సికింద్రాబాద్‌: లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం | Lashkar Bonalu At Secunderabad Ujjaini Mahankali Temple | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌: లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

Published Sun, Jul 21 2024 7:37 AM | Last Updated on Sun, Jul 21 2024 11:17 AM

Lashkar Bonalu At Secunderabad Ujjaini Mahankali Temple

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కుటుంబ సమేతంగా తొలి బోనాన్ని సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సకాలంలో మంచి వర్షాలు పడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. హైదరాబాద్ జంట నగరంలోనే కాకుండా వంద సంవత్సరాల నుంచి సంస్కృతి సాంప్రదాయాలతో ఈ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి అన్నారు.

ఈ రోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు, 28వ తేదీ లాల్ దర్వాజా బోనాలు, తర్వాత రంగం, అంబారీ ఊరేగింపు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు సహకారం కావాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement