bjym
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం దాడి
సాక్షి, అమరావతి/భవానీపురం: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు రెచ్చిపోయారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై ఆదివారం దాడికి తెగబడ్డారు. రాళ్లు, రంగు డబ్బాలు విసురుతూ భయోత్పాతాన్ని సృష్టించారు. ఉన్మాదులను తలదన్నే రీతిలో వీరంగమాడారు. నిలువరించబోయిన పోలీసులు, భద్రతా సిబ్బందిపై సైతం దాడికి యత్నించి పోలీసు ఔట్ పోస్టు అద్దాలను ధ్వంసం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి విదితమే. తాము కూడా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తామని.. తమకంటూ సిద్ధాంతాలు లేవనే రీతిలో బీజేవైఎం కార్యకర్తలు ఉదయం 11.30 గంటల సమయంలో వైఎస్సార్సీపీకి ప్రధాన కార్యాలయంపైకి దాడికి సాహసించారు.చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవాలను గ్రహించకుండా గుంపు కట్టి నినాదాలు చేస్తూ రాళ్లు విసిరారు. అంతటితో ఆగకుండా పార్టీ కార్యాలయ గోడలు, తలుపులపై రంగు ప్యాకెట్లు చల్లారు. మూసివున్న గేట్లు ఎక్కి లోపలకు దూకేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రధాన గేటు ముందు కూర్చుని పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగు ప్యాకెట్లను పార్టీ కార్యాలయం లోపలకు విసరగా అవి లోపల వైపున ఉన్న సెక్యూరిటీ గదికి సమీపంలో పడ్డాయి.సుమారు 20 మందికిపైగా యువమోర్చా కార్యకర్తలు దాడికి యత్నించడంతో పాటు కార్యాలయం దగ్గర వైఎస్సార్సీపీ ఫ్లెక్సీని చించి తగులపెట్టారు. దీంతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం తాపీగా వచ్చిన పోలీసులు ఆందోళనకారుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.టీడీపీ దారిలోనే బీజేవైఎంగడచిన వంద రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరి స్థాయిలో వారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుండటంతో బీజేవైఎం కూడా అదే దారిపట్టింది. ఈ దాడులు చూస్తేంటే ఏపీలో ఉన్నామా? బీహార్లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పోలీసులకు ఫిర్యాదువైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన దాడిపై తాడేపల్లి పోలీసులకు వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బీజేవైఎం కార్యకర్తలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఈశ్వర్, ఆర్ఎస్ఐ వీరేష్, కానిస్టేబుల్ రవీంద్రరెడ్డి, డి.ఖాజాలను దుర్భాషలాడుతూ పార్టీ కార్యాలయంలోకి చొరబడేందుకు విశ్వప్రయత్నం చేసినట్టు తెలిపారు.బీజేవైఎం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు పాల్పడిన బీజేవైఎం కార్యకర్తల ఉన్మాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నేతలు మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, దేవినేని అవినాశ్, పోతిన మహేష్తో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తల దాడిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని కోరారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఇళ్లపై దాడులు చేసేస్థాయి నుంచి పార్టీ కార్యాలయంపై దాడులు చేసే స్థాయికి రాష్ట్రంలో పరిస్థితి దిగజారిందన్నారు. చంద్రబాబు డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక భావం ఉందని, అందుకే దళితులను ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారన్నారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేయడం ప్రపంచమంతా చూసిందని, దీనిని పవన్ ఖండించకపోగా ప్రాయశ్చిత దీక్ష చేస్తుండటం సిగ్గుచేటన్నారు. కాగా, బీజేపీ ముసుగులో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయటం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాడి సరికాదు: సీపీఎంతిరుమల లడ్డూ సమస్యను ఆసరాగా చేసుకుని బీజేపీ అనుబంధ బీజేవైఎం కార్యకర్తలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగాఖండించింది. ఈ మేరకు పార్టీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘ్ పరివార్ శక్తులు ఒక పథకం ప్రకారం తిరుపతి లడ్డూ సమస్యను ఆసరాగా చేసుకుని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. -
పార్టీ కార్యాలయంపై దాడికి యత్నం.. పోలీసులకు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: బీజేవైఎం కార్యకర్తల దాడికి యత్నం ఘటనపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు.ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ గ్రీవెన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంకంరెడ్డి నాగ నారాయణ మూర్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాడి ఘటనకు సంబంధించిన ఆధారాల్ని పోలీసులకు అందించారు. కాగా, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడులకు యత్నించారు. రాళ్లు, రంగు డబ్బాలు విసిరిన బీజేవైఎం కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులపై దాడికి యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది గదిని బీజేవైఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు.చదవండి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం -
జార్ఖండ్ సీఎం నివాసాన్ని ముట్టడించిన BJYM నేతలు
-
TGPSC వద్ద హైటెన్షన్
-
ఎక్కడికక్కడే అరెస్టులు.. టీజీపీఎస్సీ వద్ద హైటెన్షన్
హైదరాబాద్, సాక్షి: నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో నగరంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు డిమాండ్ల సాధనతో ఆందోళనకు దిగిన జేఏసీ కార్యకర్తలు.. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే అప్పటికే నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్ చేశారు. బీజేవైఎం, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర శివారుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు.. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. -
బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
-
BJP: కాఫీ విత్ యూత్
సాక్షి, న్యూఢిల్లీ: యువ ఓటర్లను ఆకర్షించేందుకు ‘చాయ్ పే చర్చ’ను కాస్తా ‘కాఫీ విత్ యూత్’గా మార్చింది బీజేపీ. వీలైతే కప్పు కాఫీ అంటూ పార్టీ యువ మోర్చా నేతలు కొత్త ఓటర్లను అడుగుతున్నారు. ముంబైలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో వీటిని దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. యువ ఓటర్ల నాడి తెలుసుకుని, వారిని బీజేపీ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి... ముంబైలో ఇటీవల పలుచోట్ల దాదాపు 300 మంది యువ ఓటర్లతో బీజేపీ యువ మోర్చా నేతలు ‘కాఫీ పే చర్చ’ నిర్వహించారు. పదేళ్ల్లలో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని వారికి వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఈ చర్చలను విస్తరిస్తున్నారు. ప్రతి భేటీలో కనీసం 150 నుంచి 200 మంది యువ ఓటర్లుండేలా ప్లాన్ చేస్తున్నారు. ‘కాఫీ పే చర్చ’లో బూత్ స్థాయి కార్యకర్త మొదలు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని దాకా పాల్గొంటారు. ప్రతి కార్యకర్త తమ పరిధిలోని కనీసం 10 మంది కొత్త, యువ ఓటర్లను ఈ చర్చకు తీసుకొస్తున్నారు. రెస్టారెంట్లు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వినూత్నంగా దీన్ని నిర్వహిస్తున్నారు. మోదీ పేర్కొన్న ‘విజన్ 2047’ లక్ష్యంతో చర్చ సాగుతోంది. ‘రాబోయే ఐదేళ్లలో దేశంలో యువత పాత్ర ఎలా ఉండాలి? ప్రభుత్వం ఏం చేస్తే యువతకు దగ్గరవుతుంది? అన్ని రంగాల్లోనూ ప్రపంచంలో భారత్ అగ్ర స్థానానికి చేరాలంటే ఏం చేయాలి? అవినీతి నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, పేదరికం లేని ఇళ్లు’ తదితర అంశాలపై రెండు నుంచి మూడు గంటల పాటు కార్యక్రమం జరుగుతోంది. యువ ఓటర్ల సలహాలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు. -
బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని ఎంపీ ఫైర్..
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ యూత్ వింగ్ నాయకుడు ప్రవీణ్ కమ్మార్ దారుణ హత్యకు గురయ్యాడు. ధార్వాడ్ జిల్లా కొట్టూరు గ్రామ పంచాయితీలో మంగళవారం రాత్రి ఓ ఆలయం వద్ద ఊరేగింపు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో ఆపేందుకు ప్రయత్నించిన ప్రవీణ్ను ప్రత్యర్థి వర్గం కత్తితో పొడిచింది. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రవీణ్ వర్గంతో గొడవపడిన వర్గం తాగినమత్తులో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. కాగా.. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేసజ్వీ సూర్య ఆరోపించారు. ప్రత్యర్థి వర్గం కుట్రపన్నే ఈ దారుణ హత్యకు ఒడిగట్టారని మండిపడ్డారు. పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఊరేగింపు సమయంలో జరిగిన గొడవే హత్యకు దారీతీసిందని చెప్పారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: బార్బడోస్లో గుండెపోటుతో ఖమ్మం విద్యార్థి మృతి.. శోకసంద్రంలో ఎస్సై కుటుంబం -
బీజేపీ నేత దారుణ హత్య.. అక్కడి నుంచే ప్లాన్ జరిగింది!
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లాలో సంఘ పరివార్, బీజేపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ నెట్టార్ హత్య కేసులో మహమ్మద్ షఫిక్, జాకీర్ అనే ఇద్దరు నిందితులను మంగళూరు పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు. అనుమానంతో మరో 21 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో 7 మంది ఎస్డీపీఐకి చెందిన కార్యకర్తలున్నారు. హత్య కేసును ఏడీజీపి అలోక్కుమార్, పశ్చిమ విభాగం ఐజీ దేబజ్యోతి, ఎస్పీ రుషికేశ్ సోనావణెతో పాటు సీనియర్ అధికారులు గురువారం సమీక్షించారు. సీఐడీ ఎస్పీ అనుచేత్, హాసన్ ఎస్పీ హరిరామ్ శంకర్లను మంగళూరుకు పిలిపించి సమాచారం తీసుకున్నట్లు అలోక్కుమార్ విలేకరులకు తెలిపారు. హత్య జరిగిన సుళ్య దగ్గరి బెళ్లారెలో 144 సెక్షన్ కొనసాగుతోంది. దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితి ఉండగా, పలుచోట్ల పోలీసు కవాతులు జరిగాయి. హతుని తల్లిదండ్రులు శేఖర పూజారి, రత్నావతి, భార్య నూతన్లను అలోక్కుమార్ కలిసి పలు వివరాలను సేకరించారు. ప్రతీకార హత్యగా అనుమానం బెళ్లారెలోని ఎస్డీపిఐ కార్యకర్తలను పోలీసులు విచారిస్తున్నారు. వారంతా అమాయకులని ఎస్డీపీఐ పేర్కొంది. కాగా ప్రధాన నిందితుడు బెళ్లారె బూడు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు. ప్రవీణ్ హత్యకు కేరళలో కుట్ర జరిగిందని, ఇటీవల బెళ్లారెలో కేరళ యువకుని హత్యకు ప్రతీకారంగా ప్రవీణ్ను హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన బైకు కేరళ రిజిస్ట్రేషన్దని తెలిసింది. నా కొడుకు ఈ హత్య చేయలేదు. హత్య చేసినవారికి శిక్ష పడాలని నిందితుడు షఫీక్ తండ్రి చెప్పాడు. 50 మంది కార్యకర్తలు సుళ్యలో ఒక వర్గానికి చెందిన షాపులపై దాడి చేశారు. వస్తువులను చెల్లాచెదరు చేశారు. శుక్రవారం రాత్రి వరకు సుళ్య, పుత్తూరు, కడబ, బంటా్వళలో మద్యం అమ్మకాలను కలెక్టర్ బంద్ చేయించారు. కేరళ డీజీపీతో మాట్లాడాము.. నిందితులు వినియోగించిన మొబైల్ నంబర్లను ట్రాక్ చేసి ఆచూకిని పసిగట్టినట్లు డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. హత్య తరువాత నిందితులు కేరళకు పరారయ్యారు. వారిని అరెస్ట్ చేయడానికి కేరళ డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు. ఎన్ఐఎకి అప్పగించాలి: ప్రవీణ్ భార్య ఈ హత్య కేసు విచారణను ఎన్ఐఎకి అప్పగించాలని హతుని భార్య నూతన డిమాండ్ చేశారు. నా భర్త ఎవరికీ అన్యాయం చేయలేదు, సమాజం కోసం శ్రమిస్తున్నారు. మా కుటుంబానికీ ప్రవీణ్ ఒక్కరే దిక్కు. ఆయనను పొట్టన పెట్టుకున్నారు. హత్య కేసును ఎన్ఐఎతో దర్యాప్తు చేయించాలి, అప్పుడే న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. పార్టీ నుంచి 25 లక్షల పరిహారం, ఇల్లు.. ప్రవీణ్ కుటుంబానికి పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు రూ.25 లక్షల పరిహారం ఇస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి అశ్వర్థనారాయణ తెలిపారు. బెంగళూరులో మాట్లాడుతూ ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. హత్యకు నిరసనగా దక్షిణ కన్నడ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది యువ మోర్చా పదాధికారులు రాజీనామాలు ప్రకటించారు. సీఎం బొమ్మై పరామర్శ హత్యకు గురైన ప్రవీణ్ నెట్టారు ఇంటికి గురువారం సాయంత్రం సీఎం బసవరాజు బొమ్మై చేరుకున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. సీఎం సహాయనిధి నుంచి రూ. 25 లక్షల చెక్ను వారికి అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రవీణ్ హత్య అత్యంత హేయమని, ఇదొక ముందస్తు ప్రణాళికలో జరిగిన హత్య అని చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లాలో గత పదేళ్లలో అసాంఘిక శక్తుల అకృత్యాలు పెచ్చుమీరాయని తెలిపారు. కేరళ నుంచి కూడా ఈ విధమైన అకృత్యాలకు ప్రోత్సాహం అందుతోందన్నారు. హత్య కేసులో ఇప్పుడే దర్యాప్తు ప్రారంభమైందని, అతి త్వరగా నిందితులందరిని అరెస్టు చేస్తామన్నారు. ఈ కేసును ఎన్ఐఏ విచారణకు ఇచ్చే యోచన ఉన్నట్లు తెలిపారు. ప్రవీణ్ అంత్యక్రియల సందర్భంగా లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఇదే సమయంలో పక్కనే ఉన్న ప్రజలు సీఎంను కోరారు. దొడ్డబళ్లాపురం: బీజేపీ, సీఎం బసవరాజ బొమ్మై ఎంతో భారీఎత్తున జరుపతలపెట్టిన బల ప్రదర్శన సభ... జనోత్సవ రద్దయింది. బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకు గురికావడమే రద్దుకు కారణం. దొడ్డబళ్లాపురంలో గురువారంనాడు అంగరంగ వైభవంగా జనోత్సవ సభను నిర్వహించాలని సుమారు నెల నుంచి ఏర్పాట్లు చేశారు. రద్దు వల్ల కొన్ని కోట్ల రూపాయలు వ్యర్థమయ్యాయి. లక్ష మంది కోసం వేసిన భారీ కటౌట్లు, సెట్టింగులు, బ్యానర్లు, బంటింగ్స్ తొలగించారు. నేతలు, కార్యకర్తల తరలింపు కోసం బస్సులు, వీఐపీల కోసం అద్దెకు తీసుకున్న వాహనాలు అన్నీ రద్దయ్యాయి. సమావేశం స్థలి వద్ద భారీ వంటశాలలో సుమారు వందమంది చేయితిరిగిన వంట మనుషులు 25 వేలమందికి ఉదయం ఉపాహారంగా పలావ్, పులిహోర వండారు. మధ్యాహ్నం లక్ష మంది కార్యకర్తల కోసం భోజనం తయారీకి బియ్యం, పప్పులు, ధాన్యాలు, కూరగాయలు స్వీట్లు సిద్ధం చేశారు. తీరా సభ లేదనగానే స్థానిక బీజేపీ నేతలు షాక్కు గురయ్యారు. తరువాత తేరుకుని వండిన ఆహారం వృథా కాకూడదని తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు పంపించారు. రెండు టన్నుల కూరగాయలను ఘాటిలోని గోశాలకు తరలించారు. చాలా ఆలస్యంగా సభ రద్దు నిర్ణయం తీసుకొన్నారని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సైదాబాద్లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్: సైదాబాద్లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తున్నారు. -
మంత్రి సబితా కాన్వాయ్ ను అడ్డుకున్న BJYM కార్యకర్తలు
-
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం యత్నం
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్పీఎస్సీ) కార్యాలయం ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు యత్నించారు. పెద్ద ఎత్తున బీజేవైఎం కార్యకర్తలు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు రంగంలోకి దిగి పలువురు బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకొని అరెస్ట్ చేశారు. తెలంగాణ వెంటనే ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా బీజేవైఎం అధ్యక్షుడు భాను ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, రోజురోజుకు నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ కోసం కమిటీ వేసిన ప్రభుత్వం నోటిఫికేషన్లు ఎందుకు విడుదల చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అన్ని జిల్లా కలెక్టర్ల ముందు నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. చదవండి: వ్యూహాత్మక అడుగులు: వ్యతిరేకులు, సీనియర్లతో భేటీ -
కోల్కతాలో యుద్ధ వాతావరణం
కోల్కతా/హౌరా: బీజేపీ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం సందర్భంగా గురువారం కోల్కతా, హౌరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలకు నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణలకు దిగారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దాంతో, పోలీసులు వారిపై వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్ను ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. ఘర్షణల్లో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో కోల్కతా, హౌరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రోడ్లపై ఎక్కడ చూసినా.. కాల్చిన టైర్లు, రువ్విన రాళ్లు కనిపించాయి. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా, వేలాది కార్యకర్తలు మధ్నాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సచివాలయం వైపునకు వెళ్లడం ప్రారంభించారు. హౌరా మైదాన్ నుంచి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ మార్చ్ ప్రారంభించారు. వారిని మాలిక్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఒక కార్యకర్త నుంచి బుల్లెట్లతో ఉన్న పిస్టల్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు తమపై నాటు బాంబులు వేశారని పోలీసులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు నేతృత్వంలో సాగిన మార్చ్ను సాంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడా ఘర్షణ జరిగింది. పోలీసులతో ఘర్షణల్లో బీజేపీ నేత రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో గాయపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్వర్ఘీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ల నేతృత్వంలో సాగిన చలో సెక్రటేరియట్ మార్చ్ను కోల్కతాలోని హాస్టింగ్స్–ఖిద్దర్పోర్ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీఎంసీ గూండాలు తమపై దాడి చేశారని విజయ్వర్ఘీయ ఆరోపించారు. దాదాపు వంద మందికి పైగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం తలపెట్టిన మార్చ్కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమత సర్కారును సాగనంపాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. మమత బెనర్జీ అవినీతిమయ, హింసాత్మక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తారన్నారు. మమత పాలనకు బీజేపీ అంతం పలకడం ఖాయమన్నారు. ‘మమత తన సచివాలయాన్ని మూసివేసుకునేలా ధీరులైన మా బీజేవైఎం కార్యకర్తలు పోరాడారు. ఆమె ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారనేందుకు ఇదే ఉదాహరణ’ అని నడ్డా ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే విషయంలో మాత్రం గత వామపక్ష ప్రభుత్వం కన్నా మమత సర్కారు మెరుగ్గా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లాఠీచార్జీలో గాయపడి, రోడ్డుపైనే పడిపోయిన ఓ కార్యకర్త -
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : సంచిత
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీమంత్రి అశోక గజపతిరాజు సోదరుడి కుమార్తె, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలు సంచిత హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆమె అన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంచిత గజపతిరాజు.. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వెనుకబడిన కర్నూల్లో హైకోర్టు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని పేర్కొన్నారు. రాజధాని పేరుతో రైతుల వద్ద చంద్రబాబు నాయుడు బలవంతంగా లాకున్న భూమిని తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు ముందే ఎందుకు పారిపోయి వచ్చారని ఆమె ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ రాజధానిపై పూర్తి నివేదిక ఇవ్వకుండానే అమరావతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధపడిందని సంచిత ఆరోపించారు. అమరావతి అనేది చట్టవిరుద్ధం నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీని ప్రజలు ఎప్పడో తిరస్కరించారని, రాజధానిపై మాట్లాడే కనీస హక్కు చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు లేదని అన్నారు. అలాగే అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను సంచిత ప్రశంసించారు. రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పడూ సహకారంగా ఉంటారని, దీనిలో రాజకీయం చేసే దురాలోచన ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. కాగా రెండేళ్ల క్రితమే ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలోని అక్రమ కట్టడాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరకట్టపై ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు చేరువులు, దేవాలయాల భూములు కబ్జా చేశారని రమేష్ నాయుడు ఆరోపించారు. వీటిన్నంటిని కూడా కూల్చివేయాలని.. అలా చేస్తే జగన్కు పుష్పాభిషేకం చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇలా ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కూల్చివేయాలని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. విభజనలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందన్నారు రమేష్ నాయుడు. ఏపీ విషయంలో కేసీఆర్ కొంత పట్టువిడుపులు ప్రదర్శించాలని కోరారు. రాయల సీమ కరువుతో అల్లాడుతోందన్నారు. నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు వర్తింప జేయాలని.. ప్రైవేట్ స్కూల్లకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. -
కరవుపై తక్షణమే చర్యలు తీసుకోండి: బీజేపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుపై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీజేపీ యువ మోర్చా ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. ప్రతీ ఏటా కరవు బారిన పడుతున్న రాయలసీమను శాశ్వతంగా ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గాలపై చర్చ జరగాల్సి ఉందని, గ్రామాలలో కనీసం తాగడానికి మంచి నీరు కూడా దొరకడం లేదని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల మేత దొరకని పరిస్థితి ఏర్పడిందని, పశువులను కబేళాలకు తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వలసలు వెళ్తున్న రైతాంగాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకోవాలని కోరారు. వేరుశెనగ, జొన్న, సజ్జలు, రాగి, మొక్కజొన్న పంటలు పండించే రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ కల్పించాలని కోరారు. గతంలో మీరు అట్టహాసంగా ప్రారంభించిన రెయిన్ గన్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని మరోసారి హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. -
నాడు వాజ్పేయ్.. నేడు మోడీ
రామగిరి: నరేంద్రమోదీ పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని, నాడు వాజ్పేయ్, నేడు మోడీ పాకిస్తాన్ కుట్రలను తిప్పికొట్టి భారత్ సత్తాను ప్రపంచ దేశాలకు చూపించారని బీజేపీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి రేండ్ల సనత్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని కల్వచర్లలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన శక్తి కేంద్రాల ఇన్చార్జిలు, పైస్థాయి నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి 42మంది జవానులు హతమార్చడంతో ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేసి 300 మందికిపైగా తీవ్రవాదులను మట్టుబెట్టడంలో భారత్ విజయం సాధించడం, అభినందన్ విడుదలలో మోడీ కీలక భూమి పోషించారని వివరించారు. రానున్న పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో తర్డ్ ఫ్రంట్, పోర్ట్ ప్రంట్ అంటూ కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నాయని ఆరోపించారు. బీజేపీలో పూర్తి స్థాయిలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, రానున్న కొద్ది రోజుల్లోనే నియోజకవర్గానికి సంబధించిన అన్ని కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన వివరించారు. ముందుగా ఆయన ఇంటిపైన బీజేపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ విస్తారక్ మహేష్, జిల్లా కార్యదర్శి మహావాది రామన్న, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల శశి, నియోజకవర్గ కో కన్వీనర్ తూండ్ల క్రాంతి కుమార్, రామగిరి ఇన్చార్జి బత్తిని నర్సయ్య, మహదేవ్పూర్, కాటారం మండలాల అధ్యక్షులు ఆకుల శ్రీదర్, భాస్కర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు మారెపల్లి శ్రీనివాస్, నాయకులు బండి రంజిత్ కుమార్, మల్లారపు అరుణ్కుమార్, జంగెపల్లి అజయ్ పాల్గొన్నారు. -
‘తెలంగాణ బిడ్డను.. ఆంధ్రా కోడలిని’
హైదరాబాద్: నరేంద్ర మోదీ వంటి ప్రధాని దొరకడం మన అదృష్టమని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ‘విజయ లక్ష్యం 2019 యువ మహాధివేశన్’ పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి నిన్న(శనివారం) కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనమ్ మహాజన్ మాట్లాడుతూ.. పతంగి పట్టుకుని కారు నడుపుతున్న వారి మధ్యలోకి అమిత్ షా లాంటి సింహం రావడంతో భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ బిడ్డను, ఆంధ్రా కోడలినని తెలిపారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా 2019లో మోదీ విజయం సంపూర్ణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో కూడా ప్రసంగించారు. పప్పూ వెంట కొంత మంది మూర్ఖులు ఉన్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. ప్రతీ పోలింగ్ బూత్లో కమలం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 2019లో విజయ లక్ష్యమే మన సంకల్పమని, ఈ సమ్మేళనం ఉద్దేశ్యం కూడా అదేనన్నారు. డిసెంబర్ 11న తెలంగాణలో కమలోదయం జరగనుందని జోస్యం చెప్పారు. -
బీజేవైఎం జాతీయ సమ్మేళనం
-
‘భగత్సింగ్ కలలుగన్న సుపరిపాలన అందిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహిస్తోన్న జాతీయ యువ సమ్మేళనాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... యువ శక్తి ఎక్కువగా ఉన్న ఏకైక దేశం కేవలం భారత్ మాత్రమేనని అన్నారు. దేశాభివృద్ధి లో యువతను భాగస్వామి చేసి మోదీ సర్కారు.. భగత్ సింగ్ కలలు కన్న సుపరిపాలనను అందిస్తోందన్నారు. విశ్వంలో దేశం పేరు నిలబెట్టిన స్వామి వివేకానంద కూడా యువకుడేనని.. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ పూర్తి మెజార్టీ పొందిన బీజేపీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీ అన్ని వర్గాలకు సమన్యాయం అందించేందుకు కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని రాజ్నాథ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి జాతి హితం కన్నా రాజకీయ హితమే ముఖ్యమని అందుకే ప్రజలకు మంచి జరుగుతుంటే వారు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. మోదీని, బీజేపీని ఓడించడమే తప్ప విపక్షాలకు దేశ అభివృద్ధి ఎజెండా లేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్తో జట్టుకట్టే పార్టీ లు తర్వాత.. మీటూ.. ఉద్యమం చేయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. 2019లో భారత్ విశ్వగురువుగా అవతరించాలంటే.. 350 సీట్లు గెలిచేంత వరకు కార్యకర్తలు నిద్ర పోవద్దని పిలుపునిచ్చారు. కాగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ పూనమ్ మహాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ‘విజయ్లక్ష్య 2019 యువ మహా ఆదివిశేషణ్’ పేరుతో ఈ సమ్మేళనం రెండు రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సమ్మేళనం హైదరాబాద్లో నిర్వహిస్తుండటంతో రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో సమ్మేళనం నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపవచ్చని, ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షించవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రేపు(ఆదివారం) జరుగునున్న యువభేరీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. -
భవిష్యత్తు కార్యాచరణపై బీజేవైఎం మహాసమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేసేందుకు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తొలిసారి హైదరాబాద్లో జాతీయ యువ సమ్మేళనం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ‘విజయ్లక్ష్య 2019 యువ మహా ఆదివిశేషణ్’ పేరుతో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఈ సమ్మేళనాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రారంభించనున్నారు. మూడేళ్లకోసారి నిర్వహించే ఈ సదస్సులో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, నైపుణ్య కల్పనకు ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, యువతకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించనున్నారు. తొలిరోజైన శనివారం ఉదయం 10 గంటలకు మొదలయ్యే సమావేశాల్లో రాజ్నాథ్తోపాటు అస్సాం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్దేవ్, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్, పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు ప్రసంగించనున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సభలను హైదరాబాద్లో నిర్వహిస్తుండటంతో ఈ సమావేశాలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమ్మేళనంలో పార్టీ రాజకీయ వ్యూహాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సమ్మేళనం నిర్వహణకు చర్యలు చేపట్టారు. సమ్మేళనాన్ని తెలంగాణలో నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపవచ్చని, ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 50 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇక రెండో రోజైన ఆదివారం ముగింపు కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తదితరులు ప్రసంగించనున్నారు. అలాగే రెండో రోజు మధ్యాహ్నం భారీగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లోనే నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ సభకు దాదాపు 2 లక్షల మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. యువతకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాలు: లక్ష్మణ్ రానున్న పార్లమెంటు ఎన్నికలకు యువత ను సమాయత్తం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. యువతను మేల్కొలిపేలా, వారికి స్ఫూర్తినిచ్చేలా 2రోజుల కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, బీజేవైఎం నాయకులతో కలసి లక్ష్మణ్ శుక్ర వారం బీజేవైఎం సమ్మేళనం ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, ప్రజాకర్షక పథకాలను దేశవ్యాప్తంగా విస్తృతపరిచేలా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ దేశ యువత మోదీ నాయకత్వా న్ని నమ్ముతోందని, మోదీ అభివృద్ధిని, మార్గానిర్దేశకత్వం గురించి ఈ సభల్లో యువతకు వివరిస్తామని చెప్పారు. బీజేవైఎం సమావేశాలు నిర్వహించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. 2014లో మోదీ నిజాం కళాశాల నుంచి ఎన్నికల శంఖారావం పూరించారని, 2019 పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడినుంచే విజయభేరిని మోగించి విజయం అందుకుంటామని అన్నారు. -
బీజేవైఎం యువ సమ్మేళనానికి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి యువ సమ్మేళనానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి 28 వరకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ హైదరాబాద్లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 26న అన్ని రాష్ట్రాల నుంచి బీజేవైఎం మండల బాధ్యులు, జిల్లా, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు దాదాపు 2 లక్షల మంది రానున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్గౌడ్, జాతీయ కార్యదర్శి బద్దం మహిపాల్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు వెల్లడించారు. ఈ సభ రాబోయే ఎన్నికలకు యుద్ధభేరి మోగిస్తుందని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. సమ్మేళనంలో భాగంగా మొదటి రోజు ప్రతినిధుల రాక, రిజిస్ట్రేషన్ల కార్యక్రమం కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి సభ్యుడికి క్యూఆర్ కోడ్ కలిగిన కార్డు ఇస్తారు. బార్ కోడ్ రీడ్ చేయగానే ఆయా అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలు, ఎక్కడ ఏయే సమావేశం ఉంటుందనే వివరాలు, బస ఏర్పాట్ల వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేలా ఏర్పాటు చేశారు. 27వ తేదీ ఉదయం ప్రారంభమయ్యే ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 28న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో 10 మంది కేంద్ర మంత్రులు, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ప్రధానంగా నితిన్ గడ్కారీ, ఉమాభారతి, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, రాజ్ప్రతాప్ రూఢీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొననున్నారు. -
శ్వేత పత్రం కాదు..నల్ల పత్రం
విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఏపీ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..మంత్రి గంటా విడుదల చేసిన శ్వేత ప్రతం అంతా తప్పుల తడక అని విమర్శించారు. అది శ్వేత పత్రం కాదు..నల్ల పత్రం అని దుయ్యబట్టారు. అందులో ఉన్నదంతా బూతేనని మండిపడ్డారు. పెట్రోలియం విశ్వవిద్యాలం కోసం సబ్బవరం భూవివాదాన్ని పరిష్కరించలేని చేతగాని మంత్రి గంటా శ్రీనివాసరావని ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాసంస్థలపై మాట్లాడే హక్కు గంటాకు లేదన్నారు. ఐఐఎంకు సంబంధించి ప్రారంభోత్సవంలో హడావుడిగా బోర్డు తగిలించి ప్రభుత్వానికి చూపించేశారని విమర్శించారు. అక్కడ కరెంటు, వాటర్ ఇవ్వకుండా నిర్మాణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరు నెలల్లో 33 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు..అందులో 70 శాతం గంటా వియ్యంకుడు పి. నారాయణకు చెందిన నారాయణ కాలేజీల్లోనే జరిగాయని..దీనికి సంబంధించి ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. కేంద్ర విద్యాసంస్థలపై విడుదల చేసిన శ్వేతపత్రం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. -
నిరుద్యోగభృతి కాదు..ఎన్నికల భృతే !
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబ్ వస్తుందని, రుణమాఫీ చేస్తానని ప్రచారం చేశారు..అధికారంలోకి వచ్చాక మాట తప్పారని బీజేవైఎం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయుడు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు వచ్చే అక్టోబర్ నుంచి ఇచ్చేది నిరుద్యోగ భృతి కాదని, ఎన్నికల భృతి మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు నిరుద్యోగులకు చేసిన మోసాన్ని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తామని వివరించారు. ఇంటికొక ఉద్యోగ హామీ ఊసే లేదు..రాష్ట్రంలో 2 లక్షల 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. బాబు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. లోకేష్కు తప్ప రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 10 లక్షల మందికే నిరుద్యోగ భృతి అంటూ షరతులు విధించారని మండిపడ్డారు. -
అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తాం
కామేపల్లి : అర్హులైన లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించే ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ పొయ్యిలు అందిస్తామని, నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పని చేస్తుందని బీజేపీ అనుబంధ సంఘం బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రేష్మా రాథోడ్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్ప్రతాప్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కామేపల్లిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద మంజూరైన గ్యాస్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెల్లరేషన్ కలిగి గ్యాస్ కనెక్షన్ లేని లబ్ధిదారులందరికీ కేంద్రప్రభుత్వం ఉచితంగా గ్యాస్ అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని, కేంద్ర ఇచ్చే నిధులతో సోకులుపడుతుందన్నారు. ప్రజా సమస్యలను విస్మరించదని, మాటలతో ప్రభుత్వాన్ని కేసీఆర్ నడిపిస్తున్నారని, కేసీఆర్ మాటల గారడీకి వచ్చే ఎన్నికల్లో తాళం పడకతప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు భూక్యా శ్రీనివాస్ నాయక్, బీజీపీ మండల అధ్యక్షుడు పోలూరి రాంచంద్రయ్య, నాయకులు హతిరాం నాయక్, జె.నర్సింగ్, భద్రయ్య, కె.వీరయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అమిత్ షా లేఖ.. అవమానం ఎలా అవుతుంది?
సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో అమిత్షా లేఖ రాస్తే అది అవమానమేలా అవుతుందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీతోపాటు వామపక్ష పార్టీలపై మండిపడ్డారు. ‘అమిత్ షా.. సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తే టీడీపీ నేతలు దాన్నేదో తప్పులా చూస్తున్నారు. ఏపీ అసెంబ్లీ పూర్తిగా తెలుగు దేశం కార్యకర్తల సమన్వయ సమావేశంగా మారింది. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా.. పార్టీ వ్యవహారాలను.. అమిత్ షా లేఖ గుర్చించి ఎలా చర్చిస్తారు?.బీజేపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు మాట్లాడకుండా టీడీపీ ఏం మాట్లాడుతుంది? కుర్చీలు వేస్తే మేము కూడా మాట్లాడుతాం. అమరావతిలో అన్ని కార్యాలయాలు కట్టినప్పుడు రాజధాని పూర్తయినట్లే కదా. మరి అలాంటప్పుడు అనవసరమైన ప్రకటనలు ఎందుకు?. సెంటిమెంట్.. అయింట్మెంట్.. అంటూ పాలన సాగిస్తున్నారు. నిధుల్లో ఒక్క రూపాయి లెక్క చూపలేదు. ఏపీకి ఇప్పటిదాకా ఇచ్చిన నిధులు వెనక పడిన ప్రాంతాలకు ఇచ్చినవి కాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లటం ఖాయం’ అని విష్ణువర్ధన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఆధారాలుంటే మీడియాకు ఇవ్వండి’ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. ఆయన తనయుడు జైషాలపై అవినీతి ఆరోపణలు చేస్తూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అమిత్ షా అవినీతికి పాల్పడినట్లు మీ దగ్గర ఆధారాలు ఉంటే జాతీయ మీడియాకు ఇవొచ్చు కదా అని చంద్రబాబుకు ఆయన సూచించారు. ‘ఈ దేశంలో 11 మంది ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ చేసినంత మాత్రాన వారు అవినీతి పరులు అయిపోరు. నిరూపణ కావాలి. మీ పార్టీ కి చెందిన వ్యక్తి స్టాంపుల కుంభకోణం కేసులో దోషిగా తేలిన వ్యక్తి.. ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. అది తెలుసు కదా!’ అని చంద్రబాబుకు చురకలు అంటించారు. ‘పవన్.. గౌరవం పొగొట్టుకోకండి’ వామపక్ష పార్టీలతో కలిసి పని చేస్తే ఏపీలో ఉన్న అంతో.. ఇంతో గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్కు విష్ణువర్ధన్ సూచించారు. ఎమ్మెల్యేగా పని చేసిన రామకృష్ణ లాంటి వ్యక్తి ప్రధాని మోదీపై వ్యక్తిగత దూషణలు చేయడం సరైందేనా? పవన్ చెప్పాలన్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు టెంట్ల కింద పార్టీలని.. ఓట్లు సీట్లు రావని విష్ణువర్దన్ ఎద్దేవా చేశారు. -
ఆ డబ్బు ఏంచేశారు పవన్..?
సాక్షి, విజయవాడ: దక్షిణాదిలో బిజెపి ఎదుగుదలను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని, దీనిలో మిత్రపక్షంగా వున్న టీడీపీ భాగస్వామ్యం కావడం బాధాకరమని బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు ఎన్. రమేష్ నాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కియా మోటార్స్ ఏర్పాటైన ప్రాంతంలో రైతుల భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్కు రాయలసీమ ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. ‘కర్ణాటక, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారు అధికంగా వున్న చోట్ల తమ పార్టీ నష్టపరిచేందుకు కుట్ర జరుగుతోంది. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీలో జేఎఫ్సీలో అవుట్డేటెడ్ నేతలు, స్వయం ప్రకటిత మేథావులు వున్నారు. జేఎఫ్సీ నివేదిక కోసం నిర్వహించిన సమావేశం ఫార్స్. గతంలో పవన్ కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే వేదిక ఏర్పాటు చేసి, కోటి రూపాయలు కేటాయించినట్టు ప్రకటించారు. ఈ ఫోర్స్ ఏమయ్యింది? ఆ డబ్బు ఏం చేశారు? రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై పవన్ వైఖరి ఏమిటి? సీమ గోడు పవన్కు పట్టదా? పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లో రైతుల నుంచి టీడీపీ నేతలు భారీ కొనుగోళ్లు చేస్తున్నారు. కియా మోటార్స్ ప్రాంతంలో పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్ భూములు కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలోని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. సుమారు రెండు వందల కోట్ల విలువైన భూములు ఈ రకంగా తీసుకున్నారు. దీనిపై అన్ని ఆధారాలు మా వద్ద వున్నాయి. రైతులను భయపెట్టి 275 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి, భూములను రైతులకు ఇప్పించాల’ని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. -
నెహ్రూపై సంచలన ఆరోపణలు
సాక్షి, భోపాల్ : జనరల్ నాలెడ్జి పరీక్ష పేరుతో బీజేపీ యువవిభాగం నిర్వహించిన పరీక్ష కాస్త వివాదానికి తెరలేపింది. అందులో అడిగిన ప్రశ్నలు ప్రతిపక్షాలకు మంటపెట్టేలా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మంగళవారం సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో బీజేవైఎం(భారతీయ జనతా యువ మోర్చా) విభాగం ఓ జనరల్ నాలెడ్జి పరీక్ష నిర్వహించింది. భోపాల్లోని ఎంవీఎం కాలేజ్ క్యాంపస్లో ఈ పరీక్ష ఏర్పాటుచేయగా అంతకుముందు ‘మేరే దీన్ దయాళ్’ అనే పేరుతో ఉన్న పుస్తకాన్ని పరీక్ష రాసే వారికి అందించారు. అందులో మాజీ ప్రధాని జవహార్ లాల్పై వారు సంచలన ఆరోపణలు చేశారు. నెహ్రూకు అధికారంపై వ్యామోహం అని పేర్కొన్నారు. అందుకోసమే దేశాన్ని విడదీస్తున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అదే సమయంలో పాకిస్థాన్ పిత మహ్మద్ అలీ జిన్నా కూడా అలాంటి వ్యక్తేనని పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని 47వ పేజీలో అఖండ్ భారత్ అనే చాప్టర్లో 'ఎలాంటి విభజన లేకుండానే భారత్కు స్వాతంత్ర్యం వస్తుందని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ నమ్మారు. కానీ, తమకు అధికారం దక్కాలనే దురాశతో అవిభక్త భారతదేశానికే స్వాతంత్ర్యం అనే ఆలోచనను పక్కన పడేసి నెహ్రూ, జిన్నాలు బ్రిటీష్ వాళ్ల వ్యూహంలో పడ్డారు' అని పేర్కొన్నారు. అంతేకాకుండా జీకే పరీక్ష కోసం కూర్చున్నవారికి ఇచ్చిన ప్రశ్నా పత్రంలో కేవలం దీన్ దయాళ్కు సంబంధించినవి 4 ప్రశ్నలు అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చిన 11 పాలసీల మీద మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ పరీక్షపై పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా, దీన్ దయాళ్ గురించి నేటి తరానికి తెలియాలనే ఉద్దేశంతోనే తాము ఆ పరీక్ష పెట్టామే తప్ప దురుద్దేశంతో కాదని అన్నారు. -
విమర్శించడం మానుకోవాలి
జైనథ్ : రైతుల సమస్యలపై పోరాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ను విమర్శించడం మానుకోవాలని బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కోరెడ్డి నర్సింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబి రంగు పురుగు, కింగ్ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతూ శంకర్ నిర్వహించిన ధర్నాను టీఆర్ఎస్ నాయకులు విమర్శించడం అనైతికమన్నారు. మండలంలో రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లని టీఆర్ఎస్ నాయకులు కేవలం పదవుల కోసమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో గులాబి రంగు పురుగుతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తుంటే, ఇక్కడ ఎందుకు అందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా విమర్శలు మాని రైతులకు ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండి స్వామి, నాయకులు రాకేష్ రెడ్డి, నవీన్, రాకేష్, ఆశీష్, రమేష్ పాల్గొన్నారు. -
అసెంబ్లీ ముట్టడికి యత్నం.. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టిడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పలు జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మరోవైపు కరీంనగర్లోనూ అసెంబ్లీ ముట్టిడికి వెళ్తున్న పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సినీ ప్రముఖులకు సర్కారు అండ!
తెలంగాణ ప్రభుత్వం వారిని కాపాడుతోంది బీజేవైఎం ఆరోపణ.. ఎక్సైజ్ ఆఫీస్ ముట్టడి హైదరాబాద్: టాలీవుడ్ సినీ పరిశ్రమ డ్రగ్స్ మాఫియాలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలపై 12మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ రాకెట్ సూత్రధారి కెల్విన్ కాల్లిస్ట్లో మరో 15మంది సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయని, కానీ ప్రభుత్వ పెద్దలతో తెరవెనుక మంతనాలు జరిపి.. వారు తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేవైఎం కార్యకర్తలు శనివారం నగరంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎక్సైజ్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సినీ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని వారు ఆరోపించారు. బీజేవైఎం కార్యకర్తల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
నోట్ల రద్దు నిర్ణయం విప్లవాత్మకం
తిరువూరు : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్ సమర్థించుకున్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో శనివారం యువమోర్చా కార్యకర్తల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రధానిగా తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం విచారకరమన్నారు. ప్రస్తుతం బ్యాంకులకు, ఏటీఎంలకు చాలినన్ని కరెన్సీ వచ్చినందున ఇకపై ప్రజలు బారులు తీరి నిలబడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో కలిగే ప్రయోజనాలను బీజేవైఎం కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దారా మాధవరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సింహాచలం, ప్రకాశరావు పాల్గొన్నారు. -
బీజేవైఎం తిరంగయాత్ర ప్రారంభం
ముకరంపుర : బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగయాత్ర బైక్ ర్యాలీని గురువారం బీజేపీ కిసాన్మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్రావు ప్రారంభించారు. ప్రజలు, యువతలో దేశభక్తి, జాతీయవాదం పెంపొందించేందుకు తిరంగయాత్రను చేపట్టినట్లు తెలిపారు. కార్యకర్తలు త్యాగధనుల చరిత్రను భావితరాలకు చాటి చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు మీస అర్జున్రావు, ఎడవెల్లి విజయేందర్రెడ్డి, కొరివి వేణుగోపాల్, గంటల రమణారెడ్డి, సుజాతరెడ్డి, నరేందర్,ప్రసాద్, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. నేడు మురళీధర్రావు రాక తిరంగయాత్రలో భాగంగా నిర్వహించే కాగడాల ప్రదర్శనకు శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు హాజరుకానున్నారు. ఆర్అండ్బీ విశ్రాంతిభవనం ఎదుట సాయంత్రం 6 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని నాయకులు తెలిపారు. -
త్యాగధనుల జన్మస్థలాలు స్ఫూర్తికేంద్రాలు
దేశభక్తి పెంపొందించేందుకే తిరంగయాత్ర 1 నుంచి రెండు విడతలుగా బైక్ర్యాలీ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్రెడ్డి ముకరంపుర : బానిస బతుకుల నుంచి విముక్తి కలిగించిన త్యాగధనుల జన్మస్థలాలను స్ఫూర్తికేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు పి.విక్రమ్రెడ్డి తెలిపారు. భావితరాల్లో దేశభక్తి, జాతీయవాదం పెంపొందించేందుకే తిరంగయాత్రను దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు తెలిపారు. కరీంనగర్లోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. స్వాత్రంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఆర్థిక, సామాజిక అసమానతలతో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నైజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17ను విమోచనదినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణవ్యాప్తంగా పర్యటించి కొమురం భీం మొదలుకుని చాకలి ఐలమ్మ వరకు త్యాగధనుల జీవిత చరిత్రను వివరిస్తామన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు రెండు విడతలుగా బైక్ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. 9న కరీంనగర్లో ముగింపు సభ ఉంటుందని, రాష్ట్ర, జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. బీజేపీ, బీజేవైఎం నాయకులు గంటల రమణారెడ్డి, కన్నం అంజయ్య, కరండ్ల మధుకర్, పెండ్యాల సాయికృష్ణారెడ్డి, మురళీకృష్ణ, గడ్డం ప్రశాంత్రెడ్డి, ఆర్.ప్రసాద్, కె.జ్యోతిబసు, ఎ.శ్రీనాథ్రెడ్డి, జి.రంజిత్రెడ్డి, జితేందర్రెడ్డి, ఎం.కుమార్, కిషోర్, లవన్ పాల్గొన్నారు. -
విమోచనదినోత్సవం అధికారికంగా నిర్వహించాలి
– బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్రెడ్డి జడ్చర్ల టౌన్ : అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరిపిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎంఐఎంకు తొత్తుగా మారి విస్మరించారని, ఈ ఏడాది విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్రెడ్డి డిమాండ్ చేశారు. తిరంగా యాత్రలో భాగంగా శనివారం బాదేపల్లి పట్టణం నేతాజీ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలోని 3జిల్లాలు, మహరాష్ట్రలోని 5జిల్లాల్లో సెప్టెంబర్ 17ను స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుతున్నారని గుర్తుచేశారు. తిరంగా యాత్రలో తాము గ్రామ గ్రామానికి వెళ్లి సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిన విషయాన్ని ప్రజలకు తెలియజేసి చైతన్యం చేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ మాట్లాడుతూ మాట ఇస్తే మడమతిప్పను అన్న కేసీఆర్ నేడు ఎందుకు మాట తప్పారని, విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పాలాదిరాంమోహన్, నాయకులు శాంతకుమార్, కళ్యాణ్, నరేందర్, రమేష్జి, రాపోతుల శ్రీనివాస్గౌడ్, నాగరాజు, మధు, సామల నర్సింహులు, సారంగినవీన్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి’
ఆత్మకూర్: తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం ఆత్మకూర్ తహసీల్దార్ ప్రేమ్రాజ్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలకు మాత్రం నిజాం పాలన నుంచి సెప్టెంబర్ 17వ తేదీన విముక్తి లభించిందన్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని ప్రగల్బాలు గతంలో కేసీఆర్ పలికారని, ఇప్పుడు మాత్రం తాను అధికారంలో ఉన్నప్పటికీ విమోచన దినంపై మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో బీజే వైఎం నాయకులు మహేందర్రెడ్డి, మేర్వశ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ తీరు ఇబ్బందికరం
విజయవాడ(భవానీపురం) : ప్రత్యేక హోదా పై టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా వుందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ .విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఎన్టీఏలో భాగస్వామ్యంగా వున్నామన్న విషయం కూడా ఆ పార్టీ నేతలు మరిచిపోయారని విమర్శించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలు మారినవారు, రాత్రికి రాత్రి పదవులు పొందిన టీజీ వెంకటేష్, బు ద్దావెంకన్న, ముద్దు కృష్ణమనాయుడు వంటి వారు అధినేత మెప్పు కోసం బీజేపీని విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. అల్లూరి స్మృతి చిహ్మాన్ని సందర్శించనున్న రైల్వేమంత్రి ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులు స్మృతి చిహ్నాలను సందర్శించి వారికి నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. దేశం మొత్తంమీద 200 ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. అల్లూరి సీతారామరాజు జన్మస్ధలమైన విశాఖ జిల్లాలో జరిగే కార్యక్రమంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ఎంపీ కంభంపాటి హరిబాబు పాల్గొంటారని తెలిపారు. నిరుద్యోగుల వయసును సడలించాలి ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను నిరుద్యోగులకు మేలు జరిగేలా వారి వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు సడలించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ ,ఎస్టీలకు మరో మరో రెండేళ్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిక్కాల రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శులు సురేంద్రమోహన్, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్-2 పేపర్ లీకేజీని నిరసిస్తూ బీజేవైఎం ఆందోళన
ఎంసెట్-2 పేపర్ లీకేజీని నిరసిస్తూ భారతీయ జనతా ముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాసేపు ఆర్టీసీ బస్టాండు మార్గంలో రాస్తారోకోకు దిగారు. దీంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. బీజేవైఎం కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే ఎంసెట్ పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. -
మంత్రుల దిష్టిబొమ్మ దహనం
కందుకూరు: ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేవైఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం కందుకూరు చౌరస్తా శ్రీశైలం రహదారిపై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు పోలోజు శ్రీనివాస్చారి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్-2 పేపర్ రద్దు విషయంలో విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తుందని విమర్శించారు. అహర్నిశలు శ్రమించి ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను నిరాశకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 కోట్ల ఒప్పందంతో లీకేజీ వ్యవహారం జరిగిందని, దీనికి విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖ మంత్రులు బాధ్యత వహించాలని ఆయన మండిపడ్డారు. వారి కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. దీనికి నైతిక బాధ్యత వహించి వెంటనే సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సాధ మల్లారెడ్డి, ప్రధానకార్యదర్శులు నల్లబోలు నర్సింహారెడ్డి, దయ్యాల యాదగిరి, బీజేవైఎం మండల ప్రధానకార్యదర్శులు ఎల్లపల్లి లింగంయాదవ్, కళ్లెం సుధాకర్రెడ్డి, సీనియర్ నాయకులు మామిళ్ల అంజయ్య, గంగుల ప్రభాకర్రెడ్డి, కొంతం జంగారెడ్డి, సాధ ప్రవీణ్రెడ్డి, కళ్లెం చెన్నారెడ్డి, శ్రీశైలం, సురేష్, మహేష్, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. -
నేడు బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశం
దుబ్బాక: భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం సిద్దిపేటలోని వీఏఆర్ గార్డెన్లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె వంశీకృష్ణ గౌడ్ తెలిపారు. ఆదివారం దుబ్బాక విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన జరిగే జిల్లా కార్యవర్గ సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. జిల్లా కమిటీ, కోర్ కమిటీ, నియోజక వర్గ బాధ్యులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ఆయన కోరారు. -
విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
రంగారెడ్డి : తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ నినాదాన్ని గతంలో వినిపించి ప్రభుత్వంపై ఉద్యమించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నోరు మెదపకపోవడాన్ని తప్పుబట్టింది. అమరుల త్యాగాల ఫలితంగా నిజాం నిరంకుశపాలన నుంచి తెలంగాణకు విమోచనం కలిగిందని, దీంతో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరింది. మైనార్టీ ఓట్ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అమరుల త్యాగాలనే తాకట్టు పెడుతోందని విమర్శించింది. ఈమేరకు ఆదివారం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కొప్పు బాష ఒక ప్రకటన విడుదల చేశారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 26న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు చేపట్టాలని, ప్రజలకు విమోచన దిన ఆవశ్యకతను వివరించాలని ఆయన సూచించారు. -
అత్యాచారం కేసులో బీజేవైఎం కార్యకర్తల అరెస్టు
తిరుపతి: ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రదీప్ రాచకొండ విశ్వనాథ్, హేమంత్, దామోదర్ అనే వ్యక్తులు శ్రీనగర్ కాలనీలో తాము క్రైం పోలీసులమని బెదిరించి ఓ వ్యభిచార కేంద్రంపై దాడి చేశారు. అనంతరం అక్కడ ఇద్దరు యువతులపై లైంగికదాడి చేశారు. దీంతో అలిపిరికి చెందిన పోలీసులు వీరినలుగురితోపాటు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. -
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించ తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కేరళకు చెందిన విద్యార్థులు క్యాంపస్ లోని క్యాంటీన్ వద్ద గుమిగూడారు. 'నైతిక పోలీసింగ్'కు నిరసనగా 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమయాత్తమయ్యారు. మిగతా రాష్ట్రాల విద్యార్థుల కూడా వీరికి మద్దతు పలికారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాన్ని జరగనీయబోయమని వర్సిటీ గేటు వెలుపల బైఠాయించారు. 'కిస్ ఆఫ్ లవ్' వ్యతిరేకులు, మద్దతుదారుల నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. 'కిస్ ఆఫ్ లవ్' ఎటువంటి అసభ్యత లేదని మద్దతుదారులు అంటున్నారు. -
'కిస్ ఆఫ్ లవ్'పై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు!
కొచ్చి:'నైతిక పోలీసింగ్’కు నిరసనగా పిలుపునిచ్చిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించి తీరుతామని నిర్వాహకులు శనివారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వనప్పటికీ ప్రజల్లో నైతిక పోలీసింగ్కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు దీన్ని జరుపుతామని ‘ఫ్రీ థింకర్స్’ అనే ఫేస్బుక్ స్నేహితుల బృందం తెలిపింది. సుమారు వెయ్యి మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించడం తెలిసిందే. మోరల్ పోలీసుంగ్ను నిరసిస్తూ నవంబర్ రెండో తేదీన నిర్వహించాలని తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతమంది ఫేస్బుక్ యూజర్ల గ్రూపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని నిషేధించాలంటూ రెండు పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా.. దాన్ని అడ్డుకోడానికి తగినంత స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఆ ముద్దుల వ్యవహారంలో మేం వేలు పెట్టం!
మోరల్ పోలీసుంగ్ను నిరసిస్తూ నవంబర్ రెండో తేదీన నిర్వహించాలని తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతమంది ఫేస్బుక్ యూజర్ల గ్రూపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని నిషేధించాలంటూ రెండు పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా.. దాన్ని అడ్డుకోడానికి తగినంత స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఎర్నాకులం ప్రభుత్వ న్యాయకళాశాల, శ్రీ సత్యసాయి అనాథల ట్రస్టులకు చెందిన ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎం షఫీక్లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఐపీసీలోని నిబంధనలను ఈ కార్యక్రమం ఉల్లంఘిస్తోందని, ఇది భారతీయ సంస్కృతికి కూడా విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యతను నిరోధించాల్సిందిగా ఎర్నాకులం జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్లను ఆదేశించాలని కోరారు. నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అణగదొక్కడానికి వీల్లేదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల ఓ ఫేస్బుక్ పోస్టులో వ్యాఖ్యానించారు. అయితే నిరసనకారులు మాత్రం శాంతిభద్రతల సమస్యను సృష్టించకూడదని ఆయన అన్నారు. గతవారం కోజికోడ్లోని ఓ హోటల్లో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కొంతమంది భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు అక్కడ విధ్వంసం సృష్టించారు. దీనికి నిరసనగానే నవంబర్ రెండో తేదీ ఆదివారం నాడు కౌగిలింతలు, ముద్దులతో బహిరంగ నిరసన నిర్వహించాలని వివిధ పక్షాలు నిర్ణయించాయి. -
రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
హైదరాబాద్: వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. బీజేవైఎం కార్యదర్శి గోపాల్ ఫిర్యాదు మేరకు షాహినాల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదు చేశారు. వినాయక చవితి సందర్భంగా ‘ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా?...’ అంటూ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ ఆయనపై పలు కేసుల నమోదైన సంగతి తెలిసిందే -
రుణమాఫీ త్వరగా చేయండి: విష్ణువర్ధన్రెడ్డి
అనంతపురం: రుణమాఫీ పథకంపై రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని, ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలల్లోపే ఆ పథకాన్ని వర్తింపజేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సూచించారు. సోమవారం ఆయన అనంతపురంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో టీడీపీ అలసత్వం ప్రదర్శిస్తే ప్రజా క్షేత్రంలో పోరాటానికి తాము వెనకాడమని హెచ్చరించారు. నరేంద్ర మోడీ హవా నడిచినందునే రాష్ట్రంలో టీడీపీ- బీజేపీ కూటమి విజయం సాధించిందని చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని, రాష్ట్రంలోనూ నిర్మాణాత్మక పాత్రను పోషించి ఎన్నికల హామీలు అమలయ్యేలా చూస్తామని చెప్పారు. ‘అనంత’ను ఇండస్ట్రియల్ హబ్గా మార్చడానికి నరేంద్ర మోడీకి తమ పార్టీ తరఫున ప్రత్యేక ప్రణాళికను అందజేసినట్లు తెలిపారు. -
కాంగ్రెస్ ‘వుుఖాల’తో యువమోర్చా నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాహుల్గాంధీ గుర్రంపై ఊరేగారు..ఆయన వెనుకే సోనియా, మన్మోహన్, షీలా, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో సహా పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మందీమార్బలం బంధుగణం తోడురాగా బాజాభజంత్రీల సందడితో బీజేపీ కేంద్ర కార్యాలయం వైపుగా సాగిందీయాత్ర...’ అదేంటీ రాహుల్ పెళ్లి ఎప్పుడు కుదిరింది...ఏంటీ హంగామా అనుకుంటున్నారా..? అదేనండి ఫొటోలో చూస్తున్నారుగా.. పెళ్లికుమారుడి మాదిరిగా రాహుల్ గాంధీ మాస్క్ ధరించిన వ్యక్తి గుర్రం మీద వస్తుంటే. .ఆయనను మాస్క్లు ధరించిన మహా నాయకులు అనుసరించారు..‘గొటాలోకి బరాత్’ పేరిట అశోకా రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి బీజేపీ యువమోర్చా కార్యకర్తలు శనివారం నిరసన ప్రదర్శనలోనివీ దృశ్యాలు..యూపీఏ ప్రభుత్వ, కాంగ్రెస్ నాయకుల అవినీతిని తెలియజెప్పేందుకు తమ నిరసనను వినూత్నంగా చెప్పేందుకు ఇలా ఊరేగింపుతో ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని బీజేవైఎం సభ్యులు ఆరోపించారు. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చినందుకు కుంభకోణాలను బహుమతిగా ఇచ్చారని వారు ఆరోపించారు. 2జీ, కామన్వెల్త్గేమ్స్ కుంభకోణం, ఆదర్శ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, రైల్వే కుంభకోణంతోపాటు ఇటీవల హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ వరకు కాంగ్రెస్ నాయకులంతా అవినీతిలో కూరుకుపోయారన్నారు. ఓ వైపు పార్టీ నేతలంతా అవినీతిలో మునిగి తేలుతుంటే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు లోక్పాల్ బిల్లు ఘనత తన ఖాతాలో వేసుకునేందుకు ఆరాటపడుతున్నారన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. శనివారం నిర్వహించిన ప్రదర్శనలో రాహుల్గాంధీ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి పెళ్లికుమారుడిలా గుర్రంపై ఊరేగుతుంటే, హిమాచల్ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్, ఏ.రాజా, పవన్బన్సల్, అశ్వినీ కుమార్ మాస్క్లతో ఉన్న వ్యక్తులకు డప్పుచప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్లు చేస్తూ ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బండిపై కాంగ్రెస్పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మాస్క్ల్లో కూర్చున్న వ్యక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోడీకి క్షమాపణ చెప్పాలి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు అనురాగ్సింగ్ ఠాకూర్ అన్నారు. ప్రధాని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం ప్రధానికి తెలుసన్నారు. -
ఆదర్శ్ కుంభకోణంపై బీజేవైఎం ఆందోళన
ఢిల్లీ: ఆదర్శ్ కుంభకోణంలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన వైఖరి చెప్పాలంటూ భారతీయ జనతా యువ మోర్చా ఆందోళన చేపట్టింది. కుంభకోణం అంశానికి సంబంధించి రాహుల్ తన వైఖరి తెలియజేయాలని ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు.ఆయన నివాసం వైపునకు ర్యాలీగా దూసుకువెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆదర్శ్ కుంభకోణం దెబ్బ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ప్రక్షాళనకు అడుగులు వేస్తోంది. అవినీతి ఆరోపణలతో మకిలపడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పునరుద్ధరించడంపై అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లోపు ప్రజల్లో పార్టీకి ఆదరణ పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతమున్న రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించి అవినీతి రహిత పాలన అందించాలని వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ సైతం ఆదర్శ్ కుంభ కోణంపై రాహుల్ వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. -
కుషాయిగూడాలో బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ
హైదరాబాద్: నగరంలో బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తొలుత ఫ్లెక్సీలతో మొదలైన వివాదం కాస్తా, పతాకస్థాయిరి చేరింది. బీజేవైఎం నాయకుడు యాదవ్పై స్థానిక బీజేపీ నేత ఒకరు దాడి చేశారు. సమిష్టిగా ఏర్పాట్లు సమీక్షించాల్సిన నేతలు మధ్య ఘర్షణకు దిగడంతో చర్చలకు దారి తీసింది. దీంతో యాదవ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నవభారత యువభేరి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో వారి మధ్య వివాదం మొదలైంది. -
బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో సాక్షి వేదిక