సాక్షి, సిటీబ్యూరో: బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 వరకు నగరంలోని స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల మినహా ఎక్కడా మద్యం విక్రయించకూడదని ఆయన స్పష్టం చేశారు.