అనంతపురం ఎడ్యుకేషన్ :
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2017–18 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్ బి.తులసి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన అభ్యర్థులు వివిధ ట్రేడ్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూలై 5 వరకు అన్ని ప్రభుత్వ ఐటీఐలో దరఖాస్తులు పొందొచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 5 సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలని తెలియజేశారు.