... అందులో కనీసం సగం మంది పిల్లలుంటేనే మెరుగైన సర్విసులు కల్పించవచ్చు. అలాకాకుండా 15 నుంచి 25 మంది విద్యార్థులుంటే ఖజానాపైనా భారం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను గుర్తించాలని, అదేవిధంగా వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేసే అంశాలపై పూర్తిస్థాయి నివేదికను జిల్లాల వారీగా రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయాలకు పంపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,550 సంక్షేమ వసతిగృహాలున్నాయి. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ చాలాచోట్ల ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో ప్రీమెట్రిక్ హాస్టళ్లను పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మార్పు చేశారు. ఇంకా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రులు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
రద్దుల ఘనత బీజేపీది.. పద్దుల ఘనత టీఆర్ఎస్ది: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి, కార్మికులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన వెసులుబాటులు, వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. కేంద్రం చేనేత రంగాన్ని విస్మరిస్తూ అన్నీ రద్దు చేస్తుంటే.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పద్దులు ఇస్తూ ఆ రంగాన్ని ఆదుకుంటోందని చెప్పారు. బుధవారం హైదరాబాద్ నారాయణగూడలోని వీవర్స్భవన్లో తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్రావుతో పాటు మంత్రి కేటీఆర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. చేనేత రంగంపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. కేంద్రానివి అన్నీ రద్దులే... 1992లో అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు, పవర్లూమ్ బోర్డులను 2020లో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని హరీశ్రావు తెలిపారు. దేశంలోని స్పిన్నింగ్ మిల్స్లో ఉత్పత్తి అయ్యే నూలులో 40 శాతం చేనేత రంగానికి ఇవ్వాలనే నిబంధన ఉండగా, దానిని బీజేపీ ప్రభుత్వం 15 శాతానికి కుదించిందని చెప్పారు. ఆసరా పెన్షన్ కింద తాము రూ.2,016 ఇస్తుంటే దీనిలో కేంద్రానిది ఒక్క రూపాయి వాటా కూడా లేదన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకుంటున్నామని చెప్పినా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. రద్దులు చేసిన వారివైపు ఉండాలా? పద్దులు ఇచ్చిన వారివైపు ఉండాలా? అనేది పద్మశాలీలు ఆలోచించుకోవాలని హరీశ్ అన్నారు. ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ‘మీరు ఏ ఒక్క రంగాన్నైనా అభివృద్ధి చేశారా? ఒక్క నాడైనా చేనేత గురించి మాట్లాడారా?’అని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని నిలదీశారు. మేక్ ఇన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పిన ప్రధాని మోదీ.. జాతీయ జెండాలను చైనా నుంచి తెప్పించారని మండిపడ్డారు. ‘ఆ జెండాల తయారీని దేశంలోని చేనేత రంగానికి ఇస్తే బాగుండేది కదా? ఇదేనా మోదీ మేక్ ఇన్ ఇండియా?’అంటూ ఎద్దేవా చేశారు. చేనేతకు రాష్ట్రం చేయూత చేనేత రంగంపై, కార్మికులపై అభిమానం కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చాక నేతన్న ఎంత నేస్తే అంత బట్టని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ నష్టాన్ని భరిస్తోందన్నారు. చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం సబ్సిడీతో నూలును అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 40 వేల మరమగ్గాలు ఉన్నాయని, రూ.350 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఆర్డర్ను కార్మికులకే ఇచ్చి వారిని యజమానులను చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. నేతన్నలకు రూ.5 లక్షల బీమాను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. -
ఏడున్నరేళ్లు..742 ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిమ్స్లో రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు 25 ఏళ్లలో కేవలం 649 మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగ్గా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడున్నరేళ్లలో ఏకంగా 742 ఆపరేషన్లు జరగడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులోకి తేవడంతో శస్త్రచికిత్సలు పెరిగాయ ని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్కో శస్త్రచికిత్సకు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదిలో జరిగిన వంద కిడ్నీ మార్పిడి చికిత్సలో 97 ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించగా, అందు లో 90 ఆరోగ్యశ్రీ ద్వారానే నిర్వహించడం గమనార్హం. జీవితాంతం ఉచితంగా మందులు... ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7,800 మంది అవయవాల మార్పిడి కోసం జీవన్దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంతోపాటు అనంతరం అవసరమయ్యే మందులను జీవితకాలానికి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇలా ఉచితం గా మందులు అందించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని వైద్య వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలను, యంత్రాలను గాంధీ, నిమ్స్, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు: హరీశ్రావు ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా వ్యవహరిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణగా మన రాష్ట్రం మారుతోందన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడంలో రికార్డు సాధించామని, ఇదే స్ఫూర్తితో మరిన్ని శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు ప్రాణదానం చేయాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా వైద్య సేవలుండాలన్నారు. అందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
సంజయ్వి క్షుద్ర రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము చర్యలు తీసుకుంటుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షుద్ర, స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. పదవుల కోసం రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు దెబ్బతీసేలా చేయడం దారుణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి శాఖ అన్ని అనుమతులు ఇచ్చేవరకు పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వొద్దని, ఇందుకు ఓ ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ కోసం తీసుకురావాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్కు బండి సంజయ్ లేఖ ఇచ్చారని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో జలవనరుల శాఖ పద్దుపై చర్చకు సమాధానమిస్తూ.. బండి సంజయ్ రాసిన లేఖను సభలో చూపించారు. జల శక్తి శాఖ మంత్రి షెకావత్కు కూడా మరో లేఖ ఇచ్చారని తెలిపారు. ఏ రాష్ట్రానికి లేని నిబంధనను, అవసరమైతే చట్టాన్నే తెలంగాణ కోసం తీసుకురావాలని అడిగితే రాష్ట్ర ప్రాజెక్టులు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులను వేగంగా కట్టుకోవా అని అడిగారు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడమేంటని మండిపడ్డారు. రాష్ట్రంపై ప్రేమ ఉంటే, చేతనైతే జాతీయ ప్రాజెక్టులు తీసుకురావాలని లేదా జాతీయ హోదా తేవాలని సవాల్ విసిరారు. ఎవరైనా రాష్ట్ర ప్రాజెక్టులకు తొందరగా అనుమతులు ఇవ్వాలని అడగాలే తప్ప ఇలాంటివి చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. చేతనైతే సాయం చేయాలి కానీ.. రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టడమేంటని దుయ్యబట్టారు. బీజేపీ నేతల స్వరాష్ట్ర భక్తి ఎక్కడికి పోయిందంటూ ఎద్దేవా చేశారు. వారికి రాజకీయ భుక్తిపైనే దృష్టి తప్ప రాష్ట్ర భక్తి లేదని మండిపడ్డారు. డీపీఆర్ ఇవ్వకుండా సెంట్రల్ వాటర్ కమిషన్, పర్యావరణ శాఖ, 18 డైరెక్టరేట్ల టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఎలా అనుమతులు ఇస్తాయని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశాం.. ఏపీ సర్కారు కడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం కొనసాగిస్తోందని హరీశ్రావు వెల్లడించారు. వివిధ పద్దులపై చర్చ అనంతరం సీఎం తరఫున సాగునీటి పద్దులపై హరీశ్రావు సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టుల విషయంలో స్వయంగా సీఎం అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారని, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, సుప్రీంకోర్టులో కేసు వేశారని గుర్తుచేశారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఉత్తర్వులు తెచ్చామని, అయినా ఏపీ ప్రాజెక్టు ఆపకపోతే ధిక్కరణ కేసు వేశామని, దానిపై గ్రీన్ ట్రిబ్యునల్ కమిషన్ వేసినట్లు చెప్పారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు రూ.17,875 కోట్లతో జీవో ఇస్తే 19 నెలల తర్వాత రూ.38,500 కోట్లకు చేరిందని, 2010లో రూ.40,300 కోట్లతో కేంద్రానికి డీపీఆర్ పంపినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, వీలైతే ఎక్కువే ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు 6.64 లక్షల ఎకరాలు ఉంటే రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి, రీడిజైన్ చేసుకొని, కొత్తవి చేపట్టి 44.37 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను సాధించామన్నారు. ఐఏఎస్లకు శిక్షణలో పాఠ్యాంశంగా రాష్ట్ర ప్రాజెక్టులు మారాయంటే అంతకంటే గౌరవం ఏముంటుందని పేర్కొన్నారు. కాగా, టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఉర్దూలో రాసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. -
నిబంధనల మేరకే అప్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ కేంద్రం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడే ఉన్నాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీకి అనుగుణంగా కేంద్రం నిర్దేశించిన పరిమితుల మేరకే అప్పులున్నాయని స్పష్టం చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో.. అప్పుల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉందని తెలిపారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని చెప్పారు. దేశ జీడీపీతో పోలిస్తే కేంద్రం అప్పులు 62.2 శాతం ఉండగా, రాష్ట్ర అప్పులు కేవలం 22.8 శాతంగానే ఉన్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో అప్పులు, వడ్డీలు కలిపి రూ.50 వేల కోట్లు ఉంటాయన్న కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలని ఖండించిన హరీశ్.. వచ్చే ఏడాది అప్పులు, వడ్డీలు కలిపి చెల్లించేది రూ.26,624 కోట్లేనని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్పై చర్చలో మంత్రి హరీశ్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. ఆయా రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని హరీశ్ చెప్పారు. ప్రభుత్వ కీలక రంగాల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణలో నిధుల కేటాయింపు తక్కువగా ఉందంటూ భట్టి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చిన మంత్రి.. శాఖల వారీగా చేసిన కేటాయింపులను వివరించారు. విద్యారంగంలో గత ఆరేళ్లలో 14.15 శాతం నిధుల వెచ్చింపు జరగ్గా, వ్యవసాయ రంగంలో 11.4 శాతం, విద్యుత్ రంగంలో 7.3 శాతం, ఇరిగేషన్ రంగంలో 8.4 శాతం, హౌసింగ్లో 1.8 శాతం మేర నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జాతీయ సగటు కన్నా ఎక్కువగానే నిధుల ఖర్చు జరుగుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం సైతం జాతీయ సగటు కన్నా రెట్టింపు ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందంటూ భట్టి సభను తప్పుదారి పట్టించారని, అయితే సీఎంఐఈ సర్వే ప్రకారం 2019–20లో జాతీయ స్థాయిలో సగటు నిరుద్యోగం 7.63 శాతమైతే.. తెలంగాణలో 4.53 శాతంగా ఉందన్నారు. 2020–21లో జాతీయ సగటు 10.35 శాతం కాగా, తెలంగాణలో 6.15 శాతంగా ఉందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్, బీజేపీలు అమ్ముతూ పోతుంటే, ఆర్టీసీ, విజయ డెయిరీ వంటి సంస్థలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ రాష్ట్రం నమ్మకం కలిగిస్తోందని వెల్లడించారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని హరీశ్ ప్రస్తావించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం 30 రోజుల్లో ఇస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎక్కడ, ఎప్పుడు ఇచ్చిందో చెప్పాలని సూచించారు. ‘మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. 13వ ఆర్థిక సంఘం నుంచి ఆరేళ్లుగా రూ.1,129 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రెండేళ్లుగా రూ.817 కోట్లు రాలేదు. విభజన చట్టంలో పేర్కొన్న వెనకబడిన ప్రాంతాల నిధి కింద రూ.350 కోట్లు రాలేదు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటుగా రూ.2,350 కోట్లు ఇవ్వాలని చెప్పినా రాలేదు. మొత్తంగా కేంద్రం నుంచి రూ.28,225 కోట్లు రావాల్సి ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై మాట్లాడాలి..’అని అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుంటామని, అయితే రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోమని వెల్లడించారు. -
శంకర్ పల్లికి భారీగా పెట్టుబడులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండలం కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ‘జిల్లాకు రూ.800 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా వందలాది మందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. జిల్లా ఫార్మా, ఐటీ, సాప్ట్వేర్ కంపెనీలకు నెలవుగా మారనుంది. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ ఘనత సాధించింది. ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మాసిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హార్డ్వేర్ పార్కులతో పాటుగా ఉన్నత విద్యా సంస్థలు, వర్శిటీలు, పర్యాటకరంగాలకు కేంద్ర బిందువుగా రంగారెడ్డి జిల్లా మారింది. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపిస్తున్నారు. టెక్స్టైల్ పరిశ్రమ రైలు కోచ్లు, డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల తయారీదారు కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ రూ.800 కోట్ల పెట్టుబడితో శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో తమ యూనిట్ను నెలకొల్పనున్నది. ఇందుకోసం 2017లోనే ప్రభుత్వంతో మేధా ఒప్పందం కుదుర్చుకోవడంతో టీఎస్ఐఐసీ వంద ఎకరాల భూ సేకరణ చేపట్టింది’ అని తెలిపారు. చదవండి: సోషల్ మీడియా పోస్టు; గీత దాటితే చర్యలు తప్పవు! -
సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..: హరీశ్రావు
సాక్షి, సిద్ధిపేట: రైతు సంస్కరణలలో సిద్ధిపేట ఆదర్శం కావాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. నియంత్రిత పంటల సాగుపై శుక్రవారం జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, బొడకుంట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. (వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు) పంట మార్పిడితో రైతులకు మేలు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటల మార్పిడి ద్వారా దిగుబడి పెరిగి రైతుకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా రైతుల సంక్షేమానికి పరితపిస్తున్నారని చెప్పారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్, అంతర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్ ఆధారంగా సాగు చేయాలని ఆయన సూచించారు. (పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల) ప్రభుత్వం ఉద్దేశ్యం అది కాదు.. రైతు బంధు పథకం ఆపాలని ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు. రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టామని చెప్పారు. వానాకాలం లో మొక్కజొన్న దిగుబడి బాగా తగ్గుతుందని.. అందుకే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని ఆయన వివరించారు. యాసంగిలో వరికి రాళ్ళ వానతో నష్టం జరుగుతుందని.. అదే మొక్కజొన్న అయితే ఎలాంటి నష్టం ఉండదన్నారు. మొదటి పంటలో రైతుకు లాభం జరగడమే లక్ష్యంగా సర్కార్ పని చేస్తోందన్నారు. ఇది రైతులపై బలవంతంగా రుద్దడం కాదని స్పష్టం చేశారు. కొత్త వంగడాలు వచ్చాయి.. కందిలో కొత్త వంగడాలు వచ్చాయని.. ఆరు నెలలకే పంట కాలం పూర్తయి దిగుబడి పెరుగుతుందన్నారు. ఆ తరువాత రెండో పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చన్నారు. సిద్దిపేట రిజర్వాయర్ల ఖిల్లా అని.. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఏడాది కాలం జలకళను సంతరించుకుంటాయన్నారు. తెలంగాణలో ఎరువులు, విత్తనాలు, నీళ్లకు కొరత లేదన్నారు. గోదావరి జలాలపై ఆధారపడి పంటల సాగు చేస్తామన్నారు. పత్తికి డిమాండ్ పెరిగింది.. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ ల తయారీకి భారీ డిమాండ్ పెరిగిందని, పత్తికి డిమాండు ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 6.3 ఎంఎం పొడవు ఉన్న ధాన్యానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. సిద్ధిపేట జిల్లాలో 9,500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో ఫామ్ ఆయిల్ సాగు ఎక్కువగా చేస్తారన్నారు. వారి మాటలు రైతులు విశ్వసిస్తారా..? జిల్లాలో సాగుకు భూసార పరీక్షలు, సర్వే చేయించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని కోరామని తెలిపారు. కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని విపక్షాల మాటలు రైతులు విశ్వసిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లేనని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. -
‘రైతుల మేలుకే కొత్త విధానం’
సాక్షి, సంగారెడ్డి: రైతులకు మేలు కలిగించేందుకు కొత్త వ్యవసాయ విధానం అమలు చేస్తున్నామని, వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మంత్రి నిరంజన్ రెడ్డితో పటాన్చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ... పదవి రావడం గొప్పకాదు, పదవి నిర్వహించడం గొప్ప. రైతులకు మేలు జరిగేందుకు కొత్త వ్యవసాయం విధానం అమలు చేస్తున్నాం. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రెండు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేశాం అని తెలిపారు. (కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!) ఇక మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ మహానగర అవసరాలు తీర్చేలా పటాన్ చెరువు మార్కెట్ను అభివృద్ధి చెయ్యాలి. దేశంలోనే అత్యుత్తమ మార్కెట్గా పటాన్ చెరువు మార్కెట్ను మార్చాలి. మార్కెట్ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంట్లో కూర్చొనే కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టంలోని నిబంధనలు సైతం మార్చుతాం. ఆన్లైన్ మార్కెట్ ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. హైదరాబాద్ మహానగరానికి నలుదిక్కులా సమీకృత మార్కెట్లు అభివృద్ధి చేస్తాం. సిద్ధిపేట మార్కెట్లు రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాయి. సిద్దిపేట మార్కెట్లను చూసే నా నియోజకవర్గంలో మార్కెట్లను అభివృద్ధి చేశాను. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చాం. ఒకప్పుడు తినడానికి సరిపోయే పంట కూడా పండని పరిస్థితి రాష్టంలో ఉండేది. అరేళ్లలో ఆ పరిస్థితిని అధిగమించాం. ప్రస్తుతం నిల్వ చేయడానికి గోదాముల లేని స్థాయిలో పంటలు పండుతున్నాయి. ఈ సంవత్సరం 39 లక్షల 40 వేల ఎకరాల్లో వరి పంట పండింది. జనాభా అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు ఏ స్థాయిలో అవసరమో, విశ్వవిద్యాలయాలతో సర్వే చేయించాం. ప్రస్తుతం కేరళ, తమిళనాడు మాత్రమే బియ్యం కోసం మనపై ఆధారపడ్డాయి. కొత్త వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, పండిన పంటకు కొనుగోలుకు హామీ ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితి రావాలి అన్న లక్ష్యంతో కొత్త విధానం రూపొందిస్తున్నాం. ఒక పంట పండిన తర్వాత అది ఆహారంగా మారే వరకు వందల మందికి ఉపాధి దొరుకుతుంది. జిన్నారం, గుమ్మడిదళ గోదాములకు నిధులు మంజూరు చేశాం అని తెలిపారు. (మీ బిడ్డలకోసమైనా.. తీరు మార్చుకోండి) -
అందరికీ ఆరోగ్య కార్డులు
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రం లోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ, యూరాలజీ విభాగాలను బుధవారం ఆయన ప్రారంభిం చారు. సంబంధిత విభాగాలను పరిశీలించి ఆస్పత్రి సూపరింటెండెంట్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు అందించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. త్వరలో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందని తెలిపారు. ప్రపంచంలోని ఒక్క అమెరికాలోనే ఈ తరహా హెల్త్ కార్డుల విధానం అమలులో ఉందని, తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నారని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలోనే కార్డియాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటుతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ల ప్రజలను హైదరాబాద్కు తరలించకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించ్చవచ్చన్నారు. మరణాలు తగ్గి ప్రసవాలు పెరిగాయి.. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మాతా శిశు మరణాలు తగ్గాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. గతంలో సాధారణ ప్రసవాలు 30 నుంచి 35% మాత్రమే జరిగేవని, ప్రస్తుతం అవి 65 నుంచి 70 శాతానికి పెరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చెట్టుని కూల్చినందుకు రూ. 9,500 జరిమానా
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా పెరిగి పెద్దదైన చెట్టును తన వాహనంతో ఢీకొట్టి కూల్చివేసిన వాహనదారుడికి రూ. 9,500 జరిమానా విధించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా పెరిగిన చెట్టును తన వాహనంతో రాకేశ్ ఢీ కొట్టడంతో పడిపోయింది. దీన్ని గమనించిన పోలీసులు హరితహారం అధికారి ఐలయ్యకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఆయన.. రాకేశ్కి జరిమానా విధించారు. హరితహారంలో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి కాపాడుతున్నామని, వాటికి ఎవరు హాని కలిగించినా జరిమానా చెల్లించాల్సిందేనని ఐలయ్య తెలిపారు. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. హరితహారం చెట్ల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ శాఖ ఉన్నతాధికారులకు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, డీఈలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అమీన్పూర్కు పండుగ రోజు
సాక్షి, పటాన్చెరు: అమీన్ పూర్కు ఈ రోజు నిజమైన పండుగ రోజని మంత్రి హరీశ్రావు అన్నారు. బీరంగూడ– కిష్టారెడ్డిపేట రోడ్డు పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రూ.61 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను అమీన్ పూర్కు వచ్చినప్పుడు స్థానికులు మంచినీటి సమస్య ఉందని చెప్పారని గుర్తు చేశారు. రెండు వేల ఫీట్ల లోతు వరకు బోరు వేసినా నీరు రాని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంటింటికీ అందిస్తున్నామన్నారు. అమీన్ పూర్లోని 67 కాలనీలకు లాభం చేకూర్చే విధంగా నిర్మించిన 30 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఓహెచ్ఎస్ఆర్ను ప్రారంభించామని చెప్పారు. పటాన్ చెరు నియోజకవర్గంలో 20 ఏళ్ల వరకు జనాభా పెరిగినా ఇబ్బంది లేని విధంగా మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయన్నారు. మహిళలకు నీటి కష్టాలు ఎక్కువగా తెలుస్తాయంటూ అమీన్ పూర్ మహిళలకు నీటి కష్టాలు తప్పుతాయన్నారు. ఎమ్మెల్యే కోరిన ఒకే కోరిక.. బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రోడ్డు కావాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చాలా కాలంగా అడుగుతూ వస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారం కేసీఆర్ పటాన్ చెరుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కోరిన ఒకే కోరిక బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట మీదుగా సుల్తాన్ ఫూర్ వరకు రోడ్డు మాత్రమేనని హరీశ్రావు గుర్తు చేశారు. ఇప్పటికే పటాన్ చెరులో అన్ని ప్రధాన రోడ్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిర్మించామని ఆయన తెలిపారు. అయితే అమీన్ పూర్లోని బీరంగూడ కమాన్ నుంచి సుల్తాన్పూర్ జంక్షన్ వరకు రూ.49 కోట్లతో రోడ్డు నిర్మాణానికి కేసీఆర్ సూచనలతో కేటీఆర్ మంజూరు చేశారని మంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోడ్డు పనులను ప్రారంభించామని, త్వరలోనే ఆ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. పటాన్ చెరులో రోడ్డుపై అంగడి జరిగేదని, ఆ సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేకు డబుల్ ధమాకా పటాన్ చెరు నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతున్నాయని తెలిపారు. త్వరలోనే పటాన్ చెరులోని పేదలకు ఇళ్లను ఇస్తామన్నారు. పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలో ఉందని, దాంతో ఎమ్మెల్యేకు డబుల్ ధమాకాలా రెండు కోటాలు దక్కాయని మంత్రి చమత్కరించారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి రావాల్సిన డబుల్ బెడ్రూంకోటాతోపాటు, జీహెచ్ఎంసీ కోటా కింద కూడా ఈ ప్రాంతానికి ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులకు అభినందనలు మిషన్ భగీరథ పనులు నిర్వహిస్తున్న అధికారులను మంత్రి హరీశ్రావు అభినందించారు. రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని గుర్తు చేశారు. రెండున్నరేళ్లలోనే ప్రతీ ఇంటికి యావత్ రాష్ట్రంలో నీటిని అందించే కార్యక్రమానికి అధికారులు గొప్పగా సేవలందించారని హరీశ్రావు వారిని అభినందించారు. ఇదిలా ఉండగా అమీన్పూర్లో మండల్ లెవల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను మంత్రి ఆర్డీఓకు అందించారు. అలాగే అమీన్ పూర్లో డంప్ యార్డు ఏర్పాటుకు కూడా మరో పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను కమిషనర్ వేమనరెడ్డికి అందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ బీరంగూడ రోడ్డు మంజూరు నిధులు ఇచ్చిన ప్రభుత్వానికి, దాని పనుల ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి హరీశ్రావుకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్మంజుశ్రీ,, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే హరీష్ రావును కలిశా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి గురువారం ఆర్థిక మంత్రి హరీష్రావుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్టాడుతూ ..సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసమే మంత్రిని కలిసినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్దే తమ ధ్యేయమన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం 14సంవత్సరాల తరువాత హరీష్ను కలిసినట్లు ఆయన వెల్లడించారు. జగ్గారెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంత్రి సమస్యల పరిష్కారం పై సానుకూలంగా స్పందించినట్లు అయన మీడియాకు తెలిపారు. కాగా నిన్న, మొన్నటివరకూ విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి తాజాగా హరీష్ రావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సర్కారు బడుల్లో ట్యూషన్
సిద్దిపేట రూరల్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ మళ్లీ ఒక వినూత్న కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేటు తరహాలో సాయంత్రం వేళ అదనంగా ట్యూషన్ ప్రక్రియను నిర్వహించే పద్ధతిని గ్రామంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎమ్మెల్యే హరీశ్రావు అదనపు తరగతుల బోధనలను బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను విద్యాశాఖ వేగవంతం చేసింది. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారాన్ని అందించే ప్రక్రియను చేపట్టిన ఎమ్మెల్యే హరీశ్రావు సాయంత్రం వేళల్లో విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగేలా అదనపు తరగతుల బోధనకు శ్రీకారంచుట్టారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ట్యూషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మొదట ఆయన దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ను ఎంచుకున్నారు. గ్రామానికి చెందిన నిరుద్యోగ బీఈడీ యువత, రిటైర్డ్ టీచర్లతో ప్రతీ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రం అదనపు తరగతులకు బోధించనున్నారు. -
సొంతూరుకు సీఎం..
తమ కళ్ల ఎదుటే తిరిగిన వ్యక్తి నేడు ముఖ్యమంత్రి హోదాలో ఆత్మీయంగా, ఆప్యాయంగా పలకరించనున్నాడనే ఆనందం కొందరిలో.. తమతో ఆటలు ఆడి, పాటలు పాడిన బాల్యమిత్రుడు వస్తున్నాడనే సంతోషం మరి కొందరిలో.. వెరసి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో చింతమడక గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముఖ్యమంత్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య శోభారాణి, కుమారుడు కేటీఆర్ ఇతర కుటుంబ సభ్యులు రానున్నారు. గ్రామ ప్రజలతో సభ, ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనం, పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందడితో చింతమడక మురవనుంది. ఆదివారం పర్యటన ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్వహణను పూర్తి చేసింది. గ్రామంలో రూ.20 కోట్లతో బీసీ సంక్షేమ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అలాగే అర్హులైన నిరుపేదలకు 54 డబుల్ బెడ్రూం ఇళ్లను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణం, పెద్దమ్మ దేవాలయం, రామాలయం వాటిని ప్రారంభించనున్నారు. మరోవైపు గ్రామంలో ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డును అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ పరమైన సమస్యలు ఉండకుండా ఇప్పటికే రెవెన్యూ అధికారులు, కుటుంబ సర్వే ఆధారంగా పూర్తి నివేదికను తయారు చేశారు. చిన్నప్పటినుంచే అన్నింటా దిట్ట.. చిన్నతనం నుంచే కేసీఆర్ అన్ని రంగాల్లో చలాకీగా ముందు ఉండేవాడు. దుబ్బాక పాఠశాలలో చదువుకునే రోజుల్లో క్లాస్లో మొదటి వరసలో కూర్చొని శ్రద్ధగా పాఠాలను వినేవాడు. పరీక్షలకు కూడా సన్నద్ధం కాకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు పొందేవాడు. కేసీఆర్ మొదట 5వ తరగతి వరకు గ్రామంలో చదువుకున్నప్పటికీ, అనంతరం తొమ్మిది వరకు దుబ్బాకలో చదువుకున్నాడు. అనంతరం 10వ తరగతి పుల్లూరులో, ఇంటర్మీడియట్ సిద్దిపేటలో పూర్తి చేశాం. నేను కేసీఆర్తో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఊరు రుణం తీర్చుకోవడానికి సీఎం హోదాలో గ్రామానికి వస్తుండడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. –భైరి కృష్టారెడ్డి, కేసీఆర్ స్నేహితుడు గ్రామ రూపురేఖలు మారుతున్నాయి.. చాలా రోజుల తరువాత చింతమడక బిడ్డ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడంతో గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. అదేవిధంగా ఒక రోజంతా మాతోనే గడిపి మా బాగోగులను తెలసుకుని గ్రామ ప్రజలకు బంగారు భవిష్యత్ను అందించేందుకు కేసీఆర్ గ్రామానికి రావడం చాలా సంతోషం. చిన్నతనంలో కేసీఆర్కు చింతమడకలో ప్రధానోపాధ్యాయునిగా పాఠాలు బోధించాను. గ్రామంలోని అందరి గురించి ఇప్పటికి కేసీఆర్ గుర్తుంచుకున్నారు. ఎదైనా విషయం ఉంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేవాడు. రాష్ట్ర ఉద్యమం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరిగి గ్రామానికి వçస్తుండడతో మాకు సంతోషంగా ఉంది. కేసీఆర్ పుట్టుక మాఊరు ఏదో ఒక గొప్పపుణ్యం చేసుకున్నట్లుగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, గ్రామ భవిష్యత్ను చూస్తుంటే తెలుస్తోంది. –ప్రతాప్రెడ్డి, కేసీఆర్ చిన్ననాటి ప్రధానోపాధ్యాయుడు -
ప్రతి కుటుంబానికి చిరకాలం గుర్తుండాలి
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో జరిగే అభివృద్ధి ప్రజలు చిరకాలం సీఎంను వారి హృదయాల్లో ఉంచుకునేలా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో చింతమడకలో చేయనున్న ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి మంచి ఇళ్లు ఉండాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు. ఇళ్లు లేని ప్రతీ కుటుంబానికి యజమానులు ఇష్టం ఉన్నట్లుగా వారి స్థలంలో కట్టుకునేలా అవకాశం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం గ్రామంలోని ప్రతీ కుటుంబంతో సుదీర్ఘంగా చర్చించి వారి అవసరాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఎంపీడీఓలకు సూచించారు. అలాగే అసైన్డ్ భూముల్లో ఎస్సీలకు మోటార్లు, బోరుబావుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్దాస్ను ఆదేశించారు. పంచాయతీ శాఖతో గ్రామంలోని పాఠశాల అదనపు తరగతి గదులు, భూమి లేనివారికి ట్రాక్టర్స్ ఇవ్వడం, భూమి ఉంటే డైరీ, రూ. 10 లక్షలతో హార్వేస్టర్, హర్టీకల్చర్తో మల్బరిసాగు, చెరువు సుందరీకరణ, గ్రామంలోని ప్రతీ కుటుంబం వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించాలని సూచించారు. అన్ని వివరాలతో నివేదిక అలాగే గ్రామంలోని నిరుద్యోగ యువత కోసం వారితో చర్చించి ఆటోలు, కార్లు, వంటి వాహనాలు అందించే ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు చేసిన సర్వేను ర్యాండమ్ పద్ధతిన ఎంపిక చేసి స్వయంగా తానే విచారణ చేస్తానని తెలిపారు. గ్రామంలో 100 ఎకరాల్లో అడవి అభివృద్ధి కోసం ప్రణాళికలను తయారు చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్కు సూచించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చింతమడక గ్రామ ప్రజల సుస్థిరమైన అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలు నివేదిక రూపంగా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేస్తుందన్నారు. జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, ఎంపీడీఓల బృందతో కలిసి చింతమడక గ్రామ సమగ్ర సర్వే నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జిల్లా అదికారులు పాల్గొన్నారు. నేడు చింతమడకకు హరీశ్రావు.. చింతమడక గ్రామానికి సీఎం కేసీఆర్ వస్తున్న క్రమంలో నేడు ఉదయం 7 గంటలకు హరీశ్రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు గ్రామంలో పర్యటించనున్నారు. మూడు రోజులుగా అధికారులు చేపట్టిన గ్రామ సమగ్ర కుటుంబ సర్వే, అక్కడి ప్రజల అవసరాలు క్షేత్రస్థాయిలో తెలుసుకుని , ప్రత్యేక ప్రజా అవసరాలపై, జీవన స్థితిగతులపై ఆరా తీయనున్నట్లు తెలిపారు. -
హ్యాట్రిక్ల సిద్దిపేట
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పలువురు అభ్యర్థులు హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి 1967 ఎన్నికల్లో పోటీ చేసిన జి.వెంకటస్వామి.. 1971, 1977లోనూ గెలిచి వరుసగా మూడుమార్లు గెలిచారు. ఆయన తరువాత నంది ఎల్లయ్య 1989, 1991, 1996 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో సిద్దిపేట లోక్సభ స్థానం రద్దయి.. మెదక్ లోక్సభ స్థానంలో అంతర్భాగమైంది. ఇక, సిద్దిపేట అసెంబ్లీ స్థానంలోనూ హ్యాట్రిక్ల మోత మోగుతోంది. అనంతుల మదన్మోహన్ 1972, 1978, 1983 శాసనసభ ఎన్నికల్లో తొలి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన తరువాత టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1985, 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అదే పార్టీకి చెందిన ముఖ్యనేత టి.హరీశ్రావు కూడా 2004, 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. -
తెలంగాణపై బాబు, లగడపాటి కుట్రలు
సాక్షి, జనగామ/మహబూబాబాద్/కామారెడ్డి/ యాదాద్రి: నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్ మరోసారి కుట్రలు చేస్తున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కామారెడ్డి జిల్లా గాంధారి,యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారంలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయని, ఇందుకుగాను ఆంధ్రా శక్తులన్నీ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రా నుంచి చంద్రబాబు నోట్ల కట్టలు పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లగడపాటి రహస్య ఎజెండాతో వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. మోసపోతే గోసపడుతామని, వారి కుట్రలను తిప్పికొ ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ గెలిస్తే నీటిపారుదల, హోం, పరిశ్రమలు శాఖలు తమకే అని టీడీపీ వారు అంటున్నారని, తెలంగాణ నీళ్లు ఆంధ్రా కు తరలించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగినట్లే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పోలవరానికి నీళ్లు తగ్గు తాయంటూ ఇప్పటికే చంద్రబాబు అడ్డు తగులుతున్నాడని హరీశ్ ఆరోపించారు. కూటమికి ఓటేస్తే బాబు కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటాడని, దీంతో మనకు నీళ్లు రావన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కాళేశ్వరం వస్తుందని కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుందని అన్నారు. మరో ఏడాదిన్నర రెండేళ్ల లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ చీకటి తెలంగాణ అవుతుందన్నారు. చంద్రబాబువి దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తి అని, అలాంటి కూటమికి ఓటు వేయొద్దని హరీశ్ కోరారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగితే ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపిన నరహంతకుడని ధ్వజమెత్తారు. కాం గ్రెస్, బాబు తోడుదొంగలు, మాట తప్పిన వాళ్లన్నా రు. బాబు ఇచ్చిన పైసలతో రోజూ పేపర్లు, టీవీలలో ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మం చోడని తెలంగాణకు మేలు చేస్తాడని కోదండ రాం అనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అన్నారు. తెలంగాణ మేధావి లోకం కోదండరాంను చూసి జాలిపడుతుందన్నారు. డిసెంబర్ 11 తర్వాత వచ్చే ఫలితాలతో కేసీఆర్ ఇరగదీసే పర్సన్ అని రుజువు అవుతుందన్నారు. కూటమి నేతల కల్లబొల్లి మాటలు వినకుండా టీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ్కే నమ్మకం లేదు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. దేనికోసం కూటమికి ఓటు వేయాలో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కూటమిలోని నలుగురికి తోకలే సక్రమంగా లేవని విమర్శించారు. కోదండరాంను కోదండం ఎక్కించారని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కుడితిలో పడిన ఎలుక లెక్క కోదండరాం పరిస్థితి అయిందని విమర్శించారు. పౌరసంఘం హక్కుల నేత అని చెప్పుకునే కోదండరాం, నరహంతకుడు, ఎన్కౌంటర్లు చేయించిన బాబు కడుపులో తలపెట్టి గౌరవం తగ్గించుకున్నారని మండిపడ్డారు. కోదండరాంను చూసి మేధావిలోకం సిగ్గు పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెవ్వులో పూలు పెట్టుకున్నారు కావచ్చు.. ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
మీ బిడ్డగా చెప్తున్నా..
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అం దోలు నియోజకవర్గాలకు సింగూరు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు తెస్తా. హరీశ్రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, నేను సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు రాకుంటే.. ఇంకా ఎప్పటికీ రావు.. మెదక్ జిల్లా బిడ్డగా, కేసీఆర్గా ఇది నా బాధ్యత. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘నేను మీ బిడ్డగా చెప్తున్నా.. పాత మెదక్ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాలకు సింగూరు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు తెస్తా. పాత మెదక్ జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన సంగారెడ్డి ప్రాంతానికి సింగూరు నుంచే సాగు నీరు రావాలి. హరీశ్రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, నేను సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు రాకుంటే.. ఇంకా ఎప్పటికీ రావు.. మెదక్ జిల్లా బిడ్డగా, కేసీఆర్గా ఇది నా బాధ్యత’ అని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. ‘సింగూరు నీరు మన జన్మహక్కు. హైదరాబాద్కు సింగూరు జలాల తరలింపును నిలిపివేసి, కృష్ణా, గోదావరి నుంచి తెస్తున్నం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది జూన్ తర్వాత నీళ్లు వస్తున్నాయి. రాత్రింబగళ్లు కష్టపడుదాం’ అని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తోందని, సంపద పెంచి ప్రజలకు పంచుతుండటంతో.. అనూహ్యమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. మేనిఫెస్టోలో లేని 76 పథకాలను అమలు చేయడంతో పాటు, జాతి, మత వివక్ష లేకుండా అందరికీ మేలు చేసే పనిలో టీఆర్ఎస్ ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో పార్టీలు, వ్యక్తులు, అభ్యర్థులు గెలవడం ముఖ్యం కాదు.. ప్రజలు గెలిస్తేనే ప్రజల ఎజెండా అమలవుతుంది. ఓటర్లు గందరగోళానికి తావు లేకుండా వివేచనతో ఓటు వేయాలని’ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఓవైపు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ మరో వైపు ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని’ పిలుపునిచ్చారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ‘సంగారెడ్డికి ప్రధానంగా రెండు పనులు కావాలి. సంగారెడ్డిలో వచ్చే టర్మ్లో నూటికి నూరుశాతం ఏర్పాటు చేస్తాం. దినదినాభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి పట్టణం చుట్టూ నాలుగులేన్ల రింగు రోడ్డును నిర్మిస్తాం. త్వరలో వచ్చి ఈ పనులకు శంకుస్థాపన చేస్తానని’ కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని సర్వేలు చెప్తున్నయి. సంగారెడ్డిలో గతంలో అణువణువు తిరిగిన అనుభవం నాకు ఉంది. క్రియాశీల కార్యకర్త చింత ప్రభాకర్ చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కౌన్సిలర్, చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఈ సందర్భంలో ఇతరత్రా చిల్లర మల్లర విషయాలు మాట్లాడదలచు కోలేదు. ఎవరి వ్యక్తిత్వం ఏంటో, ఎవరి గౌరవం ఏంటో మీకు తెలుసు. ఎవరు ఎలాంటి వాళ్లో మీకు తెలుసు, చెడ్డవాళ్లను గెలిపించుకుంటే మీకు చాలా చెడు జరుగుతుంది.’ అంటూ హెచ్చరించారు. ‘ఆర్.సత్యనారాయణ క్రియాశీల కార్యకర్త. ఉద్యమం పొడవునా నాతో పనిచేసిన వ్యక్తి, త్వరలోనే ఆయనకు మరింత గుర్తింపు వస్తుంది. ఉద్యమంలో పనిచేసిన అందరికీ గుర్తింపు ఉంటుంది’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి హరీశ్రావుతో పాటు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, ఫరీదుద్దీన్, మహ్మద్ సలీం, బి.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, పార్టీ అభ్యర్థులు ఎం.భూపాల్రెడ్డి, చింతా ప్రభాకర్, కె.మాణిక్రావు, క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. మోసపోతే గోస పడతం: మంత్రి హరీశ్రావు నారాయణఖేడ్: ఎన్నికల్లో ప్రజలు మోసపోవద్దని గోసపడతామని మంత్రి హరీశ్రావు అన్నారు. నారాయణఖేడ్లోని రహమాన్ గార్డెన్ ఫంక్షన్హాల్ ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. క్వార్టర్ సీసాలు, కల్లుపెట్టెలు, నోట్ల కట్టలు చూసి మోసపోవద్దని సూచించారు. కాల్వ నీళ్లు కావాలా, క్వార్టర్ సీసాలు కావాలా అని ప్రశ్నించారు. నారాయణఖేడ్ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాళేశ్వరం నీటిని తీసుకు వచ్చి సింగూరును నింపుతామని, ఖేడ్, కల్హేర్, పెద్దశంకరంపేట్ మండలాలకు కాల్వల ద్వారా, మనూరు, కంగ్టికి ఎత్తిపోతల ద్వారా మొత్తం లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని హరీశ్ తెలిపారు. తండాలు, పల్లెల్లో భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ఖేడ్లో 54గిరిజన తండాలు పంచాయతీలుగా మారాయని గుర్తు చేశారు. ఖేడ్లో మార్కెట్ యార్డును నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇక్కడ సంజీవరెడ్డి రాత్రికి రాత్రి జెండా మార్చాడని, ఆయన జంప్ కొడితే ప్రజలు జంప్ కొడతారా అని ప్రశ్నించారు. ఆయన ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కాంగ్రెస్కు ఏం చూసి ఓట్లు వేయాలని ప్రశ్నించారు. షెట్కార్లు స్వలాభం చూసుకున్నారు తప్ప ఖేడ్కు చేసిందేమీలేదన్నారు. నాలుగేళ్ల క్రితం నారాయణఖేడ్ ఎలా ఉందో ప్రస్తుతం ఎలా మారిందో గుండెలమీద చేయివేసుకొని ఓట్లు వేయాలని కోరారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సువర్ణ షెట్కార్, జిల్లా రైసస సమన్వయకర్త వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బాపు మల్శెట్టి, మోహిద్ఖాన్, రామాగౌడ్, రవీందర్నాయక్, పార్శెట్టి సంగప్ప, నజీబ్, మూఢ రామకష్ణ, ముజమ్మిల్, నాలగతా అశోక్ తోర్నాల్, గుండు మోహన్, రవీందర్నాయక్, ప్రభాకర్, శ్రీనివాస్గౌడ్, సత్యపాల్రెడ్డి పాల్గొన్నారు. -
పార్టీలో చేర్చేందుకేనా...!
సాక్షి, జహీరాబాద్: తాజా మాజీ మంత్రి టి.హరీశ్రావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్రెడ్డిని సోమవారం రాత్రి హైదరాబాద్లో కలిశారు. జైపాల్రెడ్డి సుడోకు పోటీల్లో పాల్గొని విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఈ మేరకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లినట్లు చెబుతున్నా రాజకీయ కోణంలో వెళ్లి ఉంటారనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్లో చేరాల్సిం దిగా ఆహ్వానించి ఉంటారనే అభిప్రాయాన్ని జైపాల్రెడ్డి సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా జహీరాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే జె.గీతారెడ్డితో జైపాల్రెడ్డికి విభేదాలు ఉండడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దసరా మరుసటి రోజున గీతారెడ్డి జైపాల్రెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్కి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఎలాగైనా టీఆర్ఎస్ పాగా వేయాలనే ఉద్ధేశంతో మంత్రి వూహ్యాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లోకి వెళ్లారు. మాజీ మంత్రి ఎం.డీ ఫరీదుద్దీన్ సైతం టీఆర్ఎస్లో చేరగా అధిష్టానవర్గం ఎమ్మెల్సీ పదవితో సత్కరించింది. జైపాల్రెడ్డిని సైతం టీఆర్ఎస్లోకి తేవాలనే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఈ విషయమై జైపాల్రెడ్డి మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. -
కొడంగల్ కు బావ.. పట్నంకు బామ్మర్ది
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికార పార్టీలో నంబర్–2 స్థానంలో ఉన్న బావ, బామ్మర్దులకు మరో కొత్త సవాల్ ముందుకొచ్చింది. మన జిల్లాలో రెండు స్థానాల్లో గెలుపు బాధ్యతలను ఇరువురు మంత్రులు భుజాన వేసుకోవడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గాలపైనే పడింది. ప్రధానంగా కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ రేవంత్రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్ స్థానంలో గులాబీ పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతలను బావ హరీష్రావు చేపట్టగా.. రియల్ ఎస్టేట్, విద్య, వాణిజ్య, ఐటీ రంగానికి నెలవైన ఇబ్రహీంపట్నంలో కారు జోరు పెంచే బాధ్యతను బావమరిది కేటీఆర్ స్వీకరించారు. ఇద్దరూ అధికార పార్టీకి స్టార్ క్యాంపెయినర్లే కావడం.. అదీ స్వయానా బావామరదులు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.æ రాష్ట్రవ్యాప్తంగా 20 కీలక నియోజకవర్గాలను గుర్తించిన గులాబీ బాస్ కేసీఆర్.. వీటిలో ప్రచార వ్యూహాలను అమలు చేసే బాధ్యతను ముఖ్యనేతలకు అప్పగించారు. ప్రత్యర్థి బలంగా ఉన్న, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న, సొంతపార్టీలో అసమ్మతి తీవ్రంగా ఉన్న స్థానాలను ఎంపిక చేశారు. ఇందులో మన జిల్లాలో కొడంగల్, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లను గుర్తించారు. ఈ రెండు స్థానాలను ప్రతిష్టాత్మకంగా భావించిన గులాబీ అధినాయకత్వం.. వీటి గెలుపు బాధ్యతలను హరీష్రావు, కేటీఆర్కు కట్టబెట్టింది. పట్నంలో కేటీఆర్ గత ఎన్నికల్లో ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన మంచిరెడ్డి కిషన్రెడ్డి(టీడీపీ) గులాబీ గూటికి చేరినా.. ప్రత్యర్థి పార్టీ బలంగా ఉన్నట్లు టీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించింది. కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలున్నప్పటికీ సొంత పార్టీ నేతల్లోనూ లుకలుకలుండడం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్లు అంతర్గత సర్వేలో తేలడంతో ఈ సెగ్మెంట్పై పట్టు సాధించేందుకు మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్ రంగంలోకి దించింది. ముఖ్యంగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను సద్దుమణిగేలా చేయడం, ప్రత్యర్థులను బలహీనపరిచే బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లో విజయ పతాకం ఎగురవేయడం కేటీఆర్కు సవాలుగా మారింది. రేవంత్ ఓటమే ధ్యేయంగా.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఓటమే ధ్యేయంగా టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాలకు పదునుపెడుతోంది. ఆర్నెల్ల క్రితమే టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ను ఉప ఎన్నికల్లో ఓడించాలని భావించింది. అయితే, ఆయన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్కు కాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఇవ్వడంతో ఉప ఎన్నికకు చాన్స్లేకుండా పోయింది. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే చావుదెబ్బ తీయాలని అధికారపార్టీ అనుకుంది. అందుకనుగుణంగా కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దాదాపు రాష్ట్ర కేబినెట్ అంతా ఏదో ఒక సందర్భంలో నియోజకవర్గంలో పర్యటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. అంతేగాకుండా 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన గురునాథ్రెడ్డి స్థానే ఎమ్మెల్సీ నరేందర్రెడ్డిని బరిలో దించనున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో గురునాథ్ వర్గీయుల నుంచి అసమ్మతి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎన్నికలొప్పుడొచ్చినా టికెట్ ఖాయమని తేలడంతో నరేందర్రెడ్డి పూర్తిస్థాయిలో కొడంగల్పైనే దృష్టిపెట్టారు. మరోవైపు సోదరుడు, మంత్రి మహేందర్రెడ్డి కూడా నరేందర్ను గెలిపించడం కోసం తనదైన శైలిలో వ్యూహాలు రూపొందించారు. అనూహ్యంగా శాసనసభ రద్దు కావడం.. ఎన్నికలకు నగారా మోగడంతో ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడం టీఆర్ఎస్కు తప్పనిసరి అయింది. శాసనసభ లోపల, బయటా మాటల చాతుర్యంతో కొరకరాని కొయ్యగా మారిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డిని ఓడించకపోతే చికాకు తప్పదని గులాబీ దళపతి కేసీఆర్ అంచనా కొచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ని మట్టికరిపించేందుకు ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్రావును తెరమీదకు తెచ్చారు. స్టార్ క్యాంపెయినర్గా నరేందర్రెడ్డిని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యతను అప్పగించారు. -
కేసీఆర్కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం : హరీష్రావు
గజ్వేల్ : ఆపద్ధర్మ సీఎం కేసీఆర్కు గజ్వేల్లో లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తూప్రాన్ను మున్సిపాలిటీగా మార్చిన ఘనత కేసీఆర్దేనని చెప్పుకొచ్చారు. రీజినల్ రింగ్ రోడ్తో ఈ ప్రాంతం అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. గురువారం తూప్రాన్ రోడ్షోలో పాల్గొన్న హరీష్ రావు రూ 6వేల కోట్లతో గజ్వేల్లో ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. కంటివెలుగులతో పేదలకు వైద్యం దరిచేర్చిన కేసీఆర్కు ఓటేయాలని, గజ్వేల్ గెలుపుపై అనుమానం లేదని ఇండియా టుడే సర్వే కూడా ఇదే విషయం వెల్లడించిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించి తిరిగి టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపడతుందని హారీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తాగునీరు, విద్యుత్ను అందించడంతో పాటు గోదావరి నీటితో తూప్రాన్ను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. టీఆర్ఎస్ది జనం యాత్ర విపక్షాలు టికెట్ల కోసం జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారిది ఢిల్లీ, అమరావతి యాత్ర అయితే టీఆర్ఎస్ది జనం యాత్రని అన్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్, టీడీపీలను గెలిపించినా ఆయా పార్టీలు కనీసం తాగునీటిని సైతం కల్పించలేకపోయాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్, హరీశ్రావులపై చర్యలేవి?’
హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో కీలక పాత్రధారులుగా ఉన్న కేసీఆర్, హరీశ్రావు, కాశీపేట లింగయ్యలపై చర్యలేవని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. పద్నాలుగేళ్ల నాటి కేసును వెలికితీసి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం హర్షించదగ్గ అంశమేనని, కేసీఆర్పై ఉన్న అభియోగాలపై చట్టం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి కేసీఆర్ లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బుధవారం ఇక్కడి తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కొండగట్టు ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అన్నదాతకు అందలం
సాక్షి, సిద్దిపేట : రైతుల కష్టాలు స్వయంగా చూసిన ముఖ్యమంత్రిగా ప్రతి అడుగూ రైతు కోసం.. ప్రతీ పథకం రైతు సంక్షేమం కోసం.. ప్రవేశపెడుతూ అన్నదాతను అందలానికి ఎత్తుతున్న ఏకైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులు బీమా పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో పహానీ నఖలు, పట్టాదారు పాస్పుస్తకాల కోసం రైతులు.. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగే వారని అన్నారు. కానీ ఇప్పుడు భూ ప్రక్షాళన చేసిన పట్టాదారు పాస్పుస్తకాలు రైతుల ఇంటికి తెచ్చి ఇస్తున్నారని ఆయన అన్నారు. అడగకుండానే రైతు బంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా.. అంటూ రైతుల అవసరాలు తీరుస్తున్నారని వివరించారు. దీంతో రైతుల్లో తమకు ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం పెరిగిందని అన్నారు. ఒక్క సాగునీటి సమస్య తీరితే తెలంగాణ ప్రాంతం కోనసీమను తలదన్నే విధంగా మారుతుందని అన్నారు. అందుకోసమే గోదావరి జలాలు తెలంగాణ పొలాలకు పారించాలనే తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు. కాళేశ్వరం పూర్తి చేసి తీరుతాం.. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పోచంపల్లి, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కట్టిందని.., అదే టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తుందని చెప్పారు. ఇప్పటికే మిషన్ కాకతీయ పనులతో పూర్వ వైభవం సంతరించుకున్న చెరువుల్లో గోదావరి జలాలు నింపే రోజులు దగ్గరకు వచ్చాయని.. వచ్చే వానాకాలం వరకు చెరువులు నింపి మత్తడి దునికేలా చేస్తామని అన్నారు. రైతులకు మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోవడంలేదని, వారి వక్రబుద్ధిని ప్రదర్శించి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ వారికే సంక్షేమ పథకాలు వర్తింపజేసేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు, అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులైన జీవన్రెడ్డి, షబ్బీర్ అలీకి కూడా రైతు బంధు చెక్కులు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి, ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, సిద్దిపేట, నంగునూరు ఏఎంసీ చైర్మన్లు వెంకట్రెడ్డి, సురేందర్, పీఏసీఎస్ చైర్మన్లు రమేష్గౌడ్, సోమిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘సేఫ్ సిద్దిపేట’ను రూపొందిద్దాం సిద్దపేటజోన్: శాంతి భద్రత పరిరక్షణలో పోలీస్శాఖకు తోడ్పాటుగా ఆయా వార్డుల్లో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సేఫ్ సిద్దిపేటగా మారుద్దామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని 14వ వార్డును వందశాతం సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన తొలి వార్డుగా ప్రకటించి నిఘా వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా ఐదుగురు పోలీస్లతో సమానమని అన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో 200పైగా కెమెరాలు ఏర్పాటు చేసి వన్టౌన్ పోలీస్స్టేషన్లో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 14వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంపత్రెడ్డితో పాటు వైద్యులను మంత్రి అభినందించారు. జనవరి 1నాటికి జిల్లాలో అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో వందశాతం సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి రాష్ట్రంలోనే మెట్టమొదటి జిల్లాగా చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా పోలీస్శాఖ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 2000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని జనవరి 1నాటికి ప్రతి గ్రామంలో మొత్తంగా 10వేల కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రజలను, వ్యాపారులను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్రెడ్డి, చిప్ప ప్రభాకర్రెడ్డి, మరుపల్లి శ్రీనివాస్గౌడ్, తాళ్లపల్లి సత్యనారాయణ, నాయకులు శర్మ, చంద్రం, భీమసేన,Ðð వైద్యులు భాస్కర్రావు, గాయత్రి రవీంద్రనాథ్, వీవీరావు, పెద్దిరాజు, లక్ష్మీశ్రీనివాస్, చంద్రశేఖర్, గణేష్, మురళీక్రిష్ణ, చందర్తో పాటు వార్డు ప్రతినిధులు పాల్గొన్నారు. -
సిద్దిపేట ప్రజలకు హరీశ్రావు గ్రీన్ చాలెంజ్..
సాక్షి, సిద్దిపేట: ‘నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన యువత.. నేడు బంగారు తెలంగాణలో భాగస్వామ్యులు కావాలి. అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడండతో పాటు సర్కార్ పనితీరును ప్రజలకు వివరించే వారధులు మీరే’ అని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వీ రాజకీయ శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది యువకులే అంటూ వారి త్యాగాలను గుర్తుచేశారు. అనతి కాలంలోనే తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తోందని స్వయానా ప్రధాన మంత్రి చెప్పారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించడం, వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్, విద్యార్థులకు సన్నబియ్యం భోజనం, 570 ఇంగ్లిష్ మీడియం గురుకులాల ఏర్పాటు, విదేశాల్లో విద్య అభ్యసించే వారికి రూ.20 లక్షల ప్రోత్సాహకం.. ఇలా తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రం కోసం చావు నోటి వరకు వెళ్లొచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి కావడంతోనే ఈ పథకాలు అమలవుతున్నాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో అన్నింటా సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఉత్తమ మున్సిపాలిటీగా, ఉత్తమ మండంగా, ఉత్తమ గ్రామంగా సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామాలు నిలిచాయన్నారు. గతంలో ఎంప్లాయిమెంట్ కార్డు కోసం, డీఈఓను కలిసేందుకు, కలెక్టర్ను కలిసేందుకు సంగారెడ్డి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు సిద్దిపేట జిల్లా కావడంతో ఇబ్బందులు తీరాయని మంత్రి చెప్పారు. సిద్దిపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చరిత్రలో మిగిలిపోతుందన్నారు. నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, ముగులులో హార్టికల్చల్, ఫారెస్టు యూనివర్సీటీల ఏర్పాటు, రూ.18 కోట్లతో పీజీ కళాశాల అభివృద్ధి, రూ.2.5 కోట్లతో మహిళా డిగ్రీకళాశాల నిర్మాణం, ఇర్కోడులో ఐటీఐ ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో మన యువత ముందు ఉండేందుకు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, ఉచిత భోజనంతో కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో యువత పాల్గొని హరిత సిద్దిపేటగా మార్చాలని కోరారు. ఉత్సాహం నింపిన దేశపతి మాట.. పాట టీఆర్ఎస్వీ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్రావు తన ఆటా.. పాటలతో యువతలో ఉత్సాహం నింపారు. మధ్యమధ్యలో నందినీ సిధారెడ్డి రాసిన ‘నాగేటి సాలల్ల నా తెలంగాణ.. నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ..’ అని పాడుతూనే తెలంగాణ ప్రజలకు పాలపిట్ట ఎంత ఇష్టమో చెప్పారు. అదేవిధంగా ‘జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి..’ అంటూ అందె శ్రీ పాటను దేశపతి పాడుతుండగా మంత్రి హరీశ్రావు, విద్యార్థులు కోరస్ ఇవ్వడం విశేషం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టీఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ సారయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, బర్ల మల్లికార్జున్, టీఆర్ఎస్వీ నాయకులు మహేశ్, శేఖర్గౌడ్, మాదాస్ శ్రీనివాస్, ప్రొఫెసర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నా ప్రయత్నానికి మీరు అండగా నిలవాలి సిద్దిపేటజోన్ : ప్రతి ఒక్కరూ హరిత ఉద్యమంలో కలిసి వచ్చి నా ప్రయత్నానికి అండగా నిలిచి కాలుష్య భూతాన్ని తరుముదామంటూ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్గా మారిందని, దీనివల్ల పర్యావరణానికి ఇబ్బందిగా మారడంతో పరోక్షంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు కారకాలుగా మారుతున్నాయన్నారు. ఈ భూతాన్ని తరిమేందుకు ప్రతి ఒక్కరు మొక్క నాటాలని పిలుపునిచ్చారు. మీరంతా కలిసి వస్తే సిద్దిపేట, తెలంగాణ నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తొలగించే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట ప్రజలకు మంత్రి గ్రీన్ చాలెంజ్... ఇటీవల హరిత ఉద్యమాన్ని చేపట్టామని ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని గ్రీన్ చాలెంజ్ చేస్తున్నామని, తనతో పాటు మీరు కూడా తప్పని సరిగా మొక్కలు నాటాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు చాలేంజ్ విసిరారు. దీని ద్వారా హరితసిద్దిపేటగా మారే అవకాశం ఉందన్నారు. నిజాయితీ గల గడ్డ సిద్దిపేట... మంత్రి ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి పథకం చెక్కులను ఇస్తున్న తనకు మీరు ఒక హామీ ఇవ్వాలని, ఇస్తారా అంటూ సభా ముఖంగా ప్రశ్నించారు. తాను అడిగేది ఏమిటో తెలుసా.... మాట ఇచ్చాక మరచిపోవద్దని షరతు విధించారు. నేను అడిగేది ఏమిటో తెలుసా అంటూ వారిని ప్రశ్నించగా అందులో కొందరు ఓటు ఇవ్వామంటారా అని చెప్పడంతో మంత్రి నవ్వుతూ సిద్దిపేట ప్రజలు ఎంతో మంచివారని, సిద్దిపేట నిజాయితీ గల గడ్డ అని, పనిచేసే వారిని ఆశీర్వదించే గుణం మీదని అందుకే పలు ఎన్నికల్లో నన్ను గెలిపించారన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మరోసారి పిలుపునిచ్చారు. అనంతరం రంగనాయక సాగర్ కాలువ కోసం భూములు ఇచ్చిన 163మందికి రూ.10.11కోట్లు, అదేవిధంగా 276 లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ. 2.26కోట్లు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు మల్లికార్జున్, ఆనంద్, వెంకట్గౌడ్, చిన్న, మోహిజ్, కనకరాజు, నర్సయ్య, ఎంపీపీబీ మాణిక్యరెడ్డి, శ్రీకాంత్రెడ్డి ,యాదయ్య, తహసీల్దార్లు పరమేశం, జానకీ,రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు. హరిత సమాజాన్ని నిర్మిద్దాం చిన్నకోడూరు(సిద్దిపేట) : జన్మనిచ్చిన నేలకు నేనేమిచ్చాని ఆలోచన చేసి అందరం చెట్లు పెంచుదామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. బుధవారం చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య 9వ వార్షికోత్సవ సభలో మాట్లాడారు. 27 మహిళా గ్రామ సమాఖ్య సంఘ సభ్యులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. 74 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులు అందజేశారు. మండల గ్రామైఖ్య సంఘ మహిళలు పొదుపు చేసుకుంటున్న తీరు తెన్నులపై ఆరా తీశారు. ప్రభుత్వ సేవలు విస్తరించాలి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిని చాలా బాగా చేశాం. ఆసుపత్రుల సేవలు వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తేవాలని, ఆస్పత్రి సేవలపై నమ్మకం కలిగేలా విస్తరింపజేయాల్సిన బాధ్యత మీపై ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట ఆస్పత్రిలో సకల సదుపాయాలు సమకూర్చి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని రక్తశుద్ధి కేంద్రం, ఐసీయూ, కిడ్ని వ్యాధి గ్రస్తులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. పేదరికంలో ఉన్న వారికి బాలసదనం, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో చదివిస్తామని, అలాంటి వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి , స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తేవాలన్నారు. హరిత సమాజాన్ని నిర్మిద్దాం..అందుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ కమల, మార్కెట్ కమిటీ చైర్మన్ కుంట వెంకట్రెడ్డి, సర్పంచ్ కాముని ఉమేష్, టీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త రాధాకృష్ణశర్మ, తహసీల్దార్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లు జిల్లాకు ఏం జేసిండ్రు?
నల్లగొండ: ‘తెలంగాణ రాష్ట్రం రావడం నల్లగొండ జిల్లా ప్రజల అదృష్టం. ఇన్నేళ్లూ కాంగ్రెస్ నాయ కులకు ఓట్లేసి పెద్ద నాయకులుగా తయారు చేస్తే వారంతా కలిసి జిల్లాను ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా మార్చారు. ఈ జిల్లాను ముంచి పులిచింతల ప్రాజెక్టు నిర్మించి ఆంధ్రాకు బహుమానంగా ఇచ్చారు’ అని ఆ జిల్లా కాంగ్రెస్ నాయకులపై నీటి పారుదల, మార్కెటింగ్ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గండికొట్టి నాగార్జునసాగర్కు నీరు రానివ్వకుండా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణానికి పాటుపడ్డారే తప్ప.. జిల్లా అభివృద్ధికి వారు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఆదివారం నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీశ్రెడ్డి, రైతు సమన్వయతి సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి ఆయన నకిరేకల్లో నిమ్మ, నల్లగొండలో బత్తాయి మార్కెట్లను ప్రారంభించారు. అనంతరం నల్లగొండ మార్కెట్ యార్డులో జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో మరేమంత్రి చేపట్టలేని మంత్రి పదవులు అనుభవించిన జానారెడ్డి, మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి రైట్ హ్యాండ్గా తిరిగిన ఉత్తమ్కుమార్రెడ్డి, నా అంత పవర్ఫుల్ మంత్రి లేడని గర్వంగా చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ జిల్లాకు ఏం చేసిండ్రు? అని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో కాంగ్రెస్ నాయకులు చేయలేని అభివృద్ధి పనులు నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ, మూసీ కాలువల ఆధునీకరణ, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయడంలో కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. పెద్ద నాయకులమని చెప్పుకునే వీరు జిల్లాకు మెడికల్ కాలేజీని ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలో కొనసాగితే మరో పులిచింతల ప్రాజెక్టు నిర్మించి ఆంధ్రాకు అప్పగించేవారని ఎద్దేవా చేశారు. ఆంధ్రా ఏజెంట్లుగా పనిచేశారు... జిల్లా కాంగ్రెస్ నేతలు ఆంధ్రా పాలకులకు ఏజెంట్లుగా పనిచేశారని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించా రు. వారంతా జిల్లాలోని ఫ్లోరైడ్ నిర్మూలనకు కృషి చేయలేదన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వీరేశం, కిషోర్, ఫైళ్ల శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైట్.. రైట్..!
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఆర్టీసీ సమ్మె అంశం సానుకూలంగా పరిష్కారమైంది. గుర్తింపు కార్మిక సంఘం డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. 16% మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చేందుకు అంగీకరించింది. మిగతా అంశాలపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో సోమవారం తెల్లవారు జాము (11వ తేదీ) నుంచి తాము తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రకటించింది. దీంతో ఆర్టీసీ సర్వీసులు యథాతథంగా కొనసాగనున్నాయి. మరోవైపు టీఎంయూ నేతల తీరుపై ఆర్టీసీలోని ఇతర కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. వేతన సవరణ కాకుండా ఐఆర్కు అంగీకరించడం సరికాదని, ఇది కార్మికులను దగా చేయడమేనని ఆరోపించాయి. కొద్దిరోజులుగా టెన్షన్.. కొంతకాలంగా వేతన సవరణ కోసం డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు.. ఈ నెల 11 నుంచి సమ్మెకు దిగుతామని నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం, కార్మిక సంఘాలు పట్టుదలకు పోవడంతో కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొంది. 2015లో ఎనిమిది రోజులు సమ్మె తర్వాతగానీ రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణకు అంగీకరించలేదు. ఈసారి కూడా అదే తరహా పరిస్థితి నెలకొనేలా కనిపించింది. ముఖ్యంగా సమ్మెకు వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, సమ్మెలో పాల్గొనే ఉద్యోగులను తొలగిస్తామని, ఆర్టీసీని మూసివేసే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించడం ఒక్కసారిగా వేడి రగిలించింది. దీనిపై కార్మిక సంఘాలు తొలుత ఆందోళన చెందినా.. సీఎం బెదిరింపులకు బెదరబోమని, సమ్మె చేసి తీరుతామని ప్రకటించాయి. కానీ హరీశ్ నేతృత్వం లోని మంత్రుల బృందం రంగంలోకి దిగి.. అటు కార్మిక సంఘాలతో, ఇటు సీఎంతో చర్చలు జరపడం ప్రారంభించాక పరిస్థితిలో మార్పు వచ్చింది. శాంతించిన సీఎం.. కార్మిక సంఘాల తీరుపై తొలుత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చివరికి సానుకూలంగా స్పందించారు. మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించేందుకు అంగీకరించారు. దీంతో ఆదివారం గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ, మంత్రుల బృందానికి మధ్య ఇదే అంశంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. తొలుత 25% ఐఆర్ ఇవ్వాలని కోరిన కార్మిక సంఘం నేతలు.. కనీసం 18 శాతానికి తగ్గకుండా ప్రకటించాలని పట్టుబట్టారు. ఇటు సీఎం అనుమతి మేరకు మంత్రులు తొలుత 10 శాతం ఐఆర్ ఇస్తామని కార్మిక సంఘం నేతలకు చెప్పారు. కానీ కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో రెండు మూడు సార్లు అటు సీఎంతో, ఇటు కార్మిక సంఘంతో సమావేశమైన మంత్రులు.. చివరికి 16 శాతం ఐఆర్ ఇస్తామని, సమ్మె విరమించుకోవాలని కోరారు. దీనికి టీఎంయూ నేతలు సమ్మతించడంతో సమస్య సానుకూలంగా పరిష్కారమైనట్టయింది. ఆదివారం సాయంత్రం మంత్రులు, టీఎంయూ నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, చర్చలు సఫలమైనట్టు ప్రకటించారు. తమ డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున.. సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు టీఎంయూ నేతలు వెల్లడించారు. ఇక ‘ఆర్టీసీ’ని సరిదిద్దే చర్యలు! ప్రస్తుతం ఆర్టీసీకి రూ.3 వేల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. సాలీనా రూ.680 కోట్ల నష్టాల్లో కొనసాగుతోంది. తాజాగా 16 శాతం ఐఆర్ ఇవ్వనుండటంతో ఏటా రూ.200 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా వేశారు. ఇది సంస్థపై పెనుభారం చూపే అంశం కావడంతో.. ఆర్టీసీలో దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీకి ఉన్న అప్పులను తీర్చడంలో వన్టైం సెటిల్మెంట్ కింద కొంత బాధ్యత తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్టీసీకి డీజిల్ ధరల పెరుగుదల పెనుభారంగా మారిన నేపథ్యంలో... డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని, మోటారు వాహనాల పన్ను మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. కొంతకాలంగా నియామకాలు లేక ఖాళీగా ఉన్న దాదాపు 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలాంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘం నేతలు, ఐఏఎస్ అధికారులు, పౌర సమాజం నుంచి ప్రతినిధులు అందులో సభ్యులుగా ఉంటారు. రెండు మూడు రోజుల్లో ఈ కమిటీ ఏర్పాటు ప్రకటన ఉంటుందని మంత్రుల బృందం వెల్లడించింది. కమిటీ అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఇక చిన్నచిన్న విషయాలపై కండక్టర్లు, డ్రైవర్లను సస్పెండ్ చేస్తుండటంతో వారి ఉద్యోగ భద్రతకు భంగం కలుగుతోందన్న కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ అంశాల్లో క్రమబద్ధమైన నిర్ణయాలు తీసుకునేందుకు మరో కమిటీ వేయనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెకు సంబంధించి 27 రోజుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలన్న డిమాండ్ కూడా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. దీనిపై గతంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయినా అమలుకాకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని, వెంటనే అమలు చేయాలని ఆదేశించారని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. దానికి సంబంధించి బకాయిలను నగదు రూపంలో చెల్లించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు దాదాపు రూ.80 కోట్లను కార్మికులకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది కార్మికులను దగా చేయడమే.. టీఎంయూపై ఇతర కార్మిక సంఘాల ఆగ్రహం: కేవలం మధ్యంతర భృతికి అంగీకరించి సమ్మె విరమించడం గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ వైఫల్యమేనని ఆర్టీసీలోని ఎన్ఎంయూ, ఈయూ, టీజేఎంయూ తదితర ఏడు కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు వేతన సవరణ దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నప్పుడు.. ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతితో సరిపుచ్చటం వారిని దగా చేయడమేనని విమర్శించాయి. టీఎంయూ మరోసారి కార్మికులను మోసం చేసిందని, కార్మికుల ఆశలపై నీళ్లు చల్లి తక్కువ మధ్యంతర భృతికి అంగీకరించిందని ఎన్ఎంయూ నేతలు నాగేశ్వరరావు, కమల్రెడ్డి, నరేందర్, మౌలానా తదితరులు ఆరోపించారు. టీఎంయూ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి నిరసనగా సోమవారం తమ సంఘం నిరసన ప్రదర్శనలు చేస్తుందని ప్రకటించారు. ఇక టీఎంయూ ప్రభుత్వ బెదిరింపులకు భయపడి తక్కువ ఐఆర్కు అంగీకరించిందని టీజేఎంయూ నేత హనుమంతు ఆరోపించారు. తమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అన్ని డిపోల ఎదుట టీఎంయూ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. ఆర్టీసీ లెక్కలివీ.. 54,000 కార్మికుల సంఖ్య 3,000 కోట్లు..ప్రస్తుతం ఆర్టీసీ అప్పులు గత వేతన సవరణ 44% ఫిట్మెంట్ దానితో ఆర్టీసీపై పడిన భారం750కోట్లుసాలీనా 680కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు 200కోట్లు..తాజాగా ఐఆర్తో ఏటా అదనపు భారం -
అనాథ చిన్నారుల మధ్య హరీశ్ జన్మదిన వేడుకలు
గజ్వేల్ : అనాథ చిన్నారుల మధ్య నీటి పారుదల శాఖామంత్రి హరీశ్రావు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దుబ్బాక పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆశాజ్యోతి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు చిన్నారుల మధ్య కేక్ను కట్ చేసి తినిపించారు. చిన్నారుల సంక్షేమం కోసం రూ. 25వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, కేసీఆర్ యువసేన అధ్యక్షుడు అనూప్, ఆశాజ్యోతి డైరెక్టర్ ఫాదర్ ఆల్వీన్ తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రికి ‘కాళేశ్వరం’ జలాలు
సాక్షి, హైదరాబాద్: కరువుపీడిత యాదాద్రి భువ నగిరి జిల్లాకు వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు జలాలందుతాయని నీటిపారుదల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఈ మేరకు గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల నిర్మాణపనులను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగాన్ని, ఏజెన్సీలను ఆదేశించారు. యాదాద్రి జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ 15, 16 పనులను గురువారం జలసౌధలో సమీక్షించారు. గంధమల రిజర్వాయర్ పూర్తికాకపోయినా డిస్ట్రిబ్యూటరీల పనులు మాత్రం పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తే, వాటి ద్వారా 100 చెరువులు నింపి యాదాద్రి జిల్లాలో కనీసం 21 వేల ఎకరాలకు సాగునీరివ్వొచ్చని చెప్పారు. ఇంకా కృషి చేస్తే దాదాపు 40 వేల ఎకరాలకు కూడా సాగునీరిచ్చే అవకాశాలున్నాయన్నారు. ఈ డిస్ట్రిబ్యూటరీల కోసం వారం, పది రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో డిస్ట్రిబ్యూటరీల పనులు, స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గంధమల్ల చుట్టుపక్కల ఎన్ని గొలుసుకట్టు చెరువులున్నాయి.. ఎంత ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చో వెంటనే వివరాలివ్వాలని సూచించారు. మల్లన్నసాగర్ నుంచి గంధమల్ల వరకు 35 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వవిప్ గొంగిడి సునీతారెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం సీఈ హరిరామ్ తదితరులు పాల్గొన్నారు. -
హరీష్రావు లేఖకు దేవినేని స్పందన
అమరావతి: ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల రాసిన లేఖకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం అంటూ హరీష్రావుకు రాసిన లేఖలో దేవినేని పేర్కొన్నారు. మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి ముందే ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారుల స్థాయిలో సమావేశం జరపాలని హరీష్కు సూచించారు. -
అవకాశాలను అందిపుచ్చుకోండి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచీకరణతో వస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విద్యను ఉపాధి మార్గంగా కాకుండా సాధికారత సాధించే సాధనంగా చూడాలన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ (హైదరాబాద్) ఎనిమిదో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత్లో వృత్తి నైపుణ్యాలకు కొదవలేదని, నైపుణ్యాలను మెరుగు పరచుకునేందుకు అన్నివర్గాల వారు ప్రయత్నించాలన్నారు. ఉన్నత విద్య, ఉపాధి కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి తాను వ్యతిరేకం కాదన్నారు. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చదువుకుని, సంపాదించుకుని మాతృదేశా నికి తిరిగి రావాలన్నారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ తెలుగును తప్పని సరి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అందరికీ ఉద్యోగాలు అసాధ్యం: మంత్రి హరీశ్రావు ఒకటిన్నర నుంచి 3% మందికి మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. తెలుగు విద్యార్థులు అఖిల భారత సర్వీసుల్లో ఎక్కువ సంఖ్యలో చేరాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ, విద్యుత్, మిషన్ కాకతీయ, హరితహారం తదితర పథకాల ద్వారా ప్రభుత్వం తాగునీరు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల సమస్యలను తీర్చే దిశగా అడుగులు వేసిందన్నారు. పర్యావరణ మార్పులపై యువ ఇంజినీర్లు పరిశోధనలు చేసి పరిష్కారం చూపాలని పిలుపునిచ్చారు. గీతం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవం సందర్భంగా వైస్ చాన్సలర్ ఎం.ఎస్. ప్రసాదరావు వార్షిక నివేదిక సమర్పించగా, చాన్సలర్ ప్రొఫెసర్ కె.రామకృష్ణారావు స్వాగతోపన్యాసం చేశారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో గీతం వ్యవస్థాపకులు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి, మాజీ ఎంపీ కేఎస్ రావు, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, చింతా ప్రభాకర్, కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్లు పాల్గొన్నారు. -
‘డిండి’పై సభలో దుమారం
సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీటిని తరలించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్మెంట్ అంశంపై గురువారం శాసనసభ కాసేపు అట్టుడికింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో దీన్ని అనుసంధానించకుండా వేరుగా చేపట్టాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గతంలో ఇదే విషయమై సీఎంకు లేఖ రాశారంటూ కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ ప్రాజెక్టుపై 10 నిమిషాలకుపైగా ఆయన ప్రశ్నలు వేయడంతో వంశీ మైక్ కట్ కావడం, ఆయన పోడియంలోకి దూసుకెళ్లడం, మంత్రి హరీశ్రావు కాంగ్రెస్పై ఎదురుదాడికి దిగడంతో సభ గరంగరంగా సాగింది. శ్రీశైలం నుంచి నీరు తీసుకుంటామని.. ప్రశ్నోత్తరాల సందర్భంగా వంశీచంద్ మాట్లాడుతూ ‘‘డిండికి శ్రీశైలం నుంచే నీటిని తీసుకుంటామని జీవో ఇచ్చారు. 2015లో శంకుస్థాపన సందర్భంగా ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అలైన్మెంట్ కూడా ఖరారు కాలేదు. అప్పుడు శ్రీశైలం ఫోర్షోర్ అని చెప్పి ఇప్పుడు పాలమూరుకు అనుసంధానించారు. మేమే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. పాలమూరుతో అనుసంధానిస్తే రాజకీయ అశాంతి నెలకొంటుందని మంత్రులు ఆందోళన వెలిబుచ్చారు’’అని పేర్కొన్నారు. ఈ సమయంలో వంశీచంద్ మైక్ను స్పీకర్ మధుసూదనాచారి కట్ చేసి అధికార పార్టీ సభ్యుడు గువ్వల బాలరాజుకు ఇచ్చారు. దీంతో వంశీచంద్ నిరసన వ్యక్తం చేశారు. అయినా స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో వంశీ పోడియంలోకి దూసుకెళ్లగా ఆయనకు స్పీకర్ మైక్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిండికి వేరుగా నీటిని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం వంశీచంద్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్రావు ఘాటుగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి సభలోనే కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నల్లగొండ జిల్లాకు సంబంధించి డిండిపై చర్చ జరుగుతుంటే జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, పద్మావతిరెడ్డి సభలో లేరు. కాంగ్రెస్ నేతలు జిల్లాకో మాట మాట్లాడుతున్నారు. ఇది వారి కుటిలనీతి’’అని దుయ్యబట్టారు. డిండి ప్రాజెక్టు ఆలస్యంపై ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించాల్సింది గాంధీభవన్లో కానీ సభలో కాదని విమర్శించారు. ‘‘ఆ పార్టీ నేతలు హర్షవర్దన్రెడ్డి, పవన్కుమార్లు గండుపిల్లి కూడా లేని దగ్గర పెద్ద పులులున్నాయని, ఆముదం మొక్క కూడా లేనిచోట మహా వృక్షాలు ఉన్నాయని ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేశారు. నిజంగా నీళ్లు రావాలని కాంగ్రెస్ కోరుకుంటే మొదట కేసులు ఉపసంహరించుకొని ప్రాజెక్టుకు సహకరించాలి’’అని సూచించారు. ప్రజాధనం వృథా కావొద్దనే.. : హరీశ్ శ్రీశైలం నుంచి డిండికి నీటిని వేరుగా తీసుకుంటే అదనంగా పంప్హౌస్, సర్జ్పూల్ వంటి నిర్మాణాలతో అధిక మొత్తం ఖర్చవుతుందని, దీనికితోడు భూసేకరణ, ఇతర అనుమతులతో ఆలస్యం జరుగుతుందని హరీశ్రావు పేర్కొ న్నారు. ఈ దృష్ట్యా పాలమూరులో భాగంగా నిర్మిస్తున్న పంప్హౌస్ ద్వారానే 2 టీఎంసీల నీటిని తీసుకొని అందులో 1.5 టీఎంసీలను పాలమూరు అవసరాలకు, మరో 0.5 టీఎంసీ డిండి అవసరాలకు మళ్లించాలని నిర్ణయించామని, దీని ద్వారా ప్రజాధనం వృథా కాదన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు ఎలాంటి నష్టం ఉండదని, అన్ని జిల్లాలకు సమానంగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. కృష్ణాలో రాష్ట్రానికి కేటాయింపులు పెరగనున్నాయన్నారు. ‘డిండి’కి వ్యతిరేకం కాదు మీడియాతో వంశీచంద్ డిండి ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో అనుసంధానించడాన్నే తాము వ్యతిరేకిస్తున్నాం తప్ప డిండి ప్రాజెక్టును కాదని వంశీచంద్రెడ్డి చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ డిండి ప్రాజెక్టును పాలమూరుతో అనుసంధానం చేస్తే మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి హరీశ్రావు శాసనసభలోనే అబద్ధాలు చెప్పారని విమర్శించారు. డిండితో పాలమూరు ప్రాజెక్టును అనుసంధానిస్తే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాజకీయ అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు. -
స్థలాలు చూపిస్తే రైతు బజార్లు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ప్రస్తుతం 48 ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయాలు విక్రయిస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలో మరో 52 ప్రాంతాలకు ఈ సేవలను విస్తరింపజేస్తామని చెప్పారు. రహదారులకు సమీపంలో స్థలాలను సమీకరించి ఇస్తే రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మండలిలో సభ్యుల ప్రశ్నలకు బదులిచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు కాంగ్రెస్ పాలకులు రాష్ట్రానికి అనుకూలం గా వాదనలు వినిపించకుండా అన్యాయం చేశారని, ఈ నష్టాన్ని పూడ్చేందుకు ట్రిబ్యునల్తోపాటు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు.ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేత షబ్బీర్ అలీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ స్వామిగౌడ్ తిరస్కరించారు. -
ఏడాదిలోగానే ‘పునరుజ్జీవం’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్కు నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన పునరుజ్జీవ పథకంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రెండు పంటలకు నీళ్లు అందుతాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పునరుజ్జీవ పథకాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. సంవత్సర కాలంలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో టీఆర్ఎస్ సభ్యులు మనోహర్రెడ్డి, కె.విద్యాసాగర్రావు, బీజేఎల్పీనేత జి.కిషన్రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్రావు సమాధానమిచ్చారు. ప్రభుత్వం పునరుజ్జీవ పథకానికి రూ.1,067 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చిందని, వరద కాల్వ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి తరలిస్తామని చెప్పారు. దీనికితోడు ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సైతం నీళ్లిచ్చేలా కాల్వల ఆధునీకరణ చేపట్టామన్నారు. ప్రజలపై భారం పడుతుందనే.. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంచితే 99 శాతం ప్రజలపై తీరని భారం పడుతుందని.. అందువల్లే పెంచడం లేదని హరీశ్రావు తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువ పెంచకపోవడంతో ప్రాజెక్టుల కింద భూమిని కోల్పోతున్న నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ సభ్యుడు టి.జీవన్రెడ్డి సభ దృష్టికి తేగా.. హరీశ్ సమాధానమిచ్చారు. కాంగ్రెస్ హయాంలో భూసేకరణకు రూ.60 వేల నుంచి రూ.2 లక్షలకు మించి పరిహారం చెల్లించలేదని.. తాము ప్రస్తుతం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ విలువ రూ.60 వేల వరకే ఉన్న చోట మూడింతల పరిహారం లెక్కన రూ.1.80 లక్షలు మాత్రమే వస్తాయని.. కానీ తమ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి సైతం రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల పరిహారం అందిస్తోందని పేర్కొన్నారు. ఇక మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.65.56 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేశామని మరో ప్రశ్నకు మంత్రి హరీశ్రావు సమాధానమిచ్చారు. ఈ పనులను 18 నెలల్లో పూర్తిచేసి, చివరి ఆయకట్టు వరకు నీరిందిస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులపై విమర్శలొద్దు: కేసీఆర్ ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులపై వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయొద్దని కేసీఆర్ పేర్కొన్నారు. పడకల సంఖ్యకు మించి రోగులు వస్తున్నారని, వైద్యులు మానవతా దృక్పథంతో వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యుడు జలగం వెంకటరావు అడిగిన ప్రశ్నపై సీఎం స్పందించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భయంకరమైన స్థితిలో కూరుకుపోయిన వైద్యారోగ్య శాఖకు తాము జీవం పోస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న వైద్య రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ఇటీవల తాను ఓ పత్రికలో ఒక వార్తను చూశానని.. ఓ ప్రభుత్వాస్పత్రిలో బెడ్లు లేవని, కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి చికిత్స అందిస్తున్నారని ఫొటోతో సహా ఓ కథనాన్ని ప్రచురించారని చెప్పారు. దానిపై తాను వైద్యారోగ్య మంత్రి, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడితే.. అసలు విషయం తెలిసిందన్నారు. ప్రతి ఆస్పత్రిలో నిర్ణీత సంఖ్యలో పడకలు ఉంటాయని, అంతకు మించి రోగులు రావడంతో వైద్యులు, సిబ్బంది అలా చేయాల్సి వచ్చినట్లుగా వెల్లడైందని చెప్పారు. అందరికీ వైద్యం అందించాలన్న సదుద్దేశం, మానవతా దృక్పథంతో వైద్యులు వ్యవహరిస్తే.. విమర్శిస్తూ కథనాలు ప్రచురించడం సరికాదన్నారు. తర్వాత తాను సదరు పత్రిక యాజమాన్యానికి ఫోన్ చేశానన్నారు. విషయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయొద్దని.. వైద్యులను ప్రోత్సహించాలని సూచించినట్లు తెలిపారు. రోగుల సంఖ్య పెరిగినా చిత్తశుద్ధితో వైద్యం అందిస్తున్న ప్రభుత్వ వైద్యులను అభినందిస్తున్నానన్నారు. సమయ పాలనపై వద్దా? శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయపాలన అంశంపై బుధవారం అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల్లో ఎక్కువ సమయం తీసుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, జీవన్రెడ్డిలను సభా వ్యవహారాల మంత్రి హరీశ్రావు తప్పుబట్టారు. వారు 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుని.. సంబంధం లేకుండా ప్రశ్నలు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకే మంత్రికి 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లి అధికారపక్షం తమకు సమయం ఇవ్వడం లేదంటోందని విమర్శించారు. ప్రశ్న సూటిగా వేస్తే మంత్రి క్లుప్తంగా సమాధానం ఇస్తారన్నారు. ఖమ్మం జిల్లాలో బోదకాలు వ్యాధిపై మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడితే.. మీరేమో జహీరాబాద్, జగిత్యాల జిల్లాల్లో ప్రబలిన వ్యాధులను ప్రస్తావిస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. దీంతో హరీశ్రావు తీరును కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కూడా పలువురు సభ్యులు ఇదే తీరులో ప్రశ్నలు సంధిస్తుండటంతో స్పీకర్ వారి మైక్ కట్ చేశారు. బోదకాలు బాధితులకు పింఛన్లు: లక్ష్మారెడ్డి రాష్ట్రంలో బోదకాలు (పైలేరియా)ను శాశ్వతంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆ వ్యాధి లక్షణాలున్న వారికి, వ్యాధి సోకిన వారికి మందులు అందజేస్తున్నామన్నారు. బోదకాలు సోకి అంగవైకల్యం వచ్చిన వారికి పింఛన్లు ఇవ్వాలని శాసనసభ్యులు కోరిన నేపథ్యంలో.. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు, పైలేరియాను పూర్తిగా అరికట్టామని తెలిపారు. -
‘కాంగ్రెస్ నేతలు ఒత్తిడిలో ఉన్నారు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మొదటిరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహర శైలిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘సభ సజావుగా సాగేందుకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సభ్యులు వినలేదు. చర్చకంటే రచ్చకే కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రైతులు ఆనందంగా ఉంటే కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రైతు సమస్యలపై చర్చించే సత్తా వారికి లేదు. అందుకు రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు. సభ సజావుగా జరుగుతుంటే కాంగ్రెస్ సభ్యులు ఎందుకు పోడియంలోకి వచ్చి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే సభలో మిగతా ఏ పార్టీలు కూడా కాంగ్రెస్ను పట్టించుకోలేదు. దీంతో ఆ పార్టీ ఏకాకిగా మారిపోయింది. ఏ అంశం మీదైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే సభలో గందరగోళం సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.’ అని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ నేతలు సెల్ప్ గోల్ కొట్టుకున్నారు..
-
రైతుల ఆత్మహత్యలు కొనసాగాలా?
► ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు: హరీశ్రావు ► ప్రజాభిప్రాయ సేకరణకు ఆటంకం కలిగిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగాలని కాంగ్రెస్ నాయ కులు కోరుకుంటున్నారా? రైతుల ఆత్మహ త్యలకు అడ్డుకట్ట వేసేందుకు, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను చేపడుతుంటే.. ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు.. ట్రిబ్యునళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆటంకం కలిగిస్తు న్నారు. ఇటు ప్రజాభిప్రాయ సేకరణను విచ్చిన్నం చేసే చర్యలకు పాల్పడుతున్నారు..’’ అని సాగునీటిశాఖ మంత్రి టి.హరీశ్రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్బాబు పెద్దపల్లిలో చేసిన దాదాగిరీని, రౌడీయిజాన్ని.. ఆ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ సమర్థించడం విడ్డూరమని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్ రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు 11 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ సజావుగా ముగిసిందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజె క్టుకు అనుకూలంగా ఉన్నట్టు ప్రజలు స్పష్టం చేశారని, వేగంగా పూర్తి చేయాలని కూడా కోరారని వివరించారు. ప్రజలు, రైతులు, రాజకీయ పక్షాల ప్రతినిధులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే వాతావరణాన్ని కల్పించినా.. కాంగ్రెస్ పార్టీ చౌకబారు ప్రచారం కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అడ్డుకోవడానికి కుట్రలు ప్రాజెక్టులను అడ్డుకోవడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజాభి ప్రాయ సేకరణ ప్రక్రియ ఇష్టం లేదని హరీశ్రావు పేర్కొన్నారు. పెద్దపల్లిలో ప్రజాభి ప్రాయ సేకరణను భగ్నం చేయడానికి శ్రీధర్బాబు ప్రయత్నించారన్నారు. అందువల్లే పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ వేదికను రాజకీయం చేయడానికి ప్రయత్నిం చారని విమర్శించారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారని.. మెదక్లో కాంగ్రెస్ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా మాట్లాడారన్నారు. మరోవైపు నిబంధన లకు విరుద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందంటూ కేంద్రానికి కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి ఫిర్యాదు చెయ్యడం కూడా కుట్రలో భాగమేనన్నారు. ఇలా ప్రాజెక్టును అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని తెలంగాణవాదులు, ప్రజలు, రైతులకు పిలుపునిచ్చారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతోందని... ఆ చిట్టా విప్పితే ఆశ్చర్యం కలుగుతుందని హరీశ్ పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రక్రియను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిందని.. తమ్మిడిహెట్టి నుంచే నీటిని తరలించాలంటూ మొండి వాదన చేసిందని, మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోలేదని వివరించారు. మహారాష్ట్రతో గోదావరి, ప్రాణహిత, పెన్గంగ నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని స్వాగతించలేక అక్కసుతో విమర్శలు చేసిందని మండిపడ్డారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో టెంట్లు వేసి, కార్యకర్తలను బయటి నుంచి తరలించి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్లు వేసి జీవో 123 అమలుపై స్టే తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో భూసేకరణ మందగించి పనులు జాప్యమయ్యాయన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 30కి పైగా పిటిషన్లు వేశారని, పాలమూరు, డిండి ప్రాజెక్టులపైనా కేసులు వేశారని పేర్కొన్నారు. చివరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లి ప్రాజెక్టులకు అడ్డుపడ్డారని హరీశ్ మండిపడ్డారు. -
సరైన వాదనలు లేకనే పెండింగ్ కేసులు
► అపరిష్కృత కేసులతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం: హరీశ్ ► ప్రాజెక్టుల నిర్మాణంలో న్యాయపర చిక్కులు త్వరగా అధిగమించాలని సూచన సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కేసుల్లో సమర్థవంతమైన వాదనలు లేకపోవడంతోనే ఈ కేసులు కోర్టుల్లో సుదీర్ఘకాలం కొనసాగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఏళ్లతరబడి ఈ కేసులు అపరిష్కృతంగా ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోందని.. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్నారు. శనివారం జలసౌధలో ప్రభుత్వ న్యాయవాదులు, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులను త్వరగా అధిగమించాలని కోరారు. జిల్లాల్లోని వివిధ కోర్టు కేసుల్లో ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదించేందుకు హైదారాబాద్, ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులను నియమించుకోవాలని సూచించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించడానికి సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. దేవాదుల, ఏ.ఎం.ఆర్.పి, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల్లో పలు చోట్ల పది, ఇరవై ఎకరాల భూసేకరణ సమస్యలు కోర్టు కేసుల్లో చిక్కుకున్న కారణంగా వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతున్నట్టు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్లు కాగా పరిహారం చెల్లింపుల కోసం ఏకంగా రూ.1,400 కోట్లు ఖర్చు చేయవలసి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, లా కార్యదర్శి నిరంజన్ రావు, ఈఎన్సీ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
‘హరీష్కు ఏసీ రూంలోనూ చెమటలు’
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం మెక్కిన అవినీతి సొమ్మును కక్కించేవరకు తన పోరాటం ఆపనని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి పనులను ఆధారాలతో సహా బయటపెడితే.. మంత్రి హరీష్రావు దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఏసీ గదిలో కూర్చొని మాట్లాడినా ఆయనకు చెమటలు పడుతున్నాయి. తప్పు చేయకుంటే అంత భయపడాల్సిన అవసరం ఏముంది. టీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టేవరకు వదిలిపెట్టను' అని నాగం అన్నారు. -
మంత్రి హరీష్కు మాజీ ఎంపీ సవాల్
కరీంనగర్: ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని మంత్రి హరీశ్రావు పదేపదే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాంగ్రెస్ చేసిందేమిటో.. టీఆర్ఎస్ చేసిందేమిటో తేల్చుకుందామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఇందుకు మంత్రి హరీష్రావు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. కరీంనగర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న 2013లో భూసేకరణ చట్టాన్ని అమోదించిందని, అప్పుడు కేసీఆర్ కూడా లోక్సభ సభ్యుడేనని గుర్తుచేశారు. 2013 భూసేకరణ చట్టం రైతులను ముంచేలా ఉందని పదేపదే వల్లేవేస్తున్న మంత్రి హరీష్రావు.. ఎంపీగా కేసీఆర్ ఆ చట్టానికి ఎలా ఆమోదం తెలిపి ఓటు వేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెడుతూ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట కాలయాపన చేస్తూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం హరీష్రావుకు తగదన్నారు. తాజాగా 2013 భూసేకరణచట్టాన్ని అమలుచేయకుండా ఉభయసభల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రైతుల, భూనిర్వాసితుల నోట్లో మట్టికొట్టే చర్యలకు టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. 2013 భూసేకరణ చట్టంలో ఉన్నవాటి కంటే భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తే స్వాగతిస్తామని, ఏ ఒక్క నిబంధన రైతులకు హానికలిగేలా ఉన్నా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
'ఆ అక్కసుతోనే పోస్టులు ఇవ్వడం లేదేమో'
హైదరాబాద్సిటీ: వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల సంగారెడ్డి లో ఉందనే అక్కసుతోనే విద్యార్థులకు పోస్ట్ లు ఇవ్వడం లేదేమోనని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ ఆఫీసులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కళాశాలను భారీ నీటి పారుదల శాఖామంత్రి హరీశ్ రావు సిద్ధిపేటకి తీసుకుపోయినా ఫర్వాలేదు. కానీ విద్యార్థులకు న్యాయం జరిగితే చాలన్నారు. ప్రతి సంవత్సరం 280 మంది చొప్పున వ్యవసాయ కళాశాలలో పాస్ అవుతున్నారని, ఇప్పుడు వాళ్లకి ఉద్యోగాలు రావడం లేదన్నారు. హరీష్ రావు , పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసినా ఎలాంటి న్యాయం జరగలేదని జగ్గారెడ్డి అన్నారు. ఇప్పుడేమో మంత్రి పోచారం నావల్ల కాదు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి నే కలవండని విద్యార్థులకు చెబుతున్నాడని చెప్పారు. విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడు ఇస్తుందన్నారు. రేపు(శనివారం) ముంబా హైవేపై వందల మంది విద్యార్థులతో కలిసి రోడ్డు నిర్బంధం చేస్తామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. -
ఈ చిలిపి చేష్టలు, గిల్లికజ్జాలేమిటి?
-
ఈ చిలిపి చేష్టలు, గిల్లికజ్జాలేమిటి?: హరీశ్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభలో ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు అన్నారు. శాసన సభ గౌరవాన్ని కాంగ్రెస్ మంటగలిపిందని మండిపడుతూ వారి చర్యను ఖండించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలొద్దని, హుందాగా వ్యవహరించాలని గత బీఏసీ సమావేశాల్లోనే అందరి సమక్షంలో నిర్ణయించామని, అయినా ఎందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. స్లోగన్లతో సభలో గందరగోళానికి యత్నించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూస్తే.. ‘మేం ఎన్ని రోజులైనా చర్చకు రెడీ. ప్రతి అంశంపై చర్చ పెడతామని ఇప్పటికీ చెబుతున్నాం. గతంలో అది చేశాం.. ఇప్పుడు కూడా చేస్తాం. స్పీకర్ కూడా అన్ని పక్షాలకు ఈ విషయాన్ని చెప్పారు. గతంలో బీఏసీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులొద్దని నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ ఎందుకు స్లోగన్స్ ఇచ్చింది? ఎందుకు ఆ తొందరపాటు? చిలిపిచేష్టలు ఏ ఉద్దేశంతో చేశారు? గిల్లికజ్జాలతో సభను ఎందుకు డిస్ట్రబ్ చేయాలని అనుకున్నారు? ఏదైనా చెప్పాలనుకుంటే రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చెప్పేటప్పుడు చెప్పవచ్చు కదా. అప్పుడు మీకు చాలా సమయం ఉంటుందిగా. మీకు భయం.. ఎందుకంటే పోయిన శాసనసభ సమావేశాల్లోనే ప్రతిపక్షాలు క్లీన్ బోల్డ్ అయ్యాయి. ఇప్పుడు కూడా అవుతాయని భయపడ్డాయి. కుల వృత్తుల కోసం బడుగుల కోసం త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తుంటే వణికిపోతున్నారు. తమను మెచ్చుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ప్రతిపక్షాల చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫస్ట్ కేసీఆర్, సెకండ్ హరీష్ రావు
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా గురువారం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో పార్టీ శాసనసభాపక్షం (ఎల్పీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల వారీగా సీఎం కేసీఆర్ రేటింగ్స్ ఇచ్చారు. తాను నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు మేరకు రేటింగ్స్ ఇచ్చారు. (కేసీఆర్ సర్వే: టీఆర్ఎస్ కు ఎన్ని సీట్లంటే?) ఎమ్మెల్యేలకు ఆయన నియోజకవర్గాల వారీగా నివేదికలు అందజేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ 101-106 సీట్లు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో ఉండగా, మంత్రి హరీశ్ రావు రెండో స్థానంలో నిలిచారు. బాబూమోహన్ చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకున్నారు. జిల్లాల వారీగా వస్తే .... ఖమ్మం జిల్లా: ఫస్ట్ తుమ్మల నాగేశ్వరరావు, లాస్ట్ మదన్ లాల్ ఆదిలాబాద్ జిల్లా: తొలి స్థానంలో కావేటి సమ్మయ్య, చివరి స్థానంలో బాపురావు నిజామాబాద్ జిల్లా: ప్రథమ స్థానంలో గణేష్, మలి స్థానంలో షకీల్ వరంగల్ జిల్లా: ఫస్ట్ ఎర్రబెల్లి దయాకరరావు, లాస్ట్ దొంతి మాధవరెడ్డి కరీంనగర్ జిల్లా: ఈటల ఫస్ట్, చెన్నమనేని రమేష్ లాస్ట్ రంగారెడ్డి జిల్లా: తొలి స్థానంలో తీగల కృష్ణారెడ్డి, చివరి స్థానంలో ఆర్. కృష్ణయ్య మహబూబ్ నగర్ జిల్లా : ఫస్ట్ సంపత్ కుమార్, లాస్ట్ రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్ జిల్లా : బాషా ఖాద్రీ తొలి, రామచంద్రారెడ్డి చివరిస్థానం -
'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల
రాం కార్తీక్, భాను త్రిపాఠి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో నటించిన 'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి హరీష్రావు ఆడియోను విడుదల చేశారు. ఎస్.ఆర్.పి విజువల్ పతాకంపై సాయితేజ పాటిల్ సమర్పణలో శివరాజ్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని ఆచార్య ఈ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆడియో విడుదల కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు, జీవిత, ఎన్.శంకర్, మల్కాపురం శివకుమార్, సినిమా యూనిట్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న శివరాజ్ పాటిల్.. సినీరంగంలో కూడా రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చిత్ర నిర్మాత శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ.. సినిమా ఆడియోని ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి హరీష్రావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యూత్ని ఆట్టుకునే అన్ని కమర్షియల్ హంగులతో, ఒక చక్కని మెసేజ్ను మిళితం చేసి దర్శకుడు నాని ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. ఘంటాడి కృష్ణ అందించిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయని చెప్పారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు వెల్లడించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. తనకు ఇది 50వ చిత్రమని చెప్పారు. సంగీత దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ తనకు ఈ చిత్రంతో ఆరంభం అవుతోందని, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
ప్రజలే వారికి బుద్ధి చెబుతారు: హరీశ్ రావు
హైదరాబాద్ : తెలంగాణ ఆత్మగౌరవంను దెబ్బతీసేలా సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నాడు తెలంగాణను అడ్డుకోవడానకి యత్నించి, నేడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సున్నం రాజయ్యది వన్ మ్యాన్ షో అయితే మహాజన పాదయాత్రలో తమ్మినేనిది వన్ మ్యాన్ షో అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. -
ట్రిబ్యునల్ తీర్పుపై అభిప్రాయాలివ్వండి
-రిటైర్డ్ ఇంజినీర్లను కోరిన మంత్రి హరీష్రావు హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని రిటైర్డ్ ఇంజినీర్లకు నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్రావు విజ్ఞప్తి చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఈ అంశమై రాష్ట్రానికి న్యాయం జరిగే రీతిలో కోర్టులు, ట్రిబ్యునల్ ముందు పోరాడతామని స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడి జల సౌధలో రిటైర్డ్ ఇంజినీర్లతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి రిటైర్డ్ ఇంజినీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్రెడ్డి, వెంకటరామారావుతో పాటు మరికొంతమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వేగిరానికి తీసుకోవాల్సిన చర్యలు, కృష్ణా జలాల తీర్పు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు ఇంజినీర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఉత్తమమని సూచనలు చేసినట్లుగా తెలిసింది. రెండు రోజుల్లో అభిప్రాయాలు చెబుతూ నోట్ ఇస్తే దాన్ని సైతం పరిశీలనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. 29న అన్ని అంశాలపై చర్చిస్తామని, సుప్రీం సీనియర్న్యాయవాది వైద్యనాధన్ సూచనల మేరకు నడుచుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. -
పంటలు ఎండుతుంటే... పండగంటారా?
రాజాపూర్: వర్షాభావంతో పంటలు పండక రైతులు ఓ వైపు ఆందోళన చెందుతుంటే, పండుగలు చేసుకుంటున్నారని మంత్రి హరీశ్రావు అనడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎండిన పంటలు పరిశీలించడానికి మంత్రి హరీశ్రావు నిజనిర్ధారణకు రావాలన్నారు. కేవలం సీఎం కేసీఆర్ సంతోషించడానికే.. ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అని హరీశ్రావును ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలులోకి తేవడంతో ఎంతోమంది ఉన్నత చదువులు చదివారని పేర్కొన్నారు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.3,500 కోట్ల బకాయిలు చెల్లించలేదన్నారు. ధ్రువపత్రాల కోసం విద్యార్థులు కళాశాలకు వెళితే ఇబ్బందులు పెడుతున్నారని గుర్తుచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు, అభివృద్ధికి తాము ఎప్పుడూ అడ్డుకాదన్నారు. 31 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రజలు అడిగారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జిల్లాలు ఏర్పాటు చేయడం కాదు, ఆయా జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా మల్లు రవి డిమాండ్ చేశారు. -
దేశంలోనే తొలిసారిగా ‘ఇస్రో’తో తెలంగాణ!
హైదరాబాద్/సిద్దిపేట జోన్: చెరువుల పరిరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒప్పందం కుదుర్చుకోబోతున్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఇస్రోతో రాష్ర్ట ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందని చెప్పారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) శ్రీహరికోట ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణకు ఇస్రో సహకారం ఎంతో దోహదపడుతుందన్నారు. చెరువుల అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు, చెరువుల నీటి మట్టం, ఎఫ్టీఎల్ సమగ్ర రూపం, ఇసుక మట్టం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇస్రోతో ఒప్పందం ఉపయోగపడుతుందని చెప్పారు. అంతరిక్ష రంగంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలు అన్ని రంగాల అభివృద్ధికి వీలు కల్పిస్తున్నాయన్నారు. ఇస్రో చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లకు మ్యాపింగ్ ఎంతో ఉపయోగకరమన్నారు. అనంతరం షార్ గ్యాలరీని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. నమూనా క్షిపణులు, రాకెట్ నమూనాలు, అంతరిక్ష ప్రయోగాల గురించి షార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
ఢిల్లీలో నేడు ‘కృష్ణ’ తులాభారం
-
ఢిల్లీలో నేడు ‘కృష్ణ’ తులాభారం
⇒ హస్తినకు చేరిన నీళ్ల పంచాయితీ ⇒ పాల్గొననున్న తెలంగాణ, ఏపీ సీఎంలు, మంత్రులు, అధికారులు ⇒ అధికారులతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ సమీక్ష ⇒ పాలమూరు, డిండిలపై పాత జీవోలు సహా పలు నివేదికలతో రెడీ ⇒ పట్టిసీమ, పోలవరం కింద వాటాపై నిలదీయాలని నిర్ణయం ⇒ ఆర్డీఎస్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు సంసిద్ధం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ మధ్య రెండున్నరే ళ్లుగా నలుగుతున్న వివాదం హస్తిన చేరింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శ ర్మ, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ విజయ్ప్రకాశ్లు మంగళవారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రమశక్తి భవన్లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్లో సమావేశం జరగనుంది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కింద తమకు దక్కే వాటాలపై గళమెత్తేందుకు ఇటు తెలంగాణ.. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై నిలదీసేందుకు అటు ఏపీ సిద్ధమయ్యాయి. మన వాదనలు గట్టిగా వినిపిద్దాం.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు, డిండి, టెలీమెట్రీ విధానం, నీటి వాటాల సర్దుబాటు, పట్టిసీమ, పోలవరం కింది వాటాలు, నీటి పంపిణీ-నిర్వహణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎజెండాలో చేర్చిన అంశాలపై ఇరు రాష్ట్రాలు మొదట తమ వాదన వినిపించిన తర్వాత.. ఇతర అంశాలేవైనా ఉంటే వాటిపైనా వాదనలు జరిగే అవకాశం ఉంది. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలపై తెలంగాణ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై గతంలో ఇచ్చిన జీవోలు, నీటి వాటాల్లో ఏపీ ఉల్లంఘనలు, ప్రాజెక్టుల నియంత్రణపై చట్టంలో పేర్కొన్న అంశాలు, బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పులు, సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించిన అన్ని అంశాలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా నీటి విడుదలపై బోర్డుకు రాష్ట్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా నివేదిక రూపంలో పొందుపరిచారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరడానికి ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్.. అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు సిద్ధం చేసిన నివేదికలను అధ్యయనం చేయడంతో పాటు వాటిలో మార్పుచేర్పులపై కీలక సూచనలు చేశారు. ఏపీ లేవనెత్తే ప్రతీ అంశాన్ని సమర్థంగా తిప్పికొట్టేలా రాష్ట్ర వాదనలు సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే తెలంగాణకు దక్కే 90 టీఎంసీల వాటాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచి, ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించాల్సిందిగా కోరాలని నిర్ణయించారు. కీలకంగా ఆర్డీఎస్.. ఎజెండాలో లేని రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) అంశాన్ని ప్రస్తావించాలని తెలంగాణ నిర్ణయించింది. నిజానికి ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీరందడం లేదు. దీని కింద 87,500 ఎకరాలకు నీరందాల్సి ఉన్నా 20 వేలకు మించి అందడం లేదు. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండియాయి. దీంతో ఆనకట్ట పొడవు పెంచేందుకు నిర్ణయించి, పనులు చేపట్టగా ఏపీ పదేపదే అడ్డుకుంటోంది. దీనిపై చర్చలకు ఆహ్వానించినా.. ఏపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీనికి తోడు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకముందే ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. ఈ అంశాలను అపెక్స్ కమిటీ ముందుంచాలని సీఎం నిర్ణయించారు. -
ఢిల్లీకి రె‘ఢీ’!
- నీళ్ల పంచాయితీపై రేపే అపెక్స్ కౌన్సిల్ భేటీ - ఇరు రాష్ట్రాలకు నోటీస్ ఇచ్చిన కేంద్ర జల వనరుల శాఖ - నేడు ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ - మొత్తం ఐదు అంశాలతో ఎజెండా ఖరారు సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల వనరుల శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి అంతా సిద్ధమైంది. సమావేశానికి సంబంధించి సోమవారం కేంద్ర జల వనరుల శాఖ ఇరు రాష్ట్రాలకు నోటీసులు పంపింది. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారమే ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఆయనతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, అధికారుల బృందం వెళ్లనుంది. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఎజెండాలో చేర్చిన అంశాలపై రాష్ర్టం కసరత్తు ముగించింది. తీర్పులు, జీవోలు, ఒప్పం దాలు, నివేదికల కాపీల్ని సిద్ధం చేసింది. ఎజెండాలో చేర్చని రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)ను ఆరో అంశంగా చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్లుగా తెలిసింది. ఇదీ ఎజెండా..: అపెక్స్ కౌన్సిల్ ఎజెం డాలో కేంద్రం ఐదు ప్రధాన అంశాలను చేర్చింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ నరేశ్కుమార్ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపారు. 21వ తేదీ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు శ్రమశక్తి భవన్లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్లో సమావేశం జరుగుతుందని వివరించారు. ఎజెండాలోని అంశాలను నోటీస్లో వివరించారు. సుప్రీంకోర్టు పరిష్కరించాలని సూచించిన పాలమూరు, డిండి ప్రాజెక్టులను తొలి అంశంగా చేర్చారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం, రిజర్వాయర్ల పరిధిలో ఇన్ఫ్లో, ఔట్ఫ్లో లెక్కలు పారదర్శక ంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం, ఒక వాటర్ ఇయర్లో నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు నీటి తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చారు. వీటితో పాటు ఏవైనా ఇతర అంశాలుంటే కేంద్రమంత్రి సమ్మతితో చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఒక్కో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్తో కూడిన ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరు కావాలని సూచించారు. పూర్తయిన కసరత్తు.. అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో చేర్చినవాటితోపాటు ప్రత్యేకంగా ప్రస్తావనకు తేవాలని నిర్ణయించిన అంశాలపై తెలంగాణ కసరత్తు పూర్తి చేసింది. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై గతంలో ఇచ్చిన జీవోలు, కల్వకుర్తి వాటాల పెంపునకు సంబంధించి ఉమ్మడి ఏపీలో చేసిన ప్రతిపాదనలు, నీటి వాటాల్లో గత రెండున్నరేళ్లుగా ఏపీ చేసిన ఉల్లంఘనలు, ఆర్డీఎస్ ఆధునికీకరణ పనుల్లో ఏపీ సహాయ నిరాకరణకు సంబంధించి అన్ని ఆధారాలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా నీటి విడుదలపై బోర్డుకు రాష్ట్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను సైతం సిద్ధం చేశారు. సీఎం సూచనల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు సోమవారం సాయంత్రం వరకు కసరత్తు కొనసాగించారు. దీనిపై బుధవారం ఉదయం సీఎం, మంత్రి హరీశ్రావులు మరోమారు చర్చించే అవ కాశం ఉంది. సాయంత్రం సీఎం, మంత్రి, అధికారుల బృందం ఢిల్లీకి బయలుదేరుతుందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
చరిత్ర తెలుసుకో..
⇒ అమిత్ షాపై మంత్రి హరీశ్రావు మండిపాటు ⇒ మోదీ.. కేసీఆర్ పాలనను పొగుడుతుంటే మీరు విమర్శిస్తారా? ⇒ మత రాజకీయాలతో ఇక్కడ చిచ్చుపెడతామంటే కుదరదు ⇒ ఫిరాయింపులపై మీరా మాట్లాడేది..? ⇒ అరుణాచల్లో ఏం చేశారో దేశమంతా తెలుసు ⇒ కేసీఆర్ ఎవరికీ భయపడే రకం కాదు సాక్షి, హైదరాబాద్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చరిత్ర తెలుసుకోకుండా సెప్టెంబర్ 17పై అవాకులు చెవాకులు మాట్లాడారని సాగునీటి పారుదల మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేసీఆర్ పాలనను ప్రధాని మెచ్చుకుంటే.. అమిత్ షా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వరంగల్లో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు బాలరాజ్, గణేశ్ గుప్తాలతో కలసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. ‘‘మత రాజకీయాలు నడిపే బీజేపీకి లౌకికవాద రాజకీయాల విలువ తెలియదు. బీజేపీ, టీఆర్ఎస్ ఎజెండాకు కచ్చితమైన తేడా ఉంటుంది. ప్రశాంత తెలంగాణలో మత రాజకీయాలతో చిచ్చుపెడతామంటే కుదరదు. బీజేపీ నేతల మాటల గారడీ విద్యలు గుజరాత్లో చెల్లినట్లు ఇక్కడ చెల్లవు’’ అని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎవరికో భయపడే రకం కాదనే విషయం అమిత్ షా తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ మొండి ఘటం కాబట్టే 14 ఏళ్లు పోరాడి కేంద్రాన్ని కదిలించారన్నారు. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు? ఇప్పుడు సెప్టెంబర్ 17 గురించి మాట్లాడుతున్న అమిత్షాకు.. గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకొని అధికారంలో కొనసాగినప్పుడు ఎందుకు గుర్తురాలేదని హరీశ్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తిరంగాయాత్రను కశ్మీర్లో నిర్వహించాలని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుల గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘అరుణాచల్ప్రదేశ్లో బీజేపీ వ్యవహరించిన తీరు యావత్ దేశమంతా చూసింది. సీఎంతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ పార్టీ ఫిరాయించేలా చేసిన ఘనత బీజేపీకే చెల్లింది. తెలంగాణకు రాష్ట్ర వాటాగా రావాల్సిన నిధుల కంటే ఒక్క రూపాయి అయినా అదనంగా ఇచ్చారా’’ అని హరీశ్ ప్రశ్నించారు. పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి ఏ మేరకు చెల్లిస్తున్నారో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీని అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేంద్రం వల్ల తెలంగాణకు ప్రత్యేకంగా ఒరిగిందేమి లేదని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సైతం తుంగలో తొక్కారన్నారు. ఖాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, హైకోర్టు విభజన తదితర వాటిని కేంద్రం అటకెక్కించిందని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం.. తెలంగాణకు ఏమిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామంటున్న కేంద్రం.. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ 1990లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి విస్మరించిందని, అలాగే రామమందిరం, ఆర్టికల్ 370డి, నల్లధనం హామీలను నెరవేర్చలేదన్నారు. -
తోటపల్లిలో నీటి కటకట
గ్రామస్తుల ఆందోళన వైసీపీ నేత ట్యాంకర్తో నీటి సరఫరా బెజ్జంకి : రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దత్తత గ్రామమైన మండలంలోని తోటపల్లిలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తలెత్తింది. దీంతో గ్రామపంచాయతీ ముందు రహదారిపై మహిళలు, గ్రామస్తులు శుక్రవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. వెఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్రావు ఆందోళనకు మద్దతు తెలిపారు. గ్రామంలో వారం రోజులుగా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి హరీష్రావు స్వగ్రామం, ఎమ్మెల్యే రసమయి దత్తత గ్రామంలో వర్షాకాలంలో ప్రజలు నీటి కోసం ఆందోళనలు చేయడం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ఇంటింటికి నాళ్లు అందిస్తామంటున్న ప్రభుత్వం వాడవాడకు కూడా నీటి సరఫరా చేయడం లేదని విమర్శించారు. శ్రీనివాసరావు ఫోన్లో అధికారులతో చర్చించిన అనంతరం ఆందోళన విరమించారు. శ్రీనివాసరావు తన ట్యాంకర్ ద్వారా గ్రామంలో నీటి సరఫరా చేపట్టారు. ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
నేడు జిల్లాలో హరీష్రావు పర్యటన
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్రావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకున్న తర్వాత ఆయన హన్మకొండ మండలం పలివేల్పులలో హరితహారం మొక్కలు నాటనున్నారు. 11 నుంచి 2 గం టల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న మంత్రి
కాలేజ్ టాపర్ కన్నీటి కథ సుఖాంతం చదువుల తల్లి శిరీషకు అండగా నిలిచి నారాయణ కోచింగ్ సెంటర్లో చేర్పించిన హరీశ్రావు టేక్మాల్ : మంత్రి హరీశ్రావు ఇచ్చిన మాట ప్రకారం చదువుల తల్లి శిరీష చదువు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శిరీషను నారాయణ కోచింగ్ సెంటర్లో చేర్చించారు. శిరీషకు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కాద్లూర్ గ్రామానికి చెందిన నీల్ల దేవమ్మ, రమేష్ కుతురైన శిరీష టేక్మాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో శిరీష వెయ్యికి 902మార్కులను సాధించి మండల టాపర్గా నిలిచింది. చదువుల్లో రాణించే శిరీషకు పై చదువులు చదివేందుకు స్థోమత లేకపోవడంతో సాక్షి ముందుకు వచ్చి కాలేజి టాపర్ కన్నీటి కథ శీర్షికన కథనం ప్రచురించింది. కథనంపై స్పందించిన పలువురు శిరిషకు నగదు సాయం చేశారు. శిరీష కథనాన్ని చూసిన మంత్రి హరీశ్రావు నేరుగా సాక్షి ప్రతినిధికి ఫోన్ చేసి శిరీష చదువుకు తనదే బాధ్యత అని హామీ ఇచ్చారు. అనంతరం శిరీష కుటుంబ సభ్యులు సాక్షి ప్రతినిధి ఆధ్వర్యంలో మంత్రిని కలవగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిరీష కోరిక మేరకు హైదరాబాద్లోని మాదాపూర్ నారాయణ కళాశాల ఎంసెట్ కోచింగ్ సెంటర్కు నేరుగా ఫోన్ చేసి అడ్మిషన్ ఇప్పించారు. అంతేకాకుండా శిరీష చెల్లెలు మనూషను పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్లో చేర్పించారు. సాక్షికి కృతజ్ఞతలు నిరుపేద కుటుంబానికి చెందిన నిరుపేత విద్యార్థికి ఉన్నత చదువు చదివేందుకు కృషి చేసిన సాక్షికి పలువురు అభినందనలు తెలిపారు. సాక్షి కథనం ప్రచురితమైన నాటి నుంచి శిరీష చదువులకు టేక్మాల్ నవ్యభారతి యువజన సంఘం అధ్యక్షుడు నాయికోటి భాస్కర్ వెన్నంటే ఉంంటూ కావాల్సిన మెటీరియల్ను సరఫరా చేశారు. అంతేకాకుండా అడ్మిషన్ తీసుకునే వరకు వెన్నంటే ఉన్నారు. మంత్రి హరీశ్రావుకు థాంక్స్ నేను ఇటువటి కళాశాలలో చదువుతానని కలలో కూడా అనుకోలేదు. సాక్షి ప్రచురించిన కథనంతో నాకు ఉన్నత చదువులు చదువుకునే భాగ్యం లభించింది. నన్ను, నా చెల్లెల్ని చదివిస్తున్న మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ శిరీష పేర్కొంది. తాను ఎల్లప్పుడు వారికి రుణపడి ఉంటానంది. -
మంత్రులుగా నాడు ఏం ఒరగబెట్టారు?
ప్రాజెక్టులను అడ్డుకోవడం దారుణం దామోదర, సునీతపై మంత్రి హరీశ్రావు మండిపాటు తూప్రాన్: కాంగ్రెస్ హయాంలో జిల్లా నుంచి సునీతారెడ్డి, దామోదర్ రాజనరసింహ ఇద్దరూ మంత్రులుగా ఉండి జిల్లాకు ఒరగబెట్టిందేమిటని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. సోమవారం తూప్రాన్ మండలం మనోహరాబాద్లో రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డితో కలిసి ఓ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులుగా ఉండి జిల్లాకు న్యాయం చేయలేకపోయారని, ఇప్పుడు ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేకపోయారు. ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు. మంత్రులుగా ఏమి చేశారో వారిద్దరు ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని ఆయన సూచించారు. మంత్రులుగా మీరు జిల్లా ప్రజలకు చేసిన అన్యాయాన్ని తాము సరిదిద్ది జిల్లాను సస్యశ్యామం చేసేందుకు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు. ‘మంత్రిగా మిమ్మల్ని ఈ స్థాయిని తెచ్చిన నర్సాపూర్కు లక్ష ఎకరాలకు నీరందిస్తుంటే మీరు తలుపులు అడ్డుపెడుతున్నారు. మీరు ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా..?’ అని సునీతారెడ్డిని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ హయాంలో సింగూరు ప్రాజెక్ట్లో చుక్కనీరు లేదు. ప్రాజెక్ట్ కోసం 27 గ్రామాలను ముంచెత్తిన కాంగ్రెస్ హయాంలో ఒక్క గ్రామానికి నీరిచ్చావయ్యా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ను నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్రెడ్డి, మార్కెట్కమిటీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్గౌడ్, రాఘవేంద్రగౌడ్, సుధాకర్రెడ్డి, మన్నే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
కేసీఆర్తో కలిసి ‘మిషన్ భగీరథ’ను ప్రారంభించనున్న నరేంద్రమోడీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్రావు.. ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష గజ్వేల్: ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్లో ‘మిషన్ భగీరథ’ పథకం ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మంత్రి హరీశ్రావు నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగం రేయింబవళ్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఆ రోజు ప్రధాని కోమటిబండ అటవీ ప్రాంతంలోని గుట్టపై ఉన్న ‘మిషన్ భగీరథ’ హెడ్వర్క్క్స ప్రాంగణంలో పథకం ప్రారంభసూచికగా నల్లాను ఆన్ చేస్తారు. ఆ తరువాత గుట్ట కింది భాగంలో బహిరంగ సభ జరుగనున్నది. సుమారు 2లక్షలకుపైగా జనసమీకరణ లక్ష్యంగా ఉండగా... అందుకు తగ్గట్లు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో సభా స్థలిలో పూర్తిగా రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేయడానికి నిర్ణయించారు. ప్రధాని సభకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాకుండా వీవీఐపీల రాజీవ్ రహదారి నుంచి సింగాయపల్లి స్టేజీ, చౌదర్పల్లి మీదుగా కోమటిబండలోని సభాస్థలికి చేరుకునే విధంగా ఆ మార్గాన్ని కేటాయించబోతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల కోసం వేర్వేరుగా హెలిపాడ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ హెలిపాడ్ ఏర్పాట్లను ఆర్అండ్బీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఆ శాఖ జిల్లా ఎస్ఈ రాధాకృష్ణ, సిద్దిపేట ఈఈ బాల్నర్సయ్యలు ఇక్కడే ఉంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక డిజైన్ సిద్ధం సభావేదిక కోసం ఇప్పటికే డిజైన్ సిద్ధం చేశారు. మరో రెండ్రోజుల తర్వాత సభాస్థలిని, ‘మిషన్ భగీరథ’ ప్రారంభోత్సవ ప్రదేశాన్ని కేంద్రానికి చెందిన ఎస్పీజీ బలగాలు ఆధీనంలోకి తీసుకునే అవకాశముంది. శనివారం ఏర్పాట్లన్నింటినీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు పర్యవేక్షించారు. బహిరంగ సభాస్థలి చదును పనులను పరిశీలించారు. అంతకుముందు కోమటిబండ హెడ్వర్క్క్స ప్రాంతాన్ని సందర్శించి, ఏర్పాట్లపై కలెక్టర్ రోనాల్డ్రోస్తో చర్చించారు. సభావేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో 3 గంటలకుపైగా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని ముందుగా హెడ్వర్క్క్స ప్రాంతంలో నల్లాను ప్రారంభించిన అనంతరం సభావేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీపీసీకి చెందిన 1600 మెగావాట్ల పవర్స్టేషన్, ఎఫ్సీఐఎల్కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్, వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేమార్గం పనులకు ప్రధాని శంకుస్థాపన ఇక్కడే చేస్తారని వెల్లడించారు. వర్షాల వల్ల సభకు అంతరాయం కలగకుండా రేయిన్ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రజలను ఇక్కడకు తరలిస్తామన్నారు. -
‘భగీరథ’తో ఉపాధి కోల్పోతున్నాం
గజ్వేల్: మండల పరిధిలోని కోమటిబండ గుట్టపై ‘మిషన్ భగీరథ’ హెడ్వర్క్స్ ఏర్పాటు చేయడంతో బండ తొలుచుకుని బతికే తాము ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో తమను ఆదుకోవాలని వడ్డెర కార్మికులు శనివారం పంప్హౌస్ను పరిశీలించడానికి వచ్చిన మంత్రి హరీష్రావును కోరారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి వారికి ప్రత్యామ్నాయ గుట్టను ఉపాధి కోసం చూపాలంటూ ‘గడ’ ఓఎస్డీ హన్మంతరావును ఆదేశించారు. -
టీడీపీ, సీపీఎం కుట్రల వల్లే..
- మల్లన్నసాగర్ ఘటనపై మంత్రి హరీశ్ ఫైర్ - ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవనే అడ్డుకుంటున్నారు - బయట నుంచి వచ్చినవారే పోలీసులు, రైతులపై రాళ్లు రువ్వారు - వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం - ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాల బంద్ విఫలమైంది సాక్షి, హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడానికి టీడీపీ, సీపీఎంల కుట్రలే కారణమని మంత్రి టి.హరీశ్రావు మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయి కోటి ఎకరాలకు సాగునీరందితే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. సోమవారమిక్కడ టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో హరీశ్ మాట్లాడారు. సంగారెడ్డి, హైదరాబాద్ తదితర బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే రైతులను రెచ్చగొట్టారని, పోలీసులపై, రైతులపై రాళ్లు రువ్వారని అన్నారు. హింసాత్మక ఘటనలను చోటు చేసుకోవడానికి కారణమైన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సోమవారం తలపెట్టిన బంద్ విఫలమైందన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని విపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతున్నాయని మండిపడ్డారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎనిమిది గ్రామాలకుగాను ఆరు గ్రామాల రైతులు భూములివ్వడానికి అంగీకరించారని వెల్లడించారు. ఏటిగడ్డ కిష్టాపూర్లో ప్రతిపక్షాలు ఇటీవల ఏ టెంట్ కింద దీక్షలు చేశాయో, అదే టెంట్ కింద రైతులు భూములిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వివరించారు. మిగిలిన రెండు గ్రామాల్లో కూడా ఒకట్రెండు రోజుల్లో భూసేకరణ సమస్య పరిష్కారమైతే తమ పని అయిపోయినట్లేనని భావించిన టీడీపీ, సీపీఎం నేతలు రాజీవ్ రహదారిపై హింసాత్మక ఘటలకు కుట్రపన్నారన్నారు. ‘‘అధికారులెవరూ ముంపు గ్రామాలకు వెళ్లి భూములివ్వాలని రైతులను అడగడం లేదు. రైతులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవు. 2013 భూసేకరణ చట్టం లేదా 123 జీవోలలో ఏది కావాలనుకుంటే దాని ప్రకారం ప్రకారం భూసేకరణ జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాక ఇక సమస్య ఎక్కడిది? ప్రభుత్వ సంకల్పానికి సహకరించడానికి బదులు ప్రతిపక్షాలు ప్రాజెక్టులే కట్టకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయి. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. ఖమ్మంను ముంచుతున్నారు ‘‘ఇన్ని రిజర్వాయర్లు అవసరమా అని కొందరు మాట్లాడుతున్నారు. అది వారి అవివేకానికి నిదర్శనం. నదులు లేకున్నా ఆంధ్రా ప్రాంతంలో వెలిగొండ, అవుకు తదితర రిజర్వాయర్లు ఎందుకు నిర్మించారో చెప్పాలి. కృష్ణా డెల్టాలో మూడో పంట కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూ ఖమ్మం జిల్లాలో 8 వందల గ్రామాలను ముంచుతున్నారు. నల్లగొండ జిల్లాలో వందలాది ఎకరాలను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టారు. తెలంగాణలో కనీసం రెండు పంటలు పండించుకునే ఉద్దేశంతో ప్రాజెక్టులు నిర్మించడం తప్పా?’’ అని హరీశ్రావు ప్రశ్నించారు. గోదావరి నదిలో ఇప్పటికే 750 టీఎంసీల నీరు సముద్రం పాలైందని వివరించారు. గోదావరిలో నీళ్లు వచ్చినప్పుడే నిల్వ చేసుకుంటేనే పుష్కలంగా సాగునీరు అందించవచ్చని, అందుకే రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్, టీడీపీ కుట్రలను గుర్తించారని చెప్పారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆ జిల్లాకే చెందిన నాయకులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీశారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టే ధోరణులను తిప్పికొట్టాలన్నారు. పోలీసులు సంయమనం పాటించాలని ఆదేశించామని, విపక్షాలు కూడా సంయమనం పాటించాలన్నారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టకుంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, భూపాల్రెడ్డి పాల్గొన్నారు. -
ఉమ్మడి రాష్ట్రంలో బాలికల విద్యకు అన్యాయం
30 ఏళ్లలో కేవలం 134 మాత్రమే ఏడాదిలోనే 160 బాలికల గురుకులాలు ఏర్పాటు తాజాగా జిల్లాకు మూడు డిగ్రీ గురుకులాలు మంజూరు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట రూరల్ : ఉమ్మడి రాష్ట్రంలో బాలికల విద్యకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బాలికల విద్య కోసం 1985 నుంచి 2015 వరకు 30 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 134 పాఠశాలలు ఏర్పాటు చేస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలోనే 160 బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలు మంజూరు చేసి, వారి విద్యాభివృద్ధికి దోహదపడుతున్నట్టు చెప్పారు. ఆదివారం మండలంలోని మిట్టపల్లి, ఎల్లుపల్లి శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో డార్మిటరీ హాల్, తల్లిదండ్రులకు విశ్రాంతి భవనం, డిజిటల్ ల్యాబ్, క్లాస్ రూంలను ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో 30 మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలు మంజూరైనట్టు చెప్పారు. ఇందులో మూడు కళాశాలలు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలకు మం జూరైనట్టు చెప్పారు. అంతకు ముందు మండలంలోని పుల్లూర్ బండ శ్రీ లకీ‡్ష్మనరసింహస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డిలు మొక్కలు నాటారు. -
'ప్రాజెక్టుల నిర్మాణంలో విచ్చలవిడిగా అవినీతి'
హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు వేలకోట్లు ధారదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను హరీశ్ రావు ప్రారంభించడం దారుణమని నాగం వ్యాఖ్యానించారు. కాగా మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలం రేలంపాడు వద్ద నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండో లిఫ్ట్కు హరీష్రావు ఇవాళ ప్రారంభోత్సవం చేసిన విషయం తెలిసిందే. -
క్లీన్ సిద్దిపేట .. ఇక గ్రీన్ సిద్దిపేట
‘లక్ష’ణంగా లక్ష్యం సాధించారు మరో రికార్డు సొంతం చేసుకున్న సిద్దిపేట మున్సిపాల్టీ బొట్టు, చెట్టుతో సత్ఫలితాలు పేటలో 1.29 లక్షల మొక్కలు నాటిన ప్రజలు సిద్దిపేట జోన్: గ్రీన్ సిద్దిపేటగా మార్చాలనే మంత్రి హరీశ్రావు ఆశయానికి సిద్దిపేట మున్సిపాల్టీ చేయూతగా నిలిచింది. వినూత్న పథకాల ప్రయోగాలతో దేశ స్థాయిలో గుర్తింపు పొందిన సిద్దిపేట మున్సిపాల్టీ హరితహారంలో మరోరికార్డు సొంతం చేసుకుంది. ఇటీవల సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో ఒకే రోజు లక్ష మొక్కలను నాటి రికార్డు సొంతం చేసుకున్న విషయం విదితమే. అలాగే పట్టణ పరిధిలో అత్యధికంగా మొక్కలు నాటి సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీ మరో రికార్డు సాధించింది. హరితహారంలో భాగంగా 1, 29 లక్షల మొక్కలను నాటిన సిద్దిపేట మున్సిపల్ యంత్రాంగం మెగా ప్లాంటేషన్లో భాగంగా ఒక్కరోజే 86, 278 మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి మొక్కను అందించే లక్ష్యంతో మున్సిపల్ యంత్రాంగం డ్వాక్రా మహిళ సంఘాల సౌజన్యంతో బొట్టు, చెట్టు అనే వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి డ్వాక్రా మహిళలు బొట్టు పెట్టి మొక్కలను అందించి హరితహరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ప్రతి వ్యక్తికి మొక్కను పంపిణీ చేసిన మున్సిపల్ అధికారులు దత్తత అంగీకార పత్రాన్ని అందజేసి మొక్క పరిరక్షణ బాధ్యతను ప్రజలపైనే పెట్టడం నిరే్ధశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు దోహదపడింది. సిద్దిపేట మున్సిపల్ పరిధిలో 28 వేల నివాస గృహాలు ఉండగా, 1.5 లక్షల జనాభా ఉంది. పట్టణంలోని 34 వార్డుల్లో హరితహారం కింద మొక్కలు నాటాలని ప్రభుత్వం నిరే్ధశించింది. అ దిశగానే మంత్రి హరీశ్రావు గత నెలలో హరితహారాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు సమీక్షలు నిర్వహించారు. ఉద్యమం తరహాలో హరితహరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే సిద్దిపేట మున్సిపాల్టీకి ప్రభుత్వం ఈ యేడు 50 వేల మొక్కలు నాటాలని నిరే్ధశించింది. క్లీన్ సిద్దిపేటగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సిద్దిపేటలో ప్రభుత్వ లక్ష్యాన్ని రెట్టింపు చేసి లక్ష మొక్కలు నాటి గ్రీన్ సిద్దిపేటగా మార్చాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆ దిశగా పట్టణంలోని 34 వార్డుల ప్రజాప్రతినిధులును, విద్యాసంస్థలను, స్వచ్ఛంద సంఘాలను, ఆధికారులను ఐక్యం చేసి హరితహరాన్ని ప్రారంభించారు. రెండేళ్లుగా లక్ష్యాన్ని అధిగమిస్తూ.. సిద్దిపేటలో గతేడాది సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించిన హరితహారం కార్యాక్రమ స్పూర్తితో సిద్దిపేట మున్సిపల్ అధికారులు వరుసగా రెండేళ్లుగా లక్ష్యాన్ని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంలో ప్రభుత్వ నిరే్ధశిత లక్ష్యాన్ని పూర్తి చేశారు. గతేడాది మున్సిపల్ శాఖ పట్టణానికి 75 వేల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని నిరే్ధశించింది. ఈ క్రమంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా హరితహారాన్ని చేపట్టి 1.25 లక్షల మొక్కలు నాటారు. ఈ సంవత్సరం ప్రభుత్వం 50 వేల మొక్కలు నాటాలని సూచించగా గత కొన్ని రోజులుగా ప్రణాళికాబద్ధంగా హరితహరాన్ని నిర్వహించి ఈ నెల 18వ తేదీ నాటికి పట్టణంలో 1,29,638 మొక్కలను నాటారు. మెగా ప్లాంటేషన్ సందర్భంగా సోమవారం ఒక్కరోజే పట్టణంలో 86,278 మొక్కలను మున్సిపల్ ఆధ్వర్యంలో నాటారు. పక్కాగా ప్రణాళిక .. సిద్దిపేటను గ్రీన్ సిద్దిపేటగా మార్చాలనే మంత్రి ప్రణాళికను అధికార యంత్రాంగం నిర్ధేశిత లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించింది. పట్టణంలోని 28 వేల ఇండ్లకు 22 వేల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ప్రధానంగా మామిడి, జామ, దానిమ్మ, సీతాఫలం, బాదం, ఖర్జూర, బొప్పాయ లాంటి పండ్ల మొక్కలతో పాటు నాలుగు రకాలు ఆయుర్వేద మొక్కలు అందజేశారు. మొక్కలను పరిరక్షించేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య టౌన్ప్లానింగ్ విభాగం ఆద్వర్యంలో దత్తత పత్రాలను రూపొందించి ప్రతి వ్యక్తికి వాటిని అందజేసి వారి ద్వారా మొక్క దత్తతను అధికారికంగా తీసుకున్నారు. దీనికి తోడు మహిళల్లో చైతన్యం, స్ఫూర్తి కలిగించేందుకు మున్సిపాల్టీకి చెందిన మెప్మా విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు బొట్టు పెట్టి మొక్కను అందించి హరితహారం యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని డ్వాక్రా సంఘాలు పిలుపునిచ్చాయి. సమిష్టిగా రూపొందించిన హరితహారం నిరే్ధశిత లక్ష్యాన్ని సిద్దిపేట మున్సిపల్ అధిగమించినప్పటికి ఈ నెల చివరి వరకు కొనసాగింపు దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. గ్రీన్ సిద్దిపేట నా స్వప్నం హరితహారంలో భాగంగా దశల వారిగా పట్టణాన్ని గ్రీన్ సిద్దిపేటగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. గత యేడాది, ఈ యేడు పెద్ద ఎత్తున పట్టణంలో మొక్కలు నాటాం. ప్రతి ఒక్కరు నాటిన మొక్కను పరిరక్షించాలి. – హరీశ్రావు, నీటిపారుదల శాఖ మంత్రి -
'అది హరీశ్రావు అవివేకానికి నిదర్శనం'
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల తిరుగుబాటుతోనే రాష్ట్ర ప్రభుత్వ పతనం మొదలైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముంపు గ్రామాల ప్రజల పోరాటానికి మద్దతుగా మెదక్ జిల్లాలో సీపీఎం చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఆదివారం వేములఘాట్ మదిర తుర్కబంజేరుపల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్ మదిర గ్రామాలు గిరిజన తండా, తిరుమలగిరి, లక్ష్మాపూర్ గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధ్యంకాని ప్రాజెక్టు పేరుతో ప్రజలను భయాందోళనకు గురిచేయడం ప్రభుత్వానికి తగదన్నారు. నీటిపారుదల రంగంలో నిపుణుడైన హన్మంతరావు సూచనలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇంత పెద్ద రిజర్వాయర్ రష్యా, చైనా వంటి దేశాల్లో కూడా నిర్మించలేదన్నారు. 2013 భూసేకరణ చట్టంతో రైతులకు నష్టం జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత అనడం మంత్రి హరీశ్రావు అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ చట్టంపై చర్చించేందుకు హరీశ్రావు సిద్ధంగా ఉండాలన్నారు. -
'రైతులకు అన్యాయం జరిగితే విపక్షాలదే బాధ్యత'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టులో రైతులకు అన్యాయం జరిగితే విపక్షాలే బాధ్యత వహించాలని మంత్రి హరీష్రావు అన్నారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ..విపక్షాలు 2013 యాక్ట్ అమలు చేయాలని కోరుతున్నారని చెప్పారు. దీని ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే రూ.లక్షా 80 వేలు, అదే జీవో 123 ప్రకారం అయితే రైతులకు రూ.4 లక్షల 80 వేలు అందుతుందన్నారు. రాష్ట్రంలో విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మల్లన్నసాగర్ వల్ల ఏడు గ్రామాలే ఇబ్బంది పడుతున్నాయని, కానీ గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్ల 11 గ్రామాలు నష్టపోయాయని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని అందుకు గాను కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ముందుగా క్షమాపణ చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు. -
పరిహారంపై పట్టువిడుపు
నిర్వాసితులు ఎలా కోరుకుంటే అలా పరిహారం: కేసీఆర్ జీవో 123 లేదా 2013 భూసేకరణ చట్టం.. ఏది కావాలంటే అది వర్తింపజేస్తాం మంత్రి హరీశ్తో ముఖ్యమంత్రి భేటీ.. అనంతరం పరిహారంపై ప్రకటన నిర్వాసితులు ఆందోళన విరమించే అవకాశం ప్రాజెక్టు పరిధిలో భారీగా పెరగనున్న పరిహార మొత్తం 2013 చట్టం ప్రకారం ఇస్తే 21 వేల ఎకరాలకు ఏకంగా రూ.2 వేల కోట్లు! ఇదే విధంగా అన్ని ప్రాజెక్టులకు వర్తింపజేస్తే పెనుభారమే... సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ సమీకరణ విషయంలో రైతుల ప్రయోజనాలు, వారి అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం పరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూమి సేకరించడానికి ప్రస్తుతం రెండు విధానాలు అమలులో ఉన్నాయని, యూపీఏ ప్రభుత్వం 2013లో తెచ్చిన భూసేకరణ చట్టం అందులో ఒకటి కాగా.. మరొకటి తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.123 అని తెలిపారు. ఈ రెండింట్లో రైతులు ఎలా కావాలనుకుంటే అలా పరిహారం అందిస్తామని ప్రకటించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ద్వారా పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీతోపాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం శనివారం తన అధికార నివాసానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావును పిలిపించుకుని మల్లన్నసాగర్ భూసేకరణ వివాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పరిహారంపై ఈ మేరకు ప్రకటన వెలువడింది. భారీగా పెరగనున్న వ్యయం భూ సేకరణ చట్టం-2013ను అమలు చేస్తే మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 21 వేల ఎకరాలకు చెల్లించాల్సిన పరిహారం భారీగా ఉండనుంది. కనీసం రూ.2 వేల కోట్లు పరిహారం కింద చెల్లించే అవకాశం ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సీఎం తాజా ప్రకటన తర్వాత.. జీవో 123 ద్వారా పరిహారం కోరుకునే రైతులుంటారని తాను అనుకోవడం లేదని ఆ అధికారి పేర్కొన్నారు. మల్లన్నసాగర్తో పాటు మిగతా ప్రాజెక్టుల కింద కూడా 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయం కంటే పరిహారం ఎక్కువగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడు నెలల ఆందోళనకు ఫుల్స్టాప్ మల్లన్నసాగర్ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గత మూడు మాసాలుగా ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం నేతలు ఏటిగడ్డ కిష్టాపూర్కు వెళ్లి అక్కడి నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి శనివారం రెండ్రోజుల దీక్ష ప్రారంభించారు. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితులు తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి తాజా ప్రకటనతో మల్లన్నసాగర్ నిర్వాసితులు తమ ఆందోళన విరమించే అవకాశం ఉంది. భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్: కలెక్టర్ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని , భూసేకరణ కోసం ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతంగా భూమి సేకరించడం లేదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటి వరకు 1,600 ఎకరాలు రైతుల నుంచి సేకరించినట్లు వివరించారు. ఏటిగడ్డ కిష్టాపూర్లో ఇప్పటివరకు 145 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 270 ఎకరాల భూమిని జీవో 123 ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. -
ఖరీఫ్లో సమష్టిగా పనిచేయండి: హరీష్
► అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ప్రాజెక్టుల ఆయకట్టుపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్రావు అధికారులను ఆదేశించారు. అధికారులందరూ ఒక నిర్ధిష్ట లక్ష్యంతో పనిచేస్తేనే రైతులకు మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాగునీటిపారుదల రంగం పురోగతికి వ్యవసాయ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో, సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి పారుదలపై ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయశాఖల లెక్కలకు పొంత న కుదరడం లేదన్నారు. ఇకపై నివేదికల్లో ఆయకట్టు లెక్కలలో తేడా రావొద్దని సూచించారు. ప్రాజెక్టుల కింద ఆయకట్టు రైతాంగానికి లాభం చేకూర్చడానికి ఇరిగేషన్ అధికారులు ‘బెంచ్ మార్క్’ విధానాన్ని అవలంభించాలని ఆయన ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీటితో 12 నుంచి 15వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. భారీ ప్రాజెక్టుల కింద 22 లక్షల ఎక రాలకు గాను 15లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియం ప్రాజెక్టుల కింద 3.23 లక్షల ఎకరాల ఆయకట్టుకుగాను 2.8 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోందన్నారు. ఎప్పటికప్పుడు సాగునీటిశాఖపై ఆడిటింగ్ జరగాలని అధికారులను ఆదేశించారు. వాటర్ ఆడిటింగ్ జరగకపోవడంతో సాగునీటిపై పన్ను వసూళ్లు తగ్గుతున్నాయన్నారు. సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని సూచించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని ఉపాధిహామీ పథకం కింద పనులు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. సాగునీటి పంపిణీలో ముందుగా చివరి భూములకు నీరందించే ‘టేల్ టు హెడ్’ విధానాన్ని ప్రతీ జిల్లాలోని ఒక్కో ప్రాజెక్టు పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, కార్యదర్శి వికాస్రాజ్, ఈఎన్ సీ మురళీధర్రావు, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్, ఓఎస్డీ దేశ్పాండే, సీఈలు పాల్గొన్నారు. -
నీళ్ల లొల్లిపై కమిటీ
కృష్ణాపై ఏకాభిప్రాయం రాకపోవడంతో కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయం ముగ్గురు సీడబ్ల్యూసీ రిటైర్డ్ చైర్మన్లతో అధ్యయనం కేఆర్ఎంబీపై మార్గదర్శకాలు రూపొందించనున్న కమిటీ.. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం సూచన.. మూడోరోజు చర్చల్లోనూ ప్రతిష్టంభన 90 టీఎంసీల వాటాకు తెలంగాణ పట్టు.. వ్యతిరేకించిన ఏపీ అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి: హరీశ్రావు టెలిమెట్రిక్ విధానం పెట్టి ప్రతి చుక్కనూ లెక్కించాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంచాయితీ మూడోరోజు కూడా ఎటూ తేలలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులూ ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో జగడం తెగలేదు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సూచనల మేరకు గురువారం ఉదయం జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్ సింగ్ సమక్షంలో ఇరురాష్ట్రాల నీటి పారుదల మంత్రులు టి.హరీశ్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు సమావేశమయ్యారు. గడచిన రెండ్రోజులుగా ఉన్నతాధికారులు చేసిన వాదనలనే మంత్రులూ వినిపించారు. గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి మళ్లించిన నీటిలో తమ వాటాగా 90 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ పట్టుపట్టగా.. దాన్ని ఏపీ వ్యతిరేకించింది. నాగార్జున సాగర్ కుడికాలువ తమ భూభాగంలో ఉన్నందున తామే నిర్వహించుకుంటామని ఏపీ వాదించగా అది కుదరదని, అన్ని ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తీసుకురావాల్సిందేనని తెలంగాణ వాదించింది. ఈ చర్చల్లో ఏదీ తేలే పరిస్థితి లేదని భావించిన కేంద్రం చివరకు... కేఆర్ఎంబీ నోటిఫికేషన్ జారీకి ముందు మార్గదర్శకాలను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చింది. జూలై మొదటి వారంలో కేంద్ర జల వనరుల సంఘం మాజీ చైర్మన్లు ముగ్గురితో ఒక కమిటీ వేస్తామని, రెండు మూడు నెలల్లో ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందిస్తుందని, ఆ తర్వాత కేఆర్ఎంబీ పరిధి, అధికారాలు నిర్ణయిస్తామని తెలిపింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగాలని సూచించింది. అందుకు తెలంగాణ అంగీకరించింది. ఏపీ కూడా సాధ్యమైనంత త్వరగా ఆ కమిటీ మార్గదర్శకాలు రూపొందించాలని, అందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది. అయితే యథాతథ స్థితిని కేవలం నెలరోజులకే పరిమితం చేయాలని కోరింది. తాత్కాలిక యాజమాన్య ఏర్పాట్లపై నెల రోజుల్లోగా ఏకాభిప్రాయానికి రాని పక్షంలో మరోసారి ఇరుపక్షాలు సమావేశమయ్యే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన అనంతరం ఇద్దరు మంత్రులు విడివిడిగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి: హరీశ్రావు సమావేశంలో ఎలాంటి స్పష్టత రాలేదు. ఏపీది అదే మొండి వైఖరి. నిరంకుశంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా వితండ వాదన చేస్తోంది. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటికే బచావత్ అవార్డు స్పష్టత ఇచ్చింది. గోదావరి నీళ్లను కృష్ణాకు మళ్లిస్తే పైరాష్ట్రాలకు హక్కులు ఉంటాయని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పినందున... తెలంగాణ వాటా కింద 90 టీఎంసీలు ఇవ్వాలి. తాత్కాలిక అవగాహన ప్రకారం వచ్చిన 299 టీఎంసీలు కూడా చాలా తక్కువే. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది కేటాయింపులు ఇచ్చే వరకు చేయగలిగిందేమీ లేనందున.. బచావత్ అవార్డు అందుబాటులో ఉన్నందున దాన్ని అమలు చేయాలి. 299 టీఎంసీలకు అదనంగా 90 టీఎంసీలు కేటాయించాలని కోరాం. ఏపీ అందుకు అంగీకరించలేదు. జూలై మొదటి వారంలో ముగ్గురు రిటైర్డ్ సీడబ్ల్యూసీ చైర్మన్లతో కమిటీ వేసి వచ్చే మూడు నెలల్లోగా కేఆర్ఎంబీని నిర్వహణలోకి తెస్తామని కేంద్రం చెప్పింది. ఈ మూడు నెలలపాటు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం అభ్యర్థించింది. మేం అందుకు సమ్మతించాం. కానీ ఏపీ అందుకు అంగీకరించని పరిస్థితి ఉంది. అనేక సమస్యలకు పరిష్కారం వచ్చాకే కేఆర్ఎంబీ విధులు నిర్వర్తించగలుగుతుంది. దాన్ని నిర్వహణలోకి తేవడంలో మాకు అభ్యంతరం లేదు. కానీ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలి. అప్పుడు మాకు అభ్యంతరం ఉండదు. టెలీమెట్రిక్ విధానం పెట్టండి. సంయుక్త బృందాలను ఏర్పాటు చేయండి. ప్రతి చుక్కను కూడా లెక్కపెడితే రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి మేం సిద్ధంగా ఉన్నామని మేం చెప్పాం. మేం మహారాష్ట్ర, కర్ణాటకతో కలిసి పనిచేయగలుగుతున్నాం. కానీ ఏపీ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. తెలంగాణకు అన్యాయం జరిగితే ఢిల్లీ స్థాయిలో పోరాడుతాం. న్యాయస్థానంలో పోరాడుతాం. ఏపీకి సంబంధించి ఒక చుక్క కూడా మాకు అవసరం లేదు. మా హక్కుల కోసం మేం కొట్లాడుతాం. నీటి నిర్వహణలో ఇబ్బందులను వివరించాం: దేవినేని ఉమామహేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ పరిధిని ప్రకటించాలి. సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులతో దీనిపై కమిటీ వేస్తానంది. త్వరితగతిన మార్గదర్శకాలు విడుదల చేసి కేఆర్ఎంబీ నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. నెల రోజుల తాత్కాలిక ఏర్పాట్లపై మరోసారి చర్చలకు పిలుస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ సీఈ ఆధ్వర్యంలో ఉన్నా.. ప్రాజెక్టులోకి నీళ్లు రాగానే తెలంగాణ కేఆర్ఎంబీ ఆదేశాలు పట్టించుకోకుండా విద్యుదుత్పత్తి చేస్తోందని చెప్పాం. రాయలసీమకు మంచినీళ్లు ఇవ్వకుండా విద్యుత్ కోసం గేట్లు ఎత్తేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడికాల్వ వద్ద మా ఎస్పీఎఫ్ను పెట్టుకుంటామని చెబితే.. మొండిగా, తొండిగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు కేటాయించిన నీళ్లు వాళ్లు ఉపయోగించుకోవాలి. మొండిగా ఒకసారి 45 టీఎంసీలు, తొండిగా మరోసారి 90 టీఎంసీలు అంటున్నారు. -
మహారాష్ట్ర సీఎంతో హరీష్రావు భేటీ
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్రావు మంగళవారం మధ్యాహ్నం భేటీయ్యారు. కాళేశ్వరం, తమ్మిడిహెట్టి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇరురాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టల నిర్మాణాలపై మహారాష్ట్రతో వివాదాలను పరిష్కరించే దిశగా ఈ భేటీ కొనసాగుతోంది. గోదావరి నదిపై ప్రతిపాదించిన ప్రాజెక్ట్లు, ఆనకట్టల నిర్మాణాలకు సంబంధించి ముసాయిదాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వానికిచ్చింది. తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఎత్తు 148 మీటర్లుగా ప్రతిపాదించారు. దీంతో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయని ఆ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. -
దేవినేని ఉమకు హరీశ్ రావు ఫోన్
హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనిశ్చితికి తెర దించేందుకు ఏపీ సర్కార్తో చర్చించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ కాల్ చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించేందుకు సమావేశం అవుదామని ఈ సందర్భంగా హరీశ్ కోరారు. ఆర్డీఎస్తో పాటు తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకుందామని సూచించారు. అందుకు మంత్రి దేవినేని ఉమ కూడా అంగీకారం తెలిపారు. సమావేశం ఏర్పాటు చేయాలని హరీశ్కు దేవినేని ఉమ తెలిపారు. -
కన్నతల్లే సవతి ప్రేమ చూపించింది
సాక్షి, హైదరాబాద్: 'నల్లగొండ జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించడం దురదృష్టకరం. . జిల్లా పట్ల సానుకూలంగా ఉన్నాం. ఫ్లోరైడ్ నిర్మూలనకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారు' అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులపై ఆదివారం శాసనసభ స్వల్ప వ్యవధి ప్రశ్నల సమయంలో నల్లగొండ ఎమ్మెల్యే(కాంగ్రెస్) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతి, స్థితిగతులను వివరించారు. వర్షాలు కురిస్తే వచ్చే ఖరీఫ్లో లో లెవల్ కెనాల్ కింద 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తామన్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు జి.జగదీష్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి రెండురోజులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు హెడ్ టూ టేయిల్ వరకు కట్టమీద తిరిగి ఆధునికీకరణ పనులను పరిశీలించానన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 35 శాతం పనులే చేస్తే, ఏడాదిలోనే 50 శాతం పనులు చేశామన్నారు. మిగిలిన 10 శాతం పని ఏడాదిలోగా చేస్తామన్నారు. నీటి సంఘాల ప్యాకేజీ పనులకు గత ప్రభుత్వం టెండర్లూ పిలవలేదని, తాము టెండర్లు పిలిచి అప్పుడే 65 శాతం పనులు చేశామన్నారు. ఈ ప్రాజెక్టుపై ఏడాదిలోనే రూ.570 కోట్లను ఖర్చు చేశామన్నారు. జిల్లాలో చిన్న నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఉన్నా, గతంలో అక్కడ పర్యవేక్షక ఇంజనీర్(ఎస్ఈ) పోస్టూ లేదన్నారు. తాము వచ్చాకే ఒక ఎస్ఈతో పాటు మూడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను కేటాయించామన్నారు. జిల్లాలో చెడిపోయిన ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేసి మళ్లీ ఆయకట్టును స్థిరీకృతం చేస్తున్నామన్నారు. మూడు నాలుగేళ్లుగా నిలిచిపోయిన ఉదయ సముద్రం పనులను పునరుద్ధరించి వేగంగా చేస్తున్నామన్నారు. 2277 ఎకరాల సేకరణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి సహకరిస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ లైనింగ్ జరగక 3500 క్యూసెక్కులకు బదులు 2500 క్యూక్కులే పారుతున్నాయన్నారు. ప్రధాన కాల్వ లైనింగ్కి రూ.220 కోట్లు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ల లైనింగ్కి రూ.280 కోట్లు కలిపి మొత్తం రూ.500 కోట్లు అవసరమన్నారు. సీఎం కేసీఆర్ పరిశీలనలో ఈ ప్రాజెక్టు ఉందన్నారు. గత ప్రభుత్వం ఏఎమ్మార్పీ ప్రాజెక్టులోని ఆఫ్లైన్ రిజర్వాయర్లను తొలగించి టెండర్లు పిలిచిందని, సాధ్యమైతే మళ్లీ ఆఫ్లైన్ రిజర్వాయర్లను పెట్టేందుకు పరిశీలిస్తామన్నారు. ఎన్నికల వేళ తప్పా ఇతర సమయాల్లో తాను ఎన్నడూ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బదులిచ్చారు. కేవలం ఆఫ్లైన్ రిజర్వాయర్లను విస్మరించారనే తాను సవతి తల్లి ఆరోపణ చేశానన్నారు. హైదరాబాద్కి తాగునీటి ప్రాజెక్టుగా ఏమ్మార్పీ మారుతోంది: జానారెడ్డి ఏమ్మార్పీ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే ప్రాజెక్టుగా మారేప్రమాదం ఉందని కాంగ్రెస్శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కింద 2లక్షల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే 60 వేల నుంచి 70 వేల ఎకరాలు బీడుగా మారయన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో కొద్దిగా నిర్లక్ష్యంగా జరిగింది వాస్తవమేనని, ఈ ప్రభుత్వమైనా సరిగ్గా కృషిచేస్తే రెండేళ్లలో పనులు పూర్తి అవుతాయన్నారు. సుంకిశాల నుంచి హైదరాబాద్కు త్రాగునీటిని తరలించేందుకు రూ.900 కోట్ల రుణాన్ని జైకా మంజూరు చేసిన గత ప్రభుత్వాలు కావాలనే పక్కన పెట్టాయన్నారు. ఇప్పుడు వ్యయం రూ.1200 కోట్ల నుంచి రూ.1300 కోట్లకు పెరిగిందని, పురపాలక శాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టును నిర్మిస్తే ఏఎమ్మార్పీ నీళ్లు పూర్తిగా ఆయకట్టుకు సరఫరా అవుతాయన్నారు. ఏమ్మార్పీ టన్నెల్ లైనింగ్ పనులు నెలకు 0.5 కి.మీలకు మించి చేయడం సాధ్యం కావడం లేదన్నారు. నల్లగొండ జిల్లా నీటి అవసరాల కోసం కృష్ణాబోర్డు 4.5 టీఎంసీలను కేటాయించిందని, అవసరమైనప్పుడు విడుదల చేస్తామన్నారు. -
ఏఐబీపీ సాయం 60 శాతానికి పెంచాలి
కేంద్రానికి మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి * తెలంగాణ నుంచి మరో నాలుగు ప్రాజెక్టులను ఏఐబీపీలో చేర్చాలి * జల వనరుల సమన్వయ కమిటీ భేటీకి మంత్రి హాజరు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని సత్వర సాగునీటి ప్రాయోజిత (ఏఐబీపీ) పథకం కింద రాష్ట్రాల నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రస్తుతం ఇస్తున్న నిధుల వాటాను 25% నుంచి 60 శాతానికి పెంచాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణలోని మరో నాలుగు ప్రాజెక్టులను ఈ పథకం కింద చేర్చాలని కోరారు. శనివారం కేంద్ర జలవ నరుల శాఖ కార్యాలయంలో తొలిసారిగా జల వనరుల సమన్వయ కమిటీ భేటీ అయింది. దేశవ్యాప్తంగా పీఎంకేఎస్వై పథకం అమలు తీరుతెన్నుల పరిశీలన, మెరుగైన విధానాలు తెచ్చేందుకు వీలుగా ఇటీవలే కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్ నీటి పారుదల మంత్రి బ్రిజ్మోహన్ చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో మహారాష్ట్ర నీటి పారుదల మంత్రి గిరీష్ మహాజన్, మంత్రి హరీశ్రావు సభ్యులుగా ఉన్నారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేయడం, కేంద్రం నుంచి అందాల్సిన సాయం వంటి అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి కూడా ఇందులో పాల్గొన్నారు. కాగా ఈనెల 21వ తేదీన మరోసారి భేటీ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో 2016-17, 2017-18లో పూర్తిచేయగలిగే ప్రాజెక్టులను పీఎంకేఎస్వై కింద తీసుకుని వేగంగా నిర్మించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ కమిటీ కేంద్రానికి పలు సిఫారసులు చేసింది. సమావేశం అనంతరం కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరెతో కలసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. కరువు రాష్ట్రాలను ఆదుకోవాలి ‘ఏఐబీపీ కింద గతంలో 90% నిధులను కేంద్రం అందించేది. దాన్ని 60 శాతానికి తగ్గించారు. తెలంగాణలోగానీ, మహారాష్ట్రలోగానీ, అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో ఏఐబీపీ సాయం 25 శాతమే ఉంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, కరువులో ఉన్న రాష్ట్రాలకు సాయం పెంచాల్సిన అవసరాన్ని చెప్పాం. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించేలా చూడాలని కోరాం. ఉదాహరణకు దేవాదుల, మరికొన్ని ప్రాజెక్టులకు 25 శాతం మాత్రమే ఉంది. అందువల్ల అన్నింటికీ 60 శాతానికి పెంచాలి. కేంద్ర సాయం లేకుండా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయడం సాధ్యం కాదు. క్లియరెన్స్లు ఆలస్యం చేయకుండా సీడబ్ల్యూసీ ప్రాంతీయ కార్యాలయాలను పటిష్టం చేయాలి. రాష్ట్రాల్లో ఉన్న సీడబ్ల్యూసీ అధికారులు ఇఎన్సీలతో ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలి. కేంద్రం నుంచి కూడా ప్రతినెలా రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సిఫారసు చేశాం’ అని మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘ 2012లో ఏఐబీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులకు ఈరోజు కేవలం 20 శాతం ఎస్కలేషన్కు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఆయా ప్రాజెక్టులకు 50 శాతం వరకు ఎస్కలేషన్ అవసరం ఉంది. అందువల్ల నాబార్డు నుంచి రుణం ఇప్పించాలని సూచించాం. ప్రాజెక్టులు మరింత వేగంగా పూర్తిచేసేలా అన్ని రకాలుగా ఆర్థిక వనరులు సమకూర్చాలి. దేవాదులకు ఈ ఏడాది రూ. 112 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దేవాదులతో పాటు శ్రీరాంసాగర్ వరద కాలువ పథకాన్ని, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాన్ని, పెద్దవాగు(జగన్నాథ్పూర్), కొమురం భీం ప్రాజెక్టులను కూడా ఏఐబీపీలో చేర్చాలని కోరాం. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లను ఏడాది చివరలో కాకుండా మొదటి నెలలోనే 50 శాతం విడుదల చేయాలని కూడా సిఫారసు చేశాం’ అని హరీశ్రావు తెలిపారు. -
'కేటీఆర్, హరీష్లది ఫిరాయింపుల యజ్ఞం'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అపవిత్ర రాజకీయ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోందని టీ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్రావు ఫిరాయింపుల యజ్ఞం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను పోలింగ్ బూత్ల నుంచి ఎత్తుకుపోయి బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో 782 మంది రైతులు చనిపోయారని, అందులో 342 మంది రైతులవి మాత్రమే ఆత్మహత్యలని ప్రభుత్వం పేర్కొనడం సరికాదన్నారు. రైతుల ఆత్మహత్యలు నిరోధించేందుకు ప్రభుత్వం వద్ద సరైన విధానం లేదని తెలిపారు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 2132 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, వీరందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ను ఉప సంహరించుకోవాలని రావుల డిమాండ్ చేశారు. -
దసరా తర్వాతే పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీ
హైదరాబాద్ : నారాయణ్ఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో హరీశ్రావు మాట్లాడుతూ... మిషన్ కాకతీయ, సంక్షేమ కార్యక్రమాలపై రేపు సభలో చర్చిస్తామన్నారు. అలాగే కేబినెట్ విస్తరణపై మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలే అని ఆయన తెలిపారు. దసరా పండగ తర్వాతే పార్టీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హరీశ్రావు వెల్లడించారు. అలాగే ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. -
ఆ విషయంలో హరీశ్తో పోటీ
-
ఆ విషయంలో హరీశ్ తో పోటీ: కేటీఆర్
హైదరాబాద్ : అభివృద్ధి విషయం మాత్రమే తాను, హరీశ్ రావు పోటీ పడతామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పోటీ ఉండటంలో తప్పులేదన్నారు. రైతులకు రుణమాఫీ విషయంలో వన్టైం సెటిల్మెంట్లో తమ వైఖరి స్పష్టం చేశామన్నారు. రాజకీయ లబ్ది కోసమే తమపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పోలీసుల తమ విధి నిర్వహణలో భాగంగానే వరంగల్ ఎన్కౌంటర్ జరిగిందని ఆయన అన్నారు. వాటర్ గ్రిడ్పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. -
అసెంబ్లీలో హరీష్ వ్యాఖ్యలపై రగడ
-
అసెంబ్లీలో హరీష్ వ్యాఖ్యలపై రగడ
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో బుధవారం సాయంత్రం మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై రగడ నెలకొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. రైతు సమస్యలపై రెండోరోజు కూడా సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాధామోహన్పై హరీష్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని, రైతు సమస్యలపై సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆయన అన్నారు. కేంద్రమంత్రి ఎలాంటి ఆరోపణలు చేయలేదని, హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. ( రైతుల ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు, నపుంసకత్వం కారణమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ వ్యాఖ్యలు చేశారంటూ హరీష్ రావు పేర్కొన్నారు) అంతకు ముందు రైతు సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతుల మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలన్నారు. రైతుల పట్ల ఏ రకమైన మర్యాద ఉందో చెప్పాలంటే తన దగ్గర చాలా సబ్జెక్ట్ ఉందని, మాట్లాడుకుందామంటే అది కూడా చెప్పుకుందామని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు సమాధానం చెబుతోంటే విపక్షాలు అడ్డుకున్నాయి. -
'కాంగ్రెస్, టీడీపోళ్లు తోడు దొంగలు'
మెదక్(దుబ్బాక): ‘రైతుల కష్టాలు, బాధలు తెలిసినోళ్లం.. రైతుల కన్నీళ్లను తుడవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది.. అయితే తోడు దొంగలుగా మారిన టీడీపీ, కాంగ్రెస్ వాళ్లు ఓర్వలేక రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నార’ని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి, తొగుట మండలం జప్తిలింగారెడ్డి పల్లిలో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలకు కాల్వల ద్వారా సాగు నీరందించి, ఆగమవుతున్న అన్నదాతలను ఆదుకోవడానికి ప్రణాళిక బద్దంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు కలిసి సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాలకే సాగు, తాగు నీరందిస్తారా అంటూ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి ప్రాంత టీడీపీ, కాంగ్రెసోళ్లకు చీము నెత్తురుంటే వారిని నిలదీయాలని పిలుపు నిచ్చారు. రూ. 25 వేల కోట్లతో 48 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేపట్టి గోదావరి నీళ్లతో చెరువులను నింపి, అన్నదాతల ఆశలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వంపై ప్రతి పక్షాలు అవాకులు, చెవాకులు పలుకుతున్నాయని ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని రైతులంతా కలిసి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే ఆకారణంగా ముగ్గురు రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. -
'ఎన్నికలొస్తే ఇద్దరు తప్ప ఎవరూ గెలవలేరు'
నల్లగొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై, అధికార పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శలు చేశారు. నల్లగొండ పట్టణంలో స్థానిక మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మధ్యంతర ఎన్నికలొస్తే రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తప్ప ఎవరూ గెలవలేరంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గెలుస్తారని వెంకట్ రెడ్డి చెప్పిన వారి పేర్లలో కేసీఆర్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. సీఎం కేసీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం విదితమే. -
మంత్రి సభలో మహిళ ఆత్మహత్యాయత్నం
-
మంత్రి సభలో మహిళ ఆత్మహత్యాయత్నం
బెల్లంపల్లి: ముగ్గురు రాష్ట్ర మంత్రుల సాక్షిగా భూమి కోసం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జరిగింది. నిండు సభలో హెయిర్డై తాగి బలవన్మరణానికి యత్నించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు, దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీలు, ఎమ్మెల్యేలు బెల్లంపల్లి పర్యటనకు వచ్చారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తగా నిర్మించిన కార్యాలయ నూతన భవనానికి మంత్రి హరీశ్రావు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతుండగా.. బెల్లంపల్లి సుభాష్నగర్బస్తీకి చెందిన ఆరే వరలక్ష్మి అనే మహిళ సూపర్వాస్మల్ 33 హెయిర్డైని తాగి పడిపోయింది. పోలీసులు అంబులెన్స్లో ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా బాధితురాలు వరలక్ష్మి ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడింది. ‘నా తండ్రి పురంశెట్టి బాపు తాండూర్ శివారులోని సర్వే నం.699/1లో ఉన్న ఒక ఎకరం 42 సెంట్ల పట్టా భూమిని నాకు కట్నంగా ఇచ్చారు. ఆ భూమిని తాండూర్ జెడ్పీటీసీ మంగపతి సురేశ్బాబు కబ్జా చేసుకున్నాడు. 2011 నుంచి జెడ్పీటీసీ నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆక్రమణకు గురైన భూమి విషయమై హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. ఇంత వరకు జెడ్పీటీసీ సురేశ్బాబు భూమి మాత్రం అప్పగించలేదు. జెడ్పీటీసీకి మద్దతుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి టీఆర్ఎస్ నాయకులు పసుల సురేశ్ ఫోన్ చేసి రోజూ భూమి విడిచిపెట్టాలని బెదిరిస్తున్నారు. మంత్రి హరీశ్రావు దృష్టికి నా సమస్యను తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే హెయిర్డైని తాగాను’. పరామర్శించిన కలెక్టర్.. సభ ముగిసిన అనంతరం వరలక్ష్మిని కలెక్టర్ జగన్మోహన్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఆర్డీవో ఆయేషామస్రత్ఖానం, తహసీల్దార్ కె.శ్యామలదేవి ప్రభుత్వాస్పత్రితో బాధితురాలిని పరామర్శించారు. కలెక్టర్ జగన్మోహన్ ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ చంద్రమోహన్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెతో మాట్లాడుతూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ఉట్టికొట్టిన మంత్రి హరీశ్రావు
సిద్ధిపేట రూరల్: తెలంగాణ మంత్రి హరీశ్రావు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామం పాఠశాలలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉట్టి కొట్టారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
'ప్రజల్ని మభ్యపెడుతున్న విపక్షాలు'
హైదరాబాద్: తెలంగాణలో విపక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశంపైనైనా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. -
'ఆయన ఆంధ్రానాయకుల చేతిలో కీలుబొమ్మ'
నర్సంపేట (వరంగల్ జిల్లా): తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటున్న చంద్రబాబునాయుడు కుతంత్రాలను అడ్డుకోలేని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆంధ్ర నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారాడని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్రావు విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని 60 చెరువుల వద్ద ఒకే రోజు లక్షమొక్కలను నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేని కిషన్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ధర్నాలు చేయడం విచారకరమన్నారు. పాలమూరు, దిండి ప్రాజెక్ట్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నప్పటికీ పట్టించుకోని కిషన్రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయాలని హితవు పలికారు. ప్రాణహితకు జాతీయహోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని కిషన్రెడ్డి ప్రశ్నించకపోవడంతో ఆయన తెలంగాణ ప్రజల పక్షమా..ఆంధ్రా నాయకుల పక్షమా.. తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు జోగురామన్న, పద్మారావు, ఎంపీ సీతారాంనాయక్, జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ, టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. -
'ప్రతి జిల్లాకు జలవిధానం'
ఖమ్మం: గతంలో చేపట్టిన.. నూతనంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు, ఆయకట్టు, నిధుల మంజూరు వీటన్నింటినీ కలిపి ప్రతి జిల్లాకు జలవిధానం రూపొందించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా బుధవారం స్థానిక ఎన్నెస్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విధానంతో రాష్ట్రంలో బీడు భూములన్నింటినీ సస్యశ్యామలం చేయడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. 'గతంలో తీసుకున్న రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులతో జిల్లాకు నీరందించాలని అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుతం ఇందిరాసాగర్ హెడ్వర్క్స్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లాయి. ఈ విషయమై ఆ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాసినా స్పందించలేదు. ఇందిరాసాగర్ కింద చేసిన పనులు, దుమ్ముగూడెం పనులను అన్నింటినీ కలిపి ఒకే ప్రాజెక్టు కింద జిల్లాకు నీరందించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకోసం రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రభుత్వ ఇంజనీర్లతో కమిటీ వేశాం. నివేదిక రాగానే ముఖ్యమంత్రి ద్వారానే ఈ ప్రాజెక్టు ప్రకటన చేయిస్తాం. ఖమ్మం జిల్లాలో మిషన్ కాకతీయ సక్సెస్ అయింది. తొలి దశలో మిగిలిన చెరువులను రెండో దశలో కూడా పూర్తి చేస్తాం. వ్యవసాయానికి నీళ్లు అందించినప్పుడే ప్రభుత్వం ఆనందంగా ఉంటుంది' అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. -
జయశంకర్.. ఓ దిక్సూచి
మంత్రులు హరీశ్రావు, లక్ష్మారెడ్డి పటాన్చెరులో జయశంకర్ విగ్రహం ఆవిష్కరణ పటాన్చెరు : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రొఫెసర్ జయశంకర్ ఒక దిక్సూచి అని, ఆయన మార్గం అనుసరణీయమని మంత్రులు హరీశ్రావు, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి కొనియాడారు. గురువారం పట్టణంలో జయశంకర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జయశంకర్ ఆశయ సాధన దిశగా బంగారు, హరిత తెలంగాణ సాధించితీరుతామన్నారు. పేదలందరికీ మంచి వైద్యం, వారి ఆర్థిక స్థితి మెరుగు పడేందుకు ప్రాజెక్టులు రావాలని కోరేవారన్నారు. దేశపతి శ్రీనివాస్ ప్రసంగిస్తూ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి పితామహుడని గుర్తు చేశారు. జయశంకర్ సార్ తెలంగాణ తల్లి ఏర్పాటు చేసుకున్న న్యాయవాదని అభివర్ణించారు. ప్రజాకోర్టులో ఆయన తెలంగాణలో జరుగుతున్న అన్యాయంపై జీవితాంతం వాదించారని వివరించారు. జయశంకర్తో ఆయనకున్న గత స్మృతులను గుర్తు చేశారు. రూ. 270 కోట్లతో అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో కోటి రూపాయలు సాధించేందుకు ప్రభుత్వాల చుట్టూ ప్రజాప్రతినిధులు చెప్పులరిగేలా తిరిగేవారని గుర్తు చేశారు. కాని తమ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఒక్క పటాన్చెరుకే రూ. 270 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు వంద పడకల ఆసుపత్రికి ఆర్వో వాటర్ ప్లాంట్ను తన సొంత నిధులనుంచి వెచ్చించి నిర్మిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. జయశంకర్ విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి ప్రసాద్ను మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా సన్మానించారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి శంకుస్థాపన పటాన్చెరులో రూ. రెండు కోట్లతో నిర్మించనున్న జీహెచ్ఎంసీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పటాన్చెరు మైత్రిగ్రౌండ్స్లో రూ. రెండు కోట్లతో అధునాతన స్టేడియం నిర్మాణం కోసం మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎంజీ రోడ్డు నాలుగు లేన్లుగా వేసేందుకు మరో శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ పటాన్చెరు ఆర్అండ్బీ అతిథిగృహానికి రూ. 1.40 కోట్లతో కొత్త భవంతిని త్వరలో నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, రవీందర్రెడ్డి, బీహెచ్ఈఎల్ మాజీ యునియన్ నాయకులు ఎల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు గాలిఅనిల్కుమార్, ఆర్.కుమార్ యాదవ్, వంగరి అశోక్, జడ్పీటీసీ ప్రభాకర్, జీహెచ్ఎంసీ డిప్యూటి కమిషనర్ విజయలక్ష్మీ, నియోజక వర్గ స్థాయి నాయకులు, అన్ని గ్రామాల సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
హమాలీల అమ్మాయిలకు స్కాలర్షిప్లు
గ్రూప్-1కు రూ. 50 వేలు, సివిల్స్కు ప్రిపేరయితే రూ. లక్ష సెక్యూరిటీ గార్డుల వేతనం రూ. 13 వేలుగా నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మార్కెట్ యార్డుల్లో పనిచేసే హమాలీల అమ్మాయిల కోసం స్కాలర్షిప్లను ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర మంత్రి హరీశ్రావు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీల కార్యదర్శులతో బుధవారం మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దాంతోపాటు సెక్యూరిటీ గార్డులు, హమాలీ, దడువాయి కార్మికులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ హమాలీల ఆడపిల్లలకు ఇంటర్కు రూ. 2 వేలు, డిగ్రీకి రూ. 3 వేలు, పీజీకి రూ. 5 వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గ్రూప్-1 మెయిన్స్ కోచింగ్ తీసుకునే వారికి రూ. 50 వేల సహకారం, సివిల్స్కు ప్రిపేర్ అవుతుంటే రూ. లక్ష ఇవ్వనున్నట్టు తెలిపారు. మార్కెట్ యార్డుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుల వేతనాన్ని రూ. 6,700 నుంచి రూ. 13 వేలు పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. సెక్యూరిటీ గార్డులు, హమాలీ, దడువాయి, మహిళా కూలీలకు ఆరు నెలలకోసారి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని కార్యదర్శులకు సూచించారు. వారందరికీ ఈ నెల నుంచే రూ. 2 లక్షల బీమా వర్తించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. దీనిని వచ్చే ఏడాది నుంచి రూ.5 లక్షలు చేసేలా కార్మికశాఖతో మాట్లాడనున్నట్టు చెప్పారు. హమాలీల యూనిఫాం కోసం 3 వేలు ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. జీరో వ్యాపారాన్ని నిరోధించండి: మార్కెట్ యార్డుల్లో జీరో వ్యాపారం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. రైతులకు తక్పట్టీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటే రైతుకు, మార్కెట్ కమిటీకీ ఆదాయం పెరుగుతుందన్నారు. మార్కెట్ కార్యదర్శులు ప్రతినెలా చెక్ పోస్టులు, రైసు మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన మార్కెట్ ఫీజుల లక్ష్యాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. తమ వేతనాలు పెంచాలంటూ సమావేశం సందర్భంగా మార్కెట్ యార్డుల్లో పనిచేసేవారు మంత్రిని కోరారు. స్పందించిన హరీశ్ మార్కెటింగ్శాఖ డెరైక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. -
వెంగళరావు పార్కులో నాయిని, హరీష్రావు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావుతో కలిసి గురువారం ఉదయం వెంగళరావు పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా నగరపాలక వాటర్ సప్లై అధికారులతో మాట్లాడారు. పార్కులోని చెరువు పునర్నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. -
'అభివృద్ధి కోసమే పనిచేస్తాం'
సంగారెడ్డి క్రైం(మెదక్): తమ ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధిని చూసి కాంగ్రెస్, టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్ని కాంగ్రెస్, టీడీపీ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి విషయంలో ప్రోత్సహించాలని, విమర్శించడాన్ని వారి విచక్షణకే వదిలేస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణలో ఆస్కి సంస్థకు రూ.5 లక్షలు అడ్వాన్సుగా చెల్లించామని, అలాంటిది టీఆర్ఎస్ శిబిరంలో శిక్షణ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం వారి అవివేకానికి నిదర్శనమని చెప్పారు. ఎవరేమనుకున్నా తాము ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసమే పనిచేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు నచ్చిన కార్యక్రమాలపై విమర్శలు చేస్తే కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రజలకు దూరమవడం ఖాయమన్నారు. -
మిషన్ కాకతీయ పనుల్లో అలసత్వం వద్దు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనుల్లో అధికారులు ఎక్కడా అలసత్వం వహించరాదని నీటిపారుదల శాఖమంత్రి టి.హరీశ్రావు అన్నారు. మిషన్ కాకతీయ పురోగతిపై మంగళవారం ఆయన జలసౌధలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న చెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలన్నారు. అటవీశాఖ వారితో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ హెల్ప్లైన్ పనితీరుపై ఆరా తీస్తూ.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. రోజువారీ ఫిర్యాదులను తన వద్దకు పంపాలని ఆదేశించారు. -
‘మిషన్ కాకతీయ’ హెల్ప్లైన్ ప్రారంభించిన మంత్రి హరీష్
హైదరాబాద్ సిటీ: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుధ్దరణపై ప్రజల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించేందుకు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ ప్రత్యేక హెల్ప్లైన్ను ఆరంభించింది. గురువారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్రావు హెల్ప్లైన్ నెంబర్ 040-23472233ని ఆరంభించారు. ఈ హెల్ప్లైన్ నిర్వహణ కోసం ఇద్దరు ఈఈ, డీఈ, జేఈలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ, చెరువుల పునరుధ్దరణ పనుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగ స్వాములై పూడికమట్టిని తరలించుకుపోవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
గొల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని గొల్లపల్లి సాగునీటి ప్రాజెక్టును భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టు ఆయకట్టు వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ పర్యటనలో దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా పాల్గొన్నారు. -
హరీశ్రావుపై హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్ : శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి హరీష్రావుపై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సభలో సభలో తాను లేకపోయినా ...జాతీయ గీతాన్ని అవమానించినట్లు సస్పెండ్ చేయించి, సభను తప్పుదోవ పట్టించారని ఆయన తెలిపారు. ఈ అంశంపై సండ్ర వీరయ్య ఈరోజు ఉదయం హరీష్ రావుకు వ్యతిరేకంగా అసెంబ్లీ స్పీకర్కు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. -
వారిని గుండెల్లో పెట్టుకుంటాం
సంగారెడ్డి: 'తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది.. వారి కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం.. వారి కాళ్లకు ముళ్లు గుచ్చుకున్నా తమ పంటితో తీస్తాం..' అని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్లో గురువా రం 52 మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు ఎలాంటి బాధలు లేకుండా చేయడానికి సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. బాధితులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 'నిర్భయ'కు శ్రీకారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్భయ సహాయ కేంద్రాన్ని మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇదే తొలి కేంద్రం. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఢిల్లీ తరహా నిర్భయ సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకోవద్దనే ఉద్దేశంతో ‘షీ’ టీమ్లను ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే నేరుగా నిర్భయ కేంద్రాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. -
'మామ, అల్లుడు ఏం సాధించుకు వచ్చారు?'
కరీంనగర్ : తెలంగాణ ద్రోహులను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకులకు ఆపార్టీ పెద్దపీట వేస్తుంటే... తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు ప్రశ్నించటం లేదని ఆయన సూటిగా అడిగారు. టీడీపీ నుంచి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్...శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన మంగళవారమిక్కడ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందిపెడితే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అన్యాయాలు జరిగితే అడిగేందుకు తెలంగాణ టీడీపీ సిద్ధంగా ఉందని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఎస్పీ ఎడారిగా మారుతుంటే మామ, అల్లుడు మహారాష్ట్రకు వెళ్లి ఏం సాధించుకు వచ్చారని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలను టీడీపీ సహించదని స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలను ప్రెస్ అకాడమీ చెర్మన్ అల్లం నారాయణ లాంటి ఉద్యమకారులు ఎందుకు ప్రశ్నించరని ఎర్రబెల్లి అన్నారు. -
విధానాలకు తూట్లు
* సర్కారీ పనులకు టెండర్ల అనుమతి విధానంలో మార్పులు * సీవోటీకి వెళ్లే టెండర్ల విలువ పరిమితి 2 నుంచి 10 కోట్లకు పెంపు * మంత్రుల బృందం కీలక నిర్ణయం, ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి * తాజా నిర్ణయంతో లోపించనున్న పారదర్శకత * టెండర్ల ఆమోదానికి ఒత్తిళ్లు పెరుగుతాయంటున్నఅధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో అవినీతికి తావుండకూడదని, పాలనలో పారదర్శకత పెరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు వెలువడుతున్నాయి. అవినీతికి ఆస్కారమిచ్చేలా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయి. ఇప్పటికే నామినేషన్పై ఇచ్చే పనుల విలువను లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలకు పెంచుతూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని ఉన్నతాధికారులు వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్ మంత్రి కె. తారకరామారావుతో కూడిన మంత్రుల బృందం శనివారం సమావేశమై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండు కోట్ల రూపాయల పరిమితిని దాటే ప్రభుత్వ పనులన్నింటికి సంబంధించిన టెండర్లను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు పంపి ఆమోదం పొందాల్సి ఉంటుం ది. ఈ సీవోటీలో ఆరేడు శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్లు సభ్యులుగా ఉంటారు. అయితే తాజాగా ఈ పరిమితిని రూ. రెండు కోట్ల నుంచి పది కోట్లకు పెంచాలని మంత్రుల బృందం నిర్ణయించింది. అంటే రూ. పది కోట్లకుపైగా విలువైన పనులకు మాత్రమే ఇకపై సీవోటీ అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా సంబంధింత టెండర్ ఫైళ్లపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆలోపే వెల్లడించాలి. లేదంటే ఆ టెండరుకు సీవోటీ ఆమోదం లభించినట్లు(డీమ్డ్ టూబీ అప్రూవ్డ్)గా భావించాలని మంత్రులు నిర్ణయించారు. ఒక దశలో సీవోటీ కారణంగా టెండర్లు ఆలస్యమవుతున్నాయని, దాన్ని తొలగించాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే సీవోటీ ఉండాలని అధికారులు సూచించినట్లు సమాచారం. ప్రధానంగా రోడ్లుభవనాలు, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోనే వేల కోట్ల రూపాయల విలువైన ఇంజనీరింగ్ పనులు జరుగుతుంటాయి. మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయం అమలైతే రూ. 10 కోట్లలోపు విలువైన పనులకు ఇకపై సంబంధిత శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) లేదా చీఫ్ ఇంజనీర్ పరిధిలోనే అనుమతులు లభిస్తాయి. సాధారణంగా సీవోటీలో అయితే అన్ని శాఖల ఈఎన్సీలు సభ్యులుగా ఉండడం వల్ల టెండర్ నిబంధనలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలను తెలిపేందుకు ఆస్కారముంటుంది. అలాకాకుండా సంబంధిత శాఖ ఇంజనీరింగ్ విభాగాధిపతికే పూర్తి అధికారముంటే ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, తాజా నిర్ణయం వల్ల పంచాయతీరాజ్ శాఖలో ఏ ఒక్క పని కూడా కమిషనరేట్ ఆఫ్ టెండర్స్కు వెళ్లదని, ఆ శాఖ ఈఎన్సీ స్థాయిలోనే టెండర్లు ఖరారవుతాయని సమాచారం. వాటర్గ్రిడ్కు సంబంధించిన పనుల విషయంలోనూ ఇదే విధానం అమలైతే పనుల నాణ్యత ఎలా ఉంటుందోనన్న ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. -
కళకళ.. నిగనిగ.. గలగల
ఇదే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ‘మహబూబ్నగర్ చాలా వెనుకబడిన జిల్లా. రాష్ట్రంలో అత్యధిక చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు అన్నీ కలుపుకుని 7,480 నీటి వనరులు జిల్లాలో ఉన్నాయి. అందుకే ‘మిషన్ కాకతీయ’పై అవగాహన సదస్సు ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాం.’ అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు ప్రకటించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చెరువులు, కుంటల పునరుద్ధరణ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’పై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నీరు మనిషికి ఆధారం. ఊరుకు చెరువూ అంతే ఆధారం. ఇది ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమం. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనను మీ ముందు పెట్టి, సల హాలు తీసుకునేందుకే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం’ అని మంత్రి హరీష్రావు వెల్లడించారు. జిల్లాలో 6,475 చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తే జరిగే ప్రయోజనాలను మంత్రి వివరించారు. గంగాళంగా ఉండే చెరువులు తాంబాళంలా మారాయన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత కోసం ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి, పనులు పారదర్శకంగా చేపడుతుందని వెల్లడించారు. చెరువుల్లో తీసే పూడిక మట్టిని తరలించుకుంటే రైతులకు కలిగే ప్రయోజనాలను మంత్రి వివరించారు. కాకతీయ మిషన్ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మండల స్థాయిలోనూ అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్రావు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. సిబ్బంది కొరత లేకుండా చూస్తాం కళకళలాడే చెరువులు, నిగనిగలాడే రోడ్లు, గలాగల పారే మంచినీటి పథకాలు లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి హరీష్ వ్యాఖ్యానించారు. నీటి పారుదల శాఖలో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం తెలిపిన నిధులు, పనుల వివరాలు మంత్రి వెల్లడించారు. డిసెంబరు నెలాఖరుకల్లా మిషన్ కాకతీయ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి హరీష్రావు ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాలరాజు, సంపత్కుమార్, రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సుడిగాలి పర్యటన మహబూబ్నగర్ జిల్లా పర్యటన సందర్భంగా గురువారం జిల్లాలో పలు కార్యక్రమాలకు మంత్రి హరీష్రావు హాజరయ్యారు. జడ్చర్ల, మహబూబ్నగర్ మార్కెట్ యార్డుల్లో రైతుల విశ్రాంతి గృహాలకు శంకుస్థాపన చేశారు. మహబూబ్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఈ కార్యాలయ భవనం (జలసౌధ)ను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువును పరిశీలించి పునరుద్ధరణకు హామీ ఇచ్చారు. అనంతరం కొత్తకోటలో శంకర సముద్రం రిజర్వాయర్ను సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. -
'తెలంగాణలో ఒక నీతి.. ఏపీలో మరో నీతి'
-
'తెలంగాణలో ఒక నీతి.. ఏపీలో మరో నీతి'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒకనీతి, ఆంధ్రప్రదేశ్లో మరొక నీతి పాటిస్తోందని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో తాము రుణమాఫీ చేశామని, ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసిందా అని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలను తగ్గించమంటే రైతులను కాల్చిచంపిన పార్టీ టీడీపీ అని హరీష్ రావు విమర్శించారు. గుర్రాలతో ప్రజలను తొక్కించిన పార్టీ టీడీపీ అని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో 59 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వందలాదిమంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని, టీడీపీకి నిజంగా ప్రేముంటే రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ నాయకులు చేసిన యాత్ర మొసలి కన్నీరు కాదా? టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురదజెల్లే ప్రయత్నం కాదా? అనంతపురం జిల్లా రైతుల ఆత్మహత్యలు ఎందుకు వినిపించడం లేదు? అంటూ హరీష్ రావు టీడీపీపై విరుచుకుపడ్డారు. -
గద్వాల మార్కెట్కు మోక్షం
గద్వాల : ఎట్టకేలకు గద్వాల పత్తి మార్కెట్కు మోక్షం లభించింది. ఆరేళ్ల క్రితమే ప్రారంభించినా.. తర్వాత అది మూలనపడింది. చివరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు గురువారం ఆదేశించడంతో సీసీఐ కొనుగోళ్లు జరపనుం ది. హైదరాబాద్లో మార్కెటింగ్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల తో జరిగిన సమీక్షా సమావేశంలో గద్వా ల పత్తి మార్కెట్పై మంత్రి స్పందిం చారు. దీంతో గద్వాల కాటన్ మార్కెట్ కు మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. గద్వాల ప్రాంతంలో మూడు, నాలుగు దశాబ్ధాల క్రితం పత్తి విత్తనోత్పత్తి సాగు ప్రారంభమైంది. పత్తి విత్తనోత్పత్తిలో రైతులకు, ఆర్గనైజర్లకు అధిక ఆదాయం వస్తుండడంతో ఏటేటా విస్తీర్ణం పెంచా రు. దీనికితోడు దేశంలోనే గద్వాలలో ఉత్పత్తి అయిన పత్తి విత్తనాలకు మంచి మార్కెట్ ఉండడంతో కంపెనీలు కూడా పత్తి విస్తీర్ణాన్ని పెంచేందుకు ముందుకు వచ్చాయి. ఇలా ఎనిమిదేళ్ల క్రితం 30వేల ఎకరాల్లో పత్తి పంట సాగు ఉండడంతో గద్వాల మార్కెట్లో పత్తి మార్కెట్ కో సం రూ. 2కోట్ల వ్యయం చేశారు. పత్తి మార్కెట్ నిర్మాణం పూర్తి కావడంతో 05 అక్టోబర్ 2008న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో మార్కెట్ ప్రారంభోత్సవం చేయించారు. ప్రారంభోత్సవం జరిగిన మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు కొనుగోళ్లు, అమ్మకాలు ప్రారం భం కాలేదు. ఆరేళ్ల పాటు ఉత్సవ విగ్రహంలా మార్కెట్ నిర్మాణాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతూ వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం గద్వాల కాటన్ మా ర్కెట్లో కొనుగోళ్లను ప్రారంభించాల్సిం దిగా సీసీఐని ఆదేశించడంతో మూలనపడిన మార్కెట్ ప్రాంతం రైతులకు ఉపయోగపడేలా మారే అవకాశం ఏర్పడింది. మూడేళ్ల క్రితం నుంచి గద్వాల పత్తి విత్తనోత్పత్తి సమస్యల్లో రాజకీయాలు జోక్యం చేసుకోవడంతో కంపెనీలు విస్తీర్ణాన్ని పూర్తిగా తగ్గించాయి. ప్రస్తుతం కేవలం 10వేల ఎకరాల్లో సీడ్ విత్తనోత్పత్తి పంట సాగవుతుండగా, కమర్షియల్ పత్తి పంట సాగు 2వేల ఎకరాల్లో ఉంది. సాగు చేసుకున్న పత్తి రైతులకు గద్వాల మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైతే గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం పత్తి రైతులు తమ ఉత్పత్తులను జిన్నింగ్ మిల్లులకు అప్పగించి ఎంతిస్తే అంత తీసుకునే పరిస్థితి ఉంది. గద్వాల మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభించే విషయమై గద్వాల మార్కెట్ సెక్రటరీ హిమాశైలిని వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందడంతో పాటు సీసీఐ నుంచి స్పందన రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే తదుపరి చర్యలను చేపడతామని ఆమె తెలిపారు. -
కాంగ్రెస్ పాలన...చంద్రబాబు కుట్ర వల్లే...
కరెంటు కష్టాలు గజ్వేల్: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పాలన, టీడీపీ అధ్యక్షుడు కుట్రేకారణమని నీటి పారుదల శాఖామాత్యులు హరీష్రావు పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్లోని వైష్ణవీ గార్డెన్స్లో నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేడు కరెంట్ సరఫరా సక్రమంగా లేదంటూ విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు... కిరణ్కుమార్రెడ్డి సీఎంగా పనిచేసిన కాలంలో దక్షిణ గ్రిడ్ నుంచి 2వేల మెగావాట్ల విద్యుత్ను తెప్పించే ప్రయత్నం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు ఆంధ్ర, రాయలసీమలోని థర్మల్ ప్లాంట్లకు తరలివెళ్తుంటే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్ వాటాను రాకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. లోయర్ సీలేరు వద్ద నుంచి తెలంగాణకు 52 శాతం విద్యుత్ వాటా రావాల్సి ఉండగా అది చంద్రబాబు కుట్రవల్లే రావడం లేదన్నారు. కరెంట్ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి టీఆర్ఎస్ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీశ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈనెల 11న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ, 12న సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో బహిరంగ సభ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఈనెల 8న నియోజకవర్గ స్థాయిలో, 9న మండల స్థాయిలో పార్టీ సమావేశాలను నిర్వహించుకోవాలని సూచించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, బాబూమోహన్, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి రాజయ్యయాదవ్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ నగర పం చాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఎ మ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, టీఆర్ఎస్వీ జి ల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ సభలో ఎంపీటీసీ సభ్యుడి ఆత్మహత్యాయత్నం పోలీసులు వేధిస్తున్నారని.. ఒంటిపై పెట్రోల్ చల్లుకోవడంతో కలకలం గజ్వేల్: జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఒక కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేసిన సంఘటనకు తనను బాధ్యునిగా చిత్రీకరిస్తూ పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జగదేవ్పూర్ ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్ ఒంటిపై పెట్రోల్ చల్లుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం గజ్వేల్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్రావు ప్రసంగిస్తుండగా అనూహ్యంగా ఈ సంఘటన చోటుచేసుకోవడంతో పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇటిక్యాల గ్రామానికే చెందిన భాస్కర్... గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పుతో తనకు ఏ సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఆయన ఈ ఘటనకు పాల్పడ్డారు. పక్కనున్న కార్యకర్తలు, నాయకులు అతణ్ని వారించి, సమావేశ మందిరం నుంచి పక్కకు తీసుకెళ్లారు. అప్పటికే మంత్రి ప్రసంగం చివరి దశకు చేరడంతో సంఘటన అనంతరం మరికొంతసేపు మాట్లాడి ముగించారు. కొందరు నాయకులు ఎంపీటీసీ భాస్కర్ను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి వద్దకు తీసుకెళ్లి అతని సమస్యను వివరించారు. డిప్యూటీ స్పీకర్ అతణ్ని సముదాయించే ప్రయత్నం చేశారు. -
ఉప పోరు.. ఎవరిది జోరు!
సాక్షి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీలతోపాటు అన్ని వర్గాల వారు ఉప ఎన్నిక ఫలితంపై ఆసక్తిచూపుతున్నారు. ఓటింగ్ శాతం తగ్గడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఫలితం ఎలా ఉంటుందోనని విశ్లేషించుకునే పని లో నిమగ్నమయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు గెలుపుపై నమ్మకంతో ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గటం ఆ పార్టీలను కొంత కలవరానికి గురిచేస్తోంది. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ను పరిశీలించటంతోపాటు, ఏయే ప్రాంతాల్లో తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందన్న దానిపై ఆయా పార్టీల నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేయటంతోపాటు భారీ మెజార్టీ దక్కుతుందన్న నమ్మకంతో ఉంది. మెదక్ ఉప ఎన్నిక బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న మంత్రి హరీష్రావు పోలింగ్ సరళిపై పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతో చర్చించారు. ఏ డు నియోజకవర్గాల పరిధిలో తమకు ఎంతమేర ఓట్లు వ స్తాయి? మెజార్టీ ఎంత రావచ్చు? అనే అంశాలపై హరీష్రావు చర్చించినట్లు సమాచారం. ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ టీఆర్ఎస్కు ఓటింగ్ పెరిగిందని మంత్రి ఎమ్మెల్యేలతో అన్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి భారీ మెజార్టీ దక్కటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంగారెడ్డి, పటాన్చెరు, మెదక్లలో ఓటింగ్ టీఆర్ఎస్కు అనుకూలంగా జరిగినట్లు ఆ పార్టీ అంచనా వేస్తోంది. మొత్తంగా తమ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవటం ఖాయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలో ఆశలు.... మరోవైపు కాంగ్రెస్, బీజేపీ సైతం విజయావకాశాలపై నమ్మకంతో ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి విజయంపై ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు కలిసిరావటంతోపాటు కాంగ్రెస్ సంప్రదాయ ఓటింగ్తో విజయం ఖాయమని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. సొంత నియోజకవర్గమైన నర్సాపూర్లో మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. టీఆర్ఎస్కు మంచిపట్టు ఉన్న సిద్దిపేటలో ఓట్లను బీజేపీ చీల్చటం, గజ్వేల్లో గట్టిపోటీ ఇవ్వటం తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. మెదక్లో టీఆర్ఎస్తో సమానంగా కాంగ్రెస్కు ఓట్లు వస్తాయన్న ధీమా వ్యక్తమవుతోంది. బీజేపీ పార్టీ సైతం విజయావకాశాలపై నమ్మకంగా ఉంది. మోడీ ప్రభావం, జగ్గారెడ్డి ప్రభావంతో ఉప ఎన్నికలో బయటపడతామని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఉప ఎన్నిక ఓటింగ్ సరళిపై పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి జగ్గారెడ్డి, ముఖ్య నేతలతో చర్చించినట్లు సమాచారం. సంగారెడ్డి, పటాన్చెరు, మెదక్, సిద్దిపేటలో అనుకూలమైన ఓటింగ్ జరిగినట్లు బీజేపీ అంచనా వేస్తోంది. దీనికితోడు మోడీ ప్రభావంతో యువత, పట్టణ ఓటర్లు తమవైపు మొగ్గుచూపారని భావిస్తోంది. జగ్గారెడ్డి తన సొంత నియోజకవర్గమైన సంగారెడ్డిలో భారీ మెజార్టీ రావటం ఖాయమని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం ఎంపీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ‘గీతం’లో కౌంటింగ్ ఏర్పాట్లు మెదక్ ఉప ఎన్నికల కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల నుంచి ఓటింగ్ యంత్రాలు రుద్రారంలోని గీతం యూనివర్సిటీకి చేరుకున్నాయి. అఖిలపక్షం నాయకుల సమక్షంలో కలెక్టర్ రాహుల్ బొజ్జా ఈవీఎం యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్కు సీల్ వేశారు. కౌంటింగ్ జరగనున్న గీతం యూనివర్సిటీ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు అధికారులు కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. -
హరిత తెలంగాణే లక్ష్యం
గజ్వేల్: హరిత తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు వెల్లడించారు. గురువారం గజ్వేల్లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హౌసింగ్ బోర్డు కాలనీ, కస్తుర్బా, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటడమే కాకుండా పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఏటా 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు వెల్లడించారు. చెట్ల నరికివేత వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసి ఆకుపచ్చని తెలంగాణను సాధించుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ఈ ప్రక్రియ ఉద్యమంలా జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని వెల్లడించారు. త్వరలోనే పలు యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు తరలిరానున్నాయని చెప్పారు. ఈ నియోజకవర్గం.. దేశంలోనే ఆదర్శంగా మారటం ఖాయమన్నారు. ఇదిలావుంటే మొక్కల నాటే కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, పట్టణవాసులచే మొక్కలను పెంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ముట్రాజ్పల్లిలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీని సందర్శించారు. కస్తుర్బా పాఠశాలను సందర్శించి విద్యార్థినుల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీ హన్మంతరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ దుంబాల అరుణ, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు మద్దిరాజిరెడ్డి, యాదగిరి, మద్దూరి శ్రీనివాస్రెడ్డి, దేవీ రవీందర్, మధు, ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
లాఠీచార్జిపై మంత్రి సీరియస్
సంగారెడ్డి మున్సిపాలిటీ : చేగుంట మండలం నార్సింగ్ వద్ద రైతులపై జరిగిన లాఠీచార్జి ఘటనపై సీఎం కేసీఆర్తో పాటు మంత్రి హరీష్రావు తీవ్రంగా స్పందించారు. దీనిపై ఇన్చార్జి కలెక్టర్ శరత్ను విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు మెదక్ ఆర్డీవో వనజాదేవి విచారణ జరిపి అందజేసిన నివేదిక ఆధారంగా చేగుంట విద్యుత్శాఖ సహాయ ఇంజనీర్ పెంట్యానాయక్ను సస్పెండ్చేస్తూ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. రామాయంపేట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అధికారి శ్రీనివాస్రెడ్డిని బదిలీ చేయాలని ట్రాన్స్కో ఎస్ఈకి సిఫార్సు చేశారు. విద్యుత్ సరఫరాపై రైతులకు వాస్తవ పరిస్థితులు తెలియజేయడంలో ఏఈ విఫలమయ్యారని, రైతులకు అందుబాటులో లేరని ఆర్డీవో విచారణలో తేలిందని శరత్ తెలిపారు. ఏడీఈ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఆర్డీవో నివేదికఆధారంగా ఏఈని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈలు, ఏడీఈలు విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రైతులకు కనీసం 6 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లాలో పారిశ్రామికరంగానికి విద్యుత్ కోతను విధించైనా రైతులకు మెరుగైన విద్యుత్సరఫరా చేయాలని ఆ శాఖ ఎస్ఈని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు ఇన్చార్జి కలెక్టర్తో విద్యుత్ సరఫరాపై సమీక్షించినట్టు సమాచారం. -
దశాబ్దం తర్వాత బుగ్గ కారు
- హరీష్రావుకు మంత్రి పదవి - క్యాబినెట్లో సిద్దిపేటకు సముచిత స్థానం - భారీ నీటిపారుదల శాఖ కేటాయింపు సిద్దిపేట జోన్, న్యూస్లైన్: సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికి రాజయోగం పట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం తొలివిడత ప్రమాణం చేసిన 11 మంది మంత్రుల్లో ఎమ్మెల్యే హరీష్రావుకు అవకాశం దక్కింది. భారీ నీటి పారుదల శాఖను హరీష్రావుకు కేటాయించించారు. సిద్దిపేట నియోజకవర్గానికి పది సంవత్సరాలుగా మంత్రి పదవి కరువైంది. ఈ క్రమంలో హరీష్రావుకు తొలివిడతలో మంత్రివర్గంలో బెర్తు ఖాయం కావడంతో నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. సిద్దిపేట శాసనసభకు 2004 ఉప ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన హరీష్రావు అప్పట్లోనే దివంగత నేత వైఎస్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కూటమిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పక్షాన హరీష్రావు ఎమ్మెల్యే కాకుండానే వైఎస్ కేబినెట్లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు. తొలిసారి మంత్రి హోదాలోనే అప్పట్లో నియోజకవర్గ అభివృద్ధికి పుష్కలంగా నిధులను విడుదల చేయించుకున్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుచిత వైఖరిని నిరసిస్తూ కొద్ది నెలల తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. దీంతో హరీష్రావు తన మంత్రి పదవిని వదులుకున్నారు. కాలక్రమేనా 2009 సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచిన హరీష్రావు టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా శాసనసభలో పార్టీ పక్షాన కీలక పాత్ర పోషించారు. ఈ పదేళ్ల పాటు శాసన సభ్యుని హోదాలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడే తొలి మంత్రివర్గ కూర్పులో సిద్దిపేటకు సముచిత స్థానం దక్కింది. తెలంగాణ ప్రాంతంలో జలవనరుల అభివృద్ధిని మరింత పెంపొందించే దిశగా కేసీఆర్ తన మేనల్లుడు హరీష్రావుకు భారీ నీటి పారుదల శాఖతో పాటు అదనంగా మరో శాఖను కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
గజ్వేల్, న్యూస్లైన్: తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్కే సాధ్యమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్లో కాంగ్రెస్ నేత, మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ తదితరులు హరీష్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 2లక్షల రుణం, స్వయం సంఘాల మహిళలకు, రైతులకు లక్ష వరకు ఉన్న బ్యాంకు రుణాల మాఫీ, కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు కృషిచేస్తామన్నారు. తమ పార్టీకి నాలుగున్నరకోట్ల ప్రజలే హైకమాండ్ అని హరీష్రావు పేర్కొన్నారు. తాము ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం బందైపోయిందన్నారు. చివరి నిమిషం వరకు తెలంగాణను అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రల చేశారన్నారు. ఆంధ్రావారి నాయకత్వంలో వారి మోచేతి నీళ్లు తాగాల్సిన అగత్యం తెలంగాణ ప్రజలకు లేదని, టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గజ్వేల్ నగర పంచాయతీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎలక్షన్రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, గోపాల్రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, నాయకులు గాడిపల్లి భాస్కర్, నారాయణరెడ్డి, సురేష్గౌడ్, చేతిరెడ్డి లింగారెడ్డి, ఆకుల దేవేందర్, మద్ది రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు మూడు కళ్ల సిద్ధాంతం!
హైదరాబాద్: అన్ని జాతీయ పార్టీలను మోసం చేసిన ఘనుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని టిఆర్ఎస్ నేత హరీష్రావు మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రెండు కళ్ల సిద్ధాంతం పోయి, మూడు కళ్ల సిద్ధాంతం వచ్చిందన్నారు. ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలది ఒక దారి, తెలంగాణ నేతలది ఇంకో దారి, చంద్రబాబుది మరోదారని విమర్శించారు. అన్ని పార్టీల నేతలను చంద్రబాబు ఒంటరిగా కలవడంలో ఆంతర్య మేంటీ?అని హరీష్రావు ప్రశ్నించారు.