iti
-
బీఎస్ఎన్ఎల్కు రూ.6,000 కోట్లు.. ఏం చేస్తారంటే..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 4జీ విస్తరణ ప్రణాళికలకు ఊతమిచ్చేందుకు రూ.6,000 కోట్ల అదనపు నిధుల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయంలో లోటును పరిష్కరించడం, దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.దిల్లీ, ముంబయిల్లో మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) కార్యకలాపాలను సైతం నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్కు దేశవ్యాప్తంగా 4జీ సేవలు లేకపోవడం, అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కొరవడడంతో సవాళ్లు ఎదుర్కొంటోంది. దానివల్ల బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు 4జీ కవరేజీని అందించే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు మారుతున్నారు. ప్రైవేట్ కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కోవడానికి సంస్థ 2023లో 1,00,000 4జీ సైట్ల కోసం రూ.19,000 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ప్రభుత్వ రంగ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఐటీఐ(ITI)కి సుమారు రూ.13,000 కోట్ల అడ్వాన్స్ పర్ఛేజ్ ఆర్డర్ను అప్పగించింది. ఈ సంస్థలు కంపెనీకి కావాల్సిన 4జీ మౌలిక సదుపాయాలను సిద్ధం చేసి అందించాల్సి ఉంటుంది. తాజాగా మరో రూ.6,000 కోట్లు అందించేందుకు కేబినెట్ ఆమోదించింది.ఇదీ చదవండి: రేట్ల కోతతో తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు2019 నుంచి ప్రభుత్వం మూడు వేర్వేరు పునరుద్ధరణ ప్యాకేజీల ద్వారా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో సుమారు రూ.3.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఉద్యోగుల వ్యయాలను తగ్గించడం, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు, రుణ పునర్వ్యవస్థీకరణ, ఆస్తులను మానిటైజ్ చేయడం వంటి చర్యలు ఈ ప్యాకేజీల్లో ఉన్నాయి. ఫలితంగా 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి.భవిష్యత్తు ప్రణాళికలు..తాజాగా ఆమోదం పొందిన నిధులతో దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తేవాలని, కస్టమర్ల అట్రిషన్(ఇతర టెలికాం కంపెనీలకు మారడం)ను తగ్గించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని కూడా కంపెనీ యోచిస్తోంది. ఈ ప్రణాళికలు టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని, ప్రైవేట్ సంస్థలతో మరింత సమర్థవంతంగా పోటీ పడటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. -
ఏటీసీల్లో కొలువుల భర్తీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లుగా అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో వాటిలో ఉద్యోగ ఖాళీల భర్తీపై కార్మిక ఉపాధి కల్పన విభాగం దృష్టి సారించింది. దాదాపు పదేళ్లుగా ఐటీఐల్లో ఉద్యోగ నియామకాలు జరగకపోవడంతో దాదాపు 40 శాతం కొలువులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం రేవంత్రెడ్డి గతవారం కార్మిక, ఉపాధి కల్పన శాఖపై సమీక్షలో ఆదేశించారు. దీంతో ఏటీసీలవారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే నెల రెండో వారంలోగా కార్మి క శాఖకు నివేదికలు సమరి్పంచనున్నారు. ప్రతి ఏటీసీకి పూర్తిస్థాయి ప్రిన్సిపాల్... రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఏటీసీల్లో వివిధ కేటగిరీల్లో 2,033 ఉద్యోగాలు మంజూరయ్యాయి. అందులో మూడింట రెండో వంతు శిక్షణ ఇచ్చే శిక్షకుల పోస్టులు ఉన్నాయి. దాదాపు 1,500 శిక్షకుల పోస్టుల్లో 740 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏటీసీలవారీగా ఏయే కేటగిరీలో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలలో కొత్త ట్రేడ్లను పరిచయం చేయనుంది. పాత ట్రేడ్లు రద్దు చేస్తూనే వాటి స్థానంలో కొత్త ట్రేడ్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో కొత్త ట్రేడ్లపై శిక్షణ ఇచ్చే శిక్షకులకు అర్హతలను ఖరారు చేస్తూ ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సగానికిపైగా ఏటీసీల్లో పూర్తిస్థాయి ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఇన్చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు.ప్రతి ఏటీసీకి తప్పకుండా ప్రిన్సిపాల్ ఉండాలని సీఎం స్పష్టం చేయడంతో ప్రిన్సిపాల్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలా లేక నూతన నియామకాల్లో భాగంగా చేపట్టాలా అనే అంశంపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు నూతన ఏటీసీల ఏర్పాటుపైనా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ. 26,216.38 (2.102 శాతం) కోట్ల వాటా లభించనుంది. అందులో ఆదాయ పన్ను రూ. 9,066.56 కోట్లు, కార్పొరేషన్ పన్ను రూ. 7,872.25 కోట్లు, కేంద్ర జీఎస్టీ æరూ. 7,832.19 కోట్లు, కస్టమ్స్ రూ. 1,157.45 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ. 243.98 కోట్లు, సరీ్వస్ టాక్స్ రూ. 0.86 కోట్లు, ఇతర పన్నులు రూ. 43.09 కోట్లు ఉన్నాయి.ఈ మేరకు 2024–25 బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గతేడాది బడ్జెట్లో కేంద్ర పన్నుల రూపంలో తెలంగాణకు రూ. 23,066.20 కోట్లు కేటాయించగా దానితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో పన్నుల వాటా రూ. 3,150.18 కోట్లు అధికం కావడం విశేషం.రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు ఇవీ..⇒ ఈ ఏడాది బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటీ (ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు)కి నిధుల కేటాయింపులో కోత విధించారు. గతేడాది రూ. 300 కోట్లు బడ్జెట్లో కేటాయించి మొత్తం రూ. 522.71 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్ (ఈఏపీ)లకు రూ. 122 కోట్లు మాత్రమే కేటాయించారు. ⇒ తెలంగాణలోని గిరిజన యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా కేటాయింపులేవీ చేయలేదు. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కలిపి కేటాయింపులు చేశారు. అయితే గతేడాది తెలంగాణ, ఏపీలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ. 37.67 కోట్లు కేంద్రంకేటాయించింది.⇒ హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కు కేటాయింపుల్లో కోత విధించారు. గతేడాది రూ.115 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో కేవలం రూ.10.84 కోట్లే కేటాయించారు. ⇒ సింగరేణి కాలరీస్కు రూ. 1,600 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్కు రూ. 352.81 కోట్లు, హైదరాబాద్ సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి రూ. 242 కోట్ల మేర కేంద్రం కేటాయించింది. ⇒ హైదరాబాద్లోని ఇన్కాయిస్కు రూ. 28 కోట్లు, హైదరాబాద్ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ. 16.54 కోట్ల మేర కేటాయింపులు చేసింది. ⇒హైదరాబాద్ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్)కు రూ. 270 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలస్మెంట్ బోర్డుకు రూ. 16.78 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు (పెన్షన్లు) రూ. 603.33 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు విద్య, శిక్షణ, పరిశోధనకు మొత్తం రూ. 1,348.35 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. ⇒హైదరాబాద్లోని సీడీఎఫ్డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలకు కలిపి రూ. 940.66 కోట్లు, మణుగూరు సహా కోటా (రాజస్తాన్)లోని భార జల ప్లాంట్లకు రూ. 1,485.21 కోట్ల మేర కేటాయించారు. -
చదువులు ‘ఉన్నతం’
న్యూఢిల్లీ: దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందించనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రుణాలకు సంబంధించి ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలపై మూడు శాతం సబ్సిడీతో ఈ–వోచర్లు నేరుగా అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.విద్యార్థులు, విద్యారంగానికి ఇది మేలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చడం, నాణ్యమైన విద్య, మెరుగైన నైపుణ్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించవచ్చన్నారు.మేనేజ్మెంట్ విద్య బోధించే ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు వరుసగా రెండో ఏడాదీ కేంద్రం కేటాయింపులు కుదించింది. గత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పాఠశాల విద్యకు కేటాయింపులు రూ.535 కోట్లకుపైగా పెంచగా ఉన్నత విద్య గ్రాంట్ను రూ.9,600 కోట్లకుపైగా కుదించింది. మొత్తమ్మీద విద్యారంగానికి కేటాయింపులు రూ.9,000 కోట్లకుపైగా తగ్గాయి. విద్యాశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆవిష్కరణలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం విద్యాసంస్థలలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో మరో రూ.161 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు కేటాయింపులు రూ.1,300 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.1,800 కోట్లకు పెరిగాయి.యూజీసీకి నిధుల కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలు రూ.6,409 కోట్లతో పోలిస్తే ఈసారి 60.99 శాతం తగ్గించి రూ.2,500 కోట్లకు కుదించారు. ఐఐఎంలకు బడ్జెట్లో కోతలు తప్పలేదు. గతేడాది బడ్జెట్లో ఐఐఎంలకు కేటాయింపులు సవరించిన అంచనాలు రూ.608.23 కోట్లతో పోలిస్తే రూ.300 కోట్లకు కుదించగా ఈసారి మరింత కోత పడింది. ఈ ఏడాది సవరించిన అంచనాలు రూ.331 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.212 కోట్లకు కుదించారు. సెంట్రల్ వర్సిటీలకు మరికొంత.. దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యకు నిలయాలైన ఐఐటీలకు కూడా బడ్జెట్ కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సవరించిన అంచనాలు రూ.10,384.21 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.10,324.50 కోట్లకు తగ్గాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సెంట్రల్ వర్సీటీలు) కేటాయింపులు మాత్రం 28 శాతం పెరిగాయి.సెంట్రల్ వర్సిటీలకు సవరించిన అంచనాలు రూ.12,000.08 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.15,472 కోట్లకు పెరిగాయి. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎన్సీఈఆరీ్ట, పీఎంశ్రీ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూళ్లకు బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. -
ఆ ఐటీఐలు ఇక నుంచి ఏటీసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్(ఏటీసీ)లుగా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఆ దిశగా రాష్ట్ర కార్మిక శిక్షణ, ఉపాధి కల్పన విభాగం కార్యాచరణ వేగవంతం చేసింది. గతవారం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఏటీసీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చగా, మాసబ్టాంక్లో నాలుగు ఏటీసీల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలు ఉన్నాయి. వీటన్నింటినీ ఏటీసీలుగా అప్గేడ్ర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, తొలివిడతలో 25 ఐటీఐలను మాత్రమే అప్గ్రేడ్ చేస్తారు. ఇవన్నీ 2024–25 నుంచే సేవలు ప్రారంభిస్తాయి.తొలివిడతలోకి వచ్చే ఐటీఐలతో కూడిన ప్రతిపాదిత జాబితా ను సిద్ధం చేసేందుకు శిక్షణ, ఉపాధికల్పన శాఖ కసరత్తు చేస్తోంది. తొలివిడత ప్రాజెక్టులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే ఐదు ఐటీఐలు ఏటీసీలుగా మారనున్నాయి. మిగతా వాటిని కూడా ఎంపిక చేసి జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇండస్ట్రీస్ 4.0.... అప్గ్రేడ్ చేసే క్రమంలో ప్రస్తుతమున్న శిక్షణ కార్యక్రమాలు సైతం కొత్తరూపు సంతరించుకోనున్నాయి. రెండుమూడు దశాబ్దాల క్రితం ఉన్న శిక్షణ కార్యక్రమాలనే ఐటీఐల్లో కొనసాగిస్తున్నారు. ఇకపై ఏటీసీల్లో సరికొత్త కోర్సులు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కోర్సుల ఎంపికపైనా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆరు రకాల ట్రేడ్లు ఎంపిక చేసి వాటిని ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టేలా చర్యలు వేగవంతం చేసింది. ఇవన్నీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎన్సీవీటీ) నిబంధనలకు అనుగుణంగా మార్పు చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఐఓటీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, మోడ్రన్ ఆటోమేటివ్ మెయింటెనెన్స్, ఆర్ట్ వెల్డింగ్, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వెల్డింగ్, పెయింటింగ్ తదితర కొత్త ట్రేడ్లు ఏటీసీల ద్వారా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీస్ 4.0 పేరిట లాంగ్టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులను, పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన ట్రేడ్లను ఏటీసీల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. చాలా ఐటీఐల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ సమస్య, స్థలాభావం కారణంగా భవనాల సమస్య ఉండడంతో యుద్ధప్రాతిపదికన ఏటీసీలుగా మార్పు చేయడం కత్తిమీద సాములా పరిణమించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
65 ఐటీఐల్లో స్కిల్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్తో ఎంవోయూ కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో అధికారులు ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉపాధి శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, టాటా టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పవన్ భగేరియాతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విస్తరిస్తున్న పరిశ్రమల అవసరాలకు, ఇప్పుడున్న కోర్సులకు మధ్య భారీ అంతరముందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంతరాన్ని తగ్గించి యువతకు ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. రూ.2,700 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల ఖర్చుతో ఐటీఐలలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అవసరమైన వర్కషాప్ల నిర్మాణం, యంత్రపరికరాల సామగ్రితో పాటు శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్ చేపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐటీఐలలో కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెడతారు. అన్ని రంగాల్లో యువత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను ఎంపిక చేశారు. ప్రతి ఏడాదీ వీటితో 9000 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు లక్ష మందికి షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణను అందిస్తారు. ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుంచి మొదలయ్యే అకడమిక్ సెషన్కు వర్క్ షాప్లను అందుబాటులో ఉంచాలని, సరిపడేంత మంది ట్యూటర్లను నియమించాలని ముఖ్యమంత్రి టాటా టెక్నాలజీ ప్రతినిధులకు సూచించారు. కేవలం శిక్షణనివ్వటమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేందుకు క్యాంపస్ ప్లేస్మెంట్లపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక ప్లేస్మెంట్సెల్ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్ సూచించారు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు హైదరాబాద్ను స్కిల్ డెవెలప్మెంట్హబ్గా తయారు చేసేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించేందుకు త్వరలోనే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. -
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తాము రాజకీయాలు చేయడం లేదని, తమ దృష్టి అంతా అభివృద్ధి పైనే అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సీఐఐ– తెలంగాణ, టీడీఎఫ్– యూఎస్ఏల ఆధ్వర్యంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, వాణిజ్య అవకాశాలు అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, తరువాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రూ. 2,000 కోట్లతో 64 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫెకెట్స్ ఇస్తామని వెల్లడించారు. ఈ ప్రభుత్వం అందరిదని, ప్రజలు కోరుకుంటేనే అధికారంలోకి వచ్చామని అన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు. గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని, ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్లైన్ గా మారిందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం, సీఐఐ ప్రతినిధులు వగీశ్ దీక్షిత్, జి.గోపాల్రెడ్డి, సి. శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐ లిమిటెడ్ కొత్త ల్యాప్టాప్లు - ప్రత్యర్థులకు గట్టి పోటీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీలో ఉన్న ప్రభుత్వ రంగ ఐటీఐ లిమిటెడ్ స్మాష్ బ్రాండ్ పేరుతో ల్యాప్టాప్లు, మైక్రో పర్సనల్ కంప్యూటర్ల విభాగంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఇంటెల్ కార్పొరేషన్తో కలిసి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంటెల్ ఐ3, ఐ5, ఐ7 తదితర ప్రాసెసర్లతో ఉపకరణాలు రూపుదిద్దుకున్నాయని ఐటీఐ పేర్కొంది. ‘స్మాష్ ఉత్పత్తులను ఇప్పటికే మార్కెట్లో ప్రవేశపెట్టాం. ఏసర్, హెచ్పీ, డెల్, లెనొవో వంటి ఎంఎన్సీ బ్రాండ్స్తో పోటీపడి అనేక ఆర్డర్లు దక్కించుకున్నాం. 12,000 పైచిలుకు పీసీలను కస్టమర్లు వినియోగిస్తున్నారు’ అని సంస్థ సీఎండీ రాజేశ్ రాయ్ తెలిపారు. కాగా, తాజా ప్రకటన నేపథ్యంలో ఐటీఐ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో సోమవారం 20 శాతం ఎగసి రూ.149.40 వద్ద స్థిరపడింది. -
దేశంలో ఐటీఐలు చాలా పూర్
సాక్షి, అమరావతి: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్ధలు)ల పనితీరు చాలా పేలవంగా ఉందని, వాటిని తక్షణం సంస్కరించి, అధునాతనంగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నీతి ఆయోగ్ సూచించింది. నీతి ఆయోగ్ అధ్యయన బృందం వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటుఐటీఐలను స్వయంగా సందర్శించింది. అక్కడి విద్యార్థులు, బోధకులతో మాట్లాడటంతో పాటు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పరిశ్రమల అనుసంధానం తదితర అంశాలను పరిశీలించి, సమగ్ర అధ్యయన నివేదికను విడుదల చేసింది. దేశం మొత్తం మీద ఐటీఐల్లో శిక్షణ పొందిన వారిలో ప్లేస్మెంట్ కేవలం 0.90 శాతమే ఉందని ఆ నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద 2021 సంవత్సరంలో 4,14,247 మంది ఐటీఐల్లో శిక్షణ పొందితే 405 మంది మాత్రమే ప్లేస్మెంట్స్ పొందినట్లు వెల్లడించింది. అత్యధికంగా తమిళనాడులో 7,676 మంది విద్యార్థుల్లో 248 మందికి అంటే 3.2 శాతం ప్లేస్మెంట్స్ పొందారని, ఆ తరువాత గుజరాత్లో 0.25 శాతం ప్లేస్మెంట్స్ ఉండగా మిగతా రాష్ట్రాల్లో చాలా అధ్వాన్నంగా ఉందని నివేదిక వివరించింది. దేశంలో ప్రత్యేకంగా మహిళా ఐటీఐలు 2021 నాటికి 16.83 శాతం ఉంటే అందులో చేరికలు కేవలం 6.6 శాతమే. బోధకుల్లోనూ మహిళలు 15.83 శాతమే ఉన్నారు. ఇక్కడ లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రధానాంశాలివీ.. ప్రభుత్వ ఐటీఐలకే విద్యార్థుల ప్రాధాన్యత దేశవ్యాప్తంగా 14,789 ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మొత్తం 25,38,487 సీట్లు ఉండగా, వీటిలో 48.20 శాతం సీట్లే భర్తీ అవుతున్నాయి. మొత్తం ఐటీఐల్లో 78.40 శాతం ప్రైవేటు రంగంలో, మిగతావి ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అయితే, సీట్ల భర్తీలో ప్రైవేట్కన్నా ప్రభుత్వ ఐటీఐలే మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేటు రంగంలో 43.07 శాతం సీట్లు భర్తీ అవుతుండగా ప్రభుత్వ ఐటీఐల్లో సీట్ల భర్తీ 56.74 శాతం ఉందని నివేదిక పేర్కొంది. అత్యంత ఆదరణ పొందిన ట్రేడ్లలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మోటారు వెహికల్ మెకానిక్, డ్రాప్ట్స్మెన్ మొదలైనవి ఉన్నాయి. అయినప్పటికీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఉన్న సీట్లలో 64.81 శాతం, ఫిట్టర్ ట్రేడ్లో 71.57 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 35.19 శాతం, ఫిట్టర్లో 28.43 శాతం సీట్లే భర్తీ అవుతున్నాయి. అప్రెంటిస్లుగానే ఉపాధి ఐటీఐల్లో విద్యార్ధుల అనుభవాలు మిశ్రమంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. అత్యున్నత ప్రమాణాలతో ఉన్న ఐటీఐల్లో ప్లేస్మెంట్స్ 80 శాతం ఉంటున్నాయి. వీటిలో చదివిన విద్యార్థులు కెరీర్ పట్ల భరోసాతో ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సొంతంగా వెంచర్ ప్రారంభించాలన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. మరికొందరు బోధకులుగా మారాలనుకుంటున్నారు. మధ్యస్థాయి, తక్కువ స్థాయి ఐటీఐల్లో అతి కొద్ది సంస్థల్లో మాత్రమే 20 శాతానికి పైగా ప్లేస్మెంట్స్ పొందుతున్నారు. ఐటీఐ విద్యార్థులను సంస్థలు ఉద్యోగులుగా కాకుండా అప్రెంటిస్లుగానే పరిగణిస్తున్నాయి. సాధారణంగా ఐటీఐ అభ్యర్థుల కనీస వేతనం నెలకు రూ.20 వేలుగా ఉంది. చాలా కంపెనీలు ఐటీఐ అభ్యర్ధులను ఉద్యోగులుగా కాకుండా రిపేర్ల కోసం అప్రెంటిస్లగానే తీసుకుంటున్నాయి. వీరికి నెలకు రూ. 9,000 నుంచి రూ.12,000 వరకు ఇస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం 18 సంవత్సరాల వయస్సుగల వారు కావడం, సౌకర్యాల కోసం డిమాండ్ చేయడం. ఇవీ అసౌకర్యాలు ఐటీఐల్లో సరైన బోధకులు లేరు. మంజూరైన బోధకుల పోస్టుల్లో 36 శాతమే ఉన్నారు. ఔట్ సోర్సింగ్ బోధకుల్లో సమర్ధత లేదు. ఐటీఐల్లో శిక్షణకు అవసరమైన లేబోరేటరీలు, సాధనాల కొరత తీవ్రంగా ఉంది. ఐటీఐలకు కనెక్టివిటీ కూడా తక్కువగా ఉంది. దీంతో కొంతమంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు -
Telangana: నిజామాబాద్ ప్రభుత్వ మహిళా ఐటీఐ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని మొత్తం 295 ఐటీఐల్లో నిజామాబాద్ ప్రభుత్వ మహిళా ఐటీఐ 3.18 గ్రేడ్తో అగ్రస్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ ఒక్క ఐటీఐ మినహా రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు అన్నీ 2.5 కంటే తక్కువ గ్రేడ్లు పొందాయి. 196 ప్రైవేట్ ఐటీఐలలో 2 మాత్రమే 2.5 కంటే ఎక్కువ గ్రేడ్లు, 88 ప్రైవేట్ ఐటీఐలు 1 కంటే తక్కువ గ్రేడ్లు పొందాయి. ‘ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్– స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ వర్టికల్’పేరుతో నీతిఆయోగ్ సిద్ధం చేసిన నివేదికలో రాష్ట్రాల్లోని ఐటీఐలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. తెలంగాణలోని ఇతర జిల్లాల కంటే హైదరాబాద్లోనే అత్యధిక ఐటీఐలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఐటీఐలతో పోలిస్తే ప్రైవేట్ ఐటీఐలలో అందించే ట్రేడ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2022 సంవత్సరంలో రాష్ట్రంలోని 295 ఐటీఐల్లో 66 ప్రభుత్వ ఆధ్వర్యంలో, 77% ప్రైవేట్ నిర్వహణలో ఉన్నాయి. మహిళా ఐటీఐలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. 2020 సంవత్సరంలో 3,976 మంది ట్రైనీలు సర్టిఫికెట్లు అందుకున్నారు. కాగా, 2021 సంవత్సరంలో మొత్తం 54,340 సీట్లలో 50% మాత్రమే భర్తీ కావడంతో ఐటీఐలు పూర్తి సామర్థ్యంతో పనిచేయట్లేదు. -
5,000కు పైగా ‘స్కిల్ హబ్స్’
న్యూఢిల్లీ: దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి 5,000కుపైగా ‘స్కిల్ హబ్స్’ ప్రారంభించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడమే యువతకు తారకమంత్రం కావాలని ఉద్బోధించారు. ఆయన శనివారం ఐటీఐ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడారు. ‘‘ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఉద్యోగ అవకాశాలూ పెరుగుతున్నాయి. కనుక యువత తమ నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోవాలి. వారి రంగాల్లో మార్పులను గమనిస్తూండాలి’’ అన్నారు. ‘‘మా హయాంలో గత ఎనిమిదేళ్లలో దేశంలో కొత్తగా దాదాపు 5,000 ఐటీఐలను ప్రారంభించాం. 4 లక్షల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. నూతన విద్యా విధానం కింద అనుభవం ఆధారిత విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నాం. పునరుత్పాదక ఇంధన వనరులు, సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాలు తదితర రంగాల్లో భారత్ ముందంజ వేస్తోంది. సంబంధిత కోర్సులను ఐటీఐల్లో ప్రవేశపెడుతున్నాం’’ అని వివరించారు. రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని మోదీ ఆవిష్కరించారు. ‘‘13–14 శాతమున్న రవాణా లాజిస్టిక్స్ వ్యయాన్ని 7.5 శాతం కంటే దిగువకు తేవడంతో పాటు సమయం, డబ్బు మరింతగా ఆదా అయ్యేలా చూడటమే దీని లక్ష్యం. పీఎం గతిశక్తి పథకంతో కలిసి రవాణా రంగాన్ని ఈ పాలసీ పరుగులు పెట్టిస్తుంది’’ అన్నారు. ‘‘రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం. ఫాస్టాగ్, ఇ–వే బిల్లింగ్ వంటి చర్యలు చేపట్టాం. ‘‘సాగరమాల ప్రాజెక్టుతో నౌకాశ్రయాల సామర్థ్యాన్ని ఎంతగానో పెంపొందించాం’’ అని గుర్తు చేశారు. -
బీఎస్ఎన్ఎల్- ఐటీఐ పైలట్కు ప్రభుత్వ నిధులు
న్యూఢిల్లీ: 4జీ, 5జీ, ఈ-బ్యాండ్ స్పెక్ట్రమ్ సర్వీసులకు కావాల్సిన సాంకేతికతను దేశీయంగా అభివృద్ది చేసేందుకు బీఎస్ఎన్ఎల్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ (ఐటీఐ) తలపెట్టిన పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. టీసీఎస్-తేజస్ నెట్వర్క్ల సహకారంతో తొలిసారిగా మేడ్–ఇన్–ఇండియా 4జీ, 5జీ టెలికం నెట్వర్క్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ ప్రాజెక్ట్లో ప్రభుత్వ టెలికం పరిశోధన సంస్థ సీ-డాట్ కూడా పాల్గొంటోంది. ఒక్కో పైలట్ ప్రాజెక్టుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ రూ.10 కోట్లు అందిస్తోంది. -
ఐటీఐ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్..
ఐటీఐ మ్యుచువల్ ఫండ్ తాజాగా ఐటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ను ఆవిష్కరించింది. ఇది నవంబర్ 29తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రదీప్ గోఖలే, ప్రతిభ్ అగర్వాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ప్రధానంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, రేటింగ్ ఏజెన్సీలు, కొత్త తరం ఫిన్టెక్ సంస్థలు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. నాణ్యమైన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సంస్థ సీఈవో జార్జ్ హెబర్ జోసెఫ్ తెలిపారు. -
డిప్లొమా, ఇంజనీరింగ్, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు
జీఆర్ఎస్ఈలో 256 అప్రెంటిస్లు కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్ఎస్ఈ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 256 » ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్ (ఎక్స్–ఐటీఐ)–170, ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్)–40, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–16, టెక్నీషియన్ అప్రెంటిస్–30. » ట్రేడ్ అప్రెంటిస్(ఎక్స్–ఐటీఐ): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్మెన్, పెయింటర్ తదితరాలు. అర్హత: సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్తోపాటు క్రాఫ్ట్స్మెన్ ట్రెయినింగ్ స్కీమ్ కోసం ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. » ట్రేడ్ అప్రెంటిస్(ఫ్రెషర్): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్. అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14ఏళ్ల నుంచి 20ఏళ్ల మధ్య ఉండాలి. » గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్. అర్హత: 2018, 2019, 2020లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ అభ్యర్థులు అర్హులు కాదు. వయసు: 14ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. » టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, సివిల్. అర్హత: 2018, 2019, 2020లో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021 » వెబ్సైట్: https://apprenticeshipindia.org చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో 492 అప్రెంటిస్లు చిత్తరంజన్(పశ్చిమ బంగ)లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 492 » ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్స్ అండ్ ఏసీ మెకానిక్స్, పెయింటర్. » అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 15.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ఓరల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:03.10.2021 » వెబ్సైట్: https://clw.indianrailways.gov.in ఎస్ఈసీఎల్, బిలాస్పూర్లో 450 అప్రెంటిస్లు బిలాస్పూర్లోని సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 450 » ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మైనింగ్–140, టెక్నీషియన్ అప్రెంటిస్ మైనింగ్/మైన్ సర్వేయింగ్–310. » అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 05.10.2021 నాటికి 18ఏళ్లు నిండి ఉండాలి. » వేతనం: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు నెలకు రూ.9000, టెక్నికల్ అప్రెంటిస్లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు. » ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021 » వెబ్సైట్: www.secl.cil.in ఎస్ఈసీఆర్, బిలాస్పూర్ డివిజన్లో 432 అప్రెంటిస్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్ఈసీఆర్), బిలాస్పూర్ డివిజన్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 432 » ట్రేడులు: కోపా, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వైర్మెన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్ తదితరాలు. » అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 01.07.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దర ఖాస్తులకు చివరి తేది:10.10.2021 » వెబ్సైట్: https://secr.indianrailways.gov.in -
అస్పైర్.. ఆవిష్కరణలకు ఇన్స్పైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన అస్పైర్(ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్) ప్రభుత్వ పారిశ్రామికశిక్షణ సంస్థ(ఐటీఐ)లకు బాసటగా నిలవనుంది. గ్రామీణ యువతను సరికొత్త ఆవిష్కరణల బాటపట్టించడమే ఈ పథకం ఉద్దేశం. దీని కింద ఎంపికైన ఐటీఐలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది ఇక్కడ శిక్షణ పొందుతున్నవారికి సరికొత్త కార్యక్రమాలను పరిచయం చేయనుంది. అస్పై ర్ కింద సిరిసిల్ల, వనపర్తి, ఖమ్మం, నిజామాబాద్, మేడ్చల్, కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐలు ఎంపికయ్యాయి. ఒక్కో ఐటీఐ ఖాతాలోకి రూ.50 లక్షల చొప్పున కేంద్రం జమ చేసింది. ఈ నిధులతో ఐటీఐల్లో లైవ్లీవుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్(ఎల్బీఐ)లను కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ ఐటీఐలు సమీపంలోని పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని స్థానిక నేపథ్యంతో కూడిన సరికొత్త ఆవిష్కరణలు చేయనున్నాయి. త్వరలో మరిన్ని ఐటీఐలు ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశముంది. ►సిరిసిల్ల ఐటీఐ: ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఎల్బీఐ ప్రధానంగా చేనేత పరిశ్రమ ఆధారంగా పనిచేయనుంది. ఈ పరిశ్రమ ఉత్పత్తులు, మార్కెట్ సవాళ్లు, లక్ష్యాలు తదితర అంశాలను అధిగమించి ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది. ►వనపర్తి ఐటీఐ: స్థానిక రైతులకు సులభతర వ్యవసాయం, మార్కెటింగ్ అంశాలపై ఐటీఐ పనిచేయనుంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విత్తనోత్పత్తి, ఎరువులు, విత్తనాల తయారీపై దృష్టి పెట్టనుంది. ►ఖమ్మం ఐటీఐ: వెదురుకు ప్రసిద్ధమైన ఖమ్మం ప్రాంతంలో వెదురు దిగుబడుల ప్రాసెసింగ్తోపాటు వీటిపై ఆధారపడిన చేతివృత్తిదారులకు మెరుగైన వసతులు సమకూర్చేదిశగా ఈ ఐటీఐ పనిచేయనుంది. ►నిజామాబాద్ ఐటీఐ: వ్యవసాయ రంగానికి కేంద్రంగా ఉన్న నిజామాబాద్ ప్రాంత రైతాంగం కోసం శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పుట్టగొడుగుల పెంపకం తదితర వాటిపై ఈ ఐటీఐలోని ఎల్బీఐ పనిచేయనుంది. ►మేడ్చల్ ఐటీఐ: నగరానికి చేరువలోని ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటిపై మరింత అవగాహన కలిగించడం, స్థానిక యువతకు ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచడం, వీటికి అనుబంధంగా శిక్షణ తరగతులు నిర్వహించడం వంటి వాటిని ఈ ఎల్బీఐ పర్యవేక్షిస్తుంది. ►కరీంనగర్ ఐటీఐ: ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నప్పటికీ, కుటీర పరిశ్రమల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుపై ఎల్బీఐ పనిచేస్తుంది. ఫుట్వేర్, ఆర్నమెంట్, అత్తరు పరిశ్రమలను ప్రోత్సహించే కార్యాచరణతో ముందుకు వెళ్లనుంది. పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు అస్పైర్ పథకం అమలుతోపాటు ఎల్బీఐల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర సలహాకమిటీ, పాలకమండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి సలహా కమిటీకి కార్మికమంత్రి చైర్మన్గా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యుడిగా, కమిషనర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మెంబర్ కన్వీనర్గా, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ జనరల్, ఉపాధి, శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా కొనసాగుతారు. పాలక మండలి(గవర్నింగ్ బాడీ) చైర్మన్గా ఉపాధి శిక్షణా విభాగం కమిషనర్, కొనసాగుతారు. ఈ శాఖ జాయింట్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్గా, ఎన్ఎస్ఐసీ చీఫ్ మేనేజర్, ఎంఎస్ఎంఈ ప్రతినిధి, ఉపాధి, శిక్షణ డిప్యూటీ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కమిటీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిణి ఉత్తర్వులు జారీ చేశారు. -
అప్రెంటిస్ ఖాళీలు.. అప్లై చేసుకోండి!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాక్రాపర్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 121 ► ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, టర్నర్ తదితరాలు. ► అర్హత: సంబంధిత ట్రేడ్ను అనుసరించి ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► కాలవ్యవధి: ఒక సంవత్సరం ► వయసు: 14 నుంచి 24 ఏళ్లు మించకూడదు. ► స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8855 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కాక్రాపర్ గుజరాత్ సైట్, అనుమల–394651, టీఏ.వ్యారా, జిల్లా. తపి, గుజరాత్ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021 ► వెబ్సైట్: www.npcilcareers.co.in నరోరా అటామిక్ పవర్ స్టేషన్లో 50 అప్రెంటిస్లు భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్)కి చెందిన ఉత్తరప్రదేశ్లోని నరోరా అటామిక్ పవర్ స్టేషన్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 50 ► ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్–20, ఎలక్ట్రీషియన్–13, ఎలక్ట్రానిక్స్–12, మెషినిస్ట్–05. ► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ► వయసు: 07.07.2021 నాటికి 14–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఒకవేళ ఐటీఐ మార్కులు ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఉంటే.. వారి వయసును ప్రామాణికంగా తీసుకుంటారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్( హెచ్ఆర్ఎం), నరోరా అటామిక్ పవర్ స్టేషన్, ప్లాంట్ సైట్, నరోరా,బులందసహార్–203389(ఉత్తరప్రదేశ్) చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.07.2021 ► దరఖాస్తు హార్ట్కాపీలను పంపడానికి చివరి తేది: 21.07.2021 ► వెబ్సైట్: https://www.npcil.nic.in మరిన్ని నోటిఫికేషన్లు: పవర్గ్రిడ్లో డిప్లొమా ట్రెయినీ ఖాళీలు సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు.. త్వరపడండి పవర్గ్రిడ్, ఎస్బీఐలో ఉద్యోగ అవకాశాలు -
సదరన్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే, పెరంబూరులోని క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్కు చెందిన చీఫ్ వర్క్షాప్ మేనేజర్ కార్యాలయం.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య: 3378 ► పనిచేసే ప్రదేశాలు: క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్, రైల్వే హాస్పిటల్, ఎలక్ట్రికల్ వర్క్షాప్, లోకోవర్క్స్, ఇంజనీరింగ్ వర్క్షాప్, చెన్నై డివిజన్. ► విభాగాలు: ఫ్రెషర్ కేటగిరీ, ఎక్స్ ఐటీఐ, ఎంఎల్టీ. ► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితరాలు. ► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ)ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: 15 ఏళ్లు నిండి ఉండాలి. 22/24 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021 ► వెబ్సైట్: https://sr.indianrailways.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఎన్ఎఫ్సీ, హైదరాబాద్లో ఐటీఐ అప్రెంటిస్లు వెస్టర్న్ రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు బెల్లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు -
చైనీస్ పరికరాలకు చెక్- ఐటీఐ స్పీడ్
టెలికం రంగంలో చైనీస్ పరికరాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించనున్నట్లు వెలువడిన వార్తలు పీఎస్యూ ఐటీఐ లిమిటెడ్ కౌంటర్కు జోష్నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 14.5 శాతం దూసుకెళ్లింది. రూ. 104 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 108 సమీపానికి చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత రెండు రోజుల్లోనే ఈ కౌంటర్ 32 శాతం జంప్చేసింది. ట్రేడింగ్ ప్రారంభమైన 45 నిమిషాల్లోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 9.3 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం! డాట్ దన్ను చైనా కంపెనీల నుంచి 4జీ పరికరాల కొనుగోలును నిలువరించవలసిందిగా ప్రభుత్వ రంగ కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను టెలికం శాఖ(డాట్) ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. చైనా కంపెనీల నుంచి దూరంగా ఉండాల్సిందిగా ప్రయివేట్ రంగ టెలికం దిగ్గజాలను సైతం ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐటీఐ షేరుకి డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీ విభాగంలో పీఎస్యూ అయిన ఐటీఐ లిమిటెడ్ సేవలందిస్తున్న విషయం విదితమే. కంపెనీ డిఫెన్స్ సెక్యూరిటీ ఎన్క్రిప్షన్, ఆప్టికల్, డేటా నెట్వర్క్, పాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర పలు ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. అంతేకాకుండా టెలికం టర్న్కీ ప్రాజెక్టులుసహా టెలికం సొల్యూషన్స్నూ అందిస్తోంది. -
విప్రో చేతికి అమెరికా కంపెనీ!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ టెక్నీ గ్రూప్ ఇన్కార్పొను (ఐటీఐ) కొనుగోలు చేయనున్నది. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ ప్రొడక్ట్ లైఫ్సైకిల్ మేనేజ్మెంట్ ఇంటెరోపెరాబిలిటీ సాఫ్ట్వేర్ సేవలందించే ఐటీఐను రూ.312 కోట్ల(4.5 కోట్ల డాలర్లు)కు కొనుగోలు చేయనున్నామని విప్రో తెలిపింది. 1983లో ఆరంభమైన ఐటీఐ అమెరికాలోని ఓహియో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంగ్లాండ్, ఇటలీ, ఇజ్రాయేల్, జర్మనీల్లో ఈ కంపెనీకి కార్యాలయాలున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఈ కంపెనీలో మొత్తం 130 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ ఆదాయం గత ఏడాది జూన్ 30 నాటికి 2.32 కోట్ల డాలర్లుగా ఉంది. సెప్టెంబర్ కల్లా డీల్ పూర్తి ! ఐటీఐ కొనుగోలుతో డిజిటల్ ఇంజినీరింగ్ మాన్యుఫాక్చరింగ్లో మరింత శక్తివంతమవుతామని విప్రో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఇండస్ట్రియల్ అండ్ ఇంజినీరింగ్ సర్వీసెస్) హర్మీత్ చౌహన్ పేర్కొన్నారు. ఈ డీల్కు నియంత్రణ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ డీల్ పూర్తవ్వగలదని అంచనా వేస్తున్నామన్నారు. -
ఐటీఐలలో ఐదు ట్రేడ్లు ఔట్!
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లలో డిమాండ్ లేని ట్రేడ్లను రద్దు చేయాలని కార్మిక, ఉపాధి కల్ప న శాఖ నిర్ణయించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో అడ్మిషన్లను పరిగణిస్తూ.. గత మూడేళ్లుగా అడ్మిషన్ల తీరును విశ్లేషించింది. ఇప్పటికే ఐదు ట్రేడ్లలో ప్రవేశాల్లేవు. ఆయా రంగాల్లో ఉపాధి కల్పన కూడా ఆశాజనకంగా లేకపోవడంతో వాటిని రద్దు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫౌండ్రీమన్, షీట్ మెటల్ వర్కర్, రేడియో అండ్ టీవీ మెకానిక్, వైర్మెన్, సెక్రెటేరియల్ ప్రాక్టీస్ ట్రేడ్లు రద్దు కానున్నాయి. రాష్ట్రంలో 290 ఐటీఐలు ఉన్నాయి. వీటిలో 65 ప్రభుత్వ ఐటీఐలు కాగా, 235 ప్రైవేటు సంస్థ లు నిర్వహిస్తున్నాయి. వీటి పరిధిలో 50 వేల మంది వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు. ట్రెండ్కు తగ్గ ట్రేడ్లు.. నైపుణ్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో డిమాండ్ అంచనా వేసి నిపుణులను తయారు చేసేలా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. అక్కడున్న పరిస్థితులు, ఉపాధి అవకాశాల ఆధారంగా ఐటీఐలలో కొత్త ట్రేడ్లు ఏర్పాటు చేసుకునే వీలుంది. దీంతో డిమాండ్ లేని వాటిని తొలగించి కొత్త ట్రేడ్ల చేర్పుపై ఉపాధి కల్పన, శిక్షణల విభాగం దృష్టి సారించింది. ప్రస్తుతమున్న ఐటీఐలలో 32 ట్రేడ్లు ఉన్నాయి. వీటిలో 13 ట్రేడ్లకు శిక్షణ కాలం ఏడాది కాగా, 18 ట్రేడ్లు రెండేళ్ల కాల పరిమితి కేటగిరీలో ఉన్నాయి. మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనెన్స్ ట్రేడ్ పూర్తికి మాత్రం మూడేళ్లు పడుతుంది. ప్రస్తుత ట్రేడ్లలో ఐదింటిలో ప్రవేశాల్లేవు. తొలగించిన స్థానంలో కొత్తగా ఐదు ట్రేడ్లు చేర్చే అంశంపై ఉపాధి కల్పన, శిక్షణ శాఖ అధ్యయనం చేస్తోంది. వచ్చే విద్యా ఏడాది నాటికి కొత్త ట్రేడ్ల చేర్పుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఐటీఐలలో కామన్ ట్రేడ్లు అమలు చేసే దానిపైనా అధికారులు పరిశీలిస్తున్నారు.ప్రతి ఐటీఐని పరిశ్రమలతో అనుసంధానం చేసి, ఉపాధి అవకాశాలు పెంచే లా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. -
అన్యాయం..అక్రమం..నిర్లక్ష్యం!
కందుకూరు: విద్యార్థుల భవిష్యత్తో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ అధికారులు ఆటలాడుతున్నారు. కాలేజీల్లో చేరి కోర్సు పూర్తి చేసి మూడున్నరేళ్లు అవుతున్నా నేటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి భవిష్యత్ను అంధకారంలో నెడుతున్నారు. సర్టిఫికెట్ల కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్నా రేపు, మాపు అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. పరిస్థితి ఇలా.. కందుకూరులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో 2014–15 విద్యా సంవత్సరంలో వివి«ధ విభాగాల్లో వందల మంది విద్యార్థులు చేరారు. వీటిలో ఒక సంవత్సరం కోర్సులైన డీజిల్ మెకానిక్, కోఫా కోర్సులతో పాటు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి రెండు సంవత్సరాల కోర్సులకు చెందిన విద్యార్థులు అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక బయటకు వెళ్లారు. అయితే కోర్సు పూర్తి అయినట్లు కేవలం మార్కుల మెమోలు మాత్రమే ఇచ్చారు. దీనికి అనుబంధంగా ఉండే ఎన్టీసీ (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్) ఇవ్వలేదు. ఇది వస్తేనే ఐటీఐ కోర్సు పూర్తి చేసినట్లు లెక్క. ఎన్టీసీ సర్టిఫికెట్స్ ఢిల్లీలోని డైరెక్టర్రేట్ ఆఫ్ సాంకేతిక విద్యాశాఖ అయిన ఢిల్లీ నుంచి ఈ సర్టిఫికెట్లు రావాల్సి ఉంది. దీనిపై విద్యార్థులు కాలేజీ అధికారులను ఎప్పుడు అడిగినా ఢిల్లీ నుంచి రావాలి ఇంకా రాలేదు. మరో రెండు, మూడు నెలల సమయం పడుతుందని సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటున్నారు. అయితే ఒంగోలు ఐటీఐ కాలేజీలో అదే ఏడాది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రం సర్టిఫికెట్స్ రావడం గమనార్హం. కందుకూరు కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం దీనికి భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉందని చెప్తున్నారు. ఇదే విషయంపై ఐటీఐ కాలేజీల జిల్లా కన్వీనర్ మాత్రం భిన్నమైన సమాధానం చెప్తున్నారు. కందుకూరు కాలేజీకి సంబంధించి పెండింగ్ సర్టిఫికెట్లు ఉన్నట్లు జాబితానే రాలేదని చెప్తున్నారు. అప్రంటిస్ ఎలా? సాధారణంగా ఐటీఐ కోర్సులైన డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా నిర్ణీత సమయంలో అప్రంటిస్గా ఎక్కడో ఒకచోట పనిచేయాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాలు కచ్చితంగా అప్రంటిస్ శిక్షణను కూడా పూర్తి చేసుకోవాలి. ఇది పూర్తి అయితేనే ఐటీఐ కోర్సుకు విలువ ఉంటుంది. అప్పుడే ఏ ప్రైవేట్ కంపెనీల్లో అయినా ఉద్యోగాల్లో చేరేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కోర్సు పూర్తి చేసి కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఐదు సంవత్సరాల్లోపు అప్రంటిస్గా పనిచేయాలి. ఉద్యోగాలకు అనర్హులే.. ప్రస్తుతం ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ప్రకటనలు వస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలైన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనలు ఐటీఐ విద్యార్థులకు వరం. కానీ స్థానిక ఐటీఐ కాలేజీ అధికారులు నిర్లక్ష్యం పుణ్యమా అంటూ ఆ విద్యార్థులు ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఎన్టీసీ సర్టిఫికెట్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అలాగే ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల్లో చేరాలన్నా అనర్హులే. దీంతో ఆ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. మూడున్నరేళ్లుగా తిరుగుతూనే ఉన్నాం, 2014–15లో ఐటీఐ కాలేజీలో డీజిల్ మెకానిక్ కోర్సు పూర్తి చేశాను. మూడున్నర సంవత్సరాలుగా సర్టిఫికెట్ల కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్నాం. అడిగినప్పుడల్లా రెండు నెలల్లో వస్తాయని చెప్తున్నారు. ఒంగోలు వెళ్లి ఐటీఐ కన్వీనర్ను కలిస్తే మీ కాలేజీ వాళ్లు వివరాలు పంపలేదు. అందుకే రాలేదని చెప్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రికి, 1100కి కూడా ఫిర్యాదు చేశాం. వాళ్లు కూడా సంబంధిత అధికారులకు చెప్తామన్నారు. కానీ ఏ న్యాయం జరగలేదు.- కె. ఫణిదర్, డీజిల్ మెకానిక్ విద్యార్థి ఏ ఉద్యోగాలకూ తీసుకోవడం లేదు: ఐటీఐ కోర్సు పూర్తి చేశామన్నా ఏ ఉద్యోగానికి ఎవరూ తీసుకోవడం లేదు. కచ్చితంగా సర్టిఫికెట్లు అడుగుతున్నారు. కనీసం ఆర్టీసీలో అప్రంటీస్గా చేద్దామన్నా కూడా తీసుకోలేదు. అలాగే మూడేళ్లుగా అనేక ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు దూరమయ్యాం. ప్రస్తుతం ఆర్ఆర్బీ దరఖాస్తు చేసుకుందామన్నా సర్టిఫికేట్లు లేక అనర్హులం అవుతున్నాం. మా భవిష్యత్ పూర్తిగా నాశనం అయింది. సర్టిఫికెట్స్ కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఎం. పవన్కుమార్ -
ఐటీఐల్లో తనిఖీ బృందాలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో ప్రమాణాల పరిస్థితిని పరిశీలించేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉపక్రమించింది. ప్రైవేటు ఐటీఐల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రమాణాల పరిశీలనకు ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. పరిశీలన అనంతరం తనిఖీ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా వాటి గుర్తింపును కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 291 ఐటీఐలున్నా యి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐటీఐలకు ప్రాధాన్యతనిస్తోంది. ప్రతి ఐటీఐలోనూ పూర్తిస్థాయి ప్రమాణాలుండేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తనిఖీలకు ఉపక్రమించింది. త్రిసభ్య కమిటీలు ఏర్పాటు ఐటీఐల తనిఖీలకు ఆ శాఖ జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు, జిల్లా ఉపా ధి కల్పనాధికారితో పాటు ప్రభుత్వ ఐటీఐ నుంచి సీనియర్ ఫ్యాకల్టీతో ఏర్పా టు చేసిన త్రిసభ్య కమిటీ జిల్లా పరిధిలో ఉన్న ప్రైవేటు ఐటీఐల్లో మౌళిక వసతులు, మిషనరీ, బోధనా సిబ్బంది తదితర అంశాలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తారు. ప్రత్యేక ఫార్మాట్తో కూడిన ప్రొఫార్మా ఆ శాఖ తయారు చేసి బృందాలకు అందించింది. తనిఖీ అనంతరం వీరు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కమిటీ నివేదికలు... పారిశ్రామిక శిక్షణ సంస్థల అనుమతిలో కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని డీజీఈటీ(డైరెక్టర్ జనరల్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్)కి కీలక పాత్ర ఉంటుంది. అనుమతులు, రెన్యువల్ తదితరాలన్నీ వీటి పరిధిలోనే ఉంటాయి. ఐటీఐల తనిఖీలు చేపట్టే త్రిసభ్య కమిటీలు సమర్పించే నివేదికలను కేంద్ర కార్మిక శాఖకు సమర్పించనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ చెబుతోంది. దీంతో కమిటీ తనిఖీలపై ప్రైవేటు ఐటీఐలు ఆందోళన చెందుతున్నాయి. -
శిక్షణకు రుణ సదుపాయం
బద్వేలు: దేశంలోని వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు రాణించేందుకు భారత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీఎస్) పథకం ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులకు బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి. దీనికోసం ముందుగా సంబంధిత వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అర్హులు వీరే... పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు (ఐటీఐ), పాలిటెక్నిక్ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి గుర్తింపు పొందిన శిక్షణ సంస్థలు, కేంద్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్తో భాగస్వామ్యం కలిగిన శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఈ తరహా రుణం పొందేందుకు అర్హులు. రిజిస్ట్రేషన్ ఇలా ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్ఎస్డీసీఐఎన్డీఐఏ.ఓఆర్జీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. వెబ్సైట్లో లాగిన్ అయిన తరువాత కనిపించే ముఖచిత్రంలో అవర్వర్క్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో పైభాగంలో లాగిన్ కాలమ్ ఓపెన్ చేసి సబ్మిట్ ప్రపొజల్, ఎన్ఎస్డీసీ ట్రైనింగ్ ప్యాట్రన్ తదితర కాలమ్స్తో పాటు సిటిజన్ పోర్టల్ లాగిన్ వద్ద క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన విండో వద్ద న్యూయూజర్ వద్ద క్లిక్ చేస్తే సైన్అప్ విండో ఓపెన్ అవుతుంది. ఈ పథకానికి సంబధించి ఏపీలో 37 ప్రాంతాలలో వివిధ రంగాలకు సంబంధించిన శిక్షణ సంస్థలు ఉన్నాయి. వాటి వివరాలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు వంటి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. రుణాలు, మంజూరు, చెల్లింపులు ఇలా... ♦ అభ్యర్థులకు ట్యూషన్/కోర్సు ఫీజు, పరీక్ష రుసుం, గ్రంథాలయ ఫీజు, ప్రయోగశాల ఫీజు, కాషన్ డిపాజిట్, పుస్తకాలు, పరిస్థితులను బట్టి వసతి కోసం అయ్యే ఖర్చులు, కోర్సుకు అవసరమయ్యే ఇతర వస్తువుల ఖర్చులకు రుణాలను ఇస్తారు. ♦ రూ.ఐదు వేల నుంచి రూ.1.50లక్షల వరకు ఈ పథకం కింద రుణం ఇస్తారు. ♦ ఈ రుణాలపై ఎటువంటి మార్జిన్ మనీ కట్టాల్సిన పని లేదు. ♦ రుణాలకు వసూలు చేసే వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంది. ప్రస్తుతం ఈ తరహా రుణాలకు బ్యాంకు వడ్డీ రేటు 11 నుంచి 12 శాతం ఉంది. నైపుణ్యాభివృద్ధి రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ♦ రుణాలను తిరిగి చెల్లించేందుకు తగినంత గడువు ఇస్తారు. ఏడాదిలోపు కోర్సులకు కోర్సు పూర్తి చేసిన ఆరు నెలల వరకు, సంవత్సరం పైబడిన కోర్సులకు కోర్సు పూర్తి చేసిన తరువాత 12 నెలల మారటోరియం పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో సాధారణ వడ్డీని వసూలు చేస్తారు. ♦ రుణాలను తిరిగి చెల్లించేందుకు తీసుకున్న నగదు పరిమాణాన్ని బట్టి గడువు ఇస్తారు. ♦ రూ.50 వేలకు మూడేళ్లు, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఐదేళ్లు, రూ.లక్ష పైబడిన రుణానికి ఏడేళ్లు గడువు ఉంటుంది. ♦ రుణగ్రహీత ఎటువంటి ముందస్తు రుసుంలు లేకుండా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. ప్ర మాదం/మరణం/వైకల్యం కారణంగా అభ్యర్థులు కోర్సు పూర్తి చేయలేకపోతే శిక్షణ సంస్థ నుంచి మిగిలిని శిక్షణ కాలానికి సంబంధించిన సొమ్మును ప్రొనేటా రీఎంబర్స్మెంట్ పద్ధతిలో వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. బ్యాంకులు అర్హత కలిగిన అభ్యర్థులకు పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. దీని ద్వారా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని ఉపాధిని పొందవచ్చు. -
ఆన్లైనా.. ఆఫ్లైనా!
బాలాజీచెరువు(కాకినాడ సిటీ) : ఐటీఐ విద్యలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ పరీక్షల విధానం తీసుకొస్తుంది. ఇప్పటికే సెమిస్టర్ విధానంలో సంవత్సరానికి రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఒక సంవత్సరం ట్రేడ్వారికి ఏడాది చివర్లో, రెండేళ్ల ట్రేడ్వారికి రెండో ఏడాది చివర్లో పరీక్షలు నిర్వహించేది. ఈ విధానం వల్ల ఉత్తీర్ణతశాతం తగ్గిపోవడం, సాంకేతిక నైపుణ్యం విద్యార్థుల్లో పెరగకపోవడంతో ఈ విధానానికి ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికి, సంవత్సరం ట్రేడ్వారికి ఆరు నెలలు చొప్పున రెండు సార్లు, రెండేళ్ల ట్రేడ్వారికి ఆరు నెలల చొప్పున నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ విధానం 2013 జూలై నెలలో ఐటీఐలో చేరే విద్యార్థులకు వర్తింపజేసేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టినా పరీక్షలు మాత్రం మాన్యువల్ పద్ధతిలో నిర్వహించింది. ఇప్పుడు తాజాగా అదే సెమిస్టర్ పరీక్షలకు ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ ఆలోచన బాగున్నా... ఆ మార్పునకు తగ్గట్టుగా ఐటీఐ కళాశాలలో ఆధునిక పరికరాలు సమకూర్చకపోవడం, అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకపోవడం తదితర కారణాలతో విద్యార్థులకు పరీక్షలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడానికి ఏ మాత్రం అవకాశం కనపించడంలేదు. ప్రస్తుతం ఐటీఐలో రెండు సంవత్సరాల కోర్సులు 12, ఏడాది కోర్సులు ఆరు ఉన్నాయి. అలాగే అధ్యాపకుల కొరత కూడా సమస్యగా ఏర్పడింది. కళాశాలలో ఉన్న అధ్యాపకుల్లో సగానికిపైగా కాంట్రాక్టు పద్ధతిలో, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తుండగా 15 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు విద్యాపరంగా కూడా సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వాడ్రేవు శ్రీనివాసరావును వివరణ కోరగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఐటీఐలో ఆన్లైన్ విధానానికి చర్యలు చేపడుతుందన్నారు. అయితే ఎటువంటి ఆదేశాలు తమకు రాలేదని, కళాశాలల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు లేకపోయినా ప్రైవేట్ సంస్థల్లో పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతుండడంతో ఈ సారి ఆఫ్లైన్లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. -
ఐటీఐ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు
-
ఐటీఐ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు
విజయవాడ : ప్రభుత్వ ఐటీఐలో జిల్లా స్థాయి ట్రైనింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న కోనేరు శ్రీనివాస్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజయవాడ డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో సోదాలు జరుపుతున్నారు. విజయవాడతో పాటు పెనమలూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో ఏక కాలంలో ఆరు చోట్ల సోదాలు జరుపుతున్నారు. విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీ, విజయనగర్ కాలనీల్లోని శ్రీనివాస్ కుమార్ నివాసాల్లో జరిపిన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. మూడు కార్లు, వాణిజ్య ట్రక్కులను గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. -
ఐటీఐలకు బోర్డు ఏర్పాటు చేస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)కు జాతీయ స్థాయిలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనలకు మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ మీడియాకు వెల్లడించారు. ఐటీఐల్లో ప్రాక్టికల్కు 70 శాతం, ఎంచుకున్న సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు ఉండేలా జాతీయస్థాయిలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి చర్య లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు తరహాలో సర్టిఫికెట్లు జారీచేయడం వీలవుతుందన్నారు. -
ఏంకష్టం వచ్చిందో..!
ప్రేమజంట ఆత్మహత్య కలకాలం కలిసి ఉండాలనుకున్న ప్రేమజంటకు ఏంకష్టం వచ్చిందో తెలియదుగాని ఈ లోకం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. బలవన్మణానికి తెగించి విషాదాన్ని మిగిల్చారు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఓ లాడ్జిలో శనివారం వెలుగుచూసింది. చనిపోయినవారు ఒడిశా వాసులుగా పోలీసులు గుర్తించారు. రామచంద్ర బారికో(25) సుకంతి పారిక(17) తనువు చాలించినట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా : కలసి బతకలేమని భావించారో.. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని అనుకున్నారో.. ఇంకేమి కష్టం వచ్చిందో గానీ.. ఆ బాధను ఎవరికీ పంచుకోలేక, ఇంకెవరికీ భారం కాలేక ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఎలానూ బతకలేమని నిర్ణయించుకుని.. మరణంలోనైనా కలసే ఉందామని భావించి ఒకరికొకరు హత్తుకుని తనువు చాలించారు. తల్లిదండ్రులకు, అయిన వారికి తీరని శోకాన్ని మిగిల్చి.. తిరిగిరాని లోకాలకు వెడలిపోయారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ బాలిక, ఐటీఐ చదివి కాంట్రాక్టు పనులు చేసుకుంటున్న యువకుడు కాశీబుగ్గలోని లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పర్లాఖిమిడి సంతతోటకు చెందిన లక్ష్మీబారికో, హరి బారికో కుమారుడు రామచంద్ర బారికో(25) సెంచూరియన్ యూనివర్సిటీలో ఐటీఐ పూర్తి చేశాడు. మహేంద్రగడ పంచాయతీలో కాంట్రాక్టు పనుల్లో చేరాడు. సమీపంలో ఉన్నటువంటి డెరబాకు చెందిన దుకా పైకా, రుషియా పైకాలకు ఆరుగురు కుమార్తెలు. ఇందులో నాలుగో కుమార్తె సుకంతి పైకా(17) 8వ తరగతి చదివి మానేసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉంటోంది. చెల్లాగూడలో ఉన్నటువంటి తన అక్క ఇంటికి వెళ్లి వస్తుండేది. ఈ తరుణంలో రామచంద్ర బారికోతో పరిచయం పెరిగి, స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త.. ప్రేమగా మారి ఇద్దరు తరచూ రహస్యంగా కలుసుకునేవారు. రామచంద్ర తల్లి లక్ష్మీబారికో పర్లాఖిమిడిలో నివాసం ఉంటోంది. తండ్రి గతంలోనే మరణించాడు. అతని అన్న తారక బారికో టెక్కలి రైల్వేస్టేషన్లో పనిచేస్తున్నాడు. కాంట్రాక్టు పనుల్లో ఇబ్బందిగా ఉందని, పూణె వెళ్లి పనులు చూసుకుంటానని తన అన్నకు రూ.20 వేలు అడిగి రామచంద్ర గురువారం ఇంటి నుంచి వచ్చేశాడు. అటు సుకంతి పైకా కూడా గురువారం నుంచి ఇంటి వద్ద కనిపించలేదు. ఆమె కుటుంబ సభ్యులు గ్రామమంతా వెతికారు. తన అక్క వాళ్ల ఇంటికి వెళ్లింటుందని భావించారు. పలాస లాడ్జిలో దిగి.. ఇదిలా ఉండగా.. ఇంటి నుంచి వచ్చేసిన రామచంద్ర, సుకంతి పైకాలు గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై కాశీబుగ్గ పట్టణంలోని పాత జాతీయ రహదారి పక్కనే ఉన్న శంకర్ లాడ్జిలో దిగారు. పూణె వెళ్తున్నట్లు చెప్పి, గదిని అద్దెకు తీసుకున్నారు. రోజంతా అక్కడే ఉన్నారు. శుక్రవారం రాత్రి భోజనం పార్సిల్ను లాడ్జి గదిలోకి తీసుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున 6 గంటలైనా బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానం వచ్చి వారి గది వద్దకు వెళ్లి చాలాసేపు పిలిచారు. ఎంతకూ సమాధానం రాకపోవడంతో బలవంతంగా తలుపులు తొలగించి లోపలికి వెళ్లి చూశారు. ఇద్దరూ స్లాబ్ కొక్కేనికి చీరతో ఉరివేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ కె.అశోక్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంచనామా అనంతరం రాత్రి 7 గంటల సమయంలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే, ఇద్దరూ మరణించడానికి కారణాలను మాత్రం ఇరువైపుల కుటుంబ సభ్యులూ చెప్పలేకపోతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఐటీఐలో ‘కౌలు’ పంచాయితీ!
⇒ నల్లగొండలోని ప్రభుత్వ బాలుర, ⇒ న్యూ ఐటీఐల మధ్య చిచ్చురేపిన పచ్చిగడ్డి ⇒ ప్రాంగణంలోని పచ్చికబయళ్లు, చెట్లను బేరం పెట్టిన ఘనులు ⇒ మేకలు, గేదెలు కాసుకునేవారికి ఏడాది పాటు కౌలుకు ⇒ కౌలు డబ్బుల పంపకాల్లో తేడాలు రావడంతో రచ్చకెక్కిన వివాదం ⇒ న్యూ ఐటీఐకి నీటి సరఫరా నిలిపివేసిన బాలుర ఐటీఐ ⇒ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన నల్లగొండ: ఐటీఐలో ‘కౌలు’ పంచాయితీ.. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజం. నమ్మశక్యం కానీ, బయటికి కనిపించని ఆసక్తికరమైన సంఘటనలు నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐల్లో వెలుగుచూస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని ఐటీఐలకు పెద్దన్న పాత్ర (కన్వీనర్) పోషించేది ‘న్యూ ఐటీఐ’. కాగా సూర్యాపేట జిల్లాలోని ఐటీఐలకు పెద్దతలకాయగా (కన్వీనర్) వ్యవహరించేది బాలుర ఐటీఐ. ఈ బాలుర ఐటీఐకీ ‘బిగ్బాస్’ కూడా ‘న్యూ ఐటీఐ’నే. ఈ రెండింటి మధ్య ‘పచ్చిగడ్డి’ వేస్తే భగ్గుమనే సంఘటన ఒకటి ఇటీవల చోటుచేసుకుంది. పెద్ద తరహాగా భావించే న్యూ ఐటీఐ కన్వీనర్కు కనీసం మాటమాత్రం కూడా చెప్పకుండా బాలుర ఐటీఐలో పనిచేస్తున్న దిగువ శ్రేణి ఉద్యోగుల్లో కొందరు ‘కౌలు కుంపటి’ రాజేశారు. చెట్టును, పుట్టను వదల్లేదు.. సుమారు 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు ఐటీఐల పరిసర ప్రాంతాల్లో పొడవైన చెట్లు, పచ్చికబయళ్లు ఏపుగా పెరిగాయి. విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ రకాల పనుల కోసం వచ్చివెళ్లే వారితో ఐటీఐ ప్రాంగణమంతా ఎప్పుడూ సందడిగానే కనిపిస్తుంది. మరి అంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల కన్ను పొడవైన చెట్లు, పచ్చికబయళ్లపైన పడింది. ఇంకేముంది..! అనుకున్నదే తడవుగా అదే ఐటీఐకి చెందిన కొం దరు అధికారుల సహకారంతో మొత్తం 24 ఎకరాల్లో విస్తరించి ఉన్న పచ్చికబయళ్లు, చెట్లను కౌలుకివ్వాలని తీర్మానించుకున్నారు. అయితే ఈ కౌలుకు ఇవ్వాలనే ఒప్పందం గత పదేళ్ల నుంచి నిరంతరంగా కొనసాగుతూ వస్తోంది. బీటీఎస్, మేకల అభినవ్ స్టేడియం ప్రాంతాల్లో గేదెలు, గొర్రెల కాపలాదారులతో మాట్లాడుకుని కౌలు ఒప్పందం చేసుకున్నారు. ఏడాదికి రూ. ఆరు నుంచి రూ. పదివేల వరకు కౌలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. నేల కొరిగిన చెట్లు, వంట చెరుకును సైతం వదిలిపెట్టకుండా బేరం పెట్టారు. గత కొన్నేళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం ముదిరిపోవడంతో రచ్చకెక్కింది. వివాదం వెలుగులోకి.. కొద్ది రోజుల క్రితం గొర్రెలు, గేదెలను తోలుకుని కాపలాదారులు న్యూ ఐటీఐ వైపునకు వెళ్లా రు. దాంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. పశువులు, గొర్రెలకు గడ్డి మేపుకునేందుకు ఏడాదికి రూ.ఆరు వేల చొప్పున బాలుర ఐటీఐకి చెల్లిస్తున్నా మని కాపలాదారులు చెప్పినప్పటికీ అధికారులు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని కాపలా దారులు వెళ్లి బాలుర ఐటీఐలో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన రెండు ఐటీఐల మధ్య వివా దానికి దారితీసింది. న్యూ ఐటీఐ అవసరాలకు వెళ్లే నీరు బాలుర ఐటీఐ నుంచే సరఫరా అ వుతోంది. దీంతో కాపలాదారులను అడ్డుకున్నారన్న అక్కసుతో బాలుర ఐటీఐ నుంచి న్యూ ఐటీఐకి నీటి సరఫరా నిలిపేశారు. ఈ వివాదం ఎటు దారితీస్తుందోనన్న భయంతో బాలుర ఐటీఐలోని కొందరు ఉద్యోగులు చొరవ చూపించి న్యూ ఐటీఐ అధికారులతో రాజీకుదు ర్చకున్నారు. ఎట్టకేలకు వివాదం సద్దుమణగడంతో నీటి సరఫరా కొనసాగించారు. అంతే గాక బాలుర ఐటీఐ అధికారులే మళ్లీ కాపలాదారులను రప్పించి కౌలు ఒప్పందాన్ని యథా విధిగా కొనసాగించడం గమనార్హం. ఇప్పుడు ఎవరూ రావడం లేదు మేకలు, గేదెలు మేపేందుకు వస్తే వద్దని చెప్పాం. దాంతో వారు రావడం మానే శారు. కొద్ది రోజుల నుంచి మా వైపు రావడం మానేశారు. ఇక్కడ హరితహారం కింద నాటిన మొక్కలు పెంచుతున్నాం. పశువులు వస్తే వాటిని ఆగం చేస్తాయని వద్దని చెప్పాం. – గోపాల్ నాయక్, కన్వీనర్ రూ. ఆరు వేలు చెల్లిస్తున్నా మేకలు, గేదెలు మేపుకునేందుకు బాలుర ఐటీఐకి ఏడాదికి రూ.ఆరు వేలు చెల్లిస్తున్నా. రెం డేళ్ల నుంచి ఇక్కడే మేపుతున్నా. నా కంటే ముందు కమ్మరోళ్లు వచ్చిండ్రు. ఈ మధ్య రెండు ఐటీఐల మధ్య గొడవ జరిగింది. డబ్బులు బాలుర ఐటీఐకి ఇచ్చిన సంగతి కిందోళ్లకు తెలి యదంట. మేకలను తోలుకుని పోతే కిందోళ్లు.. ఇక్కడ మేపొద్దని అడ్డుకున్నారు. దాంతో నేను బాలుర ఐటీఐకి వచ్చి చెప్పిన. నేను చెప్పిన అని కిందోళ్లకు నీళ్లు ఆపేశారంట. – సత్తయ్య, బీటీఎస్ -
జూలై 5లోపు ఐటీఐ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2017–18 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్ బి.తులసి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన అభ్యర్థులు వివిధ ట్రేడ్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూలై 5 వరకు అన్ని ప్రభుత్వ ఐటీఐలో దరఖాస్తులు పొందొచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 5 సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలని తెలియజేశారు. -
ఐటీఐలకు స్టార్ రేటింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లకు గ్రేడింగ్లు కేటాయించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 13,000 ఐటీఐల్లో ఇప్పటికే 3,500 ఐటీఐలకు గ్రేడింగ్ ఇవ్వడం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఐటీఐల్లో అత్యుత్తమంగా రాణించిన సంస్థలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యుత్తమ ఐటీఐలవైపు విద్యార్థులను, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించారు. ఐటీఐల్లో మౌలిక వసతులు, పరిశ్రమలతో అనుసంధానం, యంత్ర పరికరాల లభ్యత, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది తదితర 43 అంశాలపై గ్రేడింగ్లు కేటాయించనున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) రెండు దశల్లో అన్ని ఐటీఐలను సమీక్షించి గ్రేడింగ్ ఇవ్వనుంది. గ్రేడింగ్తో పాటు 3 స్టార్ల కంటే అధికంగా రేటింగ్ సాధించే ఐటీఐలకు వివిధ పథకాల కింద ప్రపంచ బ్యాంకు నిధుల్ని అందించనున్నారు. సదరు విద్యాసంస్థల ప్రిన్సిపల్స్కు దేశ, విదేశాల్లోని అత్యున్నత సంస్థల్లో శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. -
ఐటీఐలకు ‘నాణ్యత’ పరీక్ష..!
ఐటీఐల్లో నాణ్యతా ప్రమాణాలు, సదుపాయాలపై కేంద్రం దృష్టి ఐఐటీ, ఎన్ఐటీల ఆధ్వర్యంలో తనిఖీలకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లకు ‘నాణ్యత’ పరీక్ష ఎదురు కానుం ది. ఐటీఐల్లో పలుకోర్సు (ట్రేడ్)ల్లో నాణ్యత ప్రమాణాలు, సదుపాయాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇంజనీరింగ్కు దిగువ స్థానంలో ఉండే ఐటీఐ కోర్సుల్లో శిక్షణను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఐటీఐల్లో నాణ్యతా ప్రమాణాలపై పక్కా సమాచారం సేకరించేం దుకు త్వరలోనే నాణ్యత ప్రమాణాల తనిఖీ లు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ తనిఖీ లను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ(ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)ల ఆధ్వర్యంలో చేపట్టేం దుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయం తీసు కున్నట్లు తెలిసింది. ఆ శాఖ నేతృత్వంలోని నేషనల్ కౌన్సిల్ ఆన్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) సంస్థ ఐటీఐల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి గుర్తింపు ఇస్తోంది. అయితే ఇకపై ఐఐటీలు, ఎన్ఐటీలు తనిఖీలు చేయనున్నాయి. వాటి నివేదికల ఆధారంగా నాణ్యతా ప్రమాణాలు లేని ఐటీఐల గుర్తిం పును రద్దు చేసే ఆలోచనలను నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ చేస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో ఐఐటీ, ఎన్ఐటీల తనిఖీ నివేది కల ఆధారంగానే ఐటీఐలకు గుర్తింపును ఇచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఐటీఐల శిక్షణలో నాణ్యతా ప్రమాణాలు కొరవడినట్లు ఇప్పటికే ప్రాథమికంగా అంచనాకు వచ్చిన కేంద్రం పూర్తి స్థాయి సమాచారం సేకరణకు సిద్ధమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 వేల ఐటీఐలు ఉన్నాయి. ఇందులో 9 వేల ఐటీఐలు ప్రైవేటు రంగంలో.. 4 వేల ఐటీ ఐలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. వీటిన్నిం టిలో త్వరలో తనిఖీలను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఐటీఐల్లో అన్నీ లోపాలే.. తెలంగాణ రాష్ట్రంలో 65 ప్రభుత్వ.. 235 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు వివిధ ట్రేడ్ (కోర్సులు)ల్లో శిక్షణ పొందుతున్నా రు. రాష్ట్రం లోని ప్రభుత్వ ఐటీఐల్లో పలు లోపా లుండగా.. ప్రైవేటు ఐటీఐల్లో పరిస్థి తి దారుణంగా ఉన్నట్లు అధికారులు చెబు తున్నారు. వసతుల కొరతే కాక మిషనరీ కొరత ప్రైవేటు ఐటీఐల్లో ఉన్నట్లు అధికారు లు అంచనా వేశారు. అధ్యాపకులూ సరి పడా లేకపోవడంతో సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగానే ప్రైవేటు ఐటీఐలు మారా యన్న ఆరోపణలున్నాయి. 65 ప్రభుత్వ ఐటీఐల్లో 20 సంస్థలకు సొంత భవనాలు లేవు. 22 ఐటీఐలకు ప్రిన్సిపాళ్లు లేకపోవ డంతో ఇన్చార్జిల పాలనలో కొన సాగు తున్నాయి. ప్రభుత్వ ఐటీఐల్లో 1,964 పోస్టులకు 1,020 మందే పనిచేస్తున్నారు. మిగితావన్నీ ఖాళీనే. ఈ పరిస్థితుల్లో ఐఐటీ, ఎన్ఐటీల తనిఖీలే కాదు.. వసతులు, నాణ్యతా ప్రమాణాలను బట్టి గ్రేడింగ్లు ఇచ్చేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ సంస్థ నిర్ణయించడంతో ఐటీఐల నిర్వా హకుల్లో ఆందోళన మొదలైంది. -
ఐటీఐ విద్యార్థులకు జాబ్ పక్కా
ప్రతి ఐటీఐని బడా కంపెనీతో అనుసంధానిస్తున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: మానవ వనరుల విని యోగంలో ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లు కీలకంగా మారనున్నాయి. కేంద్రం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని అమ లుచేస్తున్న నేపథ్యంలో... కేంద్రం దృష్టిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణ చేపడుతోంది. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి వారిని ఉపాధిబాటలో పెట్టేందుకు ఉపాధి కల్పన శాఖ ఐటీఐలను లక్ష్యం గా చేసుకుంటోంది. ఐటీఐల్లోని వివిధ కోర్సు ల్లో శిక్షణ ముగిసిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా తయారు చేస్తోంది. రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐటీఐలున్నాయి. వీటిలో 55 ఐటీఐలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) గుర్తింపు ఉంది. ఎన్సీవీటీ గుర్తింపు ఉన్న ఐటీఐలను భారీ పరిశ్రమలతో అనుసంధానించాలని ఉపాధి కల్పన, శిక్షణ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు 10ఐటీఐలు, బహుళ జాతీయ, దేశీయ సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నా యి. అయితే, బహుళజాతి కంపెనీలు గ్రామీణ ప్రాంత ఐటీఐలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతు న్నాయని ఆ శాఖ సంయుక్త సంచాలకుడు నగేశ్ ‘సాక్షి’తో అన్నారు. ⇔ సనత్నగర్ ఐటీఐతో హుందాయ్, టయో టా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో ని విద్యార్థులకు కార్లు, ఇతర పెద్ద వాహ నాలకు డెంటింగ్, పెయింటింగ్ల్లో శిక్షణ ఇస్తున్నాయి. ⇔ సికింద్రాబాద్ ఐటీఐతో ఫోర్డ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుని సీఆర్డీఐ ఇంజన్, డీజిల్ వాహనాల స్పేర్స్ అమర్చ డంలో శిక్షణనిస్తోంది. ⇔ మల్లేపల్లి ఐటీఐతో మారుతీ సుజుకీ ఒప్పందం కుదుర్చుకుంది. ⇔ ఆల్వాల్ ఐటీఐని మిథాని దత్తత తీసుకుం ది. ⇔ ఓల్డ్సిటీలోని ఐటీఐని బీడీఎల్ దత్తత తీసుకుంది. ఇందులో మౌలిక వసతులు, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు రూ.2.88కోట్లు అందించింది. ⇔ జవహర్నగర్ ఐటీఐతో బెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ⇔ కొత్తగూ డెం ఐటీఐని సింగరేణి కాలరీస్, కరీంనగర్ ఐటీఐని ఎన్టీపీసీ, సంగారెడ్డి ఐటీఐని మహేంద్ర అండ్ మహేంద్ర సంస్థలు దత్తత తీసుకుని శిక్షణనిస్తున్నాయి. -
ఐటీఐలకు సాంకేతిక సొబగులు!
⇒ ఇకపై ప్రవేశాలన్నీ ఆన్లైన్లోనే.. ⇒ బయోమెట్రిక్ పద్ధతిలో టీచర్లు, విద్యార్థుల హాజరు ⇒ 10 ఐటీఐలకు ఎన్సీవీటీ గుర్తింపు కోసం దరఖాస్తు సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభి వృద్ధి కార్యక్రమానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేప థ్యంలో రాష్ట్రం లోని ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు లో భాగంగా ఐటీఐలలో బయో మెట్రిక్ పరికరాలు అమర్చనుంది. ఇప్పటికే కొన్ని ఐటీఐ ఈ పరికరాలు వినియోగిస్తున్నప్పటికీ.. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని ఐటీఐల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తీసుకోవడంతో పాటు నిర్వహణకు సంబం ధించి పలు అంశాలకు వీటిని వినియోగించుకోనుంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు.. రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐలలో అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటివరకు నేరుగా జరిగేది. దీంతో విద్యార్థులు సకాలంలో ప్రధాన కేంద్రాలకు హాజరు కావడంలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పన శాఖ ప్రత్యేకంగా వెబ్సైట్ను అభివృద్ధి చేస్తోంది. పదోతరగతి పూర్తిచేసుకుని ఐటీఐ చదవాల నుకునే విద్యార్థి నేరుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైతే సీటు కేటాయిస్తారు. కాగా, రాష్ట్రంలోని 65 ఐటీఐలకు గాను 55 ఇన్స్టిట్యూట్లకే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) గుర్తింపు ఉంది. మిగిలిన 10 ఐటీఐలకు ఎన్సీవీటీ అనుమతి కోసంఉపాధి కల్పన శాఖ దరఖాస్తు చేసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వాటికి అనుమతులు వస్తాయని ఆ శాఖ కమిషనర్ కె.వై.నాయక్ పేర్కొన్నారు. -
రాసుకున్నోళ్లకు రాసుకున్నంత
- ఐటీఐ పరీక్షల్లో మాస్కాపీయింగ్ - హాల్టిక్కెట్లు లేకుండానే పరీక్ష రాస్తున్న విద్యార్థులు హిందూపురం అర్బన్ : ఐటీఐ మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్కాపీయింగ్ జోరుగా జరుగుతోంది. ఎస్వీ, ఏంజెల్ ఐటీఐ కళాశాలల్లో చదువుతున్న సుమారు 150 మంది విద్యార్థులకు 2 నుంచి 16వ తేదీ వరకు మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. కిరికెర వద్ద ఉన్న ఎంజెల్ ఐటీఐ కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు అంతా కుమ్మక్కై చూచిరాతలు రాయిస్తున్నట్లు కనిపిస్తోంది. బయటి వ్యక్తులు వచ్చి పరీక్ష హాలులో కూర్చుంటున్నారు. అలాగే కొందరు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు కూడా లేవు. విద్యార్థులు గుంపుగా కూర్చుని పుస్తకాలు పెట్టుకుని పరీక్షలు రాస్తున్నారు. కాగా పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఇన్విజిలేటర్లు, పర్యవేక్షకుల వద్ద ఐడీ కార్డులు కూడా లేకపోవడం గమనార్హం. -
ఐటీఐ పూర్తి చేసినవారికి పాలిటెక్నిక్లో ప్రవేశం
అనంతపురం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో రెండేâýæ్ల కోర్సు పూర్తి చేసి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నేరుగా పాలిటెక్నిక్ రెండవ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఐటీఐల్లో 2017, జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి వరకూ బ్రిడ్జి కోర్సులో శిక్షణ ఇస్తారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఏ ఐటీఐలో చేరదలిచారో ఆయా ఐటీఐల్లో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో సంప్రదించాలని సూచించారు. -
జిల్లా ఏర్పాటులో అధికారులు సహకరించాలి
మహబూబాబాద్ : జిల్లా ఏర్పాటులో అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ప ట్టణ శివారులోని ఐటీఐ భవనా న్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించగా చుట్టూ ప్రహరీ, రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శుక్రవా రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.40లక్షల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా ఏర్పాటుతో మానుకోట మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా కార్యాలయాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. మా నుకోట నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధా లా కృషి చేస్తున్నట్లు చెప్పారు. డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్, టౌన్ సీఐ నందిరామ్నాయక్, ఎస్సైలు తిరుపతి, కమలాకర్, ట్రా ఫిక్ ఎస్సై అంబటి రవీందర్, టీఆర్ఎస్ నా యకులు ఫరీద్, భూక్య ప్రవీణ్ పాల్గొన్నారు. -
ఐటీఐల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి చర్యలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేట్ ఐటీఐ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ప్రిన్సిపాల్ నాయకల్లు సోలోమన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. అభ్యర్థులు ఏ కళాశాలలో చేరాలనుకున్నారో అక్కడే పది రూపాయలు చెల్లించి దరఖాస్తు పొందవచ్చని.. ఈ నెల 20వ తేదీలోపు పూరించిన దరఖాస్తులను అందజేయాలన్నారు. 21న ఉదయం 10 గంటలకు ఆయా కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. -
ఐటీఐలో పెద్దపల్లి కలెక్టరేట్
ఎస్సారెస్పీ క్యాంపులో ఎస్పీ ఆఫీస్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యాలయాల గుర్తింపు పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యాలయాలను అధికారులు దాదాపు ఖరారు చేశారు. పట్టణంలోని ఐటీఐ బస్టాండ్, రైల్వేస్టేషన్కు కూతవేటు దూరంలో ఉండడంతో ఐటీఐని కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదించారు. కాగా, స్థానిక డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐ మహేష్ పెద్దకల్వల ఎస్సారెస్పీ క్యాంపు భవనాలను గురువారం పరిశీలించి ఎస్పీ కార్యాలయాన్ని క్యాంపులో నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. ఇక్కడి ఐటీఐ 21 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఎస్సారెస్పీ క్యాంపు 20.16 ఎకరాల విస్తీర్ణ ఉంది. ఆయా కార్యాలయాలు 10 ఎకరాల లోపే నిర్వహణలో ఉన్నాయి. దాదాపు ఇక్కడి ఐటీఐ, ఎస్సారెస్పీ క్యాంపులో సగానికి సగం స్థలం ఖాళీగానే ఉంటోంది. దీంతో ఇటు ఎస్సారెస్పీ కార్యాలయాన్ని పోలీసు అధికారులు ఎస్పీ కార్యాలయం కోసం ఇష్టపడుతుండగా రెవెన్యూ అధికారులు మాత్రం ఐటీఐలో మిగులు భూమిని కలెక్టర్ కార్యాయానికి వాడుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలోనూ ఏడు ఎకరాల మిగులు భూమిని ఐటీఐ నుంచి అప్పటి ఆర్డీవో నారాయణరెడ్డి గుర్తించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని వివిధ శాఖల కార్యాలయాను ఐటీఐ స్థలంలో నిర్మించేందుకు ప్రతిపాదించారు. తాజాగా పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఇక ఐటీఐ స్థలాన్ని కలెక్టర్ కార్యాలయానికి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. స్వయంగా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఐటీఐలోనే కలెక్టర్ కార్యాలయాన్ని కొనసాగించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. పోలీసులు ఎస్సారెస్పీ క్యాంపులోనే ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించాలని చూస్తున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఐసీడీఎస్, సోషల్ వెల్ఫేర్ లాంటి డివిజన్ కార్యాలయాలు ఎస్సారెస్పీ క్యాంపులోనే ఉన్నాయి. కొత్తగా ఆర్టీవో కార్యాలయానికి కూడా క్యాంపు స్థలాన్ని కేటాయించారు. కొత్త జిల్లాలో సగం ప్రభుత్వ కార్యాలయాలు క్యాంపులోనే ఉండే అవకాశం ఉంది. -
ఎస్పీ కార్యాలయ ఏర్పాటుకు ఐటీఐ భవనం పరిశీలన
మహబూబాబాద్ : తాత్కాలిక ఎస్పీ కార్యాలయ ఏర్పాటు కోసం పట్టణ శివారులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ భవనాన్ని బుధవారం రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కార్యాలయ ఏర్పాటుకు భవనం అనుకూలంగానే ఉందన్నారు. ఎస్పీ కార్యాలయం, ఏఆర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆ భవనం చుట్టూ పరిసరాలను కూడా పరిశీలించామన్నారు. ఆ భవనం సమీపంలోనే సబ్జైల్ ఉండటం వల్ల భద్రత కూడా బాగానే ఉంటుందన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. క్రైం టీమ్లను పెంచి చోరీలను అరికడతామన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని మూడు విభాగాలుగా చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్, సీఐలు నందిరామ్ నాయక్, ఎస్.కృష్ణారెడ్డి ఉన్నారు. -
ఇస్రోలో 272 పోస్టులు ఐటీఐ అభ్యర్థులకు 110
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు రెండు ప్రకటనలను జారీ చేసింది. ఒక నోటిఫికేషన్ను అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) విడుదల చేయగా మరో నోటిఫికేషన్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ) జారీ చేసింది. ఈ ప్రకటనల ప్రకారం పీజీ, పీహెచ్డీ విద్యార్హతలు మొదలుకొని పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా తదితర కోర్సులు చేసిన అభ్యర్థులకూ వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం మీద 110 ఉద్యోగాలు ఐటీఐ ఉత్తీర్ణులకు ఉండటం గమనార్హం. నోటిఫికేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాలు.. మొత్తం పోస్టులు 272. ఇందులో 249 ఉద్యోగాలు ఎస్ఏసీ పరిధిలోవి. 23 ఖాళీలు ఎస్డీఎస్సీవి. పోస్టుల వారీ ఖాళీలు (ఎస్ఏసీ) సైంటిస్ట్/ఇంజనీర్-88; సోషల్ రీసెర్చ్ ఆఫీసర్-1; జూనియర్ ప్రొడ్యూసర్-1; సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్-1; ప్రోగ్రామ్ అసిస్టెంట్-2; టెక్నికల్ అసిస్టెంట్-33; సైంటిఫిక్ అసిస్టెంట్-11; లైబ్రరీ అసిస్టెంట్ ‘ఎ’-2; టెక్నీషియన్ ‘బి’-103 (ఐటీఐ ఫిట్టర్-6, మెషినిస్ట్-4, టర్నర్-1, ఎలక్ట్రానిక్స్-53, ఎలక్ట్రానిక్స్/ఐటీ-1, ఎలక్ట్రీషియన్-17, ప్లంబర్-7, కార్పెంటర్-5, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్-5, వెల్డర్-1, ఐటీ/ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మెయింటనెన్స్-2, డిజిటల్ ఫొటోగ్రఫీ-1); డ్రాట్స్మ్యాన్ ‘బి’-7 పోస్టుల వారీ ఖాళీలు (ఎస్డీఎస్సీ) సైంటిఫిక్ అసిస్టెంట్-2; టెక్నికల్ అసిస్టెంట్-21 (ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విత్ ఎల్వీడీ లెసైన్స్-1, కెమికల్ ఇంజనీరింగ్-3, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్-6, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-2, మెకానికల్ ఇంజనీరింగ్-7, ఫొటోగ్రఫీ-1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-1). వేతనం సైంటిస్ట్/ఇంజనీర్, సోషల్ రీసెర్చ్ ఆఫీసర్, జూనియర్ ప్రొడ్యూసర్కు రూ.15,600-39,100+5400; సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్కు రూ.9,300-34,800+4800, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్కు రూ.9,300-34,800+4,600; టెక్నీషియన్ ‘బి’, డ్రాట్స్మ్యాన్ ‘బి’కి రూ.5,200-20,200+2000. ఎస్డీఎస్సీలోని అన్ని పోస్టులకు నెలకు సుమారు రూ.38,565 చెల్లిస్తారు. విద్యార్హత సైంటిస్ట్/ఇంజనీర్, సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సోషల్ రీసెర్చ్ ఆఫీసర్, జూనియర్ ప్రొడ్యూసర్కు పీహెచ్డీ. టెక్నికల్ అసిస్టెంట్కు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా. సైంటిఫిక్ అసిస్టెంట్కు బీఎస్సీ. లైబ్రరీ అసిస్టెంట్కు డిగ్రీ+సంబంధిత సబ్జెక్టులో పీజీ. టెక్నీషియన్ ‘బి’, డ్రాట్స్మ్యాన్ ‘బి’కి పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ. ఎస్డీఎస్సీలోని సైంటిఫిక్ అసిస్టెంట్కు ఫస్ట్ క్లాస్ బీఎస్సీ; మిగిలిన అన్ని పోస్టులకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా. వయసు 2016, ఆగస్టు 29 నాటికి కనీసం 18 ఏళ్లు; గరిష్టం 35 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ రెండూ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆన్లైన్ దరఖాస్తులను విడివిడిగా సమర్పించాలి. వెబ్సైట్ లింక్ ఆగస్టు 29 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఆన్లైన్ అప్లికేషన్ను ప్రింట్ తీసి, భద్రపరచుకోవాలి. మార్క్షీట్లను స్కాన్ చేసి ట్ఛఛిటఠజ్టీఝ్ఛ్ట ఃట్చఛి.జీటటౌ.జౌఠి.జీకు ఆగస్టు 31 లోపు పంపాలి. చివరి తేదీ ఎస్ఏసీలోని పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ 2016, ఆగస్టు 29; ఎస్డీఎస్సీ పోస్టులకు ఆగస్టు 25. వెబ్సైట్ ఎస్ఏసీ పోస్టులకు www.sac.gov.in (లేదా) http://recruitment.sac. gov.in/OSAR ఎస్డీఎస్సీ పోస్టులకు www.sdsc.shar.gov.in చూడొచ్చు. -
రేపు ఐటీఐలలో రెండో విడత కౌన్సెలింగ్
పెద్దపల్లిరూరల్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఈనెల 24న మలివిడత ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ సురేందర్ తెలిపారు. జిల్లాలోని పెద్దపల్లి, కాటారం, రామగుండం, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సకాలంలో కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. ఆయా ప్రభుత్వ ఐటీఐలలో ఉన్న ఖాళీలను ఈ కౌన్సెలింగ్తో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. 27నుంచి ప్రైవేట్ ఐటీఐల్లో... జిల్లాలోని ప్రైవేట్ ఐటీఐల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 27 నుంచి రెండోవిడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తుదారులు ఆయా ఐటీఐల్లో జరిగే కౌన్సిలింగ్కు నేరుగా హాజరుకావాలన్నారు. ఈనెల 27న మార్కోస్ (కరీంనగర్), కాకతీయ(పెద్దపల్లి), సాదువెంకటరెడ్డి (ఎల్లారెడ్డిపేట), శివశక్తి (గోదావరిఖని) ఐటీఐలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. 28న సాయి (జగిత్యాల), శ్రీసార«థి (ఎన్టీపీసీ), వివేకవర్ధిని (సిరిసిల్ల), ఆల్బర్ట్ (పెద్దపల్లి), గార్గిల్ (హుజూరాబాద్), సింధూర (పెద్దపల్లి), 29న గౌతమి (గోదావరిఖని), జీఎస్సార్ (జమ్మికుంట), వాసవి (హుజూరాబాద్), సిఎస్ఐ (కరీంనగర్), శివసాయి (పెద్దపల్లి), 30న సూర్య (కరీంనగర్), శ్రీరామ (హుజూరాబాద్), లక్ష్మి (మెట్పల్లి), తేజస్వి (హుస్నాబాద్), సంతోష్ (కరీంనగర్) ఐటీఐలలో జరిగే కౌన్సిలింగ్కు ఒరిజినల్, జిరాక్సు సర్టిఫికెట్లతో సకాలంలో హాజరుకావాలని కన్వీనర్ సురేందర్ కోరారు. -
23న ఐటీఐలో జాబ్మేళా
పోచమ్మమైదాన్ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 23న వరంగల్లోని ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో కాల్ హెల్త్కేర్ లిమిటెడ్ వారు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. హోమ్ సర్వీస్ పోస్టులకు ఏఎన్ఎం, డీఎంపీహెచ్డబ్ల్యూ, జీఎన్ఎం పాసైన వారు అర్హులన్నారు. మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పక చేయించి ఉండాలన్నారు. 20 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. ఇంటర్వూ్యలు ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు 91332 50055 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు -
ఐటీఐ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఆర్ఓ
పోచమ్మమైదాన్ : ములుగురోడ్లోని వరంగల్ ప్రభుత్వ ఐటీఐ పరీక్షా కేంద్రాన్ని డీఆర్ ఓ శోభ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పరీక్ష కేంద్రంలోని అన్ని గదులను పరిశీలించారు. పరీక్షలలో మాస్ కాíపీయింగ్ సాగుతుందని పలువురు కలెక్టర్ కరుణకు ఫిర్యాదు చేయడంతో స్పందించి వెంటనే డీఆర్ఓను వెళ్లి తనిఖీ చేయమని ఆదేశించారు. శనివారం ఉదయం పరీక్ష ప్రారంభం కాగానే డీఆర్ఓ వచ్చి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వ ఐటీఐలో రాజీవ్గాంధీ, హన్మకొండ ప్రభుత్వ ఐటీఐలలో చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 350 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అనంతరం శోభ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాను సారం పరీక్షకేంద్రంను తనిఖీ చేశానని చెప్పారు. ఎలాంటి మాస్కాపీయింగ్ జరగడం లేదని స్పష్టం చేశారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ రేణుక, ఆర్ఐ శర్మ, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
అనుమతుల కోసం నివేదిక పంపాం
సంగం : సంగంలో ఐటీఐ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం నివేదికలు పంపామని ఐటీఐ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ మురళీకష్ణ తెలిపారు. కళాశాల భవన నిర్మాణ జాప్యంపై ‘భూములిచ్చారు.. నిధులు మరిచారు’ అని ఇటీవల సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. విద్యార్థి సంఘాలు సైతం నిర్మాణం చేపట్టాలని ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన తహసీల్దారు రామాంజనేయులు ప్రిన్సిపల్ను గురువారం తన కార్యాలయానికి పిలుపించుకుని మాట్లాడారు. భవన నిర్మాణం కోసం రూ.7.3 కోట్లు ఖర్చవుతుందని నివేదికలు పంపామని, నిధులు మంజూరైన వెంటనే నిర్మాణం ప్రారంభిస్తామని తహసీల్దారుకు తెలిపారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని తహసీల్దారు మురళీకష్ణకు సూచించారు. -
ఆగస్టు 12న ఐటీఐ రెండో విడత కౌన్సిలింగ్
సీతంపేట: ఆగస్టు 12న రెండో విడ త కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ఐటీఐ ప్రిన్సిపాల్ ప్రసాద్బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్రీ్టషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, డ్రెస్మేకింగ్,కోపా(కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్) ట్రేడుల్లో మిగులు సీట్లు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వచ్చేనెల 10 వ తేదీలోగా దరఖాస్తు చే సుకోవాలని తెలిపారు. రూ.10 ఫీజు చెల్లించి దరఖాస్తులు పొందాలని సూచించారు. ఫోన్ నంబర్లు 8886882153, 8886990544కు సంప్రదించాలని కోరారు. -
కొత్తగా11 ప్రభుత్వ ఐటీఐలు
* అందుబాటులోకి మరో 2,400 సీట్లు * రూ. 37.74 కోట్లు కేటాయించిన కార్మిక శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కార్మికశాఖ పచ్చజెం డా ఊపింది. వాటిని త్వరతగతిన ఏర్పాటు చేయాలని నిర్ణయించి స్థలాలు అందుబాటులో ఉన్న తొ మ్మిది ప్రాంతాల్లో ఐటీఐల నిర్మాణానికి రూ. 37.74 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిగిలి న రెండు ఐటీఐల నిర్మాణానికి స్థలాలను త్వరతగతిన ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 62 ప్రభుత్వ, 250 ప్రైవేటు ఐటీఐలలో 39,029 సీట్లు ఉండగా కొత్త ఐటీఐల రాకతో మరో 2,400 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఐటీఐలను ఎక్కువగా పారిశ్రామికవాడలకు దగ్గరగా ఉన్న చోటనే ఎంపిక చేశారు. ఐటీఐల్లోకి విద్యార్థుల క్యూ: ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులకు దీటుగా ఐటీఐలలో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. 62 ప్రభుత్వ ఐటీఐలలో 9 వేల సీట్లు, 250 ప్రైవేటు ఐటీఐలలో 28 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉండగా వొకేషనల్ ట్రైనింగ్లో 1,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మొదటి కౌన్సెలింగ్లో భాగంగా ఇప్పటివరకు ప్రభుత్వ ఐటీఐలలో 6,500 సీట్లు, ప్రైవేటు ఐటీఐలలో 10 వేల సీట్లు భర్తీకాగా వొకేషనల్ సర్టిఫికెట్ కోర్సు (ఎస్సీవీటీ)లో 750 సీట్లు భర్తీ అయ్యాయి. భరోసా కల్పిస్తున్న కార్మికశాఖ: ఐటీఐ పూర్తి చేస్తే కచ్చితమైన ఉపాధి కలిగేలా కార్మికశాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. ప్రతి ఐటీఐకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఎంసీ)ను ఏర్పాటు చేసి ఒక్కో పరిశ్రమతో అనుసంధానించింది. తద్వారా ప్రతి విద్యార్థికీ అప్రెంటిషిప్ వచ్చేలా చూడటంతోపాటు విద్యార్థులకు నైపుణ్యశిక్షణ ఇప్పిస్తోంది. అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం లభించేలా కృషి చేస్తోంది. ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారికి దాదాపు నిరుద్యోగ సమస్య ఉండదనే భరోసాను అధికారులు కల్పిస్తుండటంతో డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెషినిస్ట్, టర్నర్, వెల్డర్ వంటి కోర్సులకు ఆదరణ పెరిగినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా రానున్న ఐటీఐలు జహీరాబాద్ (మెదక్), కుల్చారం (మెదక్), మర్పల్లి (రంగారెడ్డి), తాండూరు (రంగారెడ్డి), చర్లపల్లి (రంగారెడ్డి), బిచ్కుంద (నిజామాబాద్), ఆసిఫాబాద్ (ఆదిలాబాద్), తాడ్వాయి (వరంగల్), కమలాపూర్ (కరీంనగర్), సిరిసిల్ల (కరీంనగర్), హుజూర్నగర్ (నల్లగొండ) -
పారిశ్రామిక శిక్షణ సంస్థకు దరఖాస్తులు
కందుకూరు అర్బన్: స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2016–17 సంత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఏ.రాజేశ్వరరావు తెలిపారు. డ్రాఫ్ట్మెన్ సివిల్, ఫిట్టర్ తదితర ఖాళీలను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు. రూ.10 చెల్లించి స్థానిక ఐటీఐ కళాశాలలో 20 నుంచి దరఖాస్తులు పొందాలన్నారు. దరఖాస్తులను వచ్చే నెల 10 లోపు అందజేయాలన్నారు. వివరాలకు ఫోన్:08598 224497 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
ఆ పరీక్ష రాసిన అందరూ ఫెయిల్!
అజ్మీర్: రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్(ఐటీఐ) మొదటి సంవత్సరం తొలి సెమిస్టర్ రాసిన విద్యార్ధులందరూ అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. అంతకంటే ఆశ్చర్యకరమైన మరో విషయం ఈ పరీక్షల్లో యాభై శాతం ప్రశ్నలు అబ్జక్టివ్ టైప్ కావడం. శనివారం ఫలితాలను చూసుకున్న విద్యార్థులు షాక్ కు గురయ్యారు. అందరికీ ప్రాక్టికల్, థియరిటికల్ పరీక్షల్లో సున్నా మార్కులు రావడంతో జోథ్ పూర్ లో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(ఎన్సీవీటీ)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులందరికీ సున్నా మార్కులు రావడాన్ని తాము నమ్మడం లేదని టీచర్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరుకు విద్యార్థులు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులందరికీ సున్నా మార్కులు రావడంపై షాక్ కు గురయ్యామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. పరీక్షా ఫలితాలపై యూనివర్సిటీకు లేఖ రాసినట్లు వివరించారు. కాగా, ఈ నెల 27తో తదుపరి సెమిస్టర్ ఫీజు చెల్లింపు తేది ముగుస్తుంది. ఒకవేళ విద్యార్థులు తదుపరి సెమిస్టర్ ఫీజును చెల్లిస్తే, ప్రస్తుత ఫలితాలను అంగీకరించి సప్లిమెంటరీలో వాటిని క్లియర్ చేయాల్సివుంటుంది. ఇప్పటిలానే పోరాటం కొనసాగిస్తే ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో యూనివర్సిటీ త్వరగా సమాధానం ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. -
ఐటీఐలలో ఆకలి ‘కేక’లు
♦ ఇచ్చేది అంతంత మాత్రం... ♦ అందులోనూ నెలల తరబడి ఎదురుచూపులు ♦ కాంట్రాక్టు సిబ్బందికి అందని వేతనాలు ♦ సుమారు 12 నెలలుగా అందక అవస్థలు ♦ మూడు నెలలకు ఒకసారి కేటాయించే బడ్జెట్లో అరకొర నిధులు సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకమునుపు ఒకమాట...వచ్చిన తర్వాత మరో మాట చెబుతూ నిరుద్యోగులతో చెలగాటమాడింది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చిన టీడీపీ సర్కార్ ఆ దిశగా చర్యలు లేకపోగా....చివరకు వారికి ఇచ్చే వేతనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం...యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టు సిబ్బంది అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నెలకాదు..రెండు నెలలు కాదు...సుమారు పది నుంచి పన్నెండు నెలలుగా సక్రమంగా వేతనాలు రాకపోవడంతో ఐటీఐ సిబ్బంది పడుతున్న వేదన వర్ణణాతీతం. మూడు నెలలకు ఒకసారి బడ్జెట్ సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐటీఐల్లో బడ్జెట్ రూపొందించి పంపించడం ఆనవాయితీ. అయితే భారీగా నిధులు అవసరమని బడ్జెట్లో ప్రతిపాదనలు పంపుతున్నా అంతంత మాత్రంగానే కేటాయిస్తున్నారు. దీంతో కాంట్రాక్టు సిబ్బంది జీతాలకు సమస్య ఏర్పడుతోంది. ఒకవేళ గట్టిగా వెళ్లి అడుగుదామంటే తాము చేసేది కాంట్రాక్టు పద్దతిపైన కాబట్టి ఉంచుతారో, తీసేస్తారోనన్న భయం వెంటాడుతోంది. మరోపక్క స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో పిల్లల ఫీజులతోపాటు తిండి అవసరాలు, ఇతర ఖర్చులు భారీగా ఉంటాయి. కనీసం ఇలాంటి పరిస్థితిలోనైనా ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు సిబ్బందికి నిధులు విడుదల చేయాలని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఐటీఐల్లో పనిచేస్తున్న తమ ఇబ్బందులను గుర్తించి సత్వరమే నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని జిల్లాలోని ఐటీఐల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది వేడుకుంటున్నారు. పెరిగిన ధరలతో సతమతం జిల్లాలోని చాలా ఐటీఐలలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందికి నెలల తరబడి వేతనాలు రావడం లేదు. జిల్లాలోని ఐటీఐల్లో ఇన్స్ట్రక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్మెన్లు ఇలా రకరకాల సిబ్బంది పనిచేస్తున్నారు. 120 నుంచి 150 మంది వరకు జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 10 నుంచి 12 నెలలుగా వారికి ఇచ్చే వేతనాలు సక్రమంగా అందడం లేదు. ఇదేమని అడిగే అధికారులు లేకపోగా...చివరకు ఎలా బతుకుతున్నారని ప్రభుత్వం కూడా స్పందించిన పాపాన పోలేదని వారు వాపోతున్నారు. కాంట్రాక్టు కింద పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు కూడా పెద్ద స్థాయిలో ఉండవు. అమరావతికి వచ్చే ఉద్యోగులకు మాత్రం 30 శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని...ఇక్కడ జీతాలు రాక తిండికి అవస్థలు పడుతుంటే పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. -
కొత్త ఐటీఐలకు అనుమతులు లేవు
ముషీరాబాద్: భవిష్యత్లో కొత్త ఐటీఐలకు అనుమతులు ఇవ్వబోమని, ఉన్నవాటిని బలోపేతం చేస్తామని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్టీసీ క్రాస్రోడ్డులోని ముషీరాబాద్ ఐటీఐ కళాశాలలో ఫోర్డ్ ఇండియా కంపెనీ ఆటోమోటివ్ విద్యార్థులకు పర్వీద్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఫోర్డ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రభులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ఈ ఏడాది 250మంది ఐటీఐ విద్యార్థులను దుబాయ్ పంపించామని, వచ్చే ఏడాది 500, ఆపై సంవత్సరం వెయ్యి మందిని దుబాయ్ పంపేందుకు ఒప్పదం చేసుకున్నట్లు తెలిపారు. మల్లేపల్లి ఐటీఐని దేశంలోనే ఉత్తమ ఐటిఐగా రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫోర్డ్ ఇండియా ఉపాధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పర్విన్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ స్వర్ణలత ఫోర్డ్ ఇండియా ప్రతినిధుల మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. కార్యక్రమంలోముఠా గోపాల్, శ్రీనివాస్రెడ్డి, నగేష్, దేవరాజన్, కె.వై.నాయక్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్సీ, ఇంటర్ అర్హతలతో పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్ విద్యార్హతలతో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులకు నిర్వహించే పోటీ పరీక్షల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోటీ పరీక్షల్లో ఉండే పేపర్లు, మార్కుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. బిల్ కలెక్టర్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. నియామక ప్రక్రియను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష విధానాన్ని రూపొందించింది. కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం విద్యార్హతలకు అనుగుణంగా సంబంధిత పోస్టుల పరీక్ష ప్రణాళికను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సెస్సీ తత్సమాన విద్యార్హత ఉన్న పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్ పేపర్ ఒకటే ఉంటుంది. ఈ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. ఇక ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతలున్న పోస్టులకు జనరల్ నాలెడ్జ్, సెక్రెటేరియల్ ఎబిలిటీస్ పేరుతో ఒక పేపర్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్కు సంబంధించి 75 ప్రశ్నలు, సెక్రెటేరియల్ ఎబిలిటీస్కు 75 ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఈ పేపర్కు 150 మార్కులుంటాయి. అలాగే ఐటీఐ లేదా తత్సమాన అర్హతలున్న పోస్టులకు జనరల్ నాలెడ్జ్, సంబంధిత ఐటీఐ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 75 ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 75 ప్రశ్నలుంటాయి. మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. -
ఐటీఐ పరీక్షలు ప్రారంభం
విజయనగరం టౌన్ : ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల విద్యార్థులకు థియరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. పార్వతీపురం జ్యోతీ ఐటీఐ, విజయనగరం. బొబ్బిలి కేంద్రాలలో ప్రశ్నపత్రాలు ఆలస్యంగా పంపిణీ చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పార్వతీపురంలోని జ్యోతి ఐటీఐలో గంటకు పైగా ప్రశ్నాపత్రం రావడం ఆలస్యమైందని ప్రభుత్వ ఐటీఐల కన్వీనరు పరమేశ్వరరావు తెలిపారు. తనకు సమాచారం అందగానే ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది కేంద్రా ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. జిల్లా పరిశీలకులుగా జిల్లా ఆడిట్ అధికారి మల్లికాంబ వ్యవహరిస్తున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ ఉపాధికల్పనాధికారి కుమారస్వామి విజి లెన్స్ అధికారిగా వ్యవహరిస్తారని తెలి పారు. తొలిరోజు ఉదయం రెండేళ్ల కోర్సు పార్ట్ -1, సెమిస్టర్-1 ట్రేడ్ థియరీ, ఎంప్లాయిబులిటీ స్కిల్స్పై పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం ఏడాది కోర్సు సెమ్-1, పార్ట్-1 ట్రేడ్ థియరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 432 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్టు కన్వీనరు తెలిపారు. -
ఐటీఐలు కావు.. పిటీఐలు!
ఐటీఐలు విద్యార్థుల పాలిట పిటీగా మారాయి. పక్కా భవనాలు లేక.. వసతుల లేమి కారణంగా క్యూసీఐ గుర్తింపునకు నోచుకోని ఈ వృత్తి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరగలేదు. ఐటీఐల అడ్మిషన్లు రద్దు - పక్కా భవనాలు, వసతులు లేమి కారణం.. - క్యూసీఐ గుర్తింపు లేక అవస్థలు, - ఇదీ జిల్లాలోని ఐటీఐల దుస్థితి నర్సాపూర్: జిల్లాలోని పలు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో సరైన వసతులు లేక క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) గుర్తింపు లభించనందున అడ్మిషన్లు జరగలేదు. ఐటీఐల్లో అడ్మిషన్లు ఈనెల 21 వరకు జరిగాయి. ఐటీఐల్లో వసతులు లేకపోయినా ఇప్పటి వరకు నెట్టుకువచ్చినప్పటికీ ఈసారి క్యూసీఐ నుంచి గుర్తింపు లభించక పోవడంతో అడ్మిషన్లు చేపట్టకపోవడంతో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందాల్సిందే. ఐటీఐల్లో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించనందున అసౌకర్యలతో ఐటీఐలు కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో ఏడు ఐటీఐలు ఉండగా సంగారెడ్డి, పటాన్చెరు, హత్నూర ప్రభుత్వ ఐటీఐలకు క్యూసీఐ గుర్తింపు పూర్తి స్థాయిలో ఉండడంతో ఈసారి మూడు ఐటీఐల్లో ఉన్న అన్ని ట్రేడ్లకు అడ్మిషన్లు జరిగాయి. మెదక్, కుకునూర్పల్లి, సిద్దిపేట ప్రభుత్వ ఐటీఐల్లో ఐదు నుంచి ఎనిమిది ట్రేడ్లు ఉన్నప్పటికీ అన్ని ట్రేడ్లకు క్యూసీఐ గుర్తింపు లభించనందున నామమాత్రంగా ఒక్కో ట్రేడ్కు మాత్రమే అడ్మిషన్లు జరగగా దుబ్బాక ఐటీఐలో అడ్మిషన్లే జరుగలేదు. సమస్యల్లో ప్రభుత్వ ఐటీఐలు క్యూసీఐ నిబంధనల మేరకు ఐటీఐలకు శాశ్వత భవనం, ఖాళీ స్థలంతో పాటు కరెంటు సరఫరా, ట్రేడ్లను బట్టి శిక్షణకు అవసరమైన యంత్రాలు, ఇతర సామగ్రితో పాటు బోధించేందుకు తగిన సిబ్బంది ఉంటేనే క్యూసీఐ అధికారులు తనిఖీల అనంతరం ఐటీఐలకు గుర్తింపు ఇస్తారు. క్యూసీఐ అనుమతులు ఉంటేనే అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు ఐటీఐలకు అనుమతులు లభించకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సారానికి అడ్మిషన్లు చేపట్టలేదు. కాగా మెదక్, సిద్దిపేట ఐటీఐలకు సొంత భవనాలు లేకపోవడంతో ఇతర విద్యా సంస్థలకు చెందిన భవనాల్లో ఐటీఐలను కొనసాగిస్తున్నందున క్యూసీఐ నుంచి అనుమతులు లభించకపోవడంతో అన్ని ట్రేడ్లకు అడ్మిషన్లు జరగలేదు. ఉన్న వసతులతో నిర్వహించే అవకాశాలు ఉన్న రెండేసి ట్రేడ్లకు అడ్మిషన్లు చేపట్టారు. కాగా కుకునూర్పల్లి ఐటీఐకి భవనం, సామగ్రి ఉన్నా అవసరమైన రెగ్యులర్ బోధనకు సిబ్బంది సరిపడినంతగా లేనందున అనుమతులు లభించలేదని, ఒకే ట్రేడ్కు అనుమతి లభించడంతో ఒక్క ట్రేడ్లోనే విద్యార్థులను చేర్చుకున్నారు. కాగా దుబ్బాక ఐటీఐలో శిక్షణకు అవసరమైన సామగ్రి లేనందున అనుమతులు దొరకలేదు. గత ఏడాది చేర్చుకున్న విద్యార్థులకే ఈసారి శిక్షణ ఇవ్వనున్నారు. అంతటా ఒకే సిలబస్ ప్రభుత్వ ఐటీఐల్లో అన్నింటిలో ఒకే సిలబస్ విధానాన్ని అమలు చేయడంతో క్యూసీఐ గుర్తింపు ఈసారి తప్పనిసరిగి మారింది. గతంలో పలు ఐటీఐల్లో స్టేట్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్ సిలబస్ (ఎస్సీవీటీ) అమలులో ఉండగా మరి కొన్నింటిలో నేషనల్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్ సిలబస్ (ఎన్సీవీటీ) ఉండేది. క్యూసీఐ గుర్తింపు ఉన్న ఐటీఐల్లో నేషనల్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్ విధానం అమలవుతుంది. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అంతటా నేషనల్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయించడంతో క్యూసీఐ గుర్తింపు లభించక అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. పేరుకే రెసిడెన్షియల్ ఐటీఐ రాష్ట్రంలో మెదక్ జిల్లా హత్నూర, మహబూబ్నగర్ జిల్లాల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ ఐటీఐలు ఏన్నాయి. కాగా హత్నూరలోని రెసిడెన్షినల్ ఐటీఐలో చేరే విద్యార్థులకు భోజన వసతితో హాస్టల్ వసతి లేదు. గుర్తింపు ఉంటేనే అడ్మిషన్లు జిల్లాలో క్యూసీఐ గుర్తింపు ఉన్న ఐటీఐల్లో మాత్రమే అడ్మిషన్లు చేపట్టామని ఐటీఐల జిల్లా కన్వీనర్ గురుమూర్తి తెలిపారు. పలు ఐటీఐలకు కొన్ని ట్రేడ్లకు గుర్తింపు లభించగా ఆయా ట్రేడ్లకు విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. ఐటీఐలో ప్రవేశం కోసం 25 నుంచి కౌన్సెలింగ్ సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మిగిలిన అన్ని కేటగిరీల్లో ఉన్న సీట్లను భర్తి చేసేందుకు ఈ నెల 25 నుంచి 27 వరకు సంగారెడ్డిలోని ఐటీఐలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ గురుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ఫేజ్లో దరఖాస్తు చేసుకొని సీట్లు రాని విద్యార్థులు, ఫోన్లకు మెసేజ్ వచ్చిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. ప్రైవేట్ ఐటీఐల్లో చేరాలనుకున్నా వారు కౌన్సెలింగ్ రోజున సంవత్సరానికి రూ. 7,700 ఫీజు చెల్లించాలన్నారు. ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వారికి కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వరని, ట్రేడ్ మార్పులు ఉండవన్నారు. -
13నుంచి ఐటీఐ కౌన్సెలింగ్
టెన్త్ గ్రేడ్ పాయింట్ట ఆధారంగా ఎంపిక ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి ముందుగా ట్రేడ్స్ ఎంపిక చేసుకోవాలి జిల్లా కన్వీనర్ సక్రూ పోచమ్మమైదాన్ : పదో తరగతి ఉత్తీర్ణులై ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2015-2016 విద్యా సంవత్సరానికి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 13నుంచి 20వ తేదీ వరకు కౌన్సెలింగ్ చేడపతామని ఐటీఐల జిల్లా కన్వీనర్ గుగులోతు సక్రూ తెలిపారు. గురువా రం వరంగల్లోని ప్రభుత్వ ఐటీఐలో కౌన్సెలిం గ్ తేదీలు, గ్రేడ్ల జాబితాను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 8,716 మంది విద్యార్థులు ఐటీఐలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఆన్లైన్ పద్ధతిలో కౌన్సెలింగ్ చేడపతామన్నారు. కౌన్సెలింగ్ తేదీలను పోస్ట్, దరఖాస్తు ఫారమ్లో నమోదు చేసిన సెల్ నంబరు కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. అనివార్య కారణాల వల్ల సమాచారం అందని వారు సైతం వారి గ్రేడ్ ఆధారంగా కౌన్సెలింగ్ తేదీని సరిచూసుకుని హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు తమ పదో తరగతి మెమో, కులం, టీసీ తదితర ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్స్తో హాజరుకావాలన్నారు. ఈసారి ఎస్టీ అభ్యర్థులకు సైతం వరంగల్ ప్రభుత్వ ఐటీఐలోనే కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ముందుగానే వారు చేరాలనుకు నే ట్రేడ్ల ప్రాధాన్యతను ఎంపికచేసుకోవాలని ఆయన అన్నారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో దరఖాస్తుదారులందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్రాను. -
ప్రశ్నాపత్రాల కొరతతో ఐటీఐ పరీక్షల్లో ఆలస్యం
బొబ్బిలి : ప్రశ్నాపత్రాల కొరత కారణంగా విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఐటీఐ సెమిస్టర్ పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 830 మంది విద్యారులు బొబ్బిలిలోని ప్రభుత్వ ఐటీఐలో పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే, 200 ప్రశ్నాపత్రాలు కొరత ఉండడంతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మొదలు కాలేదు. జిరాక్స్ తీసి పరీక్ష నిర్వహిద్దామన్నా, విద్యుత్ లేకపోవడంతో ఆలస్యం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 1.30 గంటల తర్వాత కరెంట్ రావడంతో ప్రశ్నాపత్రాలను జిరాక్స్ తీసి పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ప్రశ్నాపత్రాల కొరత నెలకొన్నట్లు సమాచారం. -
ప్రాక్టికల్ విద్య అందితే సత్ఫలితాలు
ఎచ్చెర్ల: ఐటీఐల్లో ఏ ఏడాది మెరుగైన ప్రవేశాలు జరిగాయి. అయితే ఐటీఐల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య సక్రమంగా అందితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీఐల్లో ఈ ఏడాది 3226 సీట్లకు గాను 2900 వరకు నిండిపోయాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి ట్రేడుల్లో ప్రైవేటు కళాశాలల్లో సైతం దాదాపు సీట్లు నిండాయి. జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం డీఎల్టీసీ, పలాస, సీతంపేట, రాజాంల్లో ఐదు ప్రభుత్వ ఐటీఐ, మరో 17 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రస్తుత ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవాలంటే విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు, పరిశ్రమల్లో వస్తున్న సాంకేతిక మార్పులు, పరిశ్రమలు అవసరాలు ముందుగా గుర్తించాలి. విద్యార్థులు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది. వీరి పని తీరును నిరంతరం ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు. అందుకే ప్రతి ఐటీఐ విద్యార్థి నిరంతరం స్కిల్స్ నైపుణ్యం వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దిశగా ఐటీఐలు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రెండేళ్ల కోర్సుల్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్మెన్ సివిల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ నిర్వహిస్తుండగా, ఏడాది కోర్సులు వెల్డర్, కోపా, డీజిల్ మెకానిక్, కటింగ్ అండ్ సూయింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ తదితర కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మాజ్యూలరీ ఎంప్లాయ్మెంట్ స్కిల్ సంస్థ ఐటీఐల్లో డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుంది. ఇప్పటికే ఇటువంటి కోర్సులను నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్ వంటి సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో తరగతుల నిర్వహణ, శిక్షణ కొంతవరకు మెరుగ్గా ఉన్నా ప్రైవేటు సంస్థల్లో మాత్రం అనుకున్న స్థాయిలో ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు నైపుణ్యాల్లో వెనుకబడిన సందర్భాలున్నాయి. డీజీఈపీ వంటి సంస్థలు నిరంతరం పర్యవేక్షణ చేస్తేఇక్కడ సైతం శిక్షణ బాగా జరిగే అవకాశం ఉంటుంది. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ మార్పు, ప్రయోగ విద్యకు ప్రాధాన్యత నివ్వడం, పరిశ్ర మల్లో విద్యార్థులకు ప్రయోగాలకు అవకాశం కల్పించడం, అధీకృత సంస్థల నిరంతర పరిశీలనతో విద్య మరెంత బలోపేతం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐటీఐ అనంతరం విద్యార్థులు డిప్లమో, డిగ్రీ వంటి చదువు లకు ప్రాధాన్యత నిచ్చినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సెమిస్టర్ విధానంలో... గత ఏడాది నుంచి సెమిస్టర్ పద్ధతిలో ఐటీఐ పరీక్షలు ప్రవేశపెట్టారు. ఏడాది కోర్సు విద్యార్థులు రెండు, రెండేళ్ల కోర్సు విద్యార్థులు నాలుగు సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలన్నీ ఆప్షన్ల విధానంలో ఉంటాయి. గతంలో థియరీ విధానంలో పరీక్షలు రాసేవారు. పరీక్ష రాసే విధానం సైతం దృష్టి సారించాల్సి ఉంది. విద్యలో రాణించాలంటే మాత్రం ప్రయోగ విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలి. కష్టబడి పనిచేయాలి ఐటీఐలో చేరే విద్యార్థి నిరంతరం శ్రమిం చాల్సి ఉంటుంది. జిల్లాలో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు ల్లో చేరుతున్నారు. పరిశ్రమల్లో సాంకేతి క మార్పులు గమనించి మెరుగైన విద్యను పొందాలి. ప్రభు త్వ ఉద్యోగాలకు సైతం ఎంపిక కావ చ్చు. -రాడ కైలాసరావు, జిల్లా ఐటీఐల క న్వీనర్ ఉపాధి కోసం చేరా నేను ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవాలని ఐటీఐలో చేరాను. తక్కువ వయసులో ఉపాధి అవకాశాలు పొందడం ద్వారా మా కుటుంబానికి ఆర్థికంగా సహాయపడతాను. మా నాన్న కూడా ఐటీఐ చేసి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నారు. -ఎల్.అనూష, సివిల్, ఎచ్చెర్ల ఐటీఐ పరిశ్రమల్లో ఉపాధి కోసం.. నాకు 10 తరగతిలో 9.07 గ్రేడ్ మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియెట్ అనంతరం ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్థోమత లేదు. అందుకే ఐటీఐలో చేరా. ఐటీఐ అనంతరం ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవడమే నా లక్ష్యం. -జె.సంతోష్ కుమార్, ఫిట్టర్ ట్రేడ్, ఎచ్చెర్ల -
ఐటీఐలో అధ్యాపకుల కొరత
ఉట్నూర్ రూరల్ : గిరిజన ప్రాంత విద్యార్థులకు పారిశ్రామి క రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీడీఏ సహాకారంతో 1984లో ఉట్నూర్లోని కేబీ ప్రాంగణంలో ఐటీఐని (ప్రభుత్వం గిరిజన పారిశ్రామిక శిక్షణ సంస్థ) నెలకొల్పారు. పదో తరగతి తర్వాత ఉపాధి పొందాలనుకునే విద్యార్థులు ఈ కళాశాలలో ప్రవేశాలు పొందుతారు. ఇందులో వంద సీట్లు ఉండగా, 90 శాతం సీట్లు గిరిజనులకు.. మిగిలిన 10 శాతం ఇతరులకు కేటాయించారు. కొన్నేళ్ల వరకు పూర్తి స్థాయిలో అధ్యాపకులు ఉన్నారు. ఇటీవల వీరి కొరత విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కళాశాలలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మన్, సివిల్, వెల్డర్, స్టెనోగ్రఫీ, కోప తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకుగాను 177 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. కళాశాలలో ఏడుగురు సీనియర్, ఏడుగురు జూనియర్ అధ్యాపకులు ఉండాలి. కాని ఇద్దరు మాత్రమే సీనియర్ అధ్యాపకులు ఉండగా, మిగతా పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. కాంట్రాక్ట్ ప్రతిపాదికనైనా అధ్యాపకులను నియమించేందుకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన బ్యాచ్ ప్రారంభం కానుండడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. హాస్టల్ వసతి లేక ఇబ్బందులు ఐటీఐలో హాస్టల్ వసతి లేక దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు. గతేడాది క్రితం అప్పటి ఐటీడీఏ పీవో రేవు ముత్యాల రాజు కళాశాల పక్కన ఉన్న ఎకరం భూమిని హాస్టల్ వసతి నిర్మాణం కోసం కేటాయించారు. కాని నిర్మాణానికి ఇంకా నిధులు మంజూరు కాలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లోనైనా నిధులు విడుదల చేసి విద్యార్థులకు వసతిగృహం నిర్మించాలని, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. -
సమైక్యాంధ్ర బంద్ సక్సెస్
ఏలూరు, న్యూస్లైన్:జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నిత్యనూతనమై విరాజిల్లుతోంది. ఎన్జీవోల పిలుపుమేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. దుకాణాలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంక్లు, చివరకు పాన్షాపులు, టీ బడ్డీలు సైతం మూతపడ్డాయి. సమైక్యవాదులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, తణుకు, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాలతోపాటు, గ్రామగ్రామాన బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. సమైక్యవాదులు నినాదాలు చేసుకుంటూ ఉదయం నుంచీ దుకాణాలను, కార్యాలయూలను మూయించివేశారు. వారికి మద్దతుగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ముందుకు కదిలి బంద్ విజయవంతానికి సహకరించాయి. ఇదిలావుండగా, 56వ రోజు కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ ఐటీఐ, వృత్తి విద్యాశాఖ అధ్యాపకులు దీక్ష చేపట్టారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో వైద్యులు దీక్షలో పాల్గొన్నారు. పోడూరు మండ లం గుమ్మలూరులో నాయూ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. చించినాడలో ఎన్జీవోలు దీక్ష చేశారు. చించినాడ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసి రహదారి దిగ్బంధనం చేశారు. తాళ్లపూడిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్డుపైనే కబడ్డీ, షటిల్ ఆడి నిరసన తెలిపారు. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీ యూనిట్ కార్మికులు, వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. చాగల్లులో వేద పండితులు రోడ్డుపై హోమం నిర్వహించారు. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో రహదారిని దిగ్బంధించారు. కాపవరంలో పవన్ కల్యాణ్ యూత్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కొవ్వూరు టాక్సీ స్టాండులో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో జైనులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మద్దూరు, కొవ్వూరు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు కూర్చున్నారు. జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర ప్రధాన రహదారిని జేఏసీ నాయకులు దిగ్బంధించారు. వేలాది వాహనాలు నిలిచిపోయాయి. బోసుబొమ్మ సెంటర్లో జాతీయ క్రీడాకారులు రోప్ స్కిప్పింగ్ విన్యాసాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. చింతలపూడిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు రాస్తారోకో చేశారు. కామవరపుకోటలో జేఏసీ సభ్యులు జలదీక్ష చేశారు. టి.నరసాపురం మండలంలో ఆర్యవైశ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. తణుకులోను, తాడేపల్లిగూడెం సమీపంలోని జాతీయ రహదారిని ఎన్జీవోలు దిగ్బంధించారు. దువ్వలో రైతు జేఏసీ ఆధ్యర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్లో గోనె సంచుల వ్యాపారులు మెడకు ఉరితాళ్లు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. మహిళా ఉద్యోగుల ప్రత్తిపాడు సెంటర్లో రోడ్డుపై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. నరసాపురంలో మహిళా టీ చర్లు గాలిపటాలు ఎగురవేసి నిరసన తెలిపారు.