‘ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారు’
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం హోం గార్డుల సమస్యలపై చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా హోం గార్డుల జీతాలు పెంచాలని ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ , కిషన్ రెడ్డి కోరారు. ఈ విషయం పై స్పందించిన హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచినట్టు తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హోంగార్డుల విషయంలో రాధ్దాంతం చేస్తున్నారన్నారు.