-
తెలంగాణకు ఏం చేశారో చెప్పండి
కరీంనగర్ కార్పొరేషన్: పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటో ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి చేసిందేమిటో సమాధానం చెప్పాకే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ఓట్లు అడగాలన్నారు. ఆంబేడ్కర్ జయంతి సందర్భంగా పదేళ్ల బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆదివారం కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడుగుతున్నారని, తాము అధికారంలోకొచ్చి నాలుగు నెలలే అయిందని, అంతకుముందు పదేళ్లు అధికారంలో ఉండి అమలు చేయని హామీల మాటేమిటని ప్రశ్నించారు. బీజేపీ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ నిరసన దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. నల్లధనాన్ని బయటకు తీసి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు పింఛన్ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్ర విభజన హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. గతంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన పరిశ్రమలను మోదీ ప్రైవేట్ పరం చేస్తూ అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. డిపాజిట్లు రాని బీజేపీతో కాంగ్రెస్కు పోటీ ఏంటి? బీజేపీకి 2014లో 105 సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదని, 2018లో 100 సీట్లలో, 2023లో 70కి పైగా సీట్లలో డిపాజిట్ రాలేదని, అలాంటి బీజేపీకి కాంగ్రెస్తో పోటీనా అని పొన్నం వ్యాఖ్యానించారు. మోదీ ఫొటోతో ఓట్లు రావని బీజేపీ నేతలకు కూడా తెలుసని అందుకే రాముడి ఫొటోలతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీక్షలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి పాల్గొన్నారు. -
గాంధీభవన్, తెలంగాణ భవన్ వద్ద మంత్రి పొన్నం దీక్ష చేయాలి
కథలాపూర్ (వేములవాడ/వేములవాడ అర్బన్ ): వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినందుకు గాంధీభవన్ వద్ద, కేసీఆర్ పదేళ్లు ప్రజలను అరిగోస పెట్టినందుకు మంత్రి పొన్నం తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ సవాల్ విసిరారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో బండి సంజయ్ మాట్లాడారు. అంతకుముందు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రైతులను కలిసి వారు పడుతున్న కష్టాలు తెలుసుకున్నారు. ఇకనై నా కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మా టలు మానుకుని ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. పొన్నం దీక్ష ఎందుకోసమో చెప్పాలి పొన్నం దీక్ష చేసేది కరోనా సమయంలో ప్రధాని మోదీ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకా? లేక కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ. 12 వేల కోట్ల నిధులిచ్చినందుకా? లేదా కశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేసినందుకా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్లో కాంగ్రెస్కు ఎంపీ అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు చెన్న మనేని వికాశ్రావు, తదితరులు పాల్గొన్నారు. -
Ponnam Prabhakar: 14న కరీంనగర్లో దీక్ష చేస్తాం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 14న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దీక్ష చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. గాంధీభవన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి, అధికార ప్రతినిధి కోట శ్రీనివాస్లతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడారు. గత పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయకుండా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెర వేర్చకుండా ఏ మొహం పెట్టు కుని బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల్లో ఓట్లడుగుతారని వారు ప్రశ్నించారు. దేశంలోని నవరత్నాల కంపెనీలను అమ్మే స్తున్న బీజేపీకి ఒక ఎజెండా లేదని, కేవలం రాము డుపేరిట అక్షింతలు, కుంకుమలను ప్రజలకిచ్చి ఓట్లడుగుతున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమంలో యువత బలిదానాలను బీజేపీ అవహేళన చేసిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్య లకు బీజేపీనే కారణమని విమర్శించారు. కరీంనగర్ లోక్సభ అభ్యర్థి ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. -
బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం
-
టచ్ చేసి చూడండి..ఏం జరుగుతుందో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని మొన్నటివరకు బీఆర్ఎస్ పాట పాడిందని.. ఇప్పుడు బీజేపీ నేతల నోట అదే పాట వినిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యా నించారు. తలచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలే టి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘కాంగ్రెస్ను టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో’అని హెచ్చరించారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, తమను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. పొన్నం శనివారం గాం«దీభవన్లో టీపీసీసీ నేతలు నిజాముద్దీన్, కోట్ల శ్రీనివాస్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడానికి ఏలేటి మహేశ్వర్రెడ్డి ఏమైనా జ్యోతిష్యం చదువుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు బీసీని అధ్యక్షుడ్ని చేయండి లోక్సభ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరమని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్ ఏర్పాటైన 23 ఏళ్లలో ఒక్క బీసీ నేత అయినా ఆ పారీ్టకి అధ్యక్షుడయ్యారా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక అయినా, లేక ఎన్నికల్లో ఓడిపోయాక అయినా బీసీలకు అధ్య క్ష పదవి ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత, ప్రతిపక్ష నేత, మండలిలో ప్రతిపక్ష నేత.. ఇలా ఏ పదవిని కూడా బీసీలకు ఇవ్వకుండా.. బీసీలను ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడటం ఏమిటని నిలదీశారు. తమ ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి, రూ.150 కోట్లు నిధులు ఇచి్చందని, 17 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. కాంగ్రెస్తోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పారీ్టలో బీసీలకు అన్యాయం జరిగితే పారీ్టలో అంతర్గతంగా అడుగుతామని, బీఆర్ఎస్లో అలా అడిగే స్వేచ్ఛ కొంచెమైనా లేదని విమర్శించారు. బీసీని అధ్యక్ష పదవి నుంచి తీసేసి.. బలహీనవర్గాల నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసిన బీజేపీ.. బీసీ నేతను సీఎం చేస్తామని చెప్పడం ఏమిటని పొన్నం నిలదీశారు. అవినీతి చేసినందుకే బండి సంజయ్ను తీసేశామని కిషన్రెడ్డి వర్గం చెప్తుంటే.. కిషన్రెడ్డిని కేసీఆర్ నియమించుకున్నారని బండి సంజయ్ వర్గం అంటోందని వ్యాఖ్యానించారు. కాగా.. మంత్రులు టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారని మీడియా ప్రస్తావించగా.. తనను అలాంటి చర్యకు పాల్పడాలని అడిగే ధైర్యం ఎవరికీ లేదని, కలలో కూడా బీజేపీ ఊసెత్తనంటూ మంత్రి పొన్నం మీసం మెలి తిప్పారు. -
నేటి నుంచే టీజీ రిజిస్ట్రేషన్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలోని వాహనాలు శుక్ర వారం(నేటి) నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, రోడ్డు రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు భిన్నంగా టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పాడాలనే ఆకాంక్షతో పాల్గొన్న ఉద్యమకారులు, ప్రజలు తమ వాహనాలపై ఆరోజే టీజీ ఆని రాసుకున్నారని గుర్తు చేశారు. అయితే అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ టీజీకి బదులు టీఎస్ను తెచ్చి వారి ఆకాంక్షలు, మనోభా వాలను అణచివేసిందని విమర్శించారు. గురువారం హను మకొండ కలెక్టరేట్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీటీసీ పుప్పాల శ్రీనివాస్తో కలి సి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు నెరవేరేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని శాసనసభ ఆమోదంతో టీఎస్ను టీజీగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా లేఖ పంపించామని, శుక్రవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలన్నీ టీజీ మీదనే అవుతాయని, ఇప్పటివరకు రిజిస్టర్ అయిన వాహనాల నంబర్లు అలాగే ఉంటాయని చెప్పారు. ప్రతి వీఐపీ డ్రైవర్కు ఫిట్నెస్ టెస్టులు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయంలో నిబంధనలను కఠిన తరం చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రతి వీఐపీ డ్రైవర్కు కూడా ఫిట్నెస్ టెస్టులు నిర్వహించాలనే నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి కొత్తబస్సులు తెచ్చామని, త్వరలోనే మరో వెయ్యి బస్సులు తేనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని కేడర్లకు చెందిన 3,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, కార్మికులు సంతోషంగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక మూడు సిరీస్ల ముచ్చట సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలకు శుక్రవారం నుంచి టీజీ రిజిస్ట్రేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఇకపై మూడు సిరీస్లతో తెలంగాణ వాహనాలు కనిపించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వాహనాలకు ఏపీ సిరీస్ కొనసాగింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 జూన్లో టీఎస్ సిరీస్ అందుబాటులోకి వచ్చినా, అప్పటివరకు ఏపీ సిరీస్తో ఉన్న వాహనాలకు పాత సిరీస్నే కొనసాగించొచ్చని నాటి ప్రభుత్వం పేర్కొంది. దీంతో 2014 జూన్(టీఎస్గా మారకముందు)కు ముందు నాటి వాహనాలు ఏపీతో, ఆ తర్వాతవి టీఎస్తో కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి టీజీ సీరీస్ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. దీంతో మూడు సిరీస్లతో వాహనాలు కనిపించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,91,666 వాహనాలు ఉన్నాయి. వీటిల్లో 70,81,345 వాహనాలు ఏపీ సిరీస్తో ఉండగా, 98,10,321 వాహనాలు టీఎస్ సిరీస్తో నడుస్తున్నాయి. రాష్ట్ర సిరీస్ తప్ప జిల్లా సిరీస్లు యధాతథంగా కొనసాగుతాయి. టీజీ జెడ్ ఆర్టీసీ వాహనాలకు, టీజీ09 పీ పోలీసు వాహనాలకు, నంబర్ల పక్కన టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్లు రవాణా వాహనాలకు కొనసాగుతాయి. -
నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే.. : మంత్రి పొన్నం
సంగారెడ్డి: గ్రామీణ యువత క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడా స్ఫూర్తి ఐక్యతను ప్రోత్స హిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పోతారం(ఎస్) లో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను సందర్శించి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే ఆడేదని, ఈ ఊరు నుంచి కబడ్డీ క్రీడాకారులు పోలీసులు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కబడ్డీ క్లబ్ అధ్యక్షుడు మడక కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్లు కేడం లింగమూర్తి, బత్తిని సాయిలు, ఎంపీటీసీ భొమ్మగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ రథం అందజేస్తా.. లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్, కరీంనగర్ రెనే ఆస్పత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని సీవీ రామన్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో మంత్రి వైద్య పరీక్షలు చేసుకున్నారు. శిబిరంలో ప్రముఖ ఛాతీ వైద్యులు, గుండె సంబంధించిన వైద్యులు, జనరల్ ఫిజీషియన్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు, వైకుంఠ రథాలు పెట్టుకోవడానికి వసతి కోసం కలెక్టర్, ఆర్డీఓలతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లయన్స్ క్లబ్కు నా తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అయిలేని అనిత, వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, లయన్స్ క్లబ్ నిర్వాహకులు రాజగోపాల్రావు, కాయిత నారాయణ రెడ్డి, చిట్టి గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రిని సన్మానించిన ఆర్టీసీ ఉద్యోగులు హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీ ఉద్యోగులు శాలువా కప్పి సన్మానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017 సంవత్సరానికి సంబంధించి వేతన సవరణ 21 శాతం ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి చదవండి: హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా.. : బీబీ పాటిల్ -
TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి. కాగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నాం. 2017లో ఆనాటి ప్రభుత్వం పీఆర్సీ 16 శాతం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. కొత్త పీఆర్సీ జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తాం. 21 శాతం పీఆర్సీ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 418.11 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా నడుస్తోంది అని వ్యాఖ్యలు చేశారు. -
మహా జాతర షురూ
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున ఆ ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. ఉద యం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తుల రాక మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్న ను దర్శించుకుని, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ గౌతమి, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మూడు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. -
ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రయాణం
షాద్నగర్ (హైదరాబాద్)/జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహ బూబ్నగర్లో నిర్వహించిన గౌడ సంఘం సమావేశానికి వెళ్లేందుకు.. ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వరకు బస్సులో ప్రయాణించారు. నారాయణపేట డిపో బస్సు ఎక్కిన మంత్రి మహిళా ప్రయా ణికులతో ముచ్చటించారు. డ్రైవర్ ఇయర్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న విషయాన్ని గమనించిన పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బస్సులోని మహిళా కండక్టర్ను ఈ విషయమై అడి గారు. డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని తమాషా చేస్తున్నాడా?.. అలా మాట్లాడితే సస్పెండ్ అవు తాడు తెలుసా?.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు కదా? అన్నారు. ‘కాంగ్రెస్ సర్కార్ ఆయా.. ఏ సబ్ కా సర్కార్ హై’.. అంటూ ఓ ముస్లిం ప్రయాణికురాలితో మంత్రి ముచ్చటించారు. పెన్షన్ వస్తుందా? అని ప్రశ్నించగా.. రావడం లేదని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నావా? అని అడిగారు. లేదని ఆమె చెప్పడంతో వెంటనే దరఖాస్తు చేసుకోమని మంత్రి పొన్నం సూచించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని.. అదేవిధంగా కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
నా తల్లిని అంటావా?
-
ఉద్యమకారులను విస్మరించిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను విస్మరించడం వల్లనే కాంగ్రెస్లో పార్టీలోకి వలస వస్తున్నారని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం గాందీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్షి సమక్షంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీపా దాస్ మున్షి వారిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు తగిన గుర్తిపు ఉంటుందన్నారు. టీఆర్ఎస్ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను తొక్కిపెట్టిందని గుర్తు చేశారు. ఉద్యమకారులు పార్టీ వీడి మంచి నిర్ణయం తీసుకుంటున్నారని అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిని సంక్షేమ అభివద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్తగారింటి నుండి తల్లి గారి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టడంతోనే రాజీనామా చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాదని ధనబలం ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, జీహెచ్ఎంíసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కార్పొరేటర్లు బాబా ఫసియొద్దీన్ పాల్గొన్నారు. -
వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీ) డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చిన్నచిన్న తప్పిదాలతో వీఐపీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ సుమోటోగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఐపీలంతా తమ డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ లేఖలు రాస్తామన్నారు. ఈ జాబితాలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారని వివరించారు. వారి డ్రైవర్లకు అన్ని జిల్లాల్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షల అనంతరం డ్రైవర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, వారిని కొనసాగించుకోవాలా వద్దా అనేది వీఐపీల ఇష్టమని చెప్పారు. పొన్నంప్రభాకర్ శనివారం గాం«దీభవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో రోజూ సగటున 45లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడా సంఖ్య 55–60 లక్షల వరకు ఉంటోందని తెలిపారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఆర్టీసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తోందని చెప్పారు. పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని, గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ స్థలాల్లో ప్రాజెక్టులు చేపడతామని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద అనవసరంగా జీరో టికెట్లు కొట్టే కండక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమా శ్రీనివాసరావు లాంటి వారు పాత బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. ఆర్టీసీలోకి కొత్తగా వెయ్యి బస్సులు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 100 వచ్చాయని, దశలుగా మిగతావి తెస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయం రూ.150 కోట్లకు చేరిందని, రూ.2 వేల కోట్ల ఆదాయార్జన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీలది డ్రామా బీఆర్ఎస్– బీజేపీ ఒకటేనని.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త డ్రామా మొదలుపెట్టాయని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ ఒకటి కాదని చెప్పుకొనేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తున్నారని.. అందుకే వాయిదాల పద్ధతుల్లో నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్ మోడల్లో కులగణన త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఇందుకోసం బిహార్లో అమలు చేసిన ప్రక్రియను అనుసరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ గణన కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి ఎన్యూమరేటర్కు శిక్షణ ఇస్తామని, కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అంశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామన్నారు. కులగణన బిల్లును దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆమోదించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూపాలని సవాల్ చేశారు. ఆటో కార్మి కులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చామని.. దీనిపై కేబినెట్లోనూ చర్చించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల రంగం ఇబ్బంది పడుతుందనడంలో వాస్తవం లేదని.. అందుకు ప్రతి నెలా అమ్ముడవుతున్న ప్యాసింజర్ ఆటోల గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. -
317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పీఆర్టీయూటీఎస్ హర్షం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ్నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు: టీఎస్యూటీఎఫ్ ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభు త్వం జీవో 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జీవో 46పై సబ్ కమిటీతో నిరుద్యోగులకు న్యాయం: బల్మూరి వెంకట్ జీవో నంబర్ 46పై కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఎంఎల్సి బల్మూరి వెంకట్ స్వాగతించారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము సూచనలు, సల హాలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి అన్యా యం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్ కమిషనర్కు టీపీఎస్ఏ వినతిపత్రం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలపై గత సర్కార్ ఇచ్చిన జీవో 317తో ముడిపడిన సమస్యల పరిశీలనకు సీఎం రేవంత్రెడ్డి కేబినెట్ సబ్కమిటీని నియమించడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) హర్షం ప్రకటించింది. ఈ జీవో కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్కు టీఎస్పీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం పీఆర్ కమిషనరేట్లో కమిషనర్కు టీఎస్పీఏ ప్రతినిధులు మధుసూదన్రెడ్డి, .శ్రీనివాస్, పండరీనాథ్ వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో వల్ల కొందరు కార్యదర్శులు స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఇబ్బందులుపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
మా ప్రభుత్వాని టచ్ కూడా చేయలేరు
-
కేసీఆర్ తోడల్లుడిపై కేసు నమోదు
కరీంనగర్క్రైం: మాజీ సీఎం కేసీఆర్ తోడల్లుడు, రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు తండ్రి రవీందర్రావుపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టూటౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అనుచరుడు కరీంనగర్లోని రాంనగర్కు చెందిన కూస రవీందర్ భూదందాలకు పాల్పడుతున్నాడని ఓ యూట్యూబ్ చానల్లో వార్త ప్రసారం చేశారు. మిడ్మానేరు భూ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లలో భూకబ్జాకు పాల్పడ్డాడని, అక్రమ పట్టా ఇవ్వమని సిరిసిల్ల ఆర్డీవోను బెదిరింపులకు గురిచేశాడని పేర్కొన్నారు. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని, తప్పుడు విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని.. దీని వెనుక కేసీఆర్ తోడల్లుడు జోగినపల్లి రవీందర్ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్ ఉన్నారని కూస రవీందర్ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జోగినపల్లి రవీందర్ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్, యూట్యూబ్ చానెల్ నిర్వాహకుడు చిలుక ప్రవీణ్పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.ల -
హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్.. టీపీసీసీ భారీ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్ రాజకీయం నడుస్తోంది. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్కు టీపీసీసీ అప్పగించింది. ఇందులో భాగంగా జార్ఖండ్ కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలు నేడు హైదరాబాద్కు రానున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ వారి కోసం మూడు హోటల్స్ను సిద్ధం చేసింది. గచ్చిబౌలి, రామోజీ ఫిల్మ్ సిటీ, శామీర్పేట్ లియోనియో హోటల్స్ను టీపీసీసీ బుక్ చేసింది. ఈ క్రమంలో 43 మంది ఎమ్మెల్యేలను హోటల్స్కు తరలించేందుకు బస్సులను కూడా సిద్ధం చేశారు. కాగా, జార్ఖండ్లో బలపరీక్ష నిరూపణ వరకు ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్లోనే ఉండనున్నారు. మరోవైపు.. కొద్దిసేపటి క్రితమే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
బాలయ్యలా మారిన మంత్రి పొన్నం ప్రభాకర్
-
దశాబ్ద కాలం తర్వాత డీఆర్సీ
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై బుధవారం సుమారు 4 గంటల పాటు సుదీర్ఘమైన సమీక్ష సమావేశం జరిగింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత డీఆర్సీ సమావేశ దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇన్చార్జి మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పూర్తి స్థాయి వివరాలు, అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో ఆరా తీయడంతోపాటు సమస్యలను ఆయన నోట్ చేసుకున్నారు. అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. శాఖాపరంగా సమగ్ర అవగాహన, సమాచారం లేనివారిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశానికైనా సమగ్ర సమాచారంతో రావాలని పలు శాఖల అధికారులను స్వల్పంగా మందలించారు. అధికారులు తమ విధులు, బాధ్యతలు విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం మాదిరిగా వన్సైడ్ నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణతపై సమ్మతి లేఖ తప్పనిసరి త్వరలో జరగనున్న పదోతరగతి, ఇంటరీ్మడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణతపై సమ్మతి లేఖ తప్పనిసరి అని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. సంబంధిత హెచ్ఎం, టీచర్, వార్డెన్లను నుంచి సమ్మతి లేఖ తీసుకోవాలని, విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించకుంటే వారినే బాధ్యులు చేయాలని సూచించారు. ఇప్పటి నుంచే సంబంధిత అధికారులు పాఠశాలలపై పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గురుకులాలు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల లో సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. పరిష్కారానికి హామీ.. ప్రభుత్వ విభాగాల్లో పలు పలు సమస్యలు, పెండింగ్ పనులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండు మోడ్రన్ ధోబీఘాట్ల పూర్తైనప్పటికీ న్యాయపరమైన సమస్యలు ఉండడంతో మిషన్లు తుప్పుపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొనడంతో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఉన్న తాధికారులను ఆదేశించారు బీసీ హాస్టళ్లు అధిక శాతం ప్రైవేట్ భవనల్లో ఉన్నాయని వాటి సొంత భవనాల నిర్మాణం, 6 హాస్పిటళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం జీఓ ఇచి్చందని, నిధులు విడుదల చేయలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అధునాతన చేపల మార్కెట్ ఏర్పాటు నగరంలో అధునాతన చేపల మార్కెట్ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చేపల మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు రోడ్లపై విక్రయిస్తున్నారని, ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేసి మత్స్యకారులు, వినియోగదారులకు సౌకర్యం కలి్పస్తామన్నారు. కూరగాయల మార్కెట్లను సైతం రెగ్యులరైజ్ చేస్తామన్నారు. పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. కలెక్టరేట్కు కొత్త భవనాన్ని నిర్మిస్తాం.. త్వరలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్కు నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. విశాలమైన స్థలంలో ఎవరూ ఊహించని విధంగా భారీ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి సైతం కొత్తవి అందిస్తామని స్పష్టం చేశారు. 58, 59 జీఓకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లు రాబోయే వేసవితో పాటు విద్య, వైద్యానికి సంబంధించి అత్యవసర పనుల కోసం ఒక్కో నియోజక వర్గానికి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్లో జరిగిన ‘జిల్లా స్థాయి సమీక్ష సమావేశం’ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల అత్యవసర సమస్యల పరిష్కారం కోసం తన కోటా నిధులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో ఎమ్మెల్యే, ఎమెల్సీలు, ఎంపీలతో జిల్లా అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. -
కూలుస్తామంటే ఊరుకోం
కరీంనగర్ కార్పొరేషన్: ‘ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం.. మమ్మల్ని ముట్టుకొనే దమ్ముందా, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు.. మా పార్టీలో కోవర్ట్ వ్యవస్థ లేదు, మా 64 మంది కుటుంబ సభ్యులమంతా కలిసే ఉన్నాం, నోరు.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి’అని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్ని హెచ్చరించారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలుస్తుందని బండి సంజయ్ చెప్పడంపై స్పందిస్తూ.. ఆయన జోస్యం చెబుతున్నారా, లేదంటే బీఆర్ఎస్ నాయకులు ఆయనకు సమాచారం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తాము చెప్పిందే నిజమని దీనితో రుజువైందన్నారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న సంజయ్ వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. తాము దేశ నిర్మాణం చేసినవారిమని, విధ్వంసాలు సృష్టించే పని తమకెందుని అన్నారు. ఇవి మతిలేని వ్యాఖ్యలని ధ్వజమెత్తారు. తాము జీవితంలో బీజేపీతో కలిసేది లేదని, రెండు పార్టీల దారులు వేరని స్పష్టం చేశారు. ఇంటర్మిడియెట్ ఫెయిల్ అయిన బండి సంజయ్ జోస్యాలు చెపుతున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. పర్మినెంట్గా ‘కేసీఆర్’లానే ఉండండి.. ‘మీ నాయనకు సీఎం పదవి అనేది ఎడం కాలు చెప్పు అయింది. నీకు కూడా ఆ అక్షరాలు నచ్చట్లేదు.. పర్మినెంట్గా కేసీఆర్లానే ఉండండి. జీవితంలో సీఎం అనే పదవి తీసుకోకండి. సీఎం అనే పదమే మీకు పడదు. ఆ పదవి దిక్కే రాకండి. చాలా సంతోషం’అంటూ మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి పొన్నం వ్యాఖ్యానించారు. సీఎం పదవి కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలు పవర్ఫుల్ అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా విమర్శించారు. అధికారం కోల్పోతామని కేటీఆర్ కలలో కూడా ఊహించలేదని, అందుకే అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. అయోధ్యలో ఎన్నికల మార్కెటింగ్ అయోధ్యలో ధర్మానికి విరుద్ధంగా ఎన్నికల మార్కె టింగ్ జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే విషయం మాట్లాడితే హిందూ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారన్నా రు. అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట ఎవరు చేయాలో హిందువులందరికి తెలుసని, జంటగా లేనటువంటి వారెలా చేస్తారని ప్రశ్నించారు. ఆలయం నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంబోత్సవమేమిటన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చన్నారు. -
కాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర: బండి సంజయ్
కరీంనగర్టౌన్/ఎల్కతుర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ పెద్దఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్లో కేసీఆర్కు కోవర్టులున్నారని, గత ఎన్నికల్లో ఆయన వారికి పెద్దఎత్తున నిధులు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్కు టచ్లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసి ఆ నిందను బీజేపీపైకి నెట్టివేసినా ఆశ్చర్యం లేదని సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్లో బండి సంజయ్ సమక్షంలో మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చేవాళ్లమని కేటీఆర్ అంటున్నారని, పంచొద్దని ఎవరు అన్నారని ప్రశ్నించారు. ‘భద్రాద్రి రామాలయానికి తలంబ్రాలు కూడా తీసుకురానోడు.. ఎములాడ రాజన్నకు, కొండగట్టుకు, ధర్మపురి ఆలయాలకు నిధులిస్తామని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్’అని అన్నారు. ప్రజలు కేసీఆర్ను మర్చిపోయారని, బయటికి వస్తే ఎవరూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు. గల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఢిల్లీలో ఉండాల్సింది మోదీనే అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల దుష్ప్రచారం.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. అలాంటి కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజల బతుకులను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ను పూర్తిగా బొందపెట్టేదాకా విశ్రమించబోమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచి్చన హామీలు నెరవేరాలంటే కేంద్రంలో బీజేపీ ఎంపీలు ఎక్కువగా గెలవాలన్నారు. అయోధ్యపై రగడ ఎందుకు? అయోధ్య రామమందిర ఉత్సవం రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమమని, దీనిపై రగడ ఎందుకని బండి సంజయ్ ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లు రామ మందిర నిర్మాణానికి అనుకూలమా? వ్యతిరేకమా? సమాధానం చెప్పా లన్నారు. ఒకనాడు కాంగ్రెసోళ్లు అయోధ్యలోనే రాముడు పుట్టారనడానికి ఆధారాలేమిటని ప్రశ్నించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. కానీ దేశ ప్రజలు ప్రశాతంగా ఉంటూ కోర్టు తీర్పును స్వాగతించే సరికి జీరి్ణంచుకోలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హితవు పలికారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్కు ఎంత అహకారం ఉందో మంత్రి పొన్నం ప్రభాకర్కు కూడా అంతే అహంకారం ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల మాటలనే పొన్నం ప్రభాకర్ కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీని నిందిస్తే పొన్నంకు ఏమి వస్తుందో అర్థం కావడం లేదన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయిన ప్రజలు మనల్ని చూసి గర్వపడాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా విమర్శలు మానుకొని అభివృద్ధిలో ముందుకు సాగాలని సూచించారు. రాబోయో ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఓ మిత్రుడు అడగడంతో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ 350 సీట్లకు పైగా గెలవడం ఖాయమని అన్నారు. తెలంగాణలో ఎంతమంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే అంత ఎక్కువగా నిధులు తీసుకొచ్చి రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. -
పర్యాటక అభివృద్ధికి కృషి
కంటోన్మెంట్ (హైదరాబాద్): ప్రపంచ స్థాయిలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా అన్ని పండుగలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్ను శనివారం రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో నిర్వహించే పతంగుల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు నగరంలో నివసిస్తున్నారని, అందువల్ల ప్రభుత్వ ఆధ్వర్యంలో పతంగులు, మిఠాయిల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 16 దేశాల నుంచి 40 మందికి పైగా కళాకారులు కైట్స్ ఫెస్టివల్లో పాలుపంచుకుంటున్నారన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు 400కు పైగా స్టాళ్లలో సుమారు 1,200 రకాల స్వీట్లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వేడుకల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలతోపాటు వంటకాలనూ తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇలాంటి ఉత్సవాలను జిల్లా, మండలస్థాయిలోనూ నిర్వహిస్తామని ప్రకటించారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వియత్నాం, నెదర్లాండ్స్, కొరియా తదితర దేశాల నుంచి పర్యాటకులు పాల్గొన్నారని తెలిపారు. ముఖ్య ఆదాయ వనరుగా మారాలి: పొన్నం రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పర్యాటకం అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎక్సైజ్ ఇతర శాఖలకు పోటీగా పర్యాటకం ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఇందుకు రవాణా శాఖ నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె.నిఖిల, ఎండీ రమేష్ నాయుడు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్వామి వివేకానంద బాటలో నడవాలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. అటువంటి గొప్ప వ్యక్తి బాటలో నేటి యువతరం నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్లు వివేకానంద చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద చిన్నతనంలోనే అనేక విషయాలపై పట్టు సాధించిన వ్యక్తి అని అన్నారు. పొన్నంకు క్రిబ్కో చైర్మన్ సన్మానం.. ఢిల్లీ వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిబ్కో చైర్మన్ చంద్రపాల్సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిని శాలువాతో సత్కరించారు. తెలంగాణలో సహకార రంగం అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రపాల్ సింగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
బీఆర్ఎస్లో దడ మొదలైంది: మంత్రి పొన్నం
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణతో బీఆర్ఎస్లో దడ మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదన్నారు. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తామన్నారు. బీఆర్ఎస్ను కాపాడేందుకు బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చి నెలరోజులవుతుంది. గ్యారంటీ స్కీమ్లపై దరఖాస్తులు స్వీకరించాం. చిత్తశుద్ధితో అమలు చేస్తాం. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జెన్ కోతో పాటు ఇతర శాఖల్లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళాలి. భూ అక్రమార్కులపై చర్యలు చేపడుతాం’’ అని మంత్రి హెచ్చరించారు. ఇదీ చదవండి: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు -
అర్హుల గుర్తింపునకు 'ఇంటింటి సర్వే'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ఇంటింటి సర్వే నిర్వహిస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, ఆరు గ్యారంటీలను వందరోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ప్రజాపాలన దరఖాస్తులు..తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఆ సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ సచివాలయ మీడియా సెంటర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడు తూ కోటి ఐదు లక్షల దరఖాస్తులు ఆరు గ్యారంటీలకు రాగా, మరో 20 లక్షల దరఖాస్తులు రేషన్కార్డులు, ఉద్యోగాలు, భూసమస్యలపైనా వచ్చాయన్నారు. 30వేల మందికిపైగా ఆపరేటర్లతో యుద్ధప్రాతిపదికన డేటాఎంట్రీ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 13 నుంచి 14 శాతం వరకు ఎంట్రీ పూర్తయ్యిందని, మొత్తం పూర్తిచేసేందుకు ఈనెల 25 నుంచి 30వతేదీ వరకు సమయం పడుతుందని, ఆలోపు పూర్తి సమాచారం కంప్యూటరీకరిస్తామన్నారు. ఆధార్కార్డు, రేషన్కార్డులను లింకప్ చేసి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ హామీలన్నీ అందిస్తామని చెప్పారు. డేటాఎంట్రీ పూర్తయిన తర్వాత అర్హులందరి లిస్ట్ గ్రామాల వారీగా వెల్లడిస్తామన్నారు. ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి అధికారులు వెళ్లి వివరాలు మరోసారి పరిశీలిస్తారని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 40 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గతంలో తామెప్పుడూ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్రెడ్డి, భట్టివిక్రమార్క, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, మల్లిఖార్జున ఖర్గే, రాహూల్గాందీ, ప్రియాంకగాందీలు సైతం ఎక్కడా ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చి మంగళవారానికి నెలరోజులు అవుతుందని, ఈలోపే ప్రతిపక్షాలు విమర్శలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజులు కూడా కాకముందే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయన్నారు. విమర్శలు చేసే ముందు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. గత ప్రభుత్వ తప్పులను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రతిపక్షాలు, మీడియా సైతం ఓపిక పట్టాలని కోరారు. డేటాఎంట్రీ పూర్తయిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘంలో విధివిధానాలపై చర్చిస్తామన్నారు. వీటన్నింటిపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేయని అర్హులైనవారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాపాలన వెబ్సైట్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కమిటీలో ఎవరంటే.. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ సబ్కమిటీని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన ఏర్పాటు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ సబ్కమిటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతోపాటు తాను సభ్యుడిగా ఉన్నానని పొంగులేటి చెప్పారు. ఈ కమిటీ ఆరు గ్యారంటీల అమలుపై చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని తెలిపారు. రేషన్కార్డులపైనా త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. ప్రస్తుతం 89 లక్షల రేషన్కార్డులు ఉన్నాయని, కార్డులు లేనివారి నుంచి ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈనెల 6వ తేదీ నుంచి అధికారులంతా ఓటర్లిస్ట్ ప్రక్రియలో ఉన్నారని, అయినా ఆరు గ్యారంటీల అమలు ప్రక్రియలో భాగంగా డేటాఎంట్రీ కొనసాగుతుందన్నారు. సంక్రాంతి తర్వాత మీడియా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచి్చన భూములకు సంబంధించిన జీఓలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చిస్తామని చెప్పారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement