భార్యను 22 సార్లు కత్తితో పొడిచాడు | husband killed his wife in karnataka | Sakshi
Sakshi News home page

భార్యను 22 సార్లు కత్తితో పొడిచాడు

Published Thu, Feb 18 2016 12:04 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

భార్యను 22 సార్లు కత్తితో పొడిచాడు - Sakshi

భార్యను 22 సార్లు కత్తితో పొడిచాడు

మైసూరులో కిరాతకం
 
మైసూరు :  మైసూరులో కలకలం రేగింది. ఓ కిరాతకుడు భార్యను అత్యంత క్రూరంగా కత్తితో పొడిచి పొడిచి చంపడం సంచలనం రేపింది. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉండే నగరవాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.  మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మైసూరు నగరంలో మేటిగెహళ్ళి నివాసి గోపాల్‌కు విద్యారణ్యపురకు చెందిన దీపా(25)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో మద్యం చిచ్చు రేపింది.  కొంత కాలంగా మద్యానికి బానిసైన గోపాల్  నిరంతరం భార్యతో గొడవపడి చావబాదేవాడు.  భర్త వేధింపులు తాళలేక దీపా పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం రాత్రి పీకల దాక మద్యం తాగిన గోపాల్ దీపా ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు.

వెంట తెంచుకున్న కత్తితో దీపాపై 22 సార్లు  అమానుషంగా పొడిచి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన దీపా అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో  విద్యారణ్యపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు గోపాల్ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement