Nayani Narshimha Reddy
-
KTR: హైదరాబాద్ ఉక్కు వంతెన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన వంతెన ఇవాళ తెరుచుకుంది. ఇందిరా పార్క్-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ వంతెన పేరు ఇందిరా పార్కు నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్. కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం నామకరణం చేశారు. ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. తద్వారా ఆర్టీసీ క్రాస్రోడ్స్, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీ తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే మొదటి పొడవైన స్టీల్ బ్రిడ్జ్. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి భూసేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు. మెట్రో పై నుంచి ఉండడం ఈ బ్రిడ్జికి ఉన్న మరో ప్రత్యేకత. బ్రిడ్జి పొడవు 2.62 కిలోమీటర్లు.. వెడల్పు నాలుగు లైన్లు ఈ బ్రిడ్జి కోసం 12, 316 మెట్రిక్ టన్నుల ఉక్కు వినియోగించారు. 81 స్టీల్ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు వినియోగించారు. కాంక్రీట్ 60-100 ఏళ్లు, స్టీల్ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద(ఎస్ఆర్డీపీ) రూ. 450 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ నిర్మించింది. రోజుకు లక్ష వాహనాలు తిరిగే ఈ రూట్లో వాహనదారులకు బిజీ టైంలో 30-40 నిమిషాల టైం పట్టేది. ఈ వంతెన నిర్మాణంలో కేవలం ఐదే నిమిషాల్లో ప్రయాణం కొనసాగించొచ్చని అధికారులు చెబుతున్నారు. Good Morning Friends 😍❤️ Minister @KTRBRS will inaugurate the Naini Narsimhareddy Steel Bridge today#SteelBridge #Hyderabad #KTR pic.twitter.com/UzRW03wQ3M — Latha (@LathaReddy704) August 19, 2023 స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. ఎస్ఆర్డీపీలో ఇది 36వ ప్రాజెక్టు. హైదరాబాద్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. :::బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాయిని సతీమణి అహల్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి నాయిని అహల్య (64) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. భర్త చనిపోయి 4 రోజులు గడవక ముందే ఆమె కూడా తుది శ్వాస విడిచారు. తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకోక ముందే తల్లి కూడా మరణించడంతో వారి కుమారుడు, కూతురు కన్నీరు మున్నీరవుతున్నారు. గత నెల 28న నాయినికి, ఆ తర్వాత ఆయన భార్య అహల్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 10న పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. అదే సమయంలో ఇద్దరికీ ఈ నెల 13న న్యుమోనియా సోకింది. ఆరోగ్యం క్షీణించడంతో నాయిని ఈ నెల 22న ఆస్పత్రి లో కన్నుమూశారు. భర్తను కడసారి చూసేందుకు అహల్యను ఆస్పత్రి నుంచి అంబులెన్స్లోనే తీసుకొచ్చి చూపించి మళ్లీ తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది. నీతోపాటే నేనూ.. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ గ్రామం నాయిని నర్సింహారెడ్డిది కాగా, దానికి 5 కి.మీ. దూరంలోని పెద్ద మునిగాల గ్రామం అహల్యది. మేనమామ కూతురు అయిన అహల్యను నాయిని పెళ్లి చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రగతి శీల ఉద్యమాలకు అండగా నిలిచిన నాయినిపై ఎన్నో కేసులు పోలీసులు పెట్టినా ఆమె ఎన్నడూ కుంగిపోలేదు. ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. నాయిని ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వెళ్లే సమయంలో భార్యకు ఫోన్ చేసి ఆమెకు కావాల్సినవి తీసుకెళ్లేవారు. అహల్య పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్లోని ఆమె నివాసానికి తీసుకు రానున్నారు. అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు.. సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: నాయిని అహల్య మృతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతిచెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. -
అశ్రునయనాల మధ్య నాయిని అంత్యక్రియలు
-
కార్మిక నేతకు తుది వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియ లు గురువారం మధ్యాహ్నం ఫిలింనగర్ మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో నాయి ని మృతి చెందినట్లుగా అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు, అభిమానులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకొని నాయిని కుటుంబసభ్యులను పరామర్శించారు. తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఆయన పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహి ల్స్ మినిస్టర్ క్వార్టర్స్లోని నాయిని నివాసానికి తరలించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఇంటి వద్ద కడ సారి చూపుకోసం వేచి ఉన్నారు. నాయిని భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు మహమూద్అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథో డ్, ఎంపీ కే.కేశవరావు, ఎమ్మెల్యే లు దానం నాగేందర్, జీవన్రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ అంజనీకుమార్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మినిస్టర్ క్వార్టర్స్ నుంచి నాయిని అం తిమ యాత్ర ప్రారంభమైంది. మహాప్రస్థానంలో నాయిని పార్థివదేహాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్.. పాడె కూడా మోశారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. నాయిని చితికి కుమారుడు దేవేందర్రెడ్డి నిప్పంటించారు. ఆస్పత్రి నుంచి భార్య.. నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాయినితో పాటు ఆమె కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపోలో ఆస్పత్రి వైద్య సిబ్బంది అంబులెన్స్లో ఆమె ను మినిస్టర్ క్వార్టర్స్కు తీసుకురాగా భర్త భౌతిక కాయాన్ని చూసి రోదించారు. అల్లుడు శ్రీనివాస్రెడ్డి, కూతురు సమతారెడ్డి నాయిని మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. కార్మిక సమస్యల పరిష్కారంలో నాయిని కృషి చిరస్మరణీయం న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల పలువు రు ప్రముఖులు సంతాపం తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘‘స్నేహశీలి నాయిని ఆ త్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సోషలిస్టు ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చిన నర్సింహారెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కార్మిక సమస్యల పరిష్కారానికి చేసిన కృషి చిరస్మరణీయం’’అని వెంకయ్య తన సందేశంలో పేర్కొన్నారు. పలువురి సంతాపం నాయిని నర్సింహారెడ్డి మృతికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్, మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీ యాధ్యక్షుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్ఎంపీ కోమ టి రెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వినో ద్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి జి.నిరంజన్, ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సీపీఐ నేతలు సురవరం సుధాకరరెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహారావు, ప్రొఫెసర్ కోదండరామ్, జస్టిస్ సుదర్శన్రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి, టీఎన్జీఓ యూనియన్ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, మరో నేత కారం రవీందర్రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, నాయిని పార్థివదేహానికి డీజీపీ ఎం. మహేందర్రెడ్డి నివాళులు అర్పించారు. హాం మంత్రిగా ఉన్నప్పుడు నాయిని పోలీసుశాఖకు ఎన్నో సేవలు చేశారని డీజీపీ గుర్తు చేసుకున్నారు. ప్రతీక్షణం తెలంగాణ కోసం .. నాయిని తన జీవితంలో ప్రతీక్షణం తెలంగాణ కోసం శ్రమించారు. రాష్ట్ర సాధన, అభివృద్ధిలో ఆయన కృషి మరువలేనిది. నాయిని మృతితో తెలంగాణ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది – గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మరచిపోలేని అనుబంధం నాయిని మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంలో నాయినితో కలిసి పనిచేసిన అనుబంధం మరచిపోలేనిది. ఆయన కుటుంబ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. – సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి నాయిని మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణం అత్యంత బాధాకరం అని గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని ఓ గొప్ప కార్మిక నాయకుడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జననాయకుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నిలిచిన జన నాయకుడు. కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోం మంత్రిగా మనందరి మనసులో నాయిని నర్సింహారెడ్డి చిరస్థాయిగా నిలచిపోతారు. – మంత్రి కేటీ రామారావు. -
అశ్రునయనాల మధ్య నాయిని అంత్యక్రియలు
-
నాయిని అంత్యక్రియల్లో దొంగల చేతివాటం
సాక్షి, హైదరాబాద్ : మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం చూపారు. అంతక్రియలకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకుల పర్సులను ఓ దొంగల ముఠా కొట్టివేసింది. బాధితుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి ఫిర్యాదుతో వెంటనే తేరుకున్న పోలీసులు గ్యాంగ్లో ఒక సభ్యున్ని గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి మూడువేలకు పైగా సొమ్మును రికవరీ చేశారు. ఈ ముఠాలోని ఇతరుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. కాగా కార్మిక, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు నగరంలోని మహా ప్రస్థానం స్మశానవాటికలో ముగిశాయి. అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్ని కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. (పాడె మోసిన కేటీఆర్) -
నాయిని అంత్యక్రియలు: పాడె మోసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్న్నగర్లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనలతో గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మీయ నేతకు కడసారి కన్నీటి వీడ్కోలు పడలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్.. పాడె మోసి నివాళి అర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. కరోనా అనంతరం అనారోగ్యం పాలైన నాయిని.. బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు ఆదేశించారు. -
నర్సన్న మరణం తెలంగాణకు తీరని లోటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అర్ధరాత్రి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకిన విషయం తెలిసిందే. నాయిని మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. నర్సన్న మరణం పార్టీకి, తెలంగాణకు తీరనిలోటు: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అయిదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మికనేతగా పనిచేశారని, 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అనన్య సామాన్యమని గుర్తు చేశారు. 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిదని, నర్సన్న ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం: నాయినితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఉద్యమాలు, త్యాగాలు, పదవులు ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలని తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. నాయిని చనిపోవడం బాధాకరం: తెలంగాణ ఉద్యమంలో నాయిని కీలక పాత్ర పోషించారని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు. 2001 నుంచి ఆయనతో ఎన్నో విషయాలు చర్చించుకున్నామని తెలిపారు. తొలి హోంమంత్రిగా పనిచేశారని,1975 ఎమర్జెన్సీ కాలంలో రైల్వేను స్తంభింపచేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కార్మిక సంఘ ఎన్నికల్లో గెలిచారని అన్నారు. కార్మిక పక్షపాతి నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి అని, వారి హక్కుల్ని కాపాడారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన మరణం చాలా బాధకమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయినిది చిన్నపిల్లల మనస్తత్వమని ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో నాయిని పార్థివదేహాన్ని ఆయన ఉదయం తన సతీమణి సునీతా జగదీష్ రెడ్డితో కలసి సందర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతం నుండి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి కార్మిక నాయకుడిగా తొలి తెలంగాణా ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారని అన్నారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బాధ్యతలు పంచుకున్న నేతగా నాయిని అందించిన సేవలను మంత్రి జగదీష్ రెడ్డి స్మరించుకున్నారు. ఉద్యమ కాలం నుండి తొలి తెలంగాణా మంత్రి వర్గంలో నాయినితో తనకున్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. అటువంటి నేత మరణం తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు మరింత ధైర్యంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నాయిని మరణం అత్యంత బాధాకరం నాయిని నర్సింహారెడ్డి మరణం అంత్యంత బాధకరమని మంత్రి హరీష్ రావు అన్నారు. తొలి మలిదశ ఉద్యమాల్లో నాయిని పోరాటం గొప్పది గుర్తుచేశారు. కార్మికులు, పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేశారని అన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిదని తెలిపారు. నాకు అత్యంత ఆత్మీయుడు నాయిని తనకు అత్యండ ఆత్మీయుడని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా వాసి అని, ఆయన తమకు ఆదర్శం అన్నారు. నాయిని చనిపోవడం బాధాకరమని తెలిపారు. ఆయన్ని చూసి ప్రభావితుడనై రాజకీయాల్లోకి వచ్చానని జానారెడ్డి అన్నారు. కార్మిక నాయకునిగా సుదీర్ఘ కాలం: నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్మిక నాయకునిగా సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం గడిపిన నేత నాయిని అని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాల్లో కలిసి వచ్చేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి హోంమంత్రిగా పనిచేసిన నరసింహారెడ్డి మరణం బాధాకరం అన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. నిబద్ధత గల నాయకుడు తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాయిని నరసింహారెడ్డి కార్మికుల పక్షపాతి అని, తన జీవితాంతం కార్మికుల అభివృద్ధి కోసమే పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆయన చాలా నిబద్ధత గల నాయకుడు అని తెలిపారు. నాయిని తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి సీఎం కేసీఅర్ వెంట నడిచిన వ్యక్తి అని అన్నారు. కార్మికుల కొరకు తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మొదటి హోం మంత్రిగా పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తుచేశారు. అందరినీ తమ్మి.. బాగున్నావా.. అంటూ పలకరించే ఎటువంటి కల్మషం లేని వ్యక్తి నాయిని అని గుర్తు చేసుకున్నారు. నాయకుని మృతి కార్మిక లోకానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని తెలిపారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. తెలంగాణ పోరాట యోధుడు: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో పాల్గొన్న తెలంగాణ పోరాట యోధుడు నాయిని అని గుర్తు చేశారు. కార్మిక నాయకుడిగా ఉంటూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నర్సన్న లేకపోవడం బాధాకరం నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహానికి మంత్రి మల్లారెడ్డి నివాళులు అర్పించారు. కార్మిక నాయకులు నర్సన్న లేకపోవడం బాధాకరం అన్నారు. కార్మిక లోకానికి నాయిని చేసిన సేవలు మరచిపోలేమని తెలిపారు. ప్రభుత్వాలతో కోట్లాడి కార్మికుల హక్కులను కాపాడే వారు నాయిని అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాయిని చేసిన పోరాటం మరచిపోలేమన్నారు. తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ నివాళులు అర్పించారు. నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి సమరసింహారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాయిని నర్సింహారెడ్డి మృతి చాలా బాధాకరం: డిప్యూటీ స్పీకర్ పద్మారావు -
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు ఆదేశాలు ఇచ్చారు. కాగా నాయిని మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత) నాయిని నర్సింహారెడ్డి ప్రస్థానం.... నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము 1944లో నాయిని నర్సింహారెడ్డి జననం నాయిని తండ్రి దేవారెడ్డి, తల్లి సుభద్రమ్మ నాయిని సోదరుడు మాధవరెడ్డి.. చెల్లెల్లు ధమయంతి, సుధేష్న మేనమామ కూతురు అహల్యను వివాహమాడిన నాయిని నాయినికి దేవేందర్రెడ్డి, సమతా రెడ్డి సంతానం పెద్దమునగల్, ఎడవెల్లిలో నాల్గవ తరగతి వరకు చదువు 5వ తరగతి నుంచి దేవరకొండలో విద్యాభ్యాసం కుటుంబ బాధ్యతలతో హెచ్ఎస్సీ మధ్యలోనే ఆపేసిన నాయిని సొంతూరులో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న నాయిని సోషలిస్టు పార్టీకి ఆకర్శితులైన నాయిని సోషలిస్టు పార్టీ కేంద్ర నాయకులు రామ్ మనోహర్ లోహియా,.. రాష్ట్ర నాయకుడు బద్రి విశాల్ పిట్టి మాటతో 1962లో హైదరాబాద్లో అడుగుపెట్టిన నాయిని సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా కొత్త బాధ్యతలు వెయ్యి మంది సభ్యులున్న మున్సిపల్ కార్మిక సంఘాన్ని ఐఎన్టీయూసీ నుంచి.. సోషలిస్టు పార్టీలోకి తీసుకురావడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయిని 1969లో సోషలిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయిని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నాయిని ఉద్యమం సమయంలో ఓ 30సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తి నాయిని 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపు ప్రముఖ నాయకుడు టి.అంజయ్యపై 3వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో రూ.3 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీలో చేరాలని ఎన్టీఆర్ కోరగా తిరస్కరించిన నాయిని 1983లో జనతాపార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి 307 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గెలుపు 1984లో ఉపఎన్నికల్లో జనతాపార్టీ తరపున హిమాయత్నగర్ నుంచి ఓటమి 1985లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి 10,500 ఓట్ల మెజార్టీతో గెలుపు 1989లో జనతాదళ్ పార్టీ తరపున పోటీచేసి నాయిని ఓటమి 1995లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నుంచి మరోసారి నాయినికి ఆహ్వానం కార్యకర్తల ఒత్తిడితో టీడీపీలో చేరిక.. నాయినికి ముషీరాబాద్ టికెట్ పొత్తులో భాగంగా ముషీరాబాద్ టికెట్ కోసం బీజేపీ పట్టు సనత్నగర్ నుంచి పోటీచేయాలని నాయినిని కోరిన టీడీపీ టీడీపీ ప్రతిపాదనను తిరస్కరించి ఎన్నికలకు దూరంగా ఉన్న నాయిని 2001లో కేసీఆర్ నుంచి నాయినికి ఆహ్వానం 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం 2004లో టీఆర్ఎస్ నుంచి ముషీరాబాద్లో పోటీ చేసి గెలుపు వైఎస్ రాజశేఖర్రెడ్డి క్యాబినెట్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసిన నాయిని 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు -
బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు..
సాక్షి, ముషీరాబాద్: రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. ఆరడుగుల ఆజానుబాహుడు.. కోర మీసాలు.. వీటికి తోడు బుల్లెట్.. నాయిని నర్సింహారెడ్డి అనగానే గుర్తుకొచ్చేవి ఇవే. సోష లిస్టు పార్టీ భావాలతో ఎప్పుడూ నీతి, న్యాయం కోసం పోరాడేవారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇట్టే అక్కడికి చేరి వారికి న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉండేవారు. అందువల్లే హైదరాబాద్ వచ్చిన అనతికాలంలోనే కార్మికుల పక్షాన నిలబడి వారి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ ఆయనను ముద్దుగా బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు అని పిలుచుకునేవారు. ఆయన ఏ గల్లీకి వెళ్లినా బుల్లెట్ ఉండాల్సిందే. వయోభారం మీదపడ్డా.. బుల్లెట్ నడపలేని స్థితిలో ఉన్నా తన బుల్లెట్ను మాత్రం రోజూ తుడవడం, ఒకసారి స్టార్ట్ చేసి పక్క న పెట్టడం ఆయనకు అలవాటు. ముఖ్యం గా వాహనాలంటే ఆయనకు అమితమైన మోజు. మార్కెట్లోకి ఏ కొత్త వాహనం వచ్చినా దానిని ట్రయల్ చేసేవారు. చదవండి: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత రమిజాబీ కేసుతో వెలుగులోకి... 1978లో నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో రమిజాబీ అనే ముస్లిం మహిళపై జరిగిన అత్యాచారం, దాడి ఘటన అప్పట్లో రాష్త్రాన్ని మొత్తం కుదిపివేసింది. బాధితుల పక్షాన నిలబడి నాయిని సుదీర్ఘ పోరాటం చేశారు. అప్పట్లో నల్లకుంట పోలీస్స్టేషన్ను వేలాది మందితో ముట్టడించారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నల్లకుంట, ముషీరాబాద్ ప్రాంతాలలో కర్ఫ్యూ కూడా విధించారు. ఈ ఘటనతోనే నాయిని వెలుగులోకి వచ్చారు. -
నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
-
నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
ముషీరాబాద్ (హైదరాబాద్): రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆసుపత్రికి వెళ్లి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. నాయినికి భార్య అహల్య, కుమారుడు దేవేందర్రెడ్డి, కూతురు సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు వి.శ్రీనివాస్రెడ్డి రాంనగర్ డివిజన్ కార్పొరేటర్. నాయినికి నలుగురు మనవళ్లు. భోళామనిషి: సోషలిస్టు జీవితం.. సాదాసీదా మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే భోళాతనం.. నాయిని నర్సింహారెడ్డి సొంతం. సోషలిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అందరికీ అందుబాటులో ఉండే కార్మికనేతగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసిన నాయిని రాష్ట్ర రాజకీయాల్లో జెయింట్ కిల్లర్గా అప్పట్లో సంచలనం సృష్టించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒకవైపు ఇందిరా కాంగ్రెస్ నుంచి అప్పటి కార్మిక మంత్రి టి.అంజయ్య, మరోవైపు రెడ్డి కాంగ్రెస్ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డిలతో ఆయన ఢీ కొన్నారు. ఆ ఇద్దరినీ ఓడించారు. 2,167 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించి జెయింట్ కిల్లర్గా ఖ్యాతిపొందారు. 1985లో రెండోసారి, 2004లో మూడోసారి అదేస్థానం నుంచి గెలుపొందారు. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా సేవలందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ నుంచి టీఆర్ఎస్ వైదొలగిన సమయంలో అమెరికాలో ఉన్న నాయిని అక్కడి నుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు పంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన నిబద్ధతను చాటుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై హోంమంత్రిగా, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాయిని కీలకపాత్ర పోషించారు. సోషలిస్టు పార్టీ నుంచి ప్రస్థానం.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామానికి చెందిన నాయిని నర్సింహారెడ్డి ఫిబ్రవరి 12, 1940లో జన్మించారు. హెచ్ఎస్సీ వరకు చదువుకున్నారు. మొదటి నుంచే చురుకైన విద్యార్థిగా ఉంటూ వచ్చిన నాయిని ఆ ప్రాంతంలో జరిగే ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొంటుండేవారు. ఈ క్రమంలోనే 1958 జనవరి 26వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ పార్టీ సమావేశం నాగార్జున సాగర్లో జరగగా దానికి సోషలిస్టు నాయకుడు బద్రి విశాల్ పిత్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా స్థానిక నాయకుడు పాశం రుక్మారెడ్డితో సోషలిస్టు పార్టీ కార్యాలయంలో నమ్మకంగా పని చేయడానికి, చురుకైన ఓ కార్యకర్త కావాలని కోరగా అప్పుడు నాయిని నర్సింహారెడ్డి పేరును రుక్మారెడ్డి సూచించారు. దీంతో నాయిని ఆఫీసు కార్యదర్శిగా పని చేయడానికి 1962లో మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో ఆఫీసు బాధ్యతలతోపాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. కార్మిక నాయకుడిగా ఎదిగిన వైనం... సోషలిస్టు పార్టీ జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పదోన్నతి పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ట్రేడ్ యూనియన్ లీడర్గా మారి కార్మిక సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. మొదట హమాలీ, తోపుడు బండ్ల కార్మికుల సమస్యలపై ఉద్యమించారు. నగరంలో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించారు. కార్మిక నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకమైన వీఎస్టీ, ఐడీఎల్, హెచ్ఎంటీ, గంగప్ప కేబుల్స్, మోడ్రన్ బేకరి వంటి కంపెనీల్లో కార్మికనేతగా గెలుపొందడంతోపాటు సికింద్రాబాద్ హాకర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్లకు అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఈ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీలో నాయిని నర్సింహారెడ్డిని అరెస్టు చేసి ముషీరాబాద్ జైల్లో 18 నెలల పాటు నిర్బంధించారు. ఎమర్జెన్సీ మొత్తంకాలం నాయిని జైల్లోనే గడిపారు. మినిస్టర్ క్వార్టర్స్కు నాయిని పార్థివదేహం తరలించారు. పార్టీశ్రేణుల సందర్శనార్థం మినిస్టర్ క్వార్టర్స్లో నాయిని భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలు జరుగుతాయి. ప్రముఖుల సంతాపం: నాయిని మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సీఎస్ను ఆదేశించారు. నాయిని నర్సింహారెడ్డి మరణం తీరని లోటు మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాయిని పాత్ర మరువలేనిది గుర్తుచేశారు. నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. నాయిని మృతిపట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం తెలిపారు. గురువారం అధికార లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలు జరుగుతాయి. నాయిని మృతి పట్ల మంత్రి మహమూద్ అలీ సంతాపం తెలిపారు. నాయిని మృతిపట్ల మంత్రి నిరంజన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణం పార్టీకి, తెలంగాణకు తీరని లోటన్నారు. నాయిని కుటుంబ సభ్యులకు నిరంజన్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన సీఎం కేసీఆర్
-
నాయినిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న నాయినిని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాయిని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. సీఎం వెంట రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. (చదవండి : నాయిని ఆరోగ్యం విషమం ) కాగా, గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని ఇటీవల కోలుకొని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్ పడిపోవడంతో ఈ నెల 13న తిరిగి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
నాయిని ఆరోగ్యం విషమం
ముషీరాబాద్: రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారు.. అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో నాయిని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్, మరో డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భార్య, అల్లుడు, మనుమడికి కరోనా.. ఇదిలా ఉండగా నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ఆమె కూడా బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. అలాగే నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఎలా సోకింది..? లాక్డౌన్తోపాటు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఇంటికే పరిమితమైన నాయిని నరసింహారెడ్డి ఇటీవల ముషీరాబాద్లో జరిగిన కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని అభిమానులు అందించిన కేక్ను తిన్నారు. అలాగే ఓ మతపెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. దానికి తోడు ఓ మతపెద్ద సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఎక్కడో నాయినికి కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
‘మల్లారెడ్డి కార్మిక మంత్రిగా ఉండటం మన ఖర్మ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉండటం మన కర్మ అని, ప్రజలు చేసుకున్న పాపం అని ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. సోమవారం సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్) డైరీ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల పక్షాన ఉండాల్సిన మంత్రి మల్లారెడ్డి యాజమాన్యాలకు సహకరించి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పనికిరాని కార్మిక మంత్రిని చూస్తే జాలివేస్తుందన్నారు. నేడు రాష్ట్రంలో కార్మికులు సమ్మెచేసే పరిస్థితి లేదని వాపోయారు. జగన్ నిర్ణయం సరైనదే..: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొనగాడు అని నాయిని కితాబు ఇచ్చారు. జగన్ ప్రైవేట్ రంగంలో లోకల్ వారికి 75 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని, ఇక్కడ కూడా అది అమలు చేయాలని కోరారు. 3 రాజధానుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఆయన తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. టీడీపీ బినామిలే అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని విమర్శించారు. -
అలిగి అసెంబ్లీకి రాని మైనంపల్లి..
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతర పదవుల్లోనూ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీఆర్ఎస్ గ్రేటర్ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి సోమవారం బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కగా... మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మనస్తాపంతో శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా బెంగళూర్ వెళ్లారు. శాసనసభ ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, ఎమ్మెల్సీగానే ఉంటే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని నాయిని తెలిపారు. కానీ తాజా మంత్రివర్గంలో తనను పక్కకు పెట్టడం, ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లను కాదని, ఇతరులకు పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మనోగతాన్ని వెల్లడించేందుకు సీఎంను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ మనస్తాపం చెందారు. ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కేబినెట్ విస్తరణకు ముందు కేటీఆర్ను కలిసి తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సరైన గుర్తింపునిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని.. తీరా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని మైనంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ముఖ్య పదవుల భర్తీలోనూ తన ప్రాధాన్యతను గుర్తించడం లేదని ఆయన ఆదివారమే బెంగళూర్ వెళ్లారు. గ్రేటర్లో పార్టీ కోసం కష్టపడే మైనంపల్లికి కనీస గుర్తింపు ఇవ్వకుండా అవమానాలకు గురిచేయడం సమంజసం కాదంటూ ఆయన సన్నిహితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆవేదనకు సమాధానం చెప్పలేకే మైనంపల్లి బెంగళూర్ వెళ్లారని ఆయన సన్నిహితుడొకరు ‘సాక్షి’కి చెప్పారు. -
కేసీఆర్ మాట తప్పారు: నాయిని
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకుల్లో ఉన్న అసంతృప్తి మెల్లిగా బయటపడుతోంది. ఇప్పటికే మంత్రి ఈటల, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్లు తమ మనసులోని అసంతృప్తిని బహిరంగ వేదికల మీద వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి చేరారు. కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని నాయిని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే నాయిని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో నాయిని మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నాను. కానీ కేసీఆర్, వద్దు కౌన్సిల్లో ఉండు మంత్రి పదవి ఇస్తా అన్నాడని తెలిపారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి పదవి ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పుడేమో ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తానంటున్నారని నాయిని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చైర్మన్ పదవి వద్దని.. అందులో రసం లేదంటూ నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మా ఇంటికి పెద్ద.. మేమంతా ఓనర్లమే అని స్పష్టం చేశారు. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమన్నారు నాయిని. -
‘జైపాల్, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిచెందినట్లు తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైపాల్తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ నేతలు భావోద్వేగానికి గురయ్యారు. జైపాల్రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి సంతాపం తెలిపారు. రాజకీయ జీవితంతో మచ్చలేని నాయకుడిగా జైపాల్ ఎదిగారని కొనియాడారు. ఇద్దరం కలిసి దేవరకొండ హైస్కూల్లో కలిసి చదుకున్నామని, ఒకేసారి ఎమ్మెల్యేలుగా శాసనసభకు వెళ్లామని గుర్తు చేశారు. జైపాల్ మరణం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన నా రాజకీయ గురువు జైపాల్రెడ్డి మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి వల్లే తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానన్నారు. విద్యార్థి దశ నుంచే తనను ప్రొత్సహించారని, ఆయనే తన రాజకీయ గురువు అని పేర్కొన్నారు. ఆయన వల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరనన్నారు. ఏ పార్టీలో ఉన్న ఆయనతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించానన్నారు. నిజమాబాద్కు మంచినీటి, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులకోసం మొదట 100 కోట్లు ఇచ్చింది జైపాల్ రెడ్డినేనని గుర్తుచేశారు. ఆయన మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతికి తెలిపారు. జైపాల్ రెడ్డికి ఘాట్ ఏర్పాటు చేయాలి : ఉత్తమ్ జైపాల్రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. జైపాల్రెడ్డికి ఘాట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేపు అంతిమ యాత్ర ఆయన ఇంటి నంచి ఉంటుందన్నారు. నెక్లెస్ రోడ్లో దహనకార్యక్రమాలు చేసుకోవడానికి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. -
కార్మికులకు టీఆర్ఎస్ అండగా ఉంటుంది - నాయిని నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కార్మికులకు టీఆర్ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం బీమా సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. తెలంగాణభవన్లో జరిగిన నిర్మాణ కార్మికుల ఆశీర్వాదసభలో నాయిని ప్రసంగించారు. ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంది. పేద ఇంటి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేసి ఆ వర్గాలకు బాసటగా నిలుస్తున్నాం. రాహుల్ గాంధీ, చంద్రబాబు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేసి కాంగ్రెస్ 1,200 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మన ప్రాజెక్టులను అడ్డుకోవటానికి చంద్రబాబు లేఖలు రాశాడు. ప్రజాకూటమిని తరిమి కొట్టి టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలి’అని ఆయన వ్యాఖ్యానించారు. -
ఆ సీటు ఎటు?
సాక్షి,సిటీబ్యూరో: రెండు నెలలుగా నగర రాజకీయాల్లో హాట్ టాపిక్గా నలుగుతున్న ముషీరాబాద్ స్థానాన్ని టీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి కేటాయిస్తుందన్నది శనివారం తేలనుంది. వాస్తవానికి సెప్టెంబర్ 6వ తేదీనే ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించాలని భావించినా, నాయిని నర్సింహారెడ్డి అభ్యంతరాలతో ప్రకటన నిలిచిపోయింది. ‘ముషీరాబాద్తో నలభై ఏళ్ల అనుబంధం నాది. ఈ ఎన్నికల్లో నేను సూచిస్తున్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలి. అతడికి ఇవ్వడం కుదరకపోతే స్వయంగా నేనే మళ్లీ పోటీ చేస్తా’ అని గతంలోనే హోంమంత్రి నాయినిప్రకటించారు. అనంతరం ముషీరాబాద్ స్థానాన్ని తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాల్సిందేనంటూ పలు సందర్భాల్లో నాయిని ప్రకటిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో సీఎం తనకు సమయం ఇవ్వడం లేదని కూడా వాపోయారు. నగరంలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, మరో వైపు నామినేషన్ల దాఖలు గడువు ముంచుకొస్తుండడంతో శనివారం అభ్యర్థిని తేల్చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. ముషీరాబాద్ స్థానాన్ని తన అల్లుడికి ఇవ్వడం కుదరకపోతే తానే పోటీ చేయాలన్న నిర్ణయంతోనే నాయిని నర్సింహారెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ సీటును మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ముఠా గోపాల్కే ఇచ్చేందుకు సీఎం ఉన్నట్టు సమాచారం. శనివారం సీఎం కేసీఆర్తో నాయిని భేటీకానున్నారు. ఈ చర్చల్లో నాయిని కోరికకు అనుగుణంగా టీఆర్ఎస్ అధినేత గ్రీన్సిగ్నల్ ఇస్తారా..?, లేక సామాజిక సమీకరణల్లో భాగంగా ఇప్పటికే నిర్ణయించినట్టు ముఠా గోపాల్కే ఓకే చెబుతారా..? అన్నది తేలాల్సి ఉంది. ప్రజా కూటమిలోనూ.. ఆ ఒక్కటి నగరంలోని ఒక్క సీటు అంశం ప్రజా కూటమిలోనూ గందరగోళం రేపుతోంది. సనత్నగర్ స్థానాన్ని టీడీపీ బలంగా కోరుకుంటుండగా దానికి బదులు సికింద్రాబాద్ ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. సనత్నగర్లో టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేష్గౌడ్ను పోటీ చేయించే లక్ష్యంతో పార్టీ నేతలు పావులు కదపగా, సనత్నగర్లో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేక నిర్ణయాన్ని పార్టీ అధినేతరాహుల్గాంధీకి వదిలేసింది. అయితే, ఈ స్థానం నుంచి మళ్లీ మర్రి శశిధర్రెడ్డియే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఢిల్లీలో గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి. దీంతో ఈ నియోజకవర్గాన్ని అధికారికంగా ప్రకటించేంత వరకుఉత్కంఠే కొనసాగనుంది. -
పది కోట్లు కాదు..10 లక్షలే : నాయిని
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచిస్తూ కేసీఆర్ రూ.5 లక్షలో, రూ.10 లక్షలో ఇస్తానన్నారని, కానీ తాను లక్షలు అనబోయి పొరపాటున రూ.10 కోట్లు అన్నానని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వివరణ ఇచ్చారు. ముషీరాబాద్ టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ వచ్చినా రాకపోయినా కేసీఆరే తమ నాయకుడని, ఆయన ఆదేశాలను శిరసావహిస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నాయిని మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు షోలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ ముందు అభ్యర్థుల్ని ప్రకటించాలన్నారు. అసెంబ్లీ రద్దుపై డీకే అరుణ కోర్టుకెళ్లారని.. అసెంబ్లీ రద్దు అధికారం కేబినెట్కు ఉంటుందన్న విషయం మంత్రి పదవి వెలగబెట్టిన ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. దీనిపై కోర్టు సరైన తీర్పునిచ్చిందన్నారు. ఓటరు జాబితా బాగోలేదంటూ శశిధర్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, చివరకు కోర్టు కూడా ఎన్నికల కమిషన్ అధికారాలను ప్రశ్నించలేదన్నారు. దమ్ముంటే శశిధర్ రెడ్డి తలసానిపై పోటీచేసి గెలవాలని సవాలు విసిరారు. సాగునీటి ప్రాజెక్టులపై కోర్టుకెళ్లి అడ్డుపడుతున్న కాంగ్రెస్కు కోదండరాం, కమ్యూనిస్టు పార్టీల నేతలు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని, బాబు జోలికి మేము వెళ్లకున్నా ఆయనే మా జోలికి వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ఉనికే లేదన్నారు. కాంగ్రెస్లో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదని, తన రాజకీయ జీవితమంతా ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉందని స్పష్టం చేశారు. ముషీరాబాద్ నుంచి తన అల్లుడు స్వతంత్రంగా పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. -
‘నాయినికి ఇంతటి అవమానమా’
సాక్షి, హైదరాబాద్ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉద్యమకారుడు, నీతి నిజాయితీ అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ నియోజకవర్గానికి 10కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఖర్చుని భరిస్తానని కేసీఆర్ నాయినికి హామినిచ్చిన విషయాన్ని స్వయంగా ఆయనే గురువారం మీడియాకు వెల్లడించారని అన్నారు. ముషీరాబాద్ సీటును అల్లుడికి ఆశించిన నాయినికి కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్ను వెన్నంటి ఉన్న నాయినికి నెలరోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అది అవమానం కాదా...? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఎల్బీనగర్లో పోటీ చేస్తే 10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని నాయిని పత్రికాముఖంగా చెప్పారనీ, దీన్ని సుమోటాగా తీసుకుని ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలన్నారు. ఈడీ దాడులు మోడీ, కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. -
సమాధానం చెప్పలేకపోతున్నా!
సాక్షి,హైదరాబాద్: ‘యాడికి పోయినా పార్టీ కార్యకర్తలు, శ్రేయోభి లాషులు, బంధువులు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నరు. నువ్వుండగా ముషీరాబాద్ టికెట్ పెండింగ్ల ఎందుకున్నది? సీఎంకు నువ్వు బాగా దగ్గరటగద అని అడుగుతున్నరు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నా. చాలా బాధ అయితున్నది. అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కూడా బాగా అప్సెట్ అయిండు’అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి కోసం ముషీరాబాద్ టికెట్ ఆశించినా.. ఇప్పటివరకూ ప్రకటించకపోవడంపై ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. గురువారం చిక్కడపల్లిలోని ఓ జిమ్ ప్రారంభానికి అల్లుడి తో కలిసి వచ్చిన నాయిని.. ముషీరాబాద్ టికెట్ విషయంలో మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ 105 సీట్లు ప్రకటించి నెల రోజులైంది. అందులో ముషీరాబాద్ ఎందుకు ఆపారని చర్చ జరుగుతుంది. అమావాస్య తర్వాత ఆపిన 14 సీట్లు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అమావాస్య కూడా అయిపోయింది. ముషీరాబాద్ టికెట్ గురించి నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను’అని నాయిని పేర్కొన్నారు. కేసీఆర్ ఎప్పుడో మాటిచ్చారు ‘ముషీరాబాద్ గురించి ఆర్గనైజ్ చేసుకోమని సీఎం చాలా రోజుల క్రితమే నాకు చెప్పాడు. ఆయన మాట మీద విశ్వాసంతో.. అల్లుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతూ కార్యకర్తలను సమీకరించాడు. ఇప్పటికిప్పుడు శ్రీనివాస్ రెడ్డి పిలిస్తే 1000 మంది వచ్చే నెట్వర్క్ తయారైంది. అందుకే సీఎంను కలవడానికి ప్రయత్నిస్తున్నాను’అని నాయిని తెలిపారు. కేసీఆర్ కూడా ‘నర్సన్నకు చెప్పు.. ఆయనతో మాట్లాడాకే ముషీరాబాద్ టికెట్ డిక్లేర్ చేస్తా. తొందరపడొద్దు’అని కేటీఆర్ ద్వారా చెప్పించారన్నారు. ఆ తర్వాత రెండుసార్లు కలిసినా.. కేటీఆర్ ఇదే విషయాన్ని చెప్పారన్నారు. ఈమధ్య పేపర్లు, టీవీల్లో వచ్చే వార్తల్లోనూ తమ పేర్లు కనిపించడం లేదని వాపోయారు. ‘ఈరోజే కాదు.. నాలుగైదురోజుల తర్వాత పేర్లు ప్రకటించినా ఇబ్బందిలేదు. శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తే సంతోషమే. లేకుంటే నేనే పోటీ చేస్తానని చెప్పాను. ముషీరాబాద్ నియోజకవర్గంలో 1978 నుంచి ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తున్నా. నా కార్యకర్తలు చాలా మంది బాధపడుతున్నారు. మీరు రండి గెలిపిస్తామంటూ అహ్వానిస్తున్నారు’అని నాయిని పేర్కొన్నారు. అప్పుడు ఎల్బీ నగర్ నుంచి.. 2014లో నేను ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే ‘వద్దు నర్సన్నా నిను గతంలో ఓడగొట్టారు. నువ్వు ఈసారి ఎల్బీ నగర్ నుంచి పోటీచెయ్. సర్వేలో స్థానిక నాయకులకంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి’అని కేసీఆర్ అన్నారని నాయిని గుర్తుచేశారు. దానికి సమయం 15 రోజులే ఉంది బాగా డబ్బున్న సుధీర్ రెడ్డి మీద కోట్లాడేంత డబ్బు నా దగ్గర లేదంటే ‘నీ తమ్ముడిని నేనున్నా రూ.10 కోట్లు ఇస్తా పోటీచెయ్’అన్నాడన్నారు. ఎల్బీ నగర్లో పోటీకి విముఖత చూపడంతో.. ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లో చోటిచ్చాడని నాయిని చెప్పారు. ‘ఇప్పటికైనా కేసీఆర్ నాకు అనుకూ లంగానే నిర్ణయం తీసుకుంటారనే నమ్మక ముంది. మా ఇద్దరిలో (మామా అల్లుళ్లలో) ఎవరికి అవకాశం ఇచ్చినా.. భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. మంగళవారం కేటీఆర్ను కలిసి కూడా ఇదే విషయం చెప్పాను. సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాను. మరో రెండేళ్లపాటు నా ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది. దీన్ని ముషీరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వ్యక్తికి ఇచ్చి.. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది’అని ఆయన అన్నారు. అయితే, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని.. మామా అల్లుళ్లు కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నాయిని -
బాబుకు ఏపీలో ఓటమి ఖాయం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో టీడీపీ ఓడిపోవడం ఖాయమైపోయిందనే ఉద్దేశంతోనే ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు మకాం మార్చాలనుకుంటున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తెలంగాణలో నలుగురైదుగురు తన చెంచాలను గెలిపించుకోవాల ని భావిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలతో ఏర్పడే మహాకూటమి ఆ పార్టీలకే మహాగూటమిలా మారుతుం దని అన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలసి తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల తేదీలు రావడంతో కాంగ్రెస్కు ఆశాభంగమైంది. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్ని కలు రావని కాంగ్రెస్ ఆశ పడింది. కాంగ్రెస్ ఇంకా కోర్టులపై ఆశ పెట్టుకున్నట్లుంది. కాంగ్రెస్కు చేతనైతే ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లాలికానీ కోర్టుల చుట్టూ తిరగడమేంటీ? మర్రి శశిధర్రెడ్డికి దమ్ముంటే తలసాని శ్రీనివాస్పై గెలవాలి. కాంగ్రెస్కు దమ్ముంటే పొత్తుల్లేకుండా మాతో నేరుగా తలపడాలి. ఉత్తమ్ పెద్ద బట్టేబాజ్. సీఎం పదవికి గౌరవం ఇవ్వకుండా కేసీఆర్ను బట్టే బాజ్ అంటారా? 14 ఏళ్లు శాంతియుతంగా ఆందోళన చేసిన కేసీఆర్ రాష్ట్రానికి ఏం అన్యాయం చేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు’ అని ప్రశ్నించారు. ఉత్తమ్ మా ఇంటికొచ్చారు: నర్సారెడ్డి కాంగ్రెస్లో చేరుతారని జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే, రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి ఖండించారు. ‘4 నెలల కింద రోడ్డుప్రమాదంలో గాయపడ్డాను. ఇటీవలే కోలుకున్నాను. చాలా మంది నేతలు నన్ను పరామర్శించేందుకు నా ఇంటికి వచ్చిపోతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, మరికొందరు నేతలు ఆదివారం మా ఇంటి కి వచ్చి పరామర్శించారు. ఎలాంటి రాజకీయాల చర్చలు జరగలేదు’ అని ఓ ప్రకటనలో తెలిపారు. -
మర్రి శశిధర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన నాయిని
-
పథకాల అమలులో మనమే నంబర్వన్
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి అన్నారు. దేవరకొండలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి పథకాలు ఆగిపోతాయన్నారు. అదే విధంగా నల్లగొండలో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈనెల 4న జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభా ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. దేవరకొండ (నల్లగొండ రూరల్): దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్గా నిలిచిందని మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దేవరకొండలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలతో పాటు లేని హామీలను సైతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కొనే శక్తి లేదని, మహాకూటమి పేరుతో ప్రజలను మభ్యపెట్టేం దుకు వస్తున్నారని, ప్రజలు గమనించా లన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారడానికి కారణం కాంగ్రెస్ పార్టీ్టయేనని, ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపివేయాలని కేసులు వేస్తూ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్లు మాట్లాడుతూ రాను న్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజా ర్టీతో గెలిపించి దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అం తకుముందు భారీ ర్యాలీగా సమావేశ ప్రాంతానికి చేరుకున్న మంత్రులకు టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్, మార్కెట్ చైర్మన్ బండారు బాలనర్సింహ, తేర గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్గౌడ్, నల్లగాసు జాన్యాదవ్, గాజుల ఆంజనేయులు, నేనావత్ రాంబాబు, హన్మంతు వెంకటేశ్గౌడ్, పున్న వెంకటేశ్, ముత్యాల సర్వయ్య, ముక్కమల వెంకటయ్య, ఏడ్పుల గోవిందు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలి నల్లగొండ రూరల్ : రాష్టానికి పట్టిన శని పోవాలంటే ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి జగదీశ్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం టీఆర్ఎస్ నల్లగొండ మండల కమిటీ సర్వసభ్య సమావేశం బైపాస్లోని ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. 60ఏళ్లు రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు రాష్టాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. జిల్లా తలాపున కృష్ణానది పారుతున్నా సాగునీరు లేదు..కనీసం తాగునీరు అందివ్వకపోగా రోగాలను, ఫ్లోరోసిస్ అందించారని, పైగా జిల్లానే ఎడారిగా మార్చారని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు. రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ నల్లగొండకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శని అన్నారు. పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేసి చూపిస్తా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈసమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడకిషన్ రెడ్డి, పార్టి మండల, పట్టణ అధ్యక్షుడు బకరం వెకంన్న, అబ్బగోని రమేష్గౌడ్, ఐసీడీఎస్ కోఆర్డినేటర్ శరణ్యరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రేఖల భద్రాద్రి, మార్కెట్ చైర్మన్ ఖరీంపాష, ఎంపీపీ దైద రజితా వెంకట్రెడ్డి, బక్కపిచ్చయ్య, కట్టశ్రీను, జిల్లా శంకర్, దేపవెంకట్ రెడ్డి, రాజ్పేట మల్లేష్గౌడ్, గాదె రాంరెడ్డి, కె.సత్యనారాయణ, బోయపల్లి కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి, బడుపుల శంకర్, అండాలు గట్టయ్య పాల్గొన్నారు. సీఎం సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి నల్లగొండ రూరల్ : ఈనెల 4న నల్లగొండ బైపాస్లోని ఎంఎన్ఆర్ గార్డెన్ వద్ద నిర్వహించే సీఎం కేసీఆర్ ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. కొంగరకలాన్ సభకు వెళ్లలేని వారంతా సీఎం సభకు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమావేశాలను చూస్తుంటే ఎన్జీ కాలేజి స్థలం సరిపోదని బైపాస్కు మార్చినట్లు తెలిపారు. -
ఉద్యమంలో ఉత్తమ్ ఆచూకీ లేదు: నాయిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విలీనం, విమోచనం గురించి మాట్లాడే అర్హత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉత్తమ్ ఆచూకీ లేదని.. ఉద్యమంలో ఆయన ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. హైదరాబాద్ సంస్థాన విలీన దినం సందర్భంగా తెలంగాణ భవన్లో నాయిని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపడం లేదని అమిత్ షా ప్రశ్నించారు. కిషన్రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయలేక పారిపోయారు. అమిత్ షా తెలం గాణలో గెలుస్తాం అని షో చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు అమిత్ షాకు తప్పుడు సమాచారం ఇచ్చి మాట్లాడించారు. నోట్ల రద్దు, జీఎస్టీ సమయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. మాది సెక్యులర్ పార్టీ. మైనార్టీల పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాం. తెలంగాణ ఇవ్వొద్దని కాంగ్రెస్ వాళ్లు నిజాం కాలేజీలో సభ పెట్టారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ద్రోహులు. మిగతా పార్టీలు మహాకూటమితో ప్రజల వద్దకు వెళ్తామంటున్నాయి. వారు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు వంద సీట్లు రావడం ఖాయం. చంద్రబాబు తెలంగాణ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నారు. టీడీపీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలపడాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించరు. అభివృద్ధి విషయంలో తెలంగాణ, దేశంలోనే ముందు ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అది కొనసాగుతుంది’ అని అన్నారు. -
సీఎం మాటిచ్చారు.. టికెట్ మాకే
హైదరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గం నుండి టికెట్ను మాకే కేటాయిస్తారని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం బాగ్లింగంపల్లిలోని సాయిబాబా ఆలయం వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాబా ఆలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తనకు గానీ, తన అల్లుడు కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డికి పార్టీ తరపున టికెట్ కేటాయిస్తున్నట్లు సీఎం నుండి స్పష్టమైన హామీ లభించిందన్నారు. ఇక్కడి టికెట్ను అడగడంలో న్యాయం, హక్కు రెండూ ఉన్నాయన్నారు. తొలిదశ 105 టికెట్ల పంపిణీలో తమకు ముందువరుసలో రావాల్సినప్పటికీ జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. నాయకులు ప్రకాష్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ధర్మరాజు గౌడ్, పాశం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ్ మళ్లీ గెలవడు: నాయిని
సాక్షి, హైదరాబాద్: ఈ సారి ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి గెలవడని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఉత్తమ్ మంత్రిగా ఉన్నప్పుడు గృహనిర్మాణ శాఖలో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. శుక్రవారం ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ టీడీపీ నేతలు ఆ పార్టీని కాంగ్రెస్కు తాకట్టు పెట్టి.. ఎన్టీఆర్ ఆత్మకు క్షోభ కలిగిస్తున్నారు. సీపీఐ, సీపీఎం వారి సిద్ధాంతాలను పక్కన పెట్టేశాయి. ఎన్నికలు వస్తుండటంతో కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోంది. టీఆర్ఎస్ను ఓడించేందుకు కూటములు కడుతున్నారు. కాకమ్మ కథలకు కల్లబొల్లి మాటలకు ఓట్లు పడవు. జగ్గారెడ్డిపై కేసు 2004 నాటిది. ఆయన మీద కేసు ఉన్నందు వల్లే కాంగ్రెస్లో చేరారు. అప్పుడు కాంగ్రెస్ ఆ కేసును తొక్కి పెట్టింది. రాజకీయ కక్షే ఉంటే హౌసింగ్ కుంభకోణంలో ఉత్తమ్ను అరెస్టు చేయించే వాళ్లం. ఉత్తమ్ బట్టేబాజ్.. అడ్రస్ లేనోడు.. మళ్లీ గెలవడు. కేసీఆర్ను జైళ్లో పెడతా అంటవా.. ఎన్నికలయ్యాక లోపలుంటావో, బయట ఉంటావో తేల్చుకో’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయటానికి రషీద్ అనే బ్రోకర్తో కేసీఆర్, హరీశ్ పేర్లు పెట్టించారని, ఆధారాలుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ సొసైటీ కేసులో రేవంత్కు నోటీసులిస్తే రాజకీయ కక్ష అంటున్నారని మండిపడ్డారు. -
మహోన్నత వ్యక్తి.. కాళోజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 104వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్కు కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2018వ సంవత్సరానికి గానూ ఆయన ఈ పురస్కారాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కాళోజీ అని, జీవితాంతం పేదవాడి పక్షాన నిలిచిన ప్రజాకవి అని కొనియాడారు. జీవన సారాంశాన్ని రెండు మాటల్లో చెప్పిన మహోన్నత వ్యక్తి కాళోజీ అన్నారు. ప్రభుత్వ పురస్కారాలు పొందగానే కొందరిలో మార్పు వస్తుందని.. పద్మవిభూషణ్ వంటి ప్రఖ్యాత పురస్కారం పొందినప్పటికీ కాళోజీలో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణ కవులను విస్మరించాయని విమర్శించారు. కాళోజీ కవితలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళోజీ మార్గదర్శిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడారు. కాళోజీ నారాయణరావు, ఆయన సోదరుడు రామేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వరంగల్లో మిత్రమండలి స్థాపించిన కాళోజీ సోదరులు ఎంతో సాహితీ సేవ చేశారన్నారు. కాళోజీది మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. గాంధీజీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పిన ‘ఇలాంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడియాడారంటే భవిష్యత్ తరాలు విశ్వసించవు’ అన్న వ్యాఖ్యలు.. కాళోజీకి సరిగ్గా సరిపోతాయన్నారు. తన తొలి నవల అంపశయ్య రాతప్రతిని చదివి కాళోజీ తనను అభినందించిన విషయాన్ని నవీన్ గుర్తు చేసుకున్నారు. కాళోజీ పురస్కారం లభించాలన్న తన కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, సంగీత నాటక అకాడమీ అ«ధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి దేవులపల్లి ప్రభాకర్లతో పాటు పలువురు కాళోజీ అభిమానులు పాల్గొన్నారు. -
గోల షురూ!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థులపై అసమ్మతి భగ్గుమంటోంది. ఎక్కడికక్కడ విభేదాలు రచ్చకెక్కెతున్నాయి. ముషీరాబాద్ సీటు విషయంలో చిక్కుముడి అలాగే ఉండగా...తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అవసరమైతే తానే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ను ఫోన్లో సంప్రదించగా...చర్చిద్దామని సూచించినట్లు సమాచారం. ఇక కొన్నిచోట్ల అదే పార్టీకార్పొరేటర్లు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. కూకట్పల్లిలో బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్య భర్త హరీష్రెడ్డి, శేరిలింగంపల్లిలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్లు శుక్రవారం పార్టీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్లో నియోకజవర్గ ఇన్చార్జి కొలను హన్మంతరెడ్డి, జూబ్లీహిల్స్లో మురళీగౌడ్ (2014లో టీఆర్ఎస్అభ్యర్థి)లు సైతం పోటీకి సిద్ధమని ప్రకటించారు. కూకట్పల్లి నియోకవర్గంలో హరీష్రెడ్డితో పాటు గొట్టిముక్కల పద్మారావు, వెంకటేశ్వరరావులు సైతం తాజా మాజీ ఎమ్మెల్యే కృష్ణారావు అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయానికి వచ్చారు. వీరిలో హరీష్రెడ్డి ఏకంగా స్వతంత్య్ర అభ్యర్థిగా తానే పోటీ చేస్తానన్న ప్రకటన కూడా విడుదల చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సైతం తాజా మాజీ ఎమ్మెల్యే గాంధీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్కే చెందిన మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ అనుచరులతో శుక్రవారం సమావేశం నిర్వహించి, వారం రోజుల్లో అభ్యర్థిని మార్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. జగదీశ్వర్గౌడ్ సతీమణి పూజిత హఫీజ్పేట కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. ఇక కుత్బుల్లాపూర్లో నియోకవర్గ ఇన్చార్జి కొలను హన్మంతరెడ్డి తాను పోటీ చేయటం ఖాయమని శుక్రవారం ప్రకటించారు. మల్కాజిగిరి, మేడ్చల్లో హైడ్రామా మల్కాజిగిరి, మేడ్చల్ శాసనసభ స్థానాల విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. మల్కాజిగిరి సీటును తొలుత తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతికి ఖరారు చేశారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు సహా ఐదుగురు కార్పొరేటర్లు అభ్యంతరం తెలపటంతో అధికారిక ప్రకటనను వాయిదా వేశారు. తనకే టికెట్ ఇవ్వాలని మైనంపల్లి పట్టుపడుతుండగా,సీఎం కేసీఆర్ మాత్రం చింతల కనకారెడ్డి కుటుంబానికి ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల కథనం. సీటు కనకారెడ్డికా లేదా ఆయన కోడలుకా అన్న విషయాన్ని తేల్చే బాధ్యతను ఆయన సమీప బంధువు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్కు అప్పగించారు. మేడ్చల్ నియోకజవర్గంలోనూ సస్పెన్స్ సాగుతోంది. ఎంపీ మల్లారెడ్డి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుండటంతో ఆయన వైపే సీఎం మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సైతం రెండవ జాబితాలో తన పేరు ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ముషీరాబాద్ కిరికిరి.. నగర రాజకీయాల్లో కీలక స్థానమైన ముషీరాబాద్ అభ్యర్థిత్వం టీఆర్ఎస్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ స్థానాన్ని తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని కోరుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అది సాధ్యపడక పోతే తానే పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. ఈ స్థానం నుండి 2014లో ముఠా గోపాల్ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ చేతిలో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే అవకాశం ఇవ్వాలని గోపాల్ కోరుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని కోరేందుకు గోపాల్ శుక్రవారం హుస్నాబాద్ వెళ్లి బహిరంగసభ వద్ద సీఎంను కలిసే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై హోంమంత్రి నాయిని ముఖ్యమంత్రిని ఫోన్లో సంప్రదించగా శనివారం రావాలని, చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం. -
నాయిని నారాజ్!
సాక్షి,సిటీబ్యూరో: తాను సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం ప్రకటించిన టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ముషీరాబాద్ స్థానం నుంచి తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి సైతం దూరంగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఆ జాబితాలో ముషీరాబాద్ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముఠా గోపాల్ పేరు ఉందన్న సమాచారంతో నాయిని అలిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరు కాలేదన్న ప్రచారం జరిగింది. దీంతో చివరి నిమిషంలో ముషీరాబాద్ అభ్యర్థి ప్రకటనను వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయమై హోంమంత్రిని ‘సాక్షి’ ప్రతినిధి అడగ్గా.. కేబినెట్ సమావేశంలో తాను పాల్గొనడం వల్లే, కేసీఆర్ విలేకరుల సమావేశానికి వెళ్లలేదని, ‘అయినా ముషీరాబాద్ టికెట్ శ్రీనివాసరెడ్డికి ఎందుకు రాదు... తప్పకుండా వస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పద్మారావు ‘పాంచ్’ పటాకా.. 2004లో తొలిసారి శాసనసభకు పోటీ చేసిన మంత్రి పద్మారావు.. రెండు విజయాలు, రెండు ఓటములు తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఐదోసారి పోటీకి సిద్ధమయ్యారు. 2004, 2014లో విజయం సాధించిన ఈయన.. 2008 ఉప ఎన్నికల్లో తలసాని చేతిలో, 2009లో (సనత్నగర్) మర్రి శశిధర్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తలసాని ‘ఆరోసారి’.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తొలిసారి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్నారు. 1995లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన తలసాని, 1999, 2008, 2014లలో విజయం సాధించారు. 2004, 2009లో ఓటమి పాలయ్యారు. ముందస్తు ఎన్నికల్లో ఆరోసారి శాసనసభకు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాయన్నా.. ఆరోసారే.. కంటోన్మెంట్ నియోకజవర్గంలో 1994 నుంచి వరసగా పోటీ చేసి నాలుగుసార్లు సాయన్న విజయం సాధించారు. 2009లో శంకర్రావు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.. టీఆర్ఎస్ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేస్తున్న సాయన్న.. శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవడం ఇది ఆరోసారి. గతంలో ఓడిన వారికి మరో ఛాన్స్ 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలైన ముద్దగోని రాంమోహన్గౌడ్(ఎల్బీనగర్), భేతి సుభాష్రెడ్డి(ఉప్పల్), జీవన్సింగ్(కార్వాన్), సీతారాంరెడ్డి (చాంద్రాయణగుట్ట), ఇనాయత్ అలీకి చార్మినార్ బదులు బహుదూర్పురాలో అవకాశం కల్పించారు. అంబర్పేట, మలక్పేట, గోషామహల్లలో కొత్త అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నారు. -
భారీ వేదిక.. 300 మందికి చోటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ 2న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన’సభకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. దూరంలోనున్న సభికులకు కనిపించే విధంగా భారీ వేదికను నిర్మిస్తున్నారు. దీనికిగాను సభాప్రాంగణ విస్తీర్ణం పెద్దగా ఉండేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ, పట్టా భూములను చదును చేస్తున్నారు. వేదికను 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై 300 మంది ఆసీనులయ్యే విధంగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు వేదికపై చోటు కల్పించనున్నారు. సుమారు 500 ఎకరాల మైదానంలో భారీ ఎల్సీడీ స్క్రీన్లు, సరైన వెలుతురు కోసం ఫ్లడ్లైట్లు, భద్రత కోసం బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 15 ఫైరింజన్లు తీసుకుంటున్నారు. వీటి కోసం పార్టీ నిధి నుంచి చెల్లించారు. దీనికి భారీగా కరెంటు అవసరం కావడంతో రూ.30 లక్షలను విద్యుత్ శాఖకు చెల్లించనున్నారు. సభాస్థలికి రోడ్లు... అద్దె వాహనాలు... సభకు సుమారు 25 లక్షల మందిని తరలిస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీనికోసం ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, వ్యాన్లు, ప్రైవేటు స్కూల్ బస్సులు వంటి 24 వేల వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. వేదికకు ఎదురుగా 50 వేల కుర్చీలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లలో వేగం పెంచండి...: కేటీఆర్ సభాస్థలి, రోడ్ల నిర్మాణం వంటి పనుల్లో వేగం పెంచాలని పార్టీ ముఖ్యనేతలను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా పనులను పరిశీలించారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పని విభజన చేసుకుని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణాలు వద్దు: ప్రగతి నివేదన సభ కోసం దాదాపు అన్ని వాహనాలను కిరాయికి తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. ఆదివారం కావడం వల్లే ఈ సభ నిర్వహిస్తున్నామని, సామాన్యులెవరూ ఆ రోజు ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. -
చరిత్ర సృష్టించేలా ప్రగతి నివేదన సభ
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రగతి నివేదన సభ పేరుతో టీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభ దేశంలోనే చరిత్ర సృష్టిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లోని సభాస్థలాన్ని చదును చేసే పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు చేసిన సేవలను ఇక్కడ వివరిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ప్రాణాలు లెక్కచేయకుండా రాష్ట్రం సాధించాడన్నారు. 25 లక్షల మందితో సభ ఏర్పాటు చేసి సత్తా చాటుతామని నాయిని చెప్పారు. డిప్యూటీ సీఎం మహముద్ అలీ మాట్లాడుతూ మైనార్టీలకు రూ.2వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది టీఆర్ ఎస్ సర్కార్ మాత్రమేనని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి మైనార్టీ హాస్టళ్లను ప్రారం భించిందని, 50 వేల మంది పిల్లలు నేడు హాస్టళ్లల్లో చదువుతున్నారనితెలిపారు. మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్ఎస్ సభ జరగబోతోందన్నారు. సెప్టెంబర్ 2న ఉప్పొంగే జనసంద్రానికి ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయన్నారు. -
కేరళకు రూ.25 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం త్రివేండ్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్కు అందజేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం తరఫున ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు నాయిని ఆదివారం హైదరాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లారు. మానవతా దృక్పథంతో తెలంగాణ రాష్ట్రం చేయదగిన సహాయా న్ని చేస్తుందన్నారు. గత నూరేళ్లలో రాని ప్రకృతి వైపరీత్యం కేరళలో వచ్చిందని, ఈ పరిస్థితుల పట్ల చలించిన కేసీఆర్ పొరుగు రాష్ట్రానికి అండగా ఉంటామనే సందేశాన్ని తెలిపేందుకు తనను పంపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని రాష్ట్ర రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. కేరళకు నీటి శుద్ధి ప్లాంట్లు.. కేరళ వరద బాధితుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.2.5 కోట్ల విలువైన 50 ఆర్వో వాటర్ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానం ద్వారా పంపించింది. వీటి ద్వారా రోజుకు 10 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేయవచ్చు. ఆర్వో ప్లాంట్లను వినియోగించడంలో కేరళ ప్రజలకు సహకరించేందుకు 20 మంది స్మాట్ సంస్థ ఇంజనీర్లతో పాటు మరో 10 మంది సిబ్బందిని కూడా కేరళకు పంపింది. మంత్రులు, ఎమ్మెల్యేల విరాళాలు.. వరదల్లో చిక్కుకున్న కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుకొస్తున్నారు. హోంమంత్రి నాయిని, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు తమ ఒక నెల జీతాన్ని కేరళ సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. -
రూ. 25 కోట్ల చెక్కును కేరళ సీఎంకు అందజేసిన నాయిని
సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోన్న కేరళకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ రూ.25 కోట్లను తక్షణ సహాయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చెక్కును తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం నాడు కేరళ వెళ్లి ఆ రాష్ట్ర సీఎం విజయన్కు అందజేశారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. టీఆర్ఎస్ భవన్లో ఎంపీ కేశవరావు ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన 20 మంది ఎంపీల ఒక నెల వేతనాన్ని(మొత్తం 20 లక్షల రూపాయలు) కేరళ సీఎం రీలిఫ్ ఫండ్కు అందజేయనున్నామని తెలిపారు. ఈ విషయాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులంతా తమ నెల వారి జీతాలను కేరళ వరద బాధితులకు విరాళంగా అందజేయనున్నామని తెలిపారు. కేరళ సోదరి, సోదరులను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇండియా ఫర్ కేరళ, తెలంగాణ ఫర్ కేరళ అని హ్యష్ ట్యాగ్లు ట్వీట్కు జత చేశారు. -
పిలగాడు ఆగం పట్టడం ఖాయం : మంత్రి నాయిని
ప్రాజెక్టుల విషయంలో మేము చెప్పిందే నిజమైంది జూరాలపై ఆధారపడితే ఎత్తిపోతల పథకాలకు భంగపాటే నారాయణపేట, కొడంగల్కు పాలమూరు–రంగారెడ్డి ద్వారా సాగునీరు కోస్గి బహిరంగ సభలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు బస్డిపో, బస్టాండ్ పనులకు శంకుస్థాపన, సీఐ కార్యాలయం ప్రారంభం హాజరైన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి ఐటీఐ కాలేజీ ఏర్పాటుకు మంత్రి నాయిని హామీ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నాలుగేళ్లుగా పాలమూరు ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసైనా కాంగ్రెస్ నేతలు కళ్లు తెరవాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రజలకు మున్ముందు మరింత సమర్థవంతంగా అందాలంటే టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జిల్లాలోని కోస్గిలో బస్ డిపో నిర్మాణ పనులతో పాటు బస్స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా పోలీస్సర్కిల్ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. మంత్రులు పట్నం మహేందర్రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి పాల్గొన్న మంత్రి హరీశ్రావు.. ఆ తర్వాత మంత్రి పి.మహేందర్రెడ్డి అధ్యక్షతన కోస్గి జూనియర్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్రావు ప్రసంగం ఆయన మాటల్లోనే.. మేం చెప్పిందే నిజమవుతోంది! సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేము ముందు నుంచి చెబుతున్న మాటే నిజమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ రోజు జూరాల ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ఈ ప్రాజెక్టు నుంచి మనం వాడుకోగలిగిన నీరు కేవలం 6టీఎంసీలు మాత్రమే. జూరాల మీద ఆధారపడి ఇప్పటికే నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పైనుంచి వరద ఆగిపోయే సరికి ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులు పోతే ఎత్తిపోతల పంపులన్నీ నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాంటిది పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జూరాలను ఆధారంగా ఏర్పాటు చేస్తే నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుందా? శ్రీశైలం డ్యామ్లో 215 టీఎంసీల నీరు ఉంటుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు ఎండాకాలం వచ్చే వరకు నడుస్తాయి. అదే జూరాల మీద ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ పంపులను నడపగలమా? అందుకే సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని శ్రీశైలం బ్యాక్వాటర్ను ఆధారం చేసుకొని చేపట్టారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు గుర్తించాలి. నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంలో జూరాలపై భారం వేయలేం. అయినా కచ్చితంగా పాలమూరు–రంగారెడ్డి ద్వారా నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. కర్వెన రిజర్వాయర్ ద్వారా 1.30లక్షల ఎకరాలకు, ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రాబోయే రోజుల్లో ఇది చేసి చూపిస్తాం. కేసుల వల్లే ఆలస్యం.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగెత్తించాలని మేము భావిస్తుంటే కాంగ్రెస్ నేతలు కేసుల ద్వారా అడ్డుపడుతున్నారు. ఈ ప్రాజెక్టుపై పదుల సంఖ్యలో కేసులు వేసిన కారణంగానే అనుకున్నంత వేగంగా పనులు చేయలేకపోయాము. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నల్లమల్ల అభయారణ్యం దెబ్బ తింటుందని కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ ఇంచార్జీ హర్షవర్దన్రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. అలాగే దేవరకద్రకు చెందిన పవన్కుమార్ హైకోర్టులో కేసులు వేశారు. ఇలాంటి చర్యల వల్లే ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి. గులాబీ జెండా ఎగరడం ఖాయం రాబోయే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగెత్తిస్తున్నాం. మాయమాటల ద్వారా ఒకటి రెండు సార్లు మోసం చేస్తారేమో కానీ ఎల్లకాలం చెల్లుబాటు కాదు(రేవంత్ను ఉద్దేశించి). కోస్గికి గతంలో బస్డిపో మంజూరు కాకపో యినా మోసపూరితంగా శిలాఫలకం వేశారు. కానీ మేము అలా కాకుండా.. స్థానిక నేతలు అడిగిన వెంటనే 15 రోజుల్లోనే జీఓ మంజూరు చేశాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బస్ డిపోగా కోస్గి రికార్డుకెక్కింది. అలాగే ఆస్పత్రులు, మిషన్ కాకతీయ కింద చెరువుల పూడికతీత, పంచాయితీరాజ్ కింద రోడ్ల నిర్మాణం, విద్యుత్సబ్స్టేషన్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. త్వరలో బోరాంస్పేట, దౌల్తాబాద్కు జూనియర్ కాలేజీల ఏర్పాటు చేస్తాం. కోస్గిలో స్థలం గుర్తిస్తే అధునాతన కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేస్తాం. అభివృద్ధి అంటే ఏందో తెలుసా.. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి అభివృద్ధి అంటే ఏందో తెలియదని మంత్రి మహేందర్రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో గ్రాఫిక్ చిత్రాలతో ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు గెలుపొందారని... ఇక మునుముందు వారి ఆటలు సాగవన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.900 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి వివరించారు. మంత్రి హరీశ్రావు నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో పిల్లగాడు ఆగం పట్టడం ఖాయమంటూ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని ఉద్దేశించి మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్రావు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం ఖాయమని... అందుకే ఈ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్చార్జీగా సీఎం కేసీఆర్ నియమించారన్నారు. ఇక్కడ విజయం ఖాయమని... కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఆ పిల్లగాడిని అమ్మ దగ్గర పాలు తాగడానికి పంపించేలా ఉన్నారు. సీఎం కేసీఆర్ను తిట్టినోడు ఎవరూ బాగుపడలేదని...పిచ్చి కూతలు కూసే ఈ పిల్లగాడిది అదే పరిస్థితి అవుతుందని అన్నారు. పార్లమెంట్లో టీఆర్ఎస్కు ప్రధాని లాంటి జితేందర్రెడ్డి కోరిక మేరకు కోస్గిలో ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నాయిని -
విద్యార్థినులపై డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
-
విద్యార్థినులపై డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు. -
హోంమంత్రి దృష్టికి ‘కొండపల్లి’ వివాదం
సాక్షి, హైదరాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో తమ కులస్తులను వెలి వేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే కారణంతో తమ సంఘీయులను ఊరి నుంచి బహిష్కరించడం దారుణమని మంత్రికి వివరించారు. సాంఘిక దురాచారాలను ప్రోత్సహించొద్దని, తమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వెంటనే కుమురం భీం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసున్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. హోంమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ, కార్యదర్శి గొంగుల శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి రమేశ్, కార్టూనిస్ట్ నారూ ఉన్నారు. వివాదం ఇదీ... ఈ నెల 22న కొండపల్లిలో ‘దేవార’ ఉత్సవం జరిగింది. దీనికి నాయీ బ్రాహ్మణులు, రజకులు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు సహాయ నిరాకరణ చేపట్టారు. వీరికి గ్రామంలో ఎవరూ సహకరించకూడదని 23న ఊరిలో చాటింపు వేయించారు. గ్రామంలోని మూడు నాయీ బ్రాహ్మణ, ఐదు రజక కుటుంబాలపై సాంఘిక బహిష్కారం విధించారు. బాధితులు మొర పెట్టుకోవడంతో పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పి, వెలి ఎత్తివేస్తే రాజీకి వస్తామని బాధితులు తేల్చి చెప్పారు. అయితే క్షమాపణ చెప్పేందుకు గ్రామస్తులు నిరాకరించారు. బాధితులే తమకు క్షమాపణ చెప్పాలంటూ ఎదురు తిరిగారు. దీంతో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు హోంమంత్రి జోక్యం కోరారు. -
కేంద్రం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోంది: నాయిని
సాక్షి, హైదరాబాద్: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి, వారి హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాజ్బహదూర్ గౌర్ శతజయంత్యుత్సవాల ప్రారంభానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూమి, భుక్తి కోసం నైజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి రాజ్బహదూర్ అని నాయిని అన్నారు. కేంద్ర విధానాలతో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోకుం డా పోతున్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజాన్, తమ్మినేని వీరభద్రం, నవ తెలంగాణ సంపాదకుడు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు అండగా ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్రావు, నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని బషీర్బాగ్లోని పరిశ్రమల భవన్ 3వ అంతస్తులో శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసన మండలి ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్రెడ్డి, సమాచారహక్కు ప్రధాన కమిషనర్ రాజాసదారాం, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, కార్పొరేషన్ చైర్మ న్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కమిషన్ ఉందా అనే అనుమానం ఉండేదన్నారు. తెలంగాణ వస్తే వారికి పరిపాలించుకొనే స్తోమత ఉందా అని సమైక్యరాష్ట్ర పాలకులు ఎద్దేవా చేశారని, అన్ని అవరోధాల ను అధిగమించి అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్కు కమిషన్ చైర్మన్గా అవకాశం ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, 2003లోనే కమిషన్ ఏర్పాటైనా ఎక్కడా పనిచేయలేదన్నారు. గతంలో సమైక్యపాలకులకు మాత్రమే కమిషన్లో అవకాశం ఇచ్చారని, తెలంగాణ దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందన్నారు. కమిషన్ ద్వారా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ముందుంటామన్నారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కమిషన్ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
ప్రతి పల్లెలో సీసీ నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా పోలీసు శాఖ కార్యాచరణ రూపొందించింది. హైదరాబాద్లో విజయవంతంగా అమలవుతున్న కమ్యూనిటీ, నేను సైతం సీసీటీవీ ప్రాజెక్టులను అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు డీజీపీ మహేందర్రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్లోని జేఎన్టీయూలో కమిషనర్లు, ఎస్పీలు, అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు కింద జనసంచార, రద్దీ ప్రాంతాలు, కీలక కార్యాలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యే లాడ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులతో స్వచ్ఛంద సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సహాకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. నేను సైతం ప్రాజెక్టు కింద స్వచ్ఛందంగా ముందుకొచ్చే వ్యాపారులు, కాలనీ, అపార్ట్మెంట్ వాసులు, వివిధ సంఘాలు నేతృత్వంలో ఏర్పాటు చేస్తారు. కమ్యూనిటీ సీసీటీవీల వీడియో ఫుటేజీ 30 రోజుల పాటు ఉంటుందని, నేను సైతం కింద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫీడ్ యజమాని నిర్వహణపై ఆధారపడి ఉంటుందని డీజీపీ వివరించారు. జీహెచ్ఎంసీలో 10 లక్షల కెమెరాలు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ సీసీటీవీలు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసే కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తామని డీజీపీ చెప్పారు. సర్కిల్, డివిజన్, జిల్లా స్థాయి కమాండ్ సెంటర్లకు వాటిని అనుసంధానిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కమాండ్ సెంటర్లను రాజధానిలో ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్లో అనేక సంచలనాత్మక కేసులను 24–40 గంటల్లోనే ఛేదించామని గుర్తు చేశారు. హైదరాబాద్ పరిధిలో 2014 నుంచి 2017 మధ్య 32 శాతం నేరాల తగ్గుదల కనిపించిందని.. సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇదంతా జరిగిందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షలు, మిగతా ప్రాంతాల్లో 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కమ్యూనిటీ, నేను సైతం సీసీటీవీ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసుకునే కెమెరాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూపొందించిన మార్గదర్శాకాల ద్వారా కొనుగోలు చేయాలని.. నెట్వర్క్ వ్య వస్థ, హెచ్డీ క్వాలిటీ అంశాలను పాటించాలని డీజీపీ చెప్పారు. మార్గదర్శకాల కాపీ లను ఎస్పీలు, కమిషనర్లకు అందించారు. తద్వారా సీసీ ఫుటేజీ క్వాలిటీ బాగుంటుందని, నిందితులు, అనుమానితుల గుర్తింపు సులభమవుతుందని చెప్పారు. పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి: నాయిని నేను సైతం ప్రాజెక్టుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు రూపొందించిన షార్ట్ ఫిలిమ్ను హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. టెక్నాలజీతో నేరాల నియంత్రణ చేయొచ్చని హైదరాబాద్ పోలీసులు రుజువు చేశారని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని హోం మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వెళ్తే నేరాల నియంత్రణ సులభమవుతుందన్నారు. పోలీసు శాఖకు ప్రభుత్వం ఎప్పుడూ సహకారం అందిస్తుందని, పీపుల్ ఫ్రెండ్లీగా పోలీసులు ఉండాలాని నాయిని ఆకాక్షించారు. -
మరో 15 ఏళ్లు అధికారంలో టీఆర్ఎస్
సాక్షి, జగిత్యాల : మరో 15 ఏళ్ల వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటం గ్యారెంటీ అని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నాడు సీఎం ఏం చెప్పారో అదే జరుగుతోందని అన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వం నడుస్తోందని, కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. టీఆర్ఎస్ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని పేర్కొన్నారు. ఉత్తమ్కుమార్ రెడ్డి గడ్డం తీసేది లేదని, బుడ్డార ఖాన్(రేవంత్రెడ్డి)కి కేటీఆర్ అంత వయస్సు లేదు.. ఆయనా సీఎంను తిట్టేది అంటూ ఛలోక్తులు విసిరారు. అమిత్షా ఢిల్లీకే పరిమితమయ్యారని, ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి పనికి వచ్చే పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. మోదీకి కేవలం నోరు ఉందని, నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పోలీసు డిపార్ట్మెంట్లో 33శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. తమకు ఎవరితోనూ తగాదాలు లేవని, తెలంగాణ ప్రజలు శాంతి కాముకులని పేర్కొన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. -
12లోగా ‘బోనాల’కు దరఖాస్తులు: నాయిని
సాక్షి, హైదరాబాద్: బోనాల పండుగ సందర్భంగా ఆర్థిక సహాయం పొందాలనుకునే దేవాలయాలు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకో వాలని బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్, హోం మంత్రి నాయిని నర్సంహారెడ్డి సూచించారు. శనివారం సచివాలయంలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 20లోగా దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం పొందని దేవాలయాలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. -
‘ఒత్తిడిని జయించడం’ పుస్తకావిష్కరణ
మఠంపల్లి : మైండ్ పవర్లో ప్రపంచ రికార్డ్ సాధించిన తాటికొండ వేణుగోపాల్రెడ్డి రచించిన ఒత్తిడిని జయించడం (కాంక్యూర్స్ట్రెస్) పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్లో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ ఒత్తిడి ప్రమాదకరమైన వైరస్ అని ఈ పుస్తకం ఆ వైరస్ను విద్యార్థులకు సోకకుండా చేస్తుందన్నారు. పుస్తకాన్ని రచించిన మరో రచయిత విజయార్కె మాట్లాడుతూ ప్రాక్టికల్ థింకింగ్, మన ఆలోచన విధానం ఎలా ఉండాలో, ఒత్తిడిని ఎలా జయించాలో ఈ పుస్తకం తెలియజేస్తుందన్నారు. అంతేగాక పుస్తకాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదవదగ్గ పుస్తకమని, తల్లిదండ్రులకు మార్గదర్శకంగా ఉంటుందని అభినందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో శివారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసాచారి తదితరులున్నారు. -
సాంకేతికతతో ఆధారాలు పదిలం
సాక్షి, హైదరాబాద్: ఆధారాలు సేకరించడమే కాకుండా టెక్నాలజీ వినియోగంతో నిందితులను కటకటాల్లోకి పంపడం ఇప్పుడు సులభతరమైందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. టెక్నాలజీ పెరిగి ఆన్లైన్లోనే క్షణాల్లో విశ్లేషణ చేసి నిందితులను పట్టుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెండ్రోజులుగా జరుగుతున్న 19వ జాతీయ స్థాయి ఫింగర్ ప్రింట్స్ బ్యూరో సదస్సు ముగింపులో నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫింగర్ప్రింట్స్ బ్యూరో సమావేశాలు హైదరాబాద్లో జరగడం సంతోషకరమని, రాష్ట్ర పోలీస్ ఫింగర్ ప్రింట్స్ డేటా మేనేజ్మెంట్, ఆటోమేషన్లో ది బెస్ట్ అని కితాబిచ్చారు. వచ్చే ఏడాది సదస్సుకల్లా తెలంగాణ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో పూర్తి స్థాయి సిబ్బంది, అధికారులతో మరింత పటిష్టంగా మారుతుందని ఆకాంక్షించారు. ఫింగర్ ప్రింట్స్ బ్యూరో నిర్వహించిన పలు పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించిన తెలంగాణ ఫింగర్ ప్రింట్స్ అధికారిణి స్వర్ణలతకు ఆయన అవార్డు అందజేశారు. అన్ని విభాగాలు అందిపుచ్చుకోవాలి.. ఫింగర్ ప్రింట్ విభాగంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. గతంలో ఆధారాల సేకరణ, విశ్లేషణ, ఫలితాల కోసం నెలల కొద్దీ సమయం పట్టేదని, ఇప్పుడలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. బ్రిటన్లాంటి దేశాల్లో ప్రతీ పోలీస్ స్టేషన్లో ఫింగర్ ప్రింట్ విభాగం అందుబాటులో ఉంటుందని, అలాగే రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నేరస్తుల ముఖం, పేర్లు మారినా వారి వేలిముద్రలు మాత్రం మారవని, అవే అత్యంత కీలకమైన ఆధారాలు అని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది అన్నారు. భవిష్యత్తులో కార్లను కూడా వేలిముద్రలతో అన్లాక్, స్టార్ట్ చేసే టెక్నాలజీ కూడా రాబోతోందని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారినీ.. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని కూడా ఫింగర్ ప్రింట్ ద్వారా గుర్తించేందుకు టెక్నాలజీ తీసుకొస్తున్నామని ఎన్సీఆర్బీ డైరెక్టర్ ఈష్కుమార్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఫింగర్ ప్రింట్ విభాగం ఏర్పాటు, వాటి పురోగతికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు 92 శాతం పోలీస్ స్టేషన్లు అనుసంధానమయ్యాయని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే అనుసంధానం చేసి డేటాను షేర్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్, ఎన్సీఆర్బీ జాయింట్ డైరెక్టర్ సంజయ్మాతుర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
హైదరాబాద్ : పేద రెడ్ల అభివృద్ధి కోసం ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. రాజా బహద్దూర్ స్ఫూర్తిని కొనసాగించే విధంగా రెడ్డి హాస్టల్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అబిడ్స్లోని రెడ్డి హాస్టల్లో ఆదివారం సెంటినరీ పైలాన్ను ఆవిష్కరించారు. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్.. రెడ్డి హాస్టల్కు 15 ఎకరాల స్థలం, రూ.10 కోట్లను మంజూరు చేశారని చెప్పారు. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి ఓవర్సీస్ ఫండ్ కూడా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎంపీ జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. రాజా బహద్దూర్ స్ఫూర్తితో అట్టడుగున ఉన్న రెడ్డి కులస్తులను ఆదుకోవాలని సూచించారు. బుద్వేల్లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మంచి విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎడ్ల రఘుపతిరెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తీగల కృష్ణారెడ్డి, సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్రెడ్డి, సొసైటీ కార్యదర్శి కుందవరం వెంకటరెడ్డి, ఉపా«ధ్యక్షుడు పాపారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, డాక్టర్ వసుంధరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేద్దాం
జూబ్లీహిల్స్: రాష్ట్రంలో బాలకార్మిక వ్వసస్థను సంపూర్ణంగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, వచ్చే 2021 సంవత్సరంలోపు అది పూర్తవుతుందని రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం స్వచ్ఛద సంస్థలు, ప్రజలు, ప్రజా ప్రతిని«ధులతో కలిసి పనిచేస్తుందన్నారు. ప్రపంచ బాలకార్మిక నిర్మూలన రోజును పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ, ప్లాన్ ఇండియా, మహిత స్వచ్ఛద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బేగంపేట సెస్ ఆడిటోరియంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. బాలకార్మిక వ్వవస్థకు ప్రధానంగా పేదరికమే కారణమని, గ్రామాల్లో పేదరికం నిర్మూలిస్తే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుందన్నారు. గ్రామాల్లో సర్పంచ్లు చొరవ తీసుకొని పిల్లలను బడికి పంపేలా చూడాలన్నారు. నగరంలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బాలకార్మిక నిర్మూలనకు చేపట్టిన చర్యలు వివరిస్తూ ‘ఏ జర్నీ టు క్రియేట్ చైల్డ్ లేబర్ ఫ్రీ తెలంగాణ విత్ ఎన్జీఓ పార్టిసిపేషన్’ పేరుతో రూపొందించిన టేబుల్ బుక్ను, బాల కార్మిక వ్యతిరేక ప్రచారంతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్ మేనేజర్ అనితాకుమార్, మహిత డైరెక్టర్ రమేష్శేఖర్రెడ్డి, కార్మికశాఖ ఎస్ఆర్సీ స్టేట్ కో-ఆర్డినేటర్ వర్షాభార్గవ, పలు జిల్లాలకు చెందిన సర్పంచ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాయినికి ‘తెలంగాణ రత్న’ పురస్కారం
వివేక్నగర్ : తెలంగాణ ఉక్కు మనిషి నాయిని నర్సింహారెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విశేష కృషి చేసి తెలంగాణ రత్నంగా ఎదిగారని, మనస్తత్వంలోను, ఆహార్యంలోను ఎదుటి వారిని ఆకట్టుకునే తత్వం ఆయనదని పూర్వ లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్.ఎం.ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం త్యాగరాయ గానసభలో సంగీత జానపద నృత్యాంశాలతో పాటు హోంమంత్రి నాయినికి అభినందన సత్కార సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడుతూ.. భాషా ప్రాతిపధిక రాష్ట్రాలు కలిసి ఉండలేవని తేలిందని భాష కంటే సంస్కృతి సంప్రదాయం, ఆచారాలు ముఖ్యమని, అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేచిందన్నారు. ఆ ఉద్యమంలో నాయిని పాత్ర చాలా గొప్పదన్నారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డిని ‘తెలంగాణ రత్న ’ పురస్కారంతో సత్కరించి, పుష్పాభిషేకం చేశారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. తెలంగాణలో బిడ్డలందరూ రత్నాలేనని, మంచి మనసుతో చేసే పని విజయవంతమవుతుందన్నారు. తెలంగాణ సాధన కూడా అలాగే జరిగిందని వివరించారు. ప్రస్తుత తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఆచార్య మసన చెన్నప్ప అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎం.సత్యనారాయణ శర్మ, ఆయుర్వేద వైద్యులు డా.నర్శిరెడ్డి, కె.జయప్రసాద్, ఆచార్య కె.చంద్ర శేఖరరెడ్డి, అలివేలుమంగ, డా.రాజ్నారాయణ్, కుçసుమాశేఖర్, జె.మంజులారావు తదితరులు ప్రసంగించారు. -
దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ: స్పీకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన నాలుగేళ్లలోనే దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోందని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని అసెంబ్లీ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో, అమరుల ఆశయాలను సాధించుకోవడానికి నిరంతర కృషి జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి దేశమే ఆశ్చర్యపోతోందని వ్యాఖ్యానించారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ అమ్మ వారి గుడిలో స్పీకర్ ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ భవన్లోనూ.. రాష్ట్రావతరణ వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. -
అగ్రకులాల్లో పేదలు పాలకులకు కనిపించరా?
-
మా కులమే అనర్హతా?
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఉన్నత కులంలో పుట్టడమే మా తప్పా.. మా కులమే మాకు అనర్హతా... అగ్రకులాల్లో పేదలు కనిపించడం లేదా..’’అని రెడ్డి జేఏసీ నాయకులు పాలకులను ప్రశ్నించారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని, వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్తో రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలకు వెళ్లే విదార్థులకు రూ.20 లక్షల సహాయం అందించాలని, గురుకులాల్లో ప్రవేశం కల్పించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్లోని రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రాంగణంలో రెడ్ల సమరభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. సభకు రెడ్లు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించగా.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వాటిని తిప్పికొట్టారు. ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి: నాయిని అగ్ర కులాల్లో చాలామంది పేదలు ఉన్నారని, సీఎంను ఒప్పించి ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హోంమంత్రి నాయిని చెప్పారు. పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అగ్ర కులాల పేదలకు కూడా అందాల్సిన అవసరం ఉందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా సమస్యలు పరిష్కాం కావన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో ద్వారా రేవంత్రెడ్డి నాయకుడు కాగలడేమోగానీ సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. దొరల పెత్తనాన్ని అడ్డుకోవాలి: రేవంత్రెడ్డి తెలంగాణ పోరాటంలో రెడ్ల పాత్ర కీలకమని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెడ్ల పాత్రను తక్కువ చేసే యత్నం జరిగిందని, రెడ్డి అనే కారణంగా కోదండరాంను పక్కన పెట్టారని విమర్శించారు. దొరల పెత్తనానికి ఎదురొడ్డి నిలవకుంటే మన ఉనికికే ప్రమాదమని అన్నారు. వారిని ఓడించే శక్తి రెడ్లకు ఉందని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని ఎమ్మెల్యేలు డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ నవల్గ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సినీనటి జయప్రద, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అసోసియేట్ చైర్మన్ అప్పమ్మగారి రాంరెడ్డి, కొలను వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల కుటుంబాలను ఆదుకోవడం మన కర్తవ్యం
హైదరాబాద్ : దేశ సరిహద్దులో ప్రాణాలను అడ్డుపెట్టి పనిచేస్తున్న సైనికులకు మనం ఎంత చేసినా తక్కువేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ మాజీ సైనికులు, కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయిని మాట్లాడుతూ, సైనికులు తమ కుటుంబాలను, భార్యాపిల్లలను వదిలిపెట్టి దేశాన్ని కాపాడుతున్నారని తెలిపారు. సైనికుల కుటుంబాలను ఆదుకోవడం మనందరి కర్తవ్యం అని అన్నారు. వీరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, మంచి పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు. సైనికుల సంక్షేమాన్ని కాపాడాలన్న కారణంతో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఒకరోజు జీతాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు మొదలుకుని ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఒక్క రోజు జీతాన్ని సైనిక సంక్షేమానికి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఒక గ్రూపు ఒక రోజు జీతాన్ని ఇవ్వలేదన్నారు. కెప్టెన్ ఉరేష్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్రెడ్డి, సైనిక సంక్షేమ అధికారి శ్రీనిష్ కుమార్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ కేసులు.. కీలక సమీక్ష!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ కేసుల విషయమై రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలువురు ఉద్యమకారులపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులను ఎత్తివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిందని మంత్రులు తెలిపారు. ఎక్కడైనా కేసులు పెండింగ్లో ఉంటే.. 15 రోజుల్లో వివరాలను ప్రభుత్వానికి అందించాలని కోరారు. ఉద్యమకాలంలో నమోదైన మిగతా కేసుల ఎత్తివేతపై న్యాయనిపుణులతో చర్చిస్తామని మంత్రులు నాయిని, జగదీశ్రెడ్డి, కేటీఆర్ తెలిపారు. ఉద్యమకాలంలో నమోదైన కొన్ని కేసులు సాంకేతిక కారణాలు చూపుతూ.. న్యాయస్థానాలు ఎత్తివేసేందుకు నిరాకరించాయి. పలు కేసులు పెండింగ్లో ఉండటంతో అవి ఎదుర్కొంటున్న ఉద్యమకారులకు న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదు. ఇటీవల ఓ ఉద్యమకారుడికి తెలంగాణ ఉద్యమకాలం నాటి కేసులో న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పీఎస్ భవన నిర్మాణానికి మంత్రి శంఖుస్థాపన
రామగుండం : అంతర్గాం మండల కేంద్రంలో నూతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులను గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రత్యేక చొరవతో రూ.1.50 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణానికి కేటాయించారు. రామగుండం కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్, ఏసీపీ రక్షిత కె.మూర్తి, డీసీపీ సుదర్శన్గౌడ్, హోంమంత్రికి స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐజీ నాగిరెడ్డి, రామగుండం సీఐ సాగర్, ఎస్సై శీలం ప్రమోద్రెడ్డి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, తహసీల్దార్ పుప్పాల హన్మంతరావు, గ్రామ సర్పంచులు శశికళ, పద్మ, ఎంపీటీసీ పద్మ, రాజయ్య, వైస్ ఎంపీపీ పవన్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించిన నాయిని.. పాలకుర్తి : హోంమంత్రికి గురువారం పాలకుర్తి మండలం బసంత్నగర్లో కేశోరాం ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అంతర్గాంలో నూతనంగా నిర్మించనున్న పీఎస్ నిర్మాణం ప్రారంభోత్సవానికి వచ్చిన హోంమంత్రి కేశోరాం అతిథి గృహంలో బస చేశారు. కాగా ప్లాంట్ హెడ్ రాజేశ్గర్గు, మేనేజర్ కేఎన్రావులు ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్లున్నారు. మంత్రికి ఘన స్వాగతం.. జ్యోతినగర్ : మంత్రి నాయిని ఎన్టీపీసీ పీటీఎస్ అతిథి గృహంలో పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. గురువారం ‘ఖని’లో పలు శంకుస్థాపనల నేపథ్యంలో ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్ జ్యోతిభవన్ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు గౌరవందనం చేశారు. ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి హోంమంత్రికి స్వాగతం పలికారు. సారయ్య, సత్యనారాయణ, రమేశ్బాబు, గట్టయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్కు పీటీఎస్ అతిథి గృహంలో పెద్దపల్లి అభివృద్ధి ఫోరం అధ్యక్షుడు పెద్దం పేట శంకర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం తెలిపారు. చెన్న య్య, డాక్టర్ విజయభాస్కర్, సింగం సత్త య్య, పలువురు గౌడ సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లకు దూరం
గోదావరిఖని: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. ఎవరైనా మావోయిస్టులు తారసపడితే వారిని అరెస్టు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నదని, ఎన్కౌంటర్ల కు దూరంగా ఉందని స్పష్టం చేశారు. గురువారం గోదావరిఖనిలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో పోలీస్ గెస్ట్హౌస్, కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులను ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారని, ఆంధ్రోళ్లను తరిమి కొడతారని, వారి ఇళ్లను లూటీ చేస్తారని విషప్రచారం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయబోమని హోంమంత్రి తెలిపారు. తెలంగాణ వస్తే అనేక ఇబ్బందులు ఏర్పడతాయన్న ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కిదర్ గయా అని హోంశాఖ మంత్రి ప్రశ్నించారు. -
కార్మిక సంక్షేమానికి కృషి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని, అందు కోసం అహర్నిశలు పని చేస్తుందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. యాజ మాన్యం– కార్మికుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడితే ఆర్థిక వృద్ధిని సాధిం చవచ్చన్నారు. మంగళవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని రవీంద్రభారతిలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని అన్నారు. రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పని చేస్తున్న భవన, ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ మండలి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో కార్మికుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం రూ. 10 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కార్మికులు చనిపోతే రూ. 2 లక్షలే ఇచ్చేవారని, ప్రస్తుతం రూ. 6 లక్షలు ఇస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయెల్ అన్నారు. కార్మికులకు న్యాయం జరగాలన్న తలంపుతో అనేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగం, వేతనం, సామాజిక భద్రత విషయంలో కార్మికులకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. 2020 నాటికి భవన నిర్మాణ కార్మికులకు సొంత ఇళ్లు కట్టించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తొలుత లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం 8 మందికి అత్యుత్తమ యాజమాన్య అవార్డులు, 30 మందికి శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ డైరెక్టర్ కె.వై.నాయక్, ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, మినిమం వేజస్ చైర్మన్ జేసీఎల్ చంద్రశేఖర్ గంగాధర్ పాల్గొన్నారు. అవార్డులు అందుకుంది వీరే: జీఎంఆర్ ఏరో టెక్నిక్ లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కాఫీ లిమిటెడ్, యశోద హాస్పిటల్, ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, మైలాన్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్. -
రబ్బర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం!
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజా మున 2.30కి అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో టైర్లకు మంటలు అంటుకున్నాయి. సమాచా రం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంట లను ఆర్పే యత్నం చేశారు. అగ్నికీలలు భారీ గా ఎగిసిపడటంతో హైదరాబాద్ నుంచి మరో 10 ఫైరింజన్లను రప్పించారు. 12 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. ప్రమాదం కారణంగా కిలోమీటర్ మేర దట్టమైన పొగ కమ్మేసింది. ఘటనలో పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. రూ.కోట్లలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. గతంలోనూ ఇదే పరిశ్రమకు చెందిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించి రూ.25 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పరిశ్రమను సందర్శించిన హోంమంత్రి.. ఘటనా స్థలాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చన్నారు. పరిశ్రమ యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా వీలైనంత సాయం చేస్తామని హామీనిచ్చారు. కాగా ఘటనపై విచారణ చేప ట్టి వివరాలు వెల్లడిస్తామని అగ్నిమాపక జిల్లా అధికారి డీఎఫ్ఓ శ్రీధర్రెడ్డి తెలిపారు. -
దేశానికి దిశను చూపే ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాలకు దిశ దశను నిర్దేశించే విధంగా టీఆర్ఎస్ 17వ ప్లీనరీ ఉంటుందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక వద్ద మీడియా సెంటర్ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 2001లో ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఎన్నో అవమానాలను, ఆటుపోట్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిందని అన్నారు. టీఆర్ఎస్ది సెక్యులర్ ప్రభుత్వమని, తెలంగాణలో అన్నివర్గాలు సామరస్యంగా జీవిస్తున్నాయని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామాకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందని, వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని నాయిని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోబోమని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్ పార్టీ కాళ్ల కింద భూమి కదులుతోందని అన్నారు. ప్రధాని మోదీ మీద భ్రమలు తొలగిపోయాయని, కాంగ్రెస్, బీజేపీల తీరు చూసే దేశంలో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలోనే నంబర్ వన్: మహమూద్ అలీ తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలను దేశం అంతటా ఆదరణ లభిస్తున్నదన్నారు. ఏ రాష్ట్రం వెళ్లినా ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను, తెలంగాణ అభివృద్ధిని కొనియాడుతున్నారని చెప్పారు. రైతులకు రూ.12 వేల కోట్లతో పెట్టుబడి సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ఇది రైతు ప్లీనరీ అని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రదర్శించబోయే సాంస్కృతిక కార్యక్రమా లకు రిహార్సల్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. కొంపల్లిలోని గార్డెన్లో మూడు రోజులపాటు ఈ రిహార్సల్స్ కొనసాగుతాయి. -
అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహని జరగలేదు
-
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, న్యూఢిల్లీ: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన కార్మిక మండలి సమావేశంలో నాయిని పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..11 లక్షల మంది కార్మికులు, 312 ప్రభుత్వ సంస్థలు, 10,012 ప్రైవేటు సంస్థలు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మిక మండలిలో నమోదు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు వివాహ కానుకలు, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు ప్రకటించిందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల ఆర్థిక సాయం, సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.60 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో పలు రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. -
నాయినికి ‘లోహియా’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: రామ్మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బుధవారం రవీంద్రభారతిలో లోహియా విచార్మంచ్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. సోషలిస్టు నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి లోహియా అని కొనియాడారు. అలాంటి మనిషి అడుగు జాడలలో పని చేసిన నాయిని.. రామ్ మనోహర్ లోహియా పురస్కారానికి సరైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జస్టిస్ సుభాష్రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయనతోనే..బంగారు తెలంగాణ సాధ్యం
చింతపల్లి (దేవరకొండ) : బంగారు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమని తెలంగాణరాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధిదిశగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నారన్నారు.రైతులకు 24 గంటల విద్యుత్, పేద ప్రజల సంక్షేమానికి షాదిముబారక్, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు సన్న బియ్యం భోజనం తదితర సంక్షేమ పథకాలుప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. తెలంగాణరాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం ఏ రాజకీయపార్టీ తరం కాదన్నారు. రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సమస్య లేకుండాతీర్చిన ఘనతతో పాటు అనేక సంక్షేమ పథకాలుప్రవేశ పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం ఖాయమని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి ఈ ప్రభత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, మాజీ ఎంపీపీ సర్వయ్య, సుధీర్రెడ్డి, నట్వ గిరిధర్, ఎల్లంకి అశోక్, ఎండి. ఖాలెక్, చంద్రశేఖర్, నరేందర్రావు, బిజె.యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చందంపేట (దేవరకొండ) : సీఎం కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్రహోంశాఖ, కార్మిక శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. డిండి నుంచి నేరెడుగొమ్ము మండల కేంద్రానికి కాలువల ద్వారా చెరువులు నింపేందుకు వారం రోజుల క్రితం నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా శనివారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రమావత్ రవీంద్రకుమార్తో కలిసి జల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కృషితో 70 ఏళ్లుగా పూడుకుపోయిన కాలువలకు పుర్వ వైభవం వచ్చిందన్నారు. చందంపేట, నేరెడుగొమ్ము మండలంలోని సుమారు 40 చెరువులు, కుంటలు డిండి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో జలకళను సంతరించుకున్నాయని, గ్రామాల్లో ప్రజ లు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏరాష్ట్రం అందించని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముక్కమల పరుశురాములు, ఎంపీటీసీ గిరియాదగిరి, గడ్డం వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు నాయిని సుధీర్రెడ్డి, రాంరెడ్డి, ఆలంపల్లి నర్సింహ, మేకల శ్రీను, ముత్యాల సర్వయ్య, బోయపల్లి శ్రీను, ఆరెకంటి రాములు, బాలు తదితరులు పాల్గొన్నారు. -
మరో 14 వేల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే 11 వేల కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టామని, మరో 14 వేల నియామకాలకు ఉత్తర్వులిచ్చామని, త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో హోం, కార్మిక శాఖ పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం షీ టీమ్స్ హైదరాబాద్లో 100, జిల్లాల్లో 100 ఉన్నాయని.. వాటిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. బార్ల సమయంపై మాట్లాడుతూ.. మద్యం సేవించి, వాహనాలు నడిపి ఎదుటి వారి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. మద్యం తాగితే వాహనం నడుపొద్దన్నారు. రాష్ట్రంలో అవసరమున్న చోట కొత్త జైళ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నియోజకవర్గానికి ఓ కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు నాయిని తెలిపారు. మరో 1,000 మంది అర్చకులకు వేతనాలు: ఇంద్రకరణ్రెడ్డి రాష్ట్రంలో 4,700 మంది అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చేలా చర్యలు ఇప్పటికే చేపట్టామని, నెల రోజుల్లో మరో 1,000 మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. అయితే వారికి 010 పద్దు కింద వేతనాలివ్వడం కుదరదన్నారు. ధూపదీప నైవేద్యం కింద రూ. 6 వేలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని.. అందులో రూ. 4 వేలు పూజారికి, రూ. 2 వేలు ధూపదీప నైవేద్యానికి ఇస్తామని చెప్పారు. -
రాశీఖన్నాకు రోబో షేక్హ్యాండ్
-
పోరాట యోధురాలు ఈశ్వరీబాయి: నాయిని
హైదరాబాద్: పోరాట యోధురాలైన ఈశ్వరీబాయిని మహిళా నాయకులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ ఈస్ట్మారేడుపల్లిలో ఈశ్వరీబాయి విగ్రహం వద్ద 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈశ్వరీబాయి కుమార్తె, జహీరాబాద్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయిని ఈశ్వరీబాయికి నివాళులు అర్పించారు. ఈశ్వరీబాయి చేసిన సేవలు మరువలేనివని, దళితుల అభ్యున్నతికి పాటుపడిన మహానాయకురాలని నాయిని కొనియాడారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సైతం తనవాణిని వినిపించి పేదల పక్షాన నిలిచిన గొప్ప మహనీయురాలని ఆయన అన్నారు. తన తల్లి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గీతారెడ్డి తెలిపారు. ఈశ్వరీబాయి స్ఫూర్తితో రాజకీయాల్లో రాణిస్తున్నానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు బాలానందం, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, శివకుమార్, ప్రదీప్, రాజుసాగర్, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు మేఘనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు ఏడు సీట్లు వస్తే ఎక్కువే..
సాక్షి, జహీరాబాద్ : వచ్చే పదేళ్ల వరకు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ సీఎం కష్టపడని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజల అభీష్టం మేరకు పనులు చేస్తున్న సీఎం దేశంలో నంబర్ వన్గా నిలిచారని కొనియాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు తప్పకుండా వస్తుందని, ఎక్కడైతే పరిస్థితి వీక్గా ఉందో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి వారి బంధువులకు టిక్కెట్ ఇచ్చి గెలిపించుకుంటామన్నారు. కొత్త దుకాణాలు ఎక్కువరోజులు నడవవు.. కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటోందని నాయిని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే గడ్డం తీస్తానని శపథం చేసిన ఉత్తమ్కుమార్ రెడ్డి గడ్డం కుమార్ రెడ్డిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్కు ఏడు కంటే ఎక్కువ సీట్లు రావన్నారు. బీజేపీకి ఒక్క సీటు వస్తే గొప్పేనని ఆయన చెప్పారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా ఫర్వాలేదని, కొత్త దుకాణాలు ఎక్కువ రోజులు నడవవని, చివరికి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా నంబర్ వన్గా ఉందని, అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఏ రాష్ట్రంలో లేని పథకాలను సీఎం అమలు చేస్తున్నారని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మిషన్ కాకతీయ పనులను చూసి సీడబ్ల్యూసీ ఇంజినీర్లు మెచ్చుకున్నారని ఆయన చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని విదేశీయులు సైతం అభినందిస్తున్నారన్నారు. -
విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట
శాతవాహనయూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్రపౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్లోని ఎస్సారార్ ఆర్ట్స్,సైన్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన దూరవిద్య పితామహుడు గడ్డం రాంరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దూరవిద్య ద్వారా లక్షలాది మంది పేదలు ఉన్నత విద్యకు చేరువయ్యారన్నారు. రాంరెడ్డి కరీంనగర్ జిల్లాలోని మైలారం గ్రామానికి చెందినవారన్నారు. దేశంలోని అత్యున్నత యూనివర్సిటీలకు వీసీగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందుబాటులో తెస్తామన్నారు. ఇప్పుడు నిధులకు కొరత లేదని, బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ విద్యకోసం పరితపించిన వ్యక్తుల్లో రాంరెడ్డి అగ్రగణ్యుడని కొనియాడారు. రాంరెడ్డికి పద్మ అవార్డు విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చించి కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. సామాన్యులకు ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో రాష్ట్రం లో 500 రెసిడెన్షియల్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కోర్టు నుంచి వర్క్షాప్ వరకు గల రోడ్ ను రాంరెడ్డిరోడ్గా నామకరణం చేయనున్నట్లు తెలిపా రు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ రాం రెడ్డి యూజీసీ చైర్మన్గా ఉన్నప్పుడే విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపునూ ప్రవేశపెట్టారని గుర్తు చేసుకున్నా రు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఐడీసీ చైర్మన్ ఈ ద శంకర్రెడ్డి మాట్లాడుతూ దూరవిద్య ద్వారా ఎం ద రో ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్రె డ్డి మాట్లాడుతూ రాంరెడ్డి ఆశయసాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం విగ్రహ కమిటీ ప్రతినిధులను సన్మానించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, గ్రంథాలయసంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, గడ్డం రాంరెడ్డి కుమారుడు గడ్డం ప్రమోద్రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, విగ్రహ కమిటీ ప్రతినిధులు ఎడవెల్లి విజయేందర్రెడ్డి, మెతుకు సత్యం, రఘువీర్సింగ్, రెడ్డి సంఘం అధ్యక్షు డు ముద్దసాని లక్ష్మారెడ్డి, ఊట్కూరి రాదాకృష్ణారెడ్డి, ఓ పెన్ యూనివర్సిటీ సహాయక కేం ద్రం సహాయసంచాలకులు ఈ.రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో మాటల లొల్లి !
-
నెల రోజుల్లో రిజిస్టర్ చేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపే ఏజెంట్లందరూ నెలలోగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ‘ఈ– మెగ్రేట్’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదంటే అక్రమ ఏజెంట్లుగా గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు, హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ హెచ్చరికలను ఖాతరు చేయకుండా పదేపదే వీసా మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై పీడీ యాక్ట్ ప్రయో గించాలని వారు పోలీసు శాఖను ఆదేశించారు. ఎన్ఆర్ఐ శాఖ వ్యవహారాలపై మంత్రులిద్దరూ శనివారం సచివాలయంలో పోలీసు, హోం, ఎన్ఆర్ఐ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం ఢిల్లీలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్తో జరిగిన భేటీలో చర్చించిన వివిధ అంశాల అమలుకు రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచ నలు జరిపారు. బతుకుదెరువుకోసం విదేశాలకు వెళ్లేవారిని మోసం చేస్తున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఏజెంట్లపై చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రులిద్దరూ అధికారులను ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ ఏజెంట్లపై చర్యలకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. దీనికి ప్రజలు పోలీసులకు సహకరించాలని మంత్రులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టామ్కాం కంపెనీ ద్వారా చట్టపరంగా విదేశాలకు వెళ్లాలని నిరుద్యో గులకు సూచించారు.రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలన్నారు. హైదరాబాద్లో విదేశీ భవన్ నిర్మాణానికి ఫిబ్రవరి రెండో వారంలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నారై శాఖాధికారులను ఆదేశించారు. అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి.. గల్ఫ్ దేశాలకు మహిళల అక్రమ రవాణా, మోసపూరిత వివాహాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక, ఎన్నారై, పోలీస్ శాఖలు ఉమ్మడిగా బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పాస్పోర్టు కార్యా లయ అధికారుల సహకారం తీసుకోవాలన్నా రు. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఎన్నారై, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవద్దు
సాక్షి, నల్లగొండ: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీజీవో గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీకి తేడా ఉంటుందన్నారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగు అయ్యే పరిస్థితుల్లో ...అందులోని బలమైన నాయకులను టీఆర్ఎస్లోకి తీసుకువడం ద్వారా సుస్థిరమైన ప్రభుత్వం నడపాలనే తీసుకునే నిర్ణయంలో ఇలాంటివి సహజమన్నారు. స్థానిక పరిస్థితులు, జిల్లా రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని గుత్తా వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ ఉద్యమకారులను తిట్టినోళ్లు, కొట్టినోళ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద ఉన్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా రెండురోజుల క్రితం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. నాడు కేసీఆర్ను బండబూతులు తిట్టిన వారే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతున్నారని తనదైన శైలిలో విరుచుకుపడిన విషయం విదితమే. అయితే తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకలించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నామని అన్నారు. -
రెడ్డి కులస్తులంతా ఏకం కావాలి
హైదరాబాద్: రెడ్డి కులస్తులంతా ఏకం కావాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్లోని మేకల జంగారెడ్డి గార్డెన్లో రెడ్డి సామాజిక సార్వజనిక సంక్షేమ సంఘం 3వ వార్షికోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయిని మాట్లాడుతూ ఎవరికి వారు వేర్వేరు సంఘాలు పెడుతూ వాటిని రాష్ట్ర స్థాయి సంఘాలుగా చెప్పడం ప్రధాన సంఘాన్ని పలుచన చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఐకమత్యం లేకుండా ఇలా వీధికో సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడంతో చులకనభావం ఏర్పడుతుందన్నారు. ఒకటే సంఘంగా ఏర్పాటై సమస్యలను పరిష్కరించుకునే మార్గంలో ముందుకు నడవాలని సూచించారు. సంఘ ప్రతినిధుల వినతి మేరకు రెడ్డి సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో రైతు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి పంటకు, రైతుకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి ఇవ్వడం ప్రభుత్వ ఘనతేనని గుర్తు చేశారు. పేద రెడ్డి కులస్తులను ఆదుకుంటామని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కంసాని సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్రెడ్డి, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మేకల అనలారెడ్డి, రెడ్డి హాస్టల్ అధ్యక్షుడు ఎడ్ల రఘుపతిరెడ్డి, కొంపల్లి మోహన్రెడ్డి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు: నాయిని
సాక్షి, హైదరాబాద్ : ఇంటికో ఉద్యోగం ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయిని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. తాము ఇచ్చిన మాటప్రకారం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని విజయపథంలో నడిపిస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అంతకుముందు నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మేయర్ దంపతులు బొంతు రామ్మోహన్, శ్రీదేవి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సామ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేద రెడ్డి కుటుంబాలను ఆదుకుంటాం
కీసర:పేద రెడ్డి కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. ఆదివారం కీసరగుట్టలో నిర్వహించిన కుషాయిగూడ రెడ్డి సంక్షేమ సం ఘం 5వ వార్షికోత్సవం, 2018 క్యాలెం డర్ ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంక్షేమ సంఘాలన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి రెడ్డి కులస్థుల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. పేద రెడ్డి పిల్లల ఉన్నత చదువుల కోసం ఇతర కులస్తులకు ఇస్తున్నట్లుగానే రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ సముఖంగా ఉన్నారన్నారు. రెడ్డి సంక్షేమ సంఘాలను బలోపేతం చేసుకొని సామా జిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహి ంచాలని ఆయన అభిలషించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి, కుషాయిగూడ రెడ్డి సంక్షేమం అధ్యక్షుడు చిటుకుల నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి నరేందర్రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నేతలు ఎల్లారెడ్డి, వసంతరెడ్డి, సంతోష్రెడ్డి, రాజిరెడ్డి, రాంరెడ్డి, వల్లారెడ్డి, కందాడి హనుమంత్రెడ్డి, శివరాంరెడ్డి, హరిప్రసాద్రెడ్డి, బలవంత్రెడ్డి, గోపాల్రెడ్డి, కొండల్రెడ్డి, విజయ్కుమార్రెడ్డి, వెంకట్రెడ్డి, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం
సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని’ రాష్ట్ర హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అందజేశారు. శనివారం ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) టాటా (తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్) సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాయి. ‘‘కృష్ణకు ఆటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేయడం తెలుగు జాతికి గర్వకారణం’’ అని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘నాకు జీవితంలో అనేక అవార్డులు వచ్చాయి. ప్రతిసారీ నాకు హీరోగా అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలను గుర్తుకు చేసుకుంటాను. హీరోగా తొలి పరిచయం చేసిన అదుర్తి సుబ్బారావుకు కతజ్ఞతలు’’ అని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు జి.వివేక్, ఆటా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి అసిరెడ్డి, టాటా అధ్యక్షులు జాన్సీరెడ్డితో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, ఆదిశేషగిరిరావు, నటి విజయనిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఎన్నారై భవనానికి స్థలం కేటాయించండి..!
సిడ్నీ: ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన తమ ప్రతినిధుల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజమ్ అలీ, టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు సంతోష్ గుప్తాని ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వివిధ ఎన్నారై సభ్యులను తెలంగాణ హాంమంత్రి నాయని నర్సింహారెడ్డి కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై భవనం నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయిస్తే వివిధ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు అందరు కలిసి ఎన్నారై భవనం నిర్మించుకుంటామని అన్నారు. తెలుగు ఎన్నారైల కోసం భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు వారు వివరించారు. తెలంగాణలో కూడా ఎన్నారై భవనం వస్తే పలు లాభాలుంటాయని, భారతదేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నారై భవనం హైదరాబాద్లో నిర్మాణం కోసం స్థలం కేటాయింపు కొరకు తాను సీఎం కేసీఆర్తో చర్చించి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. తెలంగాణలో ఎన్నారైలు సుఖంగా తమ వ్యాపారాలు చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న పలు ఎన్నారై సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. తెలంగాణ సాధనలో ఆ పార్టీ నేతల కృషిని వారు అభినందించారు. తెలంగాణలో అసలైన అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ ద్వారానే జరుగుతుందనీ, 2019 లో అన్ని వర్గాలు కారు గుర్తుకే ఓటు వేస్తారని తెలంగాణ హోంశాఖా మంత్రి నాయని నర్సింహారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కొరకై ఎన్నారైలు కీలక పాత్ర వహించాలని నాయని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం ఆస్ట్రేలియా సభ్యులు నల్లా ప్రవీణ్ రెడ్డి, కపిల్ కాట్పెల్లీ ప్రశాంత్ కడపర్తి, అశోక్ మారం సందీప్ మునగాల, ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల, రామ్ గుమ్మడివాలి, గోవర్దన్ సుమేషు రెడ్డి, వాసు తాట్కూర్, ప్రమోద్ ఎలెటే, డేవిడ్ రాజు, శశి మానేం, వినోద్ ఏలేటి తదితరులు నాయనితో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నారై భవనం కోసం ఎయిర్ పోర్టుకు దగ్గర్లో స్థలం కేటాయిస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు
సిడ్నీ : ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతు ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్శిటీ అని, ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా, మహానేతలుగా తీర్చిదిద్దిన ఘనచరిత్ర కలదని, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలకు పురిటిగడ్డ అని కొనియాడారు. చరిత్రలో నిలిచిన ఒక విద్యా సంస్థకు వందేండ్లు రావడం, శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సభ్యులు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి. శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతు తాను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని అన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నా తెలుగు ఆడపడుచులు అందరు తెలంగాణలో తయారు చేసిన పోచంపల్లి చీరలు ధరిస్తే తెలంగాణలో వున్న పోచంపల్లి కార్మికులకు ఎంతో ఉపోయోగపడుతారని అన్నారు. అనంతరం ఆస్ట్రేలియా ఎంపి జోడీ మెకాయ్కు తెలంగాణ గుర్తుగా ప్రత్యేక పోచంపల్లి చీరను బహుకరించారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎంపిలు జోడి మెకాయ్, జియోఫ్రేలీ, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆజాం అలీ, సీనియర్ నాయకులు సంతోష్ గుప్తా, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల కమిటీ చైర్మన్ వినోద్ ఎలెట, ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి, వివిధ ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో నాయనికి ఘనస్వాగతం
సిడ్నీ: ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన హోంశాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డికి ఇక్కడ ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం సిడ్నీలోని కింగ్స్ ఫోర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాయని బృందానికి ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్ సభ్యులు, తెలంగాణ సంఘాలైన తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరమ్, ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. హోం మంత్రి నాయని ఆస్ట్రేలియాలోని పలువురు నేతలను కలుసుకుని తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించనున్నారు. అదే విధంగా డిసెంబర్ 2న ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, అనిల్ మునగాల, ప్రదీప్ సేరి, రామ్ గుమ్మడివాలి, గోవర్దన్, సుమేషు రెడ్డి, వాసు తాట్కూర్, ప్రశాంత్ కడపర్తి, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల కమిటీ చైర్మన్ వినోద్ ఎలెట, భారతీ రెడ్డి, ఇంద్రసేన్, పాపి రెడ్డి, నరసింహ రెడ్డి తదితరులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. నాయని నర్సింహారెడ్డితో పాటు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజమ్ అలీ, టీఆర్ఎస్ సీనియర్ నేత సంతోష్ గుప్తా శతాబ్ది ఉత్సావాల్లో పాల్గొంటారు.