
మెడిసిన్ ర్యాంకర్కు సన్మానం
కోదాడఅర్బన్: ఎంసెట్–3 మెడిసిన్ విభాగంలో 252 ర్యాంకు సాధించిన పట్టణానికి చెందిన వెంపటి సత్యనారాయణ కుమార్తె గాయత్రిని శుక్రవారం కోదాడ వాసవీవనితాక్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ర్యాంక్ సాధించేందుకు గాయత్రి చేసిన కృషిని వారు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ పబ్బా గీత, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు బొగ్గారపు రేఖారాణి, యాదా రాణి, క్రాంతికుమారి, శ్రీదేవి, గీత, రాధిక, సుశీల, ఉమ, అనురాధ, నళినిశ్రీ, మణి, శిరీష, నాగమణి, పందిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.