Gopal
-
క్షీణించిన నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేరిక
అయోధ్య: రామమందిర్ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్(86) ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపధ్యంలో ఆయనను లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం మహంత్ నృత్య గోపాల్ దాస్ మూత్ర విసర్జన సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మధుర వెళ్లిన సమయంలో మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం క్షీణించింది. అయితే అతని ఆరోగ్యం ఇంకా మెరుగుపడకపోవడంతో మేదాంతలో చేర్పించారు. నృత్య గోపాల దాస్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశీస్సుల కోసం ప్రధాని మోదీ పలు మార్లు అయోధ్యకు వచ్చారు. -
ఆదుకోండి..లేదంటే డెత్ ఇంజక్షన్కు అనుమతి ఇవ్వండి
నల్లగొండ టౌన్: ‘కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతూ ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాను. ప్రభుత్వం చేయూతనిచ్చి నన్ను ఆదుకోవాలి.. లేదా డెత్ ఇంజక్షన్కు అనుమతిచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలి’అని నల్లగొండ పట్టణానికి చెందిన బాధితుడు జంపాల గోపాల్ వేడుకుంటున్నారు. బాధితుడు గోపాల్తో పాటు అతని తల్లి అంజమ్మ తెలిపిన వివరాలు.. నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు పరిధి సాగర్ రోడ్డు మారుతీనగర్కు చెందిన 44 ఏళ్ల గోపాల్ 25 సంవత్సరాలుగా మసు్క్యలర్ డ్రిస్ట్రోపీ (కండరాల క్షీణత) వ్యాధితో బాధపడుతున్నారు. గోపాల్ ఇంటర్, ఐటీఐ పూర్తి చేసి 2000 సంవత్సరంలో ఆర్టీసీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం రావడంతో ఫిజికల్ టెస్టులో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్కు పంపించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతనికి మసు్క్యలర్ డ్రిస్ట్రోపీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆయన ఆర్టీసీలో ఉద్యోగం కోల్పోయాడు. తరువాత ఆరు నెలల కాలంలోనే వ్యాధి తీవ్రమై కండరాలు క్షీణించి జీవచ్ఛవంలా మారారు. కదలలేక, నడవలేక, కాళ్లు, చేతులు పనిచేయక మాటకే పరిమితమయ్యారు. 25 సంవత్సరాలుగా తాను అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అన్నీ తానైన కన్నతల్లి.. జీవచ్ఛవంలా మారి నడి వయసుకు వచ్చిన కుమారుడికి 70 ఏళ్ల వృద్ధురాలైన తల్లి అంజమ్మ ఒక్కతే దిక్కు. తల్లికి కుమారుడు చేదోడువాదోడుగా ఉండాల్సిన వయసులో తల్లే తన కుమారుడికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. బిడ్డ అనుభవిస్తున్న నరకం చూడలేక తాను చనిపోతే బాగుండునని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలి.. కేవలం ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ 4 వేల రూపాయలే తమకు ఆధారమని ఆస్తిపాస్తులు లేని తమకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని, లేదంటే తనకు డెత్ ఇంజక్షన్ ఇచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలని బాధితుడు గోపాల్ వేడుకుంటున్నారు. అదే విధంగా తాను మరణిస్తే తన భౌతిక కాయాన్ని మసు్క్యలర్ డిస్ట్రోపీ వ్యాధి నయం చేసే మందును కనుగొనేందుకు పరిశోధనకు ఉపయోగించాలని కోరుతున్నారు. దాతలు ముందుకొచ్చి ఫోన్ నంబర్ 9182241141 (గూగుల్పే, ఫోన్పే)కు ఆర్థిక సాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు. -
మీ వెంటే.. మేమంటూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించడంతో పాటు సమాజంలో సమోన్నత గౌరవాన్ని తీసుకురావడంలో చెరగని ముద్ర వేశారు. రాజకీయ చరిత్రలో ఏనాయకుడు కనీసం ఊహించని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 99 శాతం చిత్తశుద్ధితో అమలు చేసి విశ్వసనీయతకు సరైన నిర్వచనాన్ని ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా టీడీపీ, జనసేన పార్టీల్లోని కార్యకర్తల నుంచి కీలక నేతలు వరకు వైఎస్సార్సీపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు క్యూ కట్టారు. వీరిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం సమక్షంలో చేరిన గోపాల్ యాదవ్ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గోరుముచ్చు గోపాల్ యాదవ్ మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో తణుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంటరీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ పాల్గొన్నారు. మరోవైపు.. రాజంపేట టీడీపీ లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి గంటా నరహరి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పీవీ మిథున్రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో తుని వైఎస్సార్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా, ఏలూరు పార్లమెంటరీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్, వైఎస్సార్సీపీ మైలవరం నేత జ్యేష్ట శ్రీనాథ్ పాల్గొన్నారు. పార్టీ కండువా కప్పుకున్న వేనాటి సూళ్లూరుపేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సీవీ మిథున్రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, నెల్లూరు డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. కాగా.. వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. జనసేన లక్ష్మీశివకుమారి చేరిక పాయకరావుపేటకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, జనసేన నాయకురాలు అంగూరి లక్ష్మీ శివకుమారి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పీవీ మిథున్రెడ్డి పాల్గొన్నారు. జై భారత్ పార్టీ నుంచి.. జై భారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం సమక్షంలో చేరిన విజయవాడ నేతలు విజయవాడకు చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గండూరి మహేష్, నందెపు జగదీష్, కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ కోసూరు సుబ్రహ్మణ్యం (మణి), డివిజన్ మాజీ అధ్యక్షుడు గోరంట్ల శ్రీనివాసరావు, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి బత్తిన రాము వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాశ్ పాల్గొన్నారు. విశాఖ నేతల చేరిక విశాఖపట్నానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, జనసేన సీనియర్ నాయకులు జీవీ రవిరాజు, బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధకు సీఎం జగన్ వైఎస్సార్ïసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, గాజువాక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, విశాఖ నార్త్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన యలమంచిలి రవి, బత్తిన రాము లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని సీఎం జగన్ కోరారు. మంగళవారం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవినేని అవినాశ్తో పాటు యలమంచిలి రవి, గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన బత్తిన రాము, ఎంపీ కేశినేని నాని, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావులను పిలిపించి జగన్ మాట్లాడారు. అవినాష్ అధిక మెజార్టీతో విజయం సాధించేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జోష్ కొనసాగుతుండగా, సీఎం జగన్ను యలమంచిలి రవి, బత్తిన రాము కలవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక తూర్పులో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎంను కలిసిన వారిలో యలమంచిలి రవి తనయుడు రాజీవ్ కూడా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ వెంటే మేమంతా.. బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివరావు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరిస్తూ బుధవారం నుంచి బస్సు యాత్ర చేపడుతున్న సీఎం వైఎస్ జగన్ వెంటే మేమంతా సిద్ధమని బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నాగిడి సాంబశివరావు ప్రకటించారు. బీసీ సంఘం రాష్ట్ర నేతలు పోనమాల నాగరాజు, వల్లభూని మణికంఠ, వల్లభుని దుర్గాప్రసాద్, సైకం చినబాబు తదితరులతో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల సంక్షేమం కొనసాగాలంటే జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభిస్తున్న బస్సు యాత్రలో తామంతా పాల్గొంటామన్నారు. -
"బీసీలను మోసం చేసిన టీడీపీ బాబుకంటె సీఎం జగన్ బెటర్"
-
భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రూపశిల్పికి జాతీయ పురస్కారం!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: ఉద్యాన పంటల సాగులో నీటిని అతితక్కువగా వినియోగించే వినత్న భూగర్భ డ్రిప్ ‘స్వర్’ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సిఇసి) డైరెక్టర్ కే.ఎస్. గోపాల్ ‘నీటి సుస్థిరత పురస్కారం 2023–24’ విజేతగా నిలిచారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి, సీఈఓ భరత్ లాల్ చేతుల మీదుగా గోపాల్ పురస్కారాన్ని అందుకున్నారు. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి), కేంద్ర జలశక్తి శాఖ, యుఎన్డిపి ఇండియా సంయుక్తంగా వాటర్ సస్టయినబిలిటీ అవార్డ్స్ను వరుసగా మూడో ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు. ‘ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫీషియన్సీ – అగ్రికల్చర్ సెక్టార్’ విభాగంలో ప్రధమ బహుమతిని సిఇసి డైరెక్టర్ గోపాల్ గెల్చుకున్నారు. సాధారణ డ్రిప్ భూమి పైనే బిందువులుగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్ రూపొందించిన స్వర్ డ్రిప్ భూమి లోపల మొక్కల వేరే వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇవి చదవండి: Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం! -
ఫొటో జర్నలిస్ట్ గోపాల్పై దాడి
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్పై దాడి చేసిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్పీజేఏ) అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. స్వల్ప వివాదం కారణంగా మహేష్గౌడ్ అనే వ్యక్తి కర్రతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన గోపాల్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. గోపాల్ను సహచర ఫొటో జర్నలిస్టులతో కలసి వారు పరామర్శించారు. స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే గోపాల్పై దాడి చేసిన మహేష్గౌడ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
ఆ వృత్తం.. ఓ వి‘చిత్రం’!
అది ఏడున్నర మీటర్ల వ్యాసంతో ఉన్న భారీ వృత్తం.. ఎక్కడా వంకరటింకరగా లేకుండా వృత్తలేఖినితో గీసినట్టు కచ్చితమైన రూపం.. పెద్ద బండరాయి మీద 30 అంగుళాల మందంతో చెక్కటంతో అది ఏర్పడింది.. కానీ అది ఇప్పటిది కాదు, దాదాపు 3 వేల ఏళ్ల నాటిది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర శివారు ప్రాంతాల్లో కొన్ని గుట్టల్లో ఆదిమానవులు గీసిన రంగుల చిత్రాలు నేటికీ కనిపిస్తాయి. కానీ వాటికి భిన్నంగా ఇప్పుడు గుట్ట పరుపుబండ మీద ఆదిమానవులు చెక్కిన పెద్ద వృత్తం (జియోగ్లిఫ్) చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది. మేడ్చల్ సమీపంలోని మూడు చింతలపల్లి శివారులోని గుట్ట మీద ఇది వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కె.గోపాల్, మహ్మద్ నజీరుద్దీన్, అన్వర్ బాష, అహోబిలం కరుణాకర్లు ఇచ్చిన సమాచారం మేరకు చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ బృందంతో కలసి దాన్ని పరిశీలించారు. ‘తక్కువ ఎత్తున్న గుట్ట పరుపుబండపై ఈ వృత్తం చెక్కి ఉంది. ఏడున్నర మీటర్ల వ్యాసంతో భారీగా ఉన్న ఈ వృత్తం మధ్యలో రెండు త్రిభుజాకార రేఖా చిత్రాలను కూడా చెక్కారు. అంత పెద్దగా ఉన్నప్పటీకీ వంకరటింకరలు లేకుండా ఉండటం విశేషం. దీనికి సమీపంలో కొత్త రాతియుగం రాతి గొడ్డళ్లు నూరిన గాడులు (గ్రూవ్స్) ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ తరహా చెక్కిన రేఖా చిత్రం వెలుగుచూడకపోవటంతో దీనిపై మరింతగా పరిశోధించాల్సి ఉంది’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. సమాధి నమూనా అయ్యుండొచ్చు.. ఈ చిత్రం ఇనుప యుగానికి చెందిందిగా భావిస్తున్నాం. అప్పట్లో మానవుల సమాధుల చుట్టూ వృత్తాకారంలో పెద్ద రాళ్ల వరుసను ఏర్పాటు చేసేవారు. ఆ సమాధి నిర్మాణానికి నమూనాగా ఈ వృత్తాన్ని గీసి ఉంటారన్నది మా ప్రాథమిక అంచనా. గతంలో కర్ణాటకలో ఇలాంటి చిత్రం కనపించింది. దాని మధ్యలో చనిపోయిన మనిషి ఉన్నట్లు చిత్రించి ఉంది. ఈ చిత్రాన్ని మరింత పరిశోధిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. – రవి కొరిశెట్టార్, పురావస్తు నిపుణుడు -
‘నేనే సరోజ’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
శాన్వీ మేఘన, కౌశిక్ బాబు జంటగా శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే సరోజ: ఉరఫ్ కారం చాయ్’. గాళ్స్ సేవ్ గాళ్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఎస్ 3 క్రియేషన్స్ పతాకంపై రచయిత డా. సదానంద్ శారద నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసిన శాసన సభ్యులు ముఠా గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్థిని పాత్రలో శాన్వీ మేఘన పవర్ఫుల్గా నటించారు.ఓ సామాజిక అంశాన్ని తీసుకుని ఈ తరహా సినిమాను నిర్మించిన దర్శక–నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఆడపిల్ల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్ష చూపించేవారికి తాగిస్తాం కారం చాయ్ అంటూ గుణపాఠం చెప్పేలా సరోజ పాత్ర ఉంటుంది. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు శ్రీమాన్ గుమ్మడవెల్లి. ‘‘ఆలోచనాత్మక సంభాషణలు.. శాన్వి వీరోచిత పోరాటాలు, ఆర్. ఎస్. నంద హాస్యం.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అన్నారు రచయిత, నిర్మాత సదానంద్ శారద. -
ముషీరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు వీళ్లే..
ముషీరాబాద్ నియోజకవర్గం ముషీరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ముఠా గోపాల్ ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది అనిల్కుమార్పై 36888 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే, 2019 వరకు బిజెపి తెలంగాణ అద్యక్షుడుగా ఉన్న డాక్టర్ కె.లక్ష్మణ్ సుమారు 30800 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తొలిసారి ఎన్నికైన ముఠా గోపాల్ గంగపుత్రుల సమాజికవర్గానికి చెందినవారు. గోపాల్కు 72919 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఐ మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ కుమారుడైన అనిల్కుమార్కు 36031 ఓట్లు వచ్చాయి. డాక్టర్ కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి రెండోసార్లు గెలిచారు. 1999లో టిడిపితో కూటమి ఉన్నప్పుడు గెలవగా మళ్లీ 2014లో అదే కూటమి పక్షాన విజయం సాధించారు. 2014లో టిఆర్ఎస్ సమీప ప్రత్యర్ధి ముఠా గోపాల్పై 27386 ఓట్ల ఆధిక్యతతో లక్ష్మణ్ గెలిచారు. 2018లో గోపాల్ పైనే ఓడిపోయారు. గతంలో ముషీరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య మూడుసార్లు గెలుపొందగా, మూడు దశాబ్ధాల తరువాత ఆయన భార్య మణెమ్మ రెండుసార్లు గెలుపొందడం విశేషం. అంజయ్య మరణించిన తరువాత లోక్సభ ఎన్నికలలో ఆమె పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలలో పెద్దగా లేరనే చెప్పాలి. అయితే 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, ముషీరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయని నరసింహారెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. దరిమిలా జరిగిన ఉప ఎన్నికలో పోటీచేయించడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అభ్యర్దుల అన్వేషణ చేసి చివరికి మణెమ్మను ఎంపిక చేసారు. ఆ ఉపఎన్నికలో గెలుపొందిన మణెమ్మ 2009 సాధారణ ఎన్నికలోనూ గెలిచారు. ఈ విధంగా భార్యాభర్తలిద్దరూ ఎమ్మెల్యేలుగాను, ఎమ్.పిలు గాను పనిచేసిన అరుదైన రికార్డును అంజయ్య, మణెమ్మలు సొంతం చేసుకున్నారు. అంజయ్య వివిధ మంత్రివర్గాలలోను, 1981లో ముఖ్య మంత్రిగాను పనిచేసారు. ముఖ్యమంత్రి అయ్యాక మెదక్ జిల్లా రామాయంపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఒకసారి 1957లో ఆర్మూరులో గెలిచారు. మొత్తం ఐదుసార్లు గెలిచారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈయన ఒకసారి ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి పదవి కూడా నిర్వహించారు. టిఆర్ఎస్ నేతగా ఉన్న నాయని నరసింహారెడ్డి 1978లో జనతా పార్టీ పక్షాన పోటీచేసి అంజయ్యను ఓడిరచి సంచలనం సృష్టించారు. నాయిని 1978, 1985లలో జనతా పార్టీ తరుఫున గెలిచారు. తిరిగి 2004లో టిఆర్ఎస్లో చేరి విజయం సాధించారు. నాయని 2004లో ఎన్నికైన తరువాత కొంతకాలం రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ క్యాబినెట్లో హోం మంత్రి అయ్యారు. తదుపరి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1983లో ఇక్కడ గెలిచిన నేత శ్రీపతి రాజేశ్వర్ 1985, 1999లలో సనత్నగర్ నుంచి గెలుపొందారు. ఎన్.టి.ఆర్. క్యాబినెట్లలో మంత్రిగా కూడా పనిచేసారు. కాంగ్రెస్ నాయకుడు ఎమ్.కోదండరెడ్డి రెండుసార్లు విజయం సాధించారు. 1957లో గెలుపొందిన సీతయ్య గుప్త, 1962లో బేగంబజార్ నుంచి గెలిచారు. 1952లో ఇక్కడ విజయం సాధించిన జి.ఎస్. మేల్కొటే మూడుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ముషీరాబాద్లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి తొమ్మిదిసార్లు, జనతాపార్టీ రెండుసార్లు,టిఆర్ఎస్ రెండుసార్లు, బిజెపి రెండుసార్లు, టిడిపి ఒక్కోసారి గెలుపొందాయి. ఈ నియోజకవర్గంలో పదిసార్లు రెడ్డి నేతలు గెలిస్తే నాలుగుసార్లు బిసి నేతలు(మున్నూరుకాపు) గెలిచారు. ఒకసారి బ్రాహ్మణ, మరోసారి వైశ్య నేత గెలుపొందారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
యూట్యూబ్ చూసి దొంగనోట్ల ముద్రణ
పలమనేరు (చిత్తూరు జిల్లా): చదివింది కేవలం ఏడో తరగతి.. వారపు సంతలో దుకాణాల వద్ద తిరుగుతూ టీ అమ్మడం అతని వృత్తి. ఇంట్లో రహస్యంగా దొంగ నోట్టు ముద్రించి సంతలో మార్చి సులభంగా డబ్బులు సంపాదించడం ప్రవృత్తి. పలమనేరు డీఎస్పీ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వి.కోట మండలం కె.కొత్తూరుకు చెందిన గోపాల్ (41) ఏడో తరగతి చదివాడు. కొన్నాళ్లు బెంగళూరులోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. ఇప్పుడు సంతలకు వెళ్లి టీ అమ్ముతుంటాడు. వ్యసనాలకు బానిసైన గోపాల్ సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అని యూట్యూబ్లో చూసేవాడు. అందులో దొంగనోట్లను ముద్రించే వీడియోలు చూస్తూ దొంగనోట్లను ముద్రించాలనుకున్నాడు. బెంగళూరు వెళ్లి కలర్ ప్రింటర్, మందంగా ఉండే ఖాళీ బాండ్ పేపర్లు, కలర్లు, గ్రీన్ కలర్ నెయిల్ పాలీష్ కొనుక్కొచ్చాడు. 6 నెలలుగా ఇంట్లోనే రహస్యంగా రూ.500, రూ.200, రూ.100 నోట్లను ముద్రిస్తున్నాడు. రూ.500 నోట్లపై ఉండే సెక్యూరిటీ థ్రెడ్ కోసం గ్రీన్ నెయిల్ పాలిష్ వేశాడు. ఇలా ముద్రించిన నోట్లను వారపు సంతలో చలామణి చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కూరగాయల దుకాణంలో రూ.500 దొంగనోటు ఇచ్చి రూ.50 విలువైన కూరగాయలు కొని చిల్లర తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గోపాల్ను అరెస్ట్ చేసి రూ.8,200 విలువైన దొంగనోట్లను, ప్రింటర్, ఖాళీ తెల్లకాగితాలను సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
భార్యకు తెలియకుండానే మరో ఇద్దరికి పేపర్ లీక్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలైన రేణుక భర్త డాక్యా ఆమెకు తెలియకుండానే మరో ఇద్దరికి ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి ప్రశ్నపత్రాలను మరో నిందితుడు ప్రవీణ్ నుంచి అందుకున్న రేణుక... తన బంధువు ద్వారా నీలేష్ , గోపాల్లతోనే పేపర్ల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ప్రవీణ్కు చెప్పి ప్రశ్నపత్రాలు తీసుకునేప్పుడే రూ.5 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చింది. అప్పటికే గ్రూప్–1 ప్రిలిమ్స్ను అడ్డదారిలో రాసిన ‘ప్రవీణ్ అండ్ కో’మెయిన్స్ను అదే పంథాలో క్లియర్ చేయాలనే పథకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లీకేజీ వ్యవహారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది అభ్యర్థులకు పేపర్ లీక్ చేయొద్దని ప్రవీణ్ రేణుకకు చెప్పాడు. అందుకే రేణుక తన భర్తతో కలిసి నీలేష్, గోపాల్లను ఇంటికే తీసుకెళ్లి చదివించింది. అయితే ఈ పేపర్లను మరో ఇద్దరికి అమ్మి ఎక్కువ మొత్తం సొమ్ము చేసుకోవాలని డాక్యా భావించాడు. ఇందులో భాగంగానే భార్యకు చెప్పకుండా తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా ప్రశాంత్రెడ్డి, రాజేంద్రకుమార్ అనే మరో ఇద్దరు అభ్యర్థులకు ఏఈ ప్రశ్నపత్రాలు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్సులు సైతం తీసుకున్నాడు. ఈ విషయాన్ని భార్య పసిగట్టకూడదనే ఉద్దేశంతోనే వారిని ఈ నెల 4న (పరీక్ష ముందురోజు రాత్రి) హైదరాబాద్లో తాము బస చేసిన ఓ లాడ్జికి రప్పించి పేపర్లు అందించాడు. ప్రవీణ్ ఇంటి నుంచి నగదు స్వాదీనం... ప్రశ్నపత్రాల విక్రయం ద్వారా రూ. 14 లక్షల వరకు ఆర్జించిన రేణుక అందులో రూ. 10 లక్షలను ప్రవీణ్కు ఇచ్చింది. రెండు దఫాలుగా ఈ డబ్బు అందుకున్న ప్రవీణ్ అందులో కొంత మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. అకౌంట్లో ఉన్న డబ్బును ప్రవీణ్ అరెస్టు సందర్భంలోనే అధికారులు గుర్తించారు. అదనపు కస్టడీలో భాగంగా అతన్ని విచారిస్తున్న సిట్ అధికారులు సోమవారం బడంగ్పేటలోని మల్లికార్జునకాలనీలో ఉన్న ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ లభించిన రూ. 4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ప్రశాంత్రెడ్డి, రాజేంద్రకుమార్లను అరెస్టు చేసిన సిట్ పోలీసులు... సోమవారం తిరుపతయ్యను అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించారు. వారి నుంచి మరెవరికైనా పేపర్ అందిందా అనే కోణంలో ఆరా తీయనున్నారు. గ్రూప్–1 టాపర్లకు సామర్థ్య పరీక్షలు.. గ్రూప్–1 ప్రిలిమ్స్లో 100కుపైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల్లో ఇప్పటికే 53 మందిని ప్రశ్నించిన సిట్ అధికారులు... అభ్యర్థుల సమర్ధతను పరీక్షించడానికి ఎఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తున్నారు. నిపుణులతో మరో ప్రశ్నపత్రం తయారు చేయించి వాటికి సమాధానాలు రాయించడం ద్వారా అభ్యర్థుల సమర్థతను పరీక్షిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ నుంచి వచ్చి గతేడాది గ్రూప్–1 పిలిమ్స్ రాసి 100కుపైగా మార్కులు పొందిన మరో నిందితుడైన రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్కు సిట్ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. హ్యాకింగ్ ద్వారానే... పేపర్ల లీకేజీ కేసులో అదనపు కస్టడీకి తీసుకున్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను రెండో రోజైన సోమవారం తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. ముఖ్యంగా కమిషన్ సెక్రటరీ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పి.ప్రవీణ్, మాజీ నెట్వర్క్ అడ్మిన్ ఎ.రాజశేఖర్లను లోతుగా విచారించి పేపర్ల లీకేజీ అంశంలో మరో చిక్కుముడిని విప్పారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కస్టోడియన్గా వ్యవహరిస్తున్న శంకరలక్ష్మి కంప్యూటర్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ప్రవీణ్ సిస్టం ద్వారా హ్యాక్ చేసిన రాజశేఖర్ అందులోంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్ను చేజిక్కించుకున్నట్లు తేల్చారు. -
యాక్షన్ థ్రిల్లర్
విన్ను మద్దిపాటి, స్మిరితరాణి బోర జంటగా సాయిశివన్ జంపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్రంథాలయం’. ఎస్.వైష్ణవి శ్రీ నిర్మించిన ఈ సినిమా మార్చి 3న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ను దర్శకులు బి.గోపాల్, కాశీ విశ్వనాథ్, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ట్రైలర్ రిలీజయ్యాక సినిమాపై అంచనాలు పెరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ గ్రూప్లలో మా ట్రైలర్ వైరల్గా మారింది’’ అన్నారు సాయిశివన్ జంపాన, ఎస్.వైష్ణవి శ్రీ. -
భిక్షగాడిగా మారిన మాజీ వ్యవసాయ అధికారి దీనగాథ.. 26 ఏళ్ల తరువాత న్యాయం
పాతికేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసినా.. రిటైర్డ్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు(లోన్ ఉందనే కారణంతో) ఉన్నతాధికారులు నిరాకరించారు. ఇదే సమయంలో కుమారుడి మరణం అతడిని కుంగదీసింది. తన కళ్లెదుటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెలు రోజు కూలీలుగా మారి దుర్భర జీవితాన్ని అనుభవించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై పాతికేళ్లుగా జీవచ్ఛవం అయ్యాడు. అయితే ఓ గుడి దగ్గర యాచించే సమయంలో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడుతుండడంతో ఓ భక్తుడు గుర్తించారు. ఇతని దీనస్థితిని తెలుసుకుని మదురై ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడంతో.. ఎట్టకేలకూ 26 ఏళ్ల తరువాత న్యాయం దక్కింది. సాక్షి, చెన్నై: పదవీ విరమణానంతరం తనకు రావాల్సిన నగదు మొత్తం దక్కక పోవడంతో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ అధికారి ఒకరు భిక్షగాడిగా మారాడు. ఆయన దీనగాథను తన స్నేహితుడి ద్వారా తెలుసు కున్న న్యాయవాది కోర్టు తలుపుతట్టారు. చివరికి ఆ అభాగ్యుడిపై కోర్టు కరుణ చూపించింది. ఆరు వారాల్లోపు ఆయనకు చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో కలిపి అందజేయాలని మదురై ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలు.. మదురై శివారుల్లోని ఆల యాల వద్ద గత కొన్నేళ్లుగా ఓ వృద్ధుడు భిక్షాటన చేస్తూ వచ్చాడు. ఆయన అనర్గళంగా ఆంగ్లం, తమిళ భాషాలను మాట్లాడటం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలను వల్లిస్తుండడంతో ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఇటీవల ఆయన వివరాలను ఆరా తీశాడు. అతడి దీనగాథ∙విన్న ఆ భక్తుడు తన మిత్రుడైన న్యాయవాది జిన్నాకు సమాచారం ఇచ్చాడు. చదవండి: (Bengaluru: మాంసం, మద్యం విక్రయాలు బంద్) భిక్షగాడిగా.. విచారణలో తంజావూరు జిల్లా తిరుచ్చిట్రంబలంకు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ వ్యవసాయ అధికారి గోపాల్గా గుర్తించారు. 1996లో ఈయన పదవీ విరమణ చేసిన సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలం దక్కలేదు. ఇందుకు కారణం ఆయన సహకార బ్యాంక్లో రుణం తీసుకుని ఉండడమే. అదే సమయంలో మధ్యలో చదువు ఆపేయాల్సిన పరిస్థితి రావడంతో ఆయన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గోపాల్ మానసికంగా కుంగిపోయాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి కూడా చేయలేని పరిస్థితిలో పడ్డాడు. ఆ ఇద్దరు కూలి పనులకు వెళ్తుండడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. భిక్షాటన చేస్తూ కాలం గడుపుతుండడం వెలుగు చూసింది. దీంతో ఆయనకు రావాలసిన పదవీ విరమణ మొత్తం కోసం న్యాయవాది జిన్నా మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ బెంచ్ మందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. 74 ఏళ్ల వయస్సులో గోపాల్ పడుతున్న వేదనపై కోర్టు స్పందించింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సహకారం సంఘంలో ఆయన తీసుకున్న అప్పు ప్రస్తుతం వడ్డీతో రూ. 5.37 లక్షలకు చేరినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో ఆయనకు రావాల్సిన నగదును రుణానికి జయచేయాలని, మిగిలిన సొమ్ముకు వడ్డీ లెక్కించి గోపాల్కు ఆరు వారాలలోపు చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. -
ఒక కొమ్మకు పూచిన అనుబంధం
పుట్టినింటి ప్రేమ బంధం ఎన్నేళ్లయినా దారం పోగులతో మరింత పదిలంగా అల్లుకుంటూనే ఉంటుంది. అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఆండగా ఉండే ఆప్యాయతలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ మది నిండా సంతోషాలను నింపుతూనే ఉంటుంది. రక్షగా నేనున్నానంటూ జీవితమంతా భరోసాను చూపుతూనే ఉంటుంది. ఒక కొమ్మకు పూచిన పూలను కలిపే దారమైన రాఖీ తోబుట్టువుల ప్రేమను లోకాన చల్లని పున్నమి వెలుగులుగా పంచుతూనే ఉంటుంది. ‘‘బాగున్నావా అన్నా!’’ అంటూ ఆప్యాయతల మధ్య పుట్టినింటి గడపకు వచ్చి యోగక్షేమాలను కనుక్కునేలా చేసే రాఖీ పండగ అంటే అన్నకు అమితమైన ఆనందం. ‘అంతా సంతోషమేనా చెల్లీ’ అనే అన్న పలకరింపుతో గుండె బరువును దింపేసే రాఖీ అంటే తోబుట్టువుకు సంబరమే. హంగూ ఆర్బాటాలకు చోటు లేని, ధనిక–పేద తేడా చూపని రాఖీ తమ జీవితాల్లో నింపే ఆనందం గురించి కొందరు తోబుట్టువులు పండగపూట పంచుకున్న అనుభవాలు ఇవి. కేరింగ్.. షేరింగ్ హైదరాబాద్లోనే పుట్టి పెరిగాం. పీజీ వరకు చదువుకున్న. గవర్నమెంట్ టీచర్ అవ్వాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నాకు తోడబుట్టిన అన్నదమ్ములు లేరు. మా చిన్నమ్మ కొడుకు గోపాల్ నాకు తోడబుట్టినవాడికంటే ఎక్కువ. ఏ చిన్న అవసరమైనా ‘అక్కా’ అంటూ ముందుంటాడు. తోడబుట్టిన అన్నదమ్ములు లేరనే లోటు ఎప్పుడూ అనిపించలేదు. చిన్ననాటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. స్కూల్, కాలేజీ ప్రతి చిన్న విషయం తమ్ముడితో షేర్ చేసుకోకుండా ఏ రోజూ లేదు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాఖీ కట్టడం మిస్ అవలేదు. – విజయలక్ష్మి జీవితానికి మంచి దారి ఇప్పుడు నేను బీటెక్ చేస్తున్నానంటే అక్క ఇచ్చిన సజెషన్సే. చదువులో ఎప్పుడూ సాయంగా ఉంటుంది. టెన్త్, ఇంటర్, ఆ తర్వాత బీటెక్ చేసే విషయంలోనూ అక్క గైడెన్స్ ఉంది. నాకు అవసరమైనది అమ్మనాన్నలకు చెప్పి మరీ ఒప్పిస్తుంది. నేనే విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడంలో ఆందోళన పడుతున్నట్టుగా అనిపిస్తే చాలు వెంటనే పసిగట్టేస్తుంది. ట్యూషన్స్ చెప్పి, పార్ట్ టైమ్ వర్క్స్ చేస్తుంటుంది. చదువే జీవితాలను మార్చుతుంది అని ఎప్పుడూ చెబుతుంది. ఏదైనా అవసరం ఉంటుందని, నాకే డబ్బులు ఇస్తుంటుంది. – గోపాల్ నా బాధ్యత మా అమ్మ, నాయినలు కూలీనాలీ చేసుకుని బతుకుతుండిరి. నేను ఏడో తరగతి దాగా చదివిన. నలుగురు అక్కచెల్లెళ్ల తోడ నేను ఒక్కణ్ణే. ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు ముందుగల్లనే అయిపోయినయి. అమ్మ, నాయిన చనిపోతే చెల్లెలి బాధ్యత∙నాదే అనుకున్న. మంచిగ చదువుకుని మా ఇంటికి వెలుగైంది. ఇప్పుడు నా ఇద్దరు పిల్లల చదువుల సంగతి మా చెల్లెనే చూసుకుంటోంది. నా చెల్లెలిని చూస్తే గర్వంగా, సంతోషంగా ఉంటుంది. – సాయిలు మా అన్న త్యాగం గొప్పది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో ఉంటున్నాం. మా అమ్మనాన్నలు చనిపోతే అన్నీ తానై చూసుకున్నాడు మా అన్న. కూలి పనులకు వెళుతూ నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉన్నత చదువు చదవడానికి కారణం మా అన్నయ్యే. ఎం.ఎ. బీఈడీ చేశాను. ఇప్పుడు విద్యాశాఖలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్నాను. అన్నయ్య చేతుల మీదుగానే పెళ్లి జరిగింది. ఈ రోజు నేను ఆనందంగా ఉన్నానంటే మా అన్ననే కారణం. నా కోసం అన్న చేసిన త్యాగం చాలా గొప్పది. – సరోజ కలిస్తే పండగే! రాఖీ పండగ నాడు మా అన్న మా ఇంటికైనా రావాలి. లేదంటే నేనే మా అన్న ఇంటికి వెళ్లాలి. అన్న ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. నేను ఇండ్లళ్ల పనులు చేస్త. నా పెళ్లయి పదిహేనేళ్లయినా ఏ ఒక్కసంవత్సరమూ రాఖీ కట్టుకోకుండా ఉన్నది లేదు. ఒకసారి అన్నకు ఆరోగ్యం బాగోలేకుండే. ఎంత తల్లడిల్లిననో. ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్ననో. అన్న ఉంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తది. మేం, మా అన్నపిల్లలు, మా పిల్లలు కలిస్తే చాలు ఆ రోజు మా ఇంట్ల పండగే. ఇక రాఖీ పండగ అయితే చాలు, ఆరోజు అందరం కలిసి సినిమాకు కూడా పోయేవాళ్లం. రాఖీ పండగ నాడు మాత్రం మా అన్న నాకు చీర తేకుండా రాడు. – సుమలత ఒకరికొకరం రక్ష మా సుమలత మనసు మంచిది. తన చేత్తో ఏది తీసుకున్నా నాకు మంచి జరుగుతుందని చిన్నప్పటి నుంచి నాకు నమ్మకం. మేం సదువుకున్నది లేదు. కానీ, ఒకరి కష్టంలో ఒకరం తోడుంటం. మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నం. ఊరి నుంచి దూరంగా వచ్చి బతుకుతున్నవాళ్లం, మాకు మేమే రక్షగా ఉండాలనుకుంటాం. – సురేష్ మా మామయ్యకు మా అమ్మ రాఖీ కడుతుంది. నేను మా తమ్ముడు అజయ్కి రాఖీ కడతాను. పొద్దున్నే నేనూ, తమ్ముడు కొత్తబట్టలు వేసుకుంటాం. అమ్మ స్వీట్ చేస్తుంది. నాకు చాక్లెట్స్ ఇష్టం. అమ్మనడిగితే తిడుతుంది. కానీ, రాఖీ పండగ రోజు మాత్రం పెద్ద చాక్లెట్ కొని తమ్ముడితో నాకు ఇప్పిస్తుంది. ఒకటే చాక్లెట్ కదా అందుకని సగం చాక్లెట్ను తమ్ముడికి ఇస్తాను. ఈ పండగ చాలా బాగుంటుంది. – లాస్య ఎంత పని ఉన్నా ముందుంటాడు మాది తెలంగాణలోని చేవెళ్ల. ఆశావర్కర్గా పనిచేస్తున్నాను. రాఖీ పండగ వచ్చిందంటే చాలు మా తమ్ముడు ఇంటికి రాకుండా ఉండడు. ముగ్గురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు అన్నదమ్ములం. మా శేఖర్ చిన్నవాడు. అందుకే మా కందరికీ వాడంటే కొడుకులెక్క. నాకు ముగ్గురు బిడ్డలు. అందరి బాగోగులు తెలుసుకుంటూ, ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఎంత పని ఉన్నా ‘అక్కా’ అని వచ్చేస్తడు. – అమృత రాఖీ కడితేనే ఆ ఏడాది అంతా మంచి అమ్మనాన్నలు పనికిపోతే అక్కనే నన్ను ఎక్కువ చూసుకుంది. అమ్మలెక్కనే నా బాగోగులు చూసుకుంది. హైదరాబాద్ బాలానగర్లోని ఓ హాస్పిటల్లో డేటా ఆపరేటర్గా పనిచేస్తా. మా అందరి పెళ్ళిళ్లు అయి ఎవరి కుటుంబాలు వారివి అయినా వారానికి ఒకసారైనా కలుసుకుంటం. రాఖీ పండగ వస్తే మాత్రం ఎక్కడున్నా అక్కల దగ్గరవాలిపోతా. వారి చేత రాఖీ కట్టించుకుంటేనే ఆ సంవత్సరం అంతా నాకు మంచిగ ఉంటుందని నమ్మకం. – శేఖర్ -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దవూర: విద్యుదాఘాతంతో మాజీ సర్పంచ్ మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో సోమ వారం ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామానికి చెందిన బూరుగు గోపాల్ (54) వ్యవసాయం చేస్తున్నారు. వరినాటు వేసేందుకు మడులకు తడి అందించేందుకు ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. బోరు పోయకపోవడంతో పక్కనే ఉన్న రైతు బోరును చూసేందుకు వెళ్లాడు. కాగా, పక్కనే ఉన్న బత్తాయి తోట రైతు వ్యవసాయ బోరుకు విద్యుత్ సరఫరా కోసం ఫెన్సింగ్ మీదుగా బంజరు కేబుల్ తీగను తీసుకెళ్లాడు. అప్పటికే బంజరు కేబుల్ వైరు ఎక్కడో తెగిపోయి ఫెన్సింగ్కు విద్యుత్ సరఫరా అవుతోంది. గోపాల్ పొలం గట్టుపై నుంచి వెళ్తూ కాలు జారి ఫెన్సింగ్పై పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. గోపాల్ గతంలో శిర్సనగండ్ల పంచాయతీకి సర్పంచ్గా పనిచేశారు. -
నాన్నా! నేనున్నాను!!
‘‘నాన్నా! నీకు కొడుకుల్లేరని దిగులు వద్దు. నేనే కొడుకుని’’ ఈ డైలాగ్ సినిమాల్లో చూస్తుంటాం. కేరళలోని శ్రీదేవి ‘‘నాన్నా! నీకు కొడుకుని నేనే’’ అని అనట్లేదు. కానీ ‘‘నాన్నా! నేనున్నాను’’ అని తండ్రికి భరోసా ఇచ్చింది. లాక్డౌన్లో ఇంటికి ఆసరా అయింది. శ్రీదేవి గోపాలన్కి పాతికేళ్లు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, బీఈడీ ఫైనల్ ఇయర్లో ఉంది. ఈ వేసవి గడిస్తే టీచర్గా ఉద్యోగం సంపాదించుకోవచ్చు... అనుకుంది. కరోనా లాక్డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆమె తండ్రి గోపాలన్ కొబ్బరి చెట్ల నుంచి కాయలు దింపుతాడు. ‘‘ఆ సంపాదనతో ముగ్గురి కూతుళ్లను పెంచి పెద్ద చేయడం, కాలేజీ చదువులు చదివించడం చిన్న విషయం కాదు. అయినా సరే... మా నాన్న ఏనాడూ తనకు పుట్టింది కూతుళ్లు మాత్రమే. కొడుకులు లేరు... అని బెంగ పడలేదు. ముగ్గురినీ చదివిస్తున్నాడు. అలాంటిది ఈ లాక్డౌన్ కాలం ఆయనను మానసికంగా కుంగదీసింది. వయసు పెరగడం, లాక్డౌన్ మొదటినెలల్లో ఎవరూ పనికి పిలవలేదు. చేతిలో పని లేకపోవడం, ఇంటి ఖర్చులేవీ తప్పక పోవడంతో బాగా ఆందోళనకు గురయ్యారు. అమ్మతో ‘కొడుకు ఉండి ఉంటే... చేదోడుగా ఉండేవాడు’ అన్నాడు. ఆ మాటతో నా మనసు కదిలిపోయింది. ‘‘కొబ్బరి కాయలు దించడానికి నేను కూడా వస్తాను నాన్నా’’ అంటే ఒప్పుకోరని తెలుసు. అందుకే అమ్మానాన్నలకు చెప్పకుండా యూ ట్యూబ్లో కొబ్బరి చెట్టు ఎక్కడం, కాయలు దింపడం చూశాను. కొబ్బరి చెట్లు ఎక్కడానికి ఉపయోగించే సాధనాలను మా చెల్లెళ్లు ఆన్లైన్లో బుక్ చేశారు. ఆ సాధనంతో నేను స్వయంగా కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకున్నాను. పని కూడా వెతుక్కున్నాను. ఒక చెట్టు నుంచి కాయలు దింపితే నలభై రూపాయలు వస్తాయి. రోజుకు ఇరవై చెట్ల పని ఉంటుంది. నేను పనికి వెళ్లడం చూసి నాన్న తాను కూడా నాతో వస్తానన్నారు. చెట్టు మీద ఎక్కువ సేపు స్థిరంగా ఉండడం, కోత దశకు వచ్చిన కాయలను గుర్తించడం నేర్పించారు నాన్న. ఈ పనితో మా ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయి. కానీ అమ్మ మాత్రం చాలా బాధ పడుతోంది. ‘ఇంత చదివించింది చెట్లెక్కి కొబ్బరి కాయలు కోయడానికా’ అని ఒకరు, ‘నువ్వు కన్నది కూతుర్ని... ఆడపిల్ల చేసే పనులేనా ఇవి’ అని మరొకరు బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు రకరకాలుగా దెప్పుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు నాన్న ‘‘నా కూతుర్ని చూస్తే గర్వంగా ఉంది. నా కూతురి చేతికింద పని చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉంద’’న్నారు. కోవిడ్ చాలా నేర్పిస్తోంది కోవిడ్ మనలో దాగి ఉన్న చాలా నైపుణ్యాలను వెలికి తీస్తోంది. మనల్ని మనం పోషించుకోవడానికి మన ఎదురుగా ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తాం. కొబ్బరి కాయలు కోయడంతో వచ్చిన డబ్బు ఇంటి ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో సెకండ్ హ్యాండ్ ఆటో కొన్నాం. కాయల రవాణా కూడా చేస్తున్నాం. నాన్నకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను నాన్న దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నాను. కోవిడ్ మహమ్మారి ఇంతలా జీవితాల మీద దాడి చేయకపోయి ఉంటే... బీఈడీ తర్వాత టీచర్ ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నించేదాన్ని. నేను ఇన్ని పనులు చేయగలుగుతాననే విషయం ఎప్పటికీ తెలిసేది కాదు కదా’’ అని నవ్వుతోంది శ్రీదేవి. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా స్పందించడం అంటే ఇదే. ‘పాజిటివ్’ అనే పదమే భయపెడుతున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి పాజిటివ్ దృక్పథం అవసరం. అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికైనా, జీవికను గాడిలో పెట్టుకోవడానికైనా. అమ్మానాన్న, చెల్లెళ్లతో శ్రీదేవి -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
కవాడిగూడ: బంధువుల పెండ్లికి వచ్చిన పలువురు ముంబై వాసులు లాక్డౌన్ కారణంగా నగరంలోనే ఇరుక్కుపోయారు. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయి తమది కాని రాష్ట్రంలో బిక్కుబిక్కుమంటూ ఓ పూట తింటూ ఓ పూట పస్తులుంటున్న వారు సాయం కోసం కనపడిన వారినందరినీ ప్రాధేయపడ్డారు. ఈ విషయం కాస్తా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి రావడంతో.. నేనున్నాంటూ ఆయన వారికి భరోసా ఇచ్చారు. వారిని మహారాష్ట్ర తరలించేందుకు తన సొంత డబ్బు లక్ష రూపాయలతో ఏర్పాట్లు చేశారు. ఇందుకు అనుమతివ్వాలంటూ ఉన్నతాధికారులతో మాటాడి వారి స్వస్థలాలకు పంపి మానవత్వాన్ని చాటుకున్నారు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్. పార్శిగుట్టకు చెందిన సత్యనారాయణ, సృజన దంపతుల కుమారుడి వివాహం మార్చి 19న జరిగింది. వివాహానానికి ముంబై నుంచి 30 మంది దాకా వచ్చారు. అనంతరం 30 మందిలో పదిమంది ముంబైకి వెళ్లిపోగా 20 మంది సిటీని వీక్షించి 23న వెళ్లేందుకు ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నారు. మార్చి 22న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో వారు ఇక్కడే చిక్కుకుపోయారు. ఇక్కడే ఓ కిరాయి ఇంటిలో ఉంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. స్పందించిన ఆయన వారు ముంబై వెళ్లేందుకు అయ్యే ఖర్చు లక్ష రూపాయలను భర్తిస్తానని, ఇందుకు అనుమతులివ్వాడంటూ కలెక్టర్ను కోరారు. తక్షణం అధికారులు స్పందించడంతో ఈ నెల 4న (సోమవారం) వారు ఇక్కడ నుంచి ముంబైకి వెళ్లారు. దేవుడిలా తమను ఆదుకున్న ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామంటూ వారు భావోద్వేగంతో ముఠా గోపాల్కు కృతజ్ఞలు తెలిపారు. -
అతని వయస్సు 19 ఏళ్లే కానీ..
పాట్నా: బీహార్కు చెందిన 19 ఏళ్ల గోపాల్ జీ అతి చిన్న వయస్సులోనే అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. భాగల్పూర్ జిల్లాకు చెందిన గోపాల్కు నాసా ఆహ్వానం లభించింది. అమోఘమైన తెలివితేటలతో రెండు పేటెంట్ల (మేథోసంపత్తి హక్కుల)ను గోపాల్ సాధించాడు. సమాజానికి సేవ చేయడానికి తన ఆవిష్కరణలు ఉపయోగపడాలన్నదే తన ఆకాంక్షగా అతడు పేర్కొన్నాడు. తండ్రి రంజన్ కున్వర్ సాధారణ రైతు అని, కుటుంబ పరిస్థితులను అధిగమించి ఉన్నత చదువులు అభ్యసించినట్లు తెలిపాడు. గోపాల్ గొప్ప ఆవిష్కర్తగా, పరిశోధకుడిగా, డిజిటల్ విద్యా సంస్థల బ్రాండ్ అంబాసిడర్గా, ప్రేరణ కలిగించే ఉపన్యాసాలతో సమాజానికి తన సేవలను అందిస్తున్నాడు. గోపాల్ ప్రస్తుతం డెహ్రాడున్లోని గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ చదువుతున్నాడు. అరటి, బయో కణాలకు సంబంధించిన ప్రయోగాలు సఫలం కావడంతో గోపాల్ రెండు పేటెంట్లు పొందాడు. అతడి ప్రతిభకు మెచ్చి తైపీ ఎగ్జిబిషన్లో 10 దేశాలకు చెందిన 30 స్టార్టప్ కంపెనీలు అతడిని ఆహ్వానించాయి. 2017లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసానని, ఆయనతో పది నిముషాలు మాట్లాడినట్లు గోపాల్ తెలిపాడు. మోదీతో మాట్లాడాక సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని సందర్శించానని, తరువాత తనను అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) కు పంపించారని..అక్కడ మూడు ఆవిష్కరణలు చేసినట్లు తెలిపాడు. అరటి ఆకు ఆవిష్కరణకు గాను తనకు ఇన్స్పైర్ అవార్డు లభించిందని గోపాల్ పేర్కొన్నాడు. -
ఘరానా మోసం
లేదు సర్. తమ్ముడి మీద నమ్మకంతో వాటిని తీసుకున్నాను. వాట్సాప్లూ, ఫొటోలూ లేనప్పుడు ఇదే పద్ధతిలో మా మధ్య నగల మార్పిడి జరిగేది. ప్రతిసారీ ఆ బంటిగాడే వచ్చి నగలు తీసుకెళ్లేవాడు. ఈసారీ అలాగే జరిగింది. గోపాల్ సే తన కారులోంచి దిగి కంగారుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లాడు. నేరుగా ఎస్సై రమేష్ కుమార్ దగ్గరకు వెళ్లాడు. ఎస్సైగారూ! ఎలాగైనా మీరే కాపాడాలి. దారుణంగా మోసపోయాను. మీరు నన్ను కాపాడకపోతే నాకు ఆత్మహత్యే దారి.ఆ మాటలు వినగానే కుమార్ షాక్ అయ్యాడు. ఎప్పుడూ హుందాగా, ఠీవిగా దర్పాన్ని ప్రదర్శించే గోపాల్ సేఠేనా ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు. ‘‘గోపాల్ సే గారూ! ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? రండి. ముందు కూర్చోండి. తాగడానికి ఏమైనా తీసుకుంటారా?’’ అన్నాడు.‘‘ఏమీ వద్దు ఎస్సైగారూ! ముందు నా కంప్లైంట్ తీసుకోండి.. ప్లీజ్..!’’‘‘సరే చెప్పండి. ఏం జరిగింది?’’ అడిగాడు ఎస్సై.గోపాల్ సే పూర్వీకులది కలకత్తా. చాలా ఏళ్ల కిందటే వాళ్ల నాన్న ఇంట్లో గొడవ పడి హైదరాబాద్ వచ్చి నార్తిండియన్లు ఎక్కువగా ఉండే గాంధీనగర్ ఏరియాలో నగల దుకాణం పెట్టాడు. అది దినదినాభివృద్ధి చెంది ఆ ఏరియాలో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే వాళ్లకు మంచి సంపాదన తెచ్చి పెట్టింది. వాళ్ల నాన్న చనిపోయిన తర్వాత గోపాల్ సేదాన్ని మరింత అభివృద్ధిలోకి తెచ్చాడు. ఆ ఏరియాలో మిగిలిన అన్ని నగల దుకాణాల కన్నా గోపాల్ సే దుకాణానికి గ్లామరెక్కువ. సిటీలో ఒక పెద్ద మల్టీ ఫ్లోర్ జ్యువెలరీ షాపు ఓపెన్ చేయాలనేది అతని ఆశ. అతని బంధువులంతా కలకత్తాలోనే ఉంటారు. అందరూ జ్యువెలరీ బిజినెస్లోనే ఉన్నారు. అక్కడి వాళ్లకు ఇతను డిజైన్లు పంపడం, అక్కడి డిజైన్లు వాళ్లు ఇతనికి పంపడం ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది.ఎస్సై రమేష్కుమార్ ఈ మధ్యనే నిజామాబాద్ నుంచి గాంధీనగర్ పోలీస్స్టేషన్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. అతని భార్య అంటే అతనికి ఎనలేని ప్రేమ. ఆమె కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడు. మొన్నామధ్య డీజీపీ ఇంట్లో జరిగిన వేడుకలో డీజీపీ భార్య వేసుకున్న నెక్లెస్ రమేష్కుమార్ భార్యకి తెగ నచ్చేసింది. వచ్చే నెలలో జరగబోయే పోలీస్ గెట్ టుగెదర్ పార్టీకి అలాంటిదే కావాలని పట్టుబట్టింది. ఎంక్వైరీ చేస్తే అది గోపాల్ సే షాపు డిజైన్ అని తేలింది. భార్యను వెంటబెట్టుకొని షాపుకెళ్లాడు. ఆ డిజైన్ అయిపోయిందని, అటువంటిది తయారు చేయాలన్నా ఇంకో మూడునెలల టైమ్ పడుతుందని గోపాల్ సేచెప్పాడు. ఇంకో ఖరీదైన నెక్లెస్ చూపించి, ‘ఇది తీసుకోండి. లేటెస్ట్ డిజైన్. నిన్ననే డీజీపీగారి వైఫ్ వచ్చి నెక్ట్స్ మంత్ ఏదో పార్టీ ఉందని దీనిని తీసుకెళ్లారు’’ అని చెప్పాడు. ఆ మాట వినగానే రమేష్కుమార్ భార్య కళ్లు మెరిశాయి. తనకు అది కావాల్సిందేనని ఆమె చూపుతోనే రమేష్కుమార్కి అర్థమైంది. ధర ఎంతని అడిగితే, ‘జస్ట్ యాభై లక్షలే’ అని చెప్పాడు గోపాల్ సే. ధర వినగానే రమేష్కుమార్ గుండె అదిరిపోయింది. ‘‘ఏంటీ యాభై లక్షలే’’ అంటూ నోరెళ్లబెట్టాడు. ‘‘ఔను సర్! ప్యూర్ గోల్డ్. ఫైన్ కటింగ్ డైమండ్స్...’’ అంటూ ఏవేవో చెబుతున్నాడు గోపాల్ సే. కానీ అవేవీ వినకుండా రమేష్ కుమార్ ఏదో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇది కొనివ్వకపోతే భార్య పెట్టే టార్చర్ను తట్టుకోలేడు. ఈసారి ఎన్ని నెలలు ఫుడ్డు, బెడ్డు కట్ చేస్తుందోనని అతని భయం. ఆ నెక్లెస్ను ఎలా దక్కించుకోవాలా అనే ఆలోచనలో పడ్డాడు.ఇంతలో గోపాల్ సే, ‘‘ఎస్సైగారు! మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైంది. డీజీపీగారంటే పెద్దోళ్లు. వాళ్ల లెవలూ, వాళ్ల మెయిన్ ఇన్కమ్మూ, సైడ్ ఇన్కమ్మూ వేరే. మనమా వాళ్లతో పోటీ పడలేం. కానీ పడాలని కోరిక. సరే, అదంతా పక్కన పెట్టండి. మీరు నాకో సాయం చేస్తే మీకు ఇలాంటివి బోలెడు మీకు సగం రేటుకే అందుతాయి. అలాగే మీకొచ్చే మామూలు మీకు ఎలాగూ అందుతూనే ఉంటుంది. ఇంతకీ మీరు చేయాల్సిందల్లా బయట నుంచి నాకు వేరే దారిలో వచ్చే బంగారాన్ని అడ్డుకోకుండా ఉండటమే.. అంటే మీరు ఈ ఏరియాకి కొత్తగా వచ్చారు. చెప్పడం నా బాధ్యత. అయినా ఇవన్నీ మీకు తెలియనివి కావులెండి..’’ అంటూ నసుగుతూ అన్నాడు.రమేష్ కుమార్ కొద్దిసేపు మౌనంగా ఉండి, ‘‘సరే, ఆ నెక్లెస్ ప్యాక్ చేసి ఇంటికి పంపండి’’ అని వెళ్లిపోయాడు. అలా వాళ్ల మధ్య స్నేహం మొదలైంది.ధన్ తెరాస్ కోసం గోపాల్ సే పెద్ద ఎత్తున కొత్త డిజైన్లు చూపిస్తున్నాడు. అప్పుడే కలకత్తాలో ఉండే అతని బాబాయి కొడుకు శ్యామ్లాల్ తను చేసిన కొత్త డిజైన్ల ఫొటోలను వాట్సాప్ చేయమని అడిగాడు. గోపాల్ సేఆ ఫొటోలను అతనికి పంపాడు. వెంటనే శ్యామ్లాల్ ఫొటోస్లో చిన్న చిన్న డిజైన్స్ సరిగా కనపడటం లేదని, ఒకప్పట్లా పాత పద్ధతిలోనే వాటిని తనకు పంపాలని వాటిని చూసి తను నగలు చేసిన తర్వాత తిరిగి పంపిస్తానని, అవి తిరిగి వచ్చే వరకు అంతే విలువ గల నగలను వాటికి బదులు పంపిస్తానని, బంటీ వాటిని తీసుకుని వచ్చే శుక్రవారం మీ దగ్గరకొస్తాడని వాట్సాప్లో మెసేజ్ పంపాడు. దానికి గోపాల్ సే ‘ఓకే’ అంటూ బదులిచ్చాడు.బంటి శ్యామ్లాల్ దగ్గర చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. చాలా నమ్మకస్తుడు. శ్యామ్లాల్ ఇచ్చిన నగలతో బంటి శుక్రవారం గోపాల్ సేవద్దకొచ్చాడు. బంటి ఇచ్చిన నగలు తీసుకుని, తన కొత్త డిజైన్లను అతనికి ఇచ్చి పంపించాడు గోపాల్ సేవారం గడిచిపోయింది. ధన్ తెరాస్కు మరో వారం రోజులే ఉంది. శ్యామ్లాల్ నుంచి ఎలాంటి కబురూ రావట్లేదు. గోపాల్ సే శ్యామ్లాల్కి ఫోన్ చేశాడు. అటువైపు నుంచి వచ్చిన సమాధానానికి గోపాల్ సేకొయ్యబారిపోయాడు.అసలు తాను డిజైన్ల కోసం ఏ నగలూ అడగలేదని, అయినా బంటి తన దగ్గర పని మానేసి రెండు వారాలు అవుతోందని శ్యామ్లాల్ అన్నాడు. పైగా, ‘‘ఏంటి అన్నయ్యా! నా మీద ఏదో కుట్ర పన్నుతున్నట్టున్నావు. అన్నయ్యా జాగ్రత్త! అక్కడ నువ్వెంతో ఇక్కడ నేనూ అంతే’’ అని ఫోన్ కట్ చేశాడు.గోపాల్ సేకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే కలకత్తాకు బయలుదేరాడు. శ్యామ్లాల్ షాపులోకి అడుగు పెడుతూనే షాక్ అయ్యాడు. గోపాల్ సే తయారు చేసిన డిజైన్లన్నీ షోకేసుల్లో పెట్టి ఉన్నాయి. ‘‘ఏంటి తమ్ముడూ నన్ను నగలు అడగలేదన్నావు. మరి ఈ డిజైన్లు ఎవరివి?’’‘‘అవి నా డిజైన్లే’’ అని దబాయించాడు శ్యామ్లాల్. గోపాల్ సేకు చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరికీ మాటా మాటా పెరిగి గొడవ పెద్దదయింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి గోపాల్ సేని అరెస్టు చేశారు. రెండు రోజుల తర్వాత విడుదలై, నేరుగా హైదరాబాద్ చేరుకున్నాడు.జరిగినదంతా చెప్పి ‘‘తమ్మడు ఇలా చేస్తాడనుకోలేదు ఎస్సైగారూ! వీటి విలువ పది కోట్లు. ధన్ తెరాస్ వస్తోంది కదా అని సేల్స్ ఎక్కువవుతాయని అప్పు చేసి మరీ వాటిని తయారు చేయించాను. ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి. లేకపోతే ఆత్మహత్యే గతి’’ అంటూ భోరుమన్నాడు. ‘‘ఊరుకోండి గోపాల్ సేగారు! చిన్నపిల్లాడిలా ఏడిస్తే ఏం లాభం? ముందు ఈ మంచినీళ్లు తాగండి’’ అంటూ గ్లాస్ అందించాడు. ‘‘అయినా మీ దగ్గర మీ తమ్ముడు ఇచ్చిన అంతే విలువ గల నగలు ఉన్నాయి కదా!’’ అని ఎస్సై అనగానే..‘‘అయ్యో! నా ఖర్మ సార్.. ఖర్మ.. అవి నకిలీవి’’ అంటూ నెత్తికొట్టుకుంటూ మళ్లీ ఏడుపు లంకించుకున్నాడు గోపాల్ సే‘‘అదేంటి తీసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోలేదా?’’‘‘లేదు సర్. తమ్ముడి మీద నమ్మకంతో వాటిని తీసుకున్నాను. వాట్సాప్లూ, ఫొటోలూ లేనప్పుడు ఇదే పద్ధతిలో మా మధ్య నగల మార్పిడి జరిగేది. ప్రతిసారీ ఆ బంటిగాడే వచ్చి నగలు తీసుకెళ్లేవాడు. ఈసారీ అలాగే జరిగింది.’’ ‘‘మరి కలకత్తా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా?’’‘‘ఏంటి ఎస్సైగారు! అన్నీ తెలిసిన మీరే ఇలా అడిగితే ఎలా? అది వాడి ఏరియా సర్. నేను కంప్లైంట్ చెయ్యక ముందే నన్ను అరెస్టు చేయించినవాడు. నేను కంప్లైంట్ చేస్తే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే సత్తా ఉన్నవాడు. అందుకే నేను డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాను. మీ పోలీసు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలాగైనా మీరు వాటిని నాకు దక్కేలా చూడండి. మీకు వచ్చేది మీకు వచ్చేలా చేస్తాను’’ అని ఎస్సై రమేష్కుమార్ చేతులు పట్టుకుని బతిమాలాడు.‘‘సరే గోపాల్ సే గారు! మీరు బాధపడకండి. ప్రాబ్లమ్ నాకు క్లియర్గా అర్థమైంది. వాటిని మీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది. నాకు ఇవ్వాల్సింది మాత్రం మర్చిపోకండి. మీ ఫోన్ ఇచ్చి వెళ్లండి. అలాగే బంటీ ఫోన్ నంబర్ కూడా’’‘‘అలాగే సర్. మీ మీద నమ్మకంతో ఈ ఒక్కరోజన్నా నేను ప్రశాంతంగా నిద్రపోతాను’’ అని గోపాల్ సేవెళ్లిపోయాడు. గోపాల్ సే ఫోన్ చెక్ చేసి, అతను, అతని తమ్ముడు చేసిన వాట్సాప్ చాట్ చెక్ చేశాడు ఎస్సై రమేష్ కుమార్. అంతా గోపాల్ చెప్పినట్లే ఉంది. క్లూస్ టీమ్కి ఆ నంబర్ ఇచ్చి, గోపాల్ సేకి, శ్యామ్లాల్కి జరిగిన ఫోన్ సంభాషణలను రిట్రీవ్ చేసి విన్నాడు. అంతా గోపాల్ సే చెప్పినట్లే కరెక్ట్గా ఉంది. గోపాల్ సే ఇంటి నుంచి నకిలీ నగలను హ్యాండోవర్ చేసుకున్నాడు. కలకత్తాలో తనకు తెలిసిన కానిస్టేబుల్ చేత శ్యామ్లాల్ షాపులో ఉండే నగల ఫొటోలు తీయించి, వాటిని గోపాల్ సే వాట్సాప్లో పంపిన ఫొటోస్తో పోల్చి చూసుకున్నాడు. అవి కూడా మ్యాచ్ అయ్యాయి. ఇక ఒకే ఒక్క విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. అది బంటీగాడి వాంగ్మూలం. శ్యామ్లాల్ ఇదంతా చేయించాడని బంటి చెబితే సరిపోతుంది. జాక్పాట్ కొట్టినట్టే. పదికోట్ల విలువ చేసే నగలు రికవరీ చేసుకోవచ్చు. తనకు వచ్చే కమీషన్ కూడా భారీగానే ఉంటుంది అని మనసులో సంతోషించాడు.మర్నాడు డీజీపీకి కేసు వివరించి, ‘‘సర్! బంటీ అరెస్టుకు కావలసిందల్లా కలకత్తా పోలీసుల పర్మిషన్. వాడు అక్కడే ఉన్నట్లు సెల్ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేశాం. మీరు వాళ్లతో మాట్లాడి పర్మిషన్ తెప్పిస్తే మిగిలినదంతా నేను చూసుకుంటాను’’ అని చెప్పడంతో ‘‘గో అహెడ్’’ అన్నాడు డీజీపీ.మర్నాడే కలకత్తా పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. ఎస్సై రమేష్కుమార్ టీమ్ కలకత్తా వెళ్లి బంటీని అరెస్టు చేసి, హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇంటరాగేషన్లో ఇదంతా శ్యామ్లాలే చేయించాడని చెప్పాడు వాడు. రేపు వాణ్ణి కోర్టులో హాజరుపరచి, జడ్జి ఎదుట ఇదే మాట అనిపిస్తే బంటీగాడు జైలుకి, లక్షల కమీషన్ తన జేబులోకి అంటూ కలల్లో తేలిపోసాగాడు రమేష్కుమార్. ఇంటికెళ్లి భార్యతో ఇదే విషయం చెబితే ఆమె సంతోషంతో అతణ్ణి వాటేసుకుంది. రాత్రంతా వాళ్లు కలల్లో తేలిపోతూ గడిపారు.తెల్లారుజామున కాస్త కునుకుపడుతుండగా రమేష్కుమార్కు డీజీపీ నుంచి ఫోన్ వచ్చింది. చిరాగ్గా ఫోన్ ఎత్తి ‘‘చెప్పండి సర్.’’ అన్నాడు.‘‘ఏమైందా..? చేసిందంతా చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావా? తొందరగా వెళ్లి ఆ గోపాల్ సేని అరెస్టు చేసి స్టేషన్కి తీసుకురా. నేను స్టేషన్కు వస్తున్నా’’ అని ఫోన్ కట్ చేశాడు. ఎస్సై రమేష్ కుమార్కు నిద్రమత్తంతా వదిలిపోయింది. హడావుడిగా గోపాల్ సే ఇంటికెళ్లి అతణ్ణి అరెస్టు చేసి, స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. స్టేషన్ కేబిన్లో కూర్చుని ఉన్నాడు డీజీపీ. రమేష్ కుమార్ అప్పుడే లోపలకు అడుగు పెట్టాడు. అతణ్ణి చూస్తూనే ‘‘రావయ్యా రా.. నీ కోసమే ఎదురు చూస్తున్నా’’ అన్నాడు.‘సర్ అసలేం జరిగింది? నాకేమీ అర్థం కావడం లేదు. గోపాల్ సేని ఎందుకు అరెస్టు చేసినట్లు?’’ అన్నాడు.‘‘గోపాల్ సే పెద్ద జాదూగాడయ్యా. ఆ నగలు గోపాల్ సేవి కాదు. శ్యామ్లాల్వే. శ్యామ్లాల్ దగ్గర పనిచేసే బంటీగాడికి డబ్బు ఆశ చూపి తనవైపు తిప్పుకున్నాడు. బంటీగాడు ఆ నగలు సేఫ్ హౌస్లో ఉండగానే వాటిని శ్యామ్లాల్ ఫోన్ దొంగిలించి, దాంతో ఫొటోలు తీసి గోపాల్సేకి పంపించాడు. తర్వాత అవి డిలీట్ చేశాడు. తర్వాత ఆ నంబర్ నుంచి బంటీగాడు శ్యామ్లాల్లాగ నగలు అడగడం, ఇక్కడ గోపాల్ సే శ్యామ్లాల్ నంబర్కి ఫోన్చేసి పంపడం.. ఇలా వద్దని బంటీ చేత తనకు నగలు పంపించాలని బంటీగాడే శ్యామ్లాల్లా మెసేజ్లు పంపడం .. తర్వాత బంటీ శ్యామ్లాల్ దగ్గర పని మానేయడం.. ఇదంతా వాళ్ల ప్లాన్లో భాగమే.. ఇక్కడ నీతో పరిచయం కూడా వాడి మాస్టర్ ప్లాన్లో భాగమే. వాడి తర్వాతి స్టెప్ను నువ్వు కంప్లీట్ చేశావు. బంటీగాడి ఫోన్ ఆన్లో ఉంచుకోమని చెప్పి, దాని ద్వారా నువ్వు అతన్ని పట్టుకున్నప్పుడు శ్యామ్లాలే ఇదంతా చేయించాడని చెప్పడం కూడా అతని ప్లాన్లో భాగమే. వాడు జైలుకెళ్తే తర్వాత వాణ్ణి బెయిల్పై బయటకు తెచ్చే బాధ్యత తనదేనని గోపాల్ సేవాడికి ముందుగానే మాట ఇచ్చాడు.’’ఇదంతా విన్న ఎస్సై రమేష్ నిర్ఘాంతపోయాడు. తన పక్కనే ఉంటూ తనకు తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ వేశాడా.. అనుకున్నాడు.ఇక కేసు ఎలా ఛేదించాడో డీజీపీ చెప్పసాగాడు. ‘‘ఇక్కడ గోపాల్సేకి నువ్వెలా దోస్తువో, అక్కడ శ్యామ్లాల్కి కూడా పోలీసుల్లో ఒక దోస్తు ఉన్నాడు. మనం బంటీ అరెస్టుకు పర్మిషన్ అడిగినప్పుడు అక్కడి పోలీసులు శ్యామ్లాల్ ఫోన్ హ్యాండోవర్ చేసుకుని, ఫోరెన్సిక్ టీమ్తో క్రాస్ చెక్ చేయించారు. బంటీగాడు శ్యామ్లాల్ ఫోన్ నుంచి గోపాల్సే కి పంపి, డిలీట్ చేసిన ఫొటోలను కూడా రిట్రీవ్ చేశాడు. అవి బయటపడటంతో గోపాల్ సే, బంటీ కుమ్మక్కై వేసిన మాస్టర్ప్లానేనని అర్థం చేసుకున్నాడు. శ్యామ్లాల్ కలకత్తా కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మీద అక్కడి పోలీసులు ఇక్కడకు వచ్చారు. సెల్లో ఉన్న బంటీగాడిని కలకత్తా స్టైల్లో ఇంటరాగేట్ చేయడంతో నిజం కక్కాడు’’ అని వివరించాడు. ‘‘వాళ్లు ముందే వచ్చారు కాబట్టి సరిపోయింది. మనం బంటీగాడిని జడ్జి ముందు పెట్టి, శిక్షపడేలా చేశాక వచ్చి ఉంటే మన ఉద్యోగాలకే ఎసరొచ్చేది’’ అంటూ ఎస్సై రమేష్కుమార్కి చీవాట్లు పెట్టాడు. ఎం.శంకర్ రామమూర్తి -
ప్రేమామృతం
బడినుంచి వచ్చిన దగ్గరనుంచి ముఖం వేలాడేసుకుని ఉన్న గోపాల్ను దగ్గరకు తీసుకుని ‘ఏం జరిగింది కన్నా? ఎందుకలా ఉన్నావు’ అని బుజ్జగింపుగా అడిగింది అమ్మ. ‘మరేం లేదమ్మా, ఆదివారం నాడు మా బడిలో పిల్లలందరినీ వనభోజనాలకు తీసుకు వెళ్తున్నారు. అందరినీ తలా రెండు రకాల పదార్థాలను తీసుకురమ్మన్నారు మాస్టారు. అందరూ రకరకాల తినుబండారాలు తీసుకు వస్తామన్నారు. మరి నేను ఏమి తీసుకు వెళ్లాలి? ఎలా తీసుకు వెళ్లాలి...’’ అని వెక్కసాగాడు. ‘‘ఓస్, ఇంతేనా! నువ్వు కూడా రుచికరమైన తినుబండారాలు తీసుకు వెళుదువుగానీ. నువ్వేమీ దిగులు పడకు కన్నా’’ అని సముదాయించింది అమ్మ. భర్త తీసుకు వచ్చే జీతం రాళ్లకు తోడు ఇంటి ముందున్న స్థలంలో కూరగాయలు, పండ్ల చెట్లు పెంచి వాటితో గుట్టుగా ఇల్లు నడుపుకొస్తూన్న ఆమె ఏం చేయాలా అని ఆలోచిస్తూ పెరటిలోకి వచ్చింది. అరటి, సపోటా, జామ, దానిమ్మ పండ్ల చెట్లు ప్రేమగా తనను పలకరిస్తున్నట్లుగా తలలు ఊగిస్తున్నాయి. తమ కొమ్మల్లో దాచుకున్న పండ్లను తినమన్నట్లు చూస్తున్నాయి. ఏదో ఆలోచన వచ్చినదానిలా ఆ చెట్లను ఆప్యాయంగా నిమురుతూనే పండ్లు కోసింది.వాటిని ముక్కలుగా తరిగింది. ఇంతలోనే ఆమెకు మా ప్రేమను పిండుకోవా అన్నట్లుగా వేపచెట్టు కొమ్మలలోనుంచి తొంగి చూస్తున్న తేనెపట్టు కనిపించింది. తంటాలు పడి ఆ తేనెపట్టు దింపింది. పట్టునుంచి పిండిన తేనెను పండ్ల ముక్కల మీద పోసింది. ముందురోజు నానపెట్టి ఉంచిన పెసరపప్పును వడకట్టి, దానిలో సన్నగా తరిగిన కేరట్, కీరదోస ముక్కలను, కొబ్బరి కోరును కలిపి చారెడు ఉప్పు వేసి, నిమ్మరసం పిండింది. తాటిమట్టలతో తయారు చేసిన రెండు దొన్నెలలో వాటిని నింపి పైన బాదం ఆకులతో కప్పేసి, కొబ్బరి ఈనెలతో వాటి మూతులను కుట్టేసింది. ‘ఇక తీసుకు వెళ్లు’ అన్నట్లుగా గోపాల్ వైపు చూసింది ప్రేమగా. గోపాల్ సంకోచంగానే వాటిని అందుకుని వనభోజనాలకు వెళ్లాడు. అక్కడ ఆటపాటలు, క్విజ్ పోటీల తర్వాత కాళ్లూ చేతులు కడుక్కొని వచ్చి చెట్ల నీడన భోజనాలకు కూర్చున్నారు పిల్లలు. అందరూ తాము తెచ్చిన వాటి మూతలు తెరిచి చూపిస్తుంటే, గోపాల్ మాత్రం బెరుకు బెరుకుగా తను తెచ్చిన దొన్నెలను వెనకాల దాచుకుంటున్నాడు. మాస్టారు అది గమనించారు.గోపాల్ నుంచి ఆ దొన్నెలను అందుకున్నారు. ముందు తాను రుచి చూశారు. చాలా బాగున్నాయి. మీరు కూడా తినండంటూ అందరికీ గోపాల్ తెచ్చిన పదార్థాలను తానే స్వయంగా పంచారు. లొట్టలు వేసుకుంటూ తిన్నారందరూ. తల్లి ప్రేమను రంగరించి మరీ పోషకాలు ఉన్న పదార్థాలు తెచ్చాడని మెచ్చుకుని మంచి బహుమతి ఇచ్చారు. డబ్బు అన్ని పనులూ చేయలేదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
‘నక్కీరన్’ గోపాల్ అరెస్టును తప్పుబట్టిన మద్రాస్ కోర్టు
సాక్షి, చెన్నై : ప్రముఖ జర్నలిస్ట్ ‘నక్కీరన్’ గోపాల్కు మద్రాసు హైకోర్టు ఊరట కల్పించింది. గోపాల్కు రిమాండ్ విధించడానికి నిరాకరించి తమిళనాడు ప్రభుత్వానికి, చెన్నై పోలీసులకు గట్టి షాక్ ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ గురించి తప్పుడు కథనం రాశారంటూ ‘నక్కీరన్’ గోపాల్ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్ ప్రతిష్టను దిగజార్చేవిధంగా గోపాల్ అసత్య కథనాలు రాశారంటూ రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో చెన్నై ఎయిర్పోర్టులో ఆయనను అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆయనపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను తప్పుపట్టిన మద్రాసు కోర్టు గోపాల్కు రిమాండ్ విధించేందుకు నిరాకరించింది. కాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పేరు తెచ్చుకున్న గోపాల్ ప్రస్తుతం తమిళ మ్యాగ్జైన్ ‘నక్కీరన్’కు ఎడిటర్- ఇన్- చీఫ్గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ నిర్మాలా దేవికి సంబంధించిన కథనాలను ఈ మ్యాగజీన్ ప్రముఖంగా ప్రచురించింది. ఎక్కువ మార్కులు రావాలంటే విద్యార్థినులు ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ నిర్మలా దేవీ వారిని వ్యభిచారంలోకి దించుతున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో గవర్నర్ వద్దకు కూడా నిర్మలా దేవి విద్యార్థులను తీసుకెళ్లిందని గోపాల్ తన కథనంలో రాసుకొచ్చారు. అంతేకాక గవర్నర్ పురోహిత్ను కలిసినట్లు ప్రొఫెసర్ నిర్మలా దేవీ పోలీసుల విచారణలో అంగీకరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. -
గవర్నర్పై ఆరోపణలు.. జర్నలిస్ట్ అరెస్ట్
చెన్నై : తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్పై తప్పుడు కథనం రాసినందుకు గాను ప్రముఖ జర్నలిస్ట్ ‘నక్కీరన్’ గోపాల్ను మంగళవారం తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పేరు తెచ్చుకున్న గోపాల్ ప్రస్తుతం తమిళ మ్యాగ్జైన్ ‘నక్కీరన్’కు ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మ్యాగ్జైన్ తమిళనాడు ప్రోఫెసర్ నిర్మాలా దేవికి సంబంధించిన కథనాలను ప్రచురించింది. మార్కులు కావాలంటే విద్యార్థినులు ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ ప్రొఫెసర్ నిర్మలా దేవీ వారిని వ్యభిచారంలోకి దించుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఆమె గవర్నర్ వద్దకు కూడా విద్యార్థులను తీసుకెళ్లిందని నక్కీరన్ తన కథనంలో పేర్కొన్నారు. అంతేకాక ‘గవర్నర్ పురోహిత్ను కలిసినట్లు ప్రొఫెసర్ నిర్మలా దేవీ పోలీసుల విచారణలో అంగీకరించారు. అందుకే గవర్నర్ ఈ కేసుపై విచారణ చేసేందుకు అంగీకరించడం లేదు’ అంటూ నక్కీరన్ తన కథనంలో రాసుకొచ్చారు. దీంతో నక్కీరన్పై రాజ్భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్ ఖండించారు. నిందితురాలైన ప్రొఫెసర్ నిర్మలా దేవీని తాను ఎప్పుడూ కలవలేదని ఆయన వెల్లడించారు. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు రిటైర్డ్ ఉన్నతాధికారి ఆర్.సంథమ్ను గవర్నర్ నియమించారు. ఈ క్రమంలో గవర్నర్పై అసత్య ఆరోపణలు చేస్తూ, ఆయన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా అమర్యాదకరంగా కథనాన్ని ప్రచురించినందుకు గాను నక్కీరన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో పుణె వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వచ్చిన నక్కీరన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గోపాల్ అరెస్ట్ను తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు డీఎమ్కే ప్రెసిడెంట్ ఎమ్కే స్టాలిన్ ఖండించారు. బీజేపీ, అధికార ఏఐడీఎమ్కే ప్రభుత్వాలు ప్రెస్ స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేస్తున్నాయని స్టాలిన్ ఆరోపించారు. -
చిత్రహింసలు పెడుతుండ్రు
దుబ్బాక రూరల్: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తన భర్తను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, వెంటనే అతడిని ఇక్కడికి రప్పించాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామానికి చెందిన దేవవ్వ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గ్రామానికి చెందిన సారుగు గోపాల్ (33) గతేడాది సౌదీ వెళ్లాడు. ఏజెంట్ల మోసానికి బలైన అతను అక్కడికెళ్లాక ఒంటెలు కాసే పనికి కుదిరాడు. మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. స్వదేశానికి రాకుండా వీసా, పాస్పోర్టు లాక్కున్నారు. గోపాల్తో పాటు మరికొందరు కామారెడ్డి జిల్లావాసులు ఇలాగే బాధపడుతున్నట్టు సమాచారం అందిందని దేవవ్వ తెలిపింది. ప్రభుత్వం స్పందించి వెంటనే రప్పించాలని వేడుకుంది. -
జానపథం..‘నిజ’బంధం
కొలుములపల్లె (బేతంచెర్ల):వేలి వేలి ఉంగరాలు... నా స్వామి... ఎడమచేతి ఉంగరాలు ..నాస్వామి.. అంటూ అతను పాడుతుంటే ప్రేక్షకులు పాటలో లీనమై తమను తాము మరచిపోతారంటే అతిశయోక్తి కాదు. కాళ్లకు గజ్జెలు కట్టి చేతిలో అందెలు పట్టుకొని పాటకు అనుగుణంగా అతను వేసే చిందు అద్భుతం. అతని నోటి వెంట వచ్చే జానపదం విని.. పల్లెజనం శ్రమను మరచిపోయి.. ఆనందడోలికల్లో తేలియాడుతుంటారు. బేతంచెర్ల మండలం కొలుములపల్లె గ్రామానికి చెందిన నిజాంగారి గోపాల్ విజయగాథ ఇదీ.. జానపద కళాకారుడు నిజాంగారి గోపాల్ చిరుప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల గాన గంధర్వుడిగా, జానపద గాన కోకిలగా బిరుదులు అందుకున్నాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక పదో తరగతిలోనే ఇతను చదువుకు స్వస్తి పలికాడు. చిరుప్రాయంలోనే తన మేనమామ కేశాలు ప్రోత్సాహంతో జానపద గేయాలు నేర్చుకున్నాడు. కొంతమంది దాతల సహకారంతో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పొల్గొని విజేతగా నిలిచాడు. మాటీవీ రేలా రే రేలా ప్రోగ్రాంలో పలు ఎపిసోడ్లలో ప్రతిభ కనబరిచి.. 2010 నవంబర్లో ఫైనల్ విన్నర్గా నిలిచాడు. నాపరాయికి ప్రసిద్ధి గాంచిన కొలుముల పల్లె పేరు రాష్ట్రస్థాయిలో పేరుమోగేలా చేశారు. సినిమాల్లో పాటలు.. పల్లె గొంతుకు అయిన జానపదాన్ని రాష్ట్ర స్థాయిలో వినిపించిన ఘనత గోపాల్కే దక్కింది. ఇతని పాటలు.. జానపద కళాకారులను, సంగీత ప్రియులను సైతం మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఒంగోలు గిత్త సినిమాలోనూ ఒక జానపద గేయాన్ని ఆలపించాడు. జానపద కళాబృందం సభ్యులతో కలిసి ఇప్పట వరకు 300 ప్రదర్శనలు ఇచ్చారు. గోపాల్..తండ్రి ఓ సాధారణ రైతు. పేదరికం కారణంగా.. కొంత మంది దాతల సహకారంతో తాను నమ్ముకున్న రంగంలో రాణిస్తున్నాడు. ఉత్సాహవంతులైన వారికి నేర్పిస్తున్నా కళ మరుగున పడకుండా ఉత్సాహవంతులైన జానపదకాళాకారులను ప్రోత్సాహిస్తూ కొత్తబాణిలు నేర్పుతున్నాను. 15 నుంచి 35 సంవత్సరాలలోపు యువతి, యువకులను ప్రోత్సాహిస్తూ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో దాతలు ఆహ్వానం మేరకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నాను. కొత్త వారితో జానపదాలు పాడిస్తున్నాను. జానపదం ప్రాచీన కళ. ఈ కళను మరుగున పడకుండా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. – నిజాంగారి గోపాల్ -
భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని..
హైదరాబాద్: భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని సంతోష్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. స్థానిక న్యూ రక్షాపురంలో నివాసముంటున్న గోపాల్ కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య జ్యోతి, ఓ కుమారుడు ఉన్నాడు. కాగా.. జ్యోతి మూడేళ్లుగా స్థానికంగా నివాసముంటున్న రాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ అంశంపై గోపాల్ ఆమెను పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురైన గోపాల్ సూసైడ్ నోట్ రాసి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వీకెండ్ రేసింగ్
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసర్లు రెచ్చిపోయారు. డ్రాగ్ రేసు సందర్భంగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ రేసర్ ఢీ కొట్టాడు. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న గోపాల్ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, రేసర్ నదీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రేసర్ నదీమ్ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
శ్రీమంతులకు కొమ్ము కాస్తున్న మోదీ
కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2న బృహత్ ప్రతిఘటన ఎల్ఐసీ కార్మిక సంఘం సంఘటన ప్రముఖుడు గోపాల్ కోలారు : ప్రధాని నరేంద్రమోది ఎన్నికల ముందు ప్రజల కిచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎల్ఐసీ కార్మిక సంఘం సంఘటన ప్రముఖుడు గోపాల్ ఆరోపించారు. నగరంలోని పాత్రికేయుల భవనంలో కార్మిక సంఘటనల సంయుక్త సమితి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తాలూకా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు ఆనుగుణంగా నరేంద్రమోది పాలనలేదన్నారు. కేవలం శ్రీమంతులు, పెట్టుబడి దారుల కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అనుకూలంగా ఉన్న 44 చట్టాలను మార్చి పెట్టుబడి దారులకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు. సామాజిక భద్రతా పథకాలపై కేంద్రం దాడి చేస్తోందని ఆరోపించారు. ధరల పెరుగుదల, కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా బృహత్ ప్రతిఘటన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐటీయూ నాయకుడు గాంధీనగర్ నారాయణస్వామి, కేఎస్ ఆర్టీసీ నౌకర్ల సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, అంగనవాడీ నౌకర్ల సంఘం అధ్యక్షురాలు మునిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
జిన్నారం మండలం వీరన్నగూడెంలో గోపాల్(40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గోపాల్ (శనివారం) నిన్న పని నిమిత్తం బయటికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు(ఆదివారం) ఉదయం ఎంతసేపైనా నిద్రలేకపోయేసరికి కుటుంబసభ్యులు అనుమానం వచ్చి గమనించగా చనిపోయి ఉన్నాడు. కంటిపై గాయం అయిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో కుటుంబసభ్యులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్స్క్వాడ్ను తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
చదువు మాన్పిస్తారని.. పారిపోయింది..
చదువు మాన్పిస్తాం.. పెళ్ళి చేస్తామంటూ తల్లిదండ్రులు గట్టిగా చెప్పడంతో ఓ యువతి ఇంట్లో నుంచి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ రోడ్ నెం. 7 జ్ఞానిజైల్సింగ్నగర్ బస్తీలో నివసించే పి.సాయిలక్ష్మి(19) ఇటీవలి ఇంటర్ రెండోసంవత్సరం పరీక్షల్లో మొదటి శ్రేణిలోపాస్ అయ్యింది. డిగ్రీ చదవాలని ఎంతో ఆశపడింది. కొద్ది రోజులైతే డిగ్రీ కళాశాలకు వెళ్తానని స్నేహితులతో ఆనందంగా చెప్పేది. ఎస్ఆర్నగర్లోని ఓ డిగ్రీ కాలేజీలో చేరేందుకు దరఖాస్తులు కూడా చేసుకుంది. అయితే తల్లి వనిత, తండ్రి పి.గోపాల్ మాత్రం ఆమె చదువుకు ససేమీరా అన్నారు. చదువు మానెయ్... వచ్చే నెలలో పెళ్ళి చేస్తామంటూ తల్లి గట్టిగా చెప్పింది. ఇలాగే ఉంటే తనకు పెళ్ళి చేయడం ఖాయమని తనకు ఎంతో ఇష్టమైన చదువుకు దూరమవుతానని బాధతో ఈ నెల 5వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకుంటాను తప్పితే పెళ్ళి మాత్రం చేసుకోనని చుట్టుపక్కల వారితో అన్నట్లు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెపోటుతో ప్రభుత్వ వైద్యుని మృతి
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ సీనియర్ సర్జన్ గుండె పోటు తో మృతి చెందాడు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ గోపాల్(34) మంగళవారం సాయంత్రం షటిల్ ఆడుతూ అకస్మాత్తుగా పడిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపల మృతి చెందాడు. డాక్టర్ గోపాల్ స్వగ్రామం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సబ్బావారి తాండ. పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. గోపాల్కు భార్య ఉమాదేవి నలుగురు పిల్లలు ఉన్నారు. -
ఎండలో తిరగొద్దన్నందుకు ఆత్మహత్యాయత్నం
కోస్గి : తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం బిజ్జారం గ్రామపంచాయతీ పరిధిలోని గిరిమోనిపల్లెకు చెందిన పదేళ్ల వెంకటేష్ను ఎండలో బయట తిరగొద్దని తండ్రి గోపాల్ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ లో కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
81ఏళ్ళ వయసులో రికార్డు సృష్టించాడు!
పుణె: పర్వతాలను అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. ఎంతో కృషి, పట్టుదలతో పాటు ఆరోగ్యం కూడా సహకరించాల్సి ఉంటుంది. అటువంటిది 81 ఏళ్ళ వృద్ధుడు రికార్డు సృష్టించాడు. హిమాచల్ ప్రదేశ్లో హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తైన రూపిన్ పాస్ క్రాస్ అధిరోహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. పుణెకు చెందిన గోపాల్ వాసుదేవ్ లేలే వయసు 81 సంవత్సరాలు. గతేడాది సెప్టెంబర్ లో పర్వతారోహణ చేసిన వ్యక్తి కంటే పది రెట్లు ఎక్కువగా హిమాలయ పర్వతాలను అధిరోహించాడు. అంతేగాక అతి పెద్ద వయసులో 15,350 అడుగుల ఎత్తైన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న రూపిన్ పాస్.. ఎక్కిన వ్యక్తిగా గోపాల్ వాసుదేవ్ లిమ్కా బుక్ లో తనపేరు నమోదు చేసుకున్నాడు. వర్షం, మంచు కురవడం, కొండ చెరియలు విరిగి పడటంతో పాటు...మైనస్ ఏడు డిగ్రీల్లో ఉండే చలిప్రాంతంలో ప్రయాణించి గోపాల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తలచిన కార్యం సిద్ధించాలంటే ముందుగా మానసిక శక్తి, ఆత్మ విశ్వాసం ఎంతో అవసరం అంటాడు గోపాల్. తానో వృద్ధుడినని, తనకు 81 సంవత్సరాల వయసు ఉందన్న విషయాన్నిఎప్పుడూ తలచుకోనని, యువకుడిలాగానే ఫీలౌతానని అంటాడు గోపాల్. 1972 నుంచి పర్వతారోహణ చేస్తున్న అతడు... ఇప్పటికీ ప్రతిరోజూ కనీసం 8 కిలోమీటర్లు వాకింగ్ చేస్తుంటాడు. శారీరక వ్యాయామంలో భాగంగా వారానికోసారి ముంబై-పుణె హైవే ప్రాంతంలో ఉన్నకొండలను కూడ ఎక్కుతుంటాడు. ఇప్పటికే కేదార్ నాథ్, కైలాష్, కాంచెన్ జుంగా, సంగ్లా లను అధిరోహించిన గోపాల్... ఈసారి సెప్టెంబర్ లో ఉత్తరాఖండ్ లోని రూప్ కుంద్ ఎక్కేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు. పుణెకు చెందిన ట్రెక్కింగ్ గ్రూప్ 'ట్రెక్నిక్' లో ఏడేళ్ళ క్రితం చేరిన అతడు అప్పట్నుంచీ అందులో భాగంగా మారిపోయాడు. ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీర్ గా విద్యార్హతలు సంపాదించిన గోపాల్.. 1964 లో పుణెకు చేరుకున్నాడు. కొన్నాళ్ళపాటు వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేసి, అనంతరం అక్కడే తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం వ్యాపార బాధ్యతలను కుమారుడికి అప్పగించేసినా ప్రతిరోజూ ఒక్కసారైనా ఫ్యాక్టరీని సందర్శించి వస్తుంటాడు. అయితే పర్వతారోహణ రేస్ వంటిది కాదని, ఎత్తైన ప్రాంతాలను అధిరోహించేప్పుడు ఎంతో సావధానంగా ఉండాలని గోపాల్ సలహా ఇస్తాడు. ట్రెక్కింగ్ చేయాలంటే కొన్ని నెలల ముందునుంచే శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అందుకు కావలసిన ప్రిపరేషన్ ఉండాలని సూచిస్తాడు. ట్రెక్కింగ్ లో పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ తక్కువై ఊపిరి కష్టమౌతుందని అంతా చెప్తుంటారని, తాను ఇప్పటికి ఎన్నోసార్లు హిమాలయాలను ఎక్కినా తనకా సమస్య ఎదురు కాలేదని చెప్తున్నాడు. ఆరోగ్యం, శరీర ధారుఢ్యం ఉన్నా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా పర్వతారోహణ సాధ్యం కాదనే గోపాల్... ఎనభై ఏళ్ళు దాటిన వయసులోనూ బీపీ, సుగర్, ఆర్థరైటిస్ వంటి సమస్యలేవీ లేకుండా ఆరోగ్యంగా, చలాకీగా ఉంటూ.. చిన్న వయసులోనే డీలా పడిపోయే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. -
కూరగాయల రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక కూరగాయల రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్కు చెందిన గోపాల్(32) తనకున్న రెండెకరాల పొలంలో కూరగాయల సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు కూరగాయల సాగు కలిసి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జల్సాల కోసం చోరీలు
దొంగ అరెస్టు.. భారీగా రికవరీ 20 పోలీస్స్టేషన్ల పరిధిలో 64 కేసుల నమోదు మహబూబ్నగర్: కొన్నిరోజు లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గజదొంగ ఎట్టకేలకు దొరికాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెస్ట్జోన్ ఐజీ నవీన్చంద్, ఎస్పీ విశ్వప్రసాద్లు గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మల్దకల్ మండలం పాల్వాయికి చెందిన వడ్డె గోపాల్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిం చాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటుపడ్డాడు. డబ్బు కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు. 2009లో పశువులను దొంగతనం చేసి జైలుకెళ్లివచ్చాడు. జైలు నుంచి విడుదల య్యాక మళ్లీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గ్రామాల్లో ఉదయం పూట తిరిగి ఇళ్లకు తాళాలు వేసినవాటిని గుర్తిం చేవాడు. రాత్రివేళ ఆ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడు. జిల్లాలో దాదాపు 20 పోలీస్స్టేషన్ల పరిధిలో ఏడాదిన్నరలో 64 దొంగతనాలు చేశాడు. గద్వాలలో పెట్రోలింగ్ పోలీసులకు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.10.63 లక్షలు, 1.2 కేజీల బంగారం, ఏడు కిలోల వెండి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
తడిసిన బట్టల్లో వారిని చూసేందుకు హోలీ!
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగుల పండుగ హోలీని కూడా వదల్లేదు. హిరణ్య కశ్యపుడి చెల్లెలు హోలిక నుంచి ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడినందుకు మీరంతా హోలీని సంతోషంగా జరుపుకొంటారని, తనకు మాత్రం ఈ పండుగ నాడు భంగ్ తినడం, శృంగారం ఒలికించే అమ్మాయిలను చూడటం, పాఠశాలను ఎగ్గొట్టడం వంటివే సంతోషం కలిగించేవని ట్వీట్ చేశాడు. హోలీ సందర్భంగా లభించే ఏకైక ఆనందం.. యువతులను తడిసిన దుస్తుల్లో ఒరకంట చూడటమేనని, దీనికి పెద్దల ఆమోదం కూడా ఉంటుందని, వారిని అలా చూస్తూ ఫీలైన చెంపదెబ్బ తినకుండా తప్పించుకోవచ్చునని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. హోలీ రోజు ఎవరు ఎవరిని చంపారు? ఎందుకు చంపారు అన్న కారణాలు ఏమీ తెలియకుండానే చాలామంది పండుగను జరుపుకొంటున్నారని, కొందరు భంగ్ వంటివి ఆస్వాదించడం కోసం పండుగ జరుపుకుంటారని పేర్కొన్నాడు. -
'ప్రవృత్తి’కి పరదేశంలోనే నాంది !
విదేశీ కరెన్సీ, నాణేల సేకరించడంలో కోలారు వాసి దిట్ట 25 దేశాలకుపైగా కరెన్సీ సేకరణ వృత్తి పరంగా డ్రైవింగ్ శిక్షకుడు... కోలారు : విదేశీ నాణేలు, కరెన్సీల సేకరణలో నగరానికి చెందిన కోలారమ్మ డ్రైవింగ్ స్కూల్ యజమాని ఆర్ గోపాల్ ప్రత్యేకత కనబరుస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 25కు పైగా విదేశీ కరెన్సీతో పాటు వివిధ దేశాలకు చెందిన నాణేలు సేకరించారు. వీటిని అత్యత భద్రంగా తన డ్రైవింగ్ స్కూల్ ఆఫీసులోనే ఫ్రేము వేసి ప్రదర్శనకు ఉంచారు. 17 ఏళ్లుగా విదేశీ కరెన్సీ సేకరిస్తున్నట్లు చెప్పారు. వీటికి తోడు భారతదేశానికి చెందిన పాత కాలం నాటి కరెన్సీని కూడా సేకరించారు. పదవ తరగతి వరకు చదువుకున్న ఆర్ గోపాల్ 1999లో డ్రైవింగ్ పాఠశాలను నగరంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ప్రారంభించారు. తాను విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో నాణేల సేకరణ చేయాలనే కోరిక కలిగిందని గోపాల్ తెలిపారు. నగరంలోని దేవరాజ్ అరసు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు ఇంటర్ నేషనల్ డ్రైవింగ్ లెసైన్సుకోసం తన వద్దకు వస్తుంటారని వారి వద్దనుంచి వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీని సేకరించినట్లు తెలిపారు. గోపాల్ వద్ద ఇంతవరకు అమెరికా, కొరియా, సౌదీ అరేబియా, జపాన్, సింగపూర్, చైనా, మలేషియా, ఇరాక్, ఇండోనేషియా, లండన్, పాకిస్తాన్, కువైట్, బ్యాంకాక్, శ్రీలంక, ఓమెన్, ఫిలిపైై్పన్స్, నైజీరియా, కాంగో, భూటాన్, ఖతార్, నేపాల్, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన కరెన్సీలు ఉన్నాయి. మిగిలిన దేశాలకు చెందిన కరెన్సీని కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నానని ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీలను సేకరించాలనేది తన లక్ష్యమని గోపాల్ అన్నారు. -
బిడ్డా.. అన్నం పెడతా రా!
♦ ఇంట్లోకి తీసుకెళ్లి కుమారుడికి ఉరి వేసిన తల్లి ♦ అనంతరం తానూ ఆత్మహత్య ♦ కీడును శంకించి తప్పించుకున్న మరో కుమారుడు యాలాల: బిడ్డా.. గుడ్డు, అన్నం పెడతాను రా.. అంటూ తన ఇద్దరు కొడుకులను ఇంట్లోకి తీసుకెళ్లిందో తల్లి. పథకం ప్రకారం ఉరి వేసేందుకు తాడు సిద్ధం చేస్తుండగా కీడును శంకించిన ఓ కుమారుడు భయపడి బయటకు పరుగులు తీశాడు. అయితే, మరో కొడుకుకు ఉరివేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం ఎన్కెపల్లిలో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన నీళ్లపల్లి గోపాల్, బుజ్జమ్మ (35) దంపతులకు గౌతమ్, రాకేష్(5) సంతానం. కుటుంబ కలహాలతో బుజ్జమ్మ నాలుగే ళ్ల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. దీంతో మూడేళ్ల క్రితం గోపాల్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బుజ్జమ్మ కొంతకాలం క్రితం అత్తగారింటికి వచ్చింది. నెలరోజుల క్రితం గోపాల్ రెండో భార్యతో కలసి నగరానికి వలస వెళ్లాడు. ఇదిలా ఉండగా, ఆదివారం సాయంత్రం బుజ్జమ్మ అన్నం, గుడ్డు పెడతానని కొడుకులను ఇంట్లోకి తీసుకెళ్లింది. దూలానికి తాడుతో ఉరి బిగిస్తుండగా విషయం గుర్తించిన గౌతమ్ బయటకు పరుగులు తీశాడు. అనంతరం ఆమె తలుపులకు గొళ్లెం వేసి చిన్న కొడుకు రాకేష్ మెడకు ఉరేసి చంపింది. అనంతరం బుజ్జమ్మ దూలానికి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. షాక్కు గురైన గౌతమ్ కొద్దిసేపటి తర్వాత పొలం నుంచి వచ్చిన నానమ్మ, తాతయ్యలకు జరిగిన విషయాన్ని చెప్పాడు. సమాచారం అందుకున్న తాండూరు రూరల్ సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ అరుణ్కుమార్ రాత్రి గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. అయితే, గౌతమ్ బయటకు పరుగులు తీయకపోయి ఉంటే బుజ్జమ్మ అతడిని కూడా చంపేసి ఉండేదని పోలీసులు తెలిపారు. -
భార్యను 22 సార్లు కత్తితో పొడిచాడు
మైసూరులో కిరాతకం మైసూరు : మైసూరులో కలకలం రేగింది. ఓ కిరాతకుడు భార్యను అత్యంత క్రూరంగా కత్తితో పొడిచి పొడిచి చంపడం సంచలనం రేపింది. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉండే నగరవాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మైసూరు నగరంలో మేటిగెహళ్ళి నివాసి గోపాల్కు విద్యారణ్యపురకు చెందిన దీపా(25)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో మద్యం చిచ్చు రేపింది. కొంత కాలంగా మద్యానికి బానిసైన గోపాల్ నిరంతరం భార్యతో గొడవపడి చావబాదేవాడు. భర్త వేధింపులు తాళలేక దీపా పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం రాత్రి పీకల దాక మద్యం తాగిన గోపాల్ దీపా ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. వెంట తెంచుకున్న కత్తితో దీపాపై 22 సార్లు అమానుషంగా పొడిచి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన దీపా అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యారణ్యపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు గోపాల్ కోసం గాలింపు చేపట్టారు. -
వాటర్హీటర్ పెడుతూ..
వాటర్ హీటర్ పెడుతూ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరు పంచాయతీ పరిధిలోని వెంకమ్మగూగ గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. గోపాల్ (35) అనే వ్యక్తి నీళ్లు వేడి చేసుకునేందుకు ఇంటి దగ్గర వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదా ఘాతంతో ఉద్యోగి మృతి
ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు చేస్తుండా ప్రమాద వశాత్తు ఒక విద్యుత్ ఉద్యోగి చనిపోయాడు. ఈ ఘనట హైదరాబాద్ నగరం కుత్బుల్లాపూర్ వాజ్ పేయి నగర్ లో గురువారం ఉదయం జరిగింది. స్థానికంగా కరెంటు లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లను నరికే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో వాజ్ పేయి నగర్ లో ఒక విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కి గోపాల్(30) అనే ఉద్యోగి రిపేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బోల్టు ఒకటి చేతి నుంచి జారి పడింది. దీన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో విద్యుత్ ప్రసరిస్తున్న తీగలను తాకటంతో షాక్ కు గురై అక్కడి కక్కడే చనిపోయాడు. మృతుడిది మూసాపేట. కాగా.. అతడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. -
విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి
కొత్త ఇంటి నిర్మాణం కోసం ఢాబా పై ఇనుప కడ్డీలు వేస్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోపాల్(42) కొత్త ఇంటి నిర్మాణం నిమిత్తం ఇప్పుడు ఉన్న ఇంటిపై ఇనుప కడ్డీలు వేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇనుప చువ్వలు ఇంటి పక్కగా పోతున్న విద్యుత్ తీగలకు తాకడంతో.. విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నను కాపాడి ... తమ్ముడు మృతి
మహబూబ్నగర్ : బావిలో పడిన అన్నయ్యను రక్షించి ఓ తమ్ముడు మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలం మల్లాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... స్థానికంగా నివసిస్తున్న మల్లేష్ (15), గోపాల్ (18) అన్నదమ్ములు, గొర్రెల కాపరులుగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ రోజు గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్నారు. ఆ క్రమంలో గోపాలుకు తీవ్ర దాహం వేసింది. సమీపంలోని బావిలోకి మెట్ల ద్వారా దిగాడు. నీళ్లు తాగుతుండగా... కాలు జారీ నీళ్లలో పడ్డాడు. బావి లోతుగా ఉండటంతో గోపాలు నీట మునిగాడు. ఆ విషయాన్ని గమనించిన తమ్ముడు మల్లేష్ బావిలోకి దిగి.. అన్నయ్య గోపాల్ను రక్షించి మెట్ల మీదకు చేర్చాడు. కానీ మల్లేష్ మాత్రం నీట మునిగి మరణించాడు. -
అబ్బాయిలూ జాగ్రత్త!
జీవితంలో సరిగ్గా స్థిరపడాలంటే మంచి ప్రణాళిక అవసరం. కానీ, ఎలా పడితే అలా జీవిస్తే? జీవితం గాడి తప్పుతుంది. అలా, యువతరం తప్పుదోవలో పడితే అది వారి జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే కథాంశంతో జరుపుల గోపాల్ సమర్పణలో ధర్మవరపు చంద్రమౌళి నిర్మిస్తున్న చిత్రం -‘అబ్బాయిలూ... బి కేర్ఫుల్’. మల్లెల చరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివ, రామకృష్ణ, నరేశ్, శ్రీచరణ్, అక్షయ్, శ్రీనయన, విజయసాయి, విష్ణు, మహేశ్వరి ముఖ్య తారలు. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ ఎంటర్టైనర్ మూడో షెడ్యూల్ రాజమండ్రి, కాకినాడ, యానాం పరిసరాల్లో జరగనుంది. -
కొడుకు చేతిలో తల్లి హతం
రూ.5వేల కోసం ప్రాణం తీశాడు నడింపల్లిలో ఓ కొడుకు ఘాతుకం అచ్చంపేట రూరల్ : మద్యం తాగేందుకు బానిసగా మారిన ఓ కొడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని విచక్షణారహితంగా కొట్టిచంపాడు. ఈ విషాదకర సంఘటన మంగళవా రం రాత్రి అచ్చంపేట మండలం నడిం పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోడ జంగమ్మ(52)కు కొడుకు గోపాల్, ఇద్దరు కూతుళ్లు ఉన్నా రు. భర్త చెన్నయ్య 25 ఏళ్ల క్రితమే చనిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ ఊళ్లోనే ఉంటుంది. గోపాల్ భార్యాపిల్లలతో హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుం టూ అక్కడే ఉంటున్నాడు. ఇటీవల హైదరాబాద్లో గోపాల్ సెల్ఫోన్ దొంగిలించడంతో గమనించి కొందరు చితకబాదారు. 15రోజుల క్రితం నడింపల్లికి వ చ్చాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడం తో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మం గళవారం ఉదయం నుంచి మద్యం తాగుతూనే ఉన్నాడు. రాత్రి ఇంటికొచ్చిన తల్లిని రూ.ఐదువేలు ఇవ్వాలని అడిగాడు. నిరాకరించడంతో తల్లిపై కక్ష పెంచుకున్నాడు. జంగమ్మ నిద్రిస్తున్న సమయంలో ఇంటిలో ఉన్న కర్రతో తలపై బలంగా బాదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అ క్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గోపాల్ ఇంటినుంచి బయటకు వచ్చి మా అ మ్మకు తలనొప్పిగా ఉందని ఇరుగుపొరు గు వారికి చెప్పాడు. ఇది గమనించిన స్థా నికులు గోపాల్ తల్లిని చంపాడని భావిం చి ఇంటిలో బంధించారు. బుధవారం ఉ దయం పోలీసులకు అప్పజెప్పారు. మృతురాలి చిన్నకూతురు లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మణిదీప్ తెలిపారు. కాగా, గ్రామంలో వి చ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని, మద్యానికి బానిసైన యువకులు తల్లిదండ్రులను, భార్యలను వేధిస్తున్నారని చర్య లు తీసుకోవాలని పోలీసులను కోరారు. -
వేర్లకే తేమ ఇవ్వటం మేలు!
మొక్కకు నీటి చుక్కలు ఇచ్చే కన్నా.. నేలలో పాతిన కుండ ద్వారా.. నేరుగా మొక్కల వేరు వ్యవస్థకే.. అత్యంత పొదుపుగా నీటి తేమనందించే అధునాతన డ్రిప్ వ్యవస్థ ‘స్వర్’ సాధారణ డ్రిప్కు ఖర్చయ్యే నీటిలో 10% చాలు.. కరెంటుతో పనిలేదు.. కలుపు రాదు.. వినూత్న ఆవిష్కరణకు {ఫెంచ్ ప్రభుత్వ పురస్కారం జలం.. ప్రాణావసరం! తరుముకొస్తున్న కరువు కాలంలో.. ప్రతి నీటి బొట్టూ ప్రాణప్రదమే. ఒక్క చుక్కనూ సృష్టించలేం.. పది నీటి బొట్లు వాడే చోట ఒక్కదానితో ప్రాణం నిలబెట్టుకోవాలి- అది మనిషిదైనా, మొక్కదైనా! నీటి పారుదలకు స్వస్తి చెప్పి.. చుక్కలు చుక్కలుగా నేలను తడిపే బిందు సేద్యాన్ని చేపట్టాం. ఆహా ఓహో అనుకుంటున్నాం.. అయితే, ఈ బిందు సేద్యానికీ చాలినంత నీరు లేకపోతే..? అన్నదాతల రేపటి ఆశలకు ప్రతి రూపాలైన పండ్ల మొక్కలను మండుటెండల నుంచి కాపాడుకునేదెలా..? నీరూ సరిగ్గా లేక.. కరెంటూ అంతకన్నా అందని స్థితిలో రైతుకు దిక్కేమిటి? ఇదే ప్రశ్న సామాజిక శాస్త్రవేత్త కే ఎస్ గోపాల్ మదిని ఏళ్ల తరబడి తొలిచేసింది. ఎడతెగని మథనం తర్వాత.. ఆయన మదిలో ఒక అద్భుత ఆవిష్కరణ మెరిసింది! బిందు సేద్యానికయ్యే నీటి ఖర్చులో 10% తోనే పంటను కంటికి రెప్పలా కాపాడుకునే భేషైన ఉపాయం తట్టింది. కరెంటూ అక్కర్లేదు. కలుపు బెడదా లేదు. ఈ వినూత్న ఆలోచనను రైతుల పొలాల్లో మూడేళ్లుగా ఆచరణలో పెట్టి.. మరింత సమగ్రంగా తీర్చిదిద్దారు. దీని పేరు ‘సిస్టం ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ రిజునవేషన్’(స్వర్). హైదరాబాద్ కేంద్రంగా గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్(సీడబ్ల్యూసీ)కు ఆయన 2 దశాబ్దాలుగా సారధిగా ఉన్నారు. మేనేజ్మెంట్ టీచింగ్లో అనుభవం గడించిన ఆయన గతంలో ముంబై ‘టిస్’లోను, హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లోనూ సేవలందించారు. ఉపాధి హామీ పథకంపై పనిచేస్తున్న దశలో ‘స్వర్’ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. గత నెలలో పారిస్లో జరిగిన ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ ఎక్స్పోజిషన్లో ‘స్వర్’కు ఫ్రెంచ్ ప్రభుత్వం ఛాంపియన్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. ‘స్వర్’ను మరింత మెరుగుపరచి అంతర్జాతీయ సమాజానికి అందుబాటులోకి తేవడానికి ఈ పురస్కారం అవకాశం కల్పిస్తుందని గోపాల్ ఆశిస్తున్నారు. నీటి వనరులు బొత్తాగా కొడిగడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెరటి తోటలు, పండ్ల తోటలతోపాటు అడవుల పెంపకానికీ ఎంతగానో ఉపకరించే ‘స్వర్’ గురించి వివరంగా గోపాల్ అందించిన వివరాల మేరకు.. మీ కోసం! మండువేసవిలో పగటి ఉష్ణోగ్రతలు 45-50 డిగ్రీల సెల్షియస్కు పెరిగినప్పుడు.. ఎటువంటి ఆచ్ఛాదన లేని నేల ఉష్ణోగ్రత 60-65 డిగ్రీల వరకు ఉంటుంది. అటువంటి గడ్డు పరిస్థితుల్లో రైతులు తమ భూముల్లో నాటుకున్న పండ్లమొక్కలు, బంజరు భూముల్లో నాటిన అడవి జాతి మొక్కలకు పుష్కలంగా నీరందించడం కరువు ప్రాంతాల్లో కనాకష్టమే. డ్రిప్ ఏర్పాటు చేయడానికి అక్కడ విద్యుత్, బోరు అందుబాటులో లేకపోవచ్చు. వాటిని ఏర్పాటు చేసుకునే స్థోమత రైతుకు ఉండకపోవచ్చు. బోరు, డ్రిప్ సదుపాయాలున్నప్పటికీ.. డ్రిప్ పనిచేయడానికి సరిపోయేంత నీరుండకపోవచ్చు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మొక్కలను బతికించడమే కాదు.. మంచి దిగుబడినిచ్చేంత ఆరోగ్యంగా ఎదిగేందుకు కూడా ‘స్వర్’ దోహదపడుతుంది. నేరుగా వేర్ల దగ్గరకే నీటి తేమ.. డ్రిప్ లేటరల్ పైపులు జారవిడిచే నీటి చుక్కలు నేలపైన పడి.. నిట్ట నిలువుగా మట్టిని తడుపుతుంటాయి. ఇలా ఖర్చయ్యే నీటిలో కొంత భాగం ఆవిరైపోగా.. మిగిలిన కొంతభాగం మాత్రమే భూమిలోపల ఉన్న మొక్కల వేళ్లకు అందుతుంది. కానీ.. అధునాతన డ్రిప్ అయిన ‘స్వర్’ భూమి లోపలే నీటిని వదులుతూ.. నేరుగా మొక్కల వేర్లకు తగుమాత్రంగా నీటి తేమను అందిస్తుంది. వేర్లకు చేరక ముందే నీరు ఆవిరైపోవటం ఉండదు. ‘వేర్లకు కావాల్సింది నీరు కాదు.. మట్టి రేణువుల మధ్యలో ప్రాణవాయువుతో కూడిన నీటి తేమ మాత్రమే. తేమ ఎంత దూరం ఉంటే వేరు అంత దూరం విస్తరిస్తుంది. ‘స్వర్’ డ్రిప్ ఏర్పాటు చేసిన చోట భూమి లోపల 1.2 మీటర్ల దూరం వరకు తేమ విస్తరిస్తుంది. వేళ్లు ఆరోగ్యంగా, బలంగా, ఎక్కువ దూరం విస్తరించేందుకు తద్వారా అవకాశం కలుగుతున్నది. వేరు వ్యవస్థ బలంగా, విస్తారంగా పెరిగినప్పుడు మొక్క కూడా బలంగా ఎదుగుతుంది. కరువు కాలంలో కూడా ఐదేళ్ల లోపు పండ్ల తోటలను, మొక్కలను రక్షించుకోవడంతోపాటు చక్కని ఫలసాయం పొందడానికి అవసరమైన తేమను ‘స్వర్’ నిరంతరం అందిస్తుంది. డ్రిప్కు ఖర్చయ్యే నీటిలో కేవలం 10% నీటితోనే ‘స్వర్’ ఈ పని పూర్తిచేస్తుందని గోపాల్ తెలిపారు. డ్రిప్ మాదిరిగా స్వర్ వ్యవస్థలో మొక్కలకు రోజూ నీరివ్వాల్సిన పని ఉండదు. ఏడాదిలో 100-150 సార్లు నీరిస్తే చాలు సాధారణ డ్రిప్తో మొక్కలకు రోజూ నీరిస్తుంటారు. స్వర్ ద్వారా ఏడాదికి 100-150 సార్లు నీరిస్తే చాలని గోపాల్ అన్నారు. మొక్కలను, నేలను, వాతావరణాన్ని బట్టి నీరు అవసరమవుతుంది. ఓవర్హెడ్ ట్యాంకు నుంచి నీటిని వదిలిన కొద్ది నిమిషాల్లోనే ప్లాస్టిక్ బాటిల్, కుండ నిండిపోతాయి. బాటిల్ నిండగానే ట్యాంకు నుంచి నీరివ్వడం ఆపేయొచ్చు. భూమిలోపల తేమ 12 రోజుల వరకు ఉంటున్నట్లు గమనించామని గోపాల్ అన్నారు. మొక్కను కేవలం బతికించడం కోసమైతే 10 రోజులకోసారి నీరు ఇచ్చినా చాలని, ఆరోగ్యంగా పెంచడం కోసం ఎక్కువసార్లు నీరివ్వాలి అన్నారాయన. 3 రాష్ట్రాల్లో ప్రయోగాలు.. స్వర్ డ్రిప్ వ్యవస్థను అనంతపురం జిల్లాలో 8 మంది రైతులు 800 పండ్ల మొక్కలకు గత రెండేళ్లుగా వాడుతూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నల్గొండజిల్లాలో 280 మొక్కలు, రంగారెడ్డి జిల్లాలో 400 మొక్కలకు వాడుతున్నారు. 9 నెలల క్రితం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ వ్యవసాయ పాలిటెక్నిక్లో , మధ్యప్రదేశ్లోని సెహోర్లో కొన్ని పండ్లు, అడవి మొక్కలకు స్వర్ డ్రిప్ను ఏర్పాటు చేశారు. రైతులు ప్రత్యేకంగా తయారు చేసుకునే సంజీవని సేంద్రియ ఎరువు(పూర్తి వివరాలకు 18-12-2014 నాటి ‘సాగుబడి’ పేజీలో ‘సేద్య సంజీవని’ కథనం చూడండి) వేసిన తర్వాత, స్వర్ డ్రిప్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని గోపాల్ అన్నారు. ఈ ఎండాకాలంలో అన్నిచోట్లా పూర్తిస్థాయి గణాంకాలను నమోదు చేస్తున్నామన్నారు. రైతుల పొలాల్లోనే కాదు, అటవీ భూముల్లో, హైవేల వెంబడి నాటే అటవీ మొక్కలను తక్కువ నీటితోనే పెంచుకోవడానికి ‘స్వర్’ సమర్థవంతంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ‘స్వర్’ డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసేదిలా.. మొక్క నాటిన తర్వాత.. పాదుకు అడుగున్నర దూరంలో.. భూమి లోపల అడుగున్నర లోతులో మట్టి కుండను అమర్చి, దానిపైన ప్లాస్టిక్ బాటిల్ను ఉంచాలి. బాటిల్ నేలపైకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది. బాటిల్ పై భాగాన్ని లేటరల్ పైపునకు అనుసంధానం చేసి.. ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా అవసరమైనప్పుడల్లా నీటిని నింపుతూ ఉండాలి. రెండున్నర లీటర్ల నీరు పట్టే మట్టి కుండను ఉంచి.. దానిపైన 5 లీటర్ల ప్లాస్టిక్ బాటిల్ను అమర్చాలి. బాటిల్కు అడుగున ఉన్న చిన్న బెజ్జంలో నుంచి నీరు కుండలోకి నెమ్మదిగా దిగుతుంటుంది. కుండకు సగానికి కొంచెం కిందగా బెజ్జం పెట్టి.. ఆ బెజ్జంలో నుంచి నీటి చుక్కలు బయటకు పోయేందుకు 3 అంగుళాల పొడవైన సన్న ట్యూబ్ను కుండ బయటకు పెట్టాలి. ఈ ట్యూబ్లోకి మట్టి చేరి మూసుకుపోకుండా ఉండేందుకు.. గుప్పెడు ఇసుకను షేడ్నెట్ ముక్కతో చుట్టి, తాడుతో కట్టాలి. కుండ ద్వారా నీరు మొక్క వేళ్ల దగ్గర మట్టిని తడుపుతూ ఉంటుంది. సన్న ట్యూబ్ పై వరకు నీరున్నంత సేపు నీటి చుక్కలు బయటకు వెళుతుంటాయి. కుండలో నీటిమట్టం తగ్గిన తర్వాత కూడా కొన్ని గంటల వరకు కుండ చుట్టూ ఉన్న మట్టి ద్వారా తేమ వేళ్లకు అందుతూ ఉంటుంది. పదేళ్ల వరకు ఢోకా ఉండదు! ‘స్వర్’ పద్ధతిలో డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మొక్కకు రూ. 300 నుంచి రూ. 350 వరకు ఖర్చవుతుంది. అయితే, మూడేళ్లకోసారి కొత్త కుండను ఏర్పాటు చేసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో భాగంగా మామిడి తోటలకు ప్రభుత్వం నీరు పోయడానికి మూడేళ్లకు ఎకరానికి రూ. 1,15,000 ఖర్చు చేస్తోంది. కానీ, కేవలం రూ. 37 వేలతో ‘స్వర్’ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకసారి ఏర్పాటు చేసుకుంటే పదేళ్ల వరకు ఢోకా ఉండదు. బంజరు భూముల్లో నాటే అటవీ మొక్కలకూ ఇది బాగా నప్పుతుంది. ఐటీసీ వంటి ప్రైవేటు కంపెనీలూ ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వమూ ఆలోచించాలి. - కే ఎస్ గోపాల్ (98481 27794), డెరైక్టర్, సెంటర్ ఫర్ ఇన్విరాన్మెంట్ కన్సర్న్స్, హైదరాబాద్ 3,4 రోజులకోసారి నీళ్లిస్తున్నాం.. ఎకరంన్నరలో 170 మామిడి, సపోట, జామ తదితర పంట మొక్కలు రెండేళ్ల క్రితం నాటాను. ఏడాది క్రితం స్వర్ డ్రిప్ ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు 3-4 రోజులకోసారి నీళ్లు ఇస్తున్నాను. మొక్కలు బాగా పెరుగుతున్నాయి. జామ, సపోట కాయలు కాస్తున్నాయి. మొదట్లో మా కుంటలో నుంచి పెడల్ పంపుతో నీటిని ట్యాంకులోకి తోడేవాడిని. ఇప్పుడు మా అన్న పొలంలో బోరు నుంచి నీటిని తీసుకుంటున్నా. బోరున్న వాళ్లూ ఈ డ్రిప్ పెట్టుకుంటే బాగుంటుంది. - ఎనుముల గోపాల్ (84989 96975), యువ రైతు, మద్దిగుప్ప, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా -
ఆస్తి పన్ను బకాయిలపై జరిమానా మాఫీ
మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తేనే మాఫీ అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను బకాయిలపై అపరాధ రుసుమును రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే ప్రస్తుత సంవత్సర పన్నుతో పాటు పాత బకాయిలను కూడా కలిపి ఒకేసారి మొత్తం పన్ను చెల్లిస్తేనే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇది అమలవుతుందని తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వచ్చే మార్చి 31వ తేదీని తుది గడువుగా పేర్కొంది. పురపాలక సంస్థల్లో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను ప్రోత్సహించేందుకు అపరాధ రుసుమును మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ కమిషనర్ పంపిన ప్రతిపాదనలను సీఎం శుక్రవారం ఆమోదించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 68 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై అపరాధ రుసుమును మాఫీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అపరాధ రుసుముతో పాత బకాయిలను చెల్లించిన వారికీ ఈ మాఫీ వర్తించనుంది. అయితే ఈ మాఫీ అయ్యే అపరాధ రుసుమును నగదు రూపంలో తిరిగి చెల్లించకుండా.. వచ్చే ఏడాది పన్నుల్లో సర్దుబాటు చేస్తారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో గృహ, వాణిజ్య సముదాయాలకు సంబంధించి ఆస్తి పన్నుల బకాయిలు 51.42 కోట్ల వరకు ఉన్నాయి. సాధారణంగా బకాయిలపై 2 శాతం అపరాధ రుసుము విధిస్తారు. ఈ లెక్కన రూ. 9 కోట్లకు పైగా అపరాధ రుసుము మాఫీ కానుంది. -
రుణమాఫీ కాలేదని ఆగిన రైతు గుండె
కూడేరు: రుణమాఫీ కాలేదన్న దిగులుతో రైతు గుండె ఆగింది. అనంతపురం జిల్లా ఇప్పేరుకు చెందిన రైతు గోపాల్(50)కు ఐదెకరాల పొలముంది. సొసైటీ బ్యాంక్లో రూ.35 వేలు, స్టేట్బ్యాంక్లో బంగారం తాకట్టుపెట్టి రూ. 75 వేలు తీసుకున్నాడు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డులో ఇంటి పేరు వేర్వేరుగా ఉండడంతో మాఫీ వర్తించలేదు. పేరు మార్పు కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్తున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో రుణమాఫీ వర్తించదన్న మనోవేదనతో సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. -
దెయ్యాలున్నాయి..!
అభినవ్, మధులగ్న దాస్ జంటగా సాయికార్తీక్ సమర్పణలో టి. లక్ష్మీసౌజన్య గోపాల్ నిర్మించిన చిత్రం ‘గేట్’. రాజేష్ సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీజే షాన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సీడీని ఆవిష్కరించి అభినవ్కి ఇచ్చారు. బేనర్ లోగోను రమేశ్ పుప్పాల ఆవిష్కరించారు. హారర్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో కామెడీ కూడా ఉందని నిర్మాత చెప్పారు. ఆద్యంతం థ్రిల్కి గురి చేసే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో మంచి సందేశం ఉందని అభినవ్ చెప్పారు. ఈ వేడుకలో జీయస్ చక్రవర్తి, సాయి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరామనవమికి టీటీడీ నుంచే పట్టువస్త్రాలు
ఆనవాయితీ కొనసాగిస్తాం: ఈవో గోపాల్ ఖమ్మం: భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ప్రతీ ఏడాదిలాగే 2015లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు పంపిస్తామని టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఎం.జి. గోపాల్ తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ర్టంగా ఉన్నప్పుడు పట్టువస్త్రాలు టీటీడీ నుంచే అందించామని, రాష్ట్రం విడిపోయాక కూడా ఆనవాయితీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భద్రాచాలం రామాలయ కమిటీ కోరితే ఇక్కడికి కూడా బంగారు తాపడం పంపిస్తామని చెప్పారు. -
మళ్లీ తెరపైకి‘అనంత స్వర్ణమయం’
ఆలయానికి బంగారు తాపడం చేయాలని మంత్రి యనమల ప్రకటన అన్నీ సవ్యంగా ఉంటే పరిశీలిస్తామంటున్న టీటీడీ ఈవో గోపాల్ సాక్షి, తిరుమల: ‘ఆనంద నిలయం-అనంత స్వర్ణమ యం’ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. చిన్న ఆలయాలే బంగారంతో కనిపిస్తుంటే.. కోట్లకు పడగలెత్తిన తిరుమల ఆలయానికి బంగారు తొడుగులు, పూత చేయొచ్చని స్వయంగా రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల ప్రకటించారు. అన్నీ సవ్యంగా ఉంటే పరిశీ లిస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ కూడా ప్రకటిం చారు. కోర్టు ఉత్తర్వులతో అర్ధాంతరంగా ఆగిపోయిన దివంగత టీటీడీ చైర్మన్ డీకే ఆదికేశవులు కలల ప్రాజెక్టు మళ్లీ ప్రాణం పోసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వర్ణమయం రూపకల్పన తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రాకారాలకు బంగారు తొడుగులు అమర్చేందుకు 2008 అక్టోబరు 1వ తేదీన అప్పటి చైర్మన్ డీకే ఆదికేశవులు ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును రూపకల్పన చేశారు. దీనిని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు కోసం భక్తులు రూ.13 కోట్ల నగదు, 115 కేజీల వరకు బంగారాన్ని కానుకగా సమర్పించారు. తిరుమల మ్యూజియంలో ప్రత్యేకంగా వర్క్ షాపు ఏర్పాటు చేసి రాగి రేకులపై బంగారు మలాం వేశారు. దీనిపై ఆర్కియాలజీ విభాగం అభ్యంతరం తెలిపింది. ప్రాకారంపై బంగా రు తొడగులు అమర్చితే అక్కడున్న పురాతన శాసనాలు కనుమరుగవుతాయని ఎత్తిచూపింది. దీంతో అప్పటి చైర్మన్ ఆదికేశ వులు ఆలయ ప్రాకారంపై ఉన్న శాసనాలను ఎస్టాంపేజెస్ పద్ధతిలో సేకరించి వాటిని సీడీలు, పుస్తకాల్లో భద్ర పరిచారు. అయితే, అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు అనంత స్వర్ణమయం పనుల్ని నిర్మొహమాటంగా వ్యతిరేకిం చారు. టీటీడీ తనవంతుగా కోర్టుకు అఫిడవిట్ కూ డా సమర్పించింది. హ కోర్టు ఉత్తర్వులతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆ తర్వాత డీకే ఆదికేశవులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పనులు పునఃప్రారంభం కాలేదు. స్వర్ణమయం ప్రాజెక్టును రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. మంత్రి మాటలతో తిరిగి ఆజ్యం 2500 కోట్ల బడ్జెట్ కలిగిన తిరుమల ఆలయం ఎప్పు డో దశాబ్దాలకు ముందు వేసిన తాపడంతోనే కని పించడం సరికాదని ఇటీవల తిరుమలలో మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పక్కనే తమిళనాడులోని వేలూరులో స్వర్ణదేవాలయం దగదగ మెరిసిపోతోంది. తిరుమల దేవుడికి డబ్బులు తక్కువా? అంటూ ఎత్తిచూపారు. తిరుమల ఆల యానికి తప్పకుండా బంగారు తాపడం పనులు చేస్తే బాగుంటుం దని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి స్వయంగా చెప్పడం చూస్తే ఆనం ద నిలయం అనంత స్వర్ణమయం పనులు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీకే ఆదికేశవులు సతీమణి డీకే సత్యప్రభ ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అర్ధాం తరంగా ఆగి పోయిన ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసేందుకు డీకే కుటుంబం తీవ్రంగా ప్రయత్నిస్తోం ది. వారి సూచనతోనే మంత్రి యనమల రామకృష్ణుడు బంగారం తాపడం పనులు గురించి ప్రస్తావించాడన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రాజె క్టు వ్యయాన్ని కూడా భరించేందు కు డీకే కుటుంబం వెనక్కు తగ్గదని కొందరు టీటీడీ అధికారులు చెబుతుండడం గమనార్హం. కోర్టు ఇబ్బందులు లేకుంటే పరిశీలిస్తాం తిరుమల శ్రీవారికి ఆలయానికి బంగారు తాపడం పనులకు సంబంధించి కోర్టు వివాదాలు నడిచా యి. అందువల్లే టీటీడీ కూడా అనంత స్వర్ణమయం ప్రాజె క్టు పనులపై వెనకడుగు వేసింది. తాజాగా టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ కూడా సానుకూలంగా స్పందించారు. ‘కోర్టు వివాదాలు లేకుండా అన్నీ సవ్యంగా ఉంటే పరిశీలిస్తాం’ అని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే స్వర్ణమయం పనులు చేసేందుకు టీటీడీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలుస్తోంది. దీంతో స్వర్ణమయం పనులు మళ్లీ తెరపైకి రావడం టీటీడీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
చిత్తూరు జేసీగా భరత్గుప్తా
కలెక్టర్ సిద్ధార్థ్జైన్,టీటీడీ ఈవో గోపాల్ తెలంగాణకే... జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా జేసీ శ్రీధర్కు ఉత్తర్వులు ఎస్పీలు శ్రీనివాస్,గోపినాథ్ జట్టీలు జిల్లాలోనే జిల్లాకు త్వరలో కొత్త కలెక్టర్ సాక్షి, చిత్తూరు: చిత్తూరు జాయింట్ కలెక్టర్గా మదనపల్లె సబ్కలెక్టర్ భరత్గుప్తాను ప్రభుత్వం నియమించింది. చిత్తూరు జేసీ, ప్రస్తుత ఇన్చార్జి కలెక్టర్ శ్రీధర్ను జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జాయింట్ కలెక్టర్గా ఈ ఏడాది మార్చి 10న శ్రీధర్ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో గట్టిగా పనిచేశారు. రాజం పేట పార్లమెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించారు. ప్రజలు ఏదైనా సమస్యతో తన వద్దకు వస్తే తక్షణమే స్పందిస్తారనే మంచి పేరు తెచ్చుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా దూకుడుగా వ్యవహరించారు. ముఖ్యంగా ఎర్రచందనం అంతర్జాతీయ స్మగర్లపై దాదాపు రెండు నెలలుగా పీడీయాక్టు నమోదు చేయకుండా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తాత్సారం చేశారు. ఈ అంశంలో కలెక్టర్పై పలు విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. కలెక్టర్ను తెలంగాణకు కేటాయించడం, సింగపూ ర్ పర్యటనకు వెళ్లడంతో ఇన్చార్జి కలెక్టర్గా శ్రీధర్ ఈ నెల 24న బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంట నే ఏడుగురు అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీయాక్టు నమోదు చే సి ‘శభాష్’ అనిపించుకున్నారు. తక్కిన వారిపై పీడీ నమోదు చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేయాలని పోలీసులను ఆదేశించారు. సబ్కలెక్టర్గా సక్సెస్ చిత్తూరు జేసీగా నియమితులైన భరత్గుప్తా మదనపల్లె సబ్కలెక్టర్గా 2013 అక్టోబర్ 27న బాధ్యతలు తీసుకున్నారు. అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అయిన మదనపల్లె సబ్కలెక్టర్గా సక్సెస్ అయ్యారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని, తన వరకూ వచ్చిన విషయాలకు వీలైనంత వరకూ తక్షణ పరిష్కారం చూపిస్తారని పేరు తెచ్చుకున్నారు. ఒకే స మస్యపై పలుసార్లు తన వద్దకు ప్రజలు వస్తే తీవ్రంగా స్పందించేవారు. జిల్లా పరిస్థితులపై భరత్గుప్తాకు పూర్తిగా అవగాహన ఉండటంతో జాయింట్ కలెక్టర్గా తన బాధ్యతలు మరింత సులువు కానున్నాయి. తెలంగాణకే కలెక్టర్ సిద్ధార్థ్జైన్ కలెక్టర్ సిద్ధార్థ్జైన్ తెలంగాణకే వెళ్లనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా కలెక్టర్ సిద్ధార్థ్జైన్, టీటీడీ ఈవో గోపాల్ తెలంగాణ కేడర్కు, జేసీ శ్రీధర్, మదనపల్లె సబ్కలెక్టర్ భరత్గుప్తా ఆంధ్రాకు కేటాయించబడ్డారు. ఈ నెల 2 వరకూ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ క్రమంలో ఐఏఎస్, ఐపీఎస్ల అభ్యంతరాలను పూర్తిగా తోసిపుచ్చింది. ఇదివరకే జరిగిన బదలాయింపులే ఫైనల్ అని తేల్చి చెప్పింది. దీంతో సిద్ధార్థ్జైన్, గోపాల్ తెలంగాణకు వెళ్లడం అనివార్యమైంది. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు జిల్లాలోనే కొనసాగనున్నారు. జూలై 12న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్జైన్ దూకుడుగా పాలన అందించేందుకు ప్రయత్నించారు. అయితే పూర్తిగా కుప్పంపైనే దృష్టి సారించి విమర్శల పాలయ్యారు. అలాగే అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి మోపి ఇబ్బంది పెట్టారని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. మదనపల్లెను మరువలేను దేశంలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్ కేంద్రమైన మదనపల్లెను జీవితంలో మరువలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ శుభాలే జరిగాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇక్కడ చాలా మధురానుభూతులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మరువలేను. జాయింట్ కలెక్టర్గా శుక్రవారం బాధ్యతలు చేపడతా. - భరత్ గుప్తా చిత్తూరు చాలామంచి జిల్లా : శ్రీధర్, ఇన్చార్జి కలెక్టర్ చిత్తూరులో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి జిల్లా. వీలైనంత వరకూ ప్రజలకు ఉపయోగపడేలా పాలన సాగించాననే తృప్తి ఉంది. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదనే నిర్ణయంతోనే ఇన్చార్జ్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పీడీయాక్టుపై తక్షణ నిర్ణయం తీసుకున్నా. జిల్లా ప్రజలు, అధికారులు కూడా నాపై మంచి ప్రేమ చూపారు. అందరికీ కృతజ్ఞతలు. -
రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
హైదరాబాద్: వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. బీజేవైఎం కార్యదర్శి గోపాల్ ఫిర్యాదు మేరకు షాహినాల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదు చేశారు. వినాయక చవితి సందర్భంగా ‘ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా?...’ అంటూ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ ఆయనపై పలు కేసుల నమోదైన సంగతి తెలిసిందే -
సమగ్ర సర్వే చేసేందుకు వచ్చి బూతుపురాణం
-
‘అనంత’ సంపద చిలక్కొట్టుడు?
అనంత పద్మనాభస్వామి అసలు నగలను దొంగిలించి నకిలీలను ఉంచినట్లు అనుమానం సుప్రీంకు అమికస్ క్యూరీ నివేదిక కాగ్ ఆడిటింగ్కు సిఫార్సు తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగలో ఉన్న లక్ష కోట్లకుపైగా విలువైన సంపద చిలక్కొట్టుడుకు గురవుతోందా? దీని వెనక ‘ఉన్నత వ్యక్తుల’ చేతివాటం ఉందా? ఆలయ నిర్వహణ, సంపద పరిరక్షణపై నివేదిక సమర్పించాలంటూ సుప్రీంకోర్టు నియమించిన మాజీ సొలిసిటర్ జనరల్, అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం శుక్రవారం సమర్పించిన నివేదిక ఈ అనుమానాలనే రేకెత్తిస్తోంది. ఆలయ నిర్వహణ, సంపద పరిరక్షణలో తీవ్ర లోపాలను గుర్తించినట్లు సుబ్రమణియన్ తన సమగ్ర నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. గతంలో నేలమాళిగలోని సంపద మదింపు సమయంలో కల్లారా-బీ అనే గదిని తెరవనివ్వకుండా ట్రస్టీలు అడ్డుకున్నప్పటికీ దాన్ని కొనేళ్ల కిందట తెరిచినట్లుగా ప్రత్యక్ష సాక్షుల ఆధారాలు ఉన్నాయని వివరించారు. నేలమాళిగలోని సంపదను ఉన్నత స్థాయి వ్యక్తులు వ్యవస్థీకృతంగా వెలికితీసే అవకాశం కూడా ఉందన్నారు. ఈ వ్యవహారంపై చాలా ఉదాహరణలను చూపారు. బంగారు పూతపూసే యంత్రం ఇటీవల ఆలయం ఆవరణలో లభించిందని పేర్కొన్నారు. దీంతో అసలైన బంగారు నగలను దొంగిలించి, వాటి స్థానంలో న కిలీ నగలను ఉంచి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ సంపదపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాజీ డెరైక్టర్ వినోద్ రాయ్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో ఆడిటింగ్ నిర్వహించాలని సిఫార్సు చేశారు. అలాగే ఆలయ రోజువారీ వ్యవహారాల్లో ఆలయ ట్రస్టీగా ఉన్న ట్రావెన్కోర్ రాచ కుటుంబ పెద్ద జోక్యాన్ని నివారించాలని కోరారు. నా మాటే రుజువైంది: అచ్యుతానందన్ ఆలయ పరిరక్షణలో లోపాలు ఉన్నట్లు అమికస్ క్యూరీ పేర్కొన్న నేపథ్యంలో మాజీ సీఎం, సీపీఎం నేత వి.ఎస్. అచ్యుతానందన్ స్పందించారు. ఆలయ సంపదను దొంగిలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా యూడీఎఫ్ ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందన్న తన వాదనే నిజమైనదన్నారు. -
కమనీయం...పట్టాభిరాముని కల్యాణం
వాల్మీకిపురం, న్యూస్లైన్: వాల్మీకిపురంలో పట్టాభిరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలి పారు. మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. తిరుచ్చిలో స్వామివారిని అలంకరించి తిరుమాడవీధుల్లో శాస్త్రోక్తంగా ఊరేగించారు. అనంతరం వేదపండితులు స్నపనతిరుమంజనం, ఊంజల్సేవ నిర్వహించారు. తరువాత సీతాలక్ష్మణ సమేత పట్టాభిరాముల వారిని కల్యాణోత్సవానికి ముస్తాబు చేశారు. మంగళవాయిద్యాలతో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తోట వీధిలోని కల్యాణ వేదిక కు తీసుకొచ్చారు. టీటీడీ వేదపండితులు అనంతవెంకటదీక్షితులు, ఆలయ ప్రధాన అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం కమనీయం గా జరిపించారు. ఈ ఉత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించి పులకించిపోయారు. తరువాత స్వామి, అమ్మవార్లను గరుడవాహనంపై ఊరేగించారు. టీటీడీ ఈవో గోపాల్, జేఈవో పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో శ్రీధర్, ఏఈవో ధనుంజయ, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కల్యాణోత్సవ వేదిక వద్ద గురువారం రాత్రి తోటవీధి వినాయక ఉత్సవ కమిటీ, అశ్విని కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. వాల్మీకిపురానికి చెందిన బిల్డర్ ఫణికుమార్, రాఘవేంద్రరావు మజ్జిగ, తాగునీరు సరఫరా చేశారు. -
నేత్రపర్వంగా కల్యాణ వెంకన్న పుష్పయాగం
చంద్రగిరి, న్యూస్లైన్ : శ్రీనివాసమంగాపురంలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పుష్పయాగ కైంకర్యం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ అర్చక బృందం వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అభిషేకించారు. ఉత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామిని కొలువుంచారు. అంతకు ముందు స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. దేశ విదేశాల నుంచి తెప్పించిన పుష్పాలతో అభిషేకించారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వెయ్యి కిలోల పుష్పాలతో కల్యాణ వెంకన్నను అభిషేకించారు. టీటీడీ ఈవో గోపాల్, జేఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు పుష్పాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. -
మెట్పల్లిలో కలకలం
మెట్పల్లి, న్యూస్లైన్ : ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాపర్తి గోపాల్ను మెట్పల్లికి చెందిన రామ్మోహన్ అనే ఎక్సైజ్ ఉద్యోగి అపహరించి హత్య చేసి, మృతదేహాన్ని స్థానిక మాల శ్మశానవాటికలో కాల్చేసినట్టు వెలుగుచూడడంతో పట్టణంలో కలకలం రేగింది. ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు రామ్మోహన్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు శ్మశానవాటికలోని ఓ చితిలో పాక్షికంగా కాలిన కొన్ని శరీరభాగాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. రాపర్తి గోపాల్ బుధవారం రాత్రి 7గంటల సమయంలో ఆదిలాబాద్లో కిడ్నాప్నకు గురయ్యాడు. గోపాల్ను మెట్పల్లికి చెందిన ఎక్సైజ్ ఉద్యోగి రామ్మోహన్ కిడ్నాప్ చేశాడనే అనుమానంతో ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గోదావరిఖనిలో పనిచేస్తున్న రామ్మోహన్ గతంలో ఆదిలాబాద్లో పనిచేశాడు. ఆ సమయంలో కొన్ని ఫైల్స్ మాయం కావడంతో వాటిని అప్పగించాలని గోపాల్ పలుమార్లు రామ్మోహన్ను కోరాడు. ఈ క్రమంలోనే గోపాల్పై కక్ష పెంచుకున్న రామ్మోహన్ ఆయనను కి డ్నాప్ చేసి ఉంటాడనే అనుమానంతో పోలీసులు ఆదుపులోకి తీసుకొని విచారించారు. గోపాల్ను కిడ్నాప్ చేసింది తానేనని ఒప్పుకున్న రామ్మోహన్.. ఆయనను చంపి మృతదేహాన్ని మెట్పల్లిలో పడేశానని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. స్థానిక మాల శ్మశానవాటికలో బుధవారం అర్ధరాత్రి సమయంలో అప్పటికే కాలుతున్న ఓ చితిపై గోపాల్ మృతదేహాన్ని వేసినట్లు ఆయన చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నారాయణ ఆధ్వర్యంలో పోలీస్ బృందం రామ్మోహన్ను తీసుకొని గురువారం మధ్యాహ్నం ఆయన చెప్పినట్లుగా మాల శ్మశానవాటికకు వ చ్చారు. అక్కడ మృతదేహాన్ని కాల్చిన చితితోపాటు పరిసరాలను పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మెట్పల్లి ఠాణాకు చేరుకొని స్థానిక ఎస్సై నటేష్తో చర్చించారు. తర్వాత సాయంత్రం 6గంటల సమయంలో చితి వద్ద కాలు, చేయి ఉందనే సమాచారంలో తిరిగి అక్కడికి చేరుకొని పరిశీలించారు. పూర్తిగా కాలిపోకుండా ఉన్న కాలు, చేయి, అవయవాలు లభ్యం కావడంతో వాటిని స్వాధీనం చేసుకొని తమ వెంట తీసుకెళ్లారు. శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. చంపాడా.. దాచాడా? గోపాల్ కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల అదుపులో ఉన్న రామ్మోహన్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మెట్పల్లితోపాటు పలు ప్రాంతాల్లో గోపాల్ మృతదేహాన్ని పడేసినట్టు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఆయన ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు జిల్లాలోని మేడిపల్లి, మల్లాపూర్ మండలం ఓబులాపూర్లోని గోదావరినదిలో, ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామంలో పరిశీలించిన తర్వాత మెట్పల్లికి వచ్చారు. ఇక్కడ దొరికిన అవయవాల ఆనవాళ్లు గోపాల్వేనా? అన్నది తేలాల్సి ఉంది. దీంతో రామ్మోహన్ గోపాల్ను దాచాడా..? లేక నిజంగానే చంపాడా? అనే సందేహాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతోనే అసలు నిజం వెల్లడవుతుందని పోలీసులు చెబుతున్నారు. తరలివచ్చిన కుటుంబసభ్యులు, సిబ్బంది.. గోపాల్ మృతదేహం మెట్పల్లిలో ఉందనే సమాచారంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, ఎక్సైజ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పట్టణానికి తరలివచ్చారు. మంచిర్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్, ఆదిలాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్తోపాటు చెన్నూర్, కాగజ్నగర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐలు లక్ష్మణ్, వినోద్ రాథోడ్, నరేందర్రెడ్డి, టీఎన్.చారి శ్మశానవాటికకు వచ్చి పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోపాల్ సోదరులు, మిత్రులు వచ్చి ఆచూకీ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. గోపాల్ ఆచూకీ కనుగొని నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. -
చినగార్లపాడులో హత్య
చినగార్లపాడు (కారంపూడి), న్యూస్లైన్: పొలం వద్ద నీరు పెట్టుకునే విషయమై తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి హత్యకు దారితీసింది. ఈ ఘటన చినగార్లపాడు గ్రామంలోని తంగెడ మేజర్ పక్క నున్న కటారువారికుంట పొలంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బత్తుల గోపాల్ (36) హత్యకు గురయ్యాడు. సేకరించిన వివరాల ప్రకారం.. వరి పొలానికి నీళ్లు పెట్టుకునే విషయమై గోపాల్కు, వేంపాటి బ్రహ్మారెడ్డికి మధ్య వివాదం నెలకొంది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో గోపాల్ బ్రహ్మారెడ్డిని కొట్టడంతో, ఆయన ఇంటికి వెళ్లి మరికొందర్ని తీసుకుని పొలం వద్దకు వచ్చాడు. గోపాల్ను బరిసెలతో పొడిచి హత్యచేసి పరారయ్యారు. కొనఊపిరితో ఉన్న గోపాల్ను సమీప పొలాల్లో ఉన్న అతని బంధువులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతిచెందాడు. ఈ సంఘటనతో గోపాల్ భార్య వెంకటరమణ, బంధువులు వందలాదిగా సంఘటనాస్థలానికి చేరుకుని విలపించారు. గోపాల్కు ముగ్గురు కుమారులు ఉన్నారు. హతుని తమ్ముడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు బ్రహ్మారెడ్డి, మరో 13 మంది హత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశాడని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ, ముఠా తగాదాలు కారణం కాదని భావిస్తున్నామని, దర్యాప్తులో నిందితుల పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తత.. హతుడు గోపాల్ టీడీపీ నాయకుడు కావడంతో వివిధ గ్రామాల నుంచి ఆ పార్టీ నాయకులు తరలివచ్చారు. గోపాల్ వర్గీయులు హత్యకు పాల్పడ్డారని భావిస్తున్న వర్గీయుల ఇళ్లపై దాడికి యత్నించారు. ఇళ్లలో మహిళలు, పిల్లలు మాత్రమే ఉండడంతో వారి జోలిక వెళ్లలేదని, లేకుంటే ప్రతీకార దాడి జరిగి ఉండేదని గ్రామస్తులు తెలిపారు. కారంపూడి, దాచేపల్లి ఎస్ఐలు సురేంద్రబాబు, రమేష్బాబు, పోలీసు సిబ్బంది హత్య జరిగిన అరగంటలోపే గ్రామానికి చేరుకొని ఉద్రిక్తతను తగ్గించగలిగారు. పొలం నుంచి గోపాల్ మృతదేహాన్ని సెంటర్కు తెచ్చే సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రతీకార నినాదాలు చేశారు. ట్రక్కులో వున్న మృతదేహాన్ని కొందరు పైకి లేపి గ్రామస్తులకు చూపే సమయంలో ఉద్వేగం చోటుచేసుకుంది. పూర్వం నుంచి వర్గపోరు నడుస్తున్న గ్రామం కావడంతో ఈ హత్య ఆ రంగు పులుముకుంటుందనే ఆందోళన నెలకొంది. గ్రామంలో పోలీస్ పికెట్ పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల తరలించారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటుచేసి సీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంతులేని అవినీతి!
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్లైన్: జిల్లాలోని చెక్పోస్ట్ల్లో అవినీతికి అంతులేకుండా పోతోంది. ఏసీబీ అధికారులు తరచూ దాడులు చేస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా గుడిపాల మండలంలోని నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్లో సొమ్ము పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. నరహరిపేట చెక్పోస్ట్లో శనివారం తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విధినిర్వహణలో ఉన్న ఏసీటీవోలు సురేష్, గోపాల్, పళణి, సివిల్ సప్లయిస్ డెప్యూటీ తహశీల్దార్ రహీముద్దీన్ఖాన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద రశీదులు లేకుండా ఉన్న 1,02,690 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన దాడుల్లోనూ పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులో ఉప వాణిజ్యపన్నుల శాఖాధికారి, సహాయ వాణిజ్యపన్నుల శాఖాధికారి, మోటారు వాహనాల తనిఖీ అధికారి, సహాయ మోటారు వాహనాల తనిఖీ అధికారి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు సంబంధించి ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, అటవీశాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. వీరు సహాయకులుగా కొందరు ప్రయివేటు వ్యక్తులను నియమించుకుని విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమ్యామ్యా వ్యవహారాలన్నీ ప్రయివేటు వ్యక్తులు చక్కబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీరు పట్టుబడితే చర్యలు ఉండవనే భావన సిబ్బందిలో నెలకొంది. గతంలో కన్నా అధిక సొమ్ము నరహరిపేట చెక్పోస్ట్పై ఏసీబీ అధికారులు ఈ ఏడాది మార్చి 27న దాడులు చేశారు. మొత్తం 90,170 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం అంతకంటే ఎక్కువగా 1,02,690 రూపాయలు పట్టుబడింది. ఇటీవల పలమనేరు మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయంలో దాడులు నిర్వహించారు. అవినీతి సొమ్ముకు సంబంధించి కొంత మంది సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. అదే విధంగా తిరుపతి ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం, రేణిగుంట రవాణా చెక్పోస్ట్లపై గతంలో దాడులు జరిగాయి. అధిక మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. డిసెంబర్ హడావుడే.. డిసెంబర్ కదా ఇది మామూలుగా జరిగే వ్యవహారమే అంటూ ఏసీబీ దాడులపై కొందరు సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. దాడులను వారు ఏ మాత్రమూ తీవ్రంగా పరిగణించినట్లు లేదు. ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తే తప్ప సిబ్బందికి అవినీతి జాడ్యం వదిలేటట్లు లేదు. -
ఒత్తిళ్లను అధిగమిస్తేనే విజయం
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ బళ్లారి అర్బన్, న్యూస్లైన్ : మానసిక ఒత్తిళ్లను అధిగమించినప్పుడే పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయం సాధ్యమవుతుందని ప్రముఖ నవలా రచయిత, మానసిక వైద్య నిపుణులు, ఫిల్మ్ డెరైక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులకు సూచించారు. స్థానిక రాఘవ కళామందిరంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దశల వారీగా శ్రీచైతన్య విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఒత్తిళ్లను తట్టుకునే విధానాలపై మెళకువలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చురుకుదనం, బుద్ధి వికాసంతో పాటు శారీరక ఎదుగుదలకు వ్యక్తిత్వ వికాసం తోడ్పడుతుందన్నారు. విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందించి ఉజ్వల భవిష్యత్తు అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యాభివృద్ధితోనే దేశం మరింత పురోభివృద్ధి చెందుతుందన్నారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లభించాలంటే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నాపత్రం అందించి జవాబులు సరిచేసే విధానాన్ని క్షుణంగా వివరించారు. అత్యంత వినోదంగా, ఉత్సాహంగా సాగిన యండమూరి ప్రసంగం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపింది. కార్యక్రమంలో శ్రీచైతన్య పీయూ కళాశాల ప్రిన్సిపాల్ బీ.గోపాల్, శ్రీరాములు, అనిత, ఎన్ చంద్రశేఖర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న ఫలపుష్ప ప్రదర్శన
తిరుచానూరు, న్యూస్లైన్: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రదర్శనశాల ను శుక్రవారం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్ ప్రారంభించారు. అనంతరం అక్కడున్న పురాణాలకు సంబంధించిన కళాకండాలు, కూరగాయలతో రూపొందించిన బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, పుస్తక ప్రదర్శన, విక్రయ స్టాల్ను ప్రారంభించారు. ఆకట్టుకుంటున్న కళాకండాలు పురాణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని తులాభారం, గజేంద్ర మోక్షం, హిరణ్యాక్షకుడనే రాక్షసు న్ని సంహరించి భూదేవిని కాపాడుతున్న శ్వేత వరాహస్వామి, మారువేషంలో వచ్చి సీతమ్మను భిక్షమడిగే రావణాసురుడు, మహిరావణుడనే రాక్షసున్ని సంహరించి రామలక్ష్మణులను భుజంపై తీసుకెళ్తున్న హనుమంతుడు వంటి సన్నివేశాలకు సంబంధించిన కళాకండాలు ఆకట్టుకుంటున్నాయి. పూలతో అలంకరించిన ఏనుగు బొమ్మ, కూరగాయలతో చేసిన కళాకృతులు కూడా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. -
యువతరం ఇష్టసఖి
అజయ్, వరుణ్, శ్రీరామ్, భాస్కర్, అనుస్మృతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ఇష్టసఖి’. శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడు. వింజమూరి మధు నిర్మాత. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విలేకరులకు ప్రదర్శించారు. కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా యుత్ని ఆకట్టుకుంటుందని, శ్రీహరి తనకోసమే ఇందులో నటించారని, ఆయన లేకపోవడం బాధగా ఉందని దర్శకుడు అన్నారు. చిత్ర బృందంతో పాటు పంపిణీదారుడు గోపాల్, బాలాజీ నాగలింగం, సీతారాం, పైడిబాబు, రవి కూడా పాల్గొన్నారు. -
మైకేల్ అభిమాని కథ
పాప్స్టార్ మైకేల్ జాక్సన్కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉంటారు. అలాంటి ఓ అభిమాని కథతో రూపొందుతున్న చిత్రం ‘మిరాకిల్’. జయ్ శ్రీనివాస్రాజ్ సమర్పణలో తిరుమల వెంచర్స్ పతాకంపై ఉదయ్బాబు నిర్మిస్తున్నారు. గోపాల్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆనంద్ వంగా తెలియజేస్తూ -‘‘ఈ చిత్రాన్ని మైకేల్ జాక్సన్కి అంకితం చేస్తున్నాం.ఇందులో మైకేల్గా, ఆయన అభిమానిగా గోపాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే కథ, స్క్రీన్ప్లే, సంభాషణలతో పాటు మ్యూజిక్, ఎడిటింగ్ కూడా గోపాలే చేయడం విశేషం. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యనారాయణ్. -
గుణ‘పాఠం’ చెబుతాం
చిత్తూరు(టౌన్), న్యూస్లైన్: ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురువులు గర్జించారు. గురుపూజోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించి ‘మాకు సమైక్యాంధ్ర మాత్రమే కావాలి’ అంటూ డప్పు కొట్టి మరీ నినదించారు. రకరకాల ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ, ఉపాధ్యాయ జేఏసీ పిలుపు మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో విభజన నిర్ణయాన్ని ఎండగడుతూ టీచర్లు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో సుమారు 3వేల మంది నల్ల దుస్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ వద్ద చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ర్యాలీని ప్రారంభించారు. జిల్లా గెజిటెడ్ అధికారుల జేఏసీ నేతలు, నల్లటి దుస్తులు ధరించిన ఉపాధ్యాయులతో కలిసి ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలు తెప్పించిన 500 అడుగుల నల్ల వస్త్రాన్ని టీచర్లు ర్యాలీలో పట్టుకొని నిరసన తెలిపారు. విద్యార్థుల కోలాటాలు, పీఈటీలు లెజిమ్స్, ఉపాధ్యాయులు డప్పుతో ర్యాలీలో ముందుకుసాగారు. ‘పంతుళ్ల పంతం... వేర్పాటువాదం అంతం,గురువుల వేదన సమైక్యాంధ్ర సాధన, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కన్నా సమైక్యాంధ్ర ఉద్యమమే మిన్న, సర్వమతం సమైక్యం, విభజన ఆపండి విద్యార్థులను కాపాడండి’ అని ప్లకార్డులు చేతబూని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఓ ఉపాధ్యాయుడు యముడి వేషం వేసి, తాడుతో కేసీఆర్ ప్లకార్డు ధరించి ఉన్న టీచర్ను లాగుతూ ‘రాష్ట్రాన్ని విడదీస్తావా? నిన్ను పైకి తీసుకెళ్లాల్సిందే’ అంటూ అరుస్తూ ర్యాలీలో ముం దుకు సాగాడు. మరికొందరు గాంధీ విగ్రహం వద్ద డ్యా న్సులు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల నిరసనకు మద్దతుగా పలు పాఠశాలల విద్యార్థులు గాంధీ విగ్రహం చుట్టూ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈవో బీ.ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం ఎంత ముఖ్యమైందో అందరికీ తెలుసని, అయితే జిల్లా టీచర్లు అవార్డుల కన్నా సమైక్యాంధ్ర ముఖ్యమని ముందుకు రావడం అభినందనీయమన్నారు. తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పలమనేరు తదితర ప్రాంతా ల్లో నిరసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిం చారు. చిత్తూరులో జరిగిన ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల జేఏసీ నేతలు వెంకటసుబ్బారెడ్డి, శేషయ్య, అనిల్కుమార్రెడ్డి, చంద్రమౌళి, వర్మ, జయప్రకాష్, టీచర్స్ జేఏసీ నేతలు గిరిప్రసాద్రెడ్డి, శ్రీరామమూర్తి, రవీంద్రారెడ్డి, రవిరెడ్డి, వెంకటేశ్వర్లు, బాబు, దామోద రం, నరేంద్రకుమార్, మఫిషియల్ అసోసియేషన్ నేత లు పురుషోత్తం, మురళీమోహన్, రవిశేఖర్, ప్రేమ్కుమార్, గోపాల్, సహదేవనాయుడు పాల్గొన్నారు.