bonalu
-
మల్లన్న పట్నం వేసి బోనం చేసిన సోనియా ఆకుల (ఫోటోలు)
-
సూర్యాపేట : పెద్దగట్టు జాతరలో బోనం ఎత్తిన ఎమ్మెల్సీ కవిత (ఫొటోలు)
-
శ్రీ గజ్జలమ్మదేవి వార్షికోత్సవాలు బోనాలు సమర్పించిన భక్తులు (ఫొటోలు)
-
హైదరాబాద్: రాజ్భవన్ లో ఆషాడ బోనాలు ఉత్సవాలు (ఫోటోలు)
-
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్ను అధిక బడ్జెట్తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024 -
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బోనాల సందడి దృశ్యాలు
-
భాగ్యనగరంలో బోనాల సంబురం.. (ఫొటోలు)
-
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పాల్గొని.. అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ కరోనా వంటి మహమ్మరులు రాకుండా అమ్మవారు ప్రజలందరిని కాపాడలని కోరుకున్నాను. గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్తో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మిస్తాం. ... హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్న మూసి నదిని ప్రక్షాళన చేస్తున్నాం. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాం. మేడిగడ్డ బ్యారేజి కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకర్ల ప్రశ్నకు.. దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదు’’ అని అన్నారు. -
Bonalu: బోనాల్లో డ్యాన్స్ వేసేవాణ్ని
‘నేను పెరిగింది హైదరాబాద్ పాతబస్తీలో. చిన్నప్పటి నుంచి లాల్ దర్వాజా బోనాలు చూస్తూ పెరిగాను. పోతరాజు వేషంలో డ్యాన్స్ చేసేవాళ్లని చూస్తుంటే సంతోషంగా ఉంటుంది. డ్రమ్స్, మ్యూజిక్, డ్యాన్స్ చూస్తుంటే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంటుంది. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక డైరెక్టుగా బోనాల్లో పాల్గొనలేకపోతున్నాను గాని.. లాల్ దర్వాజా, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ.. ఇలా అమ్మవార్ల బోనాల ఉత్సవాలను టీవీలో చూస్తుంటాను.. చాలా సంతోషంగా ఉంటుంది’ అని సినీ నటుడు ప్రియదర్శి అన్నారు. సహాయ, కామెడీ పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. నగరంలో బోనాల పండగ జోరుగా జరుగుతున్న సందర్భంగా ‘సాక్షి’తో తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను గమనిస్తున్నది ఏంటంటే.. బోనాల తర్వాత మనకు తప్పకుండా వర్షం వస్తుంది. ఈ విషయాన్ని నేను ఏళ్ల తరబడి చూస్తున్నాను. బోనాల సమయంలో తప్పనిసరిగా వర్షం రావడం మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్లో అన్ని కులాలు, మతాల వారు బోనాల ఉత్సవాలను ఎంతో సంబరంగా జరుపుకోవడం సంతోషంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు బోనాల్లో డ్యాన్స్ చేసేవాణ్ని. పోతరాజు వేషధారణల మధ్య డ్యాన్స్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. అలాగే హైదరాబాద్లో యాదవ సోదరులు సదర్ ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అవి కూడా నాకెంతో ఇష్టం.. నేను పాల్గొనేవాణ్ని. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్లో నేను ఘంటా రవి పాత్ర చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ బాగా రిఫరెన్స్గా వాడుకున్నా. సెలబ్రిటీ అయ్యాక బోనాలు, సదర్ ఉత్సవాల్లో డైరెక్టుగా పాల్గొనలేకపోతున్నాను. తప్పదు.. కొన్నింటిని త్యాగం చేయాల్సిందే. సంక్రాంతి పండగను ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘనంగా జరుపుకుంటారో హైదరాబాద్లోనూ అంతే గ్రాండ్గా జరుపుకొంటారు. తెలంగాణలో సమ్మక్క– సారక్క, కొండగట్టు అంజన్న, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, మల్లన్న జాతర.. ఇలాంటివన్నీ సంస్కృతికి నిదర్శనం’. హిందువుల పండగలనే కాదు... నాకు అన్ని పండగలూ ఇష్టమే. ప్రత్యేకించి రంజాన్, బక్రీద్ సమయంలో ముస్లిం స్నేహితులని కలవడం.. వారు పెట్టే ఖీర్ (పాయసం) తినడం చాలా హ్యాపీగా ఉండేది’ అన్నారు ప్రియదర్శి. -
తెలంగాణ సచివాలయంలో బోనాల వేడుకలు (ఫొటోలు)
-
మహబూబ్నగర్ : ఘనంగా పోచమ్మ అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
NRI Video: TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
-
TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం (21 జూలై 2024) మధ్యాహ్నం అత్యంత వైభవంగా జరిగాయి. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూరులో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. ఇతరులు తో కలిపి సుమారు 1000 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలుగింటి ఆడపడుచులకు జిఆర్టి జెవెల్లెర్స్ వారు తాంబూళంతో కూడిన గూడీ బ్యాగ్ అందజేసి అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సింగపూర్ లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా అందరు తెలుగు వారితో పాటు ఇతరులు ఈ బోనాల జాతరలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా టీసీఎస్ఎస్ వారు తొలిసారి 2017 లో బోనాల పండుగను నిర్వహించి సింగపూర్ కు ఈ పండుగ ప్రాముఖ్యతని పరిచయం చేసిన రోజులను గుర్తు చేసుకొని సంతోషించారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు.బోనాల జాతర లో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్ మరియు అరవింద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో గడప స్వాతి రమేశ్, గోనె రజిత నరేందర్ రెడ్డి, ఎర్రమ రెడ్డి దీప్తి శిశిధర్ రెడ్డి, అలేఖ్య దార, బండ శ్రీదేవి మాధవ రెడ్డి, బొందుగుల ఉమారాణి రాము , నడికట్ల కళ్యాణి భాస్కర్, కాశబోయిన హర్షిని (W/O ప్రవీణ్) , భూక్య మీనా శ్రీధర్ , గౌరీ శ్రీవాణి శ్రీనివాస్ , తడిసిన అలేఖ్య లక్ష్మినర్సింహ , మందాడి సులోచన అనిల్ కుమార్ , శ్వేతా కుంభం , చాడ అనిత వేణుగోపాల్ రెడ్డి , బెహరా మాధవి, అమిత్ సేథీ ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. వీరితో పాటు గడప రమేశ్ అమ్మవారికి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.బోనాల పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిల్ల, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి ఎర్రమ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి చెన్నప్పగారి మరియు పెరుకు శివ రామ్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ , GRT జువెల్లర్స్ , వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్ , తందూర్ లౌంజ్ ఇండియన్ రెస్టారెంట్ ,ప్రాడ్ ఈవెంట్ మేనేజ్ మెంట్, GRT ఆర్ట్లాండ్, నిక్స్ గ్లోబల్ రియాలిటీ, మంచికంటి శ్రీధర్, రాము బొందుగుల, లాలంగర్ వేణుగోపాల్, రాధాకృష్ణ కవుటూరు, కొమాకుల సాయికృష్ణ, అజయ్ కుమార్ నందగిరి, చమిరాజ్ వెంకట రామాంజనేయులు (టింకర్ టాట్స్ మాంటిస్సోరి) గార్లకు మరియు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.తెలంగాణ బోనాల పండుగ ప్రాముఖ్యత మరియు విశిష్టతని సింగపూర్ వాసులకు తెలియపరిచే ప్రేరణతో ఫేస్బుక్ వేదికగా నిర్వహించిన పోటీలలో భాగంగా ఉత్తమ రచన విజేతలుగా నిలిచిన మొదటి ఐదుగురికి కల్వ లక్ష్మణ్ రాజ్ గిఫ్ట్ వౌచెర్స్ ని అందచేశారుఈ వేడుకలకు సునీత రెడ్డి మిర్యాల, సంతోష్ వర్మ మాదారపు, మణికంఠ రెడ్డి చెన్నప్పగారి , శశిధర్ రెడ్డి ఎర్రమ రెడ్డి , శివ ప్రసాద్ ఆవుల, గోనె నరేందర్ రెడ్డి, బొందుగుల రాము ,రవి కృష్ణ విజాపూర్, నంగునూరి వెంకట రమణ, పెరుకు శివరామ్ ప్రసాద్ మరియు కాసర్ల శ్రీనివాస రావు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.వీరితో పాటు పండుగ వేడుకలో సహాయపడిన సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి,కల్వ లక్ష్మణ్ రాజ్ , ఫణి భూషన్ చకిలం మరియు సాయికృష్ణ కొమాకుల గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. -
కోరినన్ని వర్షాలు కురుస్తాయి..
రాంగోపాల్పేట్(హైదరాబాద్): సికింద్రా బాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు సోమవారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్స వాల్లో రెండో ఘట్టమైన రంగం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9.55 గంటల సమ యంలో అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఉండే మాతంగేశ్వరి గుడి ముందు పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. ‘ఈ ఏడాది భక్తులు సమర్పించిన బోనాలు, సాక, పూజలు నాకు ఆనందాన్ని చ్చాయి. కోరినన్ని వర్షాలు కురుస్తాయి. నా ప్రజలందరినీ బాగా చూసుకుంటా, నన్ను నమ్ముకున్న వారిని నేను కాపా డుకుంటా. నా రూపాన్ని పెట్టాలనే సంకల్పాన్ని నెర వేర్చుకుంటా. నాకు శాశ్వత రూపం పెట్టా లని చూస్తున్నారు అది చేయండి, నాకు రక్తబలిని ఇవ్వడం లేదు. మీకు నచ్చింది ఇస్తున్నారు. దాంతోనే నేను సంతోషంగా ఉన్నాను. అదే చాలు. 5 వారాలపాటు పప్పు, బెల్లంతో సాక పెట్టండి. పంటల్లో ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు, వాటితో రోగాలు పెరిగిపోతున్నాయి, వాటి ని తగ్గించుకోండి. పిల్లలు, గర్భిణీలకు ఏ ఇబ్బంది రానివ్వను. అంద రినీ సంతోషంగా ఉండేలా చూసుకుంటా ను’అని అన్నా రు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్య దర్శి శైలజా రామయ్యర్, కమి షనర్ హన్మంతరావు, కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి, ఈవో మనోహర్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.ఘనంగా అమ్మవారికి సాగనంపు..: బోనా లు, రంగం అనంతరం అమ్మవారి సాగనంపు కార్యక్రమాన్ని ఘనంగా చేప ట్టారు. అమ్మవారిని అంబారీపై ఉంచి, అమ్మవారి ఘటంతో సాగనంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనితో జాతర ముగిసింది. -
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
ఓల్డ్ సిటీ మహంకాళి జాతర బోనాల సందర్భంగా ఘట్టాల ఊరేగింపు (ఫోటోలు)
-
సికింద్రాబాద్: లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా తొలి బోనాన్ని సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సకాలంలో మంచి వర్షాలు పడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. హైదరాబాద్ జంట నగరంలోనే కాకుండా వంద సంవత్సరాల నుంచి సంస్కృతి సాంప్రదాయాలతో ఈ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి అన్నారు.ఈ రోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు, 28వ తేదీ లాల్ దర్వాజా బోనాలు, తర్వాత రంగం, అంబారీ ఊరేగింపు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు సహకారం కావాలని కోరారు. -
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో శాకాంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
మహంకాళి అమ్మవారి బోనాలకు శివశక్తుల దూరం..! రాష్ట్రానికి మంచిది కాదు..
-
టాక్ ఆధ్వర్యంలో లండన్లో ఘనంగా బోనాల వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లండన్ కి ఉన్నత చదువులకోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, మన తెలంగాణ సంస్కృతి కోసం బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చాడు. పోతురాజు విన్యాసాన్నీ ప్రవాసులే కాక హాజరైన ముఖ్య అతిధులు సైతం ప్రసంశించి సత్కరించారు.టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి శుష్మణ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వేడుకలకు, వ్యాఖ్యాతగా ఉపాధ్యక్షులు సత్య మూర్తి చిలుముల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ పాల్గొన్నారు.హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ మాట్లాడుతూ.. యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న నన్ను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.స్థానిక కౌన్సిళ్లర్లు అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, ఆదేశ్ ఫర్మాహాన్, బంధన చోప్రా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ "బోనాల" వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే,ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేక సత్కరించి, బహుమతులందజేశారు.కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని,. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని తెలిపారు.టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ ,తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచం లో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శనంగా ఉందని తెలిపారు.టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం అన్న తన సహకారం, సూచనలు, స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నాం అని తేలిపారు.సంస్థ ఉపాద్యక్షురాలు శుషుమన రెడ్డి మాట్లాడుతూ, టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.ఎన్నారై బీ. ఆర్. యస్ యూకే అధ్యక్షులు మరియు టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ దూసరి గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, , ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు - బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంట్ స్పాన్సర్స్, అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపిక లతో ప్రశంసించారు. టాక్ ముఖ్య నాయకులు సుప్రజ పులుసు, గణేష్ కుప్పలా, హరి గౌడ్ నవపేట్, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, శ్రీకాంత్, క్రాంతి మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషం గా ఉందని తెలిపారు. ఇతర ఎన్నారై సంఘాల యూకే ప్రతినిధులు వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు.ఈ కార్యక్రమంలో టాక్ అద్యక్షులు రత్నాకర్ కడుదుల, అశోక్ దూసరి, శుష్మున రెడ్డి, సత్య చిలుముల , మట్టా రెడ్డి , వెంకట్ రెడ్డి , సురేష్ బుడగం , జహ్నవి వేముల , రవి రేతినేని , రవి ప్రదీప్ పులుసు , రాకేష్ పటేల్ , సత్యపాల్ , మల్లా రెడ్డి,గణేష్ కుప్పాల , సత్యం కంది , శ్రీకాంత్ జెల్ల , శ్రీధర్ రావు , మధుసూదన్ రెడ్డి , శైలజ జెల్ల ,స్నేహ , శ్వేతా మహేందర్ , స్వాతీ , క్రాంతి , పవిత్ర , సుప్రజ , శ్వేత , శ్రీ విద్య , నీలిమ , పృద్వి , మని తేజ ,గణేష్ పాస్తం , నిఖిల్ రెడ్డి , హరి గౌడ్ , నవీన్ రెడ్డి , కార్తీక్ , రంజిత్ , రాజేష్ వాక, మహేందర్, వంశీ , ఆనంద్ , అక్షయ్ , పావని , జస్వంత్ , శివ వెన్న , నాగ్ , మాడి, వినోద్ , సన్నీ , సందీప్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. -
Nabha Natesh: బిర్యానీ.. అదో ఎమోషన్!
‘హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. ఇక్కడ చాలా రకాల బిర్యానీలు ఉంటాయి. ధమ్ బిరియానీ, మొఘల్ స్టైల్, నాటుకోడి, పులావ్, ఆవకాయ్, ఉలవచారు బిర్యానీ.. ఇలా ఎన్నోరకాలు ఉంటాయి. హైదరాబాద్ బిర్యానీ అంటే కేవలం ఫుడ్ కాదు.. అదొక ఎమోషన్. నాకు ఇక్కడి హలీమ్ అంటే చాలా ఇష్టం. హలీమ్ సీజన్లో తప్పకుండా తింటాను’ అని హీరోయిన్ నభా నటేశ్ అన్నారు.‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచి్చన ఈ బ్యూటీ ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘డార్లింగ్’. ప్రియదర్శి హీరోగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నగరానికి వచ్చిన నభా హైదరాబాద్తో తనకున్న అనుబంధాన్ని, బోనాల పండుగ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సాక్షి, సినిమా డెస్క్ఇదే నా ఫస్ట్ హోం..భాగ్యనగరం నాకిప్పుడు ఫస్ట్ హోం అయిపోయింది. నా స్వస్థలం కర్నాటకలోని చిక్మంగళూర్. చిన్నప్పటి నుంచి వేర్వేరు ప్రదేశాల్లో పెరిగాను. కానీ, ఆరేళ్లుగా తెలుగు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. ఎంతో ప్రేమగా మాట్లాడతారు.. అభిమానిస్తారు.ఇక్కడి హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. ఫుడ్ అద్భుతంగా ఉంటుంది.. కావాల్సినంత పెడతారు(నవ్వుతూ). స్వీట్ చాలా ఎక్కువ తినిపిస్తారు. స్వీట్స్ని నేను ఎక్కువగా తినను. ఎందుకంటే డైట్లో ఉంటాను. ఏదైనా ఫంక్షన్కి వెళ్లినప్పుడు అయ్యయ్యో... ఇప్పుడు ఎలా? తప్పకుండా స్వీట్స్ తినాలనే ఫీలింగ్ వస్తుంది. ఏదేమైనా హైదరాబాద్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. బోనాలంటే ఇష్టం..హైదరాబాద్లో జరిగే బోనాలంటే నాకు చాలా ఇష్టం. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో బోనాల పాటకి నేను డ్యాన్స్ కూడా చేశాను. ఆ పాట చాలా బాగా పాపులర్ అయ్యింది. నేను కూడా బోనం ఎత్తుకున్నాను. ప్రస్తుతం బోనాల సమయంలోనే మా ‘డార్లింగ్’ మూవీ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని ఆత్రుతగా ఉంది. మా నిర్మాత చైతన్య మేడంగారు ప్లాన్ చేస్తామని చెప్పారు. తప్పకుండా పాల్గొంటాను.ఆ నమ్మకంతోనే...ప్రత్యేకించి ఈ నగర సంస్కృతి అంటే ఇష్టం. బాగా చూసుకుంటారు. నా మొదటి సినిమాకు మా అమ్మ తోడుగా వచ్చేది. కానీ, ఇక్కడివారు ఎంతో జాగ్రత్తగా చూసుకునే విధానం అమ్మకి నచి్చంది. నేను తోడు రాకున్నా ఎంతో కేరింగ్గా చూసుకుంటారని అమ్మకి రావడంతో ఇప్పుడు రావడం లేదు. సినిమా సెట్స్లో నటీనటులను బాధ్యతగా చూసుకుంటారు.. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. మంచి సౌకర్యాలు కల్పిస్తారు.. గౌరవం ఇస్తారు. – సినీ నటి నభా నటేశ్ -
వైభవంగా సోమాజిగూడ శ్రీ రేణుక మహాలక్ష్మి ఎల్లమ్మ కళ్యాణం దృశ్యాలు..
-
సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి
లంగర్హౌస్ (హైదరాబాద్): గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, అయితే సీఎం రేవంత్రెడ్డి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో మెదటి బోనాల పూజలు అందుకునే గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆదివారం లంగర్హౌస్లో ప్రారంభించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారమ్యన్, గోల్కొండ జగదాంబిక ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద్ల ఆధ్వర్యంలో మంత్రులు లంగర్హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నజర్బోనంతో, తొట్టెలను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఈ సంవత్సరం రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున గోల్కొండకు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.20 కోట్లు మంజూరు..అనంతరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లా డుతూ.. బోనాల ఉత్సవాల నిర్వహణకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు గత సంవత్సరం కంటే రూ.5 కోట్లు ఎక్కు వగా అంటే ఈ సంవత్సరం రూ.20 కోట్లు మంజూరు చేశా మని తెలిపారు. ఒక వేళ ఈ నిధులు సరిపోకపోతే మరింత అందజేస్తామని వివరించారు. గోల్కొండ బోనాలు నిర్వ హించే కార్వాన్ నియోజకవర్గానికి 73 లక్షల 15 వేల రూపా యలు మంజూరు చేశామన్నారు. అనంతరం ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జంట నగరాల బోనా ల ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. దానం నాగేందర్, చిన్నారెడ్డి, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంత రావు, సీపీ శ్రీనివాస్రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. -
రేపట్నుంచే ఆషాడ బోనాల జాతర.. గోల్కొండతో షురూ (ఫొటోలు)
-
బంగారు బోనం కోసం ఏర్పాట్లు షురూ
చార్మినార్: రానున్న ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఏటా మాదిరిగానే సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పించేందుకు భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బంగారు పాత్రలోని నైవేద్యాన్ని ఏడు అమ్మవారి ఆలయాలకు తీసుకెళ్లి సమర్పించేందుకు జోగిని నిషా క్రాంతికి సోమవారం మీరాలంమండిలో ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య, చంద్రకళ దంపతులు వాయినాన్ని అందజేశారు. జులై 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమరి్పంచే బంగారు బో నంతో బంగారు బోనం కార్యక్రమాలు ప్రారంభమవుతాయని గాజుల అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మాజీ చైర్మన్ పొటేల్ సదానంద్ యాదవ్, మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరమ్మ జాతర చూసొద్దాం రండి!
కైకలూరు: చుట్టూనీరు.. మధ్యన ద్వీపకల్పం.. పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. వేంగి రాజుల కాలంలో నిర్మించిన పురాతన క్షేత్రంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొల్లేటి గ్రామాల ఆరాధ్య దేవత పెద్దింట్లమ్మ క్షేత్రంలో అనేక విశేషాలున్నాయి. ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గ, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చరిత్రలో కొల్లేటికోట ‘దండకారణ్య మధ్యమున మహా సరస్సొకటి కలదు. అది జల విహంగములతో అత్యంత రమణీయమైనది’ అని అగస్త్యుడు శ్రీరామచంద్రునితో చెప్పినట్టు రామాయణంలోని అరణ్య కాండంలో పేర్కొనబడింది. చైనా యాత్రికుడు హ్యుయాన్త్సాంగ్ కొల్లేరు సరస్సును ఒక మహత్తర మంచినీటి సరస్సుగా అభివర్ణించారు. దండి మహాకవి ‘దశకుమార చరిత్ర’లో కొల్లేరు సరస్సుతోపాటు బహు సాహసిగా పేరు గడించిన తెలుగు భీముడు (భుజబలపట్నం ఆ«దీశుడు) గురించి రాశారు. విజయాదిత్య చక్రవర్తి పార్వతీదేవి రూపంలో కొలువైన అమ్మవారిని మొదటిసారిగా పెద్దమ్మగా సంబోధించారు. కమలాకరపుర వల్లభుల శాసనాల ప్రకారం వేంగి–చాళుక్య రాజులకు వైవాహిక బాంధవ్యాలు ఉండేవి. వీరికి ప్రధాన పురాలుగా కమలాకరపురం (ఏలూరు), పద్మినీపురం (గణపవరం), కొలనువీడు (కొల్లేటికోట)ను వ్యవహరించారు. కోస్తా జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద అనివేటి మండపాన్ని దాతల విరాళం రూ.4.50 కోట్లతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) నిర్మించారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ క్షేత్రానికి చేరుకోవడానికి సర్కారు కాలువపై ఇనుప వంతెన మాత్రమే ఆధారంగా ఉండేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.14.70 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు పూర్తి పెద్దింట్లమ్మ జాతర మార్చి 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. 21న జలదుర్గ, గోకర్ణేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తాం. కల్యాణం రోజునే ప్రభ బండి, బోనాలు, కలువమ్మల గ్రామోత్సవం జరుగుతుంది. చివరి రోజున కోనేరులో తెప్పోత్సవం ఉంటుంది. కొల్లేరు వారధి పూర్తికావడంతో ఈ ఏడాది భక్తుల తాకిడి మరింతగా పెరుగుతుందని భావిస్తున్నాం. – కందుల వేణుగోపాలరావు, ఈవో -
ఖైరతాబాద్లో ఘనంగా గంగ తెప్పోత్సవం బోనాలు (ఫోటోలు)
-
సింగపూర్లో ఘనంగా బోనాల పండగ
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తిగీతాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ, అమ్మవారి నామస్మరణలతో కార్యక్రమం హోరెత్తింది. పలువురు మహిళలు కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనం ఆ జగన్మాతకు ఆషాడ మాసంలో సమర్పించే నైవేద్యం. అరకేసరి దేవాలయంలో మహిళలు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజు ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. పలువురు తెలుగువాళ్లు ఆ వేడుకలో పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు పండగ మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయక పండగని,దీన్ని ప్రతీ సంవత్సరం జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. బోనాలు సమర్పించిన మహిళలల్ని, కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. -
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
సికింద్రాబాద్ లష్కర్ బోనాలు....నేడు రంగం భవిష్యవాణి
-
Telangana Bonalu 2023 Photos: ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫొటోలు)
-
లండన్లో ఘనంగా బోనాల జాతర
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి సుమారు 1200కి పైగా తెలుగు, ఇతర ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్లుగా సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా,ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయన్నారు. అనంతరం బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేకంగా సత్కరించి బహుమతులు అందజేశారు. -
Golconda Bonalu Photos: గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
Golconda Bonalu 2023 : గోల్కొండ బోనాలు షురూ (ఫొటోలు)
-
పాతబస్తీలో ఘనంగా బోనాలు
సాక్షి, హైదరాబాద్: డప్పు వాయిద్యాలు.. యువకుల కేరింతలు.. పోతరాజుల నృత్యాలు.. అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు.. ఆడపడుచుల బోనాలు.. అమ్మవారికి తొట్టెల సమర్పణ తదితర కార్యక్రమాల మధ్య పాతబస్తీలో ఆదివారం బోనాల జాతర కన్నుల పండువగా జరిగింది. భక్తులు తెల్లవారుజామునే లాల్దర్వాజ సింహవాహినీ దేవాలయం అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ కట్టారు. అలాగే పాతబస్తీలోని ఇతర మహంకాళి దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పటిష్ట భద్రత మధ్య... బోనాల జాతర ఉత్సవాలకు దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దక్షిణ మండలం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ బోనాల జాతర వేడుకల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ పట్టువస్త్రాలను సమర్పించారు. నేడు సామూహిక ఘటాల ఊరేగింపు... ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు బోనాలు పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పాతబస్తీ బోనాలు ఉత్సవంలో భాగంగా లాల్దర్వాజలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని ఆమె సందర్శించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. -
Bonalu: అంగరంగ వైభవంగా లాల్దర్వాజ సింహవాహిని బోనాలు
హైదరాబాద్లో అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడమాసం చివరి ఆదివారం లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. కాగా, నేడు(ఆదివారం) బోనాల్లో భాగంగా అమ్మవారికి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి బోనాన్ని సమర్పించారు. ఇక, తెలుగు కెరటం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా బోనమెత్తి అమ్మవారికి బోనం సమర్పించుకుంది. ఈ సందర్భంగా పీవీ సింధును ఆలయ కమిటీ సత్కరించింది. మరోవైపు.. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. రద్దీ పెరగడంతో గంటలపాటు క్యూ లైనులో వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమ్మవారి బోనాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. ఇది కూడా చదవండి: బోనమెత్తిన గవర్నర్ తమిళిసై -
Ujjaini Mahankali Bonalu: జంటనగర వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 17, 18వ తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా... కర్బల మైదాన్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రాణిగంజ్ చౌరస్తా నుంచి మినిష్టర్ రోడ్ మీదుగా, ఎస్పీ రోడ్లోని బేగంపేట హెచ్పీఎస్ వద్ద యూటర్న్ తీసుకుని సీటీవో, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ, సంగీత్, గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల మీదుగా స్టేషన్కు చేరుకోవాలి. ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా ట్యాంక్బండ్ వైపు వెళ్లాలి. ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తాడ్బంద్, బేగంపేట వెళ్లే ఆర్టీసీ బస్సులు క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా లేదా క్లాక్ టవర్, వైఎంసీఏ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే సాధారణ ట్రాఫిక్ గాస్మండి చౌరస్తా, సజ్జన్లాల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా వెళ్లాలి. ► ప్యాట్నీ ఎస్బీఐ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్ ప్యాట్నీ చౌరస్తా నుంచి మినిష్టర్ రోడ్, ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ సంగీత్ చౌరస్తా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా చిలకలగూడ వైపు నుంచి వెళ్లాలి. ► ప్యారడైజ్ వైపు నుంచి బైబిల్ హౌస్ వెళ్లాల్సిన వాహనదారులు ఎస్బీఐ, క్లాక్టవర్ మీదుగా వెళ్లాలి. ► క్లాక్ టవర్ నుంచి ఆర్పీరోడ్ వెళ్లే వాహనదారులు ప్యారడైజ్, మినిష్టర్ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► సీటీవో, ప్యారడైజ్ నుంచి ఎంజీరోడ్ వెళ్లే వాహనాలు సింధీకాలనీ, మినిష్టర్ రోడ్, కర్బల మైదాన్గా వెళ్లాలి. ► పంజగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్లే వాహనదారులు ఖైరతాబాద్ జంక్షన్, ఐమాక్స్ రోటరీ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్బండ్, ఆర్టీసీ చౌరస్తా, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనదారులు ఓల్డ్ గాంధీ, మోండా మార్కెట్, బైబిల్ హౌస్, కర్బల మైదాన్ మీదుగా వెళ్లాలి. ► ఉప్పల్ నుంచి పంజగుట్ట వెళ్లే వాహనదారులు రామంతాపూర్, అంబర్పేట్, హిమాయత్నగర్, ఖైరతాబాద్ రోడ్డును వినియోగించుకోవాలి. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ వైపు రెండు వైపుల రోడ్డు మూసి ఉంటుంది ఈ రోడ్డు వైపు రావద్దు. ► మహంకాళి ఆలయానికి వెళ్లే టొబాకోబజార్, హిల్స్ట్రీట్, సుభాష్రోడ్లో బాటా నుంచి రాంగోపాల్పేట్ పాత పోలీస్ స్టేషన్ వరకు, ఆదయ్యనగర్ నుంచి దేవాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే... ► బోనాల జాతరకు వచ్చే వాహనదారుల కోసం ట్రాఫిక్ పోలీసులు 8 ప్రాంతాల్లో పార్కింగ్లను ఏర్పాటు చేశారు. ► సెయింట్ జాన్సన్ రోటరీ, స్వీకార్ ఉపకార్, ఎస్బీఐ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్తో పాటు బెల్సన్ తాజ్ హోటల్, మహబూబ్ కళాశాల, ఎస్వీఐటీలో పార్కింగ్ చేసుకోవచ్చు. ► సుభాష్రోడ్, రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ జైల్ఖానా వద్ద, కర్బల మైదాన్, బైబిల్ హౌస్, గాస్మండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా స్కూల్, రాణిగంజ్, ఆదయ్యనగర్ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలు ఆదయ్య మెమోరియల్ స్కూల్లో, సీటీవో, బాలంరాయి, రసూల్పురా నుంచి వచ్చే వాహనాలు గాంధీ విగ్రహం వద్ద, మంజు థియేటర్ వైపు వచ్చే వాహనాలు అంజలి థియేటర్ వద్ద పార్కింగ్ చేసికోవచ్చు. ► ‘సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చే ప్రయాణికులు 10వ నంబర్ ప్లాట్ఫాం వైపు ఉన్న రహదారిని ఉపయోగించుకోవాలి’ అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. (క్లిక్: హైదరాబాద్ ఐఐటీ అదుర్స్) -
పోతరాజులతో కలిసి సరదాగా చిందులు వేసిన మంత్రి తలసాని
-
‘గణేష్ ఉత్సవాలను బాగా జరుపుకోవాలి’
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల నిర్వాహణపై ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ప్రభాకర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల నుంచి కరోనా వలన గణేష్ ఉత్సవాలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని అన్నారు. అయితే, ఈసారి దేవుని ఆశీస్సులతో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నాం... గణేష్ ఉత్సవాలను కూడా ఇలానే జాగ్రత్తగా నిర్వహించుకోవాలని తెలిపారు. వినాయక నిమజ్జన కోసం.. ప్రత్యేకంగా క్రేన్స్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈసారి ట్యాంక్ బండ్ నిండుకుండలాగా ఉందని అన్నారు. కాగా, విగ్రహల ఎత్తు గురించి ప్రభుత్వం ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదని అన్నారు. మూడు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వారు గణేష్ విగ్రహల ఏర్పాటుకి అనుమతి ఇస్తారని అన్నారు. చదవండి: Hyderabad: రెండు కేజీ బంగారు నగల బ్యాగు మిస్సింగ్ -
ఘనంగా లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు
-
పాతబస్తీలోని పలు దేవాలయాలను సందర్శించిన తలసాని
-
వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారు
-
సింగపూర్లో బోనాల పండుగ
సింగపూర్: బోనాల పండుగను సింగపూర్లో ఘనంగా నిర్వహించారు. బోనాలు నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో ఈ వేడుకలు 2021 జులై25న నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వం నిర్దేశించిన కరోనా నిబంధనల నడుమ ఈ వేడుకులు జరిగాయి. మహంకాళీ ఆశీస్సులు సింగపూర్లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ(TCSS) భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పరిమిత సంఖ్యలో సభ్యులు బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని భక్తులు కోరుకున్నారు. కరోనా కోరల నుంచి ప్రపంచాన్ని కాపాడాలని సోసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదేళ్లుగా ఐదేళ్ల కిందట తెలంగాణ కల్చరల్ సోసైటీ సభ్యులు సింగపూర్కి బోనాల పండుగను పరిచయం చేశారు. ప్రతి ఏడాది సుమారు వేయి మంది భక్తులతో బోనాల ఊరేగింపు లో పోతరాజులు, పులి వేషాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచేవి. ఈ ఆసరి కరోనా నిబంధనలతో పోతరాజు, పులివేషాలు సాధ్యపడలేదు. బోనం సమర్ఫణ ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో టీసీఎస్ఎస్ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్ కస్తూరి, గోనె నరేందర్ రెడ్డి రజిత, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్ స్వాతి మరియు వ్యవస్థాపక మరియు పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి శ్రీదేవి దంపతులు ఉన్నారు. వీరితో పాటు సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్ మరియు ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి దంపతులు సొసైటీ తరపున ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా సునీతారెడ్డి, రోజారమణి, గోనే రజిత, జూలూరు పద్మజ, కాసర్ల శ్రీనివాసరావులు వ్యవహరించారు. -
బోనాల పాట వివాదంపై స్పందించిన మంగ్లీ
-
బోనాలను కేంద్ర జాబితాలో చేరుస్తా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బోనాలను కేంద్ర ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. కరోనా నుంచి విముక్తి లభించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం హైదరాబాద్ లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహాలక్ష్మి ఆలయం వారు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కిషన్రెడ్డి అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయనతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బంగారం బోనం ఎత్తి, అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను కిషన్రెడ్డి సందర్శించారు. బోనాల కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు, మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
జులై మూడోవారంలో ప్రారంభంకానున్న లష్కర్ బోనాలు
-
భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఘటాల ఊరేగింపు
-
హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు
-
రేపు ఉజ్జయినీ అమ్మవారి బోనాలు
-
బల్కంపేటలో బోనాల సంబరాలు..!
-
ఇంట్లోనే అమ్మవారికి బోనాలు సమర్పించండి
-
ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు..
-
పబ్లిక్లో ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు..
హైదరాబాద్ : పోలీసులు వస్తున్నారంటే మాములుగా జనాలు భయపడిపోతారు. కానీ ఓ యువకుడు మాత్రం ఏకంగా విధుల్లో ఉన్న ఎస్సైకి ముద్దుపెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోనాల వేడుకల్లో భాగంగా పలువురు యువకులు రోడ్డుపై చిందులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్సై మహేందర్ అటుగా వెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆ గ్యాంగ్లోని ఓ యువకుడు ఎస్ఐ దగ్గరకు వెళ్లి ఆయనకు ముద్దుపెట్టాడు. దీంతో ఉలిక్కిపడ్డ ఎస్ఐ ఆ యువకుడిని పక్కకు నెట్టాడు. ఆ తర్వాత అతనిపై కోపం ప్రదర్శించకుండా.. సంయమనం పాటించాడు. కోపాన్ని దిగమింగుకుంటూ ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారు. యువకుడు మద్యం మత్తులో ఉండి ఈ విధంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యువకుడు మద్యం మత్తులో తనతో అమర్యాదగా ప్రవర్తించాడని అర్థం చేసుకుని.. అతన్ని ఏమి అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎస్సైని పలువురు ప్రశంసిస్తున్నారు. -
బోనమెత్తిన రాములమ్మ, సింధు, పూనమ్
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా బోనం సమర్పించేందుకు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆదివారం లాల్దర్వాజా సింహవాహని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి ఆశీస్సుల ఉంటే నేను ఇంకా బాగా ఆడతానని అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆమె అమ్మవారిని కోరుకున్నారు. ప్రభుత్వం అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. సినీనటి పూనమ్కౌర్ కూడా బోనమెత్తారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి బోనం సమర్పించి.. దర్శనం చేసుకున్నారు. -
పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 5 గంటలకు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. తెలంగాణలో నిర్వహించే ఈ బోనాల్లో.. లాల్దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని ప్రతీతి. అప్పటి నుంచి లాల్దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. ఇంతటి విశిష్ఠత ఉన్న ఈ బోనాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇంటిల్లిపాది వచ్చి అమ్మకు బోనం సమర్పించుకుంటున్నారు. బోనం ఎత్తుకుని.. అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలంగాణవారే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా.. బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆలయాన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక, సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. అక్కన్న మాదన్న, మహంకాళి అమ్మవారి ఘటాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభిస్తారు. ఒడిషా, కర్ణాటక, కేరళ నుంచి వచ్చిన కళాకారులు వివిధ ఆకృతులతో అమ్మవారి శకటాలను సుందరంగా అలంకరిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పాతబస్తీ బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 13 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీటరికి తోడుగా 43 ప్లటూన్ల సాయుధ బలగాలు కూడా భద్రత విధుల్లో పాటు పంచుకోనుంది. -
పోతరాజుల పోసాని
ఒళ్లంతా పసుపు.. కుంకుమలు.. చేతిలో చర్నాకోల.. కళ్లకు కాటుక. నోటిలో నిమ్మకాయలు.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. బోనాల ఉత్సవాల్లో పోతరాజుల సందడి అంతా ఇంతా కాదు. లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతరలో పోతరాజు వేషధారణలో పోసాని కుటుంబానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఇప్పటికీ ఆ కుటుంబానికి చెందినవారే అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పోతరాజు వేషధారణతో అలరిస్తున్నారు. చాంద్రాయణగుట్ట :మేకలబండకు చెందిన ‘పోసాని’ కుటుంబం నుంచి ఎనిమిది మంది పోతరాజు వేషధారణ వేశారు. 1908లో ఆలయంలో బోనాలు ప్రారంభమైన కొన్నేళ్ల నుంచే ఈ కుటుంబ సభ్యులు పోతరాజు వేషధారణ వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే వంశానికి చెందిన నాలుగో తరం వారు వంశపారంపర్యంగా పోతరాజు వేషధారణలో కొనసాగుతున్నారు. పోసాని బాబయ్య అలియాస్ సింగారం బాబయ్యతో ఈ అంకానికి శ్రీకారం చుట్టారు. బాబయ్య తమ్ముడు ఎట్టయ్య, బాబయ్య కుమారుడు లింగమయ్య, లింగమయ్య తమ్ముడు సత్తయ్య, లింగమయ్య కుమారుడు బాబురావు, బాబురావు సోదరుడు సుధాకర్, హేమానంద్.. ఇలా ఇప్పటి వరకు ఏడుగురు ఒకే వంశం నుంచి పోతరాజు వేషధారణ వేశారు. 2015 బోనాల నుంచి బాబురావు కుమారుడు పోసాని అశ్విన్ పోతరాజు వేషధారణ వేస్తున్నారు. పోసాని వంశం నుంచి మూడో తరానికి చెందిన బాబురావు 30 ఏళ్ల పాటు పోతరాజుగా తనదైన ముద్ర వేయడం గమనార్హం. అమ్మవారి ఆశీస్సులతోనే.. లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతోనే 30 ఏళ్ల పాటు పోతరాజుగా రాణించాను. దీంతో నన్నందరూ ‘పోతరాజు బాబురావు’ అని పిలుస్తుంటే ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంటుంది. – పోతరాజు (పోసాని) బాబురావు ఎంతో సంతోషాన్నిచ్చింది.. నాలుగేళ్లుగా పోతరాజు వేషధారణ వేస్తున్నాను. ఘటస్థాపన రోజు నుంచి నియమ నిష్టలతో ఉంటూ అమ్మవారి ధ్యానంలో గడుపుతున్నాను. అమ్మవారి కరుణతోనే పోతరాజు వేసే అవకాశం దక్కిందని భావిస్తున్నా. – పోసాని అశ్విన్, ప్రస్తుత పోతరాజు పోతరాజు అంటే ఏమిటి.. పోతరాజంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమేర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, అనంతరం సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటాడు. డప్పు చప్పుళ్లకనుగుణంగా ఆనందంతో నృత్యం చేస్తూ స్వాగతిస్తుంటాడు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు అయిన అమ్మవార్లకు ఈ పోతురాజంటే అమితానందం. దీంతో ఆయన సూచించిన రహదారిలో నడుస్తూ దేవాలయానికి తరలి వస్తారు. ఆయన గావుతో శాంతించి పొలిమేర దాటుతారు. -
మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్ : ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం జరిగిన రంగం కార్యక్రమంలో స్వర్ణలత ‘భవిష్యవాణి’ వినిపించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బోనాల జాతర జరిపినందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది బోనాల ఏర్పాట్లపై పెదవి విరిచిన అమ్మవారు.. ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొన్నారు. ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరారు. మారు బోనం తప్పకుండా సమర్పించాలని సూచించారు. ‘ఈ ఏడాది ప్రజలంతా సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారు. ప్రజలందరినీ సంతోషంగా ఉంచుతాను. నా చెల్లెలు గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోర్కెలు నెరవేరుతున్నాయి. రాష్ట్రంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. నా అక్కాచెల్లెళ్లు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. రైతులను సుఖ సంతోషాలతో ఉంచే బాధ్యత నాదేన’ని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. -
ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి పండుగ శోభను తరించుకుంది. జగతిని కాచే తల్లి మహోత్సవానికి వేళయింది. ఆదివారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దుర్గగుడి కళకళలాడుతోంది. కూరగాయలు.. ఆకుకూరలు.. ఫలాలతో దుర్గమ్మ సర్వాంగసుందరంగా అలలారుతోంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాదిలాగానే తెలంగాణ నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు సుమారు 200మందితో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ దుర్గమ్మకు బోనం సమర్పించేందుకు వచ్చినవారికి దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. అంతకు ముందు బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. మేళతాళాలు, మంగలవాద్యాల నడుమ ఊరేగింపు అమ్మవారి ఆలయానికి చేరింది. మూడు రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారి అలంకరణకు ఆకుకూరలు వినియోగించారు. రెండోరోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడోరోజు అయిన మంగళవారం బాదం. జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్తో అలకరించనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తాయి. కాగా మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి దర్శానాన్ని నిలిపివేస్తారు. కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడురోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకుకూరలను దండగలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
లండన్లో ఘనంగా బోనాలు
లండన్ : తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం (టీఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో లండన్లోని కాన్ఫోర్డ్ కళాశాలలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచి ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. ఈ వేడుకలకు లండన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, భారత రాయభార కార్యాలయ ఉన్నతాధికారి కే ఈవోమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలుగువారు మొదటిస్థానంలో ఉన్నారని ఎంపీ వీరేంద్రశర్మ తెలిపారు. ఎనిమిదేళ్లుగా లండన్ బోనాల వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందని చెప్పారు. ఇంగ్లాండ్ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాలు నిర్వహించడం, హిందూ సంప్రదాయాల్లో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఎంపీ సీమా మల్హోత్రా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో 2011లో తొలిసారిగా బోనాలు నిర్వహించిన తనకు సహకరించి.. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా బోనాల నిర్వహణకు దోహదపడుతున్న వారందరికీ తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపకుడు, చైర్మన్ గంప వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆచార, సంప్రదాయాలను ప్రచారంచేయడాన్ని సేవగా సంస్థ స్వీకరిస్తోందని, నియమ నిబంధనల మేరకు కలిసివచ్చే అందరితో సంస్థ పనిచేస్తుందని టీఈఎన్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్గౌడ్ తెలిపారు. విదేశాల్లో పుట్టిపెరిగే భారతీయ సంతతి కోసం మన పండుగలు నిర్వహించడం చాలాముఖ్యమని ఉపాధ్యక్షులు ప్రవీణ్రెడ్డి, రంగు వెంకట్ అన్నారు. స్థానిక లక్ష్మీనారాయణ గుడిలో కార్యదర్శి, మహిళాసభ్యుల ఆధ్వర్యంలో దుర్గామాతకు బోనం, ఒడిబియ్యం సమర్పించారు. లండన్ పురవీధుల్లో తొట్టెలు, బోనాల శోభాయాత్రను కన్నులపండువగా నిర్వహించారు. కాన్ఫోర్డ్ కళాశాల ఆడిటోరియంలో మీనాక్షి అంతరి అధ్యక్షతన వీరేంద్రవర్మ, శ్రీవాణి.. మహంకాళి మాతకు బోనాలు సమర్పించి పూజలు జరిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారతనాట్యం, గీతాలాపన, చిన్నారుల నృత్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో మహేష్ జమ్ముల, స్వామి ఆశ, వెంకట్ ఆకుల, మహేష్ చట్ల, బాల కృష్ణ రెడ్డి, శేషు అల్ల, నరేంద్ర వర్మ, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణీ, సవిత, సీత, శౌరి, దివ్య, సాయి లక్ష్మి, శిరీష, అశోక్ మేడిశెట్టి, నర్సింహా రెడ్డి తిరుపరి, రాజు కొయ్యడ, రవి కూర, నరేందర్, మల్లేష్ తదితరులు ఎంతగానో కృషి చేశారు. -
తెలంగాణ భవన్లో బోనాల సంబరాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్దర్వాజ బోనాల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సంబరాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ అని, ప్రకృతిని ఆరాధించే పండుగ బోనాలు అని అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం, లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బోనాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అమ్మవారి ఘట్టాన్ని నిన్న (బుధవారం) ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకూ ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. వేడుకల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రాములు, ప్రకాశ్, లింగయ్య, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు పాల్గొన్నారు. -
జగదాంబిక ఆలయంలో తొలి పూజలు
-
జంట నగరాల్లో బోనాల సందడి
-
బోనమెత్తిన పాతబస్తీ
చార్మినార్/చాంద్రాయణగుట్ట: పాతబస్తీ బోనమెత్తింది. భక్త జనంతో కిటకిటలాడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలను సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మ దర్శన భాగ్యం కోసం తరలివచ్చారు. తెల్లవారుజామున 5 గంటలకు టీడీపీ నేత, మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి మహాభిషేకం నిర్వహించారు. ఉదయం 7కి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం వరకు కొనసాగింది. ఉదయం భక్తుల రద్దీ స్వల్పంగా ఉండటంతో బోనాల సమర్పణ వేగంగా సాగింది. పది గంటల అనంతరం భక్తుల తీవ్రత పెరగడంతో నెమ్మగించింది. అంతలోనే వీఐపీల రాక మొదలవడంతో బోనాల సమ ర్పణ మందగించింది. పోలీసులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పాతబస్తీలోని ప్రధాన దేవాలయాల్లో అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు అందజేశారు. పాతబస్తీలో భక్తుల కోలాహలం పాతబస్తీలో ఏ వీధి చూసినా సందడిగా కనిపించింది. సింహవాహిని మహంకాళి దేవాలయంతోపాటు మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం, గౌలిపురా మహంకాళి దేవాలయం, సుల్తాన్షాహి జగదాంబ దేవాలయం, మేకల బండ నల్ల పోచమ్మ దేవాలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. వర్షాలు విరివిగా కురవాలి. రైతన్నలు సుఖంగా ఉన్నప్పుడే దేశం సుఖంగా ఉంటుంది. పాడి, పంటలతో వారు వర్ధిల్లాలి. – ఉత్తమ్కుమార్రెడ్డి, టీపీసీసీ చీఫ్ రాష్ట్రంలో బోనాలే పెద్ద పండుగ తెలంగాణ రాష్ట్రంలో బోనాలే అతి పెద్ద పండుగ. రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత బోనాల విశిష్టత మరింత పెరిగింది. ఢిల్లీ, విజయవాడతోపాటు అమెరికాలో కూడా నేడు తెలుగు ప్రజలు బోనాలు నిర్వహిస్తున్నారు. అందరూ బాగుండాలి. బంగారు తెలంగాణ సాధ్యం కావాలని అమ్మవారిని వేడుకున్నా. – ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి మరిన్ని సదుపాయాలు కల్పించాలి ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి. అమ్మవారి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి. రైతులు పాడి, పంటలతో విరజిల్లాలి. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించినా.. ఆలయాల వద్ద మరిన్ని సదుపాయాలు కల్పించాలి. –కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమ్మ దీవెనతోనే తెలంగాణ వచ్చింది అమ్మవారి దీవెనతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకోకుండా తెలంగాణ బిడ్డలకు మనోసంకల్పం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నా. ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్లుగా తెలంగాణ వచ్చేంత వరకే ఉద్యమాలు జరగాలి. వచ్చాక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులేసుకుందాం. – ప్రొఫెసర్ కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు -
ఘనంగా బోనాలు.. క్యూ కట్టిన ప్రముఖులు!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో బోనాల సందడి వెల్లివిరుస్తోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. లాల్దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తజనం బారులు తీరారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని మంత్రి తలసాని తెలిపారు. రేపు ఊరేగింపు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. క్యూ కట్టిన ప్రముఖులు.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరామ్, మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు లాల్దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించి.. మొక్కులు చెల్లించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని నాయిని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలాలు అందరికీ అందాలని అమ్మను వేడుకున్నట్టు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగల్లో. లాల్దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని చెబుతారు. అప్పటినుంచి లాల్దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. బోనం ఎత్తుకుని..అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. -
‘శ్యామల చెప్పింది నిజమైతది’
సాక్షి, హైదరాబాద్: ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగిని శ్యామలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హన్మంతరావు మద్దతు తెలిపారు. శ్యామల చెప్పింది నిజమైతదని, తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వపాలన ముగియక తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణలో సర్పంచులకు అధికారాలు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు కావాలనే నిర్వహించడంలేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. గ్రామాలకు ప్రత్యేక అధికారుల వస్తే తరిమి కొట్టండని వీహెచ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో డిక్టేకర్ రాజ్యం నడుస్తోందని, ప్రజలు ఈ ప్రభుత్వంపైన తిరగబడితే కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుందని వీహెచ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు తాయిలాలే తప్ప రాజకీయంగా న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య చెప్పి, ఇప్పుడు మళ్లీ బీసీల గణన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవిని త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని వీహెచ్ కోరారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయించే ఆనవాయితీ ఉందని తెలిపారు. ప్రజల్లో తిరిగే ఓపిక ఇంకా ఉందని, కాంగ్రెస్ కోసం ఒక కార్యకర్తలా పనిచేస్తానని పేర్కొన్నారు. -
శ్యామల ఫైర్.. స్పందించిన తలసాని
సాక్షి, హైదరాబాద్ : బోనాల పండుగ ఘనంగా జరిగిందని, విదేశీయులు సైతం ఈ సంబరాలకు హాజరయ్యారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందంటూ కొందరు కామెంట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం జరిగిన రంగం కార్యక్రమం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. జోగిని శ్యామల కాస్త ఇబ్బంది పడ్డారని విన్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. లక్షల మంది వచ్చినప్పుడు జరిగిన అసౌకర్యాన్ని ఆమె అర్థం చేసుకోవాలంటూ శ్యామలకు మంత్రి తలసాని సూచించారు. ‘చిన్న చిన్న అసౌకర్యాలు జరిగాయి. స్థలం తక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమే. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు బాగా సహకరించాయి. అయితే జోగిని శ్యామలకు ఆలయ పరిస్థితులు పూర్తిగా తెలుసు. ప్రభుత్వంపై ఆమె కామెంట్ చేయడం సరికాదు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని’ మంత్రి తలసాని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్ -
ఉజ్జయిని మహంకాళి జాతరలో కీలక ఘట్టం
-
బంగారు బోనం సమర్పించిన ఎంపీ కవిత
-
అమ్మవారికి బంగారు బోనం
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల నుంచి భక్తుల రద్దీ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో సహా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, శ్రీనివాస్యాదవ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ శాసన సభ పక్ష నేత కిషన్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కల్వకుంట్ల కవిత, మల్లారెడ్డి, గరికపాటి మోహన్రావు, ఎమ్మెల్యేలు సాయన్న, ఎన్వీఎస్ ప్రభాకర్, శ్రీనివాస్గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్, మాజీ ఎంపీలు నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి, దానం నాగేందర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వివిధ పార్టీల నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, బద్దం బాల్రెడ్డి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్, శక్తి పీఠాధిపతి జగద్గురు భగవతి మహరాజ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులతో వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ యోగితారాణి, ఐజీ మురళీకృష్ణ తదితర అ«ధికారులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. బంగారు బోనమెత్తిన ఎంపీ కవిత ఆలయం తరఫున 3 కిలోల బంగారంతో తయారు చేయించిన బోనాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి సమర్పించారు. ఆదయ్యనగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో 2వేల బోనాలు అమ్మవారి ఆలయానికి భారీ ఊరేగింపుగా వచ్చాయి. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఈ ఊరేగింపును ప్రారంభించారు. డప్పుల దరువు.. కళాకారుల నృత్యాల నడుమ కవిత బంగారు బోనాన్ని తలపై మోస్తూ.. సిటీలైట్, కింగ్స్ వే, సుభాశ్ రోడ్ మీదుగా ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. బాటా వరకు ఊరేగింపు చేరుకోగానే మంత్రి తలసాని ఉత్సాహంగా నృత్యం చేశారు. ఊరేగింపులో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ «ఆధ్వర్యంలో దేవత.. రాక్షసులు.. పులి.. సింహాల వంటి వేషధారులు, లంబాడీల నృత్యాలు, కోలాటాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం 9.20కి బయలుదేరిన బంగారు బోనం 11.20కి ఆలయానికి చేరుకుంది. ప్రజలంతా సుఖంగా ఉండాలి: మధుసూదనాచారి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా. ప్రకృతి మాత ఎంతో శక్తివంతమైంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక: స్వామిగౌడ్ మహంకాళి బోనాలు తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీక. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖంగా ఉండాలని కోరుకున్నా. జాతరలో అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో నంబర్ వన్ చేయాలి: నాయిని అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ఇప్పటికే రాష్ట్రం నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అన్నింటిలో నంబర్ వన్కు తీసుకుని రావాలని అమ్మవారిని మొక్కుకున్నా. రాష్ట్రంలో బాగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖంగా ఉండాలి. 4 ఏళ్ల కాలంలో హోం శాఖ ఆధ్వర్యంలో పోలీసులు సమర్థవంతంగా శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఇలాగే ఎప్పటికీ శాంతి సామరస్యాలతో ఉండాలని కోరుకున్నా. అచ్చమైన తెలంగాణ పండుగ: కిషన్రెడ్డి అచ్చమైన తెలంగాణ పండుగ బోనాల జాతర. భక్తి, శక్తికి ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుంది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, మోదీకి మళ్లీ ప్రధాని అయ్యే శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని మొక్కుకున్నా. 3 వేల మందితో బందోబస్తు: సిటీ కమిషనర్ అంజనీకుమార్ బోనాల జాతర సందర్భంగా లక్షల మంది భక్తులు పాల్గొంటారనే ఉద్దేశంతో 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశాం. 70 మంది సీనియర్ అధికారులు, 60 షీటీమ్స్ ఇందులో పాల్గొన్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. ఏర్పాట్లు భేష్: ఇంద్రకరణ్రెడ్డి లక్షల మంది భక్తులు పాల్గొనే ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ బోనాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: తలసాని రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలు, సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ అమ్మవారికి పూజలు చేశాం. లక్షల మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మొక్కు చెల్లించుకుంటున్నారు. లక్షల మంది భక్తులు పాల్గొనే ఈ జాతరలో అసౌకర్యాలు కలిగితే పెద్ద మనసుతో వాటిని అర్థం చేసుకుని మన్నించాలి. అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం: ఉత్తమ్ లక్షల మంది ఇలవేల్పు అయిన అమ్మవారిని దర్శించుకునే అవకాశం రావడం నా అదృష్టం. భక్తులందరికీ బోనాల శుభాకాంక్షలు. -
పోలీసుల తీరుపై జోగిని శ్యామల ఫైర్
-
తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్
సాక్షి, హైదరాబాద్ : ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ విఫలం అయ్యాయని జోగిని శ్యామల ఫైర్ అయ్యారు. ఏర్పాట్ల లోపం వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బోనం ఎత్తుకొని వెళ్లే క్యూ లైన్లో పోలీసులు ఇతర భక్తలను పంపారని అన్నారు. మరోవైపు గంటల తరబడి బోనం ఎత్తుకుని లైన్లలో మహిళలు వేచి చూడాల్సివచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాలు ఉత్సవంలో పోలీసుల అత్యుత్సహం ప్రదర్శించారు. ఉజ్జయిని మహంకాళి డ్యూటీలో ఉన్న ఓ చానెల్ రిపోర్టర్పై పోలీసు అధికారి చేయి చేసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై మీడియా పాయింట్ వద్ద రిపోర్టర్లు, కెమెరామెన్లు నిరసన వ్యక్తం చేశారు. -
బోనమెత్తిన భాగ్యనగరి
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట జనసంద్రమైంది. ఆదివారం ప్రారంభమైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలకు జనం వేలాదిగా తరలి వచ్చారు. అశేష జనవాహిని మధ్య లంగర్హౌస్ నుంచి ప్రారంభమైన అమ్మవారి తొట్టెల ఊరేగింపు ఫతే దర్వాజా, చోటా బజార్, బడా బజార్, గోల్కొండ చౌరస్తాల గుండా కోటకు చేరుకుంది. భారీ తొట్టెల కోట ప్రధాన ద్వారం నుంచి అమ్మవారి ఆలయం వరకు ముందుకు సాగగా.. భక్తులు వెంట వెళ్లారు. మరోవైపు గోల్కొండ బంజార దర్వాజ నుంచి పటేలమ్మ మొదటి బోనం ఊరేగింపు కఠోర గంజ్, మొహల్లాగంజ్ల గుండా కోటకు చేరుకుంది. ఈ సందర్భంగా నగీనా బాగ్లోని నాగదేవత ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, ఇంద్రకరణ్రెడ్డి.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా బోనాల ప్రారంభానికి విచ్చేశారు. ఆలయాలకు రూ.15 కోట్ల నిధులు: ఇంద్రకరణ్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిపూజతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వినోద్ ఆధ్వర్యంలో మంత్రులు లంగర్హౌస్లో ప్రారంభించారు. ఆ తర్వాత అమ్మవారికి బోనాల ర్యాలీ ప్రారంభమైంది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. బోనాల సందర్భంగా ఆలయాల అభివృద్ధి కోసం విడుదల చేసిన రూ.15 కోట్ల నిధులు కేవలం జంటనగరాల కోసమేనని చెప్పారు. మిగిలిన జిల్లాలకు కూడా ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మొదటి రోజు ఉత్సవాలతోనే అధికారులు చేతులు దులుపుకోవద్దని, గోల్కొండలో జరిగే తొమ్మిది వారాల పూజలకు ప్రతి శాఖ అధికారి భక్తులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గోల్కొండ బోనాల ఉత్సవాలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బద్దం బాల్రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆలయాల అభివృద్ధికి సీఎం పెద్దపీట వేశారని, కేవలం ప్రధాన ఆలయాలకే పరిమితం కాకుండా గల్లీల్లోని చిన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. -
లంగర్హౌజ్ నుంచి ఫ్రారంభమైన తొట్టెల ఊరేగింపు
-
గోల్కొండలో వైభవంగా ప్రారంభమైన బోనాలు
-
బోన భాగ్యాలు
ఆషాఢమాసమంటే వర్షాకాలం. అంటే అంటువ్యాధులు వ్యాపించడానికి ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు్ట, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. పసుపు నీళ్లు, వేపాకులతో సాకలు పెట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాక అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు. భోజనము అనే శబ్దానికి గ్రామ్యరూపమే బోనము. మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో పదికాలాలపాటు పచ్చగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర వాసులు పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, గండిమైసమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మాంకాళమ్మ తదితర గ్రామ దేవతలను ఆడపడచులుగా భావించి వారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పసుపు కుంకుమలు పెట్టి, భోజన నైవేద్యాలను సమర్పించి చీరసారెలతో, మంగళ వాయిద్యాలతో ఘనంగా వేడుక జరుపుతారు. ఈ పండుగకే బోనాలపండుగ అని పేరు. ఆంధ్రాప్రాంతంలో కూడా ఈ విధమైన పండుగలు ఉంటాయి కాని వీటికి వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లున్నాయి. తొలి, తుదిబోనాలు గోల్కొండ జగదాంబికదే! మొదట వేడుకలు గోల్కొండ∙జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. ఈ మేరకు నేడు అమ్మ తొలిబోనం అందుకోనుంది. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలోనూ, ఆ తర్వాత లాల్దర్వాజలోనూ, అనంతరం అన్నిచోట్లా బోనాల సంబురాలు జరుపుతారు. తుదిబోనం కూడా గోల్కొండ జగదాంబికకే సమర్పించి, బోనాల పండుగకు వీడ్కోలు పలుకుతారు. పరమాత్మలో చేరే జీవాత్మ బోనాలు సమర్పించడాన్ని జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడంగా కూడా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. విజ్ఞాన శాస్త్రపరంగా చూస్తే వేపాకు, పసుపు, నేలపైనా, గాలిలోనూ ఉండే సూక్ష్మజీవులను నాశనం చేసి, వాతావరణాన్ని క్రిమిరహితం చేయడానికి దోహదపడతాయి. నృత్య విన్యాసాలు, బోనాల సంబురాలు ప్రజలందరినీ ఒక్కతాటిమీద నడిపిస్తాయి. ఇటువంటి వేడుకలను జరుపుకోవడం తామరాకుమీద నీటి బొట్టులా ఉండే పట్టణ వాసులకు ఎంతో అవసరం. -
అమ్మకు బోనం
-
ఇదిగో ఆషాడం..అదిగో బోనం
-
బోనం.. తెలంగాణ ప్రాణం
హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక బోనం ప్రపంచ రికార్డుకెక్కింది. పోతు రాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య దాదాపు 2,650 మంది మహిళలు బోనాలు ఎత్తుకున్నారు. ఈ అపూర్వ సన్నివేశం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం చోటు చేసుకుంది. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, తనిష్ నీలిమ డ్యాన్స్ అకాడమి, వాసవి మహిళా సమాఖ్య, తెలంగాణ కలల వేదిక, కైరా ఫౌండేషన్, మయూరి రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ‘బోనం.. తెలంగాణ ప్రాణం’ పేరిట ప్రపంచ రికార్డ్ స్థాయిలో బోనాల ప్రదర్శన నిర్వహించారు. బోనాల వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని దత్తాత్రేయ సూచించారు. కార్యక్రమంలో హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి జయంత్రెడ్డి, సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్జీ, లక్ష్మీదేవి, ఉప్పల రాజ్య లక్ష్మి, స్వరూపరాణి, ఉమా మహేశ్వరి, వన్పల్లి శ్రీనివాస్రెడ్డి, ప్రతాప్, బండి దీక్షిత్, నర్సింహారెడ్డి, సతీశ్గౌడ్ పాల్గొన్నారు. -
టాంజ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు
ఆక్లాండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ) ఆధ్వర్యంలో ఆక్లాండ్ లో రాష్ట్ర పండుగైనా బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూజారి చంద్రు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. న్యూజిలాండ్ లో ఉండి కూడా బోనాల పండుగను జరుపుకోవడం తెలంగాణ ప్రజల సంస్కృతి, ఆచారాలు, భక్తికి నిదర్శనమని అన్నారు. అమ్మవారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలకు ఎప్పటికి ఉండాలని ఆయన ఆశీర్వదించారు. మహిళలు చాలా భక్తిగా అమ్మవారికి చీరెలు, ఒడి బియ్యం, బోనాలు వివిధ నైవేద్యాలు సమర్పించారు. బాలికలు ఎంతో ఉత్సాహంగ బోనాలు ఎత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పానుగంటి శ్రీనివాస్, పోతురాజు వేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాంజ్ ఏర్పాటు చేసిన నోరూరించే తెలంగాణ వంటకాలు, అమ్మవారి నైవేద్యాలతో అందరూ తృప్తిగా భోజనాలు చేశారు. మైమరిపించే తెలంగాణ బోనాల వాతావరణాన్ని పిల్లపాపలతో కలిసి అందరూ ఎంజాయ్ చేశారు. చివరిగా మహిళలు పసుపు కుంకుమలు పంచుకుని కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో టాంజ్ కమిటీ సభ్యులతో పాటు ఆక్లాండ్ లోని తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జజ్జెనకర జాతర
-
బోనమెత్తిన సింగపూర్
సుంగే కేడుట్(సింగపూర్) : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్లో తొలిసారిగా బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ బోనాల జాతర స్థానిక సుంగే కేడుట్ లోని అరసకేసరి శివన్ టెంపుల్లో ఎంతో కన్నుల పండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు భక్తిశ్రద్ధలతో దుర్గా దేవికి బోనాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతరాజు వేషాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ బోనాల వేడుకలో సింగపూర్లో ఉన్న తెలుగు వారితోపాటూ, ఇతరులు పెద్దమొత్తంలో పాల్గొన్నారు. ఈ బోనాల పండుగ ను తొలిసారిగా సింగపూర్ లో జరపడం ద్వారా టీసీఎస్ఎస్ పేరు చరిత్రలో నిలిచిపోవడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. వేడుక అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు సొసైటి అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు, నీలం మహేందర్, పెద్ది శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీను, ముదాo అశోక్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి గడప రమేష్, కార్యవర్గ సభ్యులు అలసాని కృష్ణ, చిల్క సురేశ్, దుర్గ ప్రసాద్, మిర్యాల సునీత, ఎల్లా రాం, పెద్దపల్లి వినయ్, ప్రవీణ్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గరెపల్లి శ్రీనివాస్, శివ రామ్, చెట్టిపల్లి మహేష్, ఆర్. సి రెడ్డి, నల్ల భాస్కర్, దామోదర్, భరత్లు కృతజ్ఞతలు తెలిపారు. -
బోనభాగ్యం
-
లండన్లో ఘనంగా బోనాలు ఉత్సవాలు
లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం(టీఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో ఈస్ట్హాం నగరంలో బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ మేరకు టీఈఎన్ఎఫ్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. సంప్రదాయబద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలిపింది. డ్యాన్సులు, డప్పులతో ఈస్ట్ హాం నగరంలో పండుగ వాతావరణం ఏర్పడింది పేర్కొంది. వెదురు బద్దలు, రంగు కాగితాలతో తయారు చేసిన తొట్టెల ఊరేగింపు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలిపింది. తెలంగాణ కుటుంబాల కోరిక మేరకు ఈస్ట్ లండన్, వెస్ట్ లండన్లలో వేర్వేరుగా బోనాలు నిర్వహించింది టీఈఎన్ఎఫ్. ఈ ఉత్సవాలకు భారతీయ హై కమిషనర్ ఎ.ఎస్ రాజన్, స్ధానిక కౌన్సిలర్ పాల్ సతినేసాంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యూకే నలుమూలల నుంచి 600 మంది తెలంగాణవాసులు వేడుకలకు విచ్చేశారు. టీఈఎన్ఎఫ్ ఈ ఏడాది చేపట్టిన 'చేనేతకు చేయూతనిద్దాం.. నేతన్నకు మద్దతునిద్దాం', 'చేనేత వస్త్రాలయం' కార్యక్రమాలను ముఖ్య అతిథులకు పరిచయం చేశారు. ప్రవాసులకు, స్థానికులకు చేనేత వస్త్రాలను పరిచయం చేసిన విధానాలను ముఖ్యఅతిథులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ వేడుకలలో భాగంగా తెలంగాణా నేతన్నల వద్ద నుంచి చేనేత వస్త్రాలను తెప్పించి 'చేనేత వస్త్రాలయం' ద్వారా స్థానిక ఎన్నారైల కోసం అందుబాటులో ఉంచింది టీఈఎన్ఎఫ్. బోనం ఎత్తిన ఆడపడచులందరికి విలువైన కానుకలు మరియు వేడుకలకు హాజరైన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. టీఈఎన్ఎఫ్ సంస్ధ విద్య, సంగీతం, కళలు, సాంస్కృతిక, క్రీడలు, వ్యాపారం, స్వచ్ఛంద సేవ, సమాజ సేవ వంటి పలు రంగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు, యువతీ యువకులకు 'ఆచార్య శ్రీ జయశంకర్ పురస్కారాలు' అందజేశారు. అలాగే బోనాలు వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి పలువురు ఎనలేని కృషి చేశారు. తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు- హేమలత గంగసాని, వనమాల గోపతి, నందిని మొట్ట, మంజుల పిట్టల, భారతి కొప్పుల, శ్రీలక్ష్మి మర్యాల, శ్రీవాణి మార్గం, సుచరిత కాల్వ, వర్ష కటికనేని, రజిత నీల, జ్యోతి రెడ్డి కాసర్ల, కవిత గోలి, కావ్య రెడ్డి, మేఘల ఆకుల, ప్రీతీ సీక, శశి కుడికాయల, ఉమగిరివాని, రమాదేవి తిరునగరి, శౌరి రంగుల, వాణి రంగు తదితరులు కార్యక్రమానికి సంబంధించిన పూజ నిర్వహణ, ఒడి బియ్యం, ఊరేగింపులలో పాల్గొన్న ఆడపడుచులకు తోడ్పాటుని అందించారు. తెలంగాణా ఎన్నారై ఫోరం ఎగ్జిక్యూటివ్ టీం- వ్యవస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్, అడ్వైజరీ బోర్డు చైర్మన్ అంతటి ప్రమోద్, అధ్యక్షులు సీకా చంద్ర శేఖర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని, తిరుపతి గోలి, ముఖ్యకార్యదర్శులు నగేష్ కాసర్ల, సుధాకర్ రంగుల, ఉమ్మడి కార్యదర్శులు భాస్కర్ పిట్ల, సురేష్ గోపతి, కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మరియాల, స్కాట్లాండ్ కన్వీనర్ శ్రీధర్రావు కలకుంట్ల, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ, క్రీడా కార్యదర్శుల స్పాన్సర్ టీం అశోక్ మేడిశెట్టి, భాస్కర్ మొట్ట, రాజేష్ ఎనపోతుల, మీడియా టీం- సాయి ప్రసాద్ మార్గం, శిరీష కే చౌదరి, స్వచ్చంద, సంక్షేమ టీం- మీనాక్షి అంతటి, సంతోష్ ఆకుల, ఏరియా ఇంచార్జిలు సంతోష్ ఏరుకుల్ల, ఈస్ట్, నార్త్ ఈవెంట్ కో-ఆర్డినేటర్స్- చంద్రకాంత్, దేవులపల్లి శ్రీనివాసరావు, శశి కొప్పుల, శ్రీధర్ బాబు మంగళారపు, శ్రీధర్ నల్ల తదితరులు బోనాలు వేడుకలలో చైతన్యవంతంగా పాల్గొన్నారు. -
బెజవాడ దుర్గమ్మకు బోనాల వైభవం!
విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం బోనాల వైభవాన్ని సంతరించుకుంది. అమ్మవారికి తెలంగాణ బోనాలను భక్తులు సమర్పించారు. హైదరాబాద్ పాత బస్తీ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు ఆదివారం బోనం సమర్పించారు. హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమిటీ ప్రతినిధులు విజయవాడకు వచ్చారు. విజయవాడలో డప్పు వాయిద్యాలు, జానపద కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా వచ్చి.. అమ్మవారికి బోనంతోపాటు పట్టువస్త్రాలు, పసుపుకుంకుమ, గాజులు సమర్పించారు. విజయవాడలో నిర్వహించిన ఈ ఊరేగింపును ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రారంభించారు. -
గోల్కొండలో ఘనంగా మొదలైన బోనాలు
-
గంగమ్మకు బోనాలు
తాడిపత్రి రూరల్, పుట్టపర్తి రూరల్ : జిల్లాలోని తాడిపత్రి మండలం బొందెలదిన్నెతో పాటు పుట్టపర్తిలో ఆదివారం గంగమ్మ బొనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున గంగమ్మ అమ్మవారి దేవాలయానికి బొనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ప్రత్యేక పూజలను చేశారు. వర్షం కోసం బొనాల పండుగ నిర్వహించడం ఆనావాయితీగా వస్తోందన్నారు. -
టాక్ బోనాల జాతర పోస్టర్ని ఆవిష్కరించిన కవిత
హైదరాబాద్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జూన్ 25న వెస్ట్ లండన్లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ను పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ముఖ్య సభ్యులు నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రోహిత్ రావు, విజయ్ కోరబోయిన, నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మోరు తల్లికి భక్తనీరాజనం
అమ్మోరు తల్లి నామస్మరణతో ఆదివారం జిల్లా కేంద్రం అనంతపురంలోని రాంనగర్ వీధులు మార్మోగాయి. వేలాది మంది రుద్రంపేట వాసులు బోనాలు సమర్పించేందుకు కదిలి రావడంతో జాతర వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాంనగర్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కొలువైన పెద్దమ్మ ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉరుములు, డప్పుల హోరు నడుమ నృత్యం చేస్తూ అమ్మోరు తల్లికి భక్తి నీరాజనాలర్పించారు. ఈ సందర్భగా నిర్వాహకులు యోగీంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడుతూ మహిమాన్వితమైన పెద్దమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలన్న కోరికతో మొత్తం కాలనీ వాసులందరూ తరలి వచ్చి బోనాలు సమర్పించినట్లు తెలిపారు. మధ్యాహ్నం రుద్రంపేటలో పెద్ద ఎత్తున అన్నదానం జరిగింది. కార్యక్రమంలో రుద్రంపేట వాసులు కుళ్లాయప్ప, విష్ణుకుమార్, గోవిందరెడ్డి, వెంకటేశులు, మాజీ సర్పంచ్ రామకృష్ణ, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. - అనంతపురం కల్చరల్ -
మహిళా కానిస్టేబుల్పై చేయిచేసుకున్న గన్మెన్పై కేసు
వరంగల్ : హన్మకొండ వడ్డేపల్లిలో పోశమ్మ బో నాల పండుగ సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్పై చేయి చేసుకున్న నగరంలోని ఏసీపీ గన్మెన్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ సారయ్యపై సుబేదారి పోలీసులు కేసు నమో దు చేశారు. పోశమ్మబోనాల పండుగ సందర్భం గా సుబేదారి పోలీస్స్టేçÙన్కు చెందిన మహిళా పీసీలు శిరీష, ప్రమీలకు వడ్డేపల్లిలోని దేవాల యం వద్ద డ్యూటీ వేశారు. ఈ క్రమంలో మొ క్కులు చెల్లించుకునేందుకు కాజీపేట ఏసీపీ వద్ద పనిచేస్తున్న గన్మెన్ సారయ్య తన భార్య మం జులతో వచ్చారు. అయితే, సారయ్య భార్య నేరుగా దేవాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిం చగా మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య గొడవ జరగడం తో కానిస్టేబుల్ సారయ్య, అతని భార్య మంజు ల తనపై దాడి చేశారని మహిళా పీసీ శిరీష ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బోనమెత్తిన భక్తజనం
శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భక్తులు ముత్యాలమ్మ, పోచమ్మ తదితర అమ్మవార్లకు బోనాలు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొంది. -
గ్రామాల్లో బోనాల వైభోగం
కందుకూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గుమ్మడవెల్లి, కొత్తగూడ, పులిమామిడి, దాసర్లపల్లి, సాయిరెడ్డిగూడ, మీర్ఖాన్పేట, మాలగూడ, రాచులూరు, చీమలవానికుంట, గూడూరు, అగర్మియాగూడ, బేగంపేట, అన్నోజిగూడ, తిమ్మాయిపల్లి, ఊట్లపల్లి తదితర గ్రామాల్లో పోచమ్మ, మార్కమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, కాటమయ్య బోనాలు వైభవంగా జరిగాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ మహిళలు, చిన్నారులు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
'ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తా'
-
'ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తా'
హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్ నగరంలోని లాల్దర్వాజా మహంకాళి అమ్మవారిని శనివారం ఉదయం కుటుంబసమేతంగా దర్శించుకుంది. ఒలింపిక్స్లో రజత పతకం సాధించి వచ్చిన సింధుకు ఆలయ పూజారులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న సింధు కుటుంబసభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ప్రతియేటా అమ్మవారి సన్నిధికి వచ్చి బోనాలు సమర్పిస్తానని తెలిపింది. -
కొప్పోలులో ఘనంగా బోనాల పండుగ
గుర్రంపోడు : మండంలంలోని కొప్పోలు గ్రామంలో గురువారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ మాసంలో గ్రామ దేవతలకు నైవేధ్యాలు సమర్పించి బోనాలకు వెళ్లడం సంప్రదాయంగా జరుగుతుంది. బోనాలతో గ్రామ దేవతల దేవాలయాల వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం వనవాసాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఘనంగా బోనాల పండుగ
యాదగిరిగుట్ట: మహిళ సంప్రదాయపు కట్టుబొట్టు.. నెత్తిన బోనం.. శివసత్తుల శిగాలు.. డప్పుచప్పుల ఊరేగింపుతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణం, మండలంలోని వంగపల్లి ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. శ్రావణం మూడోవ ఆదివారంలో అత్యంత వైభవంగా కొనసాగించే బోనాల జాతరను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే గ్రామదేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మాతమ్మ అమ్మవార్ల ఆలయాల చెంత ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం వేళ బోనాల ఊరేగింపుగా వెళ్లి నైవేధ్యం సమర్పించుకున్నారు. యువతుల సంప్రదాయ దుస్తులు.. యువకుల నృత్యాల మధ్య అట్టహాసంగా బోనాల పండుగ జరిగింది. గుట్టలో జరిగిన బోనాల జాతరలో జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, సర్పంచులు బూడిద స్వామి, చంద్రగాని నిరోష జహంగీర్, గుట్ట ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్గౌడ్, టీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణాధ్యక్షులు కాటబత్తిని ఆంజనేయులు, నాయకులు పెలిమెల్లి శ్రీధర్, సుడుగు శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. -
బోనాల నిధులు బొక్కేశారు..!
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో మళ్లీ అదే తంతు.. బోనాల పండుగ సందర్భంగా భక్తుల సదుపాయార్ధం ఆలయాల వద్ద పనుల కోసం కేటాయించిన నిధులను బొక్కేశారు. ఆలయాల వద్ద పనులూ కనపడలేదు.. విడుదలైన నిధులకు లెక్కలూ లేవు. ఖర్చు చేసినవాటికి పద్దూ లేదు. పైగా ఈ సంవత్సరం బోనాల పేరిట ప్రారంభించామని పేర్కొన్న పనులు.. వచ్చే ఏడాది బోనాల వరకు ‘పురోగతి’లో ఉన్నట్లు పేర్కొనడం.. ఆ తర్వాత కొత్త నిధులు మంజూరు కావడం పరిపాటిగా మారింది. దాంతో పాత నిధుల్ని అడిగే వారుండరు. పనులు చేయకపోయినప్పటికీ ఆ నిధుల్ని దారి మళ్లిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రూ.12 కోట్లకు లెక్క లేదు.. బోనాల పేరిట ప్రతియేటా కోట్ల రూపాయలు మంజూరవుతున్నా ఏనాడూ పనులు చేసిన పాపాన పోలేదు. చేసిన కొద్దిపాటి పనుల్లోనూ నాణ్యత తీసిట్టుగా మారింది. యేటా బోనాల సందర్భంగా ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రహదారుల మరమ్మతులు, ఆలయాలకు సున్నాలు, షాబాద్ ఫ్లోరింగ్, విద్యుత్ దీపాల వంటి పనులు చేయడం పరిపాటి. ఇందుకు కోసం ఈ ఏడాది జీహెచ్ఎంసీ రూ.12 కోట్లు మంజూరు చేసింది. పండగ నాటికే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉండగా, పండుగ ముగిసి నెల దాటినా ఇంకా చేస్తునే ఉన్నారు. పూర్తయినట్లు చెబుతున్న పనుల్లో నిజంగా ఎన్ని చేశారో అధికారులు, కాంట్రాక్టర్లకే తెలియాలి. పూర్తయిన పనులు ఎక్కడ చేశారో వివరాలు వెల్లడించేందుకు మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. దీంతో అసలు పనులు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేయాల్సింది ఒక చోట.. చేసేది మరో చోట.. బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద.. ఆలయాలకు దారితీసే మార్గాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిధులతో పనులు చేయాల్సి ఉంది. కానీ ఎక్కడ పడితే అక్కడ పనులు చేస్తున్నట్లు చూపుతున్నారు. దీంట్లో నిజంగా పనులు చేస్తున్నారో, లేక కేవలం కాగితాల్లో చూపుతున్నారో అంతుపట్టని పరిస్థితి. -
ఘనంగా కంఠ మహేశ్వరస్వామి బోనాల పండుగ
భూదాన్పోచంపల్లి : మండల కేంద్రంలో శనివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కంఠ మహేశ్వరస్వామి, శ్రీ వనం మైసమ్మ బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలతో మహిళలు బోనాలను ఎత్తుకొని ప్రదర్శనగా వెళ్లి తమ కులదేవతలకు బోనాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు చెర్కు అంజయ్య, కండె యాదయ్య, బండి యాదగిరి, కొయ్యడ నర్సింహ, గునిగంటి మల్లేశ్, తండ వెంకటేశం, తండ రమేశ్, తండ కిషన్, తంతరపల్లి వెంకటేశ్, బండి మహేశ్గౌడ్, ముప్పిడి శ్రీనివాస్, కాసుల కృష్ణ, అనిల్, కట్కూరి నరహరి, తంతరపల్లి శ్రీను, టి. పాండు తదితరులు పాల్గొన్నారు. -
చిత్తలూరులో ఘనంగా బోనాల పండుగ
చిత్తలూరు(శాలిగౌరారం) మండలంలోని చిత్తలూరు గ్రామంలో మంగళవారం మహంకాళమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మహంకాళమ్మ దేవతకు దూపదీపనైవేద్యాలను బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలతో తమ పాడిపంటలు మంచిగా వృద్ధిచెందాలని కోరుకుంటూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్థానిక సర్పంచ్ బొమ్మగాని రవి, ఎంపీటీసీ సుంకరి కరుణ వీరయ్య, ఉపసర్పంచ్ తరాల సువర్ణ అంతయ్య, మండల కోఆప్షన్ సభ్యులు దాసరి దేవచిత్తం, నాయకులు జయప్రకాశ్, శ్రీను, కొండల్కుమార్, నతానియేల్, కృష్ణమోహన్, మల్లయ్య, పాపయ్యలు దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఘనంగా బోనాల పండుగ
ఆత్మకూర్(ఎస్) : మండల వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగను నిర్వహించారు. నసీంపేట, తుమ్మలపెన్నహడ్, కోటపహడ్, శెట్టిగూడెం,పాతర్లపహడ్, ఇస్తాళ్లాపురం, నెమ్మికల్లు, పాతసూర్యాపేట, ఏనుబాములలో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు. -
మిన్నెసోటాలో ఘనంగా బోనాల పండుగ
మిన్నెసోటా(యూఎస్): మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్(మాట) ఆధ్వర్యంలో బోనాలు, వనభోజనాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు కుటుంబాల కోలాహలంతో హేలాండ్ పార్క్ కళకళలాడింది. మాట అధ్యక్షులు మహేందర్ గినుగ, వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అల్లంనేని, బుచ్చిరెడ్డి ముదిరెడ్డిల పర్యవేక్షణలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మాట వారు పచ్చని పందిరిలో అమ్మవారిని పీఠంపై ఉంచి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని తెలుగు వారందరూ పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలు తెచ్చిన వారందరు అమ్మవారిని పూజించి, దీవెనలు అందుకున్నారు. అనంతరం మాటవారు ఏర్పాటు చేసిన విందు భోజనం అందరూ ఆరగించారు. -
వైభవంగా గంగమ్మతల్లి బోనాలు
కరీంనగర్ కల్చరల్ : డప్పుచప్పుళ్లు, పూనకాలు, వేపమండలు, తలపై బోనాలతో కరీంనగర్లో ఆదివారం గంగమ్మ బోనాలు వైభవంగా సాగాయి. నగరంలోని వివిధ కాలనీలకు చెందిన గంగపుత్ర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ బోనాల జాతరలో గంగపుత్ర కులస్తులు, మహిళలు నెత్తిన బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మానేరు జలాశయం వద్ద గల గంగమ్మ తల్లి ఆలయం వద్ద జరిగిన పూజల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మేయర్ శంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఘనంగా బోనాల పండుగ
సూర్యాపేట బోనాల పండుగను ఆదివారం సూర్యాపేట పట్టణంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కృష్ణటాకీస్ సమీపంలో గల ఊర ముత్యాలమ్మ గుడిలో ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పించారు. వివిధ పార్టీల నాయకులు పటేల్ రమేష్రెడ్డి, తండు శ్రీనివాస్యాదవ్, బైరు వెంకన్నగౌడ్, శనగాని రాంబాబుగౌడ్, పెద్దిరెడ్డి రాజా, ముశం రవికుమార్, షఫిఉల్లా, గోదల రంగారెడ్డి, బూర బాలసైదులుగౌడ్, వెలుగు వెంకన్న, పొదిల రాంబాబు, బైరు దుర్గయ్యగౌడ్, వెలుగు సంతోషి, తాహేర్పాషా, వల్దాసు దేవేందర్, సుష్మారాణి, అనంతుల యాదగిరి, టైసన్ శ్రీను, దేవస్థానం కమిటీ సభ్యులు సారగండ్ల రాములు, గుంటి సైదులు తదితరులు వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. సాయంత్రం పట్టణంలోని వేలాది మంది భక్తులు ఊరేగింపుగా వచ్చి బోనాలు చెల్లించారు. సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బోనం ఎత్తుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ ఇన్స్పెక్టర్ వై.మొగలయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అలాగే పట్టణంలోని 1, 7, 8 వార్డుల్లోని ముత్యాలమ్మ దేవాలయాల వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కోటమైసమ్మ బజార్లో... పట్టణంలోని మార్కెట్రోడ్డులోని కోటమైసమ్మ బజార్లో గల కోటమైసమ్మ దేవాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పటేల్ రమేష్రెడ్డి పూజలు నిర్వహించారు. రమేష్రెడ్డిని వార్డు కౌన్సిలర్ వెలుగు సంతోషి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో షఫీఉల్లా, వల్దాస్ దేవేందర్, దారోజు జానకిరాములు, వెలుగు వెంకన్న, నరేడ్ల సోమయ్య, నాగభూషణం, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. గౌండ్ల బజార్లో... పట్టణంలోని గౌండ్ల బజార్లో బోనాల పండుగ సందర్భంగా పోతరాజుకు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన వారిలో గోపగాని వెంకటనారాయణగౌడ్, బైరు వెంకన్నగౌడ్, బైలు శైలెందర్గౌడ్, పరుశరాములు, నాగరాజు, మహేష్ తదితరులు ఉన్నారు. -
ఘనంగా ముగిసిన బోనాల వేడుకలు
నగరంలో బోనాల వేడుకలు ఘనంగా ముగిశాయి ఆట్టహాసంగా జరిగిన బోనాల ఉత్సవాలు అంబరాన్ని అంటేలా జరిగాయి. సోమవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆనంతరం పూరవీధుల్లో కన్నుల పండువగా ఊరేగింపులు నిర్వహించారు. అంతే కాకుండా అమ్మవారికి ప్రత్యేక నైవేధ్యాన్ని సమర్పించేందుకు మేకపోటేళ్ల బండ్లపై ఫలహారపు బండి ఊరేగింపుతో విచ్చేసి సమర్పించారు. ఫలహరపు బండ్ల ఊరేగింపులు అమ్మవారిని పూరవీధుల్లో ఊరేగింపు వంటి కార్యక్రమాలు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు కొనసాగాయి. అంబర్పేట మహంకాళి ఆలయానికి పెద్ద ఎత్తున ఫలరహారపు బండ్లు ఊరేగింపుగా వచ్చాయి. అలాగే అంబర్పేట పటేల్నగర్, ప్రేమ్నగర్, బాగ్ అంబర్పేట తదితర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల వద్ద ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా జరిగాయి. -
ఘటం.. ఘనం
పాతబస్తీలో బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. అంబారీపై అమ్మవారిని కొలువుదీర్చి...భక్తకోటి తరలిరాగా అంగరంగ వైభవంగా ఊరేగించారు. మీరాలం మండి మహంకాళి దేవాలయానికి చెందిన ఘటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
‘కేఎస్రెడ్డి’ పాఠశాలలో బోనాల పండుగ
సూర్యాపేటమున్సిపాలిటీ : పట్టణంలోని విద్యానగర్లో గల కేఎస్రెడ్డి మోడల్ స్కూల్లో సోమవారం విద్యార్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకంగా బోనాలను తయారు చేసి పాఠశాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. -
బోనాల అన్నదానంలో అకాతాయి ఉమ్మడంతో..
లంగర్హౌస్: బోనాల సందర్భంగా లంగర్హౌస్లో ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీకి చెందిన నాయకుడు, అతడి కుమారుడు వెకిలి చేష్టలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బోనాల సందర్భంగా అన్నదానం నిర్వహిస్తుండగా వారి చేతిలోని భోజనాల్లో ఉమ్మి వేయడంతో ఈ పరిస్థితులకు దారి తీసింది. ఎందుకు ఇలా చేస్తున్నారని అడగడంతో వారు వచ్చి సురేందర్, సంజయ్, సుభాష్లపై దాడి చేసి గాయపర్చారు. దీంతో పలువురు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోనం శోభాయమానం
-
అక్రమంగా విక్రయిస్తున్న భారీ మద్యం పట్టివేత
తార్నాక: అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. తార్నాకలోని మారేడుపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పి. భగవంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్ పరిధిలో మద్యం షాపులు బంద్ చేశారు. అయితే, అడ్డగుట్ట పరిధిలోని మంగోర్ బస్తీలో యు. చోటు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే అధికారులు ఆ ఇంటిపై దాడి చేసి రూ. 2 లక్షల విలువ చేసే వివిధ బ్రాండ్లకు చెందిన 53 కాటన్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోటు పరారీ కాగా.. అతని భార్య నిర్మలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తూ గతంలో పట్టుబడ్డ యు.వాణిశ్రీ అనే మహిళ బోనాల సందర్భంగా అధిక ధరలకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేసి.. చోటు ఇంట్లో నిల్వ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న వాణిశ్రీ, చోటు కోసం గాలిస్తున్నామని, కేసు తదుపరి విచారణను మారేడుపల్లి ఎక్సైజ్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ స్వప్నకు అప్పగించారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు జి.శ్రీనివాసరావు, వేమారెడ్డి, ఎస్సైలు కె.కరుణ, చంద్రశేఖర్, రమహమత్పాషా తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో బోనాలు
బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లిలో ఆదివారం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాల జాతర నిర్వహించారు. మున్సిపాలిటీలోని 14, 15 వార్డుల పరిధిలో ఉన్న అంబేద్కర్ రడగంబాలబస్తీలో మహా బోనాల జాతరలో మహిళలు, మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి బో నమెత్తుకొని పోచమ్మ దేవాలయం వరకు ప్రదర్శన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లంగా చూడాలని గ్రామ దేవతను వేడుకున్నారు. తదనంతరం కోళ్లు, మేకలను బలిచ్చారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో.. పట్టణంలోని కన్నాలబస్తీ రైల్వేఫై ్లఓవర్ బ్రిడ్జి వద్ద నుంచి కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, బజార్ ఏరియా, కాంటా చౌరస్తా, బెల్లంపల్లిబస్తీ మీదుగా పోశమ్మ గడ్డ వరకు మహిళలు బోనాలతో ప్రదర్శన సాగించారు. పోచమ్మ దేవాలయానికి చేరుకుని మహిళలు పూజలు నిర్వహించారు. అక్కడనే వంటవార్పు చేసుకొని విందు భోజనాలు ఆరగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు పిట్టల రాజమల్లు, మహిళలు, కుల పెద్దలు , యువకులు పాల్గొన్నారు. కాసిపేట : మండలంలోని సోమగూడెంలో ఆదివారం భక్తులు పోచమ్మ బోనాలు నిర్వహించారు. డప్పుచప్పుళ్లతో గ్రామస్తులు బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలివెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. వీధి వీధిన కలిసికట్టుగా నిర్వహించడంతో గ్రామంలో పండగా వాతవరణం నెలకొంది. -
వైభవంగా లాల్దర్వాజ బోనాలు
-
నేడు పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు
పాతబస్తీ : ఆషాడమాసం బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా సోమవారం పాతబస్తీలో జరిగే అమ్మవారి ఘటాల ఊరేగింపుకు ఉత్సవాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సామూహిక ఊరేగింపు సందర్బంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. పాతబస్తీలోని లాల్దర్వాజా సింహవాహిణి మహంకాళి దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, సుల్తాన్షాహి శీతల్మాత మహంకాళి దేవాలయం, గౌలిపురా నల్లపోచమ్మ దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళి దేవాలయం, మురాద్మహాల్ శ్రీ మహంకాళి దేవాయలం, అక్కన్నమాదన్న శ్రీమహంకాళి దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి బంగారు మైసమ్మ టెంపుల్లతో పాటు మరికొన్ని ప్రధాన దేవాలయాల అమ్మవారి ఘటాలు ఈ ఊరేగింపులో పాల్గొననున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని మహాంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఊరేగింపు సందర్బంగా ఎక్కడైనా అసౌకర్యాలు కలిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పాతబస్తీలో ఆగస్టు 1వ తేదీన జరిగే బోనాల జాతర అమ్మవారి ఘటాల ఊరేగింపుకు అదనపు బలగాలను రప్పించి బందోబస్తు నిర్వహిస్తున్నామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. -
ఘనంగా గ్రామ దేవతల బోనాలు
ఆలయాలకు పోటెత్తిన భక్తులు ఆయా గ్రామాల్లో వైభవంగా బోనాలు చేవెళ్ల రూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని ఆలూరు, దామరగిద్ద, వెంకన్నగూడ, గుండాల, రేగడిఘనాపూర్ గ్రామాల్లో బోనాల పండుగను జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు పెద్ద ఎత్తున పోచమ్మ, దుర్గమ్మ, ఈదమ్మ, ఉప్పలమ్మ, మైసమ్మ దేవతలకు పూజలు చేశారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు పూనకాలు ఆకట్టుకున్నాయి. కందుకూరు: మండల పరిధిలోని ఆకులమైలారం, ముచ్చర్ల, బేగంపేట గ్రామాల్లో ఆదివారం మహంకాళీ బోనాలు ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాల్లో డప్పు వాయిద్యాల నడుమ మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
వైభవంగా లాల్దర్వాజ బోనాలు
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లాల్దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతంమంతా జనసంద్రంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. 3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడుగడుగున సీసీ కెమరాల ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
బోనాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆది–సోమవారాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. లోయర్ ట్యాంక్బండ్లోని కట్టమైసమ్మ దేవాలయం, అంబర్పేటలోని మహంకాళి దేవాలయం వద్ద జరిగే ఉత్సవాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ మహేందర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు, సోమవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. ♦ ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్బండ్ మీదుగా మళ్లిస్తారు. ♦ డీబీఆర్ మిల్స్, కవాడిగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను తహశీల్దార్ కార్యాలయం మీదుగా పంపిస్తారు. ♦ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను దోమలగూడ, హిమాయత్నగర్, ఇందిరాపార్క్, డీబీఆర్ మిల్స్ మీదుగా పంపుతారు. ♦ ఉప్పల్ నుంచి అంబర్పేట వైపు వచ్చే ఇతర జిల్లాలు, రాష్ట్రాల బస్సుల్ని తార్నాక, అడిక్మెట్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, ఏవై మండలి, నింబోలీఅడ్డా, చాదర్ఘాట్ మీదుగా మళ్లిస్తారు. ♦ ఇదే మార్గంలో వచ్చే సిటీ బస్సుల్ని గాంధీ స్టాట్యూ, సీపీఎల్ అంబర్పేట, అంబర్పేట ‘టి’ జంక్షన్, ఛే నంబర్ మీదుగా పంపిస్తారు. ♦ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అర్ధరాత్రి వరకు దిల్సుఖ్నగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే సిటీ బస్సుల్ని అలీ కేఫ్, జిందా తిలిస్మాత్, తిలక్నగర్ మీదుగా పంపిస్తారు. ♦ ఉప్పల్ వైపు నుంచి అంబర్పేట వైపు వెళ్ళే సాధారణ ట్రాఫిక్ను రాయల్ జ్యూస్ కార్నర్ నుంచి డీడీ కాలనీ, సిండికేట్ బ్యాంక్ మీదుగా పంపిస్తారు. -
గుండెలు తీసిన పొట్టేళ్లు
శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగాలు, డప్పుచప్పుళ్లకు బెదరకుండా ప్రత్యేక శిక్షణ పొందిన పొట్టేళ్లు బోనాల జాతరకు సిద్ధమయ్యాయి. ఆది, సోమవారాల్లో జరిగే జాతరలో కీలక ఘట్టాలైన తొట్టెలు, ఫలహారంబళ్ల ఊరేగింపులో పొట్టేళ్లు కీలకపాత్ర పోషించనున్నాయి. అమ్మవారికి ప్రీతిపాత్రమైన పొట్టేళ్లను తొట్టెలు, ఫలహారంబళ్లు లాగేందుకు వినియోగిస్తారు. బలిష్టమైన శరీర ఆకృతి, మెలితిరిగిన కొమ్ములతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పొట్టేళ్లను పెంచేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. చిలకలగూడ, కిందిబస్తీ, మైలార్గడ్డ, వారాసిగూడ, సీతాఫల్మండి తదితర ప్రాంతాల్లో బోనాల జాతర కోసం ప్రత్యేకంగా పొట్టేళ్ల పెంపకం చేపట్టి ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. జాతర సమయంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు రూ. 3 నుంచి 5 వేలకు పొట్టేళును అద్దెకు ఇస్తుంటామని పెంపకందారులు తెలిపారు. మార్నింగ్వాక్తో శిక్షణ.. జనసందోహంతోపాటు హోరెత్తించే డప్పుచప్పుళ్లకు బెదరకుండా ఉండేందుకు పొట్టేళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చిలకలగూడకు చెందిన సాయియాదవ్ వివరించారు. ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్వాక్కు తీసుకువెల్లడంతో పొట్టేళ్లకు శిక్షణ మొదలవుతుందని, బ్రేక్ఫాస్ట్గా కందిచున్నీ, ఆవుపాలు ఇస్తామన్నారు. మెలితిరిగేందుకు కొమ్ములకు నువ్వులనూనెతో మాలిష్ చేస్తామని, రెండు పొట్టేళ్లు పెంపకానికి రోజుకు సుమారు రూ. 500 ఖర్చు అవుతుందన్నారు. హాబీగా పొట్టేళ్ల పెంపకం చేపట్టానని, జాతర సమయంలో తొట్టెలు, ఫలహారంబళ్లు లాగేందుకు వినియోగిస్తానని సాయియాదవ్ తెలిపాడు. -
ఈ నెల 31న మద్యం బంద్
సాక్షి, సిటీబ్యూరో: బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 వరకు నగరంలోని స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల మినహా ఎక్కడా మద్యం విక్రయించకూడదని ఆయన స్పష్టం చేశారు. -
మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్ : బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ నగర కొత్వాల్ ఎం.మహేందర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 వరకు నగరంలోని స్టార్ హోటళ్ళలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల మినహా ఎక్కడా మద్యం విక్రయించకూడదని ఆయన స్పష్టం చేశారు. -
లాల్దర్వాజా బోనాలకు బందోబస్తు
చాంద్రాయణగుట్ట : లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నామని ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే అన్ని ఆలయాల కమిటీ సభ్యులతో పోలీసు అధికారులు సమావేశాలు నిర్వహించారు. సున్నితమైన అలియాబాద్, శంషీర్గంజ్ తదితర ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రౌడీషీటర్లను బైండోవర్ కూడా చేశారు. వచ్చే ఆదివారం జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. నిఘా కోసం లాల్దర్వాజా ప్రధాన రహదారిలో 20 సీసీ కెమెరాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను శాలిబండ పోలీస్స్టేషన్ నుంచి పర్యవేక్షిస్తారు. బందోబస్తులో ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు ఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 300 మంది కానిస్టేబుళ్లు, హోం గార్డులు ఉంటారు. బోనాల సందర్భంగా మహిళలపై వేధింపులు, చైన్ స్నాచింగ్ల బెడద లేకుండా షీ టీమ్లతో పాటు యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్లను రంగంలోకి దిగుతాయి. డివిజన్ పరిధిలో మొత్తం తొమ్మిది ఆలయాలు.. లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం, గౌలిపురా మాతేశ్వరీ మహంకాళి, మక్దూంపురా ఎల్లమ్మ, గాంధీనికేతన్ బంగారు మైసమ్మ, సీఐబీ క్వార్టర్స్ నల్ల పోచమ్మ, అలియాబాద్ దర్బార్ మైసమ్మ, మేకలబండ నల్ల పోచమ్మ, వివేకానంద నగర్ బంగారు మైసమ్మ ఆలయాల తరఫున బోనాల్లో పాల్గొంటారు. -
ఆగస్టు 7న ‘పేట’లో ఊర ముత్యాలమ్మ బోనాలు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణంలోని కృష్ణాటాకీస్ సమీపంలో గల ఊర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగను ఆగస్టు 7న నిర్వహిస్తున్నట్టు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం పట్టణంలోని దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారుlమాట్లాడారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సారగండ్ల రాములు, గుంటి సైదులు, వెంకటలక్ష్మమ్మ, రాములు, జానయ్య, రాములు, లక్ష్మయ్య, సోమరాజు, వెంకులు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బోనమెత్తిన గోల్కొండ
సాక్షి,గోల్కొండ: గోల్కొండ కోటలో ఆదివారం బోనాల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆషాడ మాసపు బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవార్లకు ఆరవ పూజ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు కోటకు తరలివచ్చారు. పోలీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు బంజార దర్వాజ, రాందేవ్గూడ ఫతే దర్వాజ నుంచి గోల్కొండకు వ్చచే భారీ వాహనాలు, బస్సులను అనుమతించలేదు. -
చేగూరులో పోచమ్మ బోనాలు
చేగూరు(కొత్తూరు) : మండల పరిధిలోని చేగూరులో ఆదివారం పోచమ్మ, మైసమ్మ, ఈదమ్మ బోనాలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు బోనాలను ఊరేగించి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివశంకర్గౌడ్, సర్పంచ్ పాండయ్య, పీఏసీఎస్ చైర్మన్ విఠల్, నాయకులు భాస్కర్, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడలో.. మండలంలోని వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ గ్రామాల్లో ఆదివారం బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాసుధాకర్గౌడ్, నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
బోనాల పండుగ
-
బోనాల పండగ ఏర్పాట్లకు లక్షల్లో ఖర్చు
బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు గ్రామీణ యువత పోటీపడుతోంది. బోనాల పండుగ పురస్కారించుకుని అమ్మవారికి తొట్టెలను సమర్పించే కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించేందుకు తూప్రాన్ యువజన సంఘాల వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తొట్టెల ఏర్పాట్లు, పోతరాజులు, బ్యాండు, న్యత్య కళాకారులు, వివిధ ఆకృతులతో కూడిన దేవతామూర్తుల విగ్రహాల ప్రదర్శనకు ముందస్తుగానే అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. ఇందుకుగాను రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. బ్యాండు కోసం రూ.60 వేలు, పోతరాజులు, శివసత్తుల కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి 15 వేలు, నృత్యకారులకు రూ.1,500 చొప్పున దేవతామూర్తుల విగ్రహల ప్రదర్శన కోసం విగ్రహానికి ఉన్న డిమాండ్ను బట్టి రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు పలుకుతోంది. జిల్లాలోనే తూప్రాన్ మండల కేంద్రంలో జరిపే బోనాల పండుగ కు మంచి పేరుంది. ఆరేళ్ల క్రితం డీజే సౌండ్ సిస్టంతోపాటు మహిళా డ్యాన్సర్లను రప్పించారు. అయితే, పోలీసులు అభ్యంతరం చెప్పటంతో బ్యాండు మేళాల వైపు మళ్లారు. అప్పటి నుంచి ఏటా వివిధ హంగులతో అమ్మవారికి తొట్టెలను సమర్పిస్తున్నారు. పట్టణంలో ప్రతి ఏటా 15 సంఘాల వరకు ఉత్సవాల నిర్వహణలో పాల్గొనేవారు. అయితే హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు ముగిసిన అనంతరమే ఇక్కడ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. కాని, ఈ ఏడు సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల రోజునే తూప్రాన్లో ఈ నెల 31న నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. అయితే, ఒకే రోజున సికింద్రాబాద్, తూప్రాన్లో నిర్వహిస్తుండంతో బ్యాండుమేళాలు, నృత్యకళాకారులకు డిమాండ్ పెరిగిపోయింది. గతంలో కంటే రెండింతలు ఎక్కవ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని యువజన సంఘాల వారు వాపోతున్నారు. ఏది ఏమైనా బోనాల పండుగ ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బోనాలకు 3వేలమంది పోలీసులతో భద్రత
హైదరాబాద్ : నగరంలో బోనాల సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బోనాలు సందర్భంగా 3వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. బోనాలకు షీ టీమ్స్తో పాటు, యాంటీ చైన్ స్నాచింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే వంద అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, దేవాలయానికి ఒక ఎస్ఐ చొప్పున ఇన్ఛార్జ్గా నియమించినట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కాగా ఈ నెల 24,25న సికింద్రాబాద్, 31, ఆగస్టు 1న లాల్ దర్వాజా బోనాలు జరగనున్న విషయం తెలిసిందే. -
బోనమెత్తిన గోల్కొండ.
-
ఆనంద తాండవం
-
గోల్కొండ కోటలో వైభవంగా బోనాలు
-
బెజవాడ దుర్గమ్మకు పాతబస్తీ బోనాలు
చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 17న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించ డానికి శనివారం పాతబస్తీ నుంచి తరలివెళ్లారు. పాతబస్తీ హరిబౌలిలోని బంగారు మైసమ్మ దేవాలయం నుంచి ప్రతినిధులు విజయవాడకు బయలుదేరారు. ఆదివారం విజయవాడలోని బ్రహ్మణ వీధి నుంచి ర్యాలీ లాగా బయలుదేరే బోనాల జాతర ఉత్సవాలను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ప్రారంభిస్తారని కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గౌడ్ తెలిపారు. కళాకారులు, పోతరాజుల నృత్య ప్రదర్శనలతో ర్యాలీగా వెళ్లి కనక దుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించనున్నామన్నారు. పాతబస్తీలోని 23 దేవాలయాల కమిటీ ప్రతినిధులతో పాటు 500 మంది కళాకారులు విజయవాడకు వె ళ్లారు. -
న్యూజిలాండ్ లో ఘనంగా బోనాల వేడుకలు
న్యూజిలాండ్లో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్లోని మౌంట్రాస్కిల్ ఫిక్లింగ్ సెంటర్లో బోనాల వేడుకను అట్టహాసంగా జరుపుకొన్నారు. అమ్మవారిని ప్రతిష్టించిన తర్వాత బోనాలు పెట్టి మహిళలు భక్తిశ్రద్ధలతో చీరెలు, ఒడిబియ్యం సమర్పించారు. ఆ తర్వాత అక్కడి తెలంగాణవాసులు సామూహిక భోజనాలు చేశారు. పానుగంటి శ్రీనివాస్ వేసిన పోతురాజు వేషం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శంకరమ్మ స్వయంగా రాసిన పాటను పాడి ఆకట్టుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఉత్సాహంగా బోనాల పండగ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్దం దంపతులు, ఆక్లాండ్లో ఉన్న తెలంగాణ వాసులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ప్రెసిడెంట్ కల్యాణరావు, జనరల్ సెక్రటరీ దయాకర్ కృతజ్ఞతలు చెప్పారు. -
గోల్కండ కోటలో బోనాల ఉత్సవాలు
-
ఢిల్లీలో తెలంగాణ బోనాల ఉత్సవాలు
చాంద్రాయణగుట్ట : ఈ నెల 9,10వ తేదీలలో లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా బోనాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు గురువారం నగరం నుంచి బయల్దేరారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధ్యక్షుడు సి.రాజ్కుమార్ యాదవ్ తలపై అమ్మవారి బంగారు బోనం ఎత్తుకొని కమిటీ సభ్యులు, భక్తులతో కలిసి బ్యాండ్ మేళాల నడుమ అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకొని బయల్దేరారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సి.రాజ్కుమార్ యాదవ్ మాట్లాడుతూ....గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ తరఫున ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాలను ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ఆలయ కమిటీ సభ్యులతోపాటు 100 మంది భక్తులతో కలిసి ఈ బోనాలను జరుపనున్నామన్నారు. కాగా ఈ బోనాల ఉత్సవాలకు సాంస్కతిక శాఖ కార్యదర్శి సహకరించి 50 మంది కళాకారులను కూడా కేటాయిస్తున్నారన్నారు. రెండు రోజుల పాటు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడేలా ఈ బోనాలు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలలో నిజామాబాద్ ఎంపీ కవిత బోనం ఎత్తుకోనున్నారన్నారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ కూడా హాజరు కానున్నారన్నారు. ఉత్సవాల కోసం రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించనున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సలహాదారులు జి.మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పి.వై.కైలాష్ వీర్, కోశాధికారులు జి.అరవింద్ కుమార్ గౌడ్, యు.సదానంద్ గౌడ్, తిరుపతి నర్సింగ్ రావు, ప్రచార కార్యదర్శి మహేష్, సభ్యులు ఎ.మాణిక్ ప్రభు గౌడ్, బల్వంత్ యాదవ్, బంగ్లా రాజు యాదవ్, విష్ణు గౌడ్, కె.వెంకటేష్, కాశినాథ్ గౌడ్తో పాటు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. -
కోటలో ప్రారంభమైన బోనాలు
హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గోల్కొండలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కోటపై కొలువైన ఎల్లమ్మకు ఉదయం తొలిబోనం సమర్పణతో తెలంగాణలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. బోనాల ఎదుర్కోలు కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితోపాటు తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ లు హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటతోపాటు తొట్టెల ఊరేగింపు కొనసాగే బంజారాదర్వాజ్, ఫతేదర్వాజ్, నుంచి కోటకు దారి తీసే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బోనం సంబురాలకు ‘కోట’ ముస్తాబు
గోల్కొండ: తెలంగాణ సమాజం సామూహికంగా ఆచరించే బోనాలకు గోల్కొండ కోట ముస్తాబు అయింది. కోటపై కొలువైన ఎల్లమ్మకు గురువారం ఉదయం తొలిబోనం సమర్పణతో తెలంగాణలో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. గురు, ఆదివారం జరిగే ఈ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటతోపాటు తొట్టెల ఊరేగింపు కొనసాగే బంజారాదర్వాజ్, ఫతేదర్వాజ్, నుంచి కోటకు దారి తీసే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు లక్షలమంది భక్తులు సందర్శించే గోల్కొండ బోనాల నిర్వహణకు ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, వాటర్ వర్స్, విద్యుత్, సాంస్కృతిక శాఖల సహకారంతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ విస్త్రతంగా ఏర్పాట్లు చేసింది.గోల్కొండ బోనాల ఎదుర్కోలు కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితోపాటు ఇతర మంత్రులు హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. ఆగస్టు 4న గోల్కొండ కోటలో చివరి బోనం సమర్పించే వరకు నగరంలో ఉత్సవాలు కొనసాగుతాయి. ఈనెల 24, 25 తేదీల్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సికింద్రాబాద్లోని పలు గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు 10వ తేదీన ఘటోత్సవం (ఎదుర్కోలు) నిర్వహిస్తారు. ఘటోత్సవం పురవీధుల్లో ఊరేగుతూ 24వ తేదీ తెల్లవారుజామున ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుంటుంది. 17న ఘటోత్సవంతో పాతబస్తీ బోనాల వేడుక మొదలవుతుంది. లష్కర్ బోనాలు ముగిసిన వారం తర్వాత హైదరాబాద్ బోనాలు వైభవంగా జరుగుతాయి. జాతరలో ఈనెల 31న ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో, లాల్దర్వాజలోని శ్రీసింహవాహిని ఆలయంలో, భాగ్యలక్ష్మి ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారు. -
గోల్కొండ కోటలో విస్తృత తనిఖీలు
గోల్కొండ : ఆషాడ మాసం బోనాలకు ముస్తాబు అవుతున్న గోల్కొండ కోటలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ఉదయం బాంబ్స్క్వాడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
జూలై 22 నుంచి మహంకాళి బోనాలు
చాంద్రాయణగుట్ట : జూలై 22వ తేదీ నుంచి లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి 108వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు సి.రాజ్కుమార్ యాదవ్ తెలిపారు. ఆలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోనాల జాతర ఉత్సవాల వివరాలను వెల్లడించారు. జూలై 22వ తేదీన ఉదయం 8 గంటలకు జరిగే దేవి అభిషేకంతో ప్రారంభమయ్యే బోనాల జాతర ఉత్సవాలు ఆగష్టు 1 వ తేదీన ఊరేగింపుతో ముగుస్తాయన్నారు. 22వ తేదీన ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ, శిఖర పూజ, సాయంత్రం 6.15 గంటలకు కలశ స్థాపన ఉంటుందన్నారు. 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు లక్ష ఫలార్చన, 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలయ వేదిక నుంచి ఉమ్మడి దేవాలయాల ఘటాలకు స్వాగతం, రాత్రి 9 గంటలకు ఘట స్థాపన ఉంటుందన్నారు. 25వ తేదీన సాయంత్రం 4 గంటలకు లక్ష బిల్వార్చన, 26వ తేదీన సాయంత్రం 7 గంటలకు దీపోత్సవము, 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు శాకాంబరి పూజ, 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు లక్ష పుష్పార్చన, 29వ తేదీన లక్ష కుంకుమార్చన, 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు నవ ఛండీ హవనము, రాత్రి 9 గంటలకు తొట్టెల ఉంటుందన్నారు. 31వ తేదీన తెల్లవారుఝామున 4 గంటలకు బలిహరణ, ఉదయం 6 గంటలకు దేవి మహాభిషేకం అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభమవుతుందన్నారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణము, ఆగష్టు 1వ తేదీన ఉదయం 10 గంటలకు అష్టాదళపాద పద్మారాధన, మధ్యాహ్నం 12 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 2 గంటలకు పోతురాజు స్వాగతం, సాయంత్రం 4 గంటలకు భవిష్యవాణిని వినిపించే రంగం కార్యక్రమం ఉంటుందన్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ భవానీ రథయాత్ర అమ్మవారి ఊరేగింపు ఉంటుందన్నారు. కాగా ఈ బోనాల ఉత్సవాలకు గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సలహాదారులు జి.మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పి.వై.కైలాష్ వీర్, కోశాధికారులు జి.అరవింద్ కుమార్ గౌడ్, యు.సదానంద్ గౌడ్, తిరుపతి నర్సింగ్ రావు, ప్రచార కార్యదర్శి మహేష్, సభ్యులు ఎ.మాణిక్ ప్రభు గౌడ్, బల్వంత్ యాదవ్, బంగ్లా రాజు యాదవ్, విష్ణు గౌడ్, కె.వెంకటేష్, కప్పా కృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9,10 తేదీలలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాలు లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ తరఫున ఈ ఏడాది కూడా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాలను ఘనంగా నిర్వహించనున్నామని ఈ సందర్భంగా అధ్యక్షుడు సి.రాజ్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆలయ కమిటీ సభ్యులతోపాటు దాదాపు 150 మంది భక్తులతో కలిసి ఈ బోనాలను జరుపనున్నామన్నారు. కాగా ఈ బోనాల ఉత్సవాలకు సాంస్కృతిక శాఖ కార్యదర్శి సహకరించి 50 మంది కళాకారులను కూడా కేటాయిస్తున్నారన్నారు. రెండు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఈ బోనాలు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలలో నిజామాబాద్ ఎంపీ కవిత బోనం ఎత్తుకోనున్నారన్నారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలు కూడా హాజరు కానున్నారన్నారు. ఢిల్లీలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహించి అమ్మవారి ఆలయం వద్ద జరిగే బోనాల ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించనున్నామన్నారు. -
అంగరంగ వైభవంగా బోనాలు
ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదు మంత్రులు తలసాని, పద్మారావు రాంగోపాల్పేట్: ఉజ్జయినీ మహంకాళి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, జాతరకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు చెప్పారు. బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. బోనాల జాతర సందర్భంగా మహంకాళి దేవాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రులు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతేడాది 10 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని చెప్పారు. ఈ సారి భక్తుల సంఖ్య మరో రెండు లక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, విద్యుత్ దీపాలు తదితర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లను సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసేందుకు అన్ని శాఖల అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంకితభావంతో పనిచేసే వారికే వలంటీర్లుగా అవకాశమివ్వాలన్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహంతో ఫలహార బండ్ల ఊరేగింపులో గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. లక్షల మంది భక్తులు పాల్గొనే జాతరలో పోలీస్ శాఖే కీలకమని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మహంకాళి దేవాలయం, పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి మాట్లాడుతూ జాతరకు అందరూ సహకరించి విజయవంతం చేయాలన్నారు. మహిళా భక్తుల కోసం ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నామని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన చెప్పారు. జాతర కోసం 70 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం కొమరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అత్తెల్లి అరుణగౌడ్, ఆకుల రూప, తరుణి, హేమలత, కొలను లక్ష్మి, శేషుకుమారి, దేవాదాయ శాఖ ఆర్జేసీ కృష్ణవేణి, ఈవో అన్నపూర్ణ, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్, ఆర్డీవో రఘురాంశర్మ, తహసీల్దార్ విష్ణుసాగర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
'మహంకాళి జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తాం'
రాంగోపాల్పేట్: జూలై 24, 25 వ తేదీల్లో జరుగనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు చేపట్టాల్సిన భద్రత చర్యలపై ఉత్తర మండలం డీసీపీ సుమతి మంగళవారం పరిశీలించారు. మొదటి సారిగా దేవాలయానికి వచ్చిన ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ట్రాఫిక్, పోలీసులు అధికారులతో కలిసి దేవాలయంతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఆలయ విశిష్టత, ఎంత మంది భక్తులు హాజరవుతారు, క్యూలైన్లు తదితర వివరాలను ఈవో అన్నపూర్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
అన్నం తిని అనారోగ్యానికి గురైన ఆవు మృతి
రంగారెడ్డి(శంషాబాద్): అన్నం తిని అనారోగ్యానికి గురైన ఓ ఆవు బుధవారం మృతి చెందింది. వివరాలు..మండలంలోని ఘాంసిమియాగూడకు చెందిన రవీందర్ ఆవును పోషించుకుంటున్నాడు. రెండు రోజుల కిందట గ్రామంలో బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అమ్మవారికి నైవేధ్యంగా సమర్చించిన అన్నంను సమీపంలో ఓ కుప్పగా పోశారు. మంగళవారం అటుగా వెళ్లిన ఆవు ఆ అన్నం తినింది. అన్నం తిన్న ఆవు అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందింది. ఆవు మృతితో తనకు ఉపాధి లేకుండా పోయిందని, నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. -
బోనాలకు వెళ్లొచ్చేసరికి ఇల్లు సర్దేశారు..
మణికొండ (రంగారెడ్డి): బోనాల పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి అంతా సర్దుకుపోయారు. మణికొండ పంచాయతీ పరిధిలోని నేతాజీనగర్కాలనీ ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసించే సత్యనారాయణ ఆదివారం బోనాలు ఉండడంతో కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామానికి వెళ్లారు. రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 4తులాల బంగారం, 70 తులాల వెండి, రూ.75వేల నగదును దోచుకెళ్లిపోయారు. సోమవారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. -
మహానగరి... బోనాల సిరి
ఆలయాలకు పోటెత్తిన భక్తులు జంట నగరాల్లో వెల్లివెరిసిన ఆధ్యాత్మిక శోభ పటిష్ట బందోబస్తు చార్మినార్: డప్పు దరువులు... పోతురాజుల విన్యాసాలు... ఫలహార బండ్ల ఊరేగింపు.....బోనాలు...తొట్టెల సమర్పణతో పాతబస్తీలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ వె ల్లివెరిసింది. పాతబస్తీ సహా న గరంలోని ప్రధాన అమ్మవారి దేవాలయాలన్నీ ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులతో సందడిగా మారాయి. ఆలయాల్లో లక్ష అక్షితార్చన, కౌమారి పూజ, ఘటస్థాపన, లక్ష బిల్వార్చాన, దీపోత్సవం, శాకంబరి పూజ, లక్ష పుష్పార్చన, లక్ష కుంకుమార్చన, నవ చండీ హవనం, దేవీ మహాభిషేకం ఘనంగా నిర్విహంచారు. అనంతరం భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటు పాతబస్తీలోని ప్రధానఆలయాల్లోని అమ్మవార్లకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ కవిత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు హన్మంతరావు, బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు అమ్మవార్లను దర్శించుకున్నారు. వీఐపీల తాకిడితో సాధారణ భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆలయాలు కిటకిట మహిళా భక్తులు తెల్లవారు జాము నుంచే లాల్దర్వాజ సింహవాహిని దేవాలయం అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ కట్టారు. భక్తుల రద్దీతో పరిసర రోడ్లన్నీ కళకళలాడాయి. పాతబస్తీలోని మీరాలంమండి మహంకాళి అమ్మవారి దేవాలయం, ఉప్పు గూడ మహంకాళి దేవాలయం, సుల్తాన్షాహి శీతల్మాత జగదాంబ మహంకాళి దేవాలయం, గౌలిపురా నల్లపోచమ్మ దేవాలయం, గౌలిపురా మహంకాళి దేవాలయం, మురాద్మహల్ మహంకాళి దేవాయలం, అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయం, బేలాముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి బంగారు మైసమ్మ ఆలయం, రాంబక్షి బండ అమ్మవారి దేవాలయం, మేకలబండ నల్లపోచమ్మ దేవాలయం, కోట్ల అలిజా కోట మైసమ్మ, కసరట్టా శ్రీ మహంకాళి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. డప్పు దరువులు, పోతురాజుల విన్యాసాల మధ్య మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం ముందు నిర్వాహకులు ఏర్పాటు చేసిన భారీ బోనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బందోబస్తు బోనాలకు దక్షిణ మండల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షించారు. -
బోనమెత్తిన భాగ్యనగరం
-
బోనమెత్తిన హిజ్రాలు
శ్రీశైలం: తెలంగాణలో బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. అయితే అంతే ఘనంగా జరపాలనుకున్నారు ఈ హిజ్రాలు. అందుకే ఆదివారం విజయవాడకు చెందిన కొంతమంది కలిసి శ్రీశైల భ్రమరాంబకు బోనాలను సమర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీశైలంలోని గంగాధర మండపం వద్ద ఒక హిజ్రా బోనం తలపై పెట్టుకుని రాగా.. మరో ముగ్గురు హిజ్రాలు ఆటపాటలతో నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి వెళ్లి బోనాలను సమర్పించారు. -
హైదరాబాద్ లో వైభవంగా బోనాలు
హైదరాబాద్: హైదరాబాద్లో ఆదివారం బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. నగరంలోని ఆలయాలను ప్రత్యేక అలంకరణలతో బోనాల కోసం సిద్ధం చేశారు. పాతబస్తి జనసంద్రమైంది. సింహవాహిని, బిజిలీ మహంకాళి అని పిలుచుకునే లాల్దర్వాజ బోనాల జాతరలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. తెలంగాణ మంత్రులతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొంటున్నారు. -
అమ్మా బైలెల్లినాదో...
ఆలేరు (నల్గొండ జిల్లా) : ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రజలు పల్లెల్లో ఉన్న గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగకు ఊరూ,వాడా ఒక్కటై అంగరంగ వైభవంగా అమ్మవార్లకు బోనం సమర్పించి మెక్కులప్పజెప్పడం అనాదిక తెలంగాణ సంప్రదాయంలో ముడివేసుకున్న బంధం. అన్ని పండుగల కన్నా ఈ బోనాల పండుగను చాలా ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢమాసం వచ్చిన తరువాత మొదట గోల్కొండ బోనాలతో ప్రారంభమై హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజ బోనాలతో సంబరాలు ముగుస్తాయి. గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో గ్రామదేవతలు ప్రతి గ్రామంలో 5 నుండి 10 వరకు గ్రామదేవతల దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయలకు గ్రామంలో ప్రత్యేకంగా పూజారులు అమ్మవార్లకు ధూప,దీప నైవేద్యాలను సమర్పిస్తుంటారు. గ్రామాల్లో గ్రామదేవతలు దుర్గమ్మ, ఎల్లమ్మ, పోశమ్మ, మైస్మమ్మ, నల్లపోచమ్మ, కట్టమైసమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, మారెమ్మ, పోలేరమ్మలను గ్రామాలల్లో భక్తులు దేవాలయల్లో కొలువుంచుకొన ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆషాఢమాసంలో దేవిని భక్తిశ్రద్ధలతో పూజించుకొని, తన సొంత బిడ్డ పుట్టింటికి వచ్చిందనే భావనతో ప్రేమానురాగాలతో మహిళలు చీరెలు, సారెలు, రకరకాల పూలతో పూలమాలలు అల్లి అమ్మవారికి వేసి, బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బోనం అంటే ఏంటి ? బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడమే బోనం. వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్ని మార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ బోనాన్ని మట్టి లేదా రాగి కుండలలో తయారు చేస్తారు. బోనాల పండుగ సాగే తీరు బోనాల పండుగ రోజుల్లో గ్రామాల్లో గ్రామదేవతల ఆలయాలన్నీ మామిడి కొమ్మలు, అరటి మండలు, దీపాల కాంతులతో అలంకరిస్తారు. అమ్మవారికి బోనం వండడానికి ఎక్కువగా మట్టి కుండలే వాడుతుంటారు. కొత్తకుండను తెచ్చి, కట్టెల పొయ్యి మీద బోనం వండడం ఆనవాయితీ. బోనం వండిన తరువాత బోనం కుండను శుభ్రం చేసి సున్నం రాసి, పసుపు,కుంకుమలతో అలంకరిస్తారు. తరువాత బోనం కుండ మీద దీపం కంచుడు పెట్టి దాని చుట్టూ పూలమాలను అలకరించి వేప కొమ్మలను బోనానికి పెడతారు. అమ్మవారి ఘటం అమ్మవారి ఆకారంలో అలకరించబడ్డ రాగి కలశాన్ని ఘటం అంటారు. గ్రామాల్లో ఒంటిపై పసుపు పుసుకొని పూజారులు ఈ ఘట్టాన్ని మోస్తారు.ఈ ఘట్టాన్ని పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం అయ్యే వరకు డప్పులు, మేళతాళల మధ్య ఉరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తరువాత జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యం మహిళలు ఉరేంగింపుగా తీసుకువచ్చిన బోనాన్ని దేవాలయ ప్రాంగణం ముందు రాసిగా పోస్తారు. దాన్నే రతి అని పిలుస్తారు. రతి మీద కుంకుమ, పసుపు చల్లి అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించి భక్తులు మెక్కులు, ముడుపులు చెల్లించుకుంటారు. భవిష్యవాణి అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించిన తరువాత భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శివసత్తులు అమ్మవారి పూనకంతో ఈ భవిష్యవాణిని చెబుతుంటారు. భక్తులు వారి స్ధితిగతులు గ్రామ పట్టణ, దేశ స్ధితిగతులను అడుగుతుంటారు. -
ఖమ్మంలో ఘనంగా బోణాలు
ఖమ్మం: ఖమ్మం నగరంలోని పంపింగ్వెల్ రోడ్లోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం బోణాల పండగ ఘనంగా జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకటలాడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం ఎంపీ, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, అధికారులు ఉన్నారు. -
బోనాలు - విశిష్టత
-
వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు
-
అంగరంగ వైభవంగా బోనాలు
-
వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం బోనాలు. ఆషాఢమాసం ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఎటువంటి కరువులు కాటకాలు, వ్యాధుల బారినపడకుండా ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ అమ్మవారికి బోనం నైవేద్యంగా పెడతారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శనివారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. బోనాల సందర్భంగా అమ్మవారికి కోడిపుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. వీరంగం బోనాల సంబరాల్లో ప్రత్యేక ఘట్టం. ఇక బోనాల్లో చివరి అంకం ఘటాల ఊరేగింపు. కాగా బోనాల సంబరాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం రూ. 9.98 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
వరాలిచ్చే తల్లి నల్లపోచమ్మ
♦ ముంబై, థానేల్లో ఘనంగా జరుగుతున్న పోచమ్మ తల్లి ఉత్సవాలు ♦ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పణ ♦ థానేలో 150 ఏళ్ల చ రిత్ర కలిగిన జానకీదేవి ఆలయం సాక్షి, ముంబై : తెలుగు వారు ఎక్కువగా ఉన్న ముంబైతోపాటు థానే జిల్లాలో పోచమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతిఏటా ఆషాఢ మాసంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఇక్కడి ప్రజలు వీలును బట్టి పండుగ జరుపుకుంటారు. ఆది, బుధవారాల్లో ఎక్కువగా పోచమ్మ పండుగ నిర్వహిస్తారు. తెలుగు సంఘాలు, మండళ్ల ఆధ్వర్యంలో సామూహిక పోచమ్మ పండుగ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఆగస్టు 14 వరకు ఆషాఢమాసం ఉన్నప్పటికీ ఆగస్టు 2, 9 తేదీల్లో పండుగ చేసుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రసిద్ధి చెందిన జానకీ దేవి ఆలయం థానే నగరంలోని శాస్త్రినగర్లో ఉన్న జానకీదేవి ఆలయం స్థానికంగా ప్రసిద్ధి చెందింది. జానకీదేవిని మరాఠీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. స్థానిక తెలుగువారు మాత్రం పోచమ్మగా పూజిస్తారు. ఆషాఢ మాసంలో సంప్రదాయ పద్ధతిలో పండుగ జరుపుకుంటారు. శాస్త్రినగర్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు కూడా వచ్చి వేడుకల్లో పాల్గొంటారు. గుడి వద్ద దసరా, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో రామదాస్ బాబా అనే తెలుగు వ్యక్తి అర్చకులుగా ఉండేవారు. ఆలయ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు స్థానికులు చెబుతారు. బాబా తన జీవితాన్ని ఈ ఆలయానికే అంకితం చేశారని కీర్తిస్తారు. ఆయన హయాంలోనే గుడి తెలుగు వారి పోచమ్మ ఆలయంగా మారినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఆయన 50 ఏళ్లకు పైగా ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. 1995 జనవరి 11న బాబా మరణం అనంతరం సావంత్ బాబా అనే మరాఠీ వ్యక్తి ఆలయంలో పూజారీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జానకీదేవి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే ఎన్నో ఏళ్లు నిస్వార్థ సేవలందించిన రామదాస్ బాబా సమాధి మందిరాన్ని కూడా ఇక్కడ నిర్మించడం విశేషం. వరాలిచ్చే.. వరాలదేవి భివండీలో ప్రాచీనమైన వరాలదేవి మాత మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ మందిరంలో కొలువైన వరాలదేవినే తెలుగు ప్రజలు పోచమ్మ తల్లిగా కొలుస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వలస వచ్చిన తెలుగు ప్రజలందరు ఆషాఢ మాసంలో పోచమ్మ పండుగను జరుపుకోవడం ప్రారంభించారు. భివండీలోకెల్లా వరాల దేవి ఆలయం చారిత్రాత్మకమైనది, అతి ప్రాచీనమైనది. ఆలయం సమీపంలో ఉన్న జలాశయాన్ని కూడా వరాలదేవి జలాశయంగా పిలుస్తారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా పోచమ్మ బోనాలు తీసుకెల్లడంతోపాటు కోళ్లు, మేకలను దేవికి బలిస్తున్నారు. ఈ సారి కూడా భివండీలోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పోచమ్మ పండుగను జరుపుకుంటున్నారు. భివండీలో ఆది, శుక్రవారాలు సెలవు కావడంతో ఇక్కడి ప్రజలు అప్పుడే చేసుకుంటారు.