‘ఒత్తిడిని జయించడం’ పుస్తకావిష్కరణ | Naini Launched A Book | Sakshi
Sakshi News home page

‘ఒత్తిడిని జయించడం’ పుస్తకావిష్కరణ

Published Wed, Jun 27 2018 2:18 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

Naini Launched A Book - Sakshi

 పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి  

మఠంపల్లి : మైండ్‌ పవర్‌లో ప్రపంచ రికార్డ్‌ సాధించిన తాటికొండ వేణుగోపాల్‌రెడ్డి రచించిన ఒత్తిడిని జయించడం (కాంక్యూర్‌స్ట్రెస్‌) పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్‌లో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఒత్తిడి ప్రమాదకరమైన వైరస్‌ అని ఈ పుస్తకం ఆ వైరస్‌ను విద్యార్థులకు సోకకుండా చేస్తుందన్నారు. పుస్తకాన్ని రచించిన మరో రచయిత విజయార్కె మాట్లాడుతూ ప్రాక్టికల్‌ థింకింగ్, మన ఆలోచన విధానం ఎలా ఉండాలో, ఒత్తిడిని ఎలా జయించాలో ఈ పుస్తకం తెలియజేస్తుందన్నారు.

అంతేగాక పుస్తకాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదవదగ్గ పుస్తకమని, తల్లిదండ్రులకు మార్గదర్శకంగా ఉంటుందని అభినందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో శివారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసాచారి తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement