bhupalapalli
-
కేసీఆర్, హరీశ్రావులకు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్(kcr), మాజీ మంత్రి హరీశ్రావు(HarishRao)కు తెలంగాణ హైకోర్టులో మంగళవారం(డిసెంబర్24) ఊరట లభించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంలో తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, మేడిగడ్డ(Medigadda) బ్యారేజీలో పగుళ్లకు కేసీఆర్,హరీశ్రావే కారణమని భూపాలపల్లి కోర్టు(Bhupalapalli Court)లో స్థానిక న్యాయవాది ఒకరు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన భూపాలపల్లి సివిల్ కోర్టు కేసీఆర్,హరీశ్రావులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను క్వాష్ చేయాల్సిందిగా కేసీఆర్,హరీశ్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు భూపాలపల్లి కోర్టు నోటీసులపై కేసీఆర్,హరీశ్రావులకు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారునికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్లు
సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావులు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసుల్ని కొట్టివేయాలని కోరారు.మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు ఈ ఏడాది జులై 10న కేసీఆర్, హరీశ్రావుకు నోటీసులు పంపింది. అయితే, ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్, హరీష్రావు తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
కేసీఆర్, హరీశ్రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు
సాక్షి,భూపాలపల్లి: బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు సోమవారం(ఆగస్టు5) నోటీసులు జారీ చేసింది. కేసీఆర్తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులు సెప్టెంబరు 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు వారందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్ను భూపాలపల్లి కోర్టు విచారించింది. అనంతరం కేసీఆర్, హరీశ్రావులకు నోటీసులిచ్చింది. -
సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడను: సీఎం రేవంత్
సాక్షి, భూపాలపల్లి జిల్లా: హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తానెప్పుడూ కేసులకు భయపడనని అన్నారు. అమిత్షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని, అందుకే ఢిల్లీ పోలీసులను గాంధీభవన్కు పంపించి, తనను అరెస్ట్ చేయాలని ఆదేశించారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులే కాదు, సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడనని స్పష్టం చేశారు. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.భూపాలపల్లి జిల్లా రేగొండలో ఏర్పాటు చేసిన జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలిగా కడియం కావ్యాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జయశంకర్ ఊరును గత ప్రభుత్వం గ్రామపంచాయతీగా చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకే కాషాయ పార్టీ 400 సీట్లు కావాలని అంటోందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపణలు గుప్పించారు. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. -
600 ఎకరాల అటవీ భూమి అమ్మకానికి సిద్ధం..?!
సాక్షి, వరంగల్: ఏండ్లుగా అటవీ శాఖ అధీనంలో ఉన్న భూమి తన భూమి అంటూ ఓ వ్యక్తి కోటి రూపాయాలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వైనం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్కు చెందిన భూమి తమ దానం(హిబా) ద్వారా తనకు సంక్రమించిందని పేర్కొంటూ సదరు వ్యక్తి భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కొంత మంది వ్యక్తులకు విక్రయించినట్లు జోరుగా ప్రచారం నడుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 41లో 1298.03 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 41 సర్వే నంబర్లోను పూర్తి విస్తీర్ణం అటవీ(మహాసూర) భూమిని రెవెన్యూ అధికారులో రికార్డులో నమోదు చేశారు. సంవత్సారాలుగా పహణీ రికార్డులో, ధరణిలో సైతం మొత్తం ఎకరాలు అటవీ భూమిని అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. సదరు భూమి మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అని రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. సర్వే నంబర్ 41 పరిధిలోని 600ఎకరాల భూమి తనదంటూ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగిరిగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. సేత్వార్ రికార్డులో అప్పటి అధికారులు 41 సర్వేనంబర్ ఎవరికీ కేటాయించకపోవడంతోనే ఈ తతంగం అంత నడించిందని పలువురు చర్చించుకుంటున్నారు. ధరణిలో అడవి పేరుతో ఉన్న రికార్డు -
నేడు భూపాలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్ సభ
-
ఆర్టీసీ బస్సును ఢీకొట్టి.. 15 మీటర్లు ఈడ్చుకెళ్లి
శాయంపేట: మద్యం మత్తులో ఓ ఇసుక లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. అతివేగంగా లారీని నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఆ వేగానికి ఆర్టీసీ బస్సును లారీ 15 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. లారీ సైతం అదుపుతప్పి పొలాల్లో పక్కకు ఒరిగింది. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారు గుట్టల సమీపాన నేషనల్ హైవేపై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 45 మంది ప్రయాణికుల్లో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. హన్మకొండ నుంచి భూపాలపల్లి వైపు పరకాల డిపో బస్సు వెళ్తుండగా, కాళేశ్వరం నుంచి హన్మకొండ వైపు ఇసుక లారీ వెళ్తోంది. శాయంపేట సీఐ రమేష్ అక్కడికి చేరుకుని క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఆర్టీసీ డ్రైవర్ పొన్నాల రవి, కండక్టర్ జె.రవితోపాటు ఇల్లంతకుంట మండలం లక్ష్మక్కపల్లెకు చెందిన తాటికొండ సమ్మక్క, రేగొండ మండలం రాజక్కపల్లెకు చెందిన ఎన్.మల్లికాంబ, గండి విజయ, చిట్యాల మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన బెజ్జల జోత్స్న, వరంగల్ లేబర్ కాలనీకి చెందిన కూరపాటి నాగరాజు, దుగ్గొండికి చెందిన కోలా సరోజన ఉన్నట్లు సీఐ, డీఎం వివరించారు. కొందరికి స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు. లారీ క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్ను స్థానికులు కాపాడగా, అతడు పరారయ్యాడు. బస్సు డ్రైవర్ అప్రమత్తం కాకపోతే చాలా ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చదవండి: కరోనా మృతదేహాలను ఆలింగనం.. ఆపై అంత్యక్రియలు -
భూపాలపల్లి అడవుల్లో మగ పులి
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో పులి సంచరిస్తోంది. నాలుగు రోజులుగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని.. మగపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. తాడోబా లేదా ఇంద్రావతి అడవుల నుంచి రావొచ్చని అంచనా వేశారు. పులికి ఎటువంటి హాని జరగకుండా అటవీశాఖ అధికారులు అప్రమత్తం అవుతుండగా.. అటవీ గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. 17 ఏళ్ల తర్వాత దట్టమైన అడవులు కలిగిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ సమీప అడవుల్లో 2003లో ఏడు పులులు ఉన్నట్లుగా అప్పటి అటవీశాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 2009లో పాకాల సమీపంలోని రాంపూర్ అడవుల్లో ఒక పులి కనిపించింది. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా పులుల జాడ కనిపించలేదు. కాగా గత నెల 30న మహాముత్తారం మండలం యామన్పల్లి అడవుల్లో పులి అడుగులను జిల్లా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిమ్మగూడెంకు చెందిన ఓ రైతు తన ఆవు మేతకు వెళ్లి అడవిలో మృత్యువాత పడినట్లుగా గుర్తించాడు. మృతి చెందిన ఆవుపై పులి గాట్లు స్పష్టంగా కనిపించాయి. సోమవారం అదే పులి మహాముత్తారం మండలంలోని మహబూబ్పల్లి సమీపంలో గల బంగారుబాట మీదుగా, ఈ నెల 1న రాత్రి మరోమారు యామన్పల్లి–ఆజంనగర్ అడవుల్లో సంచరించినట్లుగా బుధవారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే బుధవారం సాయంత్రం మళ్లీ అదే పులి అడుగులు మల్హర్ మండలంలోని కిషన్రావుపల్లి సమీప అటవీ ప్రాంతంలో కనిపించడంతో అటవీశాఖ అధికారులతో పాటు అటవీ గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా అడవుల్లో పులి నాలుగు రోజులుగా సంచరిస్తుందనే వార్త దావనంలా వ్యాపించింది. అప్రమత్తంగా ఉండండి: డీఎఫ్ఓ జిల్లా అడవుల్లోకి పులి రావడం సంతోషకరమని డీఎఫ్ఓ పురుషోత్తం అన్నారు. కొత్తగా ఎక్కడ అడుగు జాడలు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అటవీ గ్రామాల ప్రజలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకరిద్దరు అడవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని, వేట కోసం విద్యుత్ తీగలు, ఉచ్చులు ఎవరూ అమర్చకూడదన్నారు. చదవండి: బొగతా జలపాతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతు -
ఆర్మీ కమాండోల ఆపరేషన్ సక్సెస్..
టేకుమట్ల : చుట్టూ వరదనీరు.. వాగు మధ్యలో ఎల్లమ్మ గుడి.. ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. గుడిలో పదిమంది రైతులు.. దాటుదామని వాగులోకి దిగితే కొట్టుకుపోవాల్సిందే. ప్రాణాలు అరచేతబట్టుకొని ఐదున్నర గం టలుగా బిక్కుబిక్కుమంటున్నారు.. అంతలోనేపైన గాలి మోటారు చప్పుడు వారి చెవిన పడింది. అంతే.. ప్రాణాలు లేచి వచ్చాయి. హెలికాప్టర్లో వచ్చిన ఆర్మీ కమెండోలు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో రైతుల కథ సుఖాంతమైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో.. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. కుందనపల్లిలోని చలివాగు ఒడ్డు వెంట ఉన్న పొలాల్లో వ్యవసాయ మోటార్లు వరదలో కొట్టుకుపోకుండా తీసుకురావాలనుకున్నారు రైతులు. మోటార్లను తెచ్చేందుకు రెండు ట్రాక్టర్లలో పలువురు రైతులు శనివారం ఉదయం పది గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలో పొలాల్లో ట్రాక్టర్లు దిగబాటుకు గురయ్యాయి. ట్రాక్టర్లను బయటికి తీసేందుకు పదిమంది రైతులు వెళ్లారు. అంతే.. ఒక్కసారిగా చలివాగు ప్రవాహం తీవ్ర రూపం దాల్చింది. దీంతో రైతులకు ఇరువైపులా వరదనీరు చేరడంతో ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. వాగులో రైతులు చిక్కుకుపోవడంతో స్థానికులు కూడా రక్షించే అవకాశాలు లేకపోయాయి. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి స్థానికులు విషయాన్ని తీసుకెళ్లారు. రంగంలోకి రెండు ఆర్మీ హెలికాప్టర్లు వాగులో రైతులు చిక్కుకున్న విషయాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్రావులకు వివరించారు. సీఎం జోక్యంతో హకీంపేట నుండి రెండు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఆర్మీ కమాండోలు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మధ్యాహ్నం 3:30లకు రైతులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, వాగు వద్ద సహాయక చర్యలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ అబ్దుల్ అజీం, ఎస్పీ సంగ్రామసింగ్ పాటిల్ పర్యవేక్షించారు. చివరకు రైతులు సురక్షితంగా బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమను రక్షించినందుకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ రుణపడి ఉంటాం వరదలో చిక్కుకున్న మాకు సాయం అందించి రక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మేమూ, మా కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి తిరిగి వస్తామో, రామో అని భయపడ్డాం. ఈ పరిస్థితుల్లో మాకు ఎంతో సహకరించి 10 మంది కుటుంబాలకు దిక్కుగా నిలిచారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎస్పీ, ఇతర అధికారులకు కృతజ్ఞతలు. – మాడుగుల ప్రకాశ్, రైతు, కుందనపల్లి -
‘కాళేశ్వరం’ ఎత్తిపోతలు షురూ
కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్లో బుధవారం రాత్రి ఆరు మోటార్లను ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. మే 11వ తేదీన గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో మోటార్లను నిలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే, ప్రాణహిత వరద కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద అప్రోచ్ కెనాల్ నుంచి ఫోర్ బే వరకు నీరు నిల్వ అయింది. వరద కూడా పెరుగుతుం డటంతో లక్ష్మీ పంపుహౌస్లోని 11 మోటార్లలోని ఆరు మోటార్లను ఆన్ చేయగా.. 12 పంపుల ద్వారా గ్రావిటీ కాల్వలోకి నీరు ఎత్తిపోస్తోంది. ఈ నీరు 13.41 కిలోమీటర్ల దూరంలోని అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి తరలుతోంది. రాత్రిలోగా మిగిలిన మోటార్లను ఒకేసారి నడిపించనున్నట్లు తెలిసింది. ఈ సీజన్లో మోటార్లు ఆన్ చేయడం ఇదే ప్రథమం కావడంతో ఎస్ఈ, డీఈఈ, ఏఈఈ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు పంపుహౌస్ వద్ద పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ కాంతులతో జిగేల్ కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్లో మోటార్ల ద్వారా నీరు డెలివరీ సిస్టర్న్ వద్ద ఎత్తిపోస్తున్నాయి. దీంతో సిస్టర్న్కు రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. దీంతో నీరు రంగు రంగులుగా మారి జిగేల్మంటోంది. -
పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం
సాక్షి, కాటారం: మనం పుట్టి, పెరిగిన ఊరు కన్నతల్లితో సమానమని, గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప కల్యాణ మండపంలో సర్పంచ్ తోట రాధమ్మ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి దయాకర్రావు, మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణి, పుట్ట మధు హాజరయ్యారు. మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామాలను స్వచ్ఛత దిశగా తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శ్రమదానాలు నిర్వహించడం, మొక్కలను నాటడం వంటి కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తోడ్పడిన వారికే గ్రామ అవసరాలు, ప్రభుత్వ పథకాల గురించి గ్రామసభలో ప్రశ్నించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే వ్యాధులు బాధ ఉండదని, బహిరంగ మలమూత్ర విసర్జన చేసేవారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతిని నాశనం చేసే వారికి ఎంత ఫైన్ విధిస్తే బాగుంటుందని మంత్రి సభలో గ్రామస్తులను అడుగగా వారు రూ.500 అని అనడంతో అమలు చేయండి అని కలెక్టర్ వెంకటేశ్వర్లుకు సూచించారు. ప్రత్యేక కార్యచరణలో భాగంగా ప్రతి గ్రామం ఓ గంగదేవిపల్లిని మించిపోవాలని మంత్రి అన్నారు. 30 రోజుల ప్రణాళికను గ్రామంలో విజయవంతం చేసుకుంటే ఎన్ని నిధులు అడిగిన కేటాయించే బాధ్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపులో వెనకాడేది లేదన్నారు. ప్రతి ఏటా కాటారం గ్రామపంచాయతీకి 1.20కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.3లక్షల మేర రుణం ఇచ్చేలా ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర వాటాలతో పాటు మరిన్ని నిధులు సమకూర్చేలా మంత్రి చొరవ చూపాలన్నారు. చెక్పవర్పై సర్పంచ్ల్లో ఇంకా స్పష్టత రాలేదని ఆ అంశాన్ని పునఃపరిశీలించి అధికారాలు ఇస్తే గ్రామపంచాయతీలు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు. గ్రామసభలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డీఆర్డీఓ సుమతి, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, మహదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ, ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కాటారం: కాటారం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భూమి పూజ చేశారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టాపన రాయి వేశారు. కాగా కాటారం గ్రామపంచాయతీ భవనం గత కొంత కాలం క్రితం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో నూతన పాలకవర్గం గత కొన్ని నెలలుగా కార్యాలయ నిర్వాహాణ అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. దీంతో నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఇటీవల మండల పర్యటనకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును సర్పంచ్ తోట రాధమ్మ, పాలకవర్గం సభ్యులు కోరారు. మంత్రి నిధుల మంజూరుకు సూచనాప్రాయంగా అంగీకరించడంతో గురువారం మండల పర్యటనకు వచ్చిన మంత్రి చేతుల మీదుగా భవన నిర్మాణం కోసం భూమి పూజ గావించారు. అనంతరం 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన భవన నిర్మాణం కూల్చివేతలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి స్వయంగా జేసీబీ నడిపి పాత భవనాన్ని కూల్చివేసి పారతో మట్టి ఎత్తి ట్రాక్టర్లో పోశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట రాధమ్మ, మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్భూపాలపల్లి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణిరాకేశ్, పుట్ట మధు, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డీఆర్డీఓ సుమతి, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, జక్కు రాకేశ్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
‘మాయమాటల టీఆర్ఎస్ సర్కారు’
సాక్షి, భూపాలపల్లి : రాష్ట్రంలో మాయమాటల సర్కారు కొనసాగుతుందని, విద్య, వైద్యరంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించి ప్రజలను భయానక పరిస్థితుల్లోకి నెట్టిందని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆదివారం భట్టివిక్రమార్క, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. తొలుత హాస్టల్లోకి వెళ్లి వంటగది, డైనింగ్ హాల్ను పరిశీలించి విద్యార్థులకు వడ్డిస్తున్న కిచిడీని చూశారు. అనంతరం పీహెచ్సీని పరిశీలించి అక్కడే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. భూపాలపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఆరు పడకల పీహెచ్సీతోనే కాలం వెల్లదీస్తున్నారన్నారు. ఆపరేషన్ థియేటర్ను స్టోర్ రూంగా మార్చారని, ఒకే ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారని, స్పెషలిస్ట్లు ఎవరూ లేరన్నారు. ఓపీలో ఒకే ఒక మహిళ ఉందంటే ప్రభుత్వ ఆస్పత్రి మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషెంట్లు ఎందుకు ఉన్నారు.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎందుకు లేరో తెలుసుకోవాలన్నారు. ఆస్పత్రులో కుక్కలు, కోతులు కరిచినప్పుడు వేసే ఇంజక్షన్కు సంబంధించిన సిరంజీలు కూడా అందుబాటులో లేవన్నారు. మంచినీటి సౌకర్యం లేదని, మందులు సరిపడా లేవన్నారు. ఆరేళ్లలో ఒక్క డాక్టర్ను కూడా రిక్రూట్ చేయని ప్రభుత్వంగా టీఆర్ఎస్ చరిత్రలో నిలుస్తుందన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనం అధ్వానంగా ఉందన్నారు. 280 మందికి 30 కేజీల బియ్యంలో అరకిలో పప్పు వేసి ఉడికించారన్నారు. ఇదీ కిచిడీనా అని ప్రశ్నించారు. వంద గ్రాముల నూనె, పావుకిలో ఉల్లిగడ్డ, అరకిలో చింతపండుతో చారు చేశారని వంట మనుషులే చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ మనువడు కూడా ఇలాగే తింటున్నాడా అని ప్రశ్నించారు. పిల్లల పేరు చెప్పి దోపిడీ చేసే ఈ ప్రభుత్వానికి పాపం తగులుతదన్నారు. సింగరేణి కార్మికులకు రూ.10 లక్షల రుణం, వారసత్వ ఉద్యోగాలు, పదివేల క్వార్టర్ల నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏదో ఒక పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అంటున్నారన్నారు. చిట్యాలలో గైనకాలజిస్ట్ లేక బాలింత, బిడ్డ మృతి చెందినప్పటికీ ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా అన్నారు. రాష్ట్రంలో గడిన 9 నెలల్లో కోటి 20 లక్షల మందికి విష జ్వరాలు సోకినా తగు చర్యలు తీసుకోలేదన్నారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఉండడం లేదన్నారు. కేసీఆర్ కిట్కు కొంత మేరకు ఆదరణ లభిస్తే దాన్నే సాకుగా చూపిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదరణ పెరిగిందనడంలో అర్థం లేదన్నారు. పథకాల పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం లాభం చేకూరుస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఐత ప్రకాష్రెడ్డి, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ నాయకుడు జనక్ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఇస్లావత్ దేవన్, బుర్ర రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘టీఆర్ఎస్లో ఓనర్షిప్ల కొట్లాట మొదలైంది’
సాక్షి, భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో ఓనర్షిప్ కోసం నాయకులు గొడవలు పెట్టుకుంటూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని విక్రమార్క, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువు నాయకులు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రోగులను, ప్రజలను మర్చిపోయి ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రులు అంటే 250 పడకలతో ఉంటుందని, కానీ ఇక్కడ కేవలం 6 పడకలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. భూపాలపల్లి జిల్లాగా ఏర్పడి మూడేళ్లవుతున్నా ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం, జిల్లా ఆసుపత్రిగా మార్చకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఆస్పత్రికి రోగుల రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుతం ఇన్ పేషంట్లు ఎవరూ లేరని భట్టి పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఏంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్ రే ప్లాంట్, ఈసీజీ లేవని, ఇంతటి దుర్భర పరిస్థితులు ఎక్కడా ఉండవని మండిపడ్డారు. ప్రసూతి కోసం వచ్చే మహిళలకు ఉండాల్సిన గైనకాలజిస్టులు ఒక్కరు కూడా లేరని, ఆపరేషన్ థియేటర్ అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉందని విక్రమార్క విమర్శించారు. ఆపరేషన్ థియేటర్ను స్టోర్ రూమ్గా మార్చిన పరిస్థితి కన్పిస్తుందని, కనీసం ఆస్పత్రిలో లాబ్ టెక్నీషియన్ కూడా లేరని దుయ్యబట్టారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా కుక్క, కోతి కాట్లకు గురవుతున్నారని, అందుకు కావాల్సిన సిరంజీలు కూడా లేవని విమర్శించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు బయట సిరంజీలు కొనుక్కుంటే ఇక్కడ ఇంజక్షన్లు ఇస్తున్నారని, ఇది దుర్భరమైన పరిస్థితి బట్టి అంటూ భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. -
సింగరేణికి సుప్రీం కోర్టు మొట్టికాయలు!
న్యూఢిల్లీ : భూపాలపల్లి నివాస ప్రాంతంలోని సింగరేణి ఓపెన్ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఓపెన్కాస్ట్ మైనింగ్పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చెపట్టింది. ఈ విచారణలో భూపాలపల్లి బాధితుల తరపు న్యాయవాది శ్రవణ్ వాదిస్తూ.. సింగరేణి ఒపెన్కాస్ట్ మైనింగ్ బాంబు పేలుళ్ల వల్ల ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా సురక్షిత చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా ఈ పటిషన్పై విచారణ చెపట్టిన జస్టిస్ నాగేశ్వరరావు ధర్మాసనం ఓపెన్ కాస్ట్ మైనింగ్పై తనిఖీ నిర్వహించి కోర్టుకు నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక తమకే అనుకూలంగా ఉందని కోర్టుకు తెలిపింది. అయితే బాధితుల తరపు న్యాయవాది కాలుష్య మండలి నివేదికలో వాయు, ధ్వని, జల కాలుష్యం ఉందని శ్రవణ్ కోర్టుకు వివరించారు. అయితే కేంద్ర పర్యావరణ శాఖ ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు రోజులు సమయం కావాలని సుప్పీం కోర్టును కోరింది. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. -
జయశంకర్ సార్ యాదిలో..
సాక్షి, భూపాలపల్లి: ప్రొఫెసర్ జయశంకర్ తన గురువని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఎప్పుడూ చెప్పేవారని, ఆయన సూచనల మేరకే తాను టీఆర్ఎస్లో చేరానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ తన తండ్రి క్లాస్మేట్ అని, సార్ వద్ద తాను కొద్ది రోజులు చదువుకున్నానని తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. సీఎం కే.చంద్రశేఖర్రావుకు కుడి భుజంలా ఉండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని గుర్తు చేశారు. సార్ బ్రతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యేవారన్నారు. జయశంకర్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. మొక్కలు నాటాలి.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మంజూర్నగర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జయశంకర్ ఎకో పార్కు పనులను పరిశీలించారు. అనంతరం పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ.. జయశంకర్ పార్కులో మంచి సౌకర్యాలు కల్పించి భూపాలపల్లి వాసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. వానలు సమృద్ధిగా కురువాలంటే ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పచ్చని వాతావరణం నెలకొనేలా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. అనంతరం తెలంగాణకు హరితహారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీ నర్సరీ జాబితా 2019 బుక్లెట్ను మంత్రి దయాకర్రావు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ ప్రదీప్కుమార్శెట్టి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, ఎఫ్డీఓ సారయ్య, టీఆర్ఎస్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, కొత్త హరిబాబు, కటకం జనార్దన్, పైడిపెల్లి రమేష్, శిరుప అనిల్, పిల్లలమర్రి నారాయణ, ముంజాల రవీందర్, మంథెన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
లాఠీ పట్టిన చేయితో నాగలి పట్టిన ఏఎస్పీ
-
ఓ వీడియో వెట్టి నుంచి విముక్తి చేసింది!
భూపాలపల్లి అర్బన్: ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది. ఇది బాగా పాపులర్ అయిన వ్యాపార ప్రకటన. ఇక్కడ ఓ వీడియో వలస కూలీలను వెట్టి నుంచి విముక్తి చేసింది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, రెండు రాష్ట్రాల అధికారులను కదిలించింది. కూలీలను సొంతగూటికి చేరుకునేలా దోహదపడింది. అంతగా ప్రభావితం చేసిన ఆ వీడియో కథాకమామిషు ఇది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాకు చెందిన 49 మంది వలస కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మట్టి ఇటుక బట్టీల్లో పనిచేయడానికి ఆరు నెలల క్రితం వచ్చారు. పనికి తగిన కూలి ఇవ్వడం లేదని, బలవంతంగా పనులు చేయిస్తూ శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని, తమకు ఇక్కడి నుంచి విముక్తి కల్పించాలని వలస కూలీలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి విన్నవిస్తూ సెల్ఫోన్ సహాయంతో ఓ వీడియో తీసి 10 రోజుల క్రితం బంధువులకు పంపించారు. అది వైరల్గా మారి ఆ రాష్ట్రంలోని న్యూస్చానళ్లు, పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా రావడంతో అక్కడి ప్రభుత్వం స్పందించి చర్యలు ప్రారంభించింది. వెంటనే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గరియాబంద్ జిల్లా కలెక్టర్ శ్యాందావుడే.. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు చేరవేశారు. అలాగే గరియాబంద్కు చెందిన లేబర్, రెవెన్యూ, పోలీస్, మహిళా సంరక్షణ అధికారులు భూపాలపల్లికి శుక్రవారం చేరుకొని స్థానిక అధికారులతో కలసి ఆపరేషన్ ప్రారంభించారు. పట్టణంలోని రెండు ఇటుక బట్టీలు, గణపురం క్రాస్రోడ్డులో మరో ఇటుక బట్టీలో పనిచేస్తున్న 49 మంది వలస కూలీలను తమ అదీనంలోకి తీసుకుని వివరాలు తెలుసుకున్నారు. తమతో రాత్రీ పగలు అనే తేడా లేకుండా పనులు చేయిస్తూ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, సకాలంలో డబ్బులు చెల్లించచడం లేదని వాపోయారు. భోజనం చేయడానికి సైతం కనీస సమయం ఇవ్వడంలేదని, ఖాళీ కడుపుతో పనిచేస్తున్నామని కూలీలు అధికారులకు వివరించారు. అధైర్య పడొద్దని, తొందరలోనే సమస్యను ప్రభుత్వం పరిష్కరించి ఛత్తీస్గఢ్లో పని కల్పించేలా చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి వారిని స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయమై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సైతం స్పందించింది. ఈ ఘటనపై నివేదిక పంపాలని అధికారులను ఆదేశించింది. -
వృద్ధ దంపతుల వినూత్న నిరసన
భూపాలపల్లి: ‘‘పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేం దుకు తహసీల్దార్ లంచం అడుగుతున్నాడు.. వయోభారంతో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాం.. మా దగ్గర డబ్బులు లేవు.. లంచం కోసం బిచ్చం వేయం డి’’అంటూ ఓ వృద్ధ దంపతులు శుక్రవారం భూపాలపల్లిలో వినూత్న నిరసన తెలిపారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డులు వేసుకొని భిక్షాటన చేయడం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ స్పందించి.. వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. భూపాలపల్లి మండలం ఆజంనగర్కి చెందిన మాంతు బసవయ్య, లక్ష్మి దంపతులకు గ్రామ శివారులోని 50 సర్వే నంబర్లో 1.19 ఎకరాలు, 601లో ఎకరం, 622/42లో ఎకరం, 622/52/అ లో 31 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన నాటి నుంచి పట్టాదారు పాసుపుస్తకాల కోసం వారు భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాలి కి బలపం కట్టుకొని తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పుస్తకాలు ఇచ్చేందుకు నిరాకరిం చారు. దీంతో చేసేది లేక వృద్ధ దంపతులు శుక్రవారం భిక్షాటన ప్రారంభించారు. పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ సత్యనారాయణస్వామి డబ్బులు అడుగుతున్నాడని, తమ దగ్గర లేవని, ముసలివాళ్లం అయినందున ఆదుకోవాలని కోరుతూ పట్టణ ప్రధాన రహదారిలోని వ్యాపారుల వద్ద భిక్షాటన చేశారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డు ప్రదర్శిస్తూ ప్రతి దుకాణ యజమాని వద్ద అడుక్కోవడం అక్కడున్న వారిని కదిలించింది. భూమిని ఎప్పుడో అమ్ముకున్నారు బసవయ్య, లక్ష్మి తమకున్న వ్యవసాయ భూమిని ఎప్పుడో అమ్ముకున్నారని భూపాలపల్లి తహసీల్దార్ నారాయణస్వామి అన్నారు. ఆ భూమికి సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉందని చెప్పారు. గ్రామంలో విచారణ చేపట్టగా 15 ఏళ్లుగా కానుగంటి కొమురయ్యనే భూమిని సాగు చేసుకుం టున్నాడని తేలిందన్నారు. దీంతో పాసుబుక్కును ఇవ్వకుండా నిలిపివేశామని తెలిపారు. ఎట్టకేలకు పట్టా.. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ కావడంతో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పందించారు. ఆ వృద్ధ దంపతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందివ్వాలని భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారిని ఆదేశించారు. వృద్ధ దంపతులను తన కార్యాలయానికి పిలిపించుకున్న ఆర్డీఓ.. భూరికార్డులను పరిశీలించారు. అదే సమయంలో భూమిని కొనుగోలు చేశానని చెబుతున్న కానుగంటి కొమురయ్య రావడంతో ఈ భూమి నీకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బసవయ్య, లక్ష్మిల భూమిని 1981లో తంశెట్టి బానమ్మ కొనుగోలు చేసిం దని, ఆమె నుంచి 1989లో తన తండ్రి కానుగంటి మొండయ్య కొనుగోలు చేశాడని, అప్ప టి నుంచి తామే కాస్తులో ఉన్నామని చెప్పాడు. 2004లో ఆర్ఓఆర్ పట్టా చేయించుకొని పట్టాబుక్కు తీసుకున్నట్లు చెప్పాడు. ఆ భూమి తమదేనని బసవయ్య, లక్ష్మి 2011 నుంచి గొడవ చేస్తుండటంతో కోర్టును ఆశ్రయించానని, కేసు నడుస్తున్న క్రమంలోనే 2015లో పహాణీ నుంచి తన పేరును అకారణంగా తొలగించారన్నాడు. దీంతో ఆర్డీఓ సదరు భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను బసవయ్య, లక్ష్మీలకు అందజేశారు. నిజంగా భూమి కొనుగోలు చేసి ఉంటే, అన్ని డాక్యుమెంట్స్తో తనకు అప్పీల్ చేసుకోవాలని కొమురయ్యకు సూచించారు. -
తొలి ఘట్టం..
సాక్షి, భూపాలపల్లి : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ మరి కొన్నిగంటల్లో ప్రారంభం కాబోతోంది. సోమవా రం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణను మొదలుపెట్టన్నారు. ఎన్నికల షెడ్యూల్.. 12 నుంచి 19వ తేదీ వరకు రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిణ 20వ తేదీన నామినేషన్ల పరిశీలన 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 7న పోలింగ్(ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు) 11వ తేదీన ఓట్ల లెక్కింపు జిల్లాలో రెండు నియోజకవర్గాలు.. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గ కేంద్రాలతోపాటు పునర్విభజనలో భాగంగా జిల్లాలో కలిసిన కాటారం, మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్ మండలాలకు సంబం ధించి మంథని, వాజేడు, వెంకటాపురం(కే) మండలాలకు సంబంధించి భద్రాచలం నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. నామినేషన్లను రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు 19వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. నామినేషన్ల స్వీకరణకు జిల్లా పరిధిలోని భూపాలపల్లి, ములుగుతోపాటు మంథని, భద్రాచలం ని యోజకవర్గ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భూపాలపల్లి రిటర్నింగ్ అధికారి వెంకటాచారి(ఆర్డీఓ), ములుగు రమాదేవి(ఆర్డీఓ), మంథని నగేష్(ఆర్డీఓ), భద్రాచలం భవీష్మిశ్రా(సబ్ కలెక్టర్) తమ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నేతృత్వంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేయనున్నారు. నామి నేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఆంక్షలు విధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి రెండు రోజులు తక్కువే.. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారం భం కానున్న నేపథ్యంలో మొదటి రెండు రోజులు నామినేషన్ల దాఖలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ జిల్లాలో కేవలం భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది. మహాకూటమిలో సీట్ల సరుబాటు కుదరక అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. దీంతో ప్రధాన పార్టీల నుంచి తొలిరోజున నామినేషన్లు వేసే అవకాశాలు తక్కువగానేఉన్నాయి. మరుసటి రోజు మంగళవారం సెంటిమెంట్ కావడంతో నామినేషన్లు వేసే పరిస్థితి ఉండకపోవచ్చు. జోరందుకోనున్న ప్రచారం నెల రోజుల నుంచే జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతోపాటు అన్ని పార్టీల నుంచి టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నవారు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుండడంతో నాయకులు ప్రచారాన్ని మరింత వేగం చేయనున్నారు. అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం ఒక దఫా పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులతో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ వేసే రోజు బల నిరూపనకు ఎక్కువ మందిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి భారీ ర్యాలీలు తీసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. విస్తృతంగా ప్రచారం చేస్తాం.. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలను డిసెంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. గంట సమయం కుదించిన విషయమై ఓటర్లు, రాజకీయ పార్టీల నాయకులకు అవగహన కల్పిస్తాం. అలాగే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాం. – వాసం వెంకటేశ్వర్లు, కలెక్టర్ -
వామ్మో పే...ద్ద పాము !
సాక్షి, భూపాపలల్లి రూరల్: భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని పుల్లూరి రామయ్యపల్లి శివారులోని గండ్రపల్లి ప్రాథమిక పాఠశాలలో పొడవైన నాగుపాము దూరింది. సోమవారం పాఠశాల తెరిచేసరికి బీరువా కింద పాము ఉందనే విషయాన్ని విద్యావలంటీర్ గమనించింది. గ్రామస్తులకు సమాచారమివ్వడంతో పాములు పట్టే వ్యక్తి అందుబాటులో లేడని పాఠశాలను మూసివేశారు. మంగళవారం గ్రామానికి చెందిన పాములు పట్టే ఉప్పలయ్యకు సమాచారమివ్వడంతో ఆయన పామును పట్టి సురక్షిత ప్రదేశంలో వదిలాడు. -
ఉపాధ్యాయ వృత్తి వదిలి ఉద్యమంలోకి..
సాక్షి, భూపాలపల్లి : తనకు వచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి మావోయిస్టు పార్టీలో చేరి 15 ఏళ్లుగా విప్లవోద్యమంలో కొనసాగుతున్న సుంకరి రాజ్కుమార్ అలియాస్ అరుణ్కుమార్(36) ప్రస్థానం ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి–నిమ్మలవాగు అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో రాజ్కుమార్ మృతిచెందడంతో తన స్వగ్రామం భూపాలపల్లి మండలం దూదేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దూదేకులపల్లి చెందిన సుంకరి రామక్క, సమ్మయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరిలో చిన్నవాడైన రాజ్కుమార్ డిగ్రీ, బీఈడీ పూర్తి చేశాడు. కొన్నాళ్లు గ్రామంలోనే విద్యావలంటీర్గా పనిచేశాడు. గ్రామస్తుల సహకారం తీసుకుని పాఠశాలలో వసతులు కల్పించాడు. ఈ క్రమంలోనే అతడికి నాగార్జున సాగర్లో ఉద్యోగం వచ్చినప్పటికీ వెళ్లకుండా విప్లవోద్యమానికి ఆకర్షితుడై 2003లో అప్పటి సీపీఐ(ఎంఎల్) పీపుల్స్వార్లో చేరాడు. 2004లో ప్రభుత్వంతో జరిగిన మావోయిస్టులు చర్చల అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంవత్సరంపాటు గ్రామంలోనే ఉండి మళ్లీ ఉద్యమబాట పట్టాడు. జిల్లాలోని మహదేవ్పూర్ ఏరియాలో కొన్నాళ్లు పనిచేసిన అనంతరం ఛత్తీస్గఢ్కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం చర్ల శబరి ఏరియా కమిటీ మెంబర్గా కొనసాగుతున్నాడు. రాజ్కుమార్ దళంలో పని చేసేవారికి వైద్య సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఎదురుకాల్పుల్లో మృత్యువాత.. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిం ది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు కూంబిం గ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కుర్నపల్లి–నిమ్మలగూడెం మధ్యలోని అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మావోయిస్టులు–పోలీసులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ సభ్యుడు అరుణ్ అలియాస్ రాజ్కుమా ర్ మృతిచెందాడు. మరికొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయని, వారు తప్పించుకున్నారని సమాచారం. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహంతోపాటు ఒక 303 రైఫిల్, కిట్ బ్యాగులు, గొడుగులు, చేతి సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ట్రాక్టర్లో కుర్నపల్లి అటవీ ప్రాంతం నుంచి సత్యనారాయణపురంలోని సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంప్ నకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భద్రాచలం ఏరియా వైద్యశాలకు చేర్చారు. -
పట్టు చీర చిక్కేదెలా ?
కాళేశ్వరం భూపాలపల్లి జిల్లా : స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర«శేఖర్రావు దంపతులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరాలయంలోని శుభానందదేవి(పార్వతీ) అమ్మవారికి సమర్పించిన పట్టుచీర మాయమైన ఘటనపై విచారణ నత్తనడకన సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016, మే 2న సీఎం కేసీఆర్, శోభ దంపతులు కాళేశ్వరాలయంలో శుభానందదేవి అమ్మవారికి రూ.36 లక్షలతో బంగారు కిరీటం బహూకరించి, పట్టు చీరను సమర్పించి మొక్కులు చెల్లించిన విషయం తెలిసిందే. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే రోజున భూమిపూజ చేశారు. అయితే ఆ చీర కొన్నాళ్లుగా కనిపించడం లేదు. విషయం బయటకి పొక్కడంతో సిబ్బంది చీరను మార్చి మోసం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాలుగు రోజులైనా.. సీఎం కేసీఆర్ అమ్మవారికి సమర్పించిన చీర మా యమైన విషయం నాలుగు రోజుల క్రితం వెలుగు చూసినా అధికారుల్లో చలనం రావడం లేదు. కేవలం ఆలయ ఉపప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తికి ఈఓ మారుతి మెమో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. గతంలో కాళేశ్వరాలయంలో ఈఓలుగా పనిచేసిన ఇద్దరికి కూడా తమ వివరణ ఇవ్వాలని ఎండోమెంట్ ఉన్నతస్థాయి అధికారులు మెమోలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదే లేదు.. చీర మాయం విషయమై సంబంధిత ఈఓ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పోలీ సులు మాత్రం ప్రాథమికంగా విచారణ జరిపారు. సంబంధిత ఈఓ చీర మాయంపై ఫిర్యాదు చేస్తే విచారణలో వేగం పెంచి చీర చిక్కును ఛేదిస్తామని సీఐ రంజిత్ పేర్కొంటున్నారు. అర్చకుడికి మెమో జారీ.. పట్టు చీర మాయంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆలయ ఉపప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తికి ఈఓ మారుతి మెమో జారీ చేశారు. గతంలో కాళేశ్వరాలయంలో ఈఓలుగా పనిచేసిన ఇద్దరికి తమ వివరణ ఇవ్వాలని ఎండోమెంట్ ఉన్నతస్థాయి అధికారులు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. చీరమార్చి మోసం! సీఎం సమర్పించిన చీర మాయమైందని బయటకి పొక్కడంతో మరో ఇద్దరు అర్చకులు, ఓ ఉద్యోగి కలసి మరో చీరను వరంగల్ బట్టల దుకాణంలో కొనుగోలు చేసి ఆలయ చైర్మన్, ఈఓల ముందు ఉంచారు. ఆ చీర సీఎం సమర్పించిన చీర కాదని మరో వర్గం ఆరోపించడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో ఈవ్యవహరమంతా బట్టబయలైంది. భద్రతపై అనుమానాలు... ఆలయంలో సీఎం ఇచ్చిన చీరకు భద్రత లేనప్పుడు బంగారు నగలు, వెండి ఆభరణాలకు ఎలాంటి భద్రత ఉందో అర్థమవుతుంది. ప్రతే ఏటా కాళేశ్వరాలయంలో వీవీఐపీలు విలువైన పట్టు చీరలు అమ్మవారికి బహూకరిస్తారు. ఆ చీరలు కూడా ఆలయంలో కనిపించడం లేదని తెలుస్తోంది. వాటికి సంబంధించిన రికార్డులను కూడా అధికారులు రాయడం లేదు. ఆ విలువైన చీరలు అధికారుల ఇళ్లకు తరలిపోతున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం సీసీ కెమెరాలు కూడా నాణ్యత లేవని అర్థమవుతోంది. 2 మెగా పిక్సల్ కెమెరాలను ఆలయంలో అమర్చినట్లు తెలిసింది. నాకు అధికారికంగా ఆదేశాలు రాలేదు... కాళేశ్వరాలయంలో చీరం మాయంపై విచారణాధికారిగా నన్ను నియమించలేదు. కలెక్టర్ మౌఖికంగా చెప్పారు. అధికారికరంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆదేశాలు ఇస్తే విచారణ ప్రారంభిస్తా. – మోహన్లాల్, డీఆర్ఓ, భూపాలపల్లి చీర మాయంపై ఫైలు అందింది.. కాళేశ్వరాలయంలో సీఎం అందజేసిన చీర మాయంపై సంబంధించిన ఫైలు పరిశీలిస్తున్నాం. త్వరలో చర్యలు తీసుకుంటాం. – కృష్ణవేణి, ఎండోమెంట్, విజిలెన్స్ అధికారి -
వైద్య సేవలను మెరుగుపర్చాలి
భూపాలపల్లి అర్బన్ : ప్రభుత్వ వైద్యశాలలంటే దేవుడి గుడిలా భావించేలా వైద్యులు ప్రజలకు వైద్య సేవలందించాలని కలెక్టర్ అమయ్కుమార్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 25 పీహెచ్సీలు, 4 సీహెచ్సీ కేంద్రాల్లో వైద్యుల పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించి ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం కలిగించే పని చేయాలన్నారు. వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో గర్భిణుల వివరాలను సేకరించి తేదీలవారీగా ఒక ప్రణాళిక రూపొందించుకొని, వారిని కలిసి ఆరోగ్య స్థితిని తెలుసుకొని ఎప్పటికప్పుడు వైద్యసేవలందించాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో ప్రజలకు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పనిచేసే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధునాతన వైద్య పరికరాలను ఏఏ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలో నివేదిక సమర్పించాలని, వైద్య పోస్టుల ఖాళీల వివరాలను తెలియజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ–ఔషధి పథకంలో వచ్చే మందుల వివరాలు ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేసి నివేదికగా అందించాలన్నారు. ప్రాథమిక కేంద్రాల్లో ఎక్కువ సమయం పని చేస్తే ప్రసవాల సంఖ్య పెరుగుతుందని, వైద్యులు పనిచేసే సెంటర్ల పరిధిలోనే నివాసం ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వైద్యులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ మధుసూదన్, క్రాంతికుమార్, ఆస్పత్రి సూపరింటెండెట్లు వాసుదేవరెడ్డి, గోపాల్, రవిప్రవీణ్, ప్రోగ్రాం ఆఫీసర్ శృతి, రవీందర్ పాల్గొన్నారు. -
మర్మావయవాన్ని నలిపి హత్యాయత్నం
కొత్తగూడ: తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్త మర్మావయవాలను నలిపి హత్య చేసేందుకు యత్నించిందో కిరాతకురాలు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో సోమవారం వెలుగు చూసింది. ఓటాయికి చెందిన పెండ్యాల సారయ్య భార్య కోనాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆదివారం రోజు ప్రియుడు నేరుగా ఇంటికే రావడంతో సారయ్య భార్యతో గొడవ పడ్డాడు. అది కాస్తా ముదిరి సోమవారం కొట్టుకునే స్థాయికి చేరింది. కోపం పట్టలేక సారయ్య మర్మావయవాలను అతని భార్య చిదిమివేసింది. దీంతో విపరీతంగా రక్తస్రావమై సారయ్య కేకలు పెడుతుండగా విన్న ఇరుగుపొరుగు వారు భార్యను చితకబాది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సారయ్య ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించి నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సారయ్య బంధువులు కోరుతున్నారు. ఘటనపై సమాచారం ఉందని, అయితే ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్సై సతీష్ చెప్పారు. -
మోజు తీరాక... వద్దుపొమ్మన్నాడు..
భూపాలపల్లి అర్బన్: ప్రేమించానన్నాడు. పెళ్లికూడా చేసుకున్నాడు. తీరా మోజు తీరాక వద్దుపొమ్మంటున్నాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకొన్న వాడికోసం భార్య, భర్త ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. వివరాలు.. పట్టణానికి చెందిన పెండెల రవికుమార్ వరంగల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో హన్మకొండ వడ్డేపల్లికి చెందిన మాడుచి చారుశీలతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2016 సెప్టెంబర్ 13న వరంగల్ మ్యూజికల్ గార్డెన్లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరు కలిసే ఉంటున్నారు. పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్న అనంతరం ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. ఈ విషయం పై పలుమార్లు ఒత్తిడి తెచ్చిన లాభం లేకపోయింది. కాగా.. గత నెల 17 వరకు ఫోన్లో మాట్లాడిన రవి అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ఆందోళన చెందిన చారుశీల భర్త గురించి కూపీ లాగగా.. మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో ప్రేమించిన వాడికోసం రెండు రోజులుగా పట్టణంలోని రెడ్డికాలనీలోని రవికుమార్ ఇంటి ముందు చారుశీల నిరాహారదీక్షకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు తమ మద్దతు తెలిపాయి. -
క్లాస్రూమ్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి అర్బన్: పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేసుకున్న సంఘటన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. స్థానిక గుడ్ మార్నింగ్ రెసిడెన్షియల్ పాఠశాలలో సందీప్ వర్మ పదో తరగతి చదువుతూ పాఠశాల హాస్టల్లోనే ఉంటు న్నాడు. గురువారం మధ్యాహ్నం దోమలను చంపేందుకు ఉపయోగించే రసాయన ద్రవం తాగాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే సందీప్ ను సింగరేణి ఏరియా ఆస్పత్రికి, అనంతరం వరంగల్కు తరలించారు. -
పోరాడి పెళ్లి చేసుకుంది
భూపాలపల్లి: పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదు, అనుకున్నది సాధించడం తప్ప అనుకుందో యువతి. ప్రేమించి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ఐదురోజుల పాటు మౌన దీక్ష చేసింది. తన ప్రయత్నం ఫలించింది. ప్రియుడి ఇంట్లో వారి మనసు కరిగింది. పెళ్లికి జెండా ఊపారు. చివరకు కోరుకున్న వాడిని దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లికి చెందిన కళాసాగర్, మహబూబాబాద్కు చెందిన నాగమణి ఇరువురు ప్రేమించుకున్నారు. అయితే కళాసాగర్ తమ ప్రేమను ఇంట్లోవాళ్లు అంగీకరించట్లేదని మొహం చాటేశాడు. దీంతో ప్రేమించిన వ్యక్తితో పెళ్లికోసం నాగమణి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. కళాసాగర్ తనను పెళ్లి చేసుకునే వరకు కదిలేది లేదంటూ ఐదురోజులపాటు దీక్ష చేసింది. ఇంటి ముందు చేపట్టిన నాగమణి మౌన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కళాసాగర్, అతడి కుటుంబంలో చలనం రావడంతో ఆ ప్రేమ జంట ఆదివారం ఒక్కటైంది. పెద్దల సమక్షంలో ఇరువురు దండలు మార్చుకున్నారు. -
బైక్ను ఢీకొట్టిన డీసీఎం: ముగ్గురి పరిస్థితి విషమం
ఘన్పూర్: మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని అధికారులు పదే పదే చెప్తున్నా కొందరు అది తలకెక్కించుకోవడం లేదు. కిక్కులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం కర్కపల్లి సమీపంలో ఓ డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 సాయంతో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వడదెబ్బతో 19 మంది మృతి
సాక్షి, నెట్వర్క్: మండుతున్న ఎండలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. వడదెబ్బతో బుధవారం వేర్వేరుచోట్ల 19 మంది మృతి చెందారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లికి చెందిన రైతు తాటి రమేశ్ (28), కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒంటర్పల్లి తండాకు చెందిన కాట్రోత్ కేస్లీ (56), నల్లగొండ జిల్లా నియమనూరు మండల కేంద్రానికి చెందిన పిల్లి మంగమ్మ (55), నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని బైరాపూర్ గ్రామానికి చెందిన గోరటి సాలమ్మ(47), మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పాత మొల్గర గ్రామానికి చెందిన బి.లవన్నగౌడ్(61), నల్లగొండ జిల్లా చెందిన పగిడి రామయ్య(50),భువనగిరి పట్టణానికి చెందిన ఆలేటి ఆంజనేయులు (46) ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన రైతు శనిగరం మొగిళి(57) కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లికి చెందిన మహిళాకూలీ వేముల లక్ష్మి(46), ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లికి చెందిన కడెం గంగాధర్ (42) రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన బక్కశెట్టి రాజిరెడ్డి (55) ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం 8 మంది మృత్యువాత పడ్డారు. -
పూర్తికాని తాగునీటి పథకాలు
► పూర్తికాని తాగునీటి పథకాలు ► గిరిజన తండాల్లో నీటిఎద్దడి ► పట్టించుకోని అధికారులు ► అవస్థలు పడుతున్న ప్రజలు ఏటూరునాగారం : ప్రజల దాహర్తిని తీర్చేందుకు తాగునీటి పథకాల కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా అవి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. తాగునీటి పథకాల పనులు పూర్తికాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 13వ ఆర్థిక సంఘం కోయగూడ ఎల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్, లంబాడీ తండాల్లో రూ. 40 లక్షలు వెచ్చించి రెండు మంచినీటి ట్యాంకులను నిర్మించారు. లంబాడీతండాలో నిర్మించిన ట్యాంక్ నిర్మాణం పూర్తయినప్పటకీ దాని నుంచి నీరు నల్లాలకు సరఫరా కావడం లేదు. రాంనగర్లో చేపట్టిన ట్యాంకు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. తాగునీటి పథకాల ద్వారా ప్రజలందరికీ తాగునీరు అందిస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నా వాటి అమలు సవ్యంగా లేదు. ట్యాంకుల నిర్మాణం పూర్తయినా నల్లాల నుంచి తాగునీరు సరఫరా కాకపోవడంపై కాంట్రాక్టర్లు, అధికారుల పర్యవేక్షణ కరువైంది. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులను పర్యవేక్షించకుండానే అధికారులు బిల్లులు మంజూరు చేశారు. సర్పంచ్ నివాసం ఉండే గ్రామమైన లంబాడీతండాలో సైతం సమస్యలు పేరుకుపోయి గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. శాశ్వత రోడ్లు లేకపోవడం, నిరుపయోగంగా మారిన తాగునీటి నల్లాలు, పనిచేయని చేతి పంపులతో మురుగు కాల్వల నిర్వహణ లేకపోవడం లాంటి సమస్యలతో లంబాడీతండా వాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధిపై నాయకులు హామీలు హామీలుగానే నిలిచిపోతున్నాయని ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని లంబాడీతండా, రాంనగర్ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తాగునీటికి తిప్పలు పడుతున్నాం నల్లాల నుంచి నీరు రాకపోవడంతో చేతి పంపుల వద్దకు గంటల తరబడి వేచి చూస్తున్నాం. ట్యాంకులు నిర్మించినా అవి ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నాయకులను అడిగితే పట్టించుకోవడం లేదు. త్వరగా సమస్యలు పరిష్కరించి నీటి సరఫరా చేపట్టాలి – కోడికట్ల నాగమ్మ, రాంనగర్ అధ్వానంగా మారిన రోడ్లు చెత్తాచెదారంతో రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. రోడ్లు పెంటకుప్పలుగా మారి దుర్వాసన వెదజల్లుతున్నాయి. డ్రెయినేజీలు సరిగా లేకపోవడంతో వర్షాకాలం రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. వీది దీపాలు వెలుగకపోవడంతో ఇబ్బంది అవుతోంది. దోమల మందు పిచికారి చేయడం లేదు – పోరిక శ్రీనివాస్ -
గోదారి తీరాన ‘ఆదిమ’ జాడలు
- గోదావరి తీరం వెంట మూడు వేల ఏళ్లనాటి మానవ చరిత్ర జాడలు - ఖమ్మం, భూపాలపల్లి అడవుల్లో అద్భుత నిర్మాణాలు - ఒకేచోట వేల సంఖ్యలో సమాధులు - గుట్టువిప్పేందుకు ముందుకొచ్చిన అమెరికా వర్సిటీ సాక్షి, హైదరాబాద్/ భూపాలపల్లి పది అడుగుల ఎత్తున్న రాతి పలకాలతో చుట్టూ గోడ.. పదిహేను నుంచి ఇరవై అడుగుల వెడల్పు, అడుగు మందంతో రాతి పైకప్పు.. దానికి చిన్న ద్వారం.. లోపల పదడుగుల వెడల్పు, అంతే పొడవుండే గండ శిలతో చెక్కిన తొట్టిలాంటి ఆకృతి. దానికి రాతి మూత.. దాని బయట అస్పష్టమైన మానవాకృతితో గండశిలలు.. ఆ ప్రాంగణం చుట్టూ భారీ శిలలు..! అలాంటివి ఒకటి కాదు రెండు కాదు.. వందలు... వేలు... దట్టమైన అడవిలో ఆశ్చర్యం కలిగించే నిర్మాణాలు! ఇంతకూ ఏంటవి..?? ఎవరు నిర్మించారు.. ఎక్కడున్నాయి? రాతి తొట్టిలో ఎముకలు కనిపించటంతో అవి సమాధులని, ఆదిమానవుల కాలానివని దాదా పు వందేళ్ల క్రితమే తేల్చారు. కానీ అవి ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న నిర్మాణాలని అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో విశ్వవిద్యాలయం గుర్తించింది. వీటిపై అధ్యయనానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందానికి ఆసక్తిగా ఉంది. ఇంతకూ ఆ నిర్మాణాలు ఎక్కడున్నాయో తెలుసా? భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల పరిధిలోని గోదావరి నదీతీరం వెంట! వారంతా వలస వచ్చినవారా? గోదావరి తీరం వెంట భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోని తాడ్వాయి, దామరవాయి, జానంపేట, దొంగలతోవు, సింగారం, గంగారం, కాచనపల్లి, గలబ, గుండాల... అటవీప్రాంతాల్లో వేల సంఖ్యలో సమాధులున్నాయి. వీటిని ఎవరు నిర్మించారన్నది ఇప్పటివరకు మిస్టరీగా ఉంది. తాజాగా సీసీఎంబీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో వారు వలస జీవులని తేలింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఆచార్యులు కేపీరావు ఆధ్వర్యంలో సర్వే జరిగిన సమయంలో సీసీఎంబీ.. ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఈ సమాధుల్లోని ఎముకల డీఎన్ఏను పరీక్షించిం ది. అది స్థానికుల డీఎన్ఏతో సరిపోలలేదు. దీంతో వలస వచ్చినవారు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటారని భావించారు. దీన్ని రూఢీ చేసుకోవాలంటే ఈ సమాధులు విస్తరించిన ఇతర ప్రాంతాల్లో కూడా డీఎన్ఏ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీసీఎంబీ భావిస్తోంది. దానికంటే ముందు వీటి గుట్టు విప్పేందుకు కాలిఫోర్నియాలోని శాన్ డియాగో విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ప్రపంచంలో మరెక్కడా లేని సంఖ్య లో.. ఆకృతిలో భిన్నంగా ఉన్న ఈ నిర్మాణాల వెనక బలమైన చరిత్ర ఉందని ఆ వర్సిటీ భావిస్తోంది. తాజాగా ఆ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ థామస్ లెవీ వాటిని పరిశీలించారు. వీటి గుట్టు విప్పేందుకు తెలంగాణ పురావస్తు శాఖ ముందు ప్రతిపాదన ఉంచారు. పశువుల కొట్టాల్లోకి తొట్లు: సమాధుల్లో రాతి తొట్లను స్థానికులు కొందరు అక్రమంగా ఇళ్లకు తరలించి పశువుల కొట్టాల్లో తొట్లుగా వాడుతున్నారు. వాటిపై అవగాహన లేకపోవటంతో అత్యంత అరుదైన సంపద ధ్వంసంఅవుతోంది. ఆ నిర్మాణాల్లో ఎన్నో ప్రత్యేకతలు సాధారణంగా సమాధులు భూమి లోపల నిక్షిప్తమై ఉంటాయి. వాటికి గుర్తుగా పైన గండ శిలలను వృత్తాకారంలో పాతటం నాటి అలవాటు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా భూమి ఉపరితలంలోనే రాతి పలకలతో గుడారం తరహా నిర్మాణం ఉంది. సమాధుల ముందు అస్పష్టమైన మానవాకృతి రాళ్లు పాతి ఉన్నాయి. మగవారి ఆకృతి ఉన్న రాళ్లు క్రెస్తవ శిలువ ఆకృతిని పోలి ఉన్నాయి. కానీ అది క్రెస్తవంతో సంబంధం లేదని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు తెలిపారు. మహిళా రూపం అయితే శిలలపై స్థనభాగం రూపొందించి ఉంది. ఇలాంటి ఆకృతులు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. గతంలో ఈ నిర్మాణాలపై పలుమార్లు పరిశోధన జరిగినా 1982లో పురావస్తు అధికారి రామకృష్ణ వీటిని పరిశీలించి రిపోర్టు రూపొందించారు. 1991లో పురావస్తు అధికారులు రంగాచారి, గోవిందరెడ్డిలు పరిశీలించి వీటిలోని తొట్టి తదితర వివరాలను బహిర్గతం చేశారు. స్వాతంత్య్రానంతరం తొలి మెరుగైన అధ్యయనం ఇదే. 2000లో ప్రొఫెసర్ పుల్లారావు బృందం మరికాస్త పరిశోధించి వీటి ప్రాధాన్యాన్ని ప్రపంచానికి వెల్లడించింది. వీరి ఆధ్వర్యం లోనే ఇటీవల డీఎన్ఏ పరీక్షలు జరిగాయి. యునెస్కో గుర్తింపు అర్హత ఉంది: పురావస్తుశాఖ డైరెక్టర్ ఈ సమాధులు అరుదైనవి, అద్భు తమైనవి. శాన్ డియాగో విశ్వవిద్యాల యం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి పరిశోధనలు చేయాలనే విష యంలో మేం ప్రణాళిక రూపొందిస్తాం. ఇన్ని వేల సంఖ్యలో మరెక్కడా సమా ధులు లేవు. వాటి గుట్టువిప్పి ప్రపంచం ముందు పెడితే తెలంగాణకు తొలి యునెస్కో గుర్తింపు రావటం ఖాయం. -
భూపాలపల్లిలో పెద్దనోట్ల కలకలం
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో పెద్ద మొత్తంలో కొత్త 2 వేల రూపాయల నోట్లు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వ్యక్తుల వద్ద మొత్తం కలిపి రూ.19.62 లక్షల విలువైన కొత్త నోట్లను గుర్తించినట్లు సమాచారం. వారిని అదపులోకి తీసుకున్న పోలీసులు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, నలుగురు వ్యక్తులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. -
మహారాష్ట్రకు మన మద్యం
పొరుగు రాష్ట్రంలోని గడ్చిరోలిలో మద్య నిషేధం ఇక్కడి నుంచి లిక్కర్ అక్రమ రవాణా చోద్యం చూస్తున్న ఎక్సైజ్శాఖ సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతం గుండా మద్యం అక్రమంగా మహా రాష్ట్రకు తరలుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో రెండేళ్లుగా మద్యనిషేధం అమల్లో ఉంది. దీంతో దొంగ చాటుగా లభిస్తున్న మద్యానికి అక్కడ డిమాండ్ ఎక్కు వగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అమ్మేందుకు అను మతించిన మద్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. తూర్పు అడవుల్లో గోదా వరి తీరం వెంబడి ఈ దందా యథేచ్ఛగా కొనసాగు తోంది. కాటారం, మహదేవపూర్లకు చెందిన కొందరు వ్యక్తులు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. బెల్ట్షాపుల పేరు చెప్పి.. మహదేవపూర్ మండలంలో మూడు వైన్ షాపులు ఉన్నారుు. ఇందులో రెండు మహ దేవపూర్లో ఉండగా కాళేశ్వరంలో ఒక షాపు ఉంది. కాటారంలో మూడు వైన్షాపులు ఉన్నారుు. వీటికి అనుబంధంగా తూర్పు ఏజెన్సీలో వందల సంఖ్యలో బెల్టుషాపులు కొనసాగుతు న్నారుు. బెల్టుషాపులకు సరఫరా చేసే ముసుగులో మద్యాన్ని సరిహద్దు దాటిస్తున్నారు. గోదావరి తీరం వరకు చేరు కున్న మద్యాన్ని ఆటోలు, పడవల ద్వారా సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణ మద్యం మహారాష్ట్రలో రెట్టింపు ధర పలుకుతోంది. క్వార్టర్, హాఫ్, ఫుల్ ఇలా పరిమాణం ఏదైనా రేటు డబుల్గా ఉంటోంది. మహారాష్ట్రకు మద్యం తరలింపు ద్వారా లాభాలు అధికంగా ఉండటంతో క్రమంగా ఈ దందాలో పాల్గొనేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ మార్గాల గుండా.. మన రాష్ట్రంలో కాళేశ్వరం - మహారాష్ట్రలోని సిరొంచ మధ్య వంతెన నిర్మాణం పూర్త రుు్యంది. గతంలో పడవల ద్వారా తరలిన మద్యం గత మూడు నెలలుగా ఈ వంతెన మీదుగా ఆటోలు, వ్యాన్ల ద్వారా సిరొంచకు తరలుతోంది. కొన్ని సందర్భాల్లో మహా రాష్ట్రకు చెందిన వ్యక్తులు ఇక్కడి నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తుండగా ఎక్కువగా ఇక్కడి వ్యక్తులే పకడ్బందీగా సరఫరా చేస్తున్నారు. మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ నుంచి గోదావరి నదికి అవతలి వైపు ఉన్న నడిగూడకు పడవల ద్వారా మద్యాన్ని సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వాహనాల ద్వారా మహారాష్ట్ర వైపు ఉన్న ఆసరెల్లి, అంకీస పట్టణా లకు మద్యాన్ని తరలిస్తున్నారు. పలిమెల మండలం దమ్మూరు నుంచి పడవల మీదుగా గోదావరి దాటి ఛత్తీస్గఢ్ లోని భూపాలపట్నం పరిసర ప్రాంతాలకు ఇక్కడి మద్యం రవాణా అవుతోంది. నిద్రమత్తులో ఎకై ్సజ్ శాఖ.. మన రాష్ట్రంలో అమ్మాల్సిన మద్యాన్ని అక్రమంగా పక్క రాష్ట్రంలో అమ్ముతుంటే అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు మిన్నకుండిపోతున్నారు. నిత్యం డీసీఎం, ప్యాసింజర్ ఆటోలు, పడవల ద్వారా రవాణా అవుతున్నా పట్టించుకోవడం లేదు. మద్యం తరలించే మార్గాల్లో ఎటువంటి తనిఖీలూ నిర్వహించడం లేదు. దీంతో మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూ వ్యాపా రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం మహా రాష్ట్రలో సిరొంచ, నగరం, కమలాపూర్, అంకీస, అసరెల్లి, నడిగూడ, చింతలపల్లి తదితర ప్రాంతాల్లో తెలంగాణ మద్యం చీకటి మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతోంది. -
మావోయిస్టు పోస్టర్ల కలకలం
భూపాలపల్లి: జిల్లాలోని వెంకటాపురం మండలంలో మావోయిస్టులు పోస్టర్లు అంటించడం కలకలం సృష్టిస్తోంది. ఆలుబా హైవే చుట్టుపక్కల ప్రాంతాల్లో గోడలపై మావోయిస్టులు పోస్టర్లు అంటించారు. పీఎల్జీఏ 16వ వారోత్సవాలను గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని పోస్టర్లలో ఉంది. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వారోత్సవానలు జరపాలని చర్ల, శబరి ఏరియాల మావోయిస్టులు పేర్కొన్నారు. -
1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
భూపాలపల్లి: జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో సోమవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా సుమారు 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బిల్ట్ పరిశ్రమ ఎదుట సీపీఎం ఆందోళన
మంగపేట: వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. బిల్ట్ పరిశ్రమను వెంటనే తెరిపించి.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆందోళన చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్ కార్మికులకు మద్దతుగా సీపీఎం కార్యకర్తలు ఈ రోజు రాస్తారోకో నిర్వహించారు. పాలకులకేమో పాలభిషేకాలు.. మాకోమో కన్నీటి కష్టాలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
సింగరేణిలో తప్పిన పెను ముప్పు
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి బొగ్గుగనిలో పెను ప్రమాదం తప్పింది. ఆరవ గనిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో.. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. గనిలోని రెండవ సీమ్ 15 ఎఫ్ లెవల్లో ఒక్కసారిగి మంటలు చెలరేగి దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. -
రైతు సమస్యలపై టీడీపీ పోరుయాత్ర
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై తెలంగాణ టీడీపీ సమరశంఖం పూరించడానికి సిద్ధమైంది. రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, సమగ్ర వ్యవసాయ విధానం ప్రకటించాలని, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో మినీ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఆదివారం భూపాలపల్లిలో పాదయాత్రతో పోరు ప్రారంభించనుంది. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి నేతృత్వంలో పాదయాత్ర ఉదయం ప్రారంభమై, సాయంత్రం కలెక్టరేట్ వద్ద నిరసన, బహిరంగ సభతో ముగుస్తుంది. అలాగే 9న ఖమ్మం, 12న పెద్దపల్లి, 13న మద్దూర్ (కొడంగల్), 15న సూర్యాపేటలో పాదయాత్ర, నిరసనసభ, 30న కొడంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయిన రైతును ఆదుకోకపోగా.. రుణమాఫీ వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంవల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్రెడ్డి అన్నారు. 90శాతం దళిత, గిరిజన, పేద వర్గాలు వ్యవసాయంపై ఆధారపడ్డాయని, వారిలో భరోసా నింపడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు భూపాలపల్లి చైర్పర్సన్ సంపూర్ణ
భూపాలపల్లి: పౌరుల భద్రత, విపత్తుల నివారణపై నవంబర్ 3 నుంచి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఆసియా, పసిఫిక్ దేశాల సదస్సుకు హాజరుకావాలని భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణకు సోమవారం ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ కేంద్ర హోంశాఖ వ్యవహారాల కార్యదర్శి కార్యాలయం నుంచి ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ నోముల రవీందర్, ఏఈ రవీంద్రనా«థ్, టీపీఓ ఖలీలుద్దీన్ , కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది చైర్పర్సన్ సంపూర్ణను అభినందించారు. -
అంతర్జాతీయ సదస్సుకు భూపాలపల్లి చైర్పర్సన్ సంపూర్ణ
భూపాలపల్లి: పౌరుల భద్రత, విపత్తుల నివారణపై నవంబర్ 3 నుంచి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఆసియా, పసిఫిక్ దేశాల సదస్సుకు హాజరుకావాలని భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణకు సోమవారం ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ కేంద్ర హోంశాఖ వ్యవహారాల కార్యదర్శి కార్యాలయం నుంచి ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ నోముల రవీందర్, ఏఈ రవీంద్రనా«థ్, టీపీఓ ఖలీలుద్దీ¯ŒS, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది చైర్పర్సన్ సంపూర్ణను అభినందించారు. -
మల్లన్నగుట్టకు మహర్దశ
ప్రభుత్వ కార్యాలయాలకు గుట్టచుట్టూ భూమి కేటాయింపు గణపురం : మండలంలోని మైలారం–గాంధీనగర్ గ్రామాల మధ్యనున్న మల్లన్నగుట్టకు మహర్దశ పట్టిం ది. భూపాలపల్లి జిల్లా అవుతుందనే ప్రచారం మొదలు కాగానే అధికారు ల దృష్టి ఈ గుట్టపై పడింది. గత ఏడాది పోలీస్ బెటాలియన్ కోసం 120 ఎకరాలు, మిషన్ భగీరథ పనుల నిర్మాణానికి 12ఎకరాలు కేటాయిం చారు. ఇక్కడి నుండి మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ, గణపురం మండలాల్లోని 120గ్రామాలకు తాగు నీరందించనున్నారు. ఇందుకోసం పైపులైన్, ఇన్టేక్ వెల్ పనులు జరుగుతున్నాయి. భూపాలపల్లికి మంజూరైన అగ్నిమాపక కేంద్రానికి కూడా ఈ గుట్ట వద్దే రెండెకరాలు కేటాయించారు. రూ.3 కోట్లతో నిర్మించే ఐబీ గెస్ట్హౌస్ రెండెకరాల భూమి సేకరించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే విద్యాలయానికీ ఇక్కడే భూ సేకరణ చేపట్టనున్నారు. మల్లన్న గుంటపైన ఇంకా పలు ప్ర భుత్వ కార్యాలయాల కోసం భూమి సేకరిస్తున్నారు. వరంగల్ – భూపాలపల్లి ప్రధాన రహదారిని ఆ నుకుని ఉన్న మల్లన్నగుట్ట ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. -
భూపాలపల్లిలో చేర్చండి
వాజేడు మండల వాసుల రాస్తారోకో వాజేడు : వాజేడు మండలాన్ని వరంగల్ జిల్లా నుంచి నూతనంగా ఆవిర్భవించనున్న భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలో కలపాలని కోరుతూ మండల వాసులు సోమవారం ఆందోళన నిర్వహించారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో 163వ జాతీయ రహదారి అయిన గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. తమకు ఎంతో దూరంలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కాకుండా.. అనుకూలంగా ఉండే భూపాలపల్లిలో కలపాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో కలిపితే తీవ్ర నష్టం జరుగుతుందని వివిధ పార్టీల నాయకులు అన్నారు. అదే భూపాలపల్లిలో కలిపితే గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సానుకూలంగా ఉంటుందన్నారు. బ్రిడ్జిపై దాదాపు గంటపాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధర్మారం గ్రామంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఇన్చార్జ్ తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భూపాలపల్లిలో చేర్చండి
వాజేడు మండల వాసుల రాస్తారోకో వాజేడు : వాజేడు మండలాన్ని వరంగల్ జిల్లా నుంచి నూతనంగా ఆవిర్భవించనున్న భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలో కలపాలని కోరుతూ మండల వాసులు సోమవారం ఆందోళన నిర్వహించారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో 163వ జాతీయ రహదారి అయిన గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. తమకు ఎంతో దూరంలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కాకుండా.. అనుకూలంగా ఉండే భూపాలపల్లిలో కలపాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో కలిపితే తీవ్ర నష్టం జరుగుతుందని వివిధ పార్టీల నాయకులు అన్నారు. అదే భూపాలపల్లిలో కలిపితే గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సానుకూలంగా ఉంటుందన్నారు. బ్రిడ్జిపై దాదాపు గంటపాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధర్మారం గ్రామంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఇన్చార్జ్ తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సత్తాచాటిన భూపాలపల్లి యువతేజం
సూపర్ స్పెషాలిటీ కిడ్నీ సర్జరీ ఫలితాల్లో మెుదటి ర్యాంక్ సాధించిన కిరణ్భూపాలపల్లి, గణపురం: సూపర్ స్పెషాలిటీ కిడ్నీ సర్జరీ కోర్సుల్లో ప్రవేశాలకుగానూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపరీక్షలో జిల్లా యువతేజం ఉస్కె కిరణ్ మెుదటి ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. శనివారం విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఈ మేరకు తనకు ర్యాంక్ వచ్చిందని ఆయన తెలిపారు. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని మహబూబ్పల్లి గ్రామానికి చెందిన ఉస్కె సరోజన, లింగయ్య కుమారుడు కిరణ్. ఆయన ఉస్మానియా ఆస్పత్రిలో ఎంబీబీఎస్ , ఎంఎస్ జనరల్ సర్జరీ కోర్సులు పూర్తి చేశారు. అనంతరం తన లక్ష్యమైన కిడ్నీ సర్జరీ విభాగంలో సూపర్ స్పెషాలిటీ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాయగా, అందులో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు కిరణ్ను అభినందించారు. అమ్మా,నాన్నలే స్ఫూర్తి ‘మా అమ్మానాన్న అంతగా చదువుకోలేదు. అయినా వారికి చదువు విలువ ఏంటో తెలుసు. అందుకే నన్ను బాగా చదివించారు. వారే నాకు స్ఫూర్తిప్రదాతలు. వారి పేరు నిలబెట్టాలనే సంకల్పంతో చదివాను. మంచి ర్యాంక్ వచ్చింది. అమ్మానాన్న పేరిట ఫౌండేషన్ ఏర్పాటుచేసి భూపాలపల్లి లాంటి మారుమూల గ్రామాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తా. కిడ్నీ సర్జరీ విభాగంలో ఇప్పటిదాకా హైదరాబాద్కే పరిమితమైన రోబోటిక్ సర్జరీని వరంగల్లోని వైద్యశాలలకూ విస్తరించాల్సిన అవసరం ఉంది’ – ఉస్కె కిరణ్ -
సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలి
టీడీపీ సమన్వయ కమిటీలో తీర్మానం వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నాయకులు పూర్తిస్థాయిలో పనిచేయాలని ఆ పార్టీ జిల్లా సమన్వయ కమి టీ సమావేశంలో తీర్మాణించారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మిగిలిన ఉన్న పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేయాలని నిర్ణయించారు. సోమవారం జరిగిన భూపాలపల్లి, పరకాల నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని, రానున్న కాలంలో టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మంగళవారం మహబూబాబాద్ మార్వాడీ గార్డెన్స్లో మహబూబాబాద్, మధ్యాహ్నం ఒంటిగంటకు మరిపెడ ఏఎన్ఆర్ గార్డెన్స్లో డోర్నకల్, 4న హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 9గంటలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టాలని తీర్మాణించారు. 5న బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు, మధ్యాహ్నం 2గంటలకు ములుగులో, 6న వర్ధన్నపేట, 8న ఉదయం 10 గంటలకు స్టేషన్ఘన్పూర్, మధ్యాహ్నం జనగామలో ఆయా నియోజకవర్గ సమావేశాలు నిర్వహించాలని కమిటీలో నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సీతక్క, ఈగ మల్లేషం, అధికార ప్రతినిధి వేం నరేందర్రెడ్డి, గట్టు ప్రసాద్బాబు, బొట్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్కుమార్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం పాల్గొన్నారు. -
కరువు నివారణకే హరితహారం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోల్బెల్ట్ : రాష్ట్రంలో కరువు శాశ్వత నివారణ కోసం కొనసాగుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మిలీనియం క్వార్టర్స్లో గురువారం సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం హాజరై మెుక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయనిన్నారు. దీనికి గత పాలకులు పర్యావరణ పరిరక్షణపై పట్టించుకోకపోవడమే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లలో 230 కోట్లు మెుక్కలు నాటాలనే బృహత్తర కార్యక్రమం చేపట్టగా ఈ ఏడాది 46 కోట్ల మెుక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ గనులు, ఓపెన్కాస్టులు, కార్మికకాలనీలు, స్వాధీన భూముల్లో మొక్కలు నాటడంతోపాటు సంరక్షించుకోవాలన్నారు. సింగరేణి ఇప్పటికే 75 లక్షల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. స్పీకర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ హరితహారంపై ప్రతిజ్ఞ చేయించారు. సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు మనోహర్రావు, భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, జడ్పీ చైర్మన్ గద్దల పద్మ, ములుగు ఆర్డీఓ మహేందర్జీ, స్పెషల్ ఆఫీసర్ చక్రధర్, భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్య, ఎస్ఓటూ జీఎం సయ్యద్ హబీబ్హుస్సేన్, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, వైస్ చైర్మన్ గణపతి, కౌన్సిలర్లు సిరుప అనిల్, కంకటి రాజవీరు, గోనె భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు మందల రవీందర్రెడ్డి, మేకల సంపత్కుమార్, కొక్కుల తిరుపతి, కటకం స్వామి, జోగుల సమ్మయ్య, బిబిచారి పాల్గొన్నారు. -
కొత్తగా ఐదు బొగ్గు గనులు
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం మరో ఆరు గనులకు ప్రతిపాదనలు అదనంగా 11 మిలియన్ టన్నుల ఉత్పత్తి æ నల్లబంగారం ఉత్పత్తిలో సింగరేణి ముందంజ సాక్షి, హన్మకొండ : వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా సింగరేణి సంస్థ అడుగులు వేస్తోంది. భారీ స్థాయిలో గనులను విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది ఐదు కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మరో ఆరు గనులు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా పేరుగాంచిన సింగరేణి వరుసగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటు పోతోంది. ఈ ఏడాది 63 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో ఐదు నూతన గనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. తొలి ఏడాదిలో ఈ గనుల నుంచి 4 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. రెండో ఏడాది నుంచి ఈ ఐదు గనులు ద్వారా ఏటా 11.50 మిలియన్ టన్నులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా రాబోయే గను ల్లో ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో శాంతిఖని(కంటిన్యూస్ మైనర్), వరంగల్ జిల్లా భూపాలపల్లి ఏరియాలోని కాకతీయఖని ఓపెన్ కాస్ట్–02, ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలో పీవీకే–5, జేవీఆర్ ఓపెన్కాస్ట్–02 గనులు, మణుగూరులో ఓపెన్కాస్ట్–2లను ప్రారంభించనున్నారు. వేగంగా విస్తరణ గత దశాబ్దకాలంగా చేపట్టిన సంస్కరణ ఫలితంగా సింగరేణిలో గనులు, కార్మికుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. 2000 ప్రారంభంలో లక్ష మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు సింగరేణి సంస్థలో పనిచేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య 59వేల దగ్గర ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున «థర్మల్ పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండటంతో సింగరేణి సంస్థ విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ప్రస్తుతం 34 భూగర్భ, 15 ఉపరితల గనులు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి 60 మిలియన్ టన్నులుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు రాబోయే మూడేళ్లలో మరో ఆరు గనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 70 మిలియన్ టన్నులు దాటనుంది. కొత్త గనులు ప్రారంభమైతే తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అనుమతుల కోసం.. సింగరేణి సంస్థ రాబోయే రెండు మూడేళ్లలో ఆరు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి ఏరియాలో కేటీకే(కాకతీయఖని) 3 భూగర్భగని, కేటీకే 5లో లాంగ్వాల్ ప్రాజెక్టు, ఆదిలాబాద్ జిల్లాలో శాంతిఖని, శ్రీరాంపూర్ ఓసీపీ–2, ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలో రాంపూర్ భూగర్భగని, జేవీఆర్(జలగం వెంగళరావు) ఓసీపీ–2లకు అనుమతులు ఇవ్వాలని సింగరేణి కార్పొరేట్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు విభాగం నిర్ణయించింది. వీటిలో రాంపూర్ భూగర్భగని, జేవీఆర్ ఓసీపీ–2లకు ఇటీవల టెక్నికల్ బోర్డు ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి పర్యావరణ అనుమతులు కోసం కేంద్ర పరిశీలనకు పంపనున్నారు. విడతల వారీగా మిగిలిన నాలుగు గనులకు టెక్నికల్ బోర్డు అనుమతి ఇవ్వనుంది. రాంపూర్ భూగర్భగని నుంచి ప్రతి ఏటా 1.4 మిలియన్ టన్నులు, జేవీఆర్ ఓసీపీ–2 నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. -
'హామీలు నెరవేర్చకపోతే పతనమే'
19 నెలల్లో టీఆర్ఎస్ చేసిందేమీ లేదు: పొంగులేటిభూపాలపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే టీఆర్ఎస్ పార్టీకి పతనం తప్పదని వైఎస్సార్సీపీ తెలంగాణఅధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో శనివారం పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 19 నెలల కాలంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రైతులకు ఒకే దఫా రూ. లక్ష రుణమాఫీ చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, ఇంటికో ఉద్యోగం ఏమైందని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్ భూపాలపల్లి నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చాడో చెప్పాలన్నారు. గణపురం మండలంలోని చెల్పూరు కేటీపీపీ మూడవ దశ 800 మెగావాట్ల ప్రాజెక్ట్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూపాలపల్లిని ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, డిస్మిస్డ్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదవారి ముఖంలో చిరునవ్వులు చూడటమే వైఎస్ లక్ష్యమని, అందుకోసం తమ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. త్వరలోనే సింగరేణిలో తమ పార్టీ అనుబంధ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని సెగ్మెంట్లలో వైఎస్సార్సీపీ పోటీ చేస్తుందని వెల్లడించారు. అనంతరం నియోజకర్గంలోని వివిధ పార్టీలకు చెందిన 250 మంది పార్టీలో చేరగా వారికి శ్రీనివాస్రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, రాష్ట్ర సం యుక్త కార్యదర్శి శాంతికుమార్, జిల్లా నేతలు వీరబోయిన రాజ్కుమార్గౌడ్, నెమలిపురి రఘు, మునిగాల కళ్యాణ్రాజ్, కె అచ్చిరెడ్డి, డి ప్రకాష్, కె రాజ్కుమార్, అప్పం కిషన్, మేకల కేదారియాదవ్, నాగుల దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్నేహితుడి కుమార్తె పై అత్యాచారయత్నం
భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లిలో స్నేహితుడి కుమార్తె పై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కథనం ప్రకారం... భూపాలపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు నాంపల్లి వెంకటేశ్వర్లు తన స్నేహితుడి కుమార్తె(14)ను ఆదివారం బైక్పై పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి... అత్యాచారం చేయబోయాడు. దాంతో బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బాలిక తండ్రి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భూపాలపల్లి కేటీపీపీలో సాంకేతిక లోపం
వరంగల్: వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్ (కేటీపీసీ) లో మంగళవారం సాంకేతిక లోపం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీక్ అవడంతో 500 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు పునరుద్ధరణ ఏర్పాటు చేస్తున్నారు. -
భార్య ముక్కు, చెవులు కోసిన భర్త
-
భార్య ముక్కు, చెవులు కోసిన భర్త
వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. దాంతో విచక్షణ మరచిన భర్త...ఆమె ముక్కు, చెవులు కోసిన ఘటన భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా భార్య రజితను అనుమానంతో వేధిస్తున్నాడు. ఇదే విషయమై గత రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పడుకున్న భార్య చేతులు, కాళ్లను మంచానికి తాడుతో కట్టేసిన శ్రీనివాస్...ఆమె ముక్కు, చెవులు కోశాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతూ మంచంలోనే పడి ఉన్న రజితను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో శ్రీనివాస్కు అతని తల్లి కూడా సహకరించినట్లు సమాచారం. -
కోతులను కొట్టబోయి.....
వరంగల్ : ఇంటిపైకి వచ్చిన కోతులను కొట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి శరీరంలోకి ప్రమాదవశాత్తు ఐరన్ రాడ్ చొచ్చుకుపోయింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం కార్ల్మాక్స్ కాలనీలో మంగళశారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభాకర్ అనే వ్యక్తి కోతులను కొడుతుండగా, సిమెంట్ రేకు విరిగిపడి ప్రమాదవశాత్తు ఇంటి ప్రహారీ గోడపై ఉన్న రాడ్డుపై పడ్డాడు. దాంతో రాడ్ కడుపు కింది భాగంలోకి దిగిపోయింది. దీంతో అతడు నొప్పికి తాళలేక విలవిల్లాడిపోయాడు. రాడ్ను పట్టుకుని అలాగే ఉండిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సింగరేణి రెస్క్యూటీమ్ సాయంతో రాడ్ను కట్ చేసి, 108లో ప్రభాకర్ను ఆసుపత్రికి తరలించారు. -
షిర్డీ నుంచి వస్తూ మృత్యువాత
-
షిర్డీ నుంచి వస్తూ మృత్యువాత
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడిపల్లి జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు, వృద్ధుడు ఉన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన వీరంతా షిర్డీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడినవారిని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కూలికి వెళితే.. ప్రాణం పోరుుంది
భూపాలపల్లి, న్యూస్లైన్ : కలప అక్రమ రవాణా అన్నెపున్నం తెలియని ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఫారెస్ట్ అధికారులు వస్తున్నారనే సమాచారంతో స్మగ్లర్ కంగారుతో ద్విచక్రవాహనం నడపగా అదుపుతప్పింది. దీంతో వెనకాల టేకు దుంగలను పట్టుకుని కూర్చున్న యువకుడు కిందపడగా, అతడిపై దుంగలు పడడంతో తీవ్రగాయూలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామశివారులోని పెద్దమ్మగుడి సమీపంలో జరిగింది. భూపాలపల్లి సీఐ ఎల్ ఆదినారాయణ, మృతుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం... రేగొండ మండలం కాకర్లపల్లి శివారు మడతపల్లికి చెందిన సిరంగి రామయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు ప్రశాంత్(18) వారం రోజుల క్రితం వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన సల్ల సతీష్ శనివారం రాత్రి సుమారు 12 గంటలకు ప్రశాంత్ వద్దకు వెళ్లి కూలీకి రావాల్సిందిగా కోరాడు. తన ద్విచక్ర వాహనంపై ఒక టేకు దుంగను పట్టుకుని కూర్చుంటే కూలీ ఇస్తానని చెప్పాడు. దీంతో ప్రశాంత్ అతడితో బయల్దేరాడు. వారితోపాటు అదేగ్రామానికి చెందిన పొన్నం సమ్మయ్య, చేను కిరణ్ రెండు టేకు దుంగలతో మరో ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలకు ముందు అదే గ్రామానికి చెందిన ఆవుల సంపత్, గుండగాని రాజు మరో ద్విచక్రవాహనంపై పైలట్గా బయల్దేరారు. మూడు ద్విచక్ర వాహనాలు పెద్దాపూర్ నుంచి గణపురం మండలం చెల్పూరు మీదుగా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామశివారులోని పెద్దమ్మ గుడి దాటాయి. ఈ క్రమంలోనే పైలట్గా వ్యవహరిస్తున్న సంపత్, రాజుకు అటవీశాఖ అధికారులు కనిపించారు. ఈ విషయాన్ని వారు టేకు దుంగలను తీసుకొస్తున్న వారికి చేరవేశారు. అప్పటికే వారు దగ్గరికి రావడంతో చేసేదిలేక సమ్మయ్య, కిరణ్ తమ ద్విచక్రవాహనంతోపాటు రెండు టేకు దుంగలను రోడ్డుపైనే వదిలి పారిపోయారు. అటవీ అధికారులు ఆ బైక్ను, కలప దుంగలను స్వాధీనం చేసుకుని భూపాలపల్లి వైపు వస్తున్నారు. మరో ద్విచక్రవాహనంపై వస్తున్న సతీష్, ప్రశాంత్ అటవీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్రవాహనాన్ని పొలాలబాట వైపు తిప్పారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడిపోగా ప్రశాంత్పై టేకు దుంగ పడింది. దుంగ సుమారు 6 ఫీట్లు ఉండడంతో అతడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యూరుు. రక్తస్రావం అధికంగా జరిగింది. సతీష్ గమనించి ప్రశాంత్ను మోరంచపల్లి గ్రామం వరకు ఎత్తుకుని రాగా మార్గమధ్యలోనే ప్రశాంత్ మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని మోరంచపల్లి క్రాస్రోడ్డు వద్దే వదిలి సతీష్ పరారయ్యూడు. తెల్లవారుజామున ఆరు గంటలకు గ్రామస్తులు మృతదేహాన్ని చూసి సమాచారం అందించగా మృతుడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు సల్ల సతీష్, ఆవుల సంపత్, గుండగాని రాజు, పొన్నం సమ్మయ్య, చేను కిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆదినారాయణ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు. స్మగ్లర్ల కొత్త పంథా.. అటవీశాఖ అధికారులు, పోలీసులు కొంతకాలంగా కలప తరలిస్తున్న ఎడ్లబండ్లు, ట్రాలీ, డీసీఎం వ్యాన్లను భారీ మొత్తంలో పట్టుకున్నారు. దీంతో కలప స్మగ్లర్లు కొంత పంథాను అవలంభిస్తున్నట్లు తెలిసింది. ద్విచక్ర వాహనంపై దుంగలను తరలిస్తే అటవీ అధికారులు గాలింపు చేపడుతున్న సమయంలో సులువుగా తప్పించుకోవచ్చని భావించినట్లు సమాచారం. దుంగను వదిలి పారిపోవచ్చు... లేదా దుంగను దాచి అధికారులు వెళ్లేంత వరకు బైక్పై దర్జాగా తిరగొచ్చని భావించారు. ఇందు కోసం ద్విచక్ర వాహనం వెనుక టైర్కు ఇరువైపులా కంపెనీ ఇచ్చే షాకప్జల్ కాకుండా అదనంగా మరో షాకప్జల్ను ఏర్పాటు చేసుకున్నారు. మృతుడు ప్రశాంత్ ప్రయాణించిన, అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న రెండు ద్విచక్ర వాహనాలకు ఇలాగే ఉండడం బట్టి స్మగ్లర్లు వీటిని కలప దందా కోసమే ప్రత్యేకంగా చేరుుంచినట్లు తెలుస్తోంది.