రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
హైదరాబాద్: వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. బీజేవైఎం కార్యదర్శి గోపాల్ ఫిర్యాదు మేరకు షాహినాల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదు చేశారు.
వినాయక చవితి సందర్భంగా ‘ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా?...’ అంటూ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ ఆయనపై పలు కేసుల నమోదైన సంగతి తెలిసిందే