medical aid
-
దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్
చండీగఢ్: పంజాబ్లోని ఖానౌరీ బోర్డర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించింది. మరోవైపు కేంద్రం పంజాబ్ రైతుల డిమాండ్లపై చర్చించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో జగ్జీత్ సింగ్ దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. అయితే తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని రైతు నేత సుఖ్జీత్ సింగ్ హర్డోజండే మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ 26 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించిన నేపధ్యంలో ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు.రైతు నేత దల్లెవాల్ ఆమరణ నిరాహార దీక్ష(Hunger strike) 54వ రోజుకు చేరుకుందని, రైతులకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ లభించేంత వరకు జగ్జీత్ సింగ్ నిరవధిక నిరాహార దీక్షను విరమించబోనని స్పష్టం చేశారన్నారు. ఉపవాస దీక్ష సమయంలో అతని ఆరోగ్యం క్షీణించిందని, దాదాపు 20 కిలోగ్రాముల బరువు తగ్గారని, ఈ నేపధ్యంలో వైద్య సహాయాన్ని తీసుకునేందుకు ముందుకు వచ్చారని జండే తెలియజేశారు.మరోవైపు జగ్జీత్ సింగ్ దల్లెవాల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. అయితే తొలుత ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు నిరాకరించారు. తాజాగా జాయింట్ సెక్రటరీ ప్రియా రంజన్(Joint Secretary Priya Ranjan) నేతృత్వంలోని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రతినిధి బృందం దల్లెవాల్ను కలుసుకుని, యునైటెడ్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇదే సమయంలో ఖనౌరి సరిహద్దు వద్ద మరో 10 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీంతో మొత్తం నిరాహార దీక్ష చేస్తున్న రైతుల సంఖ్య 121కి చేరింది.ఫిబ్రవరి 14న చండీగఢ్(Chandigarh)లో పంజాబ్ రైతుల సమావేశమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులతో కేంద్రం తిరిగి చర్చలు జరపనుంది. దీంతో ఈ పంజాబ్ రైతుల సమస్యలపై ప్రతిష్టంభన తొలగిపోనున్నదని రైతులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి -
నారావారి నైవైద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత వైద్య సదుపాయాలు మృగ్యమైన ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ వైద్యారోగ్యశాఖను నిర్విర్యం చేసింది. పేదల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి నారావారి నైవైద్యంగా మలచుకుంది. ప్రభుత్వాస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది. వైద్య పరీక్షల పేరిట ప్రైవేటు సంస్థలకు పందేరం చేసింది. ఈఎస్ఐ మందుల కుంభకోణానికి పాల్పడింది. ఎన్నికల మేనిఫెస్టోలో వైద్య ఆరోగ్య విధానం పేరిట చంద్రబాబు మొత్తం 14 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. జిల్లాకు ఒక నిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఏకంగా ప్రభుత్వాస్పత్రిలో నెలలు నిండని శిశువును ఎలుకలు కొరికిన వైనం రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు తీరని మచ్చగా మిగిలింది. 2014–19 మధ్య ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వైద్యారోగ్యశాఖ స్వర్ణయుగాన్ని చూస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు ద్వారా సకల వసతులూ సమకూరాయి. అర్బన్, విలేజ్ హెల్త్క్లినిక్లు బలోపేతమయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటింటికీ వైద్యసేవలు అందుతున్నాయి. ఆరోగ్యసురక్ష ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆరోగ్యాంధ్రను సర్కారు ఆవిష్కరించింది. కరోనా సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొ ల్పింది. వైద్యారోగ్యశాఖలో నెలకొన్న నాటి.. నేటి పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే.. చంద్రబాబు హయాంలో.. ఆరోగ్యశ్రీకి పేరుమార్చి తూట్లు నిరుపేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించాలనే సదుద్దేశంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తూట్లు పొడిచింది. ‘‘ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను చేర్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు ఆపరేషన్ల సౌకర్యం కల్పిస్తాం.’ అని మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు కల్ల»ొల్లి మాటలతో ప్రజలను వంచించారు. 2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వం రోగాల సంఖ్యను ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చి 1,059కి అంటే కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి ఉండేది. 108 ఊపిరి తీశారు 108, 104 సేవలను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీని బాబు పట్టించుకోలేదు. సంచార వైద్యవాహనాల నిర్వహణను గాలికి వదిలేశారు. ఒక్క కొత్త వాహనమూ కొనుగోలు చేయలేదు. ఫలితంగా అత్యవసర సమయంలో వైద్యం అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 679 మండలాలు ఉంటే కేవలం 336 అంబులెన్సులు (108) మాత్రమే ఉండేవి. అంటే మండలానికి ఒక్క సంచార వాహనం కూడా లేని దుస్థితి ఉండేది. కేవలం 292 ‘104’ మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వాహనాలు ఉండేవి. తూతూ మంత్రంగా పోస్టుల భర్తీ వైద్య శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని 2014 మేనిఫెస్టోలో ప్రకటించిన టీడీపీ 2014–19 మధ్య పట్టుమని 10 వేల పోస్టులు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు. ఆ ఐదేళ్లలో వైద్య శాఖలో కేవలం 4,469 పోస్టులు భర్తీ చేశారు. ఆస్పత్రుల్లో పెరిగిన జనాభా అవసరాలకు తగ్గట్టుగా వైద్యులు, సిబ్బంది లేరని సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా అవి బుట్టదాఖలే అయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క మెడికల్ ఆఫీసర్ మాత్రమే అందుబాటులో ఉండేవారు. దీంతో ఆ ఒక్క డాక్టర్ సెలవుపై వెళితే అక్కడ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. మందులు కావాలంటే బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. నిమ్స్ స్థాయి ఆస్పత్రుల ఊసే లేదు అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (నిమ్స్ స్థాయి) నిర్మిస్తామని హామీ ఇచ్చిన బాబు గద్దెనెక్కాక ఆ ఊసే ఎత్తలేదు. 2014లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఎటువంటి చొరవా చూపలేదు. ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించి తన అనుయాయుల జేబులు నింపడానికి బాబు పెద్ద పీట వేశారు. దీంతో వైద్య విద్యను అభ్యసించాలన్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. వైఎస్ జగన్ పాలనలో.. ఆరోగ్యశ్రీకి పునరుజ్జీవం టీడీపీ ప్రభుత్వంలో పూర్తిగా కునారిల్లిన ఆరోగ్యశ్రీ పథకానికి 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరుజ్జీవం పోసింది. కేవలం 1,059గా ఉన్న రోగాల సంఖ్యను 3,257కు పెంచింది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది. చికిత్స వ్యయం పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా క ల్పించింది. నెట్వర్క్ ఆస్పత్రులను విస్తృతంగా పెంచింది. అన్ని ఆస్పత్రుల్లో చేరిన వెంటనే వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టింది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్టు కేర్ తరఫున ఉద్యోగులను నియమించింది. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేసింది. రూ.16,852 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేసింది. నెలకు రెండుసార్లు గ్రామాలకు వైద్యులు వెళ్లేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్వో ప్రమాణాలు కలిగిన 105 రకాల మందులు ఉచితంగా అందిస్తోంది. సంచార వైద్యానికి ప్రాధాన్యం 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సంచార వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి పల్లెకు వైద్య వాహనాలు వెళ్లేలా చర్యలు చేపట్టింది. 679 మండలాలు ఉంటే 689 వాహనాలు(108) సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రవేశపెట్టి మొత్తం 910 ( 104) కొత్త వాహనాలు కొనుగోలు చేసింది. 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్లు కొన్నారు. అంబులెన్స్ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు, వీటి నిర్వహణ ఏటా రూ.188 కోట్ల ఖర్చుచేస్తున్నారు. జిల్లాకు ఓ వైద్య కళాశాల వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఓ వైద్యకళాశాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఒకేసారి ఏకంగా 17 కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించింది. మచిలీపట్నం, ఏలూరు తదితర చోట్ల ఐదు నిర్మాణాలు పూర్తి చేసి ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులూ ప్రారంభించింది. మరో ఐదు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, విలేజ్ హెల్త్ క్లినిక్ల బలోపేతం, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆరోగ్యాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది. -
పేదింటి ఆరోగ్యమే రాష్ట్ర సౌభాగ్యం
ఒక ఇంటి ఆరోగ్యం వల్ల సమాజమే ఆరోగ్యవంతమవుతుంది. సమాజం బాగుంటే రాష్ట్రం సౌభాగ్యవంతమవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ బృహత్తర ఆలోచనే సీఎం జగన్ను వైద్య రంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేలా చేయించింది. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న లక్ష్యంతో వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలను రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అందిస్తున్నారు. రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ఆరోగ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇదే బాటలో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ చాలినన్ని మందులు, వైద్య పరీక్షలు, సరిపడా వైద్య సిబ్బందితో ఆత్మీయంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా పొందే అద్భుత వరాన్ని సీఎం జగన్ మాత్రమే అందిస్తున్నారు. అందుకే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దేశంలో సగటున కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగటున బెడ్ చార్జీ రూ.50 వేల పైమాటే. అంత సొమ్ము వెచ్చించి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్యం పొందాలంటే సాధ్యమయ్యే పనేనా? కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏకంగా రూ.25 లక్షల వరకు ప్రభుత్వం వైద్య ఖర్చు భరిస్తోంది. దేశంలో సగటున బెడ్ ఛార్జ్ రూ.50 వేలు అవుతుందనే అంశాన్ని ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ ర్యాకింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) ఓ అధ్యయనంలో వెల్లడించింది. తొమ్మిది ప్రముఖ చైన్ ఆస్పత్రుల్లో రెవెన్యూపై ఐసీఆర్ఏ అధ్యయనం చేపట్టింది. ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు జబ్బు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోవాలంటే అప్పులపాలవ్వక తప్పదు. అప్పులు పుట్టని పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఏపీలో పేద, మధ్య తరగతి కుటుంబాలను సీఎం జగన్ ప్రభుత్వం కొండంత అండగా ఉంటోంది. ఈ వర్గాలు వైద్య పరంగా ఏ ఇబ్బంది ఎదుర్కోకుండా వారి ఆరోగ్యాలకు భరోసాగా ఉంటోంది. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేసినా ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో, అటు ప్రైవేట్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించి బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా కాపాడుతోంది. టెరిషరీ కేర్ అభివృద్ధితో రెట్టింపు భరోసా ఓ వైపు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్య భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసే కార్యక్రమాన్నీ సీఎం జగన్ చేపట్టారు. వైద్య రంగంలో కీలకమైన టెరిషరీ కేర్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెరిషరీ కేర్లో పేదలకు ఆధారమైన పెద్దాస్పత్రుల్లో మానవ వనరులను పూర్తి స్థాయిలో సమకూర్చడంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తూ రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో అప్పటి వరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు ఉన్న చోట నిపుణులైన వైద్యులతో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో బోధనాస్పత్రిలో 600 వరకూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 10 చోట్ల కొత్తగా బోధనాస్పత్రులు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగిలిన ఏడు చోట్ల వచ్చే ఏడాది బోధనాస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు చేరువ అవుతున్నాయి. 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ‘రక్ష’ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో ఏకంగా 95 శాతం కుటుంబాలకు సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటికి పథకం రక్షణగా నిలుస్తోంది. ఏకంగా రూ.25 లక్షల వరకూ విలువైన వైద్య సేవలను పూర్తి ఉచితంగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. రాష్ట్రంతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని 2,331 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 3,257 ప్రొసీజర్లలో లబ్దిదారులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అన్ని రకాల క్యాన్సర్లతో పాటు, గుండె మార్పిడి, కార్డియాలజీ, న్యూరో సంబంధిత ఖరీదైన చికిత్సలన్ని పథకం పరిధిలో ఉంటున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ 44,78,319 మందికి ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందించింది. ఇక్కడితో ఆగకుండా చికిత్స అనంతరం బాధితులకు అండగా నిలుస్తూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతి రూపంలో ఆర్థికంగా చేయూతగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ 23 లక్షల మంది రోగులకు ఏకంగా రూ.1366 కోట్ల మేర సాయాన్ని అందించారు. గతంలో ఎన్నడూ ఎక్కడా లేనంతగా లబ్ధి ప్రస్తుతం నిరుపేద, సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే సాధ్యపడని పరిస్థితి. దురదృష్టవశాత్తూ క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బుల బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో డబ్బు కట్టాల్సిందే. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించి ప్రజలకు భరోసాగా నిలవడం శుభపరిణామం. గతంలో కేవలం రేషన్ కార్డులు ఉన్న వాళ్లు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేవారు. రేషన్ కార్డు లేని మధ్యతరగతి కుటుంబాలు వైద్యానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకూ ఉచితంగా వైద్యం లభించడం గొప్ప మార్పు. – డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
5 లక్షల ప్రమాద బీమా.. 10 లక్షల ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఉబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ లాంటి యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, బాయ్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లినప్పుడు కుక్క తరమడంతో కంగారులో భవనం పైనుంచి పడి మరణించిన ఓ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యాబ్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలో ఓ యాప్ను టీ–హబ్ ద్వారా సిద్ధం చేసి అవకాశం ఉన్న వారికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్గాంధీ తెలంగాణలో పర్యటించినప్పుడు నవంబర్ 27న కొందరు ఫుడ్ డెలివరీ బాయ్లతో భేటీ కావడం తెలిసిందే. అప్పుడు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తిని ఈ మేరకు ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఓలా, ఉబర్ ద్వారా పనిచేసే ఆటో డ్రైవర్లతోపాటు క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్ల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న బాయ్లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆయా సంస్థల్లో పనిచేస్తూ రక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని... ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్తాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంతకంటే మెరుగైన విధంగా చట్టం తయారీకి బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టని సంస్థలపై చర్యలు.. ‘సంస్థలు కూడా లాభాపేక్ష మాత్రమే చూడకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. సిబ్బంది సంక్షేమాన్ని విస్మరించే ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. నాలుగు నెలల క్రితం ఓ స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పైనుంచి పడి మృతి చెందాడు. అప్పటి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతుందేమోనని చూశా. కానీ ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి మృతుని కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభల్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లకు సీఎం సూచించారు. డిజిటల్, మాన్యువల్ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆటోవాలాలు ఆందోళన పడొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటోవాలాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆటోవాలాలతోనూ త్వరలో చర్చించి వారికి ఇబ్బంది లేని రీతిలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్యాబ్, ఫుడ్ డెలివరీ బాయ్స్తో సమావేశం అనంతరం పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం వల్ల ఆటోవాలాల ఉపాధి పడిపోదని, బస్సులు దిగాక ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులు మళ్లీ ఆటోలనే కదా ఆశ్రయించాల్సిందని అన్నారు. -
ఉద్దానానికి ఊపిరి
పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు.. దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఇక్కడెన్నో.. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు అడుగడుగునా కనిపిస్తారు. ఇక్కడ మనుషులకు కన్నీరు శాశ్వత నేస్తం. ఈ ఊళ్లకు ఉమ్మడి ఆస్తి కష్టం. ఈ కిడ్నీ వ్యాధి ఊళ్లకు ఊళ్లను తినేసింది. పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతాం, అప్పులు చేసి అనే వైరాగ్య పరిస్థితికి ఇక్కడి బాధితులు వెళ్లిపోయారు. నెలనెలా వేలకు వేలు ఖర్చుపెట్టి వైద్య పరీక్షలు, కిడ్నీ వైద్యం చేయించుకోలేక స్థానికంగా దొరికే మందు బిళ్లలో, ఆకులతోనో సరిపెట్టుకునేవారు. ఇది నిన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ చీకటి బతుకులకు సీఎం వైఎస్ జగన్ చరమగీతం పాడుతున్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు.. మూడు దశాబ్దాల సమస్యకు చెక్ చెబుతూ శాశ్వత పరిష్కారం చూపారు. రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, రూ.85 కోట్లతో 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఈ రెండింటినీ ప్రారంభించే మహోన్నత ఘట్టాన్ని గురువారం సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి/వజ్రపుకొత్తూరు రూరల్/వజ్రపుకొత్తూరు/మందస: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే 15వేల మంది చనిపోయినట్లు అంచనా. ఒక అంచనా ప్రకారం.. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ బారినపడి విలవిల్లాడుతున్నాయి. సాధారణంగా రక్తంలో సీరం క్రియాటిన్ 1.2 మిల్లీగ్రామ్/డెసీలీటర్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సరిగా పనిచేయడంలేదని అర్థం. కానీ, ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటిన్ లెవెల్స్ చాలామందిలో 25 మిల్లీగ్రామ్/డెసీలీటర్ మేరకు ఉంది. క్రియాటినిన్ 5 దాటితే డయాలసిస్ తప్పనిసరి. ఇటువంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. వీరంతా విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. వారానికి రెండుసార్లు కూడా వెళ్లేవారున్నారు. ఇలా రోజుకు 500కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రవాణా, వైద్య ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ఎంతోమంది డబ్బుల్లేక, వైద్యం చేసుకోలేక ప్రాణాలను కోల్పోయేవారు. మరోవైపు.. ఈ మహమ్మారిని పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. ఇలాంటి ఆపత్కాలంలో ప్రతిపక్షనేత హోదాలో జగన్ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చే కబురు చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆపన్నహస్తం అందిస్తున్నారు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు నెలనెలా చేతిలో రూ.10వేలు పెడుతున్నారు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానానికి తీసుకొచ్చారు. తగ్గిపోతున్న ఉద్దానం ఆయష్షు రేఖకు ఊపిరిలూదుతున్నారు. అంతేకాదు.. రూ. వందల కోట్లతో మంచినీటి ప్రాజెక్టును.. కిడ్నీ పరిశోధనా ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. గతమంతా పరిశోధనలకే పరిమితం.. నిజానికి.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలో కన్పించాయి. కానీ, 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ కవిటి ప్రాంతంలో కిడ్నీవ్యా««ధి కేసులను గుర్తించారు. 2002 నుంచి వారే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందనే అంశంపై పరిశోధన ప్రారంభించారు. ♦ 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేజీహెచ్ హెచ్ఓడీ డాక్టర్ రవిరాజ్తో కవిటి ప్రాంతంలో పరిశోధన వైద్య శిబిరాలు ప్రారంభించారు. ♦ 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ ఆర్ఎంఓ శేషాద్రి ఉద్దానంలో పర్యటించారు. అదే ఏడాది నాటి రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ఇక్కడ నీటి నమూనాలను తీసుకెళ్లింది. ♦ 2009లో న్యూయార్క్కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఈ ప్రాంతంలో పర్యటించి రోగుల ఆహార అలవాట్లు, నీరు, రక్తం తదితర నమూనాలను పరిశోధనకు తీసుకెళ్లారు. ♦ 2011లో డాక్టర్ రవిరాజ్, డాక్టర్ వెలగల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్చక్రవర్తి, ఎ.వేణుగోపాల్ అనే నెఫ్రాలజీ నిపుణుల బృందం ఉద్దానం ఎండోమిక్ నెఫ్రోపతి (యూఈఎన్) పేరిట ఓ అధ్యయనం చేసింది. ♦ 2011లో న్యూయార్క్కు చెందిన స్టోనీబ్రూక్స్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ అనూప్ గంగూలీ, డాక్టర్ నీల్ ఓలిక్ల నేతృత్వంలో ఓ బృందం వివిధ గ్రామాల ఆహారపు అలవాట్లు తెలుసుకుని రక్త, మూత్ర నమూనాలు తీసుకెళ్లింది. ♦ 2011లో హైదరాబాద్కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్ఆర్ సుజాత ఈ ప్రాంతంలో నీటిని తీసుకెళ్లి దాని ద్వారా ఏఏ మార్పులు వస్తున్నాయో పరిశీలించారు. ♦ ఆ తర్వాత 2012లో జపాన్ బృందం, అమెరికన్ల బృందం పర్యటించింది. ♦ 2012 అక్టోబరు 1న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికల్ డిసీజెస్ బృందం పరిశీలించింది. 2013లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పోతురాజు అనే రీసెర్చ్ స్కాలర్ పరిశోధన చేశారు. ♦ 2017 నుంచి భారతీయ వైద్య పరిశోధనా మండలి డాక్టర్ వివేక్ ఝా నేతృత్వంలో ప్రస్తుతం పరిశోధన సాగుతోంది. ♦ అయితే, ఇప్పటివరకు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఇక్కడి కిడ్నీ వ్యాధులకు కచ్చితమైన మూలకారణాన్ని గుర్తించలేకపోయారు. ♦ కొన్ని అధ్యయనాలు ఈ వ్యాధి నీటిలో అధిక సెలీనియం లేదా సీసం కారణంగా ఉండవచ్చని అనుమానించాయి. మరికొందరు దీనికి నేల స్వభావమే కారణమై ఉండొచ్చని నివేదించారు. ఉష్ణోగ్రత, తక్కువ నీటి వినియోగం, అధిక పెయిన్ కిల్లర్స్ వాడకం, జన్యుపరమైన లోపాలు కూడా వ్యాధికి కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కానీ, ఈ అధ్యయనాలు ఏవీ సరైన స్పష్టత ఇవ్వలేకపోయాయి. ♦ మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టీఆర్ఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో 2019లో సంయుక్తంగా సమగ్ర పరిశోధనలు నిర్వహించి వ్యాధిని గుర్తించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. కిడ్నీ బాధితులపై ఆగ్రహంతోఊగిపోయిన బాబు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించి పట్టించుకోలేదు. తిత్లీ తుపాను సమయంలో మొక్కుబడిగా పర్యటించినప్పటికీ వారికెలాంటి భరోసా ఇవ్వలేదు సరికదా.. తుపానుతో సర్వం కోల్పోయిన బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు వస్తే ఆగ్రహంతో ఊగిపోయారు.‘నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది.. నాకు అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కేస్తా.. తొక్కతీస్తా.. తోలు తీస్తా’ అని వ్యాఖ్యానించారు. కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. డ్రామాలకే పవన్ పరిమితం.. ఇక పవన్కళ్యాణ్ అయితే 2017లో దీక్ష పేరుతో పెద్ద డ్రామా ఆడారు. టీడీపీతో కలిసి ఐదేళ్లు చెట్టాపట్టాలు వేసుకున్నా దానికొక పరిష్కారం చూపలేదు. ఎవరైనా అడిగితే.. అంతా తానే చేశానని, కిడ్నీ బాధల నుంచి విముక్తి కల్పిస్తానని హడావుడి చేయడం తప్ప నిజానికి ఆయన చేసిందేమీ లేదు. కిడ్నీ బాధితులకు ఇది పెద్ద ఊరట ఉద్దానంలో కిడ్నీ బాధితులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెద్ద ఊరట కలిగిస్తుంది. వీరికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుచేయడంతోపాటు వంశధార నది నుంచి మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టడం, అది కూడా హామీ ఇ చ్చిన ఐదేళ్లలో పనులు పూర్తిచేయడం చరిత్రాత్మకం. ఆస్పత్రి పరంగా మూలాల శోధనకు ప్రాధాన్యత ఇవ్వడం, పరిశోధనతోనే కిడ్నీ ఇబ్బందులకు పరిష్కారం దొరుకుతుంది. – డాక్టర్ ప్రధాన శివాజీ, రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు, సోంపేట వైఎస్ జగన్ సీఎం అయ్యాక తీసుకున్న చర్యలు వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు. అప్పటివరకు రూ.3,500 ఉన్న పింఛన్ను రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తున్నారు. 5కు పైబడి సీరం క్రియాటిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.10వేలు చొప్పున 792 మందికి.. రూ.5 వేలు చొప్పున 451 మందికి పింఛన్లు ఇస్తున్నారు. అవసరమైతే ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ♦ ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. ♦ సోంపేట సీహెచ్సీ డయాలసిస్ సెంటర్లో 13 పడకలుండేవి. వాటిని 21కి పెంచారు. ♦ కవిటి సీహెచ్సీ డయాలసిస్ సెంటర్లో 10 పడకలు ఉండగా, 19కి పెంచారు. ♦ హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేశారు. రెండు కంటైన్డ్ బేస్డ్ సర్విసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటుచేశారు. ♦ ఇవికాక.. కొత్తగా గోవిందపురం, కంచిలి, అక్కుపల్లి, బెలగాంలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ♦ ఇచ్ఛాపురం సీహెచ్సీ, కంచిలి పీహెచ్సీలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి చ్చింది. ♦ టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ♦ కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్లలో అందుబాటులో ఉంచారు. ♦ కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా మరణాలను నియంత్రించేందుకు నిరంతర స్క్రీనింగ్ను ప్రభుత్వం చేపడుతోంది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లకు ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించారు. ఇప్పటివరకూ ఉద్దానం ప్రాంతంలోని 2.32లక్షల మందిని స్క్రీన్ చేయగా 19,532 మందిలో సీరమ్ క్రియాటిన్ 1.5 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ వైద్య సాయం అందించారు. ♦ టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్లోనెఫ్రాలజీ విభాగం ఏర్పాటుచేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్సీకి వెళ్లి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ♦ కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలో అందించడం కోసం రూ.85 కోట్ల అంచనాలతో పలాసాలో రీసెర్చ్ సెంటర్తోపాటు 200 పడకలతో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో రూ.60 కోట్లు ఆస్పత్రి నిర్మాణానికి, రూ.25 కోట్లు అధునాతన వైద్య పరికరాలు, ఇతర వనరుల కల్పనకు కేటాయించారు. రూ.742కోట్లతో భారీ రక్షిత మంచినీటి పథకం ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో నిపుణుల సూచనల మేరకు వంశధార నదీ జలాలను భూ ఉపరితల తాగునీరుగా అందించేందుకు రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ మంజూరు చేశారు. దీనికింద ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని 807 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ఈ మంచినీటి పథకానికి 2019 సెపె్టంబరు 6న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో ఒక్కొక్కరికి రోజుకు వందలీటర్ల చొప్పున అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. భవిష్యత్లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లోని 170 గ్రామాలకు కూడా ఈ పైపులైన్ ద్వారా అదనంగా తాగునీరు అందించే వీలుగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. నిజానికి.. ఉద్దానం సమీపంలో ఉన్న బాహుదా, మహేంద్రతనయ నదుల నుంచి తక్కువ ఖర్చుతోనే రక్షితనీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతే ఇక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదన్న భావనతో జగన్ సర్కార్ ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కనపెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా ఈ ప్రాంతానికి 104 కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు పూనుకుంది. ఈ ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. హిరమండలం రిజర్వాయర్లో కనీస నీటిమట్టం స్థాయిలోను 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుంచి మూడు భారీ మోటార్ల ద్వారా 32 కిలోమీటర్ల దూరంలోని మెలియాపుట్టి మండల కేంద్రం వద్దకు చేరుతుంది. అక్కడ నీటిని శుద్ధిచేసి ఉద్దానానికి సరఫరా చేస్తారు. ఇదీ కిడ్నీ పరిశోధనా కేంద్రం స్వరూపం.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ♦ ఇందులో.. మొదటి అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో ఓపీ విభాగం, రీనల్ ల్యాబ్, పాలనా విభాగం, మీటింగ్ హాల్, మెడిసిన్ స్టోర్సు ఉన్నాయి. ♦ రెండో అంతస్తులో నెఫ్రాలజీ విభాగం, పేమెంట్ రూములు, కీలకమైన డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ♦ మూడో అంతస్తులో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, సీఎస్ఎస్ డి, అదనపు వసతులతో ఉన్న పే రూములు, ప్రీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసోలేషన్ గది, బ్లడ్ బ్యాంకు ఉన్నాయి ♦ నాలుగో అంతస్తులో యూరాలజీ వార్డు, పే రూములు, రీసెర్చ్ లేబొరేటరీలు ఏర్పాటుచేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు.. ఈ కేంద్రంలో అందించే వైద్యసేవల్ని పరిశీలిస్తే యూరాలజీ, రేడియాలజీ, ఎనస్తీషియా, నెఫ్రాలజీ, వ్యాస్కులర్ సర్జన్, పల్మనాలజీ, కార్డియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ లాంటి సూపర్ స్పెషాలిటీస్ సేవలు.. జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ సేవలు అందిస్తారు. ఈ ఆస్పత్రిలో 41 మంది సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు కలిపి 154 పోస్టులను కొత్తగా మంజూరు చేసి భర్తీ చేపట్టారు. మరోవైపు.. ఇందులో ప్రపంచస్థాయి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంచేసింది. గత 20 రోజులుగా వీటితో ఇప్పటికే రోగులకు చికిత్స చేస్తున్నారు. ఎక్స్రే (300ఎంఎ), సిటీస్కాన్, అల్ట్రా సౌండ్ మెషిన్, ఆటోమెటిక్ టిష్యూ ప్రాసెసర్, క్రయోస్టాట్, ఆటోమేటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్, సి–ఆర్మ్ మిషన్, ఈఎస్డబ్ల్యూ మిషన్, ఆటోమేటిక్ ఓటి టేబుల్స్, –80 నుంచి –40 సెంటీగ్రేడ్ల డీప్ ఫ్రీజర్లు, వెంటిలేటర్లు ఇప్పటికే సిద్ధంచేశారు. జీవితంపై ఆశ కలిగింది.. కూలీ పనిచేసే నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారినపడ్డాను. అప్పట్లో సరైన వైద్యం అందక డయాలసిస్ కోసం మరొకరి సాయంతో విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. బోలెడంత డబ్బు ఖర్చేయ్యేది. ఇక్కడ సరైన వైద్య సదుపాయాల్లేక మా కళ్ల ముందే మా స్నేహితులు, బంధువులు ఎందరో మృత్యువాత పడ్డారు. ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన దయవల్ల ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ అందుకుంటున్నాను. విశాఖకు వెళ్లే పని తప్పింది. పలాసలోనే డయాలసిస్, మందులు అందుతున్నాయి. పెద్ద ఆసుపత్రిని కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు జీవితంపై ఆశ కలుగుతోంది. సీఎంకు ఉద్దానం వాసులంతా రుణపడి ఉంటారు. – గేదెల కోదండరావు, చినడోకులపాడు గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వం మాలాంటి వారికి ప్రాణం పోస్తోంది చికిత్స కోసం నాకు లక్షల రూపాయలు ఖర్చేయ్యేవి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. 108 అంబులెన్స్లో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి, డయాలసిస్ అయ్యాక మళ్లీ ఇంటి వద్ద దిగబెడుతున్నారు. రూ.10వేలు పింఛను కూడా అందుతోంది. పౌష్టికాహారం, పండ్లు, మందులు కొనడానికి ప్రభుత్వం సహకరిస్తోంది. నాలాంటి ఎంతోమందికి జగన్ ప్రభుత్వం ప్రాణం పోస్తోంది. – నర్తు సీతారాం, లోహరిబంద, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ఇంటింటికీ కుళాయి ఇచ్చారు..జగనన్న చల్లగా ఉండాలి మా ప్రాంత వాసుల కష్టాల తీర్చేందుకు.. కిడ్నీ మహమ్మారి బారినపడిన ఉద్దానం వాసుల్ని రక్షించేందుకు జగనన్న మంజూరు చేసిన వైఎస్సార్ సుజలధార ప్రారంభానికి సిద్ధమయ్యిందనే విషయం తెలియగానే చాలా ఆనందం అనిపించింది. రోజూ కిడ్నీ వ్యాధులకు భయపడి 20 లీటర్ల క్యాన్లను కొనుగోలు చేస్తున్నాం. జగనన్న దయవల్ల ఇంటింటికీ కుళాయిలను ఇప్పటికే అమర్చారు. మా ప్రాంత వాసుల కష్టాలు తీరుస్తున్న జగనన్న చల్లగా ఉండాలి. – కర్ని సుహాసిని, గృహిణి, అమలపాడు, వజ్రపుకొత్తూరు మండలం -
చిట్టి గుండెకు గట్టి భరోసా
‘‘ముక్కుపచ్చలారని ఏ చిన్నారి కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడకూడదు. వ్యాధిబారిన పడ్డ నా బిడ్డను కాపాడుకోలేకపోయాననే వేదన ఏ ఒక్కరూ పడకూడదు. ఇందుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించాలి. ఆ బాధ్యత నాది’’.. .. అంటూ చిన్నపిల్లల గుండె సంబంధిత చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి వివిధ ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్య సహాయం అందించేలా దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కృషిచేశారు. 2003లో ఆయన చెప్పిన ఈ మాటలను కార్యరూపం దాల్చేలా 2004లో నిర్ణయం తీసుకుని పసిగుండెలకు సాంత్వన చేకూర్చారు. ఇప్పుడాయన వారసుడిగా సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి చిన్నపిల్లల గుండె సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ ఆస్పత్రినే నిర్మించాలని సంకల్పించారు. మరెక్కడా ఇలాంటి సమస్యల కోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రి లేకపోవడంతో చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీనికి బీజం వేశారు. అనుకున్నట్లుగానే అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తిరుపతిలో విజయవంతంగా అంకురార్పణ చేశారు. (వడ్డే బాలశేఖర్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం నుంచి సాక్షి ప్రతినిధి) వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చీరాగానే సీఎం వైఎస్ జగన్ ప్రజారోగ్య వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు పెట్టించారు. పిల్లలకు ప్రభుత్వరంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల బలోపేతంపైనా దృష్టిసారించారు. ఇందులో భాగంగా టీటీడీ సహకారంతో తిరుపతిలో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా శ్రీపద్మావతి హృదయాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు పిల్లల గుండె చికిత్స కోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు వెళ్లే పనిలేకుండా పోయింది. 1,980 మంది చిన్నారులకు పునర్జన్మ ఇక ఈ రెండేళ్లలో 14,800 ఓపీ సేవలు ఈ ఆస్పత్రిలో నమోదయ్యాయి. వీరిలో పుట్టుకతో వచ్చిన గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఓపెన్ హార్ట్, కీ హోల్, వంటి ఇతర సర్జరీలు పెద్దఎత్తున నిర్వహించారు. మరికొందరికి మెడికల్ మేనేజ్మెంట్ చేశారు. ఇలా 1,980 మందికి పైగా చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించారు. వీరిలో మెజారిటీ శాతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారే. ఆరోగ్యశ్రీ కింద వీరికి పూర్తి ఉచితంగా వైద్యసేవలన్నింటినీ అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ కింద 2,052 ప్రొసీజర్లు రెండేళ్లలో నమోదయ్యాయి. చిన్నారులతో పాటు, పెద్దలకు సైతం గుండె మార్పిడి ఆపరేషన్లను చేపట్టారు. ఇప్పటివరకూ ఏడు గుండె మార్పిడి ఆపరేషన్లు ఇక్కడ నిర్వహించారు. ఒక్కో ఆపరేషన్కు రూ.10 లక్షల వరకూ ఖర్చుకాగా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. గుండె మార్పిడి, ఇతర చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ కింద కూడా అదనంగా సహాయం అందింది. 75 పడకలున్న ఈ ఆస్పత్రిలో 15 మంది నిష్ణాతులైన వైద్యులు సేవలు అందిస్తున్నారు. అడ్వాన్స్ క్యాథ్ల్యాబ్, మెడికల్ ల్యాబ్, ఎక్స్రే, ఈసీజీ పరికరాలతో పాటు, ఆపరేషన్ థియేటర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆసుపత్రికి తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి సులభంగా ఆటోలో వెళ్లొచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆధార్, ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే.. బాధితులతో వచ్చే అటెండర్లలో ఒకరు ఇక్కడ ఉండొచ్చు. ఇక ఈ ఆసుపత్రి ఇటీవలే ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్గా గుర్తింపు పొందింది. ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా సంస్థ ప్రైడ్ ఆఫ్ నేషన్గా ఈ అవార్డును ప్రకటించగా తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్ డా.శ్రీనాథరెడ్డి దానిని అందుకున్నారు. త్వరలో మరో సూపర్ స్పెషాలిటీ.. మరోవైపు.. తిరుపతి జిల్లా అలిపిరి వద్ద శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల వ్యయంతో, అత్యాధునిక ప్రమాణాలతో దీనిని ఏర్పాటుచేస్తున్నారు. హెమటో ఆంకాలజి, మెడికల్ ఆంకాలజి, సర్జికల్ ఆంకాలజి, న్యూరాలజి, కార్డియాలజీ, నెఫ్రాలాజి, గ్యాస్ట్రో ఎంట్రాలజి లాంటి 15 రకాల సూపర్స్పెషాలిటీ విభాగాల్లో చిన్నారులకు వైద్యసేవలు, చికిత్సలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇదే తరహాలో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లోను పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల వైద్యశాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఫొటోలోని సుర్ల శివ, పార్వతి దంపతులది పార్వతిపురం మన్యం జిల్లా నర్సిపురం. ఎనిమిది నెలల క్రితం వీరికొక కొడుకు ప్రన్షు పుట్టాడు. చిన్నారికి ఆరోగ్యం బాగోకపోవడంతో విశాఖలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారి గుండెలో రంధ్రంతో పాటు.. చెడు, మంచి రక్తం కలుస్తున్నాయని వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. ఆపరేషన్కు రూ.25 లక్షలు ఖర్చవుతుందన్నారు. అంత స్థోమత ఆ దంపతులకు లేదు. అదే సమయంలో తిరుపతిలో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చికిత్స గురించి తెలిసిన వాళ్లు చెప్పారు. వెంటనే అక్కడ తీసుకెళ్లగా చిన్నారికి పరీక్షలు చేసి ఒక్కరూపాయి కూడా ఖర్చుకాకుండా ఆరోగ్యశ్రీ కింద స్టెంట్లు వేశారు. చిన్నారి కోలుకుని బరువు పెరిగాక గుండె రంధ్రానికి కూడా ఇక్కడే ఉచితంగా ఆపరేషన్ చేయనున్నారు. ‘ఇక నాకు పిల్లలు పుట్టే అవకాశంలేదు. బాబుకు ఏదైనా జరిగితే ఎలా అని నేను ఏడవని రోజులేదు. ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడంటే అది ఒక్క సీఎం జగన్ వల్లే’.. అంటూ పార్వతి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది. ఈ ఫొటోలోని అన్నమయ్య జిల్లా మంగపట్నంకు చెందిన గంగాదేవి వ్యవసాయ కూలీ. మంచం మీద నిద్రపోతున్న చిన్నారి ఈమె కుమారుడు.. పేరు దేవాన్‡్ష. ముగ్గురు ఆడపిల్లల అనంతరం కలిగిన మగ సంతానం. అయితే, పుట్టుకతోనే గుండె సమస్య వచ్చిపడింది. రెక్కాడితే కానీ డొక్కాడని వీరికి ఆపరేషన్ చేయించే స్థోమతలేదు. గంగాదేవి కుమారుడి ప్రాణాలను ఆరోగ్యశ్రీ, హృదయాలయం రూపంలో ప్రభుత్వం ఆదుకుంది. తాముంటున్న ప్రాంతానికి కొద్దిదూరంలోని తిరుపతిలో ఆపరేషన్ చేస్తున్నారని తెలిసి బాబును ఇక్కడికి తీసుకొచ్చింది. ఏ సిఫార్సు, చేతి నుంచి ఒక్క రూపాయి ఖర్చులేకుండా చిన్నారికి ఆపరేషన్ పూర్తయింది. ‘కుటుంబ పోషణే భారమైన మాకు కొడుకు ఆరోగ్య సమస్యతో పెద్ద చిక్కొచ్చి పడింది. కానీ, కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నా బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేయించింది’.. అని అంటున్న గంగాదేవి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ..ఈ ఇద్దరు చిన్నారుల తరహాలోనే పుట్టుకతో తీవ్రమైన గుండె సమస్యలున్న వందల మంది చిన్నారులకు శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం అక్కున చేర్చుకుని పునర్జన్మను ప్రసాదించింది. 11 అక్టోబరు 2021 అక్టోబరు 11న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మానసపుత్రికను ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోంది. విజయవంతంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తూ అభాగ్యుల పాలిట వరంగా నిలుస్తున్న హృదయాలయాన్ని ‘సాక్షి’ పరిశీలించి రోగుల కుటుంబాలను పలకరిస్తే.. ఒకొక్కరిదీ ఓ కన్నీటి గాధ ఆవిష్కృతమైంది. సీఎం జగన్ నాకు పునర్జన్మనిచ్చారు గుంటూరులో ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుంటాను. నాకు గుండె సంబంధిత సమస్యలుండటంతో హైదరాబాద్, గుంటూరు ఇలా చాలాచోట్ల చూపించుకున్నా. గుండె మార్పిడి చేయాలన్నారు. గతనెల 24న గుండె మార్పిడి చేశారు. ఈ ఆపరేషన్కు రూ.10 లక్షల పైనే ఖర్చవుతుందన్నారు. అయితే, నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చుకాలేదు. మొత్తం ప్రభుత్వమే భరించింది. సీఎం జగన్ నాకు పునర్జన్మ ప్రసాదించారు. – ఎస్. సుమతి, వెల్దుర్తి, పల్నాడు జిల్లా నెలకు 120 సర్జరీలు..మొదట్లో ఇక్కడ నెలకు 30 ఆపరేషన్ల వరకూ చేసేవాళ్లం. ప్రస్తుతం నెలకు 100 నుంచి 120 చేస్తున్నాం. పెద్దల్లో కూడా పుట్టుకతో వచ్చిన స్ట్రక్చరల్ గుండె సమస్యలతో పాటు, గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నాం. 15 మంది నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలున్న ఈ తరహా ఆస్పత్రి ప్రైవేట్లో కూడా ఎక్కడా ఉండదు. ఆస్పత్రి నిర్వహణ కోసం టీటీడీ పుష్కలంగా నిధులు అందిస్తోంది. ఇక పేద ప్రజలకు ఉచితంగా చికిత్సలు చేయడానికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రూపంలో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. త్వరలో అలిపిరిలో పీడియాట్రిక్ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి కూడా అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ శ్రీనాథరెడ్డి, డైరెక్టర్, శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం -
ఏపీయే స్ఫూర్తి.. దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఏపీ తరహాలోనే దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. పశు పోషకులకు నాణ్యమైన బ్రాండెడ్ మందులను కారుచౌకగా అందించడం ద్వారా వా రికి ఆర్థిక భారం తగ్గించడం, మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అన్ని ప్రాథమిక పశు వైద్యశాలలు, పాలిక్లినిక్స్, డిస్పెన్సరీ ప్రాంగణాల్లో ఈ వైఎస్సార్ జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సంకల్పించి జనరిక్ మందుల తయారీదారులతో పశుసంవర్ధక శాఖ అవగాహనా ఒప్పందం చేసుకుంది. విజయవాడలో తొలిసారిగా.. పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా, యూనిట్ కాస్ట్లో కేవలం 25 శాతాన్ని లబ్ది దారులు భరిస్తే చాలు.. రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీని భరిస్తోంది. వీటి ద్వారా నిర్వాహకులతో పాటు కనీసం ముగ్గురు నుంచి నలుగురికి ఉపాధి లభిస్తుంది. ఈ ఔట్లెట్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిన 70కు పైగా జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్ ధరల కంటే 35–85% తక్కు వగా ఇక్కడ లభిస్తుండడంతో పశు పోషకులతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వారి నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీరోజూ 300 మందికి పైగా వినియోగదారులు ఈ కేంద్రం సేవలను వినియో గించుకుంటుండగా, రోజుకు రూ.20 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టు విజ యవంతం కావడంతో మలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దశల వారీగా రూ.14.17 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 ప్రాథమిక పశు వైద్యశాల (పీవీసీ) ప్రాంగణాల్లో ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవల రాష్ట్రాల పశుసంవర్థక శాఖ మంత్రులతో జమ్మూకశ్మీర్లో నిర్వహించిన జాతీయ స్థాయి పశుసంవర్ధక శాఖ వర్కుషాపులో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్లు ఏపీలో సీఎం జగన్ ఆలోచనల మేరకు పశుపోషకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు దేశంలోనే తొలిసారి జనరిక్ పశుఔషధ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. రాష్ట్రస్థాయిలో వీటిని విస్తరించేందుకు ఆర్థిక చేయూతనివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ కృషికి కేంద్ర బృందం కితాబు సదస్సులో పాల్గొన్న కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలాతో పాటు కేంద్ర అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వ కృషిని, సీఎం జగన్ చొరవను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తి తో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించడమే కాక.. ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆ యన కూడా అంగీకారం తెలిపారు. దీంతో కేంద్ర బృందం శుక్రవారం మరోసారి భేటీ అయింది. కేంద్రం ఆహ్వానంతో అమరేంద్రకుమార్ వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకం లక్ష్యాలను వివరించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో విధి విధానాల రూపకల్పనకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మలి విడతలో ఏర్పాటుచేయ తలపెట్టిన జనరిక్ పశు ఔషధ కేంద్రాలకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు అంగీకరించింది. -
‘అన్న’లకు అనారోగ్యం!
ఉద్యమం కోసం అడవుల బాట పట్టిన ‘అన్న’లకు అనారోగ్యం తీవ్రంగా బాధిస్తోంది. దశాబ్దాలుగా అడవుల్లో ఎన్నో విపత్కర పరిస్థితులు లెక్క చేయక గడిపిన ఎందరో నాయకులు ఇప్పుడు అనేక జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఓవైపు మారిన వాతావరణ పరిస్థితులు, మరోవైపు అడవుల్లో సరైన వైద్య సాయం అందక, కొన్నిసార్లు మందులకు తీవ్ర కొరతతో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. వైద్యం కోసం అడవులు వదిలితే ఎక్కడ పోలీస్ బలగాలకు చిక్కుతామన్న భయంతో తప్పని పరిస్థితుల్లో అడవుల్లోనే ఉండి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సమయంలో ఎలాగోలా బతికి బయటపడినా.. పోస్ట్ కోవిడ్ సమస్యలు ఇప్పుడు వారిని మరింతకుంగదీస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రనేత ఆర్కే అనారోగ్యంతోనే.. అనారోగ్య కారణాలతోనే మావోయిస్టు అగ్రనాయకులైన ఆర్కే, హరిభూషణ్లు సైతం మృతిచెందారు. అలాగే ఇటీవలే మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మావోయిస్టు కేంద్ర కమిటీతోపాటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారిలోనూ దాదాపు 30కి పైగా మావోయిస్టు కీలక నేతలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతంలో అరెస్టయిన మావోయిస్టు నేతలు చెబుతున్నారు. మంచానికే పరిమితమైన గణపతి? మావోయిస్టు ఉద్యమం పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటైన ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా అత్యంత కీలక నేతగా ఉన్న గణపతి వయస్సు 73కు చేరింది. బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, అల్జీమర్స్తో బాధపడుతున్న గణపతి ప్రస్తుతానికి మంచానికే పరిమితమైనట్టు విశ్వసనీయ సమాచారం. సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడు అయిన గాజర్ల రవి సైతం కీళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధ జబ్బులతో బాధపడుతున్నట్టు తెలిసింది. సెంట్రల్ కమిటీలోని రామచంద్రారెడ్డి, మొడెం బాలకృష్ణ, పోతుల కల్పన, దండాకరణ్యం స్పెషల్ జోన్ కమిటీలోని నూనె నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న వెన్ను నొప్పితో , తెలంగాణ డివిజనల్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ అధిక రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇతర కీలక నాయకులు సైతం చాలా మంది షుగర్ , బీపీ, కీళ్ల నొప్పులు ఇతర సమస్యలతో సతమతవుతున్నట్టు తెలుస్తోంది. స్థానికుల నుంచి సహకారం తగ్గుతోందా? మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గతంలో మాదిరిగా స్థానికుల నుంచి మద్దతు తగ్గుతోందనీ, అందుకే సకాలంలో మందుల రవాణా, ఇతర సహాయ సహకారాల్లో జాప్యమవుతోందన్న చర్చ నడుస్తోంది. అయితే వైద్య కోసం వచ్చే మావోయిస్టులకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే మావోయిస్టుల మరణాలు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. కటకం సుదర్శన్ మృతిపై ప్రకటన జారీ సందర్భంగా మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఇవే ఆరోపణలు చేశారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మేం చూసుకుంటామంటున్న ఖాకీలు పోలీసు అధికారుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది..అనారోగ్యంపాలైన మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్య సేవలందిస్తామని తాము బహిరంగంగా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంటున్నారు. మావోయిస్టు నాయకులు, కేడర్ లొంగిపోతున్న సందర్భాల్లో, అరెస్టుల సందర్భంగా నిర్వహించే పత్రికా సమావేశాల్లోనూ లొంగిపోతే సరైన వైద్యం అందిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సాయం చేసినా సహించలేరా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాధితులకు సాయం చేసినా ఎల్లో మీడియా సహించలేకపోతోంది! రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా నిత్యం దుష్ప్రచారాలకు తెగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి కాన్వాయ్లో వస్తుండగా అచ్చంపేట మండలం ముత్యాల గ్రామవాసి పువ్వాడ సాయి, అతడి తల్లి తమ సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. వారిని చూసిన ముఖ్యమంత్రి తన వద్దకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి పట్టించుకోకుండా బస్సులో ముందుకు వెళ్లిపోయారంటూ ఎల్లో మీడియా అబద్ధాలకు తెగించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది. నిజానికి బాధితుల సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించారు. చెయ్యి విరిగిన సాయి చికిత్స కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించడంతోపాటు ఫిజియోథెరపీ అందించాలని ఆదేశించారు. ఈ మేరకు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో అదేరోజు సాయంత్రం పువ్వాడ సాయి కుటుంబ సభ్యులకు తక్షణ సాయం రూ.లక్ష అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యాధునిక వైద్య చికిత్స అందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ సమస్యలతో ముఖ్యమంత్రి జగన్ను కలసిన మరో 21 మందికి తక్షణ సాయంగా రూ.32.50 లక్షలు ఆరి్థక సాయం అందించడంతోపాటు అవసరమైన వారికి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. దీనిపై బురద చల్లుతూ సామాజిక మాధ్యమాల్లో దు్రష్పచారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. -
నేను విన్నాను.. నేనున్నాను.. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్..
అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధ పడుతున్న పలువురికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం అందేలా ఆదేశించారు. నౌపడ సభా వేదిక నుంచి హెలిప్యాడ్కు వెళ్తున్న సమయంలో టెక్కలి మండలానికి చెందిన లాయిపండా వెంకటరావు తన కుమారుడు కార్తీక్ (9) ‘తొసిల్జుమాబ్–సోజియా’ అనే ఎముకల వ్యాధితో ఆరేళ్లుగా బాధ పడుతున్నాడని సీఎంకు చెప్పారు. వైద్య ఖర్చులకు ఇంటిని కూడా అమ్మేశానన్నారు. సీఎం స్పందిస్తూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని, తక్షణ సాయంగా రూ.5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠ్కర్ను ఆదేశించారు. వీరి విషయం ఫాలోఅప్ చేయాలని సీఎంవో కార్యదర్శి ధనంజయరెడ్డికి సూచించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండటెంబురు గ్రామానికి చెందిన అన్నపూర్ణ తన కూతురు రాజశ్రీ పుట్టకతోనే పక్షవాతం బారిన పడిన విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చలించిపోయిన సీఎం జగన్ సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. లక్షల మంజూరు చేశారు. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామానికి చెందిన అప్పారావు తన కుమారుడు దిలీప్ కుమార్ పుట్టకతోనే దివ్యాంగుడనే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన తమ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమేని సీఎం జగన్కు విన్నవించారు. దీనికి సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. 2లక్షల మంజూరు చేశారు సీఎం జగన్. విజయనగరం జిల్లా సారథికి చెందిన వంజరాపు రామ్మూర్తి కుమారుడు రవికుమార్ (33) ఊపిరితిత్తుల వ్యాధి వల్ల ఆక్సిజన్ సిలెండర్ల మీదే బతుకుతున్నాడని స్థానిక సామాజిక కార్యకర్త పాలూరి సిద్ధార్థ బాధితుని తరఫున సీఎంను కోరారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందివ్వాలని, ప్రతి నెలా రూ.10 వేలు íపింఛన్ మంజూరు చేసేలా విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించాలని సీఎంఓ కార్యదర్శి ధనంజయరెడ్డికి సూచించారు. బాధితులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Fact Check: సీతకొండపై బాబు బొంకు!.. అబద్ధాలతో ట్వీట్ -
World Piles Day 2022: పైల్స్కు స‘మూల’ పరిష్కారం..
గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల ప్రస్తుతం ప్రజలు యుక్త వయసులోనే మూలవ్యాధి(పైల్స్/మొలలు) బారిన పడుతున్నారు. ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల బాధపడుతున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ రోగులు ఎక్కువగా కూర్చోలేరు. అలాగని తిరగనూ లేరు. గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్య విభాగానికి ప్రతిరోజూ పది మంది పైల్స్ సమస్యతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జిల్లాలో 120 మంది జనరల్ సర్జన్లు, పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ సగటున ఇద్దరు మొలల బాధితులు చికిత్స కోసం వస్తున్నట్టు సమాచారం. హెమోరాయిడ్స్గా పిలిచే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ నవంబర్ 20న వరల్డ్ పైల్స్ డేని నిర్వహిస్తున్నారు. సరైన వైద్యం తీసుకుంటే మూలవ్యాధిని సమూలంగా నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. కారణమేంటంటే.. మల విసర్జన సరిగా జరగకపోవడాన్ని మలబద్ధకం అంటారు. ఇది ఎక్కువగా ఉండేవారిలో అన్నవాహిక చివరి భాగంలో మల ద్వారానికిపైన పురీషనాళం వద్ద రక్తనాళాల్లో వాపు చోటుచేసుకుంటుంది. దీనినే మూల వ్యాధి అంటారు. కొందరిలో మలద్వారం దగ్గర సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. వంశ పారంపర్యంగానూ వచ్చే ఆస్కారం ఉంది. వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే ఆస్కారం ఉంది. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, మానసిక ఒత్తిడి, మద్యపానం, నీరు తక్కువగా తాగడం, మాంసాహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో పైల్స్ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. మల ద్వారం చుట్టూ దురదగా ఉండడం, మల విసర్జన సమయంలో వాపు, ఉబ్బు తగలడం, అధిక రక్తస్రావం దీని లక్షణాలు. చికిత్స, జాగ్రత్తలు ► ప్రస్తుతం మూలవ్యాధికి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్టాప్లర్, లేజర్, హాల్స్వంటి విధానాల వల్ల ఎక్కువ నొప్పి, గాయం లేకుండా మూలవ్యాధిని నయం చేయొచ్చు. ► మొలలు సోకిన వారు పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ద్రవ పదార్థాలను ప్రత్యేకంగా నీళ్లను తరచూ తాగాలి. పండ్లు, ఆకు కూరలు, కాయగూరలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువగా శ్రమపడి ఒత్తిడి కలిగేలా మల విసర్జన చేయకూడదు. కారం, మాసాలాలు, పచ్చళ్లు, వేపుళ్లు, దుంప కూరలకు దూరంగా ఉండాలి. 90 శాతం మందులతోనే నయం పైల్స్ బాధితులకు గుంటూరు జీజీహెచ్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా ఆపరేషన్లూ చేస్తున్నాం. నూటికి 90 శాతం మూలవ్యాధి మందులతోనే నయమవుతుంది. కేవలం పది శాతం మందికి మాత్రమే శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఆపరేషన్కూ అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి. లేజర్ చికిత్స ద్వారా అతి తక్కువ కోత, కుట్లతో శస్త్రచికిత్స చేయొచ్చు. – షేక్ నాగూర్బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ -
మాట మార్చిన సిద్ధూ.. ప్లీజ్ కొంచెం టైమ్ ఇవ్వండి
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 1988 నాటి కేసులో కోర్టు ఆయనుకు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సిద్ధూ గురువారం స్పందిస్తూ.. కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని అన్నారు. ఇంతలోనే శుక్రవారం సిద్ధూ మాట మార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని నవజోత్ సింగ్ సిద్ధూ కోరారు. దీంతో, సిద్ధూ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు సింఘ్వీ.. సీజేఐ ఎన్వీ రమణను కలవాలని ఏఎం ఖన్వీల్కర్ సూచించారు. ఇక, కేసు రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ ఎస్కే కౌల్తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా తమకు అందలేదని, శుక్రవారం ఉదయం ఛండీగఢ్ కోర్టు నుంచి పాటియాలా పోలీస్స్టేషన్కు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం సమన్లను సిద్ధూకి అందించి లొంగిపోవాలని కోరుతున్నామని పోలీసులు చెప్పారు. అరెస్టు చేసిన వెంటనే సిద్ధూను వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టం చేశారు. Will submit to the majesty of law …. — Navjot Singh Sidhu (@sherryontopp) May 19, 2022 ఇది కూడా చదవండి: లాలూ ప్రసాద్ యాదవ్, కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చిన సీబీఐ -
ప్రవాసాంధ్రుల దాతృత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ కట్టడి చర్యలకు ప్రవాసాంధ్రులు సాయం అందించారు. సుమారు రూ.4,28, 08,885 విలువైన వైద్య పరికరాలను ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా ప్రభుత్వాస్పత్రులకు అందించారు. సోమవారం తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి, సీఈవో కె.దినేష్కుమార్, భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి అవసరమైన వైద్య పరికరాల వివరాలను స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో సమన్వయం చేసుకుంటూ ప్రవాసాంధ్రుల నుంచి వాటిని సేకరించడంలో ఏపీఎన్ఆర్టీఎస్ విశేష కృషి చేస్తోందంటూ కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీఎన్ఆర్టీఎస్ పనిచేస్తోందని వెంకట్ మేడపాటి అన్నారు. ఏపీకి వైద్య పరికరాలను పంపాలనుకునే వారికి వివిధ దేశాల్లో ఉన్న తమ కోఆర్డినేటర్లు సాయం అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 70 ఏరియా, పెద్దాస్పత్రులకు వైద్య సామగ్రి పంపిణీ జరిగిందన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీలకు చెందిన పూర్వ విద్యార్థి సంఘాలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. చదవండి : ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్ -
క్రౌడ్ ఫండింగ్... సేవా ట్రెండింగ్
ఇటీవల హైదరాబాద్కు చెందిన ఒక బాలుడు అరుదైన వ్యాధితో బాధపడ్డాడు. చికిత్సకు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో అంత డబ్బు ఎలా తేవాలని, ఎవరిని అడగాలని, తమ చిన్నారిని ఎలా బతికించుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎంతగానో కలత చెందారు. అప్పుడు వారిని దేవుడిలా ఆదుకుంది ‘క్రౌడ్ఫండింగ్’. దీంతో ఆన్లైన్లో సమకూరిన నిధులతో వారు తమ చిన్నారిని బతికించుకున్నారు. ఆ కుటుంబంలో మళ్లీ సంతోషం నింపిన ఆ ‘క్రౌడ్ఫండింగ్’ అంటే ఏమిటో తెలుసుకుందాం.. సాక్షి, హైదరాబాద్: గతంతో పోలిస్తే.. దాతల సంఖ్య పెరిగింది. ఐటీ సంబంధిత సంస్థల్లో పనిచేసే యువకులు చారిటీ అంటే సై అంటున్నారు. దీంతో ఆపన్నులు–దాతలకు మధ్య వారధిలాంటి మాధ్యమాలు కూడా పెరుగుతున్నాయి. వీటిలో ప్రాచుర్యంలో ఉన్న వారధి ఆన్లైన్ ఫండ్ రైజింగ్ పేజెస్/ క్రౌడ్ ఫండింగ్. అన్ని అవసరాలకూ ఇవి ఉపయోగపడుతున్నప్పటికీ.. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు అధికంగా లబ్ధి చేకూరుతోంది. దీంతో ఖరీదైన చికిత్సలు అవసరమైన అభాగ్యులకు ఇవి వరంలా మారాయి. వ్యక్తిగతంగా చేస్తే సందేహాలు మన వారెవరైనా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ చికిత్సకు అవసరమైన డబ్బు మన దగ్గర లేనప్పుడు ఆన్లైన్ పేజ్లు తయారుచేసుకుని దాతల నుంచి విరాళాలు సేకరించవచ్చు. అలా ఓ రోగి తరపున పేజ్ సృష్టించిన వ్యక్తిని క్యాంపెయిన్ ఆర్గనైజర్గా వ్యవహరిస్తారు. వ్యక్తిగతంగా పేజ్ తయారు చేసుకుంటే దాతలు సందేహించొచ్చు కాబట్టి అప్పటికే ఈ తరహా పేజ్లకు సపోర్ట్ చేసేందుకు కొన్ని క్రౌడ్ ఫండింగ్ వేదికలు అవతరించాయి. ఇవి కొంత రుసుము తీసుకుని బాధితుడి తరపున చారిటీ క్యాంపెయిన్ నిర్వహిస్తాయి. వాటినే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లంటారు. జాగ్రత్తగా...చేయూత చికిత్స కోసం నిజంగా అవసరమైన వారిని మాత్రమే తమ వేదికను వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వడం.. మరోవైపు దాతలిచ్చే విరాళాలు దుర్వినియోగం కాకుండా చూడటం అనే ఈ రెండు బాధ్యతలనూ క్రౌడ్ ఫండింగ్ వేదికలు నిర్వర్తిస్తాయి. దీని కోసం వీరు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరార్థులకు చెందిన ఆధార్, పాన్ తదితర గుర్తింపు కార్డులతోపాటు సోషల్ మీడియా ప్రొఫైల్స్ని కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. క్యాంపెయిన్ చేసేవారికీ లబ్ధిదారులతో ఉన్న అనుబంధం, రోగి ఐడీ, వ్యాధి, చికిత్స తాలూకు ధ్రువపత్రాలు, చికిత్సకు అయ్యే అంచనా వ్యయం.. వగైరా వివరాలు కచ్చితంగా సేకరిస్తారు. చికిత్స అందిస్తున్న సంబంధిత ఆసుపత్రి, వైద్యులతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ హైదరాబాద్ సహా పలు నగరాల్లో శాఖలు ఉన్నాయి. సిటీ ఆస్పత్రులతో ఒప్పందాలు మేము హైదరాబాద్ నుంచి వివిధ చికిత్సల కోసం 12 వేల క్యాంపెయిన్స్ నిర్వహించాం. బాధితులకు రూ.105 కోట్లు అందించాం. పుణెకు చెందిన వేదికా షిండా అనే బాలికకు అవసరమైన జీన్ రీప్లేస్మెంట్ థెరపీ కోసం సేకరించిన రూ.14.3 కోట్లే ఇప్పటిదాకా సేకరించిన వాటిలో అత్యధిక మొత్తం. ఇందులో 1.34 లక్షల మంది దాతలు పాల్గొన్నారు. రెయిన్బో, గ్లోబల్, కిమ్స్ తదితర 25 ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తున్నాం. మా ద్వారా సాయం కోరాలంటే Milaap.org వెబ్సైట్ను సందర్శించాలి లేదా facebook@milaap.orgకు మెయిల్ చేయాలి. –అనోజ్ విశ్వనాథన్, ప్రెసిడెంట్, మిలాప్ సెకనుకో విరాళం సెకనుకో విరాళం అనే స్థాయిలో విరాళాలు మా వేదిక ద్వారా అందుతున్నాయి. ఇప్పటిదాకా మేం రూ.1,500 కోట్ల ఫండ్ రైజింగ్కు తోడ్పడ్డాం. హైదరాబాద్ నుంచి కోవిడ్ సెకండ్ వేవ్లో రెండువేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. 150 ఆస్పత్రులతో కలిసి పనిచేశాం. తాజాగా హైదరాబాద్కి చెందిన మూడేళ్ల బాలిక ఆయాన్ట్ గుప్తాకు అవసరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ టైప్1 చికిత్స కోసం రూ.14.84 కోట్లు సేకరించాం. చికిత్స నిధుల కోసం www.impactguru.com/users/start&fundraiser ను సంప్రదించవచ్చు. –పీయూష్ జైన్, సీఈఓ, ఇంపాక్ట్గురు.కామ్ సెలబ్రిటీలూ స్పందించారు.. మా అబ్బాయి ఆయాన్ష్కు అయ్యే చికిత్సలో భాగంగా అందించాల్సిన ఒక ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు అని తెలియగానే అంత మొత్తం ఎలా తేవాలో తెలియక ఆందోళన చెందాం. అయితే ఆస్పత్రి సహకారంతోపాటు ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్ చేయూతతో ఖరీదైన ఇంజెక్షన్ను మా అబ్బాయికి ఇప్పించగలిగాం. దీని కోసం 62,450 మంది దాతలు స్పందించడం మర్చిపోలేని విషయం. వీరిలో సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఉన్నారు. –యోగేష్ గుప్తా చదవండి: ఇదిగో మేమున్నాం.. మీకేం కాదు.. -
covid-19: విశాఖ పోర్టుకు చేరిన సింగపూర్ సాయం
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో మిత్ర దేశాల నుంచి భారత్కు అత్యవసర సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా సింగపూర్ తదితర మిత్ర దేశాలు సముద్ర సేతు పేరుతో అత్యవసర మందులు, వైద్య పరికరాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా ఐఎన్ఎస్ జలస్వ నౌక 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో ఆదివారం విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరింది. వీటితో పాటు కోవిడ్ మందులు కూడా మిత్ర దేశాలు అందించాయి. సముద్ర సేతు 2లో భాగంగా ఈ సేవలు భారత్కు చేరాయి. చదవండి: మాకు కరోనా లేదు... పరీక్షలు చేయొద్దు -
భారత్కు ఎంతో సహాయం చేస్తున్నాం.. మరింత చేస్తాం
వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్పై జరుగుతున్న యుద్ధంలో భారత్కు బాసటగా నిలుస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. భారత్కు గణనీయమైన సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రాణాధార ఔషధాలు, కీలకమైన వైద్య పరికరాలు పంపిస్తున్నామని అన్నారు. ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్కు ఆరు విమానాల్లో ఔషధాలు, పరికరాలు వచ్చాయి. ఇందుకు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఏఐడీ) నిధులు సమకూర్చింది. ఔషధాలతోపాటు ఆక్సిజన్ సిలిండర్లు, ఎన్95 మాస్కులు భారత్కు చేరుకున్నాయి. తాను ఇటీవలే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులు అందజేయాలని మోదీ కోరారని, ఈ మేరకు వాటిని పంపించామని వివరించారు. బైడెన్ తాజాగా వైట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. భారత్కు ఎంతో సహాయం చేస్తున్నామని ఉద్ఘాటించారు. జూలై 4 నాటికి అమెరికా వద్ద ఉన్న అస్ట్రాజెనెకా వ్యాక్సిన్లలో 10 శాతం వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిస్తామన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రస్తుతం భారత్కు తోడుగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. ఔషధాలు, పరికరాలు, ప్రాణ వాయువు సిలిండర్లతో కూడిన మరికొన్ని విమానాలను భారత్కు పంపుతామన్నారు. -
గర్భిణుల వైద్యపరీక్షలకు ఉచిత రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులకు వైద్యసేవలకు వెళ్లే గర్భిణులు ఇకపై ఆటో కోసమో, బస్సు కోసమో ఎదురు చూడాల్సిన పనిలేదు. వీళ్లకోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇంటివద్దకే వాహనాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తోంది. ఆపదలో ఉన్న వారి కోసం ఇప్పటికే 108 వాహనాలు పనిచేస్తున్నాయి. పల్లెల్లో మందులివ్వడానికి 104 వాహనాలున్నాయి. ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు నడుస్తున్నాయి. అయితే.. గర్భిణులు ప్రసవానికి ముందు ఆస్పత్రులకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే రవాణా సౌకర్యం లేదు. దీనికోసం ఇప్పుడు కొత్తగా వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తొలిదశలో 170 వాహనాలు గర్భిణులు 9 నెలల కాలంలో విధిగా నాలుగు దఫాలు వైద్యపరీక్షలకు వెళ్లాలి. దీన్నే యాంటీనేటల్ చెకప్స్ అంటారు. ఈ సమయంలో ప్రతి గ్రామంలో ఉన్న గర్భిణులకు ఇంటివద్దకే వాహనాలను పంపిస్తారు. గర్భిణి ఎప్పుడు వైద్యసేవలకు వెళ్లాలో స్థానికంగా ఆశా వర్కర్కు, ఏఎన్ఎంకు అవగాహన ఉంటుంది. వీళ్లు ఆ సమయానికి మెడికల్ ఆఫీసర్కు ఫోన్చేసి, వాహనాన్ని ఇంటివద్దకే రప్పించి దాన్లో ఆస్పత్రికి పంపిస్తారు. వైద్యపరీక్షలు పూర్తయ్యేవరకు వాహనం అక్కడే ఉండి తిరిగి ఇంటివద్దకు చేరుస్తుంది. దీనికోసం తొలుత 5 జిల్లాల్లో 170 వాహనాల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు యత్నిస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తారు. గర్భిణులకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించే వాహనాలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్త ఎవరైనా డాక్టరుకు ఫోన్ చేయగానే ఆ గర్భిణి ఇంటివద్దకే వాహనాన్ని పంపిస్తారు. గర్భిణి ప్రయాణానికి వీలుగా ఉండేలా తుపాన్ వాహనాన్ని ఎంపిక చేసినట్టు తెలిసింది. తొలుత ఈ ఐదు జిల్లాల వాహనాలకు కలిపి ఏడాదికి రూ.10 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. 3 లక్షల మంది గర్భిణులకు లబ్ధి రాష్ట్రంలో ఏటా 7 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో 3 లక్షలమంది ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు. వీళ్లలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే. రవాణా సౌకర్యం లేక వైద్యపరీక్షలకు వెనుకాడుతున్నారు. ఉచిత రవాణా కల్పిస్తే ప్రతి ఒక్కరు వైద్యపరీక్షలకు వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, సమస్యలున్నప్పుడు మందులు తీసుకోవడం వల్ల సుఖప్రసవాలు జరగడమే కాకుండా మాతాశిశు మరణాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. -
తగ్గుతున్న మాతృ మరణాలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మాతృ మరణాలు (ప్రసవ సమయంలో తల్లుల మృతి) గణనీయంగా తగ్గుతున్నాయి. సహస్రాబ్ధి లక్ష్యాల్లో భాగంగా జాతీయ స్థాయిలో లక్ష ప్రసవాలకు తల్లుల మృతుల సంఖ్యను 70కి తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు. తాజాగా ఎస్ఆర్ఎస్ (శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే) స్పెషల్ బులెటిన్లో జాతీయ సగటున ప్రతి లక్ష ప్రసవాలకు 113 మంది తల్లులు మృతి చెందుతున్నట్టు వెల్లడైంది. అయితే జాతీయ సగటు కంటే చాలా రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉండడం కలవరపెడుతోంది. అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ భారీగా మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. 2016–18కి గానూ విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్లో లక్ష ప్రసవాలకు ఏపీలో 65 మాతృ మరణాలు సంభవిస్తున్నట్టు వెల్లడైంది. మాతృ మరణాలకు ప్రధాన కారణాలు ఇవే.. ► ప్రసవానంతరం అధిక రక్తస్రావంతో 38 శాతం మంది.. ► సెప్సిస్ (ప్రసవ సమయంలో విషపూరితం కావడం) కారణంగా ► శాతం మంది.. అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) వల్ల 5 శాతం మంది.. ► అబార్షన్లు జరగడం వల్ల 8 శాతం మంది.. ► రకరకాల గర్భకోశ వ్యాధుల వల్ల 5గురు.. ► ఇతర కారణాల వల్ల 34 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. ఏపీలో తల్లులకు భరోసా ఇలా.. ► ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి హైరిస్కు గర్భిణులను గుర్తించి, ప్రత్యేకంగా ఓ ఆశ కార్యకర్త లేదా ఒక ఏఎన్ఎంను నియమించడం ► ప్రతి పీహెచ్సీలోనూ సేఫ్ డెలివరీ కేలండర్ ఏర్పాటు చేయడం. ఆరు రోజుల ముందే వారిని ఆస్పత్రిలో చేర్పించడం ► 108 డ్రైవరు నంబరు ఆమెకు ఇవ్వడం..డ్రైవరుకు గర్భిణి నంబరు ఇచ్చి ఫోన్ చేసి మరీ తీసుకురావడం ► ఎంఎస్ఎస్ యాప్ ద్వారా ప్రతి పీహెచ్సీ పరిధిలోనూ హైరిస్కు గర్భిణులను గుర్తించి వారికి సుఖప్రసవాలు అయ్యేలా చేయడం ► ప్రతి 15 రోజులకు ఒకసారి మాతృ మరణాలపై కలెక్టర్ల స్థాయి సమీక్ష నిర్వహించడం గణనీయంగా తగ్గించేందుకు కృషి ఆంధ్రప్రదేశ్లో మాతృ మరణాలను 74 నుంచి 65కు తగ్గించాం. ఈ సంఖ్య మరింతగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మాతృ మరణాలు తగ్గడం మంచి పరిణామం. – డా. గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
టెన్త్ చదివి.. డాక్టర్నంటూ వైద్యం
నరసాపురం: పదో తరగతి చదివి కోవిడ్తో సహా అన్ని వ్యాధులకు చికిత్స చేస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుడి మోసాన్ని డీఎంఅండ్హెచ్వో వెలుగులోకి తెచ్చారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగింది. నరసాపురం బ్రాహ్మణ సమాఖ్య భవనం రోడ్డులో ఉన్న గాబ్రేల్ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సునంద శనివారం తనిఖీ చేశారు. డాక్టర్ స్థానంలో ఉన్న ఆసుపత్రి నిర్వాహకుడు సతీష్ (35)ను సర్టిఫికెట్లు, అనుమతులు చూపాలని కోరారు. తనకు పీఎంపీ, ఆర్ఎంపీ సర్టిఫికెట్ కూడా లేదని, పదో తరగతి వరకు చదివానని సతీష్ చెప్పడంతో వెంటనే ఆసుపత్రిని సీజ్ చేసి అక్కడ ఉన్న హైపవర్ యాంటీ బయోటిక్ మందులను స్వాధీనం చేసుకున్నారు. సతీష్పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న అక్రమ వైద్యం చేస్తున్న పీఎంపీ, ఆర్ఎంపీలు కొందరు తమ వైద్యశాలలు మూసేసి పరారయ్యారు. -
నాణ్యత నిర్ధారించాకే ఆస్పత్రులకు మందులు
సాక్షి, అమరావతి: పేద రోగులకు అందించే మందులను ముందుగా పరిశీలించి.. వాటి నాణ్యత నిర్ధారించాకే ఆస్పత్రులకు సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రజలకు కావాల్సిన అన్ని మందులను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికనుగుణంగా అధికారులు ముందుకు కదులుతున్నారు. గతంలో తూతూమంత్రంగా ర్యాండం పద్ధతిలో సరఫరా అయ్యే మందుల్లో కొన్నిటికి మాత్రమే పరీక్షలు చేసేవారు. నాణ్యతను నిర్ధారించి, నాసిరకం అని తేల్చేసరికే రోగులు మందులను వాడుతుండేవారు. దీంతో ఉన్న జబ్బులు నయం కాకపోవడంతోపాటు కొత్త జబ్బుల బారిన పడేవారు. ఇప్పుడలా కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీలు) నుంచి బోధనాస్పత్రుల వరకూ ప్రతి మందునూ నాణ్యత నిర్ధారించాకే సరఫరా చేయాలని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. మందులకు సంబంధించిన ప్రతి బ్యాచ్ను ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్) గుర్తింపు ఉన్న లేబొరేటరీల్లో నిర్ధారించి ఆస్పత్రులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మూడు లేబొరేటరీల్లో నిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా.. వీటి సంఖ్యను ఐదుకు పెంచనున్నారు. సగటున నెలకు 300 బ్యాచ్లకు సంబంధించిన మందుల నాణ్యతను నిర్ధారించేలా చర్యలు తీసుకుంటున్నారు. అంటే.. ఏడాదికి 3600 బ్యాచ్లకు సంబంధించిన మందులకు పరీక్షలు చేశాకే ప్రజల్లోకి పంపిస్తారు. అదేవిధంగా సగటున 400 రకాల మందులు ప్రభుత్వాస్పత్రులకు సరఫరా అవుతుండగా.. ఈ సంఖ్య మరికొద్ది రోజుల్లో 600కు చేరనుంది. ఈ నేపథ్యంలోనే లేబొరేటరీల సంఖ్యను పెంచుతున్నారు. మందులు లేబొరేటరీకి చేరిన 26 రోజులలోగా నాణ్యతను నిర్ధారించి.. సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు. ప్రతి మందుకూ నాణ్యత నిర్ధారణ పరీక్షలు ఇకపై ర్యాండం పద్ధతిలో మందుల నాణ్యత నిర్ధారణ జరగడానికి వీల్లేదు. ప్రతి మందుకూ నాణ్యత పరీక్షలు చేశాకే సరఫరా చేస్తాం. దీనికోసం పక్కాగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పేద రోగికి నాణ్యమైన మందులు అందించడమే మా సంస్థ లక్ష్యం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నాం. – విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ -
పాప వైద్యానికి కేటీఆర్ భరోసా
సాక్షి, సూర్యాపేట: బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న సూర్యాపేటకు చెందిన చిన్నారికి వైద్య ఖర్చులకోసం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం భరోసా ఇచ్చారు. సూర్యాపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వల్ధాసు ఉపేందర్ ఎనిమిది సంవత్సరాల కూతురు భూమిక కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. దాంతో సూర్యాపేటలోని హాస్పిటల్లో చికిత్స నిర్వహించినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో హైదరాబాద్ తీసుకెళ్లడంతో బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది. వైద్య ఖర్చులకు రూ.ఎనిమిది లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ట్రైలర్ వృత్తే జీవనాధారంగా కాలం వెళ్లదీస్తున్న పాప తల్లిదండ్రులు విషయం తెలిసి రోదిస్తున్నారు. ఆర్థికసాయం అందించాలని దాతలను వేడుకోవడంతో సూర్యాపేటకు చెందిన వారి మిత్రుడు శైలేంద్రాచారి పాప పరిస్థితిని ట్విట్టర్లో కేటీఆర్కు తెలిపారు. దాంతో ఆయన వెంటనే స్పందించారు. పాపకు సంబంధించినవారిని వెంటనే తన ఆఫీస్కు రమ్మని ఆహ్వానించారు. దీంతో పాప తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
డెంగీ డేంజర్ ; కిట్లకు కటకట..
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులకు ఇదో పరీక్ష. డెంగీ రోగులకు పరీక్షలు చేయడంలో విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో డెంగీ నిర్ధారణ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సరిపడా డెంగీ నిర్ధారణ కిట్లు లేక పాట్లుపడుతున్నాయి. రెండు, మూడు రోజులు ఆగాలని వైద్య సిబ్బంది చెబుతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం డెంగీపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కిట్లు సమకూర్చకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నివేదికలతో ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అవసరం 10 లక్షలు...అందుబాటులో 1.35 లక్షల మందికే వైరల్ జ్వరాలు విజృంభిస్తుండటం, ఒక్కోసారి 103–104 డిగ్రీల జ్వరం వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా జనం ఆందోళన చెందుతున్నారు. వైరల్ జ్వరాలు, డెంగీ అనుమానిత కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 31 జిల్లా, 87 ఏరియా ఆసుపత్రులకు రోజూ లక్షలాదిమంది తరలివస్తున్నారు. పడకలు కూడా దొరకని పరిస్థితి. ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్లోని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్కూ రోగులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వేలాది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి కూడా డెంగీ నిర్ధారణ కోసం లక్షలాది మంది వస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షలమందికి డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉండగా, వైద్య విధానపరిషత్ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో కేవలం 1.35 లక్షలమందికి మాత్రమే సరిపడా కిట్లున్నాయి. అందులో ప్రాథమిక నిర్ధారణ కోసం నిర్వహించే ర్యాపిడ్ టెస్టు కిట్లు 73 వేలుండగా, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఎలీసా కిట్లు కేవలం 62 వేలమందికి సరిపోను మాత్రమే ఉన్నాయి. ఎలీసా పరీక్షల కోసం రెండు, మూడు రోజులపాటు ఆగాలని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది చెబుతుండటంతో బాధితులు ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. వైద్య విధాన పరిషత్ యంత్రాంగం విఫలం వైద్య విధాన పరిషత్కు ఇన్చార్జి కమిషనర్గా హైదరాబాద్ కలెక్టర్ మాణిక్రాజ్ కొనసాగుతున్నారు. రెండు విధులతో ఆయన జిల్లా, ఏరియా ఆసుపత్రులపై దృష్టి సారించడంలేకపోతున్నారు. కనీసం ఆయా ఆసుపత్రుల యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేని పరిస్థితి. ఆయన కంటే కిందిస్థాయిలో ఉండే అధికారులు కూడా డెంగీ నిర్వహణ, పర్యవేక్షణలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలీసా కిట్లు ఏడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకూ అధికారులు డెంగీ నిర్ధారణ కిట్లు తక్కువగానే ఇచ్చారు. ర్యాపిడ్ టెస్టు కిట్లను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి 500, దుబ్బాక ఆసుపత్రికి 150, తూప్రాన్ ఆసుపత్రికి 250 మాత్రమే ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి కేవలం ఏడే ఎలీసా కిట్లు ఇచ్చారు. ర్యాపిడ్ పరీక్ష కిట్టు ద్వారా ఒక్కో యూనిట్ ఒక్కరికి, ఎలీసా కిట్టు ఒక్కోటి 96 మందికి పరీక్ష చేయడానికి వీలుంది. నీలోఫర్ ఆసుప త్రికి 70 ఎలీసా కిట్లు మాత్రమే ఇచ్చారు. అయితే, ఇక్కడికి రోజూ కనీసం 2 వేల మందికి పైగా పిల్లలు వస్తున్నారు. హైదరా బాద్లోని ఫీవర్ ఆసుపత్రికి రోజూ 2,500 మంది రోగులు వస్తుంటారు. అక్కడ కేవలం 3,936 మందికి సరిపోయే 41 ఎలీసా కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి ఐదు ఎలీసా కిట్లు మాత్రమే ఉన్నాయి. ఆలస్యానికి కారణమిదే.. డెంగీ పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యానికి కారణం కిట్ల కొరత కాదు. అవసరమైనన్ని కిట్లు అందుబాటులో ఉంచుతున్నాం. అవసరమైనప్పుడు తెప్పిస్తున్నాం. అయితే, ఎలీసా పరీక్షకు నిర్వహించే ఒక్కో కిట్టు ధర రూ.25 వేలు. ఒక్కో కిట్టు ద్వారా 96 మందికి పరీక్షలు చేయడానికి వీలుంది. కొద్దిమంది కోసం ఒక్కసారి కిట్టు విప్పితే మిగతావారి కోసం దాన్ని దాచి ఉంచలేం. కాబట్టి 96 రక్త నమూనాలు వచ్చే వరకు ఆగుతున్నాం. -చంద్రశేఖర్రెడ్డి, ఎండీ,టీఎస్ఎంఎస్ఐడీసీ -
రోగుల సహాయకులకూ ఉచిత భోజనం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో రోగుల సహాయకులకు కూడా ఉచితంగా భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్పేషెంట్లుగా చేరిన వారికి ప్రభుత్వమే ఉచితంగా ఆహారం (డైట్) అందిస్తున్నా వారి సహాయకులు మాత్రం భోజనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి అవస్థలు తొలగించేందుకు ఇన్పేషెంట్ల సహాయకులకు కూడా ఉచితంగా భోజనం సమకూర్చనున్నారు. మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా ఉచితంగా భోజనం అందించేందుకు వైద్య విద్య సంచాలకులు కసరత్తు ప్రారంభించారు. ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్)తో చర్చించి రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయానికి రానున్నారు. ఆర్థిక భారం నుంచి ఉపశమనం.. ఇస్కాన్ ఇప్పటికే హైదరాబాద్లోని నీలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం సమకూరుస్తోంది. అదే తరహాలో ఏపీలోనూ అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని వైద్య విద్య సంచాలకులను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్రెడ్డి ఆదేశించారు. రోగులతో పాటు వారి సహాయకులకు కూడా ఆహారం అందచేయడం ద్వారా వైద్య చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చే కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఉచితంగా భోజనం సమకూరుస్తుండగా కాకినాడలోని రంగరాయ బోధనాసుపత్రిలో హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ఆహారాన్ని అందిస్తోంది. ఇలా కొన్ని ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా భోజనం అందిస్తున్నా అన్ని చోట్లా ఈ సదుపాయం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భోజనం సమకూరుస్తున్న సంస్థలను అలాగే కొనసాగిస్తూ మిగతా ఆస్పత్రులకు భోజనం అందించడం లేదంటే అన్నీ ఒకరికే అప్పగించాలా? అనే అంశాన్ని ఇస్కాన్తో చర్చించిన అనంతరం నిర్ణయించనున్నట్టు వైద్య విద్య అధికారులు తెలిపారు. రోజూ 10 వేల మందికిపైగా ప్రయోజనం రాష్ట్రవ్యాప్తంగా 11 బోధనాసుపత్రుల్లో సుమారు 12 వేల వరకు పడకలున్నాయి. సగటున రోజూ 11,500 మంది ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. వారి కోసం సహాయకులు కూడా వస్తుంటారు. ఉచిత భోజనం సమకూర్చడం వల్ల నిత్యం 10 వేల మందికిపైగా రోగుల సహాయకులకు మేలు జరుగుతుంది. రోగి సహాయకులు పాస్ చూపిస్తే డిస్చార్జి అయ్యే వరకు రెండు పూటలా భోజనం అందిస్తారు. వీలైనంత త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బోధనాసుపత్రుల తరువాత ఈ సేవలను 14 జిల్లా ఆస్పత్రులకు కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
తయారీరంగంలో ఇది మన మార్కు!
సాక్షి, హైదరాబాద్: మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి. పార్కులో మౌలిక సౌకర్యాల కల్పన శరవేగంగా సాగుతోంది. వైద్య ఉపకరణాల తయారీ రంగానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్లో ‘మెడికల్ డివైజెస్ పార్కు’ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 14 వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమలకు భూకేటాయింపులు కూడా జరిగాయి. నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు వచ్చే ఏడాది నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తాయని అంచనా. పార్కు నిర్మాణానికి వీలుగా సుల్తాన్పూర్ పరిధిలోని 174, 70 సర్వే నంబర్ల పరిధిలో 557.32 ఎకరాలను కేటాయించింది. ఔటర్రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను టీఎస్ఐఐసీ చేపట్టింది. 2017 జూన్లో పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్కును రెండు దశల్లో ఏ, బీ బ్లాకులుగా అభివృద్ధి చేయనున్నారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి పార్కు వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు రూ.9 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు పార్కులో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.35 కోట్ల మేర ఖర్చు చేసింది. రూ.20 కోట్లతో పార్కు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కొండలను పిండి చేసి.. పార్కు ఆవరణలో ఇతర పరిశ్రమల ఏర్పాటుకు కూడా పెట్టుబడిదారులు ముందుకు వస్తుండటంతో 272 ఎకరాల్లో మెడికల్ డివైజెస్, 226 ఎకరాల్లో ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేలా డీపీఆర్లో అధికారులు మార్పులు చేశారు. మరో 47 ఎకరాలను మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్’కు కేటాయించారు. వంద, 60 అడుగుల వెడల్పుతో 5.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్, హై టెన్షన్ విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. ట్రాన్స్కో విభాగం 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను నిర్మించింది. నీటి అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయిం చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ఐఐసీ ప్రతి పాదనలు సమర్పించింది. పార్కుకు కేటాయించిన ప్రాంతంలో 150 ఎకరాలు మాత్రమే చదునుగా ఉండగా, మిగతా భూమి కొండలు, గుట్టలతో నిండి ఉంది. దీంతో కొండలను పిండి చేయాల్సి రావ డంతో ఖర్చు కూడా పెరుగుతున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. రెండంకెల వృద్ధి రేటు లక్ష్యంగా... దేశంలో వైద్య ఉపకరణాల తయారీ రంగం శైశవదశలో ఉన్న నేపథ్యంలో బహుళ జాతి కంపెనీల ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. దేశంలో మూడు బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు జరుగుతుండగా రెండంకెల వృద్ధి రేటుతో 2023 నాటికి 11 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో స్థానికంగా వైద్య ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘లైఫ్ సైన్సెస్ పాలసీ 2015–2020’లో భాగంగా మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇప్పటివరకు మెడికల్ డివైజెస్ పార్కులో 14 వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమకు భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమల ద్వారా రూ.3,631.97 కోట్ల పెట్టుబడులతోపాటు 1,588 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2019 చివరిలోగా భూ కేటాయింపు పొందిన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించే భఃవిధంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. క్రషర్ల తొలగింపునకు నోటీసులు మెడికల్ డివైజెస్ పార్కుకు కేటాయించిన సర్వే నంబరు 174లో గతంలో నాలుగు మైనింగ్ కంపెనీలకు క్రషర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం పార్కులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నా, సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఖాళీ చేసేందుకు క్రషర్ల యజమానులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే రెండు యూనిట్లను మూసివేయించిన టీఎస్ఐఐసీ.. మరో రెండు యూనిట్ల మూసివేతకు కూడా నోటీసులు జారీ చేసింది. -
సచివాలయంలోనే మందుల్లేవ్..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పాలనకు కేంద్రంగా ఉండే సచివాలయంలోనే మందులకు దిక్కులేని పరిస్థితి నెలకొని ఉంది. గత రెండు మాసాలుగా మధుమేహం నివారణ (షుగర్)కు ఇచ్చే మాత్రలు లేకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మందులను రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సరఫరా చేయాలి. కానీ గడిచిన రెండు మాసాలుగా మధుమేహం నివారణ మందులు సరఫరా చేయలేదు. సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతాయి. సచివాలయ ఉద్యోగులు 2 వేల మంది ఉండగా, వారికే సకాలంలో సరఫరా చేయలేకపోతున్నారు. చాలా మంది ఉద్యోగులు సచివాలయంలోని డిస్పెన్సరీకి వెళ్లడం, మందులు లేవని చెప్పడంతో వెనుదిరిగి వస్తున్నారు. ఈ మందులతో పాటు మరికొన్ని యాంటీబయోటిక్స్, బీకాంప్లెక్స్, విటమిన్ మాత్రలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సచివాలయంలోని డిస్పెన్సరీలో ఎప్పుడూ మందులు లేవని చెప్పేవారు కాదని, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు మందులు ఉంటాయో, ఎప్పుడు ఉండవో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. అలాగే సచివాలయం ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకూ రక్తపరీక్షలు కూడా చేయలేని పరిస్థితి నెలకొని ఉందని ఉద్యోగులు వాపోయారు. ఏ రక్తపరీక్ష చేయించుకోవాలన్నా బయటికి వెళ్లి చేయించుకోవాల్సి వస్తోందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి వాపోయారు. ఇప్పటివరకు లేబొరేటరీ కూడా ఏర్పాటు చేయలేక పోవడం దారుణమని, అంబులెన్సు కూడా అందుబాటులో ఉండదన్నారు. ఎవరైనా ఉద్యోగులు 108కు ఫోన్ చేస్తే తూళ్లూరు నుంచి గాని, మరెక్కడనుంచో ఇక్కడకు రావాలని, దీనికి బాగా సమయం పడుతోందని పేర్కొన్నారు. -
తెలంగాణ యువకుడిపై కాల్పులు
మహబూబాబాద్: అమెరికాలో మరో తెలుగు యువకుడిపై దుండగులు దారుణానికి ఒడిగట్టారు. మహబూబాబాద్కు చెందిన పూస సాయికృష్ణ (26) అనే యువకుడిపై కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావంతో డెట్రాయిట్లోని ఓ ఆసుపత్రిలో సాయికృష్ణ మృత్యువుతో పోరాడుతున్నారు. జనవరి 4న జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాయికృష్ణ.. 2015లో ‘ట్రిపుల్–ఈ’లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. 2016 డిసెంబర్ నుంచి మిచిగాన్ రాష్ట్రంలో ఐబీఎస్ఎస్ కన్సల్టింగ్ కంపెనీలో ఇన్ఫొటైన్మెంట్ టెస్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. జనవరి మూడు రాత్రి 11.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విధులు నిర్వహించుకుని తిరిగి వస్తున్న సమయంలో అటకాయించిన దొంగలు బలవంతంగా కార్లో ఎక్కి.. కొంతదూరం తీసుకువెళ్లారు. నిర్జన ప్రదేశంలోకి వెళ్లాక సాయికృష్ణ పర్స్ లాక్కుని కార్లోంచి తోసేశారు. అనంతరం ఆయనపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో చల్లని చలిలోనే సాయికృష్ణ పడిఉన్నారు. అటుగా వెళ్తున్న కొందరు బాధితుడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన సాయికృష్ణకు డెట్రాయిట్లోని ఓ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉందని.. నాలుగైదు ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఉందని తెలిసింది. షాక్లో కుటుంబం సాయికృష్ణ తండ్రి పూస ఎల్లయ్యకు జనవరి 4 అర్ధరాత్రి అమెరికాలోని ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ కుమారుడు కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయనకు చికిత్స అవసరం. రక్తం ఎక్కించాలి. అత్యవసరంగా ఆపరేషన్ చేయాలి. మీరు అనుమతిస్తే వైద్యం చేస్తాం’అనేది ఫోన్ సారాంశం. ఒక్కగానొక్క కుమారుడికి ప్రమాదం జరిగిందన్న సమాచారం ఎల్లయ్య దంపతులను షాక్కు గురిచేసింది. తమ కుమారుడి పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడాలని తల్లిదండ్రులు శైలజ, ఎల్లయ్య కోరారు. అసలేం జరిగిందో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సాయిపై కాల్పులు జరిగాయన్న సంగతి అతని తల్లిదండ్రులకు తెలియదు. మానవత్వం పరిమళించె.. సాయికృష్ణ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినందుకు ఆయనకు ఇన్సూరెన్స్ లేదు. దీంతో వైద్య ఖర్చులను (ఇన్సూరెన్స్ లేకపోతే అమెరికాలో వైద్యం చాలా ఖరీదు) భరిం చేందుకు సాయి మిత్రులు వినోద్, నాగేందర్లు ‘సపోర్ట్ సాయికృష్ణ’ఉద్యమాన్ని ప్రారంభిం చారు. ‘గోఫండ్మి.కామ్’వెబ్సైట్ ద్వారా 17 గంటల్లోనే 1,06,379 డాలర్లను (దాదాపు రూ.74లక్షలు) సేకరించారు. 2.5 లక్షల డాలర్లు సేకరించడమే తమ లక్ష్యమని వీరు తెలిపారు. -
టీబీ లేకుండానే మందులిచ్చారు!
కృష్ణాజిల్లా, నూజివీడు : పట్టణంలోని జీఎంహెచ్ (అమెరికన్ ఆస్పత్రి)లోని ఎక్స్రే యూనిట్ సిబ్బంది ఒకరి ఎక్స్రే రిపోర్ట్ మరొకరికి ఇవ్వడంతో లేని టీబీ రోగానికి ఐదు నెలల పాటు మందులు మింగిన మహిళ ఉదంతమిది. ముసునూరు మండలం సూరేపల్లికి చెందిన కోకిలపాటి రజని (27) ఈ ఏడాది మే 30వ తేదీ అస్వస్థతగా ఉంటే వైద్యం కోసంపట్టణంలోని అమెరికన్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పరిశీలించి ఊపిరితిత్తులు ఎక్స్రే తీయించడంతో పాటు కొన్ని రక్తపరీక్షలు సైతం చేయించి నెమ్ము, టీబీ లక్షణాలున్నాయని చెప్పగా, డబ్బులు పెట్టుకోలేమని రజని చెప్పడంతో ప్రభుత్వాస్పత్రికి వెళితే ఉచితంగా ఇస్తారని తెలిపారు. దీంతో ఏరియా ఆసుపత్రిలోని టీబీ యూనిట్ వద్దకు వెళ్లగా వాళ్లు ఎక్స్రే చూసి టీబీ మందులు ఇచ్చేశారు. ఆ మందులు ఆమె వాడుతుండగా తీవ్ర స్థాయిలో నీరసానికి గురవ్వడం జరుగుతుండటంతో ప్రతి రోజూ గ్రామంలోనే సెలైన్ పెట్టించుకుంటూ నెట్టుకొస్తోంది. పరిస్థితి మరింత తీవ్రమవుతుండటంతో ఏరియా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు శ్రీకాంత్ వద్దకు ఈ నెల 8న వచ్చి తన బాధ చెప్పుకోవడంతో ఆయన మళ్లీ ఎక్స్రే తీయించగా టీబీ ఏమీ లేదని తేలింది. అమెరికన్ ఆసుపత్రిలో తీసిన ఎక్స్రేను మంగళవారం డాక్టర్కు చూపించారు. ఆయన పరిశీలిం చి ఆ ఎక్స్రే బి.గోపయ్య అనే వ్యక్తిదని, దానిపై బి.గొప్పయ్య అని ఉందని చెప్పారు. అమెరికన్ ఆసుపత్రిలోని ఎక్స్రే యూనిట్ సిబ్బంది తప్పిదానికి రజనీ అవస్థపడాల్సివచ్చింది. బాధితురాలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. టీబీ యూనిట్లోనూ నిర్లక్ష్యమే.. ఎక్స్రే రిపోర్టు తీసుకువచ్చినప్పుడు దానిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కళ్లె పరీక్ష చేసి నిర్ధారించాల్సిన టీబీ యూనిట్ సిబ్బంది కూడా ఇక్కడ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందరి నిర్లక్ష్యానికి రజనీ నాలుగు నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. -
ఆధునిక వ్యాధులకు దేశీ ఆహారమే దివ్యౌషధం!
మధుమేహం, హృద్రోగాలు, ఊబకాయం, కేన్సర్, కిడ్నీ జబ్బులు, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ డి, బి12 లోపం, విషజ్వరాలు.. వంటి ఆధునిక వ్యాధుల నియంత్రణకు, నిర్మూలనకు.. సంపూర్ణ ఆరోగ్య సాధనకు సేంద్రియ పద్ధతుల్లో పండించిన సిరిధాన్యాలు, కషాయాలు వంటి దేశీయ ఆహారమే దివ్యౌషధాలని ప్రముఖ స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త, అటవీ వ్యవసాయ నిపుణులు డా. ఖాదర్వలి(మైసూరు) అంటున్నారు. ఔషధ విలువలతో కూడిన సిరిధాన్యాలు, కషాయాలతో అన్ని రకాల వ్యాధులను జయించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చంటున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ నెల 7,8 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సభల్లో ప్రసంగించిన అనంతరం సభికుల ప్రశ్నలకు డా. ఖాదర్ సమాధానాలిస్తారు. ఈ నెల 7(ఆదివారం)న మ. 2 గం.–5.30 గం. వరకు సికిందరాబాద్లోని హరిహరకళాభవన్లో ప్రసంగిస్తారు. 8(సోమవారం)న ఉ. 9.30 గం.–మ. 12.30 గం. వరకు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం(సుబేదారి, హనుమకొండ)లో, అదే రోజు సా. 3 గం.–6 గం. వరకు కరీంనగర్లోని వైశ్య భవన్(గాంధీరోడ్, కరీంనగర్)లో డా. ఖాదర్ ప్రసంగిస్తారని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. -
అలిసన్, హొంజొలకు మెడిసిన్లో నోబెల్
న్యూయార్క్ : జపాన్కు చెందిన తసుకు హొంజొ, అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ అలిసన్లకు మెడిసిన్లో 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ ప్రైజ్ లభించింది. క్యాన్సర్ చికిత్సలో పరిశోధనకు గాను వీరికి అత్యున్నత పురస్కారం దక్కిందని నోబెల్ కమిటి పేర్కొంది. క్యాన్సర్ కణాలను నిరోధించేలా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేయడంపై వీరు సాగించిన పరిశోధన క్యాన్సర్కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మైలురాయి వంటిదని, వీరు ప్రతిపాదించిన ఇమ్యూన్ చెక్పాయింట్ సిద్ధాంతం క్యాన్సర్ చికిత్సలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని కమిటీ వ్యాఖ్యానించింది. క్యాన్సర్ను ఎలా ఎదుర్కోగలమనే మన దృక్కోణాన్ని సైతం వీరి పరిశోధన సమూలంగా మార్చివేసిందని పేర్కొంది.యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్కు చెందిన ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో ప్రొఫెసర్ అయిన అలిసన్ సాగించిన పరిశోధనా ఫలితాలు దీటైన క్యాన్సర్ చికిత్సకు మార్గం సుగమం చేశాయని నోబెల్ కమిటీ తెలిపింది. ఇక జపాన్లోని క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్ హొంజొ చేపట్టిన పరిశోధనలు సైతం సమర్ధవంతమైన క్యాన్సర్ చికిత్సకు ఊతమిచ్చాయని పేర్కొంది. హొంజొ 34 సంవత్సరాలుగా క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. -
కేన్సర్కు నానో వైద్యం...
కీమోథెరపీ వంటి సంప్రదాయ చికిత్సలకూ లొంగని కేన్సర్లను నానోవైద్యంతో అదుపులోకి తేవచ్చునని అంటున్నారు వేన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఆక్సిజన్ సరఫరా తగ్గినా, పెరుగుదలను ప్రోత్సహించే కణాలు చేరినా కేన్సర్ కణితులు కీమోథెరపీకి ప్రతిస్పందించవని ఇప్పటికే గుర్తించారు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని నానోకణాలను ప్రయోగిస్తే మాత్రం భిన్నమైన ఫలితాలు వస్తాయని అరుణ్ అయ్యర్, సమరేశ్ సాహులతో కూడిన శాస్త్రవేత్తల బృందం నిరూపించింది. నానోకణాలు నేరుగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న కణాలను, కణితి పెరుగుదలకు కారణమవుతున్న రోగ నిరోధక వ్యవస్థ కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయని, అంతేకాకుండా సాధారణ పరిస్థితుల్లో కేన్సర్ కణితులను నాశనం చేసే రోగ నిరోధక వ్యవస్థ కణాలను ప్రోత్సహిస్తాయని అరుణ్ వివరించారు. అంతేకాకుండా నానో కణాలు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కణితిని గుర్తిస్తాయని, కణితి గుర్తింపు, దశ నిర్ధారణ, శస్త్రచికిత్స ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం వంటి అంశాలన్నింటికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పైగా నానో కణాలను జోడించడం వల్ల కీమోథెరపి మరింత సమర్థంగా, తక్కువ దుష్ఫలితాలతో పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం తాము రీనల్ సెల్ కార్సినోమాకు సంబంధించి కొన్ని ప్రయోగాలు చేసినప్పటికీ ఇతర కేన్సర్ల విషయంలోనూ ఈ పద్ధతి సమర్థంగా పనిచేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. -
కాన్పు చేయలేక పీహెచ్సీ నుంచి గర్భిణి గెంటివేత
వెల్దుర్తి(తూప్రాన్): ప్రసవం కోసం వచ్చిన ఓ గిరిజన మహిళకు వైద్యం చేయడానికి ఇబ్బందిగా ఉందంటూ అర్ధరాత్రి దాటాక పీహెచ్సీ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీలేక గర్భిణిని తోడుగా వచ్చిన ఇద్దరు మహిళలు తమ భుజాలపై ఆమెను మోసుకుని బస్టాండ్ వైపు తీసుకెళ్లారు. అదే సమయంలో గణేష్ శోభాయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులు గమనించి గర్భిణిని మొదట స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం 108కు సమాచారం అందించి మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సభ్యసమాజం తలదించునేలా జరిగిన ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని ఉప్పులింగాపూర్ పంచాయతీ పరిధిలోని గిరిజనతండాకు చెందిన లాలావత్ జ్యోతిని కుటుంబ సభ్యులు కాన్పుకోసం ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వెల్దుర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాత్రి పురిటి నొప్పులు అధికమవడంతో స్టాఫ్నర్స్ కవిత కాన్పు చేయడానికి ప్రయత్నించింది. రాత్రి 12 గంటల వరకూ ప్రసవం కాకపోవడంతో ఇక్కడి నుండి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది, గర్భిణి కుటుంబీకులకు తెలిపారు. అయితే అం త రాత్రి సమయంలో ఎక్కడికి Ððవెళ్లాలని, మీరే ఎలాగైనా కాన్పు చేయండని వేడుకున్నా బలవంతంగా బయటకు పంపించారంటూ బాధిత మహిళ కుటుంబసభ్యులు తెలిపారు. విచారణ చేపట్టిన అధికారులు.. గర్భిణిని బయటకు గెంటివేసిన ఘటనపై జిల్లా వైద్యాధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక అందించాలన్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు ఆదేశాల మేరకు నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు, వెల్దుర్తి ఆస్పత్రి ఇన్చార్జి మురళీధర్ సోమ వారం వెల్దుర్తి పీహెచ్సీని సందర్శించారు. ఘటనకు సంబంధించి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులను అత్యవసర పరిస్థితుల్లో వేరే ఆస్పత్రికి తరలించే బాధ్యత సిబ్బందిపైనే ఉంటుందని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా పీహెచ్సీ వైద్యుడు రాకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, 108 వాహనంలో మెదక్ ఆస్పత్రిలో సోమవారం ఉదయం 3 గంటల సమయంలో ప్రసవం అయింది. ప్రస్తుతం తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నారు. -
ప్రొటీన్ ఆధారిత మందులు వచ్చేస్తున్నాయి...
కేన్సర్ చికిత్సకు వాడే మందులతో బోలెడన్ని దుష్ప్రభావాలు ఉంటాయని అందరికీ తెలుసు. అందుకే ఈ దుష్ప్రభావాలను వీలైనంత తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అతి సంక్లిష్టమైన ప్రొటీన్ల నిర్మాణాన్ని నియంత్రించడం ద్వారా అతితక్కువ చెడు ప్రభావాలను చూపగల కేన్సర్ మందుల తయారీకి వీరు మార్గం సుగమం చేశారు. ప్రొటీన్లతో కేన్సర్కు మాత్రమే కాకుండా అనేకానేక ఇతర వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించవచ్చునని చాలాకాలంగా తెలిసినప్పటికీ సంక్లిష్ట నిర్మాణం కారణంగా ఇప్పటివరకూ అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జెన్సిన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కొన్ని పరిశోధనలు చేపట్టింది. హిస్–ట్యాగ్ అకైలేషన్ అని పిలిచే ఈ పద్ధతిలో ప్రొటీన్లకు నిర్దిష్టమైన పరమాణువులను అతికించడం సాధ్యమవుతుంది. ఈ రకమైన ప్రొటీన్లు కేవలం కేన్సర్ కణాలకు మాత్రమే అతుక్కుంటాయి. ఆరోగ్యకరమైన వాటిని వదిలేస్తాయి. ఫలితంగా దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయన్నమాట. ఈ కొత్త పద్ధతిని ఉపయోగిస్తే కొత్తరకమైన ప్రొటీన్ ఆధారిత మందుల తయారీ రోగనిర్ధారణ కూడా సులువు అవుతుందని అంచనా. ఉదాహరణకు ప్రతీదీప్తినిచ్చే పరమాణువులను ప్రొటీన్లకు అతికిస్తే శరీరంలో అది ఎక్కడికెళ్లిందో సులువుగా చూడవచ్చునని జెన్సిన్ తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థకూ మధుమేహానికీ లంకె...! తిండి ద్వారా ఊబకాయమొస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా మీ సాయానికి రాదని వైద్యశాస్త్రం చెబుతుంది. తెల్ల రక్తకణాలు నేరుగా అడిపోస్ కొవ్వుకణజాలంలోకి చేరిపోయి మంట/వాపులకు కారణమవుతున్నాయని, ఇది కాస్తా చివరకు మధుమేహానికి దారితీస్తుందని కూడా శాస్త్రవేత్తలకు తెలుసు. ఎలా జరుగుతుందన్న విషయాన్ని మాత్రం వాండర్బిల్ట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తాజాగా తెలుసుకోగలిగారు. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అందించి ఎలుకలపై ప్రయోగాలు జరిపినప్పుడు సీడీ 8 + తెల్ల రక్తకణాలు చైతన్యవంతమవుతున్నాయని, కొవ్వులు దహనమయ్యే ప్రక్రియలో విడుదలయ్యే ఐసోలెవుగ్లాన్డిన్స్ రసాయనాలతో సీడీ 8 + కణాలు బ్యాక్టీరియా, వైరస్, అనారోగ్య కణాలపై దాడులు చేస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వ్యాట్ మెక్డోనెల్ తెలిపారు. అయితే ఇవే కణాలు కొవ్వు కణజాలంలో మాత్రం మంట/వాపులకు కారణమవుతుందని అన్నారు. ఇది కాస్తా ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా మధుమేహం వస్తుందని వివరించారు. ఐసోలెవుగ్లాన్డిస్ రసాయనాల ఉత్పత్తిని నియంత్రించే మందులను తయారు చేయడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతను అధిగమించేందుకు అవకాశముంటుందని తమ పరిశోధన చెబుతోందని చెప్పారు. జాబిల్లిపై షికారుకు టూరిస్ట్ రెడీ... అంతరిక్ష విహార యాత్రకు రంగం సిద్ధమైపోయింది. ఈలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ త్వరలో జాబిల్లిపైకి పంపే బిగ్ ఫాల్కన్ రాకెట్లో ప్రయాణించేందుకు ఓ అజ్ఞాత వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకొన్ని నెలల్లో తొలి ప్రయోగం జరుగుతుందని అంచనా. ఈ తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరన్న ప్రశ్నకు మస్క్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. ట్విట్టర్లో జపాన్ జాతీయ పతాకాన్ని పోస్ట్ చేసి ఆ దేశపు వ్యక్తి అని సూచించారు. ఆ తరువాత స్పేస్ ఎక్స్ ఇంకో ట్వీట్ చేస్తూ ఇప్పటివరకూ జాబిల్లిని చుట్టివచ్చిన వారు కేవలం 24 మంది మాత్రమేనని, 46 ఏళ్లు గడిచినా 25వ వ్యక్తి చందమామను చేరకపోయేందుకు అనేక కారణాలున్నాయని వివరించారు. రాకెట్ తయారీకి అనుమతులు లభించడంతోపాటు, ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఉన్న ఇబ్బందుల వల్ల ప్రయోగం కొంచెం అటు ఇటు కావచ్చునని సూచించారు. దాదాపు 350 అడుగుల ఎత్తున్న బిగ్ ఫాల్కన్ రాకెట్ల ద్వారా ముందుగా జాబిల్లిపైకి.. ఆ తరువాత కొన్నేళ్లకు అంగారకుడిపైకి మనుషులను పంపుతానని ఈలాన్ మస్క్ ఏడాది క్రితమే ప్రకటించారు. -
అక్కరకు రాని ఔషధాలు
కర్నూలు(హాస్పిటల్): ఔషధాలు అక్కరకు రాకుండా పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా రూ.4 కోట్ల విలువైన మందులు కాలం తీరిపోయి (ఎక్స్పైరీ) వృథాగా పడివున్నాయి. వీటిని కర్నూలు సెంట్రల్ డ్రగ్ స్టోర్లో గుట్టలుగుట్టలుగా పడేశారు. ప్రభుత్వ అడ్డగోలుతనం, ఉన్నతాధికారుల కమీషన్ల వ్యవహారానికి ఇవి నిలువుటద్దంలా నిలుస్తున్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాలుగేళ్లుగా డిమాండ్కు మించి పంపుతుండడం, ఇదే తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రులు డిమాండ్కు మించి తీసుకోలేకపోతుండడంతో మందులు సెంట్రల్ డ్రగ్స్టోర్లో పేరుకుపోయాయి. కాలం తీరిన వీటిని నాశనం చేసేందుకు అధికారులు ఇప్పుడు ఓ కమిటీ వేయడం గమనార్హం. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, ఆదోనిలో ఎంసీహెచ్ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రితో పాటు 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 86 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 40కి పైగా ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఏటా కర్నూలు సర్వజన వైద్యశాలకు ఒక్క దానికే రూ.4 కోట్లు, మిగిలిన ఆసుపత్రులకు రూ.4 కోట్ల విలువైన మందులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) ద్వారా మందులు, సర్జికల్స్ కొనుగోలు చేసి జిల్లా కేంద్రాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు పంపిస్తోంది. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక వాహనంలో తరలిస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దుర్వినియోగం చేస్తున్నారంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ–ఔషధి విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, సర్జికల్స్ ఇండెంట్ను వారు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ప్రభుత్వానికి పెడుతూ ఉండాలి. ఆయా ఆసుపత్రుల డిమాండ్ను బట్టి మందులను కేటాయిస్తూ ఉంటారు. ఏ ఆసుపత్రికి ఎంత డిమాండ్ ఉందనే విషయం ఉన్నతాధికారులకు తప్ప సెంట్రల్ డ్రగ్ స్టోర్కు కూడా సరైన సమాచారం ఉండదు. ఈ మేరకు రాజధాని ప్రాంతం నుంచే మందులను ఉన్నతాధికారులు కొనుగోలు చేసి, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. అవసరానికి మించి కొనుగోలు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక 2014లో మూడు నెలల ఇండెంట్కు బదులు తొమ్మిది నెలల మందులను ఒకేసారి పంపించారు. అప్పటి నుంచి అధిక శాతం మందులను కొనుగోలు చేసి పంపిస్తూనే ఉన్నారు. వీటిని పెట్టేందుకు అవసరమైన స్థలం లేక ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ కార్యాలయంలోని అధికారుల గదుల్లోనూ ఉంచారు. ఇటీవల ఎన్ఎస్, ఆర్సీ సెలైన్ బాటిళ్లు జిల్లాకు మూడు నెలలకు సంబంధించి 34,000 డిమాండ్ ఉండగా.. ప్రభుత్వం ఏకంగా లక్షకు పైగా పంపింది. ఇలా వచ్చిన మందుల్లో అధిక శాతం కాలపరిమితికి దగ్గరగా ఉన్నవే కావడం గమనార్హం. కాలపరిమితి తీరిన మందుల విలువ రూ.4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నాలుగేళ్లుగా కమీషన్లకు ఆశపడుతూ కొనుగోలు చేసిన మందుల్లో అధిక శాతం వినియోగం కాకపోవడంతో కాలం తీరిపోయాయి. ఇందులో బి.కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం, డైక్లోఫెనాక్, పారాసిటమాల్, సీపీఎం, ప్యాంటిడిన్, పాంటాప్రోజోల్ లాంటి 120 రకాల నిత్యావసర మందులూ ఉన్నాయి. ప్రస్తుతం ఇవే మందుల కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్రంగా ఉండటం గమనార్హం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. వెంటనే ఆ మందులను నాశనం చేయాలని జిల్లా అధికారులకు చెప్పినట్లు సమాచారం. దీంతో మందులను ఎలా నాశనం చేయాలనే విషయమై కమిటీ వేశారు. ఇకపోతే పీహెచ్సీలకు పంపిన మందుల్లో కాలపరిమితి తీరిన వాటిని అక్కడే నాశనం చేస్తున్నారు. మందులను నాశనం చేసేందుకు కమిటీ కొన్నేళ్లుగా కాలపరిమితి తీరిన మందులు సెంట్రల్ డ్రగ్స్టోర్లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.4 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటిని నాశనం చేసేందుకు నాతో పాటు డీఎంహెచ్వో, ప్రభుత్వ ఆసుపత్రి సీఎస్ఆర్ఎంవో, నంద్యాల డీసీహెచ్లతో కమిటీ వేశాం. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం పంపించాం. –విజయభాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ -
జీవో 550పై హైకోర్టు ఉత్తర్వులు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రక్రియలో జీవో 550లోని పేరా 5(2)ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే జరిగిన ప్రవేశాలను కదపరాదని స్పష్టం చేసింది. మాన్యువల్గా కౌన్సెలింగ్, స్లైడింగ్ అమలు చేసినంతవరకు జీవో 550 సరైనదేనని, అయితే దీన్ని ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా సహేతుకంగా అమలు చేయలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. వచ్చే ఏడాది కౌన్సెలింగ్కు సంబంధించి తగు మార్పులు చేసుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాలకు అవకాశం ఇచ్చింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కౌన్సెలింగ్లో ఓపెన్ కేటగిరీ సీటును వదులుకుని రిజర్వేషన్ కోటాలో మెరుగైన సీటును దక్కించుకున్నప్పుడు ఓపెన్ కేటగిరీలో ఖాళీ చేసిన సీటును అదే రిజర్వేషన్కు చెందిన మరో విద్యార్థితో భర్తీ చేయాలని నిర్దేశించే జీవో 550లోని పేరా 5(2)ను ఉమ్మడి హైకోర్టు ఇటీవల పక్కనపెట్టింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ 16 మంది విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, ఎన్టీఆర్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. గురువారం ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం శుక్రవారం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను మరోసారి పరిశీలించి రాతపూర్వకంగా సోమవారం వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును తప్పుపట్టిన ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా మౌఖిక ఆదేశాలు జారీ చేస్తూ ‘హైకోర్టు ఈ సమస్యను సరిగా అర్థం చేసుకోలేకపోయింది. ఓపెన్ కేటగిరీ సీటును వదులుకుని రిజర్వేషన్ కేటగిరీలో సీటు తీసుకున్నప్పుడు ఖాళీ అయిన ఓపెన్ కేటగిరీ సీటును రిజర్వేషన్ అభ్యర్థులతో భర్తీ చేయడానికి సంబంధించిన డేటాను హైకోర్టు సరైన రీతిలో విశ్లేషించలేదు. ఈ విధానంలో రిజర్వేషన్లు 50 శాతం మించలేదని స్పష్టమవుతోంది. ఇక జీవో 550లోని పేరా 5 మ్యాన్యువల్ కౌన్సెలింగ్లో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఆన్లైన్లో సీటు ఎంపిక, ఖాళీ, ఖాళీని అదే రిజర్వేషన్ కలిగిన అభ్యర్థితో భర్తీ చేయడం తదితర ప్రక్రియలన్నీ ఏకకాలంలో అమలుచేయడం కష్టసాధ్యం. అందువల్ల ఈ ఏడాది జరిగిన ప్రవేశాలకు అంతరాయం కల్పించరాదు. వచ్చే ఏడాది జీవో 550ని అమలు చేసుకోవడానికి ప్రభుత్వం అవసరమైన పక్షంలో తగిన మార్పులు చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఉదయ్కుమార్ సాగర్, పాల్వాయి వెంకటరెడ్డి, విద్యార్థుల తరఫున రమేశ్ అల్లంకి, ఎ.సత్యప్రసాద్, ఏపీ తరఫున గుంటూరు ప్రభాకర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరఫున ఎం.ఎన్.రావు పాల్గొన్నారు. -
తక్కువ ఫీజుకే విదేశాల్లో మెడిసిన్ సీట్లు అంటూ...
సాక్షి, హైదరాబాద్: తక్కువ ఫీజుకే విదేశాల్లో మెడిసిన్ సీటు ఇపిస్తానని వందల మంది విద్యార్థుల నుంచి కోట్లు రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వీకోట మండలం పాముగాని గ్రామానికి చెందిన కిషన్రెడ్డి గత పది సంవత్సరాల నుంచి దిల్సుఖ్నగర్లో ఇగ్గి మల్టీసర్వీస్ పేరుతో ఫిలిప్పీన్స్ లోని సీడీయూ యూనివర్సిటీలలో మెడిసిన్ సీటు ఇప్పిస్తానని విద్యార్థుల నుంచి 30 లక్షల రూపాయలు వరకు వసూలు చేశాడు. ముందుగా లక్ష రూపాయలు విద్యార్థు నుంచి వసూలు చేసి యూనివర్సిటీకు కట్టి అడ్మిషన్లు ఇప్పిస్తాడు. తాము ఫీజు కట్టినా కట్టలేదని యూనివర్సిటీల నుంచి ఫోన్లు రావడంతో కిషన్రెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరారు. డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదు ఎవరికీ చెప్పకుంటారో చెప్పుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ పిల్లల చదువులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అతడి వద్ద ఉండటంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థుల తల్లిదండ్రులు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి తప్పించుకుని తిరుగుతున్న కిషన్రెడ్డిని వారం రోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ పిల్లల ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ అతని వద్దే ఉన్నాయని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తమకు ఇప్పించాలని డీసీపీని తల్లిదండ్రులు కోరారు. తమ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని మరెవరికి జరగకుండా అతడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మెడిసన్ సీట్ల పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసి స్థిరాస్తులు కూడబెట్టుకున్న వాటిని జప్తు చేసి నష్టపోయిన వారికి ఇవ్వాలని పోలీసులకు విన్నవించుకున్నారు. -
ముంబైలో దారుణం.. ట్యాబ్లెట్లు వికటించి..
సాక్షి, ముంబై : ఐరన్, విటమిన్ ట్యాబ్లెట్లు వికటించడంతో ముంబైలోని గోవంది మురికివాడలోని ఓ పాఠశాలలో 12 సంవత్సరాల బాలిక మరణించగా, 197 మంది చిన్నారులు ఆస్పత్రిపాలయ్యారు. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న161 మంది చిన్నారులను గట్కోపర్లోని రాజవాది ఆస్పత్రికి తరలించగా, 36 మంది చిన్నారులను గోవంది శతాబ్ధి ఆస్పత్రికి తరలించారని డాక్టర్ ప్రదీప్ జాదవ్ తెలిపారు. స్కూల్లో ఇచ్చిన ఐరన్, విటమిన్ ట్యాబ్లెట్ను వేసుకున్న చందాని షేక్ అనే బాలిక గురువారం రాత్రి రక్తపు వాంతులు చేసుకుని మృత్యువాత పడిందని చిన్నారి తల్లితండ్రులు వెల్లడించారు. అయితే పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే బాలిక మృతికి కారణాలు వెలుగులోకి వస్తాయని వైద్యులు తెలిపారు. తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని రాజవాది ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విద్యా ఠాకూర్ తెలిపారు. -
గ్రామానికి కీడు సోకిందని...
ఆత్మకూర్ (ఎస్), (సూర్యాపేట): గ్రామానికి కీడు సోకిందని ప్రజలందరూ తమ ఇళ్లకు తాళాలు వేసి వన వాసానికి వెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో నెల రోజులుగా కొందరు జ్వరాల బారిన పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా తగ్గడం లేదు. అంతేకాకుండా వైద్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించినా తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో గ్రామానికి కీడు సోకిందని.. గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఊరంతా తమ ఇళ్లకు తాళాలు వేసి తెల్లవారుజామునే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నిప్పును కొనుక్కుని వనవాసానికి వెళ్లారు. దీంతో గ్రామంలో వీధులన్నీ బోసిపోయి కనిపించాయి. -
ఇళయరాజా సంగీతం ఇక వైద్యం!
తమిళసినిమా(చెన్నై): దశాబ్ధాలుగా తన అద్బుత సంగీతంతో కోట్లాది మందిని అలరిస్తున్న ‘మేస్ట్రో’ ఇళయరాజా సంగీతం ఇకపై వివిధ జబ్బులను నయం చేయడంలోనూ కీలకంగా మారనుంది. వెయ్యికిపైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఘనత ఆయనది. వీనులవిందైన ఇళయరాజా సంగీతాన్ని వైద్యానికి ఉపయోగపడేలా మార్చేందుకు సింగపూర్కు చెందిన ప్రముఖ మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి నిర్వాహకులు కృషి చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇళయరాజా రూపొందించిన సంగీత ఆల్బమ్లపై వారు పరిశోధనలు చేస్తున్నారు. ఇళయరాజా కూడా ఇందుకోసం కొన్ని ప్రత్యేక బాణీలను సమకూర్చుతున్నట్లు సమాచారం. ఉత్తమ సంగీత దర్శకుడిగా మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఇళయరాజాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించిన విషయం తెలిసిందే. -
శుభప్రదం శీఘ్ర ఫల దాయకం
అరటి శుభ సూచకం అని అందుచేత అరటిని శుభకార్యాలలో తప్పకుండా వినియోగిస్తారు. దీనివెనుక ఒక ఇతిహాస సంబంధమైన కథ కూడా ఉంది. ఒకప్పుడు దూర్వాస మహాముని సాయంసంధ్యవేళ కూడా ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఆయన భార్య (కదలీ) సంధ్యావందనం సమయం కావడంతో ఆయనను నిద్ర నుండి మేలుకొల్పుతుంది. దుర్వాసుడి నేత్రాలనుండి వచ్చిన కోపాగ్నికి ఆవిడ భస్మరాశిగా మారిపోతుంది. కొన్నిరోజుల తరువాత దుర్వాస మహర్షి మామగారు తన కూతురు గురించి అడగగా ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయిందని చెప్పి, తన మామ గారి ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు, ఆమెను చెట్టుగా మార్చి, శుభప్రదమైన కార్యాలన్నింటిలో కదలీఫలం (సంస్కృత పదానికి తెలుగు అర్థం అరటి) రూపంలో వినియోగించబడుతుంది అని వరాన్ని ఇస్తాడు. అరటి ఆకులను రకరకాల పనులకు ఉపయోగిస్తారు, ముఖ్యంగా భోజనం చెయ్యడానికీ, పెళ్ళిళ్ళలో మండపాల అలంకరణకు వాడతారు. ఆంజనేయస్వామిని ఆరాధించేవారు అరటితోటలో లేదా అరటిచెట్టు కింద స్వామి వారి విగ్రహాన్ని/ప్రతిమను/ పటాన్ని ఉంచి పూజిస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అరటికి అంటుదోషం, ఎంగిలి దోషం అంటవు. అందుకే అన్ని దేవతల పూజలలోనూ అరటిని నివేదించవచ్చు. కుజదోషం ఉన్నవారు అరటిచెట్టుకు చక్కెర కలిపిన నీరు పోసి, తడిసిన ఆ మట్టిని నొసట బొట్టుగా ధరిస్తే ఉపశమనం కలుగుతుందంటారు. అరటినారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల కొన్ని సత్ఫలితాలు కలుగుతాయంటారు. సంతానం లేనివారు అరటిచెట్టును పూజిస్తే మంచిదని చెబుతారు. అరటిని ఆనారోగ్యానికి ఔషధంగా వాడతారు. దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. మానసిక ఒత్తిడితో బాధపడేవారు అరటిపండ్లు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని, అరటిపండు శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుందనీ వైద్యనిపుణులు చెబుతారు. జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. -
మందులు బయట కొనుక్కోండి..!
ఎర్రగుంట్ల (వైఎస్సార్ కడప): ఎర్రగుంట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీ దేవగుడి శంకర్రెడ్డి సుబ్బారామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ ఆస్పత్రి సూపర్ స్ఫెషాలిటీ వైద్యులు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయితే రోగులను పరీక్షించి, మందులను బయట కొనుక్కోవాలని చీటీలు రాసిచ్చారు. ఈ పరిస్థితిలో మంత్రి ఆదినారాయణరెడ్డి వైద్య శిబిరాన్ని సందర్శించారు. మందులు రాసిచ్చిన విషయాన్ని రోగులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆది స్పందిస్తూ మందులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మందులు తెప్పించాలని ఆదేశించారు. అప్పటికే చాలా మంది రోగులు చీటీలతో వెళ్లిపోయారు. ఈ శిబిరాన్ని మంత్రి ఆది సతీమణి అరుణ, తనయుడు సుధీర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో నారాయణ ఆస్పత్రి గుండె, చర్మ, ఆర్థోఫెడిక్ తదితర వ్యాధుల వైద్య నిపుణులు రోగులను పరీక్షించారు. మందులు ఇవ్వకుండా చీటీలు రాసివ్వడంపై చాలా మంది రోగులు నిరాశకు గురయ్యారు. మంత్రి ఆదేశాలతో ఎర్రగుంట్లలోని ఓ ప్రైవేట్ మెడికల్ షాపు నుంచి మందులు తెప్పించి ఉన్న రోగులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి ఆది సోదరుడు జయరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముసలయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ జెక్కు చెన్నకృష్ణారెడ్డి, కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు. -
అశ్వగంధకు ఇదే అదను!
రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే ఔషధ పంటల్లో అశ్వగంధ ముఖ్యమైనది. తెలుగురాష్ట్రాలతోపాటు మరో 4 రాష్ట్రాల్లో అశ్వగంధ సాగులో ఉంది. పంటకాలం 150–180 రోజులు. ఆగస్టు మొదటి వారం వరకు దీన్ని విత్తుకోవచ్చు. అశ్వగంధ వేర్లు, కాండం, ఆకుల్లో ఔషధ గుణాలుంటాయి. అయితే వాణిజ్యపరంగా వేర్లకే గిరాకీ ఉంటుంది. మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది. వేర్లు లేత పసుపుతో కూడిన తెలుపు రంగులో చిరుచేదుగా ఉంటాయి. నరాల బలహీనతను నివారించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, అల్సర్ల నివారణకు ఉపయోగిస్తారు. అశ్వగంధ వేర్ల చూర్ణం నిద్రలేమిని నివారిస్తుంది. నీరు నిల్వ ఉండని నేలలు, పొడి వాతావరణం అనుకూలం. ఉదజని సూచిక 7.5–8.0 మధ్య ఉండాలి. వర్షాధార పంటగా సాగుకు తేలికపాటి నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉంటే ఇసుక నేలలు లేదా తేలికపాటి ఎర్రనేలలు అనుకూలం. జవహర్–20, రక్షిత, నాగరి రకాలు విత్తుకోవచ్చు. తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ బోడుప్పల్లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ(సీమాప్) అందించే పోషిత రకం వంగడం అనుకూలం. ఎకరాకు నారు పద్ధతిలో 2 కిలోలు, వెదజల్లే పద్ధతిలో 7–8 కిలోలు అవసరం. 5 రెట్లు ఇసుకతో కలిపి వెదజల్లాలి. నారును వరుసల మధ్య 25–30 సెం.మీ., మొక్కల మధ్య 8–10 సెం.మీ. ఉండేలా నాటుకోవాలి. అశ్వగంధకు తీవ్రమైన తెగుళ్లేవీ రావు. కాయలు ఎరుపు రంగులోకి మారినప్పుడు లేదా ఆకులు పూర్తిగా ఎండిపోయినప్పుడు మొక్కలను పీకి వేర్లను సేకరించాలి. వేర్లను 7–10 సెం.మీ. ముక్కలు చేసి నీడన ఆరబెట్టుకోవాలి. ఎండిన వేర్లను గ్రేడింగ్ చేసుకొని నిలువ ఉంచుకుంటే రైతులకు మంచి ధర లభిస్తుంది. ఎకరాకు 250–300 కిలోల ఎండు వేర్లు, 80 కిలోల విత్తనం వస్తుంది. ఎకరాకు ఖర్చు రూ. 15 వేల వరకు ఉంటుంది. జాతీయ ఔషధమొక్కల బోర్డు, తెలంగాణ ఔషధ మొక్కల బోర్డు(94910 37554) ఎకరా సాగుకు రూ. 4,392 వరకు సబ్సిడీ అందిస్తున్నాయి. మార్కెట్ ధరను బట్టి రూ. 35,000–45,000 వరకు నికరాదాయం రావచ్చు. మధ్యప్రదేశ్లోని నీమచ్, మాండ్సర్ మార్కెట్లు అశ్వగంధ కొనుగోలుకు ప్రసిద్ధి. స్థానికంగా కూడా మార్కెటింగ్ అవకాశాలున్నాయి. (రాజేంద్రనగర్లోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలోని ఉద్యాన కళాశాల పరిశోధక విద్యార్థులు ఎస్. వేణుగోపాల్, బి. అనిత అందించిన సమాచారం) -
ఆన్లైన్ ఔషధ విక్రయాల్లోకి దిగ్గజాలు...
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో దేశీ ఆన్లైన్ షాపింగ్ ముఖచిత్రాన్ని మార్చేస్తున్న దిగ్గజ ఈ–కామర్స్ సంస్థలు తాజాగా ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలను కొనేయడమో లేదా పెట్టుబడులు పెట్టడమో, వాటాలు తీసుకోవటమో చేసే పనిలో పడ్డాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజాలతో పాటు బిగ్బాస్కెట్, స్విగ్గీ వంటి సంస్థలూ బరిలోకి దిగడంతో ఆన్లైన్ ఫార్మా రంగంలో పోటీ మరింత తీవ్రం కానుంది. దేశీయంగా ఔషధాల అమ్మకాలు 2020 నాటికల్లా 55 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా. ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) గణాంకాల ప్రకారం 2017లో రూ. 1,19,641 కోట్ల (17.5 బిలియన్ డాలర్లు) విలువ చేసే ఔషధాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూన్లో రూ.10,215 కోట్ల (1.49 బిలియన్ డాలర్లు) విలువ చేసే ఔషధాలు దేశీయంగా అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెల గణాంకాలతో పోలిస్తే ఇది 8.6 శాతం అధికం. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఫార్మాలో పెద్దగా డిస్కౌంట్ల ఊసుండదు. దీంతో మార్జిన్లు భారీగానే (సుమారు 20–30 శాతం దాకా) ఉంటాయి. కొన్ని స్టార్టప్లు డిస్కౌంట్లు, ఆఫర్లతో ఆన్లైన్ ఫార్మసీలు ప్రారంభించినప్పటికీ... ఈ విభాగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ అంశాలే ఈ–కామర్స్ దిగ్గజాలను ఈ రంగంవైపు ఆకర్షిస్తున్నాయి. ఆన్లైన్ ఫార్మా సంస్థలతో అమెజాన్ చర్చలు ప్రస్తుతం దేశీయంగా మెడ్ప్లస్, 1ఎంజీ, మెడ్లైఫ్, ఫార్మీజీ, మైరా, అపోలో, నెట్మెడ్స్ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మెడ్ప్లస్ వంటి 3–4 సంస్థలతో అమెజాన్ చర్చలు జరిపినట్లు సమాచారం. దేశీయంగా రెండో అతి పెద్ద ఫార్మసీ చెయిన్ అయిన మెడ్ప్లస్పై అమెజాన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మెడ్ప్లస్కు ఆన్లైన్ ఫార్మసీతో పాటు దేశవ్యాప్తంగా 1,400 స్టోర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే... ఈ స్టోర్స్ని అమెజాన్ డెలివరీ సెంటర్లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. తద్వారా కార్యకలాపాలను మరింత భారీగా విస్తరించవచ్చు. అమెజాన్ నిర్దిష్టంగా ఎంత మేర వాటాలు కొనుగోలు చేసేదీ తెలియనప్పటికీ.. మెడ్ప్లస్తో ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మెడ్ప్లస్లో వ్యవస్థాపకుడు మధుకర్ గంగాడికి దాదాపు 90% వాటాలున్నాయి. 2006లో ప్రారంభమైన మెడ్ప్లస్.. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. మెడ్ప్లస్ ఆదాయాలు 2014–15లో రూ. 1,361 కోట్లు, 2015–16లో రూ. 1,726 కోట్లుగా ఉన్నాయి. రెండేళ్లలో లాభాలు రూ. 7–9 కోట్లుగా ఉన్నాయి. మెడ్లైఫ్పై ఫ్లిప్కార్ట్ దృష్టి.. అమెజాన్కు పోటీదారైన దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కూడా ఆన్లైన్ ఫార్మాలో ప్రవేశించేందుకు చకచకా పావులు కదుపుతోంది. అల్కెమ్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు నిర్వహించే మెడ్లైఫ్ సంస్థతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పేర్లు వెల్లడించనప్పటికీ.. రెండు భారీ ఈ–కామర్స్ సంస్థలతో చర్చలు జరిపినట్లు, ప్రస్తుతానికి ఇవి ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు మెడ్లైఫ్ వర్గాలు పేర్కొనడం ఇందుకు ఊతమిస్తోంది. ఇక ఫుడ్ డెలివరీ సేవల్లో ఉన్న బెంగళూరు సంస్థ స్విగ్గీ .. ఔషధాల డెలివరీ సర్వీసులు కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దీనికి ఈ–ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. అటు ఆన్లైన్లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్బాస్కెట్ సంస్థ.. కొత్తగా ఫార్మాను కూడా తమ లిస్టులో చేర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐవోసీడీ ఆందోళన.. ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏఐవోసీడీ ఆగస్టు 1 నుంచి 14 దాకా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం గానీ తమ డిమాండ్లను పట్టించుకోకపోయిన పక్షంలో రోజు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే షాపులు తెరిచేలా వర్క్–టు–రూల్ విధానాన్ని అమలు చేస్తామని ఏఐవోసీడీ హెచ్చరిస్తోంది. ఇందులో 8.5 లక్షల మంది కెమిస్టులు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉన్నారు. పిల్ప్యాక్ కొనుగోలుతో అమెజాన్ సంచలనం.. అమెరికాలో పిల్ప్యాక్ అనే ఆన్లైన్ ఫార్మా కంపెనీని దాదాపు 1 బిలియన్ డాలర్లకు అమెజాన్ కొనుగోలు చేయడం అక్కడి ఫార్మా మార్కెట్ను కుదిపేసింది. ఈ డీల్ వార్తతో అమెరికా ఫార్మసీ/డ్రగ్స్టోర్ పరిశ్రమ మార్కెట్ క్యాప్ ఏకంగా 13 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. ఇలాంటి భారీ సంచలనాన్నే భారత్లోనూ పునరావృతం చేసేందుకు అమెజాన్ కసరత్తు చేస్తోంది. నిజానికి అమెజాన్కి ఆన్లైన్ ఫార్మా వ్యాపారం కొత్తేమీ కాదు. 1998లో డ్రగ్స్టోర్డాట్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కానీ, 2000లో టెక్నాలజీ సంస్థలు కుదేలవడంతో.. ఇది మూతబడింది. ఆకర్షణీయమైన భారత మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అమెజాన్ మళ్లీ రంగంలోకి దిగుతోంది. -
మందుల్లేవ్..
పశ్చిమగోదావరి , భీమవరం (ప్రకాశం చౌక్): పేదల ఆరోగ్యం కోసం, ఉత్తమ వైద్య సేవలందించేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొం దిం చిన 104 పథకానికి ‘చంద్రన్న సంచార చికిత్స’గా పేరుమార్చిన తెలుగుదేశం పాలకులు పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 104 వాహనంలో గ్రామాలకు చేరుకుని అక్కడే పేదలకు వైద్య సేవలతో పాటు మందులు అందజేసేలా పథకాన్ని రూపొందించారు. వైఎస్ హ యాంలో 104 సేవలు ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో అందాయి. ఆయన మరణాంతరం పథకం అరకొర సేవలతో నడుస్తోంది. 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పథ కం పేరును ‘చంద్రన్న సంచార చికిత్స’గా మా ర్చారు. అయితే ఈ సేవలు గ్రామీణులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. నెలలో ఒక్కసారి గ్రామానికి వచ్చి పేదలకు సేవలు అందించే 104 వాహనాల్లో కనీసం మందులు కూడా ఉండటం లేదు. దీంతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. బీపీ (రక్తపోటు), షుగర్ మందులు కొరత సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో 104 వాహనాల వద్దకు వచ్చిన వృద్ధులు మందులు లేక నిట్టూరుస్తూ వెనుదిరుగుతున్నారు. రెండు నెలల నుంచి.. జిల్లాలో 104 వాహనాలు 21 ఉన్నాయి. రెండు నెలలుగా ఆయా వాహనాల్లో బీపీ (ఎథనోలాల్) మందులు, బి.కాంప్లెక్స్ మందులు లేవు. ప్రతి గ్రామంలో బీపీ బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ప్రతి గ్రామంలో వాహనం వద్దకు 50 నుంచి 70 మంది వరకు బీపీ మందుల కోసం వస్తున్నారు. బీపీ మందుల్లో కచ్చితంగా ఉండాల్సిన ఎథనోలాల్ మందులు రెండు నెలలుగా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 104 సిబ్బంది ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ సరఫరా కాలేదు. దీంతో రోగులకు వీరు అందించలేకపోతున్నారు. దీంతో పాటు బి.కాంప్లెక్స్ మందులు కూడా 104 వాహనాల్లో లేవు. మహానేత వైఎస్సార్ హయాంలో 108, 104 పథకాలు సమర్థవంతంగా నిర్వహించారని, ఆయన మరణాంతరం పథకాల అమలుపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని వృద్ధులు వాపోతున్నారు. వారంలో సరఫరా చేస్తాం 104 వాహనాల్లో అందుబాటులో లేని బీపీ రకం, బి.కాంప్లెక్సు మందుల కోసం ప్రతిపాదనలు పంపించాం. వారంలో అన్ని వాహనాల్లో మందులు ఉంచి కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. – డీఎం వీఎస్ఎన్మూర్తి, 104 జిల్లా మేనేజర్ -
ఈ దోపిడీ మూలాలేమిటి?
విశ్లేషణ ప్రాణం కాపాడే మందుల ధరలు ప్రజలకు అందుబా టులో ఉంచడానికి. జాతీయ ఔషధ ధరల అథారిటీ గరిష్ట ధరలను నిర్ణయించాలి. నిర్ణీత ధరకు మించి అమ్మితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అథారిటీ ధరలు నిర్ణయించడం లేదు. జాబితాలో నిజంగా అత్యవసరమైనవి చేర్చడం లేదు. నిర్లిప్తత, నిష్క్రియాపరత్వం వల్ల ప్రయివేటు వైద్యవర్తకుల దోపిడీకి అవకాశం వచ్చింది. ఒక అభా గ్యుడికి గుండెపోటు వస్తే ఫరీదాబాద్ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. స్టెంట్ అమర్చాలన్నారు. ఆస్పత్రి వారే స్టెంట్ను లక్షా 26 వేల రూపాయలకు అమ్మారు. స్టెంట్ ప్యాకెట్ బాక్స్పై గరిష్ట ధర లేదు. ఎందుకని అడిగితే ప్రభుత్వం స్టెంట్ను ఔషధంగా ప్రభుత్వం పరిగణించదు కనుక నియంత్రణ లేదట. జాతీయ ఔషధ ధరల అథారిటీ సేకరించిన వివరాల మేరకు జాబితాలో లేని వస్తువులు, మందులకు ధరలు వేయి శాతం నుంచి రెండువేల శాతం వరకూ పెంచేస్తున్నారు. మరో వైపు కార్డియో వాస్క్యులార్ రోగాలు పెరుగుతూ అయిదేళ్లలో ఆంజియోప్లాస్టీ చికిత్సలు రెట్టింపు అయ్యాయి. స్టెంట్ పేర రోగులను నిలు వునా దోచుకుంటున్నారు. ఇదో పెద్ద కుంభకోణం. ఏ స్టెంట్ కొనమనాలో వైద్యశాల యజమానులు డాక్ట ర్లను ఆదేశిస్తారు. డాక్టర్ చెప్పారని ఎంత ధరైనా పెట్టి కొంటారు. మార్కెట్లో మంచి స్టెంట్ ఎంచుకునే స్వేచ్ఛ గుండె రోగులకు లేదా? ప్రయివేటు వైద్య వర్తకుల స్టెంట్ దోపిడీని అరికట్టేందుకు జాతీయ అత్యవసర మందుల జాబితాలో ఈ స్టెంట్లు చేర్చా లని ఆదేశించాలని కోరుతూ ప్రజాప్రయోజన వాజ్యాన్ని బీరేందర్ సాంగ్వాన్ ఢిల్లీ హైకోర్టులో 2014లో దాఖలు చేశారు. ఆర్టీఐ ద్వారా సాధించిన సమాచార పత్రాల ఆధారంగా ఈ పిల్ను రూపొం దించారాయన. ఈఎస్ఐ కార్పొరేషన్ తమ ఆస్పత్రుల్లో స్టెంట్ ఇంప్లాంట్ చేసే సౌకర్యాలు లేవనే నెపంతో రోగు లను ప్రయివేటు వైద్యశాలలకు పంపుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సీజీహెచ్ఎస్ ధరలను లేదా ఎయిమ్స్ ధరలను మాత్రమే వసూలు చేయాలని నియమాలు ఉన్నట్టు అధికారులు అంటున్నారు. ఎంత మంది రోగులను ప్రయివేటు ఆస్పత్రులకు పంపారు? వారు ఎంత ధర వసూలు చేశారు? నిర్ణీత ధరలు ఏవి? అని సమాచార హక్కుచట్టం కింద అడిగారు. కోట్ల రూపాయలు ప్రయివేటు ఆస్పత్రులకు చెల్లించే బదులు సొంత ఆస్పత్రుల్లో కావలసిన చికిత్సలు అందించే ఏర్పాట్లు చేయరు. కార్పొరేట్ ఆస్పత్రులకు దోచుకునే అవకాశం ఇస్తున్నారు. దీని వల్ల ఏటా రూ.1500 కోట్ల చొప్పున 2013 నుంచి 2016 దాకా చెల్లించవలసి వచ్చిందని ఈఎస్ ఐసీలో పనిచేసిన ఒక డాక్టర్ వివరించారు. ఔషధం స్రవించే స్టెంట్లను ఇండియాలో 600 నుంచి 2971 డాలర్ల ధర దాకా అమ్ముతున్నారని, అమెరికాలో ఈ స్టెంట్లను అంతకు సగం కన్నా తక్కువ ధరకు అంటే సగటున 1200 డాలర్లకు అమ్ముతున్నారని అమెరికన్ హెల్త్ అసోసియేషన్ పరిశోధనా పత్రంలో వివరించారు. ఈఎస్ఐసీవారు సాధారణంగా సీజీహెచ్ఎస్ రేటునే చెల్లిస్తారని చెప్పారు. నిజానికి ప్రైవేటు ఆసుపత్రులవారు ఎయిమ్స్ లేదా, సీజీహెచ్ఎస్ రేట్లకన్నా రెండున్నర రెట్లు ఎక్కువ ధరకు వసూలు చేస్తున్నారని, అయినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆర్టీఐ వేసిన ఒక డాక్టర్ విమర్శించారు. ఎయిమ్స్ రేటు లేదా సీజీహెచ్ఎస్ రేటుతో పోల్చితే మార్కె ట్లో ప్రైవేటు ఆస్పత్రుల ధరలు చాలా ఎక్కువ. మార్కెట్ లో గరిష్ట ధర కన్న 15 శాతం తక్కువ చార్జి చేయాలని నియమాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈఎస్ఐసీ వారు సాధారణంగా సీజీ హెచ్ఎస్ రేటునే చెల్లిస్తారని చెప్పారు. పాలనా విధా నాలను సరిచేయడంలో ఆర్టీఐ ప్రజలకు ఒక భూమి కను ఏర్పాటుచేస్తుంది. మొట్టమొదట స్టెంట్ రేటును నియంత్రించాలి. గరిష్ట ధర ఎంతో విస్తృతంగా ప్రజ లకు సులువుగా తెలియజేయాలి. ప్రయివేటు ఆసు పత్రుల గోడల మీద స్టెంట్ గరిష్ట ధర పెద్దగా రాసి ఉండాలి. అంతకు మించిన ధర ఇవ్వద్దనీ, వసూలు చేస్తే ఫలానా వారికి ఫిర్యాదు చేయాలని, మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ కూడా పెద్దగా రాయాలి. ఈ విధంగా రాయని వైద్యశాలల లైసెన్సు రద్దు చేయాలి. కేవలం జాతీయ అత్యవసర ఔషధాల్లో ఒకటిగా స్టెంట్ను చేర్చకపోవడం, అత్యవసర వస్తు వుల ధరల అథారిటీ ధరలను నిర్దారించకపోవడం వల్ల కోట్లాది రూపాయల అవినీతి ప్రభుత్వ రంగం లోనూ, అదే స్థాయిలో అక్రమార్జన ప్రయివేటు ఆస్పత్రి రంగంలోనూ జరుగుతోంది. దోపిడీకి గుర య్యేది మాత్రం సామాన్య రోగులు, మధ్యతరగతి కుటుంబాల వారు. ఈ విధాన నిర్ణయాలు తీసుకోవ డంలో ఎంత ఆలస్యం అయితే అంత మేరకు రోగుల దోపిడీ జరుగుతూనే ఉంటుంది. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
సకల సంపత్కరం శ్వేతార్కం
జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాధిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి, మట్టిని కడిగివేసి, నీళ్లలో నానబెట్టి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క ఇంటిలో ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయని, ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్పభ్రావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. అయితే, ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అంటారు. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్రం అంటే ఏమిటో తెలీదని శాస్త్రం చెబుతోంది. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని, వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని, శ్వేతార్క వేరుని తాయిత్తులలో ధరించటంగాని చేస్తే శుభప్రదం. ఎవరైతే శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి. జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు పండితుల్ని, పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. కుదరని పక్షంలో వినాయక చవితి çరోజున ఈ శ్వేతార్క గణపతిని ప్రతిష్టించి పూజ చేసుకోవాలి. -
పేదాస్పత్రి
సర్వజనాస్పత్రి...జిల్లాకే పెద్దదిక్కు. ఏ చిన్న జబ్బుచేసినా నిరుపేదలంతా పరుగున వచ్చేది ఇక్కడికే. అందుకే రోజూ ఓపీ 2,000 దాకా ఉంటుంది. అడ్మిషన్లో 1,300 మంది దాకా ఉంటారు. కానీ ఇది పేదాస్పత్రిగా మారిపోయింది. కనీసం మందులు అందజేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికొచ్చిన వారిని ప్రైవేటు ఫార్మసీల మెట్లెక్కిస్తోంది. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా.. పట్టించుకోవాల్సిన ఉన్నతాధికారి తనకేం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.. ప్రశ్నిస్తే..మందులు పుష్కలంగా ఉన్నాయంటూ బుకాయిస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిని మందుల కొరత పట్టిపీడిస్తోంది. మూడు నెలలుగా మందులు పూర్తి స్థాయిలో లేవు. దీంతో ఫార్మసీ సిబ్బంది రోగులకు అరకొరగా పంపిణీ చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే... స్టాక్ లేదని సమాధానం చెబుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం మాత్రం స్టాక్ పుష్కలంగా ఉందని సమాధానమిస్తోంది. రోగులు మాత్రం ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్నా మంత్రులు, ఎమ్మెల్యే పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం జిల్లా కలెక్టర్ అయినా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సాధారణ మాత్రలకే గతిలేదు ఆస్పత్రిలో సాధారణ మాత్రలు కూడా అందుబాటులో లేకుండాపోయాయి. రాన్టాక్, పాన్టాప్, బీ కాంప్లెక్స్, విటమిన్ సీ,డీ 2 సీసీ సిరంజీలు, గ్లౌవ్స్ కూడా లేవు. వీటి ధర చాలా తక్కువ. ఇలాంటి వాటిని సరఫరా చేయడంలో ఆస్పత్రి యాజమాన్యం విఫలమవుతోంది. ఇకఖరీదైన మందుల కథ దేవునికెరుకనే చెప్పాలి. వీటితో పాటు 70 రకాల యాంటీబయాటిక్స్ మందులు పూర్తి స్థాయిలో లేవని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అలాగే బీపీని అదుపులో ఉంచే ఆమ్మోడిపిన్తో పాటు ట్రెమడాల్, డైజోఫామ్ ఇంజెక్షన్, తదితర మందులు సరఫరా ఆగిపోయింది. ఆర్ఎల్ ఐవీ ప్లూయిడ్ లేదు. ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సిందే సర్వజనాస్పత్రికి వచ్చే రోగుల్లో 90 శాతం నిరుపేదలే. ఆస్పత్రిలో మందుల కొరత కారణంగా రూ.వందలు వెచ్చించి ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ‘‘అత్యవసర కొనుగోలు’’ కింద డబ్బులు వెచ్చించి రోగులకు సరఫరా చేయవచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఇక.. ఎన్టీఆర్ వైద్యసేవ కేసుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద సర్జరీ చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆస్పత్రిలో అలాంటి పరిస్థితే లేదు. వారుసైతం ప్రైవేట్గా కొనుగోలు చేస్తున్నారు. మందులు సమృద్ధిగా ఉన్నాయే... ఆస్పత్రిలో మందుల కొరతా..? అలాంటి పరిస్థితే లేదే.. మందులు సమృద్ధిగానే ఉన్నాయి.. మందులు లేకపోతే ఎమర్జెన్సీ పర్జేసింగ్ కింద అందజేస్తున్నాం.–డాక్టర్ జగన్నాథ్, ఆస్పత్రిసూపరింటెండెంట్ -
భారత్ దిగుమతులకు చైనా ప్రోత్సాహకాలు
బీజింగ్ : భారత్ నుంచి ఔషధ దిగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు వాటిపై సుంకాలను తగ్గిస్తూ ఆ దేశంతో ఒప్పందానికి వచ్చినట్టు సోమవారం చైనా వెల్లడించింది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్షీణించిన క్రమంలో భారత్ నుంచి ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులను భారీగా దిగుమతి చేసుకోవాలని చైనా నిర్ణయించింది. మరోవైపు భారత్తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి చర్యలు చేపట్టే క్రమంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆసియా పసిఫిక్ వాణిజ్య ఒప్పందం (ఏపీటీఏ)కు అనుగుణంగా జులై 1 నుంచి భారత్, చైనాలు పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాయి. ఈ గ్రూపులో బంగ్లాదేశ్, లావోస్, దక్షిణ కొరియా, శ్రీలంకలు కూడా సభ్యదేశాలుగా ఉన్నాయి. వ్యవసాయ, రసాయన ఉత్పత్తులు సహా 8549 ఉత్పత్తులపై టారిఫ్స్ను తగ్గించనున్నామని, భారత్ దాదాపు 3142 ఉత్పత్తులపై దిగమతి సుంకాలను తగ్గించనుందని చైనా స్పష్టం చేసింది. -
కాటేస్తున్నాయ్!
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో దుక్కులు దున్నే సమయంలో పుట్టలు, ఏపుగా పెరిగిన గడ్డి నుంచి పాములు బయటికి వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల రైతులు పాముకాటుకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి 149 పాము కేసులు వచ్చాయి. ఇప్పటికే ముగ్గురు మృతి చెందడం గమనార్హం. పాము కాటుతో పాటు ఇతర విషపు పురుగులు కుట్టి ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచే కాకుండా రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, భువనగిరి, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఆయా జిల్లా కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీ స్నేక్ వీనం మందుతో పాటు వెంటిలేటర్ సపోర్ట్, నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియాకు పరుగులు తీస్తున్నారు. పాము కాటును గుర్తించి, ఆస్పత్రికి తరలింపులో తీవ్రజాప్యం జరుగుతుండటంతో బాధితులు మృత్యువాతపడుతున్నారు. మూడు గంటలు మించితే ప్రాణాపాయమే.. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నట్లు ఓ అంచనా. మన దేశంలో ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుంది. దేశంలో దాదాపు 250 జాతుల పాములంటే వాటిలో 52 విషసర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో కనిపించే పాముల్లో 5 జాతులు మాత్రం అత్యంత విషపూరితమైని. ఇవి కాటేసిన మూడు గంటల్లో మనిషి చనిపోతాడు. ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి. లేనిపక్షంలో ప్రాణాలకు ముప్పు తప్పదు. కాటువేసిన పాము విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవాలంటే కరిచిన చోట ఎన్ని గాట్లున్నాయో పరిశీలించాలి. ఒకటి లేదా రెండు కాట్లు ఉంటే విషపూరితమైందని.. మూడు అంతకంటే ఎక్కువ ఉంటే విషరహితమైందిగా గుర్తించాలి. విషపూరిత సర్పం కాటువేస్తే గాయమైన ప్రాంతం నుంచి విషం శరీరంలోకి చేరుతుంది. అక్కడి నుంచి గుండెకు, గుండె నుంచి ఇతర శరీర భాగాలు, మెదడుకు రక్తం ద్వారా చేరుకుంటుంది. పాము విషం అన్ని శరీర భాగాలకు చేరడానికి మూడు గంటలు పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోతాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి.. విషపూరిత సర్పం కరిచిన వెంటనే గాయంపై అంటే గుండె వైపు బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని పాము కాటువేసిన గాయం దగ్గర పెట్టి రక్తాన్ని బయటకు లాగాలి. మొదట రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అంటే అది విషతుల్యమైన రక్తమని అర్థం. ఇలా రెండు మూడు సార్లు చేస్తే ఆ వ్యక్తి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కోరల్లో ఉంచుకునే విషం 0.5 ఎంఎల్ నుంచి 2 ఎంఎల్ వరకు మాత్రమే. అలాగే కేవలం రూ.5 నుంచి రూ.10 విలువుండే నాజా 200 అనే 5ఎంఎల్ హోమియోపతి ఔషధం ఇంట్లో ఉంచుకోవాలి. దీనిని పాము కాటుకు గురైన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి మూడుసార్లు వేస్తే త్వరగా కోలుకుంటాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. -
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు శుభవార్త
తూర్పుగోదావరి, రామచంద్రపురం: హెచ్ఐవీ వ్యాధితో జీవిస్తున్న వారికిది నిజంగా శుభవార్తే. ఇప్పటివరకు ప్రతినెలా లింక్ ఏఆర్టీ కేంద్రానికి వచ్చి మందులు తీసుకోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో వీరికి కొంత వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి వీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు సరిపడా మందులు అందించనున్నారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.పవన్కుమార్, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జావేద్ లాల్బండ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పి.సత్యనారాయణ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జి. ఆదిలింగం, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఐసీటీసీ సూపర్వైజర్ ఎ.బుజ్జిబాబు పాల్గొన్నారు. -
‘వర్సిటీ’ పేరిట వంచన
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడిసిన్ సీట్లు ఇస్తానంటూ అనేక మంది వైద్యులను నిండా ముంచిన సూడో డాక్టర్ సంతోష్ రాయ్ కేసు దర్యాప్తులో కొత్త విష యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఇతనితో పాటు సహచరుడైన మనోజ్కుమార్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. దాదాపు 16 ఏళ్లుగా మోసాలు చేస్తున్న సంతోష్ వ్యవ హారాలకు నాంది ఢిల్లీలోనే పడింది. 2002లో ఎస్ఆర్ఎం వర్సిటీని ఏర్పాటు చేసి పలు కోర్సుల పేర అడ్మిషన్లంటూ మోసాలకు తెరలేపాడు. కొన్ని వైద్య సంబంధ కోర్సుల్నీ ప్రవేశపెట్టాడు. అప్పట్లో 30 మంది నుంచి రూ.9 కోట్ల వరకు వసూలు చేసి జైలుకెళ్లాడు. అయినా మోసాలు కొనసాగిస్తూ ముఠాల ఏర్పాటుతో వ్యవస్థీకృత పంథాలోకి మారాడు. ఇటీవల సంతోష్పై 2 కేసుల్ని సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. నగరానికి చెం దిన డాక్టర్ ఫాతిమా కుమార్తెకు పీజీ మెడిసిన్ సీటు పేరుతో రూ.81 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు సిటీలో ఉండగా, ఢిల్లీలో రాజేంద్రనగర్కు చెందిన మరో వ్యక్తి నుంచి రూ.68 లక్షలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించాడు. ఇతని అరెస్టుని మీడియా ద్వారా తెలుసుకున్న ఇద్దరు బాధితులు సోమవారం బయటకు వచ్చారు. వైజాగ్ కి చెందిన ఓ డాక్టర్ తన నుంచి రూ.65 లక్షలు తీసుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు తెలపడంతో అక్క డి ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు. బెంగళూరు నుంచి వచ్చి సిటీలో ఉద్యోగం చేస్తున్న మరో వైద్యుడు సైతం సైబర్ క్రైమ్ ఠాణాను సంప్రదించాడు. సంతోష్ అండ్ గ్యాంగ్ తన నుంచి రూ.40 లక్షలు తీసుకున్నట్లు వాపోయాడు. దీనిపై బెంగళూరులో కేసు నమోదు కానుంది. ఈ రెండు కేసుల్లో అక్కడి పోలీసులు సంతోష్ తదితరుల్ని పీటీ వారంట్పై అక్కడకు తరలించే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీగానే... ఈ గ్యాంగ్ ఒక్కొక్కరి నుంచి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసింది. సాధారణంగా ఇంతటి భారీ మొత్తాలను మోసగాళ్లు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకోవడమో, ట్రాన్స్ఫర్ చేయించడమో చేస్తుంటారు. కానీ వీరు బ్యాంక్ ఖాతాల జోలికిపోలేదు. వాటిని వాడితే పోలీసులకు ఆధారాలు లభిస్తాయనే ఉద్దేశంతో నగదు మాత్రమే తీసుకునేవారు. ఇతన్ని అరెస్టు చేసిన పోలీసులు 11 బ్యాంకు ఖాతా లను గుర్తించి ఫ్రీజ్ చేశారు. వీటిలో ఒక్క ఖాతాలోనే రూ.3 లక్షలు ఉన్నట్లు తేలింది. బాలీవుడ్ నిర్మాత అయిన సంతోష్ ఆ రంగంలో పెట్టుబడులు పెట్టి ఉం టాడన్న కోణంలోనూ అధికారులు దృష్టి పెట్టారు. ఈ సూడో గ్యాంగ్ కొన్ని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఈడీ సహా ఇతర సంస్థలు దర్యాప్తు చేస్తు న్న ఆర్థిక నేరాల వివరాలు సంతోష్కు తెలిసేవి. అందులోని నిందితులతో సంప్రదింపులు జరిపి ఆయా కేసుల్ని సెటిల్ చేయిస్తానని లేకుంటే త్వరలో కఠిన చర్యలు తప్పవని బెదిరించేవాడు. ఈ కోవకు చెందిన బాధితుల్లో సిటీకి చెందిన వారూ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు ప్రాధాన్యత, పరిధి దృష్ట్యా లోతుగా విచారించడానికి సంతోష్ను 10 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
వైద్యఅంగడిలో బందిపోట్లు
బందిపోట్లు స్టెన్గన్లతో దోచుకుంటే స్టెతస్కోప్లతో వైద్యం చేసే డాక్టర్లు స్టెంట్ పోట్లతో రోగుల గుండెల్లో పొడిచారు. ఒక లాయర్ సాంగ్వాన్. ఫరీదాబాద్లో తన మిత్రుడికి కరొనరీ స్టెంట్ కావాలంటే వైద్యశాలకు వెళ్లాడు. రక్త ప్రసరణ సాఫీగా సాగడానికి వీలుగా తీగతో అల్లిన స్టెంట్ అనే వస్తువును మూసుకుపోయిన గుండెనాళాల్లో అమరుస్తారు. ఆ స్టెంట్ గరిష్ట ధర ఎంత అనడిగితే చెప్పేవాడే లేడు. మీరు కొన్న రశీదు ఇవ్వండి అంటే అదీ ఇవ్వడు. పోనీ నాకు ఈ ధరకు స్టెంట్ అమ్మినట్టు రశీదు ఇవ్వండి అంటే అదీ లేదు. ఆ నల్లకోటు లాయర్ ఈ తెల్లకోటు వ్యాపారుల దోపిడీమూలాలు కనుక్కోవడానికి పరిశోధన మొదలుపెట్టాడు. మనదేశంలో చికిత్స పేరుతో కొందరు డాక్టర్ల తెల్లకోటు చాటున ఆరులక్షల 70 వేల కోట్ల రూపాయల నల్ల దందా జరుగుతున్నదని తేల్చాడు సాంగ్వాన్. ఈ దేశంలో రూ. 3,300 కోట్ల దాకా కరొనరీ స్టెంట్ల పరిశ్రమ వర్థిల్లుతున్నది. అసలా రోగికి స్టెంట్ అవసరమా లేదా అనేది వేరే కుంభకోణం. స్టెంట్ ధర దానికదే ఒక భయంకరమైన కుంభకోణం. మనదేశంలో కార్డియోవాస్కులార్ సమస్యలతో, గుండెపోటు తదితర గుండె జబ్బులతో మృత్యుముఖంలోకి వెళుతున్న అయిదు కోట్ల మందికి బతకాలంటే స్టెంట్లు తప్పనిసరి అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ డాక్టర్ కార్పొరేట్ అనైతిక వ్యాపార సంబంధాల వల్ల నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి నిరంతర కృషి చేయడం వల్ల జనించిన కృత్రిమ స్టెంట్ మార్కెట్ విపరీత లాభాపేక్షా దుర్బుద్ధిని మరింత పెంచింది. వీరు స్టెంట్ను అసలు ధర కన్న 654 శాతం ఎక్కువకు అమ్ముతున్నారు. మన వైద్యవస్తువులు ఔషధాల ధరలను నిర్ధారించే జాతీయ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ సంస్థ ఇన్నాళ్లూ ఏంచేసిందో తెలియదు కాని ఫిబ్రవరి 13, 2017 నాడు కోటింగ్ లేని అసలు స్టెంట్ ధర 7,260 రూపాయలకన్న మించరాదని చెప్పింది. లక్షలాది మంది హృద్రోగులు హృదయంలేని హృదయ సజ్జనుల (సారీ.. సర్జనుల) దోపిడీకి బలైన తరువాత, సాంగ్వాన్ వంటి సామాన్యులు ఆర్టీఐ ద్వారా పిల్ ద్వారా ఈ కుంభకోణాన్ని బయటికి తీసిన తరువాత తీరిగ్గా ఈ ధరానిర్ధారణాధికార సంస్థ ఈ రహస్యాన్ని ప్రకటించింది. ఔషధాన్ని స్రవించే అత్యాధునిక స్టెంట్ను కూడా 29 వేల 600 రూపాయల కన్నా ఎక్కువ ధరకు అమ్మకండిరా తెల్ల వ్యాపారుల్లారా అని చెప్పిందా? స్టెంట్ కొనుక్కున్న గుండె వ్యాపారులు ఇప్పటివరకు ఎంత చెల్లించారో లెక్కవేసుకోండి. అప్పటిదాకా రూ. 7,260ల స్టెంట్ను ఈ దొంగలు రూ. 45 వేలకు, రూ. 29,600ల అత్యాధునిక స్టెంట్ను లక్షా 20 వేలకు సగటున కొన్నేళ్ల పాటు అమ్ముకున్నారు. సాంగ్వాన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మెట్రో హాస్పిటల్ వారు 3.2 లక్షల రూపాయల కన్న ఎక్కువ వసూలు చేశారని పేర్కొన్నారు. సాంగ్వాన్ వరసగా ఆర్టీఐ పిటిషన్లు వేస్తూ మొత్తం 54 ఆస్పత్రుల వారు రకరకాల రేట్లు వేసి గుండెలో స్టెంట్ పేరుతో నెత్తురు తోడుకున్నారని వివరించారు. స్టెంట్లను కూడా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చి వాటి ధరలను ఇష్టం వచ్చినట్టు వైద్యశాలలు పెంచకుండా నిరోధించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై తగిన చర్య తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు భారత రసాయనిక, ఎరువుల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. కాని కొన్ని నెలలయినా ఏ చర్యా తీసుకోలేదు. అక్టోబర్ 2015 నాడు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సవాలు చేస్తూ కోర్టుధిక్కార పిటిషన్ వేయకతప్పలేదు. ఏడాది తరువాత, జూలై 2016లో ప్రభుత్వానికి వేడి తగిలి స్టెంట్లను ఆ జాబితాలో చేర్చింది.ఒక ఆర్టీఐ సవాల్, ఒక పిల్, ఒక ఫిర్యాదు, ఒక కోర్టు ధిక్కార పిటిషన్, వెరసి సుదీర్ఘ పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం అనే మత్తగజానికి చీమ కుట్టినట్టు కాలేదు. పంపిణీదారులు, వైద్యశాలలు, డాక్టర్లు కూడా తోడుదొంగలుగా మారి రోగులను విపరీతంగా దోచుకున్నారని ఆవేదనతో ఆవేశంతో సాంగ్వాన్ అనే ఒక యువలాయర్ డాక్టర్లతో కలిసి సాగుతున్న ఈ దోపిడీని సవాల్ చేశాడు. ఒక్క డాక్టరు కూడా అడగలేకపోయాడా? తెలిసి నోరుమూసుకుంటే నేరంలో భాగస్వాములే. వారే చేతులుకలిపితే చెప్పేదేముంది? కార్పొరేట్ మేనేజర్లు ఇచ్చిన టార్గెట్ ప్రకారం స్టెంట్లు అమ్మక తప్పదనేవారిని ఏమనాలి? డాక్టర్లు అనా బ్రోకర్లు అనా? వైద్య వృత్తి పవిత్రతను దిగజార్చిందెవరు? వైద్యులు కాదా? - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
కలుషితాహారంతో 80 మందికి అస్వస్థత
పులిచెర్ల (కల్లూరు): ఆలయ ప్రారంభోత్సవంలో ఇచ్చిన ఉప్మా, పొంగలి తిని 80 మంది భక్తులు అస్వస్థతకు గురైన ఘటన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పాతపేట పంచాయతీ పూరేడువారిపల్లెలో చోటుచేసుకుంది. గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయాన్ని శనివారం ప్రారంభించారు. గ్రామస్తులు, వారి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ఆలయం వద్ద భక్తులకు ఉప్మా, పొంగలి వడ్డించారు. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. సాయంత్రం నుంచి ఒక్కొక్కరికి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 80 మంది అస్వస్థతకు గురికావడంతో 108కు సమాచారం అందించారు. రాత్రి మూడు గంటల సమయంలో మూడు అంబులెన్స్లలో కొందరు బాధితులను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆదివారం ఉదయం పూరేడువారిపల్లెలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించారు. విందుకు వచ్చిన ఫించా, పాకాల, మొగరాల వాసులకు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రుల్లో చేరారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఆహారాన్ని పరీక్షిస్తున్నాం బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఆహారం కలుషితం కావడానికి కారణాలు పరీక్షల్లో వెల్లడవుతుంది. పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపాం. ప్రస్తుతం ఎవరికి ఎటువంటి ఇబ్బందీ లేదు. – ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ చంద్రశేఖర్ -
మెడిసిన్ అబ్రాడ్
మన దేశంలోని విద్యార్థులకు మెడిసిన్ కోర్సుల పట్ల అత్యంత క్రేజ్. దాదాపు 60 వేల సీట్లకు 12 లక్షల మందికిపైగా పోటీ పడుతున్నారు అంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ! దాంతో నీట్లో మంచి ర్యాంకులు పొందిన కొద్ది మందికే దేశంలో వైద్య కోర్సులుఅభ్యసించే అవకాశం లభిస్తోంది. దాంతో ఎలాగైనా ‘డాక్టర్’ కల నెరవేర్చుకోవాలనుకునే విద్యార్థులు విదేశాల వైపు దృష్టిసారిస్తున్నారు. ఎంబీబీఎస్ అబ్రాడ్ కోణంలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలు, ప్రవేశ విధానం, ఫీజులు, ఆయా దేశాల్లో పేరున్న యూనివర్సిటీల గురించి తెలుసుకుందాం.. చైనా మెడికల్ కోర్సుల పరంగా ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థుల ఆదరణ పెరుగుతున్న దేశం చైనా. కారణం.. ఇతర దేశాలతో పోల్చితే తక్కువ ఖర్చు, సరిహద్దునే ఉన్న దేశం. అన్నిటికంటే ముఖ్యంగా కరిక్యులం పరంగా క్లినికల్ ప్రాక్టీస్కు అధిక ప్రాధాన్యం ఉంది. ఇంగ్లిష్ మీడియం బోధన మరో కలిసొచ్చే అంశం. ఆరేళ్ల వ్యవధిలో ఉండే కోర్సు సమయంలో అయిదేళ్లు క్లాస్రూం బోధన, మరో ఏడాది ఇంటర్న్షిప్ తప్పనిసరి. ఫీజు ఏడాదికి గరిష్టంగా రూ.రెండున్నర లక్షలు ఉంటుంది. ఏటా ఆగస్ట్/సెప్టెంబర్లో క్లాసులు ప్రారంభమవుతాయి. చైనా ప్రభుత్వం ఏటా అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునేందుకు అనుమతి పొందిన మెడికల్ కాలేజీల జాబితాను ప్రచురిస్తుంది. విద్యార్థులు ఆ కాలేజీల్లోనే చేరడం మేలు. ఇలాంటి కాలేజీలు దాదాపు 50 వరకూ ఉంటాయి. ఇంటర్/10+2 స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన విద్యార్థులు చైనాలో మెడిసిన్ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. యూనివర్సిటీస్/ఇన్స్టిట్యూట్స్: చైనా మెడికల్ యూనివర్సిటీ; దలైన్ మెడికల్ యూనివర్సిటీ; జియాంగ్జు యూనివర్సిటీ; టియాన్జిన్ మెడికల్ యూనివర్సిటీ, జిలిన్ యూనివర్సిటీ; నాన్జింగ్ మెడికల్ యూనివర్సిటీ; సూచో యూనివర్సిటీ; సౌత్ఈస్ట్ యూనివర్సిటీ; సదరన్ మెడికల్ యూనివర్సిటీ; యాంగ్ఝౌ యూనివర్సిటీ తదితరాలు. వివరాలకు వెబ్సైట్: mbbs.cucas.edu.cn రష్యా రష్యా ప్రభుత్వం ఉన్నత విద్యకు రాయితీలు ఇస్తోంది. అంతేకాకుండా ఎక్కువ శాతం సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దాంతో రష్యాలో చదువుకయ్యే ఖర్చు తక్కువగా ఉంటోంది. రష్యాలో ఎండీగా పిలిచే మెడికల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ వ్యవధి ఆరేళ్లు. ప్రవేశాలు ఆయా యూనివర్సిటీలను బట్టి జూలైలో జరుగుతాయి. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం లభిస్తుంది. అర్హత 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). కోర్సు బోధన ఇంగ్లిష్, రష్యన్లో కొనసాగుతుంది. ఫీజు ఏడాదికి రూ. రెండు లక్షలు నుంచి రూ. నాలుగున్నర లక్షల మధ్యలో ఉంటుంది. యూనివర్సిటీలు: రష్యన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కర్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కజన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఐ.ఎం.షెనోవ్ మాస్కో మెడికల్ అకాడమీ, పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీ ఆఫ్ రష్యా మొదలైనవి. వివరాలకు వెబ్సైట్: en.russia.edu.ru ఉక్రెయిన్ ఫీజులు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయంతోపాటు నాణ్యమైన విద్యను అందుకునే అవకాశం ఉండటంతో మన విద్యార్థులు ఇటీవల కాలంలో ఉక్రెయిన్లో మెడికల్ కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్ యూనివర్సిటీలకు యూరోపియన్ విశ్వవిద్యాలయాలతో ఉన్న అవగాహన కారణంగా ఎక్సే ్చంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రయోజనం పొందొచ్చు. కోర్సును రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలలోపు పూర్తిచేసుకునే అవకాశం ఉండటం వంటి కారణాలు సైతం ఉక్రెయిన్ను బెస్ట్ డెస్టినేషన్గా నిలుపుతున్నాయి. డాక్టర్ ఆఫ్ మెడిసిన్గా పిలిచే ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. వార్షిక ఫీజు రూ.2.25 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. అర్హత 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). యూనివర్సిటీలు: ఇవానో–ఫ్రాంకివ్స్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ; లుగాన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఎం.గోర్కీ డొనెట్స్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ; ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ తదితర. వివరాలకు వెబ్సైట్: www.kmu.gov.ua జర్మనీ ప్రపంచంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యను అందిస్తున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది జర్మనీ. వాస్తవానికి జర్మనీలో అన్నిరకాల కోర్సులకు ఫీజులు తక్కువ. అలాగే మెడిసిన్ కోర్సులను కూడా తక్కువ ఫీజులతోనే పూర్తిచేసుకునే వీలుంది. జర్మనీ యూనివర్సిటీలు 5 శాతం సీట్లను విదేశీ విద్యార్థుల కోసం కేటాయిస్తుండటం ఈ దేశం ప్రత్యేకత. అయితే జర్మనీలో వైద్య కోర్సుల్లో చేరాలంటే.. టెస్ట్ ఫర్ మెడికల్ స్టడీస్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. దాంతోపాటు జర్మన్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. జర్మనీలో మెడికల్ కోర్సులను జర్మన్ భాషలో బోధిస్తారు. మెడికల్ కళాశాలలను డిసీజెస్ రీసెర్చ్ సెంటర్లతో అనుసంధానం చేయడం వల్ల విద్యార్థులకు చికిత్స పద్ధతులతోపాటు ఆయా వ్యాధులకు సంబంధించిన మూలాల గురించి తెలుసుకునే ప్రాక్టికల్ నైపుణ్యం లభిస్తుంది. జర్మనీ మెడికల్ ఎడ్యుకేషన్ విధానంలో మరో ప్రత్యేకత అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్), పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎండీ) అని తేడా లేకుండా ఇంటిగ్రేటెడ్గా యూజీ, పీజీ కోర్సును అందించడం. ఏడేళ్ల వ్యవధిలో మొత్తం కోర్సు ఉంటోంది. అంతేకాకుండా జర్మనీలో అధిక శాతం యూనివర్సిటీలు ప్రభుత్వ పరిధిలో ఉండటం, నిబంధనల ప్రకారం ప్రభుత్వ పరిధిలోని ఇన్స్టిట్యూట్లలో ట్యూషన్ ఫీజులు లేకపోవడం మరో విశేషం. మెడికల్ కోర్సులకు ప్రవేశాలు జూలైలో ఉంటాయి. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్: టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యునిచ్, లడ్విగ్ మ్యాక్స్ మిలన్ యూనివర్సిటీ–మ్యునిచ్, ఆల్బర్ట్–లడ్విగ్స్ యూనివర్సిటీ, హంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్, హంబర్గ్ యూనివర్సిటీ మొదలైనవి. కిర్గిజిస్థాన్ కిర్గిజిస్థాన్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య పొందొచ్చు. ఆరేళ్ల వ్యవధిలో ఉండే ఎండీ పేరుతో పిలిచే ఎంబీబీఎస్ తత్సమాన కోర్సు పూర్తిచేసేందుకు అయ్యే వ్యయం రూ.11 లక్షల నుంచి రూ. 20 లక్షలలోపే. ఏటా ఆగస్టు/సెప్టెంబర్లో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వవిద్యాలయాలు: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిజిస్థాన్, ఏషియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్, ఓష్ స్టేట్ యూనివర్సిటీ, కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ. జల్–అలాబాద్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ తదితర. ఫిలిప్పీన్స్ తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తిచేయొచ్చు. ఆరేళ్ల వ్యవధిలో ఉండే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సు ఫీజు 30 వేల డాలర్ల నుంచి 40 వేల డాలర్లు ఉంటుంది. యూనివర్సిటీలు: అవర్ లేడీ ఫాతిమా యూనివర్సిటీ; ఏఎంఏ ఎడ్యుకేషన్ సిస్టమ్–మనీలా; ఎమిలో అగ్వినాల్డో కాలేజ్–మనీలా మొదలైనవి. వెబ్సైట్: www.ched.gov.ph జార్జియా ఇక్కడ ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు కచ్చితంగా యూఎస్ఎంఎల్ఈ లేదా పీఎల్ఏబీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఫీజు ఏడాదికి 4,500–6,500 డాలర్లు. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ప్రవేశాలు ఉంటాయి. ప్రముఖ యూనివర్సిటీలు: జియోమెడి మెడికల్ యూనివర్సిటీ; టిబిల్సి మెడికల్ అకాడమీ; డేవిడ్ ట్విల్డియాని మెడికల్ యూనివర్సిటీ; కౌకాసస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తదితరం. వివరాలకు వెబ్సైట్: www.mes.gov.ge -
బట్టతలకు పరిష్కారం దొరికింది..
న్యూఢిల్లీ : సమకాలీన ప్రపంచంలో చాలా మందిని వేధిస్తున్న వాటిలో బట్టతల కూడా ఒకటి. పలురకాల సంస్థలు బట్టతల సమస్యను పూర్తిగా తగ్గిస్తామని పేర్కొంటున్నాయి. దీంతో చాలామంది పురుషులు వాటివైపు ఆకర్షితులు అవుతున్నారు. అయితే, తాజా అధ్యాయనంలో బట్టతలకు పరిష్కారం దొరికింది. ఎముకలు పెళుసుబారడాన్ని నివారించే మందుకు బట్టతలను కూడా నివారించే శక్తి ఉందని పరిశోధకుల అధ్యాయనాల్లో తేలింది. బట్టతల సమస్యతో బాధపడుతూ ఈ మందును వినియోగించిన పురుషులకు కేవలం ఆరు రోజుల్లో రెండు మిల్లీమీటర్ల పాటు జుట్టు పెరిగినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, దీనిపై పూర్తి స్థాయిలో అధ్యాయనం చేయాల్సివుందని చెప్పారు. డబ్ల్యూఏవై-316606 అనే మందును ఉపయోగించినప్పుడు ఈ ఫలితం వచ్చిందని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం బట్టతల నివారణకు రెండు రకాల డ్రగ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటి వల్ల దుష్ఫలితాలు కూడా ఉంటుండటంతో ఎక్కువ మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారు. -
మెడిసిన్.. మెరిక : స్టేట్ ఐదో ర్యాంకు
ఎంసెట్ పరీక్ష రోజే ఈ అమ్మాయికి విపరీతమైన జ్వరం.... నీరసంతో నడిచేందుకు కూడా కష్టపడుతోంది. వెంటనే కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. అక్కడి నుండి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లిందా అమ్మాయి. లక్ష్య సాధనపైనే గురిపెట్టిన ఆ విద్యార్థిని జ్వరాన్ని లెక్కచేయకుండా ఎంసెట్ పరీక్ష రాసింది. బాటనీలో 35.6 మార్కులు, జువాలజీలో 35.6, ఫిజిక్స్లో 31.8 మార్కులు, కెమిస్ట్రీలో 40 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఐదో ర్యాంకు సొంతం చేసుకుంది. తన మెడిసిన్ భవితకు బాటలు వేసుకుంది. ఆ అమ్మాయే కదిరికి చెందిన షేక్ జానుభీ రఫియా కుల్సుమ్. కదిరి: పట్టణంలోని వలీసాబ్రోడ్లో ఓ చిన్న వీధి. అక్కడ ఎస్జే రియాజ్ అనే మంచాల వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఈయన చదివింది పదో తరగతి వరకే. బైపాస్ రోడ్లో ఎంఎస్ లాడ్జి పక్కన మంచాలు అల్లి అక్కడే దుకాణంలో అమ్ముకుంటుంటాడు. రోజుకు సరాసరిన రూ.300 రావడం కూడా కష్టమే. ఆయన భార్య కౌసర్ గృహిణి. ఆమె 8వ తరగతి వరకు చదువుకుంది. వీరికి కూతురు రఫియా కుల్సమ్, కుమారుడు రిజ్వాన్ సంతానం. రిజ్వాన్ పట్టణంలోని వాల్మీకి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కూతురు రఫియా కుల్సమ్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. బుధవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి(బైపీసీ)లో 5వ ర్యాంకు సాధించి జిల్లాలో టాపర్గా నిలిచింది. మొత్తం 160 మార్కులకు గాను 143 మార్కులు సాధించింది. ఇంటర్ లోనూ 1000కి 982 మార్కులు సాధించింది. పేదరికాన్ని లెక్క చేయక రఫియాను విజయవాడలో ఇంటర్ చదివించడం కోసం ఏడాదికి రూ. లక్ష చొప్పున రెండేళ్లకు రూ. 2 లక్షలు ఖర్చు చేసింది ఆ పేద కుటుంబం. ఇందుకోసం రియాజ్ అన్నదమ్ములందరూ తమ వంతు సహకారం అందించారు. నాన్న పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన రఫియా కూడా చదువుల్లో ఎప్పుడూ టాపర్గా ఉండేది. పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో 7వ తరగతి చదివేసమయంలో తన ప్రతిభతో అక్కడి ఉపాధ్యాయులను ఆకట్టుకుంది. అందుకే వారు ‘‘రఫియాను బాగా చదువుతుంది..బాగా చదివించండి..ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులొస్తే మమ్మల్ని సంప్రదించండి’’ అని చెప్పారు. దీంతో ఆనందపడిపోయిన రిజాజ్ ఎంత కష్టమైనా కూతురును బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. పట్టణంలోని వాల్మీకి పాఠశాలలో 8 నుండి 10వ తరగతి వరకు చదివిన రఫియా.. పదో తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించింది. తల్లిదండ్రుల కష్టం నిరంతరం గుర్తు చేసుకుంటూ శ్రద్ధగా చదువుకుంది. నేడు స్టేట్ టాపర్గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటోంది. -
ఎంసెట్: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి 7వ తేదీ వరకు (నీట్ ఉన్నందున 6వ తేదీ మినహా) ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిష్టాత్మకమైన ఎంసెట్ పరీక్షల కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు విద్యార్థులను అనుమతించడం లేదు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించబోమని ఇప్పటికీ అధికారులు ప్రకటించారు. ఎంసెట్ పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి 2,21,064 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాల్లోని 18 జోన్ల పరిధిలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2, 3 తేదీల్లో 75 కేంద్రాల్లో అగ్రికల్చర్ పరీక్ష... 4, 5, 7 తేదీల్లో 83 కేంద్రాల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్ పరీక్షలకు 73,106 మంది, ఇంజనీరింగ్ పరీక్షకు 1,47,958 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు పరీక్ష తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్లో 25 వేల మంది వరకు విద్యార్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించేలా ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉదయం సెషన్ 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. ఆన్లైన్ ఎంసెట్ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అమలు చేస్తున్నామని, నిర్ధారిత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు. పరీక్షా సమయం కంటే రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఈసారి కొత్తగా నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్నగర్లలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఏపీ నుంచి 29,356 మంది ఎంసెట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 29,356 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ పరీక్షకు 21,369 మంది, అగ్రికల్చర్ పరీక్షకు 7,987 మంది ఉన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే ‘కీ’లు ఐదు రోజుల పాటు ఆన్లైన్ పరీక్షలు జరుగుతున్నందున అన్ని పరీక్షలు పూర్తయ్యాక ప్రాథమిక ‘కీ’లను విడుదల చేసేలా ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసే 7వ తేదీ రాత్రి లేదా 8న ‘కీ’లను విడుదల చేయనుంది. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ప్రశ్నపత్రం ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు. అందువల్ల ‘కీ’లను విడుదల చేసే సమయంలో.. సంబంధిత కోడ్ ప్రశ్నపత్రం, ‘కీ’ రెండింటినీ విడుదల చేస్తారు. ఇక ప్రాథమిక ‘కీ’లపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మొత్తంగా ఈనెల 15వ తేదీ నాటికి ఫలితాలను, ర్యాంకులను ప్రకటించేలా చర్యలు చేపట్టారు. -
ఉద్యోగుల వైద్యంలో కోట్లు కొట్టేస్తున్నారు
సాక్షి, అమరావతి : ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వైద్య పరీక్షల్లోనూ కోట్లు కొల్లగొట్టడానికి ప్రభుత్వం యంత్రాంగం పథకరచన చేసింది. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో రక్తపరీక్షల నిర్వహణను ఓ కార్పొరేట్ సంస్థకు అప్పగించి కమీషన్లు కొట్టేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య పరీక్షల్లోనూ అలాగే కమీషన్లు జేబులో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐదు లక్షల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 32 లక్షల మందికి అందించాల్సిన వైద్య పరీక్షల వ్యవహారంలో ఓ కంపెనీ నుంచి రూ. కోట్లు కమీషన్లు అధికారులకు ముట్టినట్టు తెలుస్తోంది. విజయవాడ బందరు రోడ్డులోని ఓ స్టార్ హోటల్లో దీనికి సంబంధించిన ఒప్పందం ఇటీవలే జరిగిందని, ఆరోగ్యశాఖ సలహాదారు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారని విశ్వసనీయ సమాచారం. కమీషన్ల బేరం కుదిరాక రాత్రికి రాత్రి టెండరు నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేశారు. కంపెనీకి అనుకూలంగా నిబంధనలు.. తమకు అనుకూలమైన ఆ కంపెనీకి వైద్య పరీక్షల నిర్వహణ అప్పగించేందుకు వీలుగా నిబంధనలు మార్చాక టెండరు డాక్యుమెంటును ఏపీఎంఎస్ఐడీసీ (రాష్ట్రమౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ) వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. తర్వాత ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. అక్కడకి వచ్చిన బిడ్డర్లకు కొత్తగా రూపొందించిన టెండర్ డాక్యుమెంటును ఇచ్చారు. మొదటి డాక్యుమెంట్లో గుండె వైద్య పరీక్షలు, దంతవైద్య పరీక్షలు నిర్వహణలో ఆయా సంస్థలకు మూడేళ్ల పూర్వ అనుభవం ఉండాలని ఉండగా కొత్త డాక్యుమెంటులో అది లేకపోవడాన్ని బిడ్డర్లు గుర్తించారు. అంతేగాక ప్రతి జిల్లాలో ఒక డయాగ్నొస్టిక్ సెంటర్ ఉండాలనే నిబంధన చేర్చారు. ఈ రెండు కూడా కమీషన్లు తీసుకున్న కంపెనీ కోసం మార్చినవే. దీంతో అధికారులతో బిడ్డర్లు వాగ్వాదానికి దిగారని తెలిసింది. కొత్త నిబంధనలు మార్చబోమని అధికారులు చెప్పడంతో సమావేశానికి వచ్చిన బిడ్డర్లు వెనక్కి వెళ్లిపోయారు. ఇక రెండు మూడు రోజుల్లో కమీషన్లు ఇచ్చిన సంస్థకు నిర్వహణా పనులు కట్టబెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వైద్య పరీక్షల నిర్వహణకు గాను సదరు కంపెనీకి ఏటా రూ. 70 కోట్ల చొప్పున మూడేళ్ల కాలానికి రూ. 210 కోట్లు చెల్లించనున్నట్టు తెలిసింది. నాలుగేళ్లుగా కొలిక్కిరాని వైద్యం గడిచిన నాలుగేళ్లుగా ఉద్యోగులు, పెన్షనర్ల వైద్యానికి ఉన్న అడ్డంకులను తొలగించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యవిధానపరిషత్ పరిధిలో 5 వేల మంది ఉద్యోగులు ఉంటే వారిలో ఒక్కరికి కూడా ఇప్పటి వరకూ కనీసం హెల్త్కార్డులు ఇవ్వలేకపోయారు. అంతేగాక ఎయిడెడ్ కళాశాలల లెక్చరర్లు, గ్రంథాలయాల సిబ్బంది సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న వారికి కార్డులు రాలేదు. ప్యాకేజీలు తక్కువగా ఉన్నాయన్న కారణంగా చాలా ఆస్పత్రులు ఇప్పటికీ నగదు రహిత వైద్యానికి నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మళ్లీ గుండె జబ్బు నిర్ధారణ పరీక్షలు, దంతవైద్య పరీక్షలు తొలగించి దారుణంగా దెబ్బకొడుతున్నారని, గుండె జబ్బుల పరీక్షలు చేయించుకునేవారే ఎక్కువ ఉండగా దాన్ని పరీక్షల నుంచి తొలగించడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేం చెప్పినచోటే కళ్లద్దాలు కొనాలి ఉచితంగా కంటిపరీక్షలు, కళ్లద్దాలు ఇచ్చే పథకాన్ని ఓ ప్రైవేటు సంస్థకు ఇటీవలే అప్పజెప్పారు. కాగా ఇప్పుడు ఆరోగ్యశాఖలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తి.. కళ్లద్దాలు తాము చెప్పిన చోటే కొనుగోలు చేయాలని ఆ ప్రైవేటు సంస్థపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఆ సంస్థ ససేమిరా అంటున్నా.. కళ్లద్దాల సంస్థతో కమీషన్లు మాట్లాడుకున్న ఆ వ్యక్తి వినిపించుకోవడంలేదు. దీనిపై గతవారం రోజులుగా ఆ వ్యక్తి, ప్రైవేట్ సంస్థ ప్రతినిధుల మధ్య వాగ్వాదం నడుస్తున్నట్టు అధికారులు చెప్పారు. వివిధ రకాల టెండర్లు దక్కించుకున్న వారిపై సదరు వ్యక్తి పెత్తనం చేస్తూ.. తాను చెప్పినచోటే పరికరాలు కొనుగోలు చేయాలని పట్టుబడుతున్నారని చెబుతున్నారు. -
ఆయుర్వేదంతో డెంగీకి చెక్
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న డెంగీ వ్యాధికి చెక్ పెట్టే ఆయుర్వేద ఔషధాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలో డెంగీ నివారణ కోసం రూపొందించిన మొట్టమొదటిదిగా చెపుతున్న ఈ ఔషధం వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. ఆయుష్, ఐసీఎంఆర్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పని చేసే ద సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సీసీఆర్ఏఎస్) శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని రూపొందించారు. కర్ణాటకలోని బెల్గామ్లో ఉన్న సీసీఆర్ఏఎస్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో ఈ ఔషధం భద్రత, సామర్థ్యంపై ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. డబుల్ బ్లైండ్ ప్లాస్బో అనే కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ విద్యా కేఎస్ ధిమాన్ తెలిపారు. మానవులపై పరిశోధనలు చేసే ఈ పద్ధతికి అంతర్జాతీయంగా ఆమోదం ఉందని చెప్పారు. ఆయుర్వేదంలో వినియోగిస్తున్న 7 మూలికలతో గత ఏడాది జూన్లో ఔషధాన్ని సిద్ధం చేశామని చెప్పారు. పైలట్ స్టడీలో 90 మంది రోగులకు ద్రవ రూపంలో ఔషధం ఇచ్చామని, ఇకపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్లో దీనిని ట్యాబ్లెట్ రూపంలో ఇస్తామని చెప్పారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ వల్ల తీవ్రమైన జ్వరం, ఒళ్లు నెప్పులు, తీవ్ర తలనొప్పి, వాంతులు, చర్మ సంబంధ సమస్యలు మొదలైనవి వస్తాయి. ఏటా 40 కోట్ల మంది డెంగీ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ప్రస్తుతం డెంగీకు ఎటువంటి మందు లేదు. డెంగీ లక్షణాల ఆధారంగా ముందస్తు నివారణ చర్యలు మాత్రమే చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వాలు.. ఆరోగ్య సంస్థలు దీనికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించాయి. -
కాకినాడ ఆసుపత్రిలో చావుకేక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)లో మరణ మృదంగం మోగుతోంది. ఈ ఏడాది జనవరిలో 615 మంది, ఫిబ్రవరిలో 531, మార్చిలో 483 మంది ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రధానంగా సెరిబ్రో వాస్క్యులర్ యాక్సిడెంట్ (మెదడులో రక్తనాళాలు చిట్లడం), హెమీప్లీజియా(పక్షవాతం)తో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. ఇక్కడ అవసరమైన మందులు అందుబాటులో లేవు. ప్రభుత్వం మందుల సరఫరాను నిలిపివేసింది. అరకొర బడ్జెట్ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 1,065 పడకలు ఉన్నాయి. రోగుల ఆక్యుపెన్సీ 2,000 నుంచి 2,500 వరకు ఉంటోంది. అంటే ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులు ఉండాల్సి వస్తోంది. నిత్యం రోగులతో కిటకిటలాగే ఈ ఆసుపత్రికి మందుల కోనుగోలు కోసం ప్రభుత్వం ఏటా రూ.1.82 కోట్లు మాత్రమే కేటాయిస్తోంది. ఆ మేరకే సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ మందులను సరఫరా చేస్తోంది. కేటాయించిన రూ.1.82 కోట్లకు ఒక్కపైసా పెరిగినా మందులు సరఫరా చేయడం లేదు. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఆరు నెలలకు కూడా సరిపోవడం లేదు. అత్యవసర మందులు, పరికరాలు లేక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆసుపత్రిలో 400 రకాల మందులు ఉండాలి. కానీ, ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో కేవలం 150 రకాల మందులే ఉండడం గమనార్హం. ఇవి కొద్దిరోజుల్లో అయిపోతున్నాయి. ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నది అధికారులకే అంతుబట్టడం లేదు. అత్యవసరమైన సక్షన్ ఆపరేటర్స్ (ఊపిరితిత్తుల నుంచి నీరు తీసే పరికరం), ఆక్సిజన్ ప్లో మీటర్ల కొరత కూడా వేధిస్తోంది. మరణాలపై అధ్యయనమేదీ? కాకినాడ జీజీహెచ్లో ప్రతినెలా వందల సంఖ్యలో రోగుల మరణాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. మరణాలపై అధ్యయనం జరగడం లేదు. అనారోగ్యంతో ఈ ఆసుపత్రిలో చేరితే క్షేమంగా ఇంటిరి తిరిగివెళ్తామన్న నమ్మకం లేకుండా పోయింది. ఇక్కడ ఏం జరుగుతోందో సమీక్ష చేసే నాథుడే లేడు. మందుల సరఫరా నిలిచిపోవడం వాస్తవమే అత్యవసర మందుల సరఫరా నిలిచిపోయింది. ఆసుపత్రికి కేటాయించిన బడ్జెట్ అయిపోవడంతో సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ మందుల సరఫరాను నిలిపివేసింది. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మందులు అందిస్తున్నాం. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అనుమతితో ప్రైవేట్ మెడికల్ దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తాం’’ – ఎం.రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్, కాకినాడ జీజీహెచ్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెడికోల మృతి
కొణిజర్ల (ఖమ్మం జిల్లా) : వైద్యులుగా పీజీ చదువు పూర్తి చేసి మరి కొద్దిరోజుల్లో తమ స్వంత స్థలాలకు వెళ్లి ఎందరికో బతుకును ఇవ్వాల్సిన మెడికోలను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కారు, కంటైనర్ లారీ ఢీకొని ఇద్దరు మమత వైద్య కళాశాలకు చెందిన పీజీ వైద్య విద్యార్థు«లు మృతి చెందిన ఘటన మండలంలోని తనికెళ్ల సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. వైరా సీఐ మల్లయ్యస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని శ్రీరామపురానికి చెందిన డాక్టర్ బండారు సిద్ధార్థ (27), పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని నలజర్ల గ్రామానికి చెందిన డాక్టర్ పులివర్తి సూర్యకిరణ్ (31) ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో పీజీ విద్యను అభ్యసిస్తున్నారు. సూర్యకిరణ్ కార్డియాలజీలో ఎండీ డీఎం చదువుతుండగా, సిద్ధార్థ« అనస్తీషియా విభాగంలో పీజీ చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కళాశాలకు సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు వైరా వైపు కారులో వెళ్లి తిరిగి ఖమ్మం వస్తుండగా వైరా వైపు నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. దీంతో డాక్టర్ సిద్ధార్థ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సూర్యకిరణ్కు తీవ్ర గాయాలు కావడంతో మమత వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సూర్యకిరణ్కు గత ఏడాదే వివాహం జరిగింది. మృతుడి భార్య కూడా పీజీ వైద్య విద్యార్థిని. సిద్ధార్థ అవివాహితుడు. కారులో చిక్కుకున్న డాక్టర్ సిద్ధార్థ మృతదేహాన్ని అతి కష్టంగా జేసీబీ సాయంతో బయటకు తీయించారు. సీఐ మల్లయ్యస్వామి పర్యవేక్షణలో ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెరటి వైద్యం
బాధను ఔషధం తొలగిస్తుంది. అయితే బాధకు ఒకే ఔషధం ఉండదు! ఇదే జీవితంలోని పెద్ద సందిగ్ధత. ఈ సందిగ్ధత కంటే బాధే నయం అనిపిస్తుంది కొన్నిసార్లు! ఇన్ని ఔషధాలేమిటి? ఇంత అయోమయం ఏమిటి? జాషువా పొల్లాక్ అంతర్జాతీయ వయెలినిస్ట్. యు.ఎస్. ఆయనది. ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నారు. జీవితంలో సమస్యల పరిష్కారాలకు ‘హార్ట్ఫుల్నెస్ వే’ అనే ఒక కొత్త మందును కనిపెట్టారు పొల్లాక్. దీనికి ఆయన చెప్పిన తేలికపాటి అర్థం ‘సంతృప్తి చెందడం’. రెండు రోజుల క్రితం ఈయన చండీఘర్ వచ్చినప్పుడు..‘సంతృప్తి చెందడం అంటే ఏమిటి? సరిపెట్టుకోవడమా?’ అని అడిగారు మనలాంటి వాళ్లు కొందరు ఆయన్ని. ‘కాదు, సంతృప్తి చెందడమే’ అన్నారు పొల్లాక్. అప్పుడిక జీవితంలో ఏ సమస్యా బాధించదట. సమస్య ఉంటుంది కానీ, బాధ ఉండదు. ఇదీ పొల్లాక్ వైద్యం. అర్థమవడం కొంచెం కష్టమే. ‘మెడిటేషన్ చేస్తే అర్థం చేసుకోవడం సాధ్యమే’ అంటాడు మళ్లీ పొల్లాక్. సమస్య కన్నా పెద్ద సమస్యలా అనిపిస్తాయి ఈ సాధనలన్నీ. వేదాంతిది ఒక వైద్యం. ఆధ్యాత్మిక వేత్తది ఒక వైద్యం. ఏ వైద్యమూ వద్దనే నాస్తికుడిది ఒక వైద్యం. ఇది సుఖంగా అనిపిస్తుంది.. వైద్యం చేయించుకోకుండా తిరగడం! మరి నొప్పీ? అదొక్కటే ఉంటే చాలదా.. వైద్యం నొప్పి కూడా ఎందుకు? ఇదొక ధోరణి. పొల్లాక్ ‘హార్ట్ఫుల్నెస్ వే’ కూడా మనల్ని అక్కడికే తీసుకెళుతుంది. వైద్యుడు లేని చోటుకు, వైద్యం అవసరం లేని చోటుకు! ‘‘జీవితంలో ఒకేచోట ఉండిపోండి. ఎక్కడున్నారో అక్కడే. అదే స్నేహితులు, అదే కుటుంబం, అదే ఉద్యోగం. నిస్పృహ వస్తుంది. రానివ్వండి. ధ్యానం ఉంది కదా.. దాంతో మీ గుండెనిండా సంతృప్తి నింపుకోండి. నిస్పృహ పోతుంది’’ అంటాడు పొల్లాక్! అంటే మనకు మనమే వైద్యులం. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనేది మన ఫీలింగ్. ఇన్నర్ హీలింగ్కి కావలసింది మన నాడికి మన చెయ్యే. బహుశా ఇదే కావచ్చు ‘హార్ట్ఫుల్నెస్ వే’. -
మందుల కొరత
నిజామాబాద్అర్బన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం కంటికి సంబంధించిన మందుల కొరత ఏర్పడింది. దీంతో రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. బయట కొనుక్కోవాల్సిందిగా సూచిస్తూ వైద్యులు రోగులకు మందులను రాసిస్తున్నారు. అయితే పేదలైన రోగులు మందులను బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు. కంటి ఆపరేషన్ల అనంతరం రోగులకు ఇచ్చే యాంటీ బయాటిక్ మందులు దాదాపు 20 రోజులుగా అందుబాటులో లేవు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ను సంప్రదించగా, తన దృష్టికి రాలేదన్నారు. కంటి చుక్కలమందు కరువు.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు 10 నుంచి 15 వరకు కంటి ఆపరేషన్లు జరుగుతాయి. కంటి ఆపరేషన్ అనంతరం రోగులకు కంటిలో ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు యాంటీబయాటిక్ మందులు అయిన గేటిక్విన్, గేట్–పిలను 30 రోజుల పాటు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఈ మందులు అందుబాటులో లేవు. దీంతో ఆపరేషన్ చేయించుకున్నవారు మందులను బయటనే మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. కాగా ఆపరేషన్ చేయించుకున్న నాయికీబాయికి, మరికొందరికి సంబంధిత కంటి వైద్యుడు రెండు యాంటిబయాటిక్ చుక్కల మందులను రాసి ఇచ్చాడు. వీటిని బయట మెడికల్ షాపుల్లో మందులు కొనలేని పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా ఆస్పత్రికి మందుల సరఫరా లేదని వైద్య సిబ్బంది ద్వారా తెలిసింది. నా దృష్టికి రాలేదు కంటి ఆపరేషన్ చేయించుకున్నవారికి అందించే మందులు కొరతగా ఉందని నా దృష్టికి రాలేదు. సమస్య ఉంటే తక్షణమే మందులను అందుబాటులో ఉంచుతాం. బయట కొనుక్కోవాల్సిందిగా రాయడం సరైంది కాదు. అవసరమైన మందులను మేమే కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. – రాములు, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
వైద్యాలయం.. మందుల వ్యాపారం
తణుకు అర్బన్:తణుకు ఏరియా ఆస్పత్రిలో కార్పొరేట్ మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయ ఒత్తిడో, మరే ఇతర కారణాలో కాని వైద్యాధికారుల కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. గతేడాది నుంచి విజయవాడకు చెందిన ఉషా కార్డియాక్ ఆస్పత్రి ఆధ్వర్యంలో తణుకు ఏరియా ఆస్పత్రిలో ప్రతి మంగళవారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈసీజీ, ఎకో వంటి గుండె పరీక్షలు ఉచితంగానే చేస్తున్నారు. మెరుగైన సేవలు అవసరమైన వారిని విజయవాడకు రావాల్సిందిగా సం బంధిత వైద్యులు సూచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పరీక్షలు నిర్వహించిన వైద్యుడు రాసిన మందులు కార్పొరేట్ సంస్థ ప్రతినిధుల వద్దే కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అవి మరే దుకాణంలో దొరకని దుస్థితి. దీంతో రోగులు వీరి వద్దే మందులు కొంటున్నారు. బయట దుకాణాల్లో 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారని, అయితే ఇక్కడ మాత్రం ఎమ్మార్పీకే మందులు విక్రయిస్తున్నారని రోగులు అంటున్నారు. తణుకు ఆస్పత్రిలో జరుగుతున్న ఈ మందుల విక్రయాలను మంగళవారం తణుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ పరిశీలించారు. ఎంఓయూ ఉందంటూ తప్పుదోవ మందులు విక్రయించేందుకు తమకు మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) ధ్రువీకరణ పత్రం ఉందని సదరు విక్రయాలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రి సిబ్బంది డ్రగ్ ఇన్స్పెక్టర్ విక్రమ్కు చెప్పారు. ఎంఓయూ చూపించమని విక్రమ్ అడగడంతో అందుబాటులో లేదని సదరు సిబ్బంది సమాధాన మిచ్చా రు. మందుల అమ్మకంపై గతంలోనే ‘సా క్షి’ కథనాలు ప్రచురించినా వైద్యాధికారులు స్పందించలేదు. రాజధాని ప్రాంతం నుంచి వచ్చిన కార్పొరేట్ ఆస్పత్రి కావడంతో తెరవెనుక ఏదైనా రాజకీయ హస్తం ఉందా అనే విమర్శలు లేకపోలేదు. రూ.లక్షకు పైగా అమ్మకాలు జిల్లాలో తణుకుతో పాటు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఈ తరహా మందుల అమ్మకాలు సదరు కార్పొరేట్ సంస్థ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తణుకులో వైద్య శిబిరానికి సుమారుగా 50 నుంచి 70 మంది వరకు వస్తున్నారు. రూ.లక్షకు పైగా మందుల విక్రయం జరుగుతున్నట్టు అంచనా. ఎంఓయూ ఉందంటున్నారు మందుల అమ్మకాలకు ఎంఓయూ ధ్రువీకరణ పత్రం పొందామని విజయవాడ ఉషా కార్డియాక్ ఆస్పత్రి వైద్య బృందం చెప్పారు. అయితే అది విజయవాడలో ఉందంటున్నారు. వచ్చే వారం ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మని ఆదేశించాను. తీసుకురాని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.– విక్రమ్, తణుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎటువంటి ధ్రువీకరణ ఇవ్వలేదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేట్ మందుల విక్రయాలు జరపరాదు. ఇందుకోసం ఎవరికీ ఎటువంటి ఎంఓయూ ధ్రువీకరణ పత్రాలు జారీచేయలేదు. వచ్చే మంగళవారం జరిగే వైద్య శిబిరంలో మందుల విక్రయాలు మానకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ కె.శంకరరావు, డీసీహెచ్ఎస్, ఏలూరు -
మండువేసవిలో మందులు జాగ్రత్త
వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు ప్రమాదభరితంగా మారాయి. బయటకు రావడం అలా ఉంచితే,.ఇళ్లలోనే ఉండలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు వేసవిలో కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే వారు ఎక్కువే. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులపై పడి పనిచేయకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై కథనం.. లబ్బీపేట(విజయవాడతూర్పు): గతేడాదితో పోలిస్తే సాధారణ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మరో 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రభావం గదిలోపల కూడా ఉంటుంది. సాధారణంగా 27 డిగ్రీల టెంపరేచర్ ఉండే నివాస గృహాల్లో ఎండ దెబ్బకి 30 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది.ఆరు బయట 40 డిగ్రీలు, మూసివున్న డాబా గదుల్లో 45 డిగ్రీల వరకూ, అద్దాలుమూసి నిలిపి ఉంచిన కార్లు, వ్యాన్లలో 140 డిగ్రీల వరకూ ఉండే అవకాశాలు ఉంటున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండుతున్న ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక మందుల పనితీరుపై సూర్యుడి ప్రభావం చూపి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రస్పుటంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా భద్రపర్చాలి ♦ మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక మందులు సాధారణంగా 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చాలి. ముఖ్యంగా జానుమెట్, జార్డియాన్స్, కొమ్బిగ్లైజా, సిటాగ్లిప్టిన్, కార్ధేస్, ఆటర్వా స్టాటిన్, రాబెప్రజోల్, మేకోబాలమిన్ వంటి మందులు 30 డిగ్రీలలోపు, అమరిల్, విల్ధాగ్లిప్టిన్ , మెట్ఫార్మిన్, సారోగ్లిటజార ఆమ్లోడిపిన్, క్లిన్దపిన్,æ విటమిట్ ఇ, డి మందులు 25 డిగ్రీ టెంపరేచర్ లోపు భద్రపర్చాలి. ♦ ఇన్సులిన్ గుడ్డులో ఉండే ప్రోటీన్ వంటిదేనని, కొద్దిసేపు అదిక వేడిమికి గురైన గుడ్డును వేడిచేసే ఉడికినట్లు, ఇన్సులిన్ కూడా అదే విధంగా మారుతుందని నిపుణులు చెపుతున్నారు. అనంతరం ఫ్రిజ్ వంటి వాటిలో ఉంచి వాడినా ప్రయోజనం వుండదని చెపుతున్నారు. మందులు కొనుగోలు చేసే సమయంలోనే నిర్ధిష్ట ఉష్ణోగ్రతలు ఉన్న మందుల షాపుల్లో కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలో ఉంచిన మందులు వాడటం వల్ల వ్యాధులు అదుపులో ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. ♦ రిఫ్రిజిరేటర్లు లేని వారు మట్టికుండలో నీళ్లు పోసి, దానిలో ఇన్సులిన్ను భద్రపరుచుకోవచ్చు. ∙ప్రయాణాల్లో దీర్ఘకాలికమందులు, ఇన్సులిన్లను కూలెంట్ పౌచ్లలోనే తీసుకెళ్లడం మంచిది. తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచినా కొన్ని మందులు పనిచేయవని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్సులిన్ను కూలర్,జెల్ప్యాక్స్లోభద్రపరుచుకోవాలి ఇన్సులిన్ వాడుకునే వాళ్లు బాటిల్స్, ఇన్సులిన్ పెన్లను ఐస్బాక్స్ లేదా, ఐస్ ఉన్న ప్లాస్కోలో ఉంచుకోవాలి. వాటని ఇన్సులిన్ స్టాక్ను ఫ్రీజ్ డోర్ అడుగుభాగంలో పెట్టుకోవాలి. డీప్ ప్రీజర్లో ఉంచరాదు. ఏవీ అందుబాటులో లేకపోతే మట్టికుండలో చన్నీళ్లు పోసి, దానిలో భద్రపరుచుకోవచ్చు. అనుకోకుండా షుగర్ ఎక్కువుగా ఉంటున్నట్లయితే వేడికి ఇన్సులిన్ సరిగా పనిచేయక పోయి ఉండవచ్చు. అదే రకం కొత్త ఇన్సులిన్ బాటిల్ స్టోరేజ్ కరెక్ట్గా ఉన్నది వాడి చూడండి. బయటకు వెళ్లే టప్పుడు సరిపోను ఆహారం, గ్లూకోజ్ టెస్ట్స్ట్రిప్స్, మందులు రోజుకు సరిపడా తీసుకు వెళ్లడమే కాకుండా, అందుబాటులో ఉంచుకోవాలి. ఎండలో, కార్లో వదిలేసిన గ్లూకో మీటర్, స్ట్రిప్స్ సరిగా పనిచేయవు. సరైన ఉష్ణోగ్రతల్లో మందులు ఉంచడం చాలా ముఖ్యం.–డాక్టర్ ఎం.శ్రీకాంత్, డయాబెటాలజిస్ట్ -
మందుల్లేవ్!
ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు రామచంద్ర, విజయమ్మ. వీరిది కదిరి. కూలికెళితేనే పూటగడిచేది. ఈనెల 18న తమ ఆరేళ్ల కూతురు రేవతికి జబ్బు చేయడంతో సర్వజనాస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. పరీక్షించిన వైద్యులు షుగర్ ఉందని తెలిపారు. రోజూ షుగర్ పరీక్ష చేసి ఇన్సులిన్ ఇవ్వాలని చెప్పారు. మొదట్లో ఐవీ ఫ్లూయిడ్స్ లేకపోవడంతో ప్రైవేట్గా రూ.700 కొనుగోలు చేశారు. ఇక షుగర్ టెస్ట్ కోసం ఉపయోగించే స్ట్రిప్స్ కూడా ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో రామచంద్ర, విజయమ్మ దంపతులు రూ.800 వెచ్చించి ప్రైవేట్గా కొనుగోలు చేశారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మందులు, ఖర్చులకు రూ.3,500 వరకు ఖర్చు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు తమ ఆదాయం రూ.8 వేలు మాత్రమేనని, ఇంకా ఇద్దరు పిల్లలున్నారని, నెలకు రూ.3500 ఖర్చు చేయాల్సి వస్తే తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిని మందుల కొరత పట్టిపీడిస్తోంది. ఎప్పటికప్పుడు అప్రమత్తమై రోగులకు మందులందించేలా చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. కాటన్ మొదలు కొని ఐవీ ఫ్లూయిడ్స్, క్యాన్లా, 2సీసీ సిరంజీలు, సెఫిగ్జెమ్, ఆంపిసిల్లిన్, సిఫ్ట్రోఫ్లాక్సిన్, సీపీఎం, విటమిన్ సిరప్లు, షుగర్ స్ట్రిప్స్ లేవు. రెండు నెలలుగా ఇదే దయనీయమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రోగుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్నా.. అది మాటలకే పరిమితమవుతోంది. కాటన్కూ కటకట.. రోగులకు ఫస్ట్ ఎయిడ్, ఇంజెక్షన్స్ వేయడం మొదలుకుని ప్రతి పనికీ కాటన్ (దూది) తప్పనిసరి. అటువంటి కాటన్ సరఫరా ఆగిపోయింది. చిన్నపిల్లల వార్డు, లేబర్, గైనిక్, ఆర్థో, మెడిసిన్ తదితర వార్డులో కాటన్ లేకపోవడంతో వైద్యులు, స్టాఫ్నర్సులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులకు కాటన్ను బయటి నుంచి తెప్పించే దారుణమైన పరిస్థితి నెలకొంది. గర్భిణుల అవస్థలు ఆస్పత్రిలో ప్రసవం చేయించుకునే గర్భిణులు రూ.వేలు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఐవీ సెట్ల నుంచి సెర్విప్రిమ్ జెల్లాంటివి బయట తెచ్చుకుంటున్నారు. సెర్విప్రిమ్జెల్ అనే మందు కాన్పు త్వరగా అయ్యేందుకు ఉపయోగిస్తారు. ఈ జెల్ ప్రైవేట్గా రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఆస్పత్రిలో రోజూ 30 ప్రసవాలు జరుగుతాయి. అందులో 20 సాధారణ ప్రసవాలు జరుగుతాయి. సాధారణ ప్రసవాలకు జెల్ తప్పనిసరి. కానీ స్టాఫ్నర్సులు ఇండెంట్ పెడుతున్నా ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోవడం లేదు. మూలుగుతున్న నిధులు సర్వజనాస్పత్రిలో ఎమర్జెన్సీగా మందులు కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు నిధులు ఉన్నట్లు తెల్సింది. అత్యవసరానికి ఈ డబ్బులు వినియోగించవచ్చు. ఆస్పత్రి యాజమాన్యం ఇండెంట్ పెట్టామని చెబుతున్నా... రోజూ రూ.5 వేలు కొనే సౌలభ్యం ఉంది. ఇందులోనుంచైనా కాటన్ కొనుగోలు చేయవచ్చు. కానీ అటువంటి పరిస్థితి లేదు. పోస్టునేటర్ వార్డులో అడ్మిషన్లో ఉన్న ఈమె చెన్నంపల్లికి చెందిన పర్వీన. మూడ్రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎస్ఎన్సీయూలోని వైద్యులు పరీక్షించి మూడు రకాల మందులు ప్రైవేట్గా తెచ్చుకోవాలని రాశారు. ఎందుకని ప్రశ్నిస్తే ఆస్పత్రికి మందులు సరఫరా కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇలా ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది కొరత వాస్తవమే ఆస్పత్రిలో మార్చి నుంచి మందుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఇప్పటికే మందుల కోసం ఇండెంట్ పెట్టారు. విజయవాడ నుంచి సరఫరా కావాల్సి ఉంది. – డాక్టర్ వెంకటేశ్వర రావు,ఇన్చార్జ్ సూపరింటెండెంట్ -
అద్దెబతుకు.. శ్మశానమే దిక్కు!
సిరిసిల్లటౌన్: కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వృద్ధురాలు చనిపోతే తమ ఇంటికి అరిష్టమని ఇంటి యజమానులు చెప్పడంతో బతికుండగానే ఓ అవ్వను కుటుంబ సభ్యులు శ్మశానానికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్థానిక ప్రగతినగర్కు చెందిన గుంటుకు తులసవ్వ(85) భర్త వెంకటి చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. తులసవ్వకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకూతురు లలిత షోలాపూర్లో ఉంటుండగా పెద్దకూతురు శోభ వద్ద ఆమె ఉంటోంది. ప్రగతినగర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో వీరు అద్దెకు ఉంటున్నారు. ఆర్నెల్లుగా తులసవ్వ అనారోగ్యం బారినపడగా పేదరికంలో ఉన్న కూతురు చేతిలో డబ్బు లేక సరైన వైద్యం చేయించలేకపోయింది. మూడురోజులుగా తులసవ్వ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఇంటి యజమాని శ్రీనివాస్.. శనివారం మధ్యాహ్నం వృద్ధురాలితోపాటు ఆమె కూతురును తన ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో వేరే దారిలేక కూతురు శోభ తల్లితోపాటు శ్మశానానికి చేరుకుంది. వీరి దీన స్థితిని చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్సై శేఖర్ వెంటనే ఇంటి యజమాని శ్రీనివాస్కు కౌన్సెలింగ్ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తులసవ్వను జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
ప్రాణాలతో చెలగాటం
కొవ్వూరు: మనిషి ప్రాణాలు నిలబెట్టే ఔషధ విక్రయ కేంద్రాల నిర్వహణలో నిబంధనలకు పాతరేస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ షాపులు నడుపుతున్నారు. అద్దె సర్టిఫికెట్స్పై అమ్మకాలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడు లేరు. కొన్ని దుకాణాల్లో అడ్డుఅదుపు లేకుండా కాలం చెల్లిన ఔషధాల విక్రయాలు సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. స్టాకు రిజిస్టర్లు లేకుండానే లావాదేవీలు నడుస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నప్పటికీ ఔషధ తనిఖీ అధికారులకు పట్టడం లేదు. అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 వరకు మెడికల్ షాపులున్నాయి. 450 హోల్సేల్ దుకాణాలున్నాయి. 14 బ్లడ్బ్యాంక్లు, మూడు బ్లడ్ స్టోరేజ్ కేంద్రాలు, మూడు మందుల తయారీ కంపెనీలు న్నాయి. ఫార్మసిస్టులు లేకపోవడం మూలంగా ఏ మందులో ఏఏ పదార్థాల మిశ్రమం ఏమిటి అనే దానిలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏ రోగానికి ఏ మందులు వాడతారు. ఏవిధంగా వినియోగించాలన్నదీ తెలియాలంటే ప్రతి మెడికల్ షాపుల్లోను ఫార్మసిస్టులు తప్పనిసరిగా ఉండాలి. ఒక ఔషధానికి బదులు మరో ఔషధం ఇస్తే ప్రాణాలకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఫార్మసిస్టులు లేకుండానే నిత్యం వందల కోట్ల మెడిసిన్స్ వ్యాపారం సాగుతోంది. నెలవారీగా మూమూళ్లు దుకాణదారుల నుంచి నెలవారీ మామూళ్లు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్కో షాపు నుంచి నెలకి రూ.500 చొప్పున ఏడాదికి ఒక్కో షాపు ద్వారా రూ.6 వేలు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులను ఔషధ తనిఖీ అధికారులు మధ్యవర్తులుగా ఉంచుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా 2,500 దుకణాలున్నాయి. వీటి ద్వారా ఈ విధంగా లెక్కలు వేస్తే సుమారు నెలకి రూ.12.50 లక్షల వరకు మామూళ్లు ముడుతున్నట్టు సమాచారం. ఈ సొమ్మును పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పంచుకుంటారని చెబుతున్నారు. మొక్కుబడిగా తనిఖీలు ప్రస్తుతం జిల్లాలో మెడికల్ దుకాణాల తనిఖీ అంతా మొక్కుబడి తంతుగానే సాగుతుంది. జిల్లాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు తణుకు, కొవ్వూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరులో డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. వీరిలో ప్రస్తుతం భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఒక్కో ఇన్స్పెక్టర్ నెలకి నలభై దుకాణాలు తనిఖీలు, ఐదు శాంపిల్స్ సేకరించాల్సి ఉంటుంది. రెండు శాంపిల్స్ ప్రభుత్వ పీహెచ్సీలు, సీహెచ్సీలు, కమ్యూనిటీ ఆసుపత్రుల నుంచి మూడు ట్రేడర్స్ నుంచి సేకరించాల్సి ఉంటుంది. శాంపిల్స్ నివేదికలు అందిన తర్వాత సంబంధిత కంపెనీలు, వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారు. చాలా చోట్ల మెడికల్ దుకాణాల్లో ఫార్మసిస్టులే ఉండటం లేదు. వాస్తవంగా వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్కి అనుగుణంగా మందులు విక్రయాలు చేయాలి. కొనుగోలుదారులకు బిల్లు ఇవ్వాలి. కొన్ని దుకాణాల్లో నకిలీ మందులు, నాసిరకం మందులు విక్రయాలు సాగిస్తున్నప్పటికీ మొక్కుబడి తంతుగానే తనిఖీ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం మందులను, ఫిజీషియన్ శాంపిల్స్ను చిల్లర విక్రయాల ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. మందుల షీట్పై ముద్రించిన తేదీని వాళ్ల వద్ద ఉంచుకుని రెండో వైపు కత్తిరించి ఇవ్వడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటువంటి సందర్భాలు జిల్లాలో కోకొల్లలు. -
మందుల్లేవ్..?
సాక్షి, ఆదిలాబాద్: సర్కారు దవాఖానాలకు ప్రభుత్వం నుంచి సరఫరా చేసే మందుల కోటా ప్రతీ ఏడాది మిగిలిపోయి ల్యాప్స్ అవుతున్నాయి. మరో పక్క ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు అత్యవసరంలో 20 శాతం మందులు బయట నుంచి కొనుగోలు చేసే అవకాశాన్ని మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాయి. అయినప్పటికీ ధర్మాస్పత్రుల్లో సాధారణ మందులు కూడా లభించకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. కోటాలో మందులు మిగిలిపోతాయి.. అత్యవసరం పేరిట ఆస్పత్రి వర్గాలు మందులు కొనుగోలు చేస్తాయి.. అయినా పేద రోగులకు మాత్రం ఆస్పత్రిలో సాధారణ మందులు కూడా లభించవు. దీంతో బయట మెడికల్లో పేద రోగులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డబ్బులు లేకనే చికిత్స, మందులు ఉచితంగా లభిస్తాయని రిమ్స్కు వస్తే ఈ పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నిత్యం కనిపిస్తోంది. పేద రోగులకు చికిత్స, మందులు పూర్థి స్థాయిలో ఉచితంగా అందజేయాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదు. ప్రతీ ఏడాది ఇదే పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో డ్రగ్స్ రూ.14.66 కోట్లకు గాను రూ.10.95 కోట్లు వినియోగించారు. రూ.3.70 కోట్ల విలువైన డ్రగ్స్ ల్యాప్స్ అయ్యాయి. రూ.4.04 కోట్లు సర్జికల్ ఐటమ్స్గాను రూ.3.31 కోట్లు వినియోగించగా, రూ. 72.92 లక్షల విలువైన సర్జికల్ ఐటమ్స్ మిగిలిపోయాయి. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ద్వారా ఏప్రిల్లో మందుల కోటాను విడుదల చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రి, భైంసా, మంచిర్యాల, నిర్మల్ ఏరియా ఆస్పత్రులు (ఏహెచ్), ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, సిర్నూర్, ఉట్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్సీ), నిర్మల్లోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్), ఉమ్మడి జిల్లాలోని 72 పీహెచ్సీలు, పట్టణ ప్రాంతాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లకు ప్రతి ఏడాది మందుల కోటా టీఎస్ఎంఎస్ఐడీసీ నుంచే మంజూరు అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు మందుల సరఫరా జరుగుతుంది. గత ఏడాది పరిస్థితే మళ్లీ జిల్లాలో కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా కేటాయించిన మందుల కోటా మిగిలిపోతుండగా ఆస్పత్రుల్లో మాత్రం పేదలకు మందులు లభించని పరిస్థితి. ఈ తారతమ్యాన్ని పరిష్కరించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే మందుల కోటాను పెంచాల్సి ఉంది. ఈ–ఔషధి, ఈ–ఆస్పత్రి పేరిట ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటునప్పటికీ పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య చికిత్సలతోపాటు మందులు లభించినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. మందుల కొనుగోలులో అక్రమాలు ప్రతి ఏడాది మూడు నెలలకు ఓసారి నాలుగు కోటాల్లో మందులను ఆస్పత్రులకు విడుదల చేస్తారు. ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరిల్లో ఈ మందులను విడుదల చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి కావాల్సిన మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అందుబాటులో లేని పక్షంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు కోటాపై 20 శాతం మందులు బయట నుంచి కొనే అవకాశం ఉంది. బయట నుంచి కొనే మందుల విషయంలో ఆస్పత్రిల్లో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఒక ఆస్పత్రికి డిమాండ్ ఉన్న మందులు, మరో ఆస్పత్రిలో అవే మందులు వృథాగా ఉంటే ఆ ఆస్పత్రి నుంచి ఈ ఆస్పత్రికి మందులను తరలించే చెయిన్ సిస్టమ్ ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గిరిజనులు అత్యధికంగా ఉండే ఆసిఫాబాద్, ఖానాపూర్, ఉట్నూర్ వంటి ఆస్పత్రుల్లోనూ మందుల కోటా పెద్ద ఎత్తున మిగిలిపోతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంత అవసరమో అంతే కొంటాం.. సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అందుబాటులో లేని మందులను బయట నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎంత అవసరమో అంత మేరకే కొంటాం. రిమ్స్ కొనుగోలు కమిటీ అనుమతి మేరకు మందులను కొనుగోలు చేస్తాం. కోటాపై 20 శాతం కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. మందుల వినియోగం పై ప్రతి ఏడాది ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. – డాక్టర్ అశోక్, రిమ్స్ డైరెక్టర్ -
మేడ మీద ము‘నగ’!
హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఎస్.బి.ఐ. కాలనీలో రెండంతస్థుల సొంత భవనంలో నివాసం ఉంటున్న అర్చన, ఫార్మా ఉద్యోగి అరవింద్కుమార్ దంపతులు గత ఐదారేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటున్నారు. ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీపై సిల్పాలిన్ బెడ్స్ తీసుకొని టమాటా, వంకాయలు, అల్లంతోపాటు మునగ, బొప్పాయి చెట్లను పెంచుతున్నారు. పార్స్లీ, ఆరెగానో, తులసి, లెమన్గ్రాస్, కలబంద తదితర ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. పెద్ద సిల్పాలిన్ బెడ్లో నాలుగేళ్లుగా ఎత్తుగా పెరిగిన మునగ చెట్టు వీరి కిచెన్ గార్డెన్కు తలమానికంగా నిలిచింది. మునగ కాయలతోపాటు ఆకులను కూడా కూరవండుకుంటున్నామని అర్చన తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా పార్స్లీ, ఆరెగానో తదితర ఆకులను ఉపయోగించి ఇంట్లోనే పిజ్జాలు తయారుచేసుకొని తింటుండడం విశేషం. 30 ఏళ్ల నాటి ఈ రెండంతస్థుల భవనానికి పిల్లర్లు వేయలేదు. గోడలపైనే నిర్మించారు. అందువల్ల గోడలపైనే 8 సిల్పాలిన్ బెడ్స్, కుండీలను ఏర్పాటు చేసుకొని ఐదారేళ్లుగా ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. 15 రోజులకోసారి జీవామృతం మొక్కలకు మట్టి ద్వారా, పిచికారీ ద్వారా కూడా ఇస్తున్నారు. రోజూ దేశీ ఆవుపాలు సరఫరా చేసే వ్యక్తే జీవామృతాన్ని సైతం ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మేడపైనే ఒక సిల్పాలిన్ బెడ్ను కంపోస్టు తయారీకి వాడుతున్నారు. టెర్రస్పైన ఇంటిపంటలు, షేడ్నెట్, ఇంటి చుట్టూ వెదురు తదితర మొక్కలు ఉండటం వల్ల తమ ఇంట్లో వేసవిలోనూ ఉష్ణోగ్రత 3–4 డిగ్రీల మేరకు సాధారణం కన్నా తక్కువగా ఉంటున్నదని అర్చన(98663 63723) సంతోషంగా చెప్పారు. అంటే.. ఇంటిపంటల కోసం శ్రద్ధతీసుకుంటే.. ఆరోగ్యంతోపాటు ఇంటి ఏసీ ఖర్చులు కూడా తగ్గాయన్నమాట! మునగాకు చిన్న – పోషకాలలో మిన్న మునగను తింటే అనేక పోషకాలను పుష్కలంగా తిన్నట్టే లెక్క. ఇదీ మునగ ఆకులో నిక్షిప్తమై ఉన్న పోషకాల జాబితా.. విటమిన్–సి: కమలాల్లో కన్నా 7 రెట్లు ఎక్కువ విటమిన్–ఎ: క్యారెట్లలో కన్నా 4 రెట్లు ఎక్కువ కాల్షియం: పాలలో కన్నా 4 రెట్లు ఎక్కువ పొటాషియం: అరటి పండ్లలో కన్నా 3 రెట్లు ఎక్కువ విటమిన్–ఇ: పాలకూరలో కన్నా 3 రెట్లు ఎక్కువ మాంసకృత్తులు: పెరుగులో కంటే 2 రెట్లు ఎక్కువ మునగాకును పప్పులో, సాంబారులో వేసి వండవచ్చు. మునగాకు వేపుడు చేయవచ్చు. మునగకాయలో కంటే ఆకుల్లో పోషకాలు ఎక్కువ మునగ పొడి చేసేదెలా? ► తయారు చేయటం తేలిక – వాడటం తేలిక ► లేత మునగాకును కడిగి, నీడలో ఆరబెట్టాలి ► గలగలలాడేలా ఆరిన మునగాకును పొడి చెయ్యాలి ► పొయ్యి మీద నుంచి దించిన తరువాత కూరలు, చారు వంటి వాటిల్లో వేయచ్చు. మునగలో ఉపయోగపడని భాగం లేదు ఆకులు – కూర, పోషకాల గని గింజ – మందు, నూనె, నీటి శుద్ధి కాయ – కూర పువ్వు – మందు, చట్నీ బెరడు – మందు బంక – మందు వేరు – మందు పెరటిలో మునగ చెట్టు ఉండగ – విటమిన్లు, టానిక్కులు కొనటం దండగ. మునగ చెట్లు పెంచుదాం – మునగాకు వాడకం పెంచుదాం. వివరాలకు.. కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్(040–27610963) ఫొటోలు: ఇసుకపట్ల దేవేంద్ర, సాక్షి ఫొటో జర్నలిస్టు -
ఈ టెర్రస్.. ఇంటిపంటల శిక్షణా కేంద్రం!
సింహాచలం అప్పన్న గోశాలకు కూత వేటు దూరంలో విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని దారపాలెంలో సొంత ఇల్లు నిర్మించుకున్న దాట్ల వర్మ, శ్రీదేవి దంపతులు సేంద్రియ ఇంటిపంటల సాగులో ఆదర్శవంతమైన కృషి చేస్తున్నారు. వర్మ ప్రస్తుతం విజయనగరం ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం సొంతిల్లు నిర్మించుకొని టెర్రస్ కిచెన్/మెడిసినల్ గార్డెన్ను ఏర్పాటు చేసుకున్నారు. 150కి పైగా ఖాళీ రంగు డబ్బాలలో మొక్కలు పెంచుతున్నారు. ఇంటిపంటల జీవవైవిధ్యానికి నిదర్శనం: ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు, పూలమొక్కలతో పచ్చగా కళకళలాడే వారి టెర్రస్ గార్డెన్ జీవవైవిధ్యంతో సుసంపన్నంగా ఉంటుంది. ఘనజీవామృతం, జీవామృతం, పశువుల ఎరువు(గెత్తం), వర్మీకంపోస్టు, అవసరం మేరకు కషాయాలను వాడుతూ వర్మ దంపతులు మక్కువతో ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఇంటి చుట్టూ నేలపైన, దగ్గర్లో తెలిసిన వారి ఖాళీ ఇంటి స్థలాల్లో కూరగాయలు, కందులు, పండ్ల మొక్కలను సాగు చేస్తూ.. పూర్తిగా ఇంటిపంటల ఆహారాన్నే తింటున్నారు. మేడపైన పుదీన, కొత్తిమీర, తోటకూర, పాలకూర తదితర ఆకుకూరలతోపాటు బీర, ఆనపకాయ, చిక్కుళ్లు, కంది,అరటి, వంకాయలు, బెండకాయలు, క్యాబేజి, టమోటా సాగు చేస్తున్నారు. ఇంటి చుట్టూ పెరట్లో పది రకాల పండ్ల చెట్లను పెంచుతున్నారు. హైదరాబాద్లోని ఇంటిపంట సాగుదారులు ఏర్పాటు చేసుకున్న ఫేస్బుక్ బృందం స్ఫూర్తితో ప్రధానంగా విశాఖ ప్రాంత ఇంటిపంట సాగుదారులకు సహాయ పడటానికి కొత్తవలసకి చెందిన కర్రి రాంబాబుతో కలిసి ఫేస్బుక్లో రైతుమిత్ర పేరిట బృందాన్ని ప్రారంభించారు. ఇంటిపంటలపై అవగాహన: సేంద్రియ ఇంటిపంటల పెంపకంపై ఆసక్తి ఉన్న విశాఖనగరవాసులు సెలవు రోజుల్లో మా ఇంటిని సందర్శిస్తూ ఉంటారు. వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి అవగాహన కల్పించడంతోపాటు కొన్ని మొక్కలు, విత్తనాలను కూడా ఇస్తున్నామని వర్మ, శ్రీదేవి(98661 38129) తెలిపారు. సింహాచలం అప్పన్న ఆలయ గోశాలలో జీవామృతాన్ని తయారు చేయించి, మనిషికి 5 లీటర్ల చొప్పున ఉచితంగా పంపిణీ చేయిస్తున్నారు. మరింత మందికి ఈ విధానాన్ని తెలియజేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెబుతున్నారు. – అవసరాల గోపాలరావు, సాక్షి, సింహాచలం, విశాఖ జిల్లా -
క్షీణిస్తున్న ఆయుష్
ఆయుష్ విభాగాలు నిర్వీర్యమవుతున్నాయి. ఈ వైద్య విధానాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యమిస్తూ కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. జిల్లా కేంద్రమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఆయుష్ విభాగంలో ఒక్క వైద్యుడూ లేకపోవడం..మందులు కొరత అందుకు నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు(హాస్పిటల్): పెద్దాసుపత్రిలోని ఆయుష్ విభాగంలో రెగ్యులర్ హోమియో వైద్యుడిగా ఉన్న డాక్టర్ వెంకటయ్య 2016 మే 19వ తేదీన బదిలీపై తెలంగాణాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన స్థానంలో డాక్టర్ సుజాతను నియమించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమె విధులకు సక్రమంగా హాజరయ్యేది కాదు. గత డిసెంబర్లో ఆమె గుడివాడకు డిప్యూటేషన్పై వెళ్లిపోయారు. అప్పటి నుంచి బ్రాహ్మణకొట్కూరులో పనిచేస్తున్న డాక్టర్ భారతిని సోమ, బుధ, శుక్రవారాలు, ఆత్మకూరులో పనిచేస్తున్న డాక్టర్ జవహర్లాల్ను మంగళ, గురు, శనివారాల్లో డిప్యూటేషన్పై ఇక్కడ పనిచేసేటట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్ భారతి రెగ్యులర్గా వస్తున్నా కొంత కాలంగా డాక్టర్ జవహర్లాల్ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎవ్వరూ రావడం లేదు. రోగులు మాత్రం ఆసుపత్రికి వచ్చి వెనుతిరిగిపోతున్నారు. డిస్పెన్సరీలో డాక్టర్లు ఉంటారో..ఉండరోననే ఉద్దేశంతో ఇటీవల వారు రావడం కూడా మానేశారు. గతంలో ఇక్కడ రోజుకు 70 నుంచి 120 వరకు రోగులు చికిత్స కోసం వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ఆయుర్వేద డిస్పెన్సరీలో 2017 జూన్లో డాక్టర్ పీవీ నాగరాజ బదిలీపై బనగానపల్లికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇక్కడ ఏ ఒక్కరినీ నియమించలేదు. పాణ్యంలో పనిచేస్తున్న డాక్టర్ గ్రేస్ సెలెస్టియల్ సోమ, బుధ, శుక్రవారాలు మాత్రమే వస్తూ రోగులను పరీక్షిస్తున్నారు. మిగిలిన రోజుల్లో వైద్యులు లేక రోగులు వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. ఆయుర్వేదంలో మందులు ఖాళీ ఆయుర్వేద విభాగంలో మందులు ఖాళీ అయ్యాయి. ప్రభుత్వం వద్ద ఆయుష్నిధులు పుష్కలంగా ఉన్నా ఇక్కడ మాత్రం మందుల కొరత వేధిస్తోంది. ఉండాల్సిన మందుల్లో 10 శాతం కూడా లేవు. వచ్చిన రోగులకు వైద్యులు ప్రైవేటుకు మందులు రాయాల్సి వస్తోంది. రెండు విభాగాల్లో డాక్టర్లు లేకపోవడంతో ఇక్కడ పనిచేసే ఫార్మాసిస్టులే రోగులకు పెద్ద దిక్కుగా మారారు. రెండు నెలలుగా మందులు లేవు నాకు గ్యాస్ట్రబుల్, కీళ్లనొప్పులు, షుగర్ వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులకు నేను గతంలో ఆయుర్వేద వైద్యాన్ని వాడుతూ తగ్గించుకున్నాను. ఆ మందులే నాకు బాగా పనిచేసేవి. ప్రైవేటుగా మందులు కొనుగోలు చేసినా ఇక్కడ ఇచ్చినంతగా పనిచేసేవి కావు. అయితే రెండు నెలల నుంచి ఇక్కడ మందులు లేకపోవడంతో వెనుదిరగాల్సి వస్తోంది. –బి. నరసింహులు, రిటైర్డ్ సూపరింటెండెంట్, విద్యాశాఖ -
మాతృభాషలోనే మందులు
లక్ష్మణచాంద(నిర్మల్): అందరికీ అవసరమయ్యే ఔషధాల పేర్లను ప్రభుత్వం మాతృభాలోనే ముద్రిస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలై ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి తెలుగులో ముద్రించిన మందులు వస్తున్నాయి. తప్పిన ఆంగ్ల తిప్పలు.. చరిత్రలోనే నేటి వరకు ఔషధాల పేర్లు తెలుగులో ముద్రించిన దాఖలాలు లేవు. వైద్యులు మందుల చిట్టీపై ఆంగ్లంలో మందులు రాస్తే ఎవరికీ అర్థం కాని స్థితిలో ఉండేది. ప్రభుత్వం అందరికీ అర్థమయ్యలా రాయాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మందులు కూడా తెలుగులో ముద్రితమై వస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మందుల పేర్లు అన్ని తెలుగులోనే ముద్రించాలని నిబంధన విధించిం ది. మాత్రలు, మందు సీసాలపై తెలుగులోనే ఔ షధ ఫార్ములా ముద్రించారు. అందువల్ల వైద్యులు కూ డా తప్పనిసరిగా జనరిక్ నామం రాయకతప్పడం లేదు. వైద్య, ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టి వల్ల నూతన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టిని సారించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఇతరత్రా సౌకర్యాలను కల్పిస్తోంది. అలాగే ఔషధాల దుర్వినియోగం కాకుండా మందులను ఆన్లైన్లో నమోదు చేయిస్తోంది. తాజాగా ఔషధాల పేర్లు తెలుగులో ముద్రించడం ద్వారా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లయిందని ప్రజలు పేర్కొంటున్నారు. 50 కంపెనీలు 500 రకాల ఔషధాలు.. ప్రభుత్వం ఇప్పటి వరకు అన్ని జిల్లాలోని జిల్లా ఆస్పత్రులకు, ప్రాథమిక ఆస్పత్రులకు 50 కంపెనీలకు చెందిన 500 రకాల మందులను సరఫరా చేస్తోంది. ఇందులో సాధారణ వ్యాధుల మందులతో పాటు ధీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే మందులు, వివిధ రకాల సిరప్లు, ఆయింట్మెంట్లు ఉన్నాయి. మందులపై అవగాహన పెరిగింది.. ఇంతకు ముందు మందుల పేర్లు ఆంగ్లంలో ఉండేవి. దీంతో మాలాంటి సామాన్యులకు అవేమీ అర్థం కాకపోయేవి. పలుకుదామంటే నోరు తిరిగేది కాదు. కానీ ప్రభుత్వం తెలుగులో మందుల పేర్లు ముద్రించడంతో మందులపై అవగాహన పెరిగింది. – మోహన్, తిర్పెల్లి సామాన్యులకు మేలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు చాలా వరకు మేలు జరిగింది. తెలుగులో మందుల పేర్లు ముద్రించడంతో వారే మందుల తెలుసుకుంటున్నారు. – మనోజ్ఞ, వైద్యులు, లక్ష్మణచాంద -
అన్నీ ఆన్లైన్లోనే
సిద్దిపేటకమాన్: ‘ఈ–ఔషధి’ అమలులో సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆదర్శంగా నిలుస్తోంది. ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు వారికి అందించే మందుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తుండటంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో 19వేల మంది రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. అత్యాధునిక సేవలు సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కార్పొరేట్ హంగులతో అత్యాధునిక సేవలు అందిస్తోంది. ఆస్పత్రికి నిత్యం వచ్చే వందలాది మంది రోగులను వైద్యులు పరీక్షించడంతో పాటు ఫార్మసీలో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. అయితే, గతంలో రోగుల సంఖ్య, వారికి అందజేసే మందుల వివరాలను చేతిరాత ద్వారా రికార్డు చేసేవారు. ఈ పద్ధతి వల్ల రోగులు, మందుల వివరాలు సమాచారం పక్కాగా ఉండేది కాదు. దీంతో మందులు పక్కదారి పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో వసతుల కల్పన, వైద్య సేవల మెరుగుదలపై రాష్ట్ర సర్కార ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రోగుల వివరాలను పక్కాగా నమోదు చేయడం, పారదర్శకంగా మందులను పంపిణీ చేయడానికి ఈ–ఔషది విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కంప్యూటర్లతో పాటు సిబ్బందికి శిక్షణ అందించారు. అంతేకాకుండా రోజువారి రోగులు, మందుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ విధానం 2017 మార్చి నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 19,112 మంది రోగుల వివరాలనుఈ–ఔషధిలో నమోదు చేయడం గమనార్హం. ఈ విధానంతో సిద్దిపేట జిల్లా ఆస్పత్రి రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలుస్తోంది. రోజుకు 1200 ఓపీ సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి నిత్యం వివిధ విభా గాల్లో సుమారు 1200 మంది రోగులు సేవలు పొం దుతున్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు లేకపోవడంతో పాటు సేవలు కూడా అంతంత మాత్రంగా ఉండటంతో 500 వరకు మంది ఔట్ పేషె ంట్లు వచ్చేవారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో ఇటీవల ఆస్పత్రిని అన్ని విధాల అ భివృద్ధి చేస్తున్నారు. అన్ని విభాగాల్లో వైద్యులను ని యమించడం, హైరిస్క్ కేంద్రం,డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ–ఔషధి ద్వారా రోగులు, మందుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. ఈ ప్రక్రియ ఎప్పటికీ కొనసాగుతుంది. గతంలో రికార్డులు రాసే విధానం ఉండటంతో మందులు పక్కదారి పట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. – డా.నర్సింహం, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ప్రభుత్వాస్పత్రి ఓపి డిస్పెన్సరీలో అగ్నిప్రమాదం
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపి డిస్పెన్సరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం. ఈ సంఘటనలో మందులు, ఫర్నిచర్, ఏసీ అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆస్పత్రి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎఫ్బీలో చూసి ఆ పిచ్చిపని చేశా.. వైరల్
సాక్షి, శ్రీనగర్: రైలు వస్తుండగానే దాని ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకోవాలన్న యత్నంలో ఇప్పటికే కొందరు వ్యక్తులు మృతిచెందారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలపాలవుతూ కాళ్లు, చేతులు కోల్పోతుంటారు. అయితే తాజాగా జమ్మూకశ్మీర్కు చెందిన మెడిసిన్ విద్యార్థి చేసిన డేరింగ్ ఫీట్పై తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. రైలు పట్టాలపై పడుకుని రైలు వెళ్తుండగా స్నేహితుడితో ఈ తతంగాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ యువకుడి చర్యలను పిచ్చి చేష్టలుగా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇలాంటివి చేయకూడదంటూ యువతను హెచ్చరించారు. పోలీసుల కథనం ప్రకారం.. కశ్మీర్లోని బిజ్బెహ్రా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అదిల్ అహ్మద్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అదిల్ ఇటీవల ఫేస్బుక్లో ఓ ప్రమాదకర వీడియో చూశాడు. తాను కూడా అలాగే చేయాలని ప్లాన్ చేసుకున్న అదిల్ తన స్నేహితుడు మొహమ్మద్ ఖాసీం(19)తో కలిసి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. తాను పట్టాలపై పడుకుంటానని, ఆ సమయంలో ట్రాక్పై రైలు వెళ్తుండగా వీడియో తీయాలని ఖాసీంకు సూచించాడు. రైలు వెళ్తుండగా పట్టాలపై అదిల్ ధైర్యంగా పడుకోవడం, రైలు వెళ్లిపోయాక తనకు ఏమీ కాలేదంటూ గంతులేయడాన్ని ఖాసీం వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దంటూ పోలీసులు యువతను హెచ్చరించారు. తాను తప్పు చేశానని ఒప్పుకున్న అదిల్.. మరోసారి తాను ఇలాంటి పనులు చేయనని, ఎవరూ ఇలాంటి ప్రమాదకర స్టంట్లకు ఉపక్రమించవద్దని సూచించాడు. -
ఎఫ్బీలో చూసి ఆ పిచ్చిపని చేశా..
-
జీరిక నీరా, బెల్లం భేష్!
తాటి బెల్లం ద్వారా ఒనగూడే ఔషధ గుణాలు, పోషక విలువలు ఎన్నో. అనాదిగా మన పెద్దలు వాడుతున్న ఆరోగ్యదాయకమైనది తాటి బెల్లం. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో తాటి బెల్లానికి, ఆరోగ్య పానీయంగా తాటి నీరా వాడకానికి మళ్లీ ఆదరణ పెరుగుతోంది. తాటి బెల్లాన్ని సాధారణ పంచదార, బెల్లానికి బదులుగా వాడటం ఎంతో ఆరోగ్యదాయకమని వైద్యులు చెబుతున్నారు. అందువల్లే మధుమేహ రోగులు సైతం తాటి బెల్లాన్ని నిక్షేపంగా వాడుతున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ బెల్లం తయారీకి అవసరమైన నీరా ఉత్పత్తి తాటి చెట్టుకు రోజుకు 5–6 లీటర్లకు మాత్రమే పరిమితం. తాటి నీరా కన్నా జీరిక నీరా రుచికరమైనది. తాటి బెల్లానికి దీటుగా ఔషధగుణాలు, పోషకాలు కలిగి ఉండే ‘జీరిక’ బెల్లాన్ని భారీ ఎత్తున ఉత్పత్తి చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు ఇటీవల వేలాది జీరిక మొక్కలను నర్సరీల నుంచి సేకరించి తమ నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఇటీవల నల్లగొండ జిల్లా మల్లేపల్లిలో తాటి పరిశోధనా స్థానాన్ని మంజూరు చేసింది. ఈ కేంద్రంలో జీరిక చెట్లపై కూడా పరిశోధన ప్రారంభించటం మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఈ జీరిక చెట్ల మాదిరిగానే కనిపించే అలంకారప్రాయమైన మరో జాతి చెట్లు కూడా ఉన్నాయని, వీటిని కేవలం అందం కోసం లాండ్స్కేపింగ్లో వాడుతున్నారని.. నీరా కోసం జీరిక మొక్కలను నాటుకునే రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గిరిజనుల కల్పవృక్షం.. జీరిక జీరిక చెట్టును సుల్ఫి లేదా ఫిష్టైల్ పామ్ అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో గిరిజనులు సాంప్రదాయకంగా జీరిక నీరాను, కల్లును ఆరోగ్యపానీయంగా వాడుతున్నారు. తాటి చెట్ల నీరా/కల్లు కన్నా రుచికరమైనది కావడంతో జీరిక నీరా/కల్లుకు జగదల్పూర్, బస్తర్ ప్రాంతాల్లో గిరాకీ ఎక్కువగా ఉంది. ఇది గిరిజనులకు ముఖ్యమైన ఆదాయ వనరుగా కూడా ఉంది. నాటిన ఆరేళ్ల నుంచే నీరా దిగుబడి.. జీరిక మొక్క నాటిన ఆరేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు.. ఒక్కో జీరిక చెట్టు నుంచి సగటున 30–40 లీటర్ల నీరాను సేకరిస్తున్నారు. భూసారం తదితర సానుకూలతల వల్ల కొన్ని చెట్ల నుంచి రోజుకు 50–60 లీటర్ల వరకు నీరాను సేకరిస్తూ, ఆరోగ్య పానీయంగా వినియోగిస్తున్నారు. బియ్యాన్ని ఉడికించి అన్నం వండుకోవడానికి నీటికి బదులు జీరిక నీరాను గిరిజనులు వినియోగిస్తుంటారు. తద్వారా కేన్సర్, తదితర జబ్బులు నయమవుతున్నాయని కూడా గిరిజన సంప్రదాయ వైద్యులు విశ్వసిస్తున్నారు. ఆ విధంగా జీరిక నీరా/కల్లు ఛత్తీస్గఢ్ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జగదల్పూర్, మారేడుమిల్లి ప్రాంతాల్లో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగానే కాకుండా.. వారి ఆహార సంస్కృతిలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నది. అందువల్లనే గిరిజనులు జీరిక చెట్టును కల్పవృక్షంగా కొలుస్తారు. ఆడ పిల్లకు ఒక్కో చెట్టు చొప్పున పుట్టింటి వాళ్లు కానుకగా ఇచ్చే అలవాటు కూడా అక్కడ అనాదిగా ఉన్నది. ఈ కారణంగా ఒక్కో చెట్టు నుంచి ఏటా రూ. 30 వేల నుంచి 40 వేల వరకు గిరిజనులు ఆదాయం పొందుతుండటం విశేషం. మైదాన ప్రాంతాలకు జీరిక అనువైనదేనా? జీరిక చెట్లు ప్రస్తుతం ఆంధ్ర–ఒడిశా– ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతున్నాయి. తాటి చెట్ల కన్నా 6–7 రెట్ల నీరా దిగుబడినిస్తున్నాయి. అయితే, మైదాన ప్రాంతాల్లో ఈ చెట్లు ఇదే మాదిరిగా అధికంగా నీరా దిగుబడిని ఇస్తాయా? లేదా? అన్నది వేచి చూడాలని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా స్థానం సీనియర్ ఆహార శుద్ధి శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య ‘సాగుబడి’ తో చెప్పారు. అనాదిగా జీరిక పెరుగుతున్న మారేడుమిల్లి తదితర ప్రాంతాలు సముద్ర తలం నుంచి 250 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ విధంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వీటి కన్నా ఎత్తయినవే. కాబట్టి, సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మినహా ఎత్తయిన మైదాన ప్రాంతాల్లో కూడా జీరిక సాగు లాభదాయకంగానే ఉండొచ్చని ఆయన చెబుతున్నారు. అయితే, జీరిక నీరా దిగుబడిపై వాతావరణం, భూములు.. ఇంకా ఇతర అంశాల ప్రభావం ఏమేరకు ఉంటుందో శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంది. జగదల్పూర్లో రెండేళ్ల క్రితమే జీరికపై ప్రత్యేక పరిశోధనా స్థానం ఏర్పాటైంది. దీనిలో పరిశోధనలు ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్నాయి. వెంగయ్య తమ పరిశోధనా స్థానంలో గత ఏడాది గిరిజనుల నుంచి సేకరించిన జీరిక మొక్కలను నాటారు. మైదాన ప్రాంతాల్లో కూడా నీరా దిగుబడి బాగా ఉందని రుజువైతే.. ఆరోగ్యదాయకమైన పానీయం నీరాతో పాటు ఔషధగుణాలుండే సహజ జీరిక బెల్లాన్ని కూడా భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి, అశేష ప్రజానీకానికి అందుబాటులోకి తేవటం సాధ్యమవుతుందని వెంగయ్య అన్నారు. తాటి బెల్లంలో మాదిరిగా జీరిక బెల్లంలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి.. సాధారణ పంచదార/బెల్లానికి బదులు తాటి/జీరిక బెల్లాన్ని ఏ వయస్సు వారైనా, మధుమేహ రోగులు సైతం వాడొచ్చని ఆయన తెలిపారు. 100 లీటర్ల జీరిక నీరాతో 15 కిలోల బెల్లం తాటి నీరా కన్నా జీరిక నీరా రుచికరమైనది కూడా. జీరిక నీరాతో తాటి నీరాతో మాదిరిగానే 12–15% బెల్లం రికవరీ(100 లీటర్ల నీరాను ఉడికించితే 12–15 కిలోల బెల్లం ఉత్పత్తి) వస్తున్నదని వెంగయ్య జరిపిన ప్రాధమిక అధ్యయనంలో తేలింది. అయితే, ఔషధగుణాలు, ఖనిజలవణాలు, పోషకాల విషయంలో కూడా తాటి, జీరిక నీరాల మధ్య తేడా ఏమైనా ఉందా అనేది పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్నప్పటికీ.. పెద్దగా తేడా ఉండకపోవచ్చు అని వెంగయ్య (94931 28932) తెలిపారు. జీరిక చెట్ల వద్ద రాలిపడిన కాయల ద్వారా మొక్కలు మొలుస్తుంటాయి. గిరిజనులు వాటిని తెచ్చి మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. జీరిక చెట్ల కాయలు పెద్ద రేగు కాయల సైజులో ఉంటాయి. జీరిక చెట్లలో వైవిధ్యం, అవి పెరుగుతున్న భూములను బట్టి వాటి కాయల రంగులో తేడా కనిపిస్తోంది. ఈ కాయల నుంచి విత్తనాలను సేకరించి.. నర్సరీలో మొక్కలను పెంచుకొని నాటుకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
1,200 ఏళ్ల కిందటే.. మందుల్లో పాదరసం!
సాక్షి, హైదరాబాద్ : మందుల్లో పాదరసాన్ని వినియోగించడం ఇప్పుడు ఆశ్చర్యం కాకపోవచ్చు.. కానీ 1,200 ఏళ్ల కిందటే ఈ ప్రక్రియ జరిగితే!!! ఆకు పసర్లు, మూలికలే మందులుగా ఉండే కాలంలో ఇంత పరిజ్ఞానం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతాం. కానీ 9వ శతాబ్దంలోనే సిద్ధ నాగార్జునుడు అనే వైద్య ప్రముఖుడు దీన్ని ఆచరించి చూపాడు. ఇది ఎక్కడో కాదు.. తెలంగాణ గడ్డమీదే. మహబూబ్నగర్ జిల్లా ఏలేశ్వరంలో జరిపిన తవ్వకాల్లో ఆయన వినియోగించిన పరిశోధనశాల వెలుగు చూసింది. అప్పట్లో ఆయన రాసిన రసేంద్ర మంగళం గ్రంథాన్ని ఉటంకిస్తూ పద్మనాయకుల హయాంలో రాసిన తాళపత్ర గ్రంథాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇలా ఇదొక్కటే కాదు ప్రపంచానికి తొలి శాస్త్రీయ వైద్యాన్ని అందించిన ఆయుర్వేదంలో ఇలాంటి అద్భుతాలెన్నో. ఇవన్నీ పుక్కిటి పురాణాలుగా కొట్టేసే విషయాలు కాదు. ఆధారాలతో సహా ఉన్నాయన్న సంగతి అంతర్జాతీయ పురావస్తు సదస్సులో ప్రధానాకర్షణగా నిలిచింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శుక్రవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో సహాయ సంచాలకులు డాక్టర్ గోలి పెంచల ప్రసాద్ తన పరిశోధనల వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు, చరిత్రకారులు డాక్టర్ రాజారెడ్డి దీనికి అనుబంధంగా పలు విషయాలను వెల్లడించారు. వివరాలు వారి మాటల్లోనే.. అగ్గలాంగే గగ్గలమ్ ‘‘నేను చికిత్స చేసే క్రమంలో మందులతో జబ్బును తగ్గించేందుకు ప్రయత్నిస్తా. అవసరమైతే శస్త్రచికిత్స చేస్తా’’11వ శతాబ్దంలో చాళుక్యుల హయాంలో ప్రముఖ వైద్యుడిగా వెలుగొందిన అగ్గలయ్య మాట ఇది. ఈయన ఫిజీషియన్గా, సర్జన్గా అప్పట్లో వెలుగొందారు. ఏ వైద్యుడూ నయం చేయలేని జబ్బు మాయం చేస్తాడన్నది అప్పట్లో ఆయన ఘనతను చెప్పుకొనేవారట. ‘అగ్గలాంగే గగ్గలమ్’అంటూ ఆయనను పిలిచేవారు. ఈయన తొలుత ఓ గ్రామ పెద్దగా ‘గౌండ్’హోదాను, ఆ తర్వాత సామంత రాజు హోదాను దక్కిం చుకున్నారు. ఈ విషయాలు సైదాపూర్లో వెలుగుచూసిన ఓ శాసనం వెల్లడిస్తోంది. ఆయన ‘వైద్య రత్నాకర ప్రాణాచార్య’ బిరుదు కూడా అందుకున్నారు. నాటి ఓ జైన ఆలయానికి వైద్య రత్నాకర జినాలయం అనే పేరు పెట్టారు. ఆయన పేరుతో స్తూపంపై నాటి రాజు జయసింహ–2 శాసనమే చెక్కించారు. జ్వరాలయం.. ఓ మెడికల్ కాలేజీ ఒకటి, రెండు శతాబ్దాల్లో నాగార్జున కొండ వద్ద విహారే ముఖ్య జ్వరాలయం కొనసాగింది. ఇది నాటి మెడికల్ కళాశాల. అందులో జ్వరాలకు ప్రత్యేక విభాగం ఉండేది. 1920లో జరిగిన తవ్వకాల్లో వెలుగుచూసిన శాసనం దీన్ని పేర్కొంటోంది. 2, 3 శతాబ్దాల్లో సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో కూడా ఇలాంటి అంశమే వెలుగుచూసింది. అక్కడ నిలబెట్టిన ధర్మ చక్రం ఓ వైద్యుడికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నవారే ఆ స్థూపాన్ని నిలపాల్సి ఉంటుంది. నాటి రాజు ధేమసేన ఆస్థాన వైద్యుడుగా కొనసాగుతున్న రాజవైద్యుడితో దాన్ని నిలబెట్టించారు. నల్లగొండ జిల్లా రామన్నపేట సమీపంలోని తుమ్మలగూడెంలో లభించిన శాసనంలో విష్ణుకుండినులు–5కు చెందిన గోవిందవర్మన్ నాటి వైద్య అవసరాలకు మందుల కొనుగోలుకు గ్రాంటు విడుదల చేసిన అంశం చెక్కి ఉంది. అశోకుడి కాలంలో జంతువులకూ వైద్యం 12వ శతాబ్దంలో నాటి వైద్యుడు మేడవారి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించినందుకు పరహిత బిరుదు పొందినట్టు శాసనంలో ఉంది. ఉచిత వైద్యం అందించిన వారికి భూమిని కూడా అందించినట్టు శాసనంలో పేర్కొన్నారు. 800 ఏళ్ల కిందట చోళ రాజు వీర రాజేంద్ర–2 ప్రజల వైద్య అవసరాల కోసం 15 పడకల ప్రసూతి ఆసుపత్రిని నిర్మించి అందులో ఒక ఫిజీషియన్, ఒక సర్జన్, చాలినంత మంది సిబ్బందిని వినియోగించినట్టు తిరుమక్కదల్ శాసనం వెల్లడిస్తోంది. ఇక అశోకుడి కాలంలో మనుషులకే కాకుండా జంతువులకు కూడా వైద్యం చేయించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. -
నువ్వుల్ నవ్వుల్
ఇది హేమంత ఋతువు... ఆకలి, జీర్ణశక్తి ఎక్కువగా ఉండే ఋతువు... శరీరానికి జీర్ణశక్తి అధికంగా ఉన్నప్పుడు తక్కువ శక్తినిచ్చే పదార్థాలు సరిపోవు. అధిక జీర్ణశక్తికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. నూనెపదార్థాలు కలిగిన ఆహారం అందించాలి. అలాగని నూనె నేరుగా తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు... అధికంగా నూనె ఉండే నువ్వులను నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బావుంటుంది. పోషకాలు, ఖనిజాలు అధికంగా అందుతాయి. నువ్వులుంటే ఆనందాల పువ్వులు... ఆరోగ్యాల నవ్వులు... నువ్వుల అన్నం కావలసినవి: బియ్యం – అర కేజీ; నువ్వులు – 100 గ్రా.; జీడి పప్పులు – కొద్దిగా; కిస్మిస్ – కొద్దిగా; ఉల్లిపాయ – 1; వెల్లుల్లి – 2 రేకలు; పోపు కోసం: పచ్చి మిర్చి – 4; పచ్చి సెనగపప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 4; నెయ్యి – తగినంత; ఉప్పు – తగినంత. తయారి: ∙ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ∙బాణలిలో నూనె లేకుండా నువ్వులు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాక ఉల్లి తరుగు జత చేసి దోరగా వేయించాలి ∙ఒక పాత్రలో అన్నం వేసి పొడిపొడిగా చేయాలి ∙నువ్వుల పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్, వేయించిన పోపు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙టొమాటో పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది. నువ్వుల చపాతీ కావలసినవి: గోధుమ పిండి – కప్పు; క్రీమ్ – కప్పు; గోరువెచ్చటి పాలు – 4 టేబుల్ స్పూన్లు; తెల్ల నువ్వులు – టేబుల్ స్పూను (నూనె లేకుండా బాణలిలో వేయించాలి); నల్ల నువ్వులు – టేబుల్ స్పూను; నెయ్యి – టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారి: ∙ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి, క్రీమ్, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పాలు జత చేస్తూ, చపాతీ పిండిలా కలిపి అర గంటసేపు పక్కన ఉంచాలి. (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేయొచ్చు) ∙పిండిని ఉండలుగా చేసుకుని, నెయ్యి అద్దుతూ చపాతీలా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక ఒక్కో చపాతీని వేసి నేతితో కాల్చాలి ∙క్యాలీఫ్లవర్ కూరతో తింటే రుచిగా ఉంటాయి. నువ్వుల పులుసు కావలసినవి: నువ్వులు – 100 గ్రా. (బాణలిలో నూనె లేకుండా వేయించాలి); ఉల్లికాడలు – 2 (సన్నగా తరగాలి); చింతపండు – కొద్దిగా (నీళ్లలో నానబెట్టి, చిక్కగా పులుసు తీసి పక్కన ఉంచాలి); ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; బెల్లం పొడి – టేబుల్ స్పూను; బియ్యప్పిండి – టేబుల్ స్పూను; పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 5; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా తయారి: ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి ∙ఉల్లికాడలు జత చేసి కొద్దిగా వేయించాలి ∙చింతపండు పులుసు జత చేసి బాగా కలపాలి ∙రెండు గ్లాసుల నీరు, ఉప్పు, పసుపు, నువ్వుల పొడి వేసి ఉడికించాలి ∙బియ్యప్పిండిని చిన్న గ్లాసుడు నీళ్లలో ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న పులుసులో వేసి మరోమారు ఉడికించి దింపేయాలి ∙అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. నువ్వుల స్వీట్ చట్నీ కావలసినవి: నువ్వులు – 100 గ్రా.; చింతపండు – 100 గ్రా.; బెల్లం పొడి – 100 గ్రా.; ఉప్పు – తగినంత; పోపు కోసం: ఎండు మిర్చి – 20; పచ్చి సెనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారి: ∙ముందుగా బాణలిలో నూనె లేకుండా నువ్వులను దోరగా వేయించి తీసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించి తీసేసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙చింతపండుకు కొద్దిగా నీళ్లు జత చేసి ఉడికించి, చల్లారాక చేతితో మెత్తగా చేసి, గింజలు, ఈనెలు పక్కకు తీసేయాలి ∙ఒక పాత్రలో ఈ పదార్థాలన్నిటినీ వేసి బాగా కలిపాక, మిక్సీలో మరోమారు వేసి అన్నీ కలిసేవరకు మిక్సీ పట్టి తీసేయాలి ∙బాణలిలో నువ్వుల నూనె వేసి గోరు వెచ్చనయ్యాక ఇంగువ వేసి కొద్దిగా వేడి చేసి, దింపేసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి దోసెలు, ఇడ్లీలు, గారెలలో చాలా రుచిగా ఉంటుంది. సెసేమ్ క్రిస్ప్స్ కావలసినవి: కోడి గుడ్డు – 1 (తెల్లసొన మాత్రమే); పంచదార – 30 గ్రా.; మైదా పిండి – 30 గ్రా.; బటర్ – 20 గ్రా. (ఉప్పు లేని బటర్); నువ్వులు – 90 గ్రా. (దోరగా వేయించాలి); నెయ్యి – కొద్దిగా. తయారి: ∙ఒక పాత్రలో కోడిగుడ్డు తెల్ల సొన వేసి బాగా గిలకొట్టాలి ∙పంచదార జత చేసి, కరిగే వరకు మరోమారు గిలకొట్టాలి ∙కరిగించిన బటర్ జత చేయాలి జల్లించిన మైదా పిండి జత చేసి ఉండలు లేకుండా బాగా కలపాలి ∙వేయించిన నువ్వులు జత చేయాలి బేకింగ్ ట్రేకి నెయ్యి పూయాలి ∙కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని స్పూనుతో కొద్దికొద్దిగా దూరం దూరంగా పరచాలి ∙ఫోర్క్ సహాయంతో గుండ్రంగా వచ్చేలా సరిచేయాలి ∙170 డిగ్రీల దగ్గర వేడి చేసి ఉంచుకున్న అవెన్లో ఉంచి సుమారు 10 నిమిషాల తరవాత తీసేయాలి ∙మరో రెండు నిమిషాలు ఉందనగా సెసేమ్ క్రిస్ప్స్ను తిరగేయాలి ∙రెండు నిమిషాలయ్యాక బయటకు తీసేయాలి ∙కొద్దిగా చల్లారాక అందించాలి. నువ్వులలో ఔషధ గుణాలు... సూర్యుడు ధనుస్సు నుంచి మకరంలోకి ప్రవేశించే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ మాసంలో చలి వెనుకబడి నెమ్మదిగా వే పెరుగుతూ వస్తుంది. ఈ సమయంలో నువ్వులు తినడం ద్వారా వాతావరణంలో వచ్చే మార్పుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. మహారాష్ట్రలో ‘తిల్ గుడ్’ పేరుతో అందరూ ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకుంటారు. నువ్వులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ∙నువ్వుల ద్వారా లభించే క్యాల్షియమ్ పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిలో 20 శాతం ప్రోటీన్లు ఉన్నాయి. నువ్వుల్లో ఉండే ఫైటో స్టెరాల్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది. ∙నువ్వులు జీర్ణశక్తిని పెంచడంలోను, రక్తపోటును తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి. ∙నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు, అనేక ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. అవన్నీ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. ∙నువ్వులు ఎముకలను పటిష్టం చేయడం ద్వారా ఎముకలను గుల్లబరిచే ఆస్టియో పోరోసిస్ వ్యాధి రాకుండా కాపాడతాయి. కీళ్లను, రక్తనాళాలను శక్తివంతం చేసే లక్షణం నువ్వుల్లో ఎక్కువగా ఉంది. ∙కాలేయపు పనితనాన్ని మెరుగుపరుస్తాయి. -
మానవత్వం మరిచారు.. నిండు ప్రాణం తీశారు
భోగాపురం: అస్వస్థతతో ఉన్న వ్యక్తిని మార్గమధ్యంలో దించేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, గుండెనొప్పితో బాధపడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆలోచించిన ఆటో డ్రైవర్లు కలిసి ఒక నిండు ప్రాణం పోవడానికి కారకులయ్యారు. కళ్లముందే కన్నతండ్రి గుండెపట్టుకుని విలవిలలాడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ కుమారుడు పడిన వేదన వర్ణనాతీతం. చూసిన వారు అయ్యో పాపం అన్నారే తప్ప సాయం చేసేవారే కరువయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద బుధవారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పొన్నాడ అచ్యుత్ (50) ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన వారం రోజులుగా దగ్గుతో బాధపడుతున్నాడు. శ్రీకాకుళంలో వైద్యం చేయించినప్పటికీ తగ్గలేదు. దీంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేందుకు కుమారుడు విష్ణుతో బుధవారం ఆర్టీసీ బస్సు ఎక్కారు. భోగాపురం ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి అచ్యుత్ అస్వస్థతకు లోనయ్యాడు. ఛాతీ నొప్పి వస్తోందని కుమారుడికి చెప్పాడు. దీంతో విష్ణు వెంటనే ఆస్పత్రి ఏదైనా ఉంటే ఆపాలని కండక్టర్ను కోరాడు. అయితే చాకివలస కూడలి వద్దకు వచ్చేసరికి అచ్యుత్కు నొప్పి ఎక్కువ కావడంతో డ్రైవర్ బస్సు ఆపి దించేశాడు. ఛాతీ నొప్పితో విలవిలలాడుతున్న ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటోవాలాలు తిరస్కరించారు. తర్వాత ఒక ఆటో డ్రైవర్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ముందుకు వచ్చాడు. కొంచెం దూరం వెళ్లగానే తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఎస్బీఐ బ్రాంచ్ వద్ద దించేశాడు. అంతే కన్నకొడుకు చేతిలోనే ఆ తండ్రి చనిపోయాడు. సంఘటన స్థలానికి కూతవేటు దూరంలోనే ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. కిలోమీటరు దూరంలోనే సీహెచ్సీ ఉంది. బస్సు డ్రైవర్ బస్సును వెంటనే వెనక్కి తిప్పి సీహెచ్సీకి తీసుకెళ్లినా, ఆటో డ్రైవర్లు ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఒక నిండు ప్రాణాన్ని కాపాడేవారు. చుట్టూ ఎంతమంది ఉన్నా సాయం చేసేవారు లేకపోవడంతో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.