
వెంగళరావు పార్కులో నాయిని, హరీష్రావు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావుతో కలిసి గురువారం ఉదయం వెంగళరావు పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా నగరపాలక వాటర్ సప్లై అధికారులతో మాట్లాడారు. పార్కులోని చెరువు పునర్నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.