కేసీఆర్‌, హరీశ్‌రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు | Bhupalapally Court Summoned Brs Top Leaders Kcr Harishrao | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 5న హాజరవండి: కేసీఆర్‌,హరీశ్‌రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు

Published Mon, Aug 5 2024 7:08 PM | Last Updated on Mon, Aug 5 2024 7:39 PM

Bhupalapally Court Summoned Brs Top Leaders Kcr Harishrao

సాక్షి,భూపాలపల్లి: బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు సోమవారం(ఆగస్టు5) నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులు సెప్టెంబరు 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 

ఈ మేరకు వారందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను భూపాలపల్లి కోర్టు విచారించింది. అనంతరం కేసీఆర్‌, హరీశ్‌రావులకు నోటీసులిచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement