ఎంసెట్-2 పేపర్ లీకేజీని నిరసిస్తూ భారతీయ జనతా ముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాసేపు ఆర్టీసీ బస్టాండు మార్గంలో రాస్తారోకోకు దిగారు. దీంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. బీజేవైఎం కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే ఎంసెట్ పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఎంసెట్-2 పేపర్ లీకేజీని నిరసిస్తూ బీజేవైఎం ఆందోళన
Published Fri, Jul 29 2016 3:10 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
Advertisement
Advertisement