Published
Mon, Aug 29 2016 12:23 AM
| Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
ఖిలావరంగల్లో ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్న మహిళలు
శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భక్తులు ముత్యాలమ్మ, పోచమ్మ తదితర అమ్మవార్లకు బోనాలు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొంది.