vinayaka chavithi
-
విశాఖలో ఘనంగా వినాయక చవితి సంబురాలు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణేషుడి తొలిపూజలో సీఎం.. గవర్నర్ ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేషుడికి సీఎం రేవంత్రెడ్డి తొలిపూజ నిర్వహించనున్నారు. 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంలో మహాగణపతి దర్శనమిస్తున్నారు.👉ఖైరతాబాద్ గణేశుడిని సీఎం రేవంత్రెడ్డి దర్శించుకున్నారు. సప్తముఖ వినాయకుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి.. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్రెడ్డి.. మహాగణపతికి గజమాల, పండ్లు సమర్పించారు. వినాయకుడి తొలిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. రాష్ట్రంలోని అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. శనివారం మధ్యాహ్నం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గవర్నర్కు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.👉ఏటా ఒక్కో రూపంలో దర్శనమిచ్చే మహాగణపతి ఈసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో నిలబడిన ఆకారంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో కూడిన సప్త ముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం, రెండువైపులా 14 చేతులతో కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద.. ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతికి కుడివైపున పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహంతో ఈసారి దర్శనమిస్తున్నారు.👉ఎడమవైపు రాహు కేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేశారు. మహాగణపతి పాదాల చెంత ఆయన వాహనమైన మూషికం ఆకారాలు 3 అడుగులలో దర్శనమిస్తున్నాయి. విగ్రహానికి కుడివైపున 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపు శివపార్వతుల కళ్యాణం విగ్రహ మూర్తులను ఏర్పాటు చేశారు. -
ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు గణనాథుని ఆశీస్సులు ఉండాలని.. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి.. విజయాలు సిద్ధించాలని.. గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబమూ సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
పండుగనాడూ పస్తులే
సాక్షి, అమరావతి : హిందువుల తొలి పండుగ వినాయక చవితిని ఘనంగా నిర్వహించేందుకు దేశమంతా ఏర్పాట్లు చేసుకున్నారు. రాష్ట్ర రాజధానిలో భాగంగా చెప్పుకొనే విజయవాడలో మాత్రం పండుగ జాడ కానరావట్లేదు. బెజవాడ నగరం సగానికిపైగా వరద నీటిలో మునగడంతో బాధితులు తీవ్ర విషాదంలో ఉన్నారు. పండుగ నాడూ పస్తులుండాల్సిన స్థితిలో ఉన్నారు. వరద ప్రాంతాల్లో మంచి నీరు, ఆహారం కోసం బాధితులు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. దాతలు పెద్ద ఎత్తున తెస్తున్న ఆహారం, ప్రభుత్వం అందిస్తున్న మంచినీరు, ఆహారం వరద ప్రాంతాల మొదట్లోనే ఆగిపోతున్నాయి. వరద తీవ్రత ఉన్న లోపలి ప్రాంతాలకు అవి అందడంలేదు. దీంతో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు నీటిలో ఎదురీదుతూ వచ్చి నీరు, ఆహారం కోసం ట్రాక్టర్లు, వ్యాన్ల వెంట పరుగులు తీస్తున్న దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయి. వరద విపత్తుతో యుద్ధం.. గురువారం మధ్యాహా్ననికి వరద కొంత శాంతించిందని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బుడమేరు ఊరిపై పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నీటి ఉధృతి పెరగడంతో అజిత్సింగ్నగర్, రాజరాజశ్వరిపేట, వాంబే కాలనీ, సుందరయ్యనగర్, కండ్రిక తదితర ప్రాంతాల్లో ప్రజలు మళ్లీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ప్రజల జీవన్మరణ పోరాటం.. పోలీసుల ఆంక్షలు.. ఉద్యోగుల హడావుడితో వరద ప్రాంతాల్లో యుద్ధ వాతావరణంలాంటి పరిస్థితి నెలకొంది. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లిన వారిని మళ్లీ ఇంటికి చేరకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో కుటుంబంలో బయట కొందరు, వరద నీరు చుట్టుముట్టిన ఇళ్లలో మరికొందరు చిక్కుకుపోయారు. వారి వాళ్లను కలిసే అవకాశం లేక అవస్థలు పడుతన్నారు. అటుగా వెళ్లే ట్రాక్టర్లు, వ్యాన్లు, బస్సులు ఎక్కి ముంపు ప్రాంతంలోని ఇళ్లకు తిరిగి చేరేందుకు బాధితులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లనీయడంలేదు. తమనైనా ఇళ్లకు పంపాలని, లేదంటే ఇంట్లో చిక్కుకుపోయిన వాళ్లనైనా బయటకు తీసుకురావాలని వందలాది మంది ఆందోళన చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా వారిపై పోలీసులు పరుష పదజాలంతో విరుచుకుపడుతన్నారు. దీంతో మేమేమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నామా? మా ఇంటికి మేము వెళ్లకుండా అడ్డుకుంటారా? ప్రభుత్వం ఎలాగు పట్టించుకోదు.. మా చావు మేము చస్తాం అంటూ పలుచోట్ల ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు.మాకు రిలీవర్ను ఇవ్వండి సార్.. అధికారులకు రోజు విడిచి రోజు షిఫ్ట్ పద్ధతిలో వరద ప్రాంతాల్లో విధులు కేటాయిస్తుంటే.. దిగువ స్థాయి ఉద్యోగులకు మాత్రం 24/7 విధులు చేయించడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. సార్.. రేపు వినాయక చవితి ఇంటికి వెళ్తాం.. ఒక్కరోజుకైనా రిలీవర్ను పంపించండి అంటూ వేడుకుంటున్నారు. వారం రోజులుగా విజయవాడలోనే పని చేస్తున్నామని, పండుగ ఒక్కరోజైనా వేరొకరిని కేటాయించి తమకు శలవు ఇవ్వాలని పశి్చమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగులు అధికారులకు మొరపెట్టుకోవడం గమనార్హం. నిన్ను నమ్మలేం బాబు..బాధితుల ఆగ్రహంవన్టౌన్ (విజయవాడ పశ్చిమ) : వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం ‘నిన్ను నమ్మలేం బాబు’ అంటూ ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. ఐదు రోజులుగా జనం నరకాన్ని చవిచూస్తున్నారు. మొదటి మూడ్రోజులు కొంతమందికే ఆహారం, మంచినీరు వచ్చింది. అది కూడా వంతెన పైన ఉన్న ప్రాంతాల్లో ఇచ్చి చేతులు దులుపుకున్న సంగతులు తెలిసిందే. అధికారులు, ప్రజా ప్రతినిధులు చివరివరకూ వెళ్లలేక చేతులెత్తేశారని స్థానికులు మండిపడ్డారు. అయితే, ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతోంది. దీంతో సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు సాయమందిస్తాం ధైర్యంగా ఉండండి అంటూ పదేపదే భరోసా కల్పిస్తున్నప్పటికీ ఇక్కడి స్థానికులు వారి మాటలను విశ్వసించడంలేదు. మీకు రేషన్ బియ్యాన్ని పంపిస్తున్నాం, ఇతర సరుకులను పంపిస్తాం అంటూ తెగ ప్రచారం చేస్తున్నా మళ్లీ వరద వస్తే వీరంతా తమను వదిలేస్తారంటూ దాదాపు 30–40 శాతం మంది సురక్షిత ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు.అనేక బోట్లు మా ముందే ఖాళీగా వెళ్తుంటే తాము బతిమాలుతున్నా పట్టించుకోకుండా పోయారంటూ బాధితులు మండిపడుతున్నారు. అటువంటి ప్రభుత్వం ఉన్న క్రమంలో మళ్లీ వరదనీరు ముంచెత్తితే మా బతుకులు తెల్లారతాయంటూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. వరద పూర్తిగా తగ్గిన తరువాతే మా ఇళ్లకు వస్తామంటూ సింగ్నగర్, ఆంధ్రప్రభ కాలనీ, వాంబే కాలనీ, ఉడా కాలనీ, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, ప్రకాష్నగర్, కబేళాలకు చెందిన వారు తేల్చిచెబుతున్నారు. రెండు రోజులుగా రోడ్డుపైనే ‘నిత్యావసర’ లారీలుఅన్లోడ్ చేయకపోవడంతో అవస్థలు పడుతున్న డ్రైవర్లువరద వల్ల సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లర్లు పంపించిన నిత్యావసర సరుకుల లారీలు అన్లోడ్ కోసం ఎదురుచూస్తున్నాయి. అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో రెండు రోజులుగా విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో పెద్ద సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. వాటిని ఎప్పుడు తీసుకెళ్తారో అర్థమవ్వక.. లారీల డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. ‘గురువారం రాత్రి బియ్యం లోడుతో అమలాపురం నుంచి విజయవాడకు వచ్చాను. అప్పటి నుంచి బీఆర్టీఎస్ రోడ్డులోనే పార్కింగ్ చేసి ఉంచాను. అధికారులు ఎప్పుడు అన్లోడ్ చేయిస్తారో అర్థమవ్వట్లేదు’ అని లారీ డ్రైవర్ ఏడుకొండలు వాపోయాడు.– నెహ్రూనగర్, మేడికొండూరుప్రకాశం బ్యారేజ్కు మరమ్మతులుసాక్షి, అమరావతి: కృష్ణా వరద ఉధృతికి కొట్టుకొచ్చిన నాలుగు పడవలు ఢీకొనడంతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ మూడు గేట్లకు ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సలహాదారు కన్నయ్యనాయుడు నేతృత్వంలో మరమ్మతు పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా 69, 67 గేట్ల కౌంటర్ వెయిట్లను గురు, శుక్రవారాల్లో బీకెమ్ సంస్థ కార్మికులు తొలగించారు. 67, 68, 69 గేట్లను కిందకు దించారు. శనివారం 67–68 గేట్ల వద్ద ఉన్న రెండు పడవలను మరపడవతో తొలగించనున్నారు. హైదరాబాద్లో తయారు చేయించిన ఐరన్ కౌంటర్ వెయిట్లను విజయవాడకు తెచ్చి.. వాటిని 69, 67 గేట్లకు శనివారం బిగిస్తారు. -
#VinayakaChavithi : రేపటి నుండి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం (ఫొటోలు)
-
#VinayakaChavithi2024 : వినాయక చవితికి నేను సిద్దం..మరి మీరు (ఫొటోలు)
-
Prince World 2024: మోడల్ కార్తికేయ
మోడల్ కార్తికేయనడకతోపాటే నాట్యం కూడా నేర్చుకున్నాడు కార్తికేయ. వినాయక చవితి స్టేజ్తో మొదలు పెట్టి అంతర్జాతీయ వేదికపై మెరిశాడీ మోడలింగ్ ప్రిన్స్. థాయ్లాండ్లో జరిగిన అంతర్జాతీయ మోడలింగ్ పోటీల్లో ‘ప్రిన్స్ వరల్డ్–2024’ టైటిల్ సొంతం చేసుకుని వైజాగ్కు తిరిగి వచ్చిన కార్తికేయ సక్సెస్ స్టోరీ ఇది.థాయ్లాండ్లో ‘ప్రిన్స్’కిరీటం..కార్తికేయ రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్–2, ఆంధ్రా ఫ్యాషన్ వీక్ పోటీలలో విజేతగా నిలిచాడు. కోళికోడ్ నగరంలో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లో కూడా విజయం సాధించాడు. ప్రిన్స్ ఆఫ్ ఏపీ సబ్ టైటిల్ను గెలిచి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. దీంతో ఇటీవల థాయ్లాండ్లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో పోటీలు నిర్వహించారు. దీనికి 11 దేశాల నుంచి 45 మంది చిన్నారులు పోటీ పడ్డారు. ఇందులో కార్తికేయ మనదేశానికి ప్రాతినిథ్యం వహించాడు. నాలుగవ తరగతి చదువుతున్న ఈ విశాఖపట్నం కుర్రాడు మోడలింగ్తోపాటు వ్యాఖ్యానం, నటన, కథలు చెప్పడం, యోగా ఇలా అనేక రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కార్తికేయ తండ్రి బి.జె.శ్రీనివాసరెడ్డి ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆయన కథలు, కవితలు, వెబ్ పేజీలకు ఆర్టికల్స్ రాస్తుంటారు. వీటితోపాటు సేంద్రియ వ్యవసాయం, తేనెటీగల పెంపకం ఆయన ఆసక్తులు. కార్తికేయ తల్లి పావనీ లత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో ఇంజినీర్. చిత్రకారిణి కూడా. తల్లిదండ్రులిద్దరిలోనూ సృజనాత్మకత మెండుగా ఉండడం పిల్లల మీద మంచి ప్రభావం చూపించింది.రెండేళ్లకు బ్రేక్కార్తికేయ రెండేళ్ల వయసులో గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలలో తొలిసారిగా చేసిన డ్యాన్స్కు మంచి ప్రశంసలందాయి. ప్లే స్కూల్లో పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే.. కార్తికేయ డ్యాన్సులతో ఆ పిల్లలను అలరించేవాడు. దీంతో తల్లిదండ్రులు మంచి డ్యాన్సర్ను చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మూడో ఏట కాలికి సర్జరీ అవడంతో ఏడాదిపాటు డ్యాన్స్కు దూరం కావల్సి వచ్చింది. గాయం తగ్గిన వెంటనే మళ్లీ డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కాడు. పాశ్చాత్య నృత్యాన్ని అభ్యసించాడు. స్కూల్లో జరిగే కల్చరల్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు. అతడు ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం విమర్శకుల మన్ననలు పోందింది. రాగయుక్తంగా శ్లోకాలు, గీతాలు పాడి అందరి అభినందనలు అందుకున్నాడు. డ్యాన్స్లోనే కాకుండా తొలిసారిగా ఫ్యాషన్ షోలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. డ్యాన్సర్గా, మోడల్గా పలు రాష్ట్రాల్లో షోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇద్దరూ ఆణిముత్యాలేతమ్ముడు కార్తికేయ రెడ్డి డ్యాన్స్, మోడలింగ్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అక్క హరి శ్రేయసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకుంది. 34 శ్లోకాల సమాహారమైన ‘శ్యామలదండకం’ వల్లించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైంది. అలాగే చిత్ర లేఖనం, పాటల పోటీలలో కూడా బహుమతులు గెలుచుకుంది. 2024లో ఉగాది ప్రతిభా పురస్కారం అందుకుంది.– దుక్క మురళీకృష్ణారెడ్డి, సాక్షి, విశాఖపట్నం -
Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తజన సందోహం (ఫోటోలు)
-
వినాయక నిమజ్జనంలో సితార, గౌతమ్.. వీడియో వైరల్!!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్ ప్రిన్స్ కూతురు సితార, కుమారుడు గౌతమ్ గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్లోని ఇంటిలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోను నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇది చదవండి: తొలిసారి హీరోయిన్గా ట్రాన్స్జెండర్.. హీరోగా ఎవరంటే?) తమ ఇంట్లో పూజలు చేసిన వినాయకుడిని ఆవరణలోని ఓ డ్రమ్ము నీటిలో నిమజ్జనం చేశారు. ఈ వీడియోలో నమ్రతా, మహేశ్ బాబు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంట్లోని పనివారితో కలిసి ఈ వేడుకల్లో సితార, గౌతమ్ పాల్గొన్నారు. నమ్రతా ఇన్స్టాలో రాస్తూ 'గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం' అంటూ పోస్ట్ చేసింది. అయితే మహేశ్ బాబు కూతురు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ అభిమానులతో టచ్లోనే ఉంటోంది. కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో కలిసి ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు. (ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సింగపూర్లో ఘనంగా వినాయక చవితి పూజలు.. లడ్డూ వేలం
సింగపూర్లో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుని జయజయద్వానాల మధ్య భక్తి శ్రద్దలతో, ఎంతో అద్యాత్మిక శోభతో ఘనంగా జరిగింది. సుమారు వందమంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించబడి ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దిన గణనాధుని ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజనంతరం వినాయకచవితి లడ్డు వేలం ఆసక్తికరంగా సాగింది. ఇందులో వీరగ్రూపు లడ్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి..పూజలో పాల్గొన్న పిల్లలందిరికి మట్టితో చేసిన గణపతి విగ్రహాలు అందించారు. అనంతరం 800 మందికి అన్నిరకాల 21 పత్రిని ఉచితంగా పంచిపెట్టారు. ఈ పూజా కార్యక్రమాన్ని సుమారు 500 ప్రత్యక్షంగా, 5000 మంది అంతర్జాలం ద్వారా వీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
అమెరికాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, 11 రోజుల పాటు..
అమెరికాలోని నార్త్ కరోలినాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హంటర్స్విల్లేలోని సాయిమందిర్లో గణపతి ప్రతిమను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పెద్ద ఊరేగింపుతో మండపానికి తీసుకువచ్చారు. మహిళల కోలాటాలు, భజనలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన మండపాల్లో గణనాథుడిని ప్రతిష్టించారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. విఘ్నేశ్వరుడ్ని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 11 రోజుల పాటు నిత్యపూజలు, మండపంలో రోజుకో అలంకరణ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గణేష్ ఉత్సవాలతో పాటు 5వ వార్షికోత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం, బాబాకి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. -
వినాయక చవితి స్పెషల్: స్వీట్ సందేశ్ చేసుకోండి ఇలా
స్వీట్ సందేష్ ఇలా చేసుకోండి కావలసినవి: ఉడికించిన చిలగడ దుంప – పెద్దది ఒకటి; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; జీడిపప్పు పొడి – పావు కప్పు; కొబ్బరి పాలు – అరకప్పు; పంచదార – అరకప్పు; యాలకులపొడి – అరటీస్పూను; రోజ్ వాటర్ – టీస్పూను. తయారీ: చిలగడ దుంప తొక్క తీసి ఉండలు లేకుండా మెత్తగా చిదుముకోవాలి ∙చిదుముకున్న చిలగడ దుంప మిశ్రమంలో జీడిపప్పు పొడి వేసి కలపాలి. పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి సుగర్ సిరప్ను తయారు చేసుకోవాలి ∙సిరప్ తయార య్యాక కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చినప్పుడు చిలగడదుంప మిశ్రమాన్ని వేసి కలపాలి ∙మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొబ్బరిపాలు వేయాలి ∙మధ్యలో కొబ్బరి పాలతో΄పాటు యాలకులపొడి, రోజ్వాటర్ వేసి కలుపుతూ మొత్తం కొబ్బరి పాలు అయిపోయేంత వరకు మగ్గనివ్వాలి ∙ దాదాపు ఇరవై నిమిషాల తరువాత ఈ మిశ్రమం దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసేయాలి ∙ గోరువెచ్చగా ఉన్నప్పుడే మిశ్రమాన్ని చేతులతోగానీ, మౌల్డ్స్లోవేసి నచ్చిన ఆకారంలో వత్తుకుంటే స్వీట్ సందేష్ రెడీ. -
మెగా ఇంట్లో సందడి.. ఈ సారి ప్రత్యేకత ఏంటో తెలుసా?
మెగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది వినాయకచవితి మెగా ఫ్యామిలీకి మరింత స్పెషల్. ఎందుకంటే తొలిసారిగా మెగా వారసురాలితో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జూన్లో మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన దంపతులకు బేబీ పుట్టింది. అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మినిచ్చింది. మెగా వారసురాలు అడుగుపెట్టిన సందర్భంగా ఫ్యాన్స్తో పాటు కుటుంబసభ్యులు సైతం ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. (ఇది చదవండి: వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!) తన మనవరాలి పేరును మెగాస్టార్ దంపతులు రివీల్ చేశారు. కొణిదెల క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా క్లీంకారతో కలిసి ఈ ఏడాది వినాయకచవితిని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన తమ ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇవీ చూసిన మెగా ఫ్యాన్స్ సైతం తాము అభిమానించే ఫ్యామిలీకి వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏 ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊 Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd — Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023 (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) రామ్ చరణ్ ఇన్స్టాలో రాస్తూ.. 'అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
వినాయక చవితి స్పెషల్: కేసి మిథోయ్
కేసి మిథోయ్ కావలసినవి: తాజా బియ్యప్పిండి – రెండు కప్పులు; పచ్చికొబ్బరి తురుము – కప్పు; పంచదార పొడి – అరకప్పు; యాలకుల పొడి అరటీస్పూను; కొబ్బరి నీళ్లు – అరకప్పు. తయారీ: ►తడి బియ్యప్పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ∙దీనిలో కొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల ΄పొడి వేసి కలపాలి. ► అవసరాన్ని బట్టి కొబ్బరి నీళ్లను కొద్దికొద్దిగా వేసి పిండిని ముద్దలా కలుపుకోవాలి. ► పిండి ముద్దను చిన్న భాగాలుగా చేసి, ఉండలుగా చుట్టుకోవాలి ∙పిండిమొత్తాన్ని ఉండలుగా చుట్టుకుంటే కేసి మిథాయ్ రెడీ. ► కొబ్బరి నీళ్లకు బదులు కొద్దిగా నెయ్యికూడా కలుపుకోవచ్చు ∙రిఫ్రిజిరేటర్లో రెండుమూడురోజుల వరకు ఇవి తాజాగా ఉంటాయి. -
ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా లేదు.. దీని విశిష్టత ఇదే
ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూణెలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం కింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూణె చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోంది. -
వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!
వినాయకచవితి పండుగ వచ్చిందంటే చాలు. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు డ్యాన్సులతో హోరెత్తిస్తారు. పెద్ద పెద్ద డీజేలు, గణనాధుని పాటలతో ఏ గల్లీలో చూసినా సందడే సందడి.. ధూమ్ ధామ్. మరీ ఇంత సంతోషంగా పిల్లలు, పెద్దలు జరుపుకునే పండుగలో గణనాథునిపై మనం రాసుకున్న పాటలకైతే కొదువ లేదాయే. మరీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంతోషంగా గణనాధున్ని గంగమ్మ ఒడికి చేర్చే వరకు మనకోసం.. మరీ ముఖ్యంగా బొజ్జ గణపయ్య కోసం సినిమాల్లో వచ్చిన పాటలను ఓ సారి గుర్తు చేసుకుందాం. వినాయకచవితి సందర్భంగా లంబోదరుడి సూపర్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం పదండి. సినిమాల్లో మన గణపయ్య సూపర్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ 'జై చిరంజీవ'- 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' అనే సాంగ్ వినాయకచవితి వచ్చిందంటే కచ్చితంగా ఉండాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక ప్రధాప పాత్రల్లో విజయ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెంకటేశ్ కూలీనెం 1- 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా' 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా. నీ అండదండా ఉండాలయ్యా.. దేవా' అంటూ సాగే వినాయకుని పాట ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్. వెంకటేశ్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2002లో రిలీజైంది. 100% లవ్ -'తిరుతిరు గణనాథ..' నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 100% లవ్. ఈ చిత్రంలో తమన్నా పాడే 'తిరుతిరు గణనాథ..' అంటూ పాడే సాంగ్ హైలెట్. వినాయకచవితి పండుగ రోజు ఈ పాట కచ్చితంగా ఉండాల్సిందే. అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో'- గణపతి బప్పా మోరియా అల్లు అర్జున్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రం ఇద్దరమ్మాయిలతో. ఈ చిత్రంలో 'గణపతి బప్ప మోరియా' సాంగ్ వినని వారుండరు. ఐకాన్ స్టార్ ఈ పాటకు తన స్టెప్పులతో అదరగొట్టాడు. వెస్ట్రర్న్ స్టెల్లో బన్నీ దుమ్ములేపారు. దేవుళ్లు- 'వక్రతుండా మహాకాయ' సాంగ్ ఎస్పీ బాలసుబ్రమణ్య ఆలపించిన ఈ సాంగ్ దేవుళ్లు సినిమాలోది. ఇద్దరు చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం దేవుడిని మొక్కులు చెల్లించేందుకు బయలుదేరుతారు. ఈ సినిమాలో 2001లో రిలీజ్ కాగా.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. బాలయ్య భగవంత్ కేసరి- గణేశ్ ఆంతం సాంగ్ బాలకృష్ణ, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో గణేశ్ ఆంతం లిరికల్ సాంగ్ను ఇటీవలే రిలీజ్ చేశారు. వినాయకచవితికి గణపతి మండపాలు ఈ పాటతో హోరెత్తనున్నాయి. -
రంగులు మార్చుకునే వినాయకుడు..మీరెప్పుడు చూసుండరు!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువుతీరాడు పార్వతీ తనయుడు. రాజ్య రక్షకుడు: రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు. ఒక రోజు రాత్రి అతను నిద్రపోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరిపోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసిపోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు. ఇదీ విశిష్టత: ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ప్రార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఎక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్లో ఉంది. రంగులు మార్చే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయమే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా... ప్రాశస్త్యం మాత్రం చాలా పెద్దది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. మార్చి నుంచి జూన్ వరకూ నల్లని రంగులో ఉండే ఈ వినాయకుడు జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడి వినాయకుడు తన రంగును మార్చుకు న్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఇక చారిత్రక విషయాల కొస్తే... ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది ‘శివాలయం’. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని అంటారు. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో ‘కేరళపురం’ రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ వెళ్లాడట. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం’ అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతనమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. దొడ్డ గణపతి ఆలయం, బెంగళూరు బెంగళూరులోని బసవన గుడి బుల్ ఆలయం పక్కనే ఉంది ఈ ఆలయం. దేవాలయంలోని గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని పిలుస్తుంటారు.విశేషం ఏమిటంటే ... ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు. స్వామి వారి అలంకరణ: వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు చేసి రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణ లో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకొంటారు. ఇది చూస్తే జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది. ఆలయ వెనక శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు ఉన్నాయి. ఆలయ సందర్శన సమయం దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం ఏడు నుంచి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది. వినాయక చవితి నుంచి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. బెంగళూరు లో వాయు, రోడ్డు, విమాన సౌకర్యాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉంది. అలాగే రెండు రైల్వే స్టేషన్ లు – బెంగళూరు సిటీ, యశ్వంతపుర ఉన్నాయి ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు, విమానాలు వస్తుంటాయి. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బెంగళూరు కు బస్సు సౌకర్యం ఉంది. తెలుగు రాష్ట్రాలలో సిద్ధివినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం దీనికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. ఉమాసుతుడు ఇక్కడ సిద్ధి వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతల ఆలయాలూ ఉన్నాయి. స్థల పురాణం కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం చెబుతోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామం లో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకుని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. క్షేత్ర ప్రత్యేకత అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. దక్షిణాభిముఖంగా దర్శనం..సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. అలాగే దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం. వివిధ ఉత్సవాలు.. ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష కలములను సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి... లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం. వివిధ ఆలయాలు... అయినవిల్లి క్షేత్రంలో గణపతి ఆలయంతో పాటు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరాలయం, శ్రీదేవీ, భూదేవీ సమేత కేశవస్వామి ఆలయం, కాలభైరవ ఆలయాలు ఉన్నాయి. ఇలా చేరుకోవాలి... రాజమహేంద్రవరం నుంచి అయినవిల్లికి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం నుంచి బస్సు, ఆటోలో దేవాలయాన్ని చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు. ఇతర సమాచారం.. దేవాలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 8గంటల వరకు తెరిచి ఉంటుంది. అభిషేకం ఉదయం 7 గం.ల నుంచి 11 గం. వరకు జరుగుతుంది. (సాధారణ రోజుల్లో) – డి.వి.రామ్ భాస్కర్ -
మహారాష్ట్రలోని అష్టగణపతి ఆలయాల గురించి మీకు తెలుసా?
గణపతి ఉపాసనకు మహారాష్ట్ర పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో గణపతి క్షేత్రాలు కోకొల్లలు. వాటన్నిటిలోకి అష్టగణపతి క్షేత్రాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఎనిమిది క్షేత్రాలు గణాధిపత్యులకు ముఖ్యమైనవి. ఈ ఎనిమిదీ ‘అష్టగణపతి క్షేత్రాలు‘గా ప్రసిద్ధికెక్కాయి. 1. మయూరేశ్వర గణపతి – పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న ’మోరగావ్’లో మయూరేశ్వర గణపతి ఆలయం ఉంది. 2. చింతామణి గణపతి – పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న ’థేపూర్’ చింతామణి గణపతి క్షేత్రం. 3. గిరిజాత్మజ గణపతి – పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న ’లేహ్యాద్రి’ అనే స్థలంలో గిరిజాత్మజ గణపతి క్షేత్రం వెలిసింది. 4. శ్రీ విఘ్నేశ్వర గణపతి – లేహ్యాద్రి సమీపంలోనే ’ఓఝల్’ స్థలంలో ’శ్రీవిఘ్నేశ్వర’ క్షేత్రం వెలిసింది. 5. మహోత్కట గణపతి – పునానుండి 32 మైళ్ళ దూరంలో ’’రాజన్గావ్’’లో మహోత్కట గణపతి ఆలయం ఉంది. 6. భల్లాలేశ్వర గణపతి – మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో ’పాలీ’ అనేచోట భల్లాలేశ్వర గణపతి క్షేత్రం ఉంది. 7. వరదవినాయకుడు – కులాబా జిల్లాలో ’’మహర్’’ అనే స్థలంలో ’’వరదవినాయక’’ ఆలయం ఉంది. 8. సిద్ధివినాయకుడు – అహ్మద్ నగర్ జిల్లాలో ’’సిద్ధటేక్’’ అనే స్థలంలో సిద్ధివినాయక క్షేత్రం వెలిసింది...!! -
ఈ వినాయకుడ్ని దర్శిస్తే..ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతుందట!
అన్ని విఘ్నాలనూ తొలగించే... తొలిపూజలందుకునే దేవుడిగా ప్రసిద్ధికెక్కిన గణపయ్యకు ఎన్నో రూపాలున్నాయి. వింతకాంతులతో వెలుగుతూ చిత్ర విచిత్ర రూపాలతో భాసించే ఆ దేవుణ్ణి అందరూ ఆరాధిస్తారు. గుడికట్టి పూజిస్తారు. ఆ గణనాథుణ్ణి మామూలుగా అందరికీ తెలిసిన ఆకారంలో గాకుండా విశిష్టంగా కనిపించే రూపాలతో దేశవిదేశాలలో అనేక ఆలయాలున్నాయి. వినాయక చవితి సందర్భంగా అరుదైన రూపంతో అగుపించే గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుని గురించి తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అక్కడి గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని స్థానికులు చెబుతారు. ఇక్కడే కాదు, మన భారతదేశంలో కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో విగ్రహాలు పెరుగుతాయని భక్తులు విశ్వాసం. కాణిపాకంలో లాగే కర్నూలు జిల్లా యాగంటిలో కూడా నంది విగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని భక్తుల నమ్మకం. అలాగే కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలోని మధుర్ గ్రామంలోని శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఉత్త్తర కర్నాటకలో కాసర గోడ్ సమీపంలో మధుర్లో అనేక ఆలయాలున్నాయి ఇందులో మహాశివ ఆలయం, మహాగణపతి ఆలయం ముఖ్య మైనవి. ప్రకృతి ఒడిలోకి చేరినట్లు కనిపించే కేరళ... కర్నాటక బార్డర్లో కేరళ కొసన కసార్గాడ్ అనే పట్టణం ఉంది. ఈ పట్టణానికి అతి సమీపంలో మధుర్ మహాగణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయం ఆవిర్భావం, చరిత్ర అన్నీ విశేషమే! నిజానికి చెప్పాలంటే ఈ ఆలయంలోని మూలవిరాట్టు ఆ పరమేశ్వరుడు. ఈ శివుని విగ్రహం కూడా ఓ స్వయంభువు గా వెలసినదని చెబుతారు. మధుర్ స్థలపురాణం ప్రకారం మధుర అనే ఒక స్త్రీ పెరుగుతున్నగణపతిని కనుగొన్నది. ఆమె పేరు మీదగానే ఈ ఆలయం మధూరాలయంగా మరియు ’మధుర్ మహాగణపతి ఆలయం’గా ప్రసిద్ది చెందింది. విగ్రహాన్ని ఆమె తొలిసారి చూసింది కనుక ప్రస్తుతం తొలి దర్శనాన్ని ప్రత్యేకించి మహిళకే కల్పిస్తున్నారు. మరి అంతటి మహిమల గల ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్థల పురాణం ప్రకారం ఒక పురాణగాథ స్థల పురాణం ప్రకారం ఒక పురాణగాథ ఉంది. మధుర్ గణపతి ఆలయ పూజారి పిల్లవాడు ఒక సారి ఈ శివాలయానికి వచ్చాడు. ఆడుకుంటూ, ఆడుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళి, అక్కడి దక్షిణంవైపు ఉన్న గోడమీద వినాయకుని రూపాన్ని సరదాగా చెక్కాడు. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చాడో...తండ్రి చెంత తను కూడా ఉండాలనుకున్నాడో కానీ..ఆ బొమ్మ నుండి ఒక వినాయకుని రూపం ఆవిర్భవించడం మొదలైంది. అంతే కాదు..అలా మొదలైన ఆ రూపం నానాటికీ పెరుగుతోందని, అందుకే ఆ వినాయకుడిని బొడ్డ గణపతి అని పిలుస్తున్నారు. బొడ్డ గణపతి అంటే బొజ్జగణపయ్య అని అర్థం.మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనబడుతుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని గజప్రిస్త’గోపురాలని పిలుస్తారు. ఆలయంలోని చెక్క మీద మహాభారత, రామాయణ ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు. ఆలయ సమయాలు: ఈ ఆలయాన్ని ప్రతి రోజూ ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది. ఇక్కడికి ఆదివారం నాడు భక్త జన సందోహం ఎక్కువ గా రావటం విశేషం.ఈ ఆలయం చరిత్రకు మరో విశేషం కూడా ఉంది. ఈ ఆలయం చరిత్రకు మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే టిప్పుసుల్తాను దాడి. ఒకసారి టిప్పు సుల్తాను తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ దిశగా వచ్చాడట. తిరుగుముఖంలో ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడట. కానీ ఈ ఆలయంలోని మంచినీరు తాగిన వెంటనే ఆయన మనసు మారిపోయిందట. అయితే తన సైనికుల తృప్తి కోసం నామకార్థంగా తన ఖడ్గంతో ఆలయం గోడ మీద ఒక వేటు వేసి వెళ్లిపోయాడట. ఇప్పటికీ ఆలయం గోడ మీద టిప్పు సుల్తాను తన ఖడ్గంతో మోదిన గుర్తుని చూడవచ్చు. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టం ఏదైనా కొత్త పనిని ఆరంభించేటప్పుడు, అనుకున్న పనికి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు..... ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పక ఫలితం దక్కుతుందన్నది భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టమట. అందుకనే ఈ స్వామిని దర్శించుకుని ఆయనకు అప్పాలను ప్రసాదంగా సమర్పిస్తే... ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతాయని అంటారు. సహస్రాప్పం పేరుతో స్వామివారికి వేయి అప్పాలను నివేదించే ఆచారమూ ఇక్కడ కనిపిస్తుంది.ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. కర్ణాటకలోని మంగళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో కన్నడిగులు కూడా వేలాదిగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. గోకర్ణం దగ్గర నుంచి సాగే ఆరు వినాయకుని క్షేత్రదర్శనంలో మధుర్ మహాగణపతి ఆలయం కూడా ఓ భాగమే! -
ఈ వినాయకుడ్ని పూజిస్తే వివాహ అడ్డంకులు తొలిగిపోతాయట!
విశిష్ట గణపతికి ... వైవిధ్య రూపాలతో పూజలు పురాణేతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పార్వతీ దేవికి సోదరుని వరస. వినాయకుడు పార్వతీ తనయుడు. శ్రీ కృష్ణుడు మహావిష్ణువు అవతారం. ఈ వరస మేరకు కృష్ణుడు వినాయకుని మేనమామ.అలాటి మేనమామ తన మేనల్లుడి ఒడిలో కూర్చున్న అపూర్వ దర్శనం మీకెప్పుడైనా జరిగిందా ? అలాటి పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలియాలంటే మనం కేరళలోని మళ్ళియూర్ వూరికి వెళ్ళాలి. అక్కడి ఆలయంలో వినాయకుని ఒడిలో బాలకృష్ణుడు ఆసీనుడై భాగవతం వింటున్న అపూర్వ దృశ్యాన్ని మనం చూడగలం.ఇటువంటి దృశ్యం మరెక్కడా దర్శించలేము.వేలసంవత్సరాల ప్రాచీనమైన ఈ ఆలయంలో బీజ గణపతి రూపంలో వినాయకుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం ప్రసిద్ధి చెందడానికి భాగవత అంశగా ప్రసిద్ధి చెందిన శంకరన్ నంబూద్రియే ముఖ్య కారణంగా చెపుతారు. శంకరన్ నంబూద్రి గణపతి విగ్రహం పక్కనే సాలగ్రామాన్ని పెట్టుకుని పూజిస్తూండేవారు. నిత్యం భాగవత పారాయణం చేసేవారు. ఒకనాడు ఆయనకు తన పూజలో వినాయకుని విగ్రహంలో బాలకృష్ణుని రూపం స్పష్టంగా గోచరించింది. ఆయన తాను చూసిన దృశ్యాన్ని యదాతధంగా చెక్కిన రూపమే ఈనాడు ఆ ఆలయంలో దర్శనమిచ్చే విగ్రహం. తొండం చివర నిమ్మపండు, హస్తాలలో కొడవలి, అంకుశం, తనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు చేత ధరించి తనకు మామ అయిన బాలకృష్ణుని తన ఒడిలో వుంచుకొని దర్శనానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు. గర్భగుడిలో ఇతర దైవ విగ్రహాలు ఏవీ వుండవు. భక్తుల కోరికలను తక్షణమే నెరవేర్చే వరప్రసాది మళ్ళియూరు మహాగణపతి. ఇక్కడ ఇష్టసిద్ధికై చేసే పూజలను ముక్కుట్రి పుష్పాంజలి అంటారు. సకల ఐశ్వర్యాలు కలగడానికి ఉదయాస్తమ పూజ జరుగుతున్నది. కష్టాలు తీరడానికి సహస్ర కలశాభిషేకం జరిపించుకుంటారు.వివాహ అడ్డంకులు లేకుండా వుండడానికీ పళ్ళమాలలు సమర్పిస్తారు. 27 కదళీ ఫలాలతో కట్టే యీ మాలను నక్షత్ర మాల అంటారు. అనారోగ్యాల నివారణకై దడి నివేదన చేస్తారు. బియ్యప్పిండి, చక్కెర, కొబ్బరి కలిపి మోదకంగా తయారు చేసి ఆవిరిలో ఉడికించి నివేదిస్తారు. దీనికే దడి నైవేద్యమని పేరు. ఈ ఆలయంలో పితృదోష పరిహారాలు జరుపుతారు. చవితినాడు చతుర్ధియూటు అనే పితృదోష పరిహార పూజలు జరుపుతారు. సంతాన భాగ్యం కోసం పాలు పాయసం నివేదించి పూజిస్తారు. తులాభార మొక్కు లు కూడా తీర్చుకుంటారు. ఈ ఆలయంలో తొమ్మిది రోజుల ఉత్సవం ఫాల్గుణ మాసంలో ఆరంభమై చైత్రమాసంలో వచ్చే విషూ పండుగతో సంపూర్ణమౌతాయి. వినాయకచవితి పండగను ఘనంగా జరుపుతారు.కేరళలోని కొట్టాయం .. ఎర్నాకుళం మార్గంలో కురుప్పన్దర అనే చోట దిగితే 2 కి.మీ దూరంలోను, కురుప్పన్దర రైల్వేస్టేషన్ నుండి 1/2 కి.మీ దూరంలో మళ్లియూరు మహాగణపతి ఆలయం వున్నది. -
గణపతి నవరాత్రులు..ఇలా పూజిస్తే విజయమే కాదు ధనం కూడా
మన భారతీయ సంప్రదాయం ముఖ్యంగా మూడు నవరాత్రుల పండుగలను చెప్పింది. 1) వసంత నవరాత్రులు, 2) గణపతి నవరాత్రులు, 3) దేవీ నవరాత్రులు. వినాయక నవరాత్రులనకుండా గణపతి నవరాత్రులనటంలోనే గణపతి వైభవం మనకు స్పష్టంగా అర్థమౌతున్నది. వేదం కూడా వినాయకుణ్ణి గణపతిగానే కీర్తించింది. ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ‘‘ఓమ్ గణానాం త్వా గణపతిగ్ం హవామహే‘‘ అనే వేదమంత్రంతోనే వినాయక పూజ ప్రారంభిస్తారు, గణపతులు మహాగణపతి, వాతాపిగణపతి, విద్యాగణపతి, విజయగణపతి, నృత్యగణపతి, సంగీత గణపతి, ఉచ్ఛిష్ట గణపతి ఇలా చాలా రకాలుగా ఉన్నారు. అందరికీ అవసరమైన వానినందిస్తూ అందరిచేత పూజలందుకొనే వాడు లక్ష్మీగణపతి. ఈనాడు చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీగణపతిని ఆరాధిస్తే విద్యా, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. ఈ లక్ష్మీగణపతి వృత్తాంతం గణేశ జననం అనే పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది.పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేశుని ఉద్దేశించి మమ స్థితిశ్చ, దేహే తే గేహే భవతు శాశ్వతీ! (నీ శరీరంలో, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది. అంటే నేను నివసిస్తాను) అని లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీగణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది. శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్ననివారకమ్ ‘ పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీగణపతిం భజే ‘‘ అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీగణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆలయాలు బెంగళూరులోను, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో రత్నగిరి నగర్, పలకలూరి పంచాయతీలో లక్ష్మీగణపతి ఆలయం ఉన్నది. అక్కడి స్వామి ఎడమ వైపున ఒడిలో లక్ష్మీ అమ్మవారిని కూర్చుండపెట్టుకొని దశ భుజుడై దర్శనమిస్తాడు. అష్టలక్ష్ములకు సంకేతంగా ఎనిమిది చేతులతో ఎనిమిది విధాలైన ఆయుధాలను ధరించి ఒక చేతిలో అభయ ముద్రతో, మరొక చేతితో అమ్మవారిని ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యే వినాయకచవితి రోజున లక్ష్మీగణపతి స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిద్దాం మనతో పాటు దేశ సౌభాగ్యాన్ని కూడా పొందుదాం. -
ముక్కోటి దేవుళ్ళలో వినాయకుడికే మొదటి పూజ ఎందుకు? గణాధిపత్యం ఎలా దక్కింది?
కుమారస్వామి అప్పటికే దేవసేనాధిపతిగా ఉన్నాడు. అందువల్ల వినాయకుడికి ప్రమథ గణాధిపత్యం ఇవ్వాలనుకున్నాడు శివుడు.‘నువ్వు నా ప్రమథగణాలకు నాయకుడిగా ఉండు’ అని వినాయకుడితో అన్నాడు శివుడు.‘తండ్రీ! నాయకుడిగా ఉండమంటే సరా? అర్హత నిరూపించుకోనిదే నాయకత్వం స్వీకరించడం ఏమంత సమంజసం? తమ్ముడు ఇప్పటికే దేవసేనాధిపతిగా సేనానాయకత్వంలో ఆరితేరి ఉన్నాడు. అతడికే గణాధిపత్యం కట్టబెడితే బాగుంటుంది’ అన్నాడు వినాయకుడు.‘ఇప్పటికే నీ తమ్ముడు దేవసేనాధిపతిగా ఉన్నాడు గనుకనే నిన్ను ప్రమథగణాలకు నాయకత్వం వహించమంటున్నాను. ఒక్కడే రెండు బాధ్యతలు నిర్వహించడం అతడికి భారంగా మారవచ్చు’ అన్నాడు శివుడు.‘తండ్రీ! అయితే, ఏదైనా పరీక్షపెట్టి, నెగ్గినవారికి నాయకత్వం అప్పగించడం న్యాయంగా ఉంటుంది’ అన్నాడు వినాయకుడు. దేవతలు, ప్రమథులు కలసి వినాయకుడికి, కుమారస్వామికి ఒక పందెం పెట్టారు. ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను సేవించి ముందుగా ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే గణాధిపత్యం అప్పగించాలని తీర్మానించారు.కుమారస్వామి తన మయూరవాహనంపై రివ్వుమని ఎగురుతూ బయలుదేరాడు.వినాయకుడు ఎక్కడికీ కదలకుండా, ఉన్నచోటనే చతికిలబడి కూర్చుండిపోయాడు.అప్పుడు విష్ణువు అతణ్ణి ఏకాంతంలోకి తీసుకుపోయి, ‘నాయనా! మేమంతా నిన్ను అభిమానిస్తున్న వాళ్లం. నీ ఓటమి మా ఓటమి అవుతుంది. నువ్వెక్కడికీ తిరగనక్కర్లేదు. నేను చెప్పినట్లు చేస్తే చాలు’ అని చెప్పాడు.విష్ణువు సలహాతో వినాయకుడు ఉన్నచోటనే మఠం వేసుకు కూర్చుని, శివపంచాక్షరి మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.కుమారస్వామి వెళ్లిన ప్రతి తీర్థంలోనూ, క్షేత్రంలోనూ వినాయకుడు అతడికి తిరుగుముఖం పడుతూ ఎదురవుతూ వచ్చాడు. ఆశ్చర్యపోతూనే ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను కుమారస్వామి సేవించుకున్నాడు. కైలాసానికి తిరిగివస్తూనే, ‘తండ్రీ! ఈ పందెంలో నేను ఓడిపోయాను. అన్నదే గెలుపు. నీవనుకున్నట్లు అతడికే గణాధిపత్యాన్ని అప్పగించు’ అన్నాడు. కుమారస్వామి కైలాసంలో కొలువుదీరిన దేవతలు, మునులు, ప్రమథగణాల మధ్యకు వచ్చి, ‘పందెంలో మా అన్న వినాయకుడే గెలిచాడు. అతడికి సత్వరమే గణాధిపత్య పట్టాభిషేకం జరగాలి. శివుని ఆజ్ఞ అందరికీ శిరోధార్యం’ అని చెప్పాడు. కుమారస్వామి ప్రకటనతో దేవతలందరూ హర్షం వెలిబుచ్చారు. అయితే, ప్రమథగణ ప్రముఖులలో శృంగీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం దీనిని వ్యతిరేకించారు.అదివరకు వినాయకుడు పుత్రగణపతి రూపంలో వారికి గర్వభంగం చేశాడు. ఆ అక్కసుతోనే వారు వినాయకుడికి గణాధిపత్యం కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, ‘మొదటి నుంచి మేము శివుడికి నమ్మినబంట్లుగా ఉంటున్నాం. అలాంటిది వినాయకుడు మాకు ఎలా అధిపతి అవుతాడు? అతడికి తనదంటూ ఎలాంటి బలగమూ లేదు. అతడికి గణాధిపత్య అభిషేకమేమిటి?’ అంటూ నానా మాటలూ అన్నారు.ప్రమథుల కలకలం విన్న శివుడు అక్కడకు చేరుకున్నాడు. వారి మాటలు విని కళ్లెర్రజేశాడు. ‘నా నిర్ణయానికే ఎదురాడేటంత గొప్పవారైపోయారా మీరు?’ అంటూ ఆగ్రహోదగ్రుడయ్యాడు.ఇంత జరుగుతున్నా వినాయకుడు శాంతంగా, ‘నిజమే! నాకు గణాలెక్కడివి? లేవు కాబోలు. అన్నట్లు పుత్రగణపతిగా ఉన్నప్పుడు నాకూ కొన్ని గణాలు ఉన్నట్లు గుర్తు. ఆ గణాలు ఎక్కడ?’ అన్నాడు. వినాయకుడి నోట ఆ మాట వెలువడగానే, ముమ్మూర్తులా వినాయకుడిని పోలి ఉన్న గజముఖులు కోటాను కోట్లుగా పుట్టుకొచ్చారు. దిక్కులు పిక్కటిల్లేలా వినాయకుడికి జయజయ ధ్వానాలు పలుకుతూ అతడికి బాసటగా వచ్చి నిలుచున్నారు. వారందరూ చతుర్భుజులే! కొందరి చేతుల్లో ఘంటాలు, లేఖినులు, కుంచెలు ఉన్నాయి. ఇంకొందరి చేతుల్లో త్రిశూల కరవాల గదా ధనుర్బాణాది ఆయుధాలు ఉన్నాయి. మరికొందరి చేతుల్లో వీణా వేణు మృదంగ ఢక్కాది వాద్యపరికరాలు ఉన్నాయి. వారిలో కొందరు అరుణపతాకాలను పట్టుకున్నారు. ఇంకొందరు వినాయకుడికి ఛత్ర చామరాలు పట్టారు. వారు రత్నఖచితమైన భద్రసింహాసనాన్ని తీసుకువచ్చి, వినాయకుణ్ణి దానిపై కూర్చుండబెట్టారు. ఈ సంరంభానికి వినాయకుడి వాహనమైన మూషికం సింహాసనం కింద ఆనందంతో చిందులు వేయడం మొదలుపెట్టింది. దేవతలు, మునులు వేదస్తోత్రాలు పఠిస్తుండగా ప్రమథ గణాధిపతిగా వినాయకుడికి ఘనంగా అభిషేకం జరిగింది. ∙సాంఖ్యాయన -
వినాయకుడి వివాహం ఎలా జరిగిందో తెలుసా?మనకు తెలియని కథ..
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం. -
Ganesh Chaturthi 2023: మనం కొలిచే తొలి దైవం ఆయనే..ఆనాటి నుంచే ఆచారం
సమస్త విఘ్నాలను పోగొట్టి,సర్వ విజయాలను,సత్వర ఫలాలను అందించే విఘ్ననాయకుడు వినాయకుడి పండుగను సభక్తి పూర్వకంగా జరుపుకోవడం అఖండ భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం.మనం పూజించే తొలి దైవతం ఆయనే. ఎంతటి నాయకుడైనా వినాయకుడి ముందు సాగిలపడాల్సిందే.తమ ఇచ్ఛలు తీరాలంటే ఈ దేవుడిని కొలవాల్సిందే.భిన్న మతాలు,జాతులు కులాలు,సంస్కృతుల సంగమమైన భారతదేశాన్నిఏకం చేసింది,ఈ నేలపై జీవించేవారినందరినీ ఐక్యంగా నిలిపిందీ సనాతన ధర్మం.సహనం,సమ భావనందానికి ఆధారం."సర్వేజనా సుఖినో భవంతు"అన్న ఆర్యవాక్కులు దానికి మూలాధారం.సర్వజనులు బాగుండాలనే మంచితనం మనవారి రక్షణ కవచం.ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వచ్చి,మనల్ని దురాక్రమించారు. వందల ఏళ్ళు ఈ రాజ్యం పరాయి పాలనలో సాగింది.ఎన్నో భాషా సంస్కృతులు వచ్చి చేరాయి.చాలా సంపదను కోల్పోయాం,విష కౌగిళ్ళ మధ్య నలిగిపోయాం.తుచ్ఛ సంస్కృతి వీధుల్లో ఏరులై పారింది.వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం.మన ఉనికిని కాపాడుకున్నాం.మనదైన సంప్రదాయం మృగ్యమవకుండా చూసుకున్నాం.ప్రపంచ దేశాలలో భారత్ ను విశిష్టంగా గౌరవింప చేసింది,వివేకానంద వంటి మహనీయులు ప్రసంగిస్తుంటే ఆంగ్లేయులు సైతం మ్రాన్పడి వినేలా చేసింది మనదైన సంస్కారం.ఈ విశిష్ట విధానమే మన జీవనశైలి,మన పెంపకం.కలిసిమెలిసి వుండే కుటుంబ బంధాలు,గొప్ప వివాహ వ్యవస్థ మన దేశాన్ని సర్వోన్నతంగా నిలిపాయి.అదే మన సనాతన ఆచారంలోని ఔన్నత్యం. ఆచారం అంటే ఆచరించేది.హంగూ అర్భాటాలతో ప్రదర్శించేది కాదు.ఆత్మశుద్ధితో సాగే ఆరోగ్య స్రవంతి.పండుగలు మన జీవితంలో భాగం.హృదయంగమంగా జరుపుకోవడం ఒక యోగం.ఇంతటి ఉదాత్త విధానాల రూపమైన పండుగలు,ఆచారాలు రాజకీయాలకు వేదికలుగా మారడం మారుతున్న సమాజానికి, అడుగంటుతున్న విలువలకు అద్దం పట్టే విషాదం.అనంత కాలప్రవాహంలో,లక్షలాదిసంవత్సరాల మానవ జీవన పయనంలో కరోనా కాలం ఎంతో బాధించింది.ఇప్పుడు నిఫా వైరస్ అంటున్నారు.గతంలోనూ ఇటువంటివి ఎన్నో వచ్చి వెళ్లిపోయాయి.రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.మంచిరోజులు వస్తాయి.భక్తి ప్రదర్శన కాదు.ఆత్మగతమైన అనుభూతి,బుద్ధిని ప్రక్షాళనం చేసే సద్గతి,అని మన పూర్వులు చెప్పారు.అఫ్ఘాన్ వంటి దేశాలను చూస్తేవారి రాక్షస ప్రవృత్తే వారిని ఏకాకులను చేసింది. డబ్బు పరంగా అగ్రరాజ్యమనే పేరున్నా,అమెరికాపై ప్రపంచ దేశాలకు విశ్వాసం లేదు.తుపానులా పైకి లేచిన చైనాను ఎవ్వరూ నమ్మరు.మూలక్షేత్రానికే దెబ్బకొడదామని చూసే పాకిస్తాన్ పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు.క్షణక్షణానికి బంధాలు మార్చుకుంటున్న రష్యా తీరూ అంతే.ఒకప్పుడు అనంతమైన సంపదకు,సర్వ విద్యలకు నెలవుగా ఉన్న భారతదేశం,నేటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నప్పటికీ,ప్రపంచం మనల్ని విశ్వసిస్తోంది,గౌరవిస్తోంది.ప్రపంచ తత్త్వశాస్త్రాలను -భారత తత్త్వ సిద్ధాంతాలను తులనాత్మకంగా విశ్లేషించి,భారతీయమైన ఔన్నత్యాన్ని ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో వివరిస్తూ, ప్రసంగం సాగిస్తే! మేధోసమాజమంతా ఆయనకు,ఆయనలోని భారతీయతకు మోకరిల్లింది. భారతీయ తత్త్వం తెలిసినవారే పాలకులుగా ఉండాలన్నది సర్వేపల్లివారి సంకల్పం.కులాలు,మతాలు, ప్రాంతాలు దాటి రాజకీయాలు సాగే పరిస్థితులు నేడు లేనే లేవు.వినాయకచవితి పండుగ ఎలా జరుపుకోవాలో వాళ్లే నిర్దేశిస్తున్నారు.ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చదు.ప్రజలను తదనుగుణంగా తమవైపు తిప్పుకొని రాజకీయమైన లబ్ధి పొందాలనే దృష్టి తప్ప,సంప్రదాయంపై,ఆచార వ్యవహారాలపై ప్రేమ కాదని తెలుస్తూనే ఉంటుంది.వివాదాలకు కావాల్సినంత ప్రచారం జరుగుతూనే ఉంటుంది.పండుగలను వివాదాలకు,ఆచారాలను రాజకీయాలకు వేదికగా మారని సమాజాన్ని చూడాలన్నది విజ్ఞుల హృదయం.సర్వజనులకు జయావహం,ప్రియంవదమైన వాతావరణం రావడమే పర్వదినం. సర్వ విఘ్నాలను తొలగించి,సకల జనులకు సకల జయాలను కలిగించి,ముప్పులకు ముగింపు పలికి,ప్రగతి ప్రయాణానికి ముహూర్తం పెట్టాలని విఘ్ననాయకుడికి విజ్ఞప్తి చేసుకుందాం.సనాతన ధర్మం, భారతీయత అందించిన సదాచారాల మధ్య,సమభావనతో,సోదర తుల్యంగా సహజీవనం చేద్దాం.పర్వదినం అంటే? సర్వులకు మంచిరోజు.పర్యావరణ హితంగా పండుగ జరుపుకుందాం. సరికొత్త సంకల్పాలకు శ్రీకారం చుడదాం.సిద్ధి దిశగా కృషి సాగిద్దాం. --మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
ఒజ్జ గణపతికి వందనాలు
‘‘ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య! ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు.’’ అంటూ పిల్లలు సంబరంగా జరుపుకునే పండగ వినాయక చవితి. యావద్భారత దేశం వేడుకగా జరుపుకునే పండగ ఇది. కలియుగంలో అతి త్వరగా అనుగ్రహించే దైవం వినాయకుడు. ఋగ్వేద కాలం నుండి కీర్తించబడి పూజించబడుతున్న దేవత ఒక్క గణపతి మాత్రమే. దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు ఐన గణపతిని అన్ని సందర్భాలలోను పూజించటమే కాదు దేవతలందరూ త్రిమూర్తులతో సహా పూజించినట్టు ఆధారాలున్నాయి. గణపతి కున్న నామాలలో బాగా ప్రసిద్ధమైనవి వినాయకుడు, గజాననుడు. గణనాథుడికి ఉన్న పన్నెండు నామాలలో ప్రతి దాని వెనక ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా వినాయకోత్పత్తి, వినాయకుడు గజాననుడు కావటానికి గల కారణాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంతే కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు కనపడుతుంది. సృష్టికార్యం ప్రారంభించే ముందు బ్రహ్మ ప్రార్థించిన గణపతి ఓంకార స్వరూపుడు. కృతయుగంలో కశ్యపునికి అదితికి జన్మించి ‘మహోత్కటుడు‘ అనే పేరుతో దేవాంతక నరాంతక రాక్షసులను సంహరించి లోకకల్యాణం గావించాడు. త్రేతాయుగంలో, మయూరేశుడుగా అవతరించి త్రిమూర్తులకు వారు కోల్పోయిన స్థానాలను తిరిగి ఇప్పించాడు. అప్పుడే బ్రహ్మ తన కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలను వినాయకుడికిచ్చి, వివాహం చేస్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనం నెమలి. ద్వాపరయుగంలో గజాననుడుగా అవతరించి, సింధూరుడనే రాక్షసుని సంహరించాడు. మనం వినాయకవ్రత కల్పంలో చదివే కథ ఈ గజాననునిదే. కలియుగంలో ధూమ్రకేతువుగా అవతరించి, అశ్వారూఢుడై ప్రతిప్రాణిలో పెచ్చుపెరిగిన రాక్షసప్రవృత్తిని నశింప చేస్తూ ఉన్నాడట. వివిధ పురాణాలలో గణపతి వినాయకుడి ఆవిర్భావం, రూపు రేఖలు విభిన్నంగా ఉన్న కారణంగా శిల్పులు వాటికి గణపతి తత్త్వాన్ని, తమ సృజనాత్మకతను జోడించి రకరకాల గణపతులను మన ముందు ఉంచుతున్నారు. మిగిలిన లక్షణాలను ఏరకంగా చూపించినా అన్నింటిలోనూ సామాన్యంగా ఉండేవి – గజ ముఖం, కురచ మెడ, పెద్దబొజ్జ, నాగయజ్ఞోపవీతం, చేతిలో మోదకం, మూషిక వాహనం మొదలైనవి. గజముఖంలో తొండం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు భాగాలు. ప్రపంచ సాహిత్యంలో మొదటిది అయిన ఋగ్వేదంలో గణపతిగానే పేర్కొనటం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో ‘‘కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా’’ అని లలితాదేవి కల్పించినది గణేశ్వరుణ్ణే అని తెలుస్తోంది. తరువాత విఘ్నాలకి అధిపతి అయి విఘ్నేశ్వర నామాన్ని పొందటం జరిగింది. గణాలకు అధిపతి కనుక గణపతి, గణాధిపతి అనే నామాలు కలిగాయి. ఏవైనా గణములు అంటే గుంపులు, సముదాయాలు ఉంటే వాటి మీద అధికారం కలిగి, అవన్నీ ఏకోన్ముఖంగా పని చేసేట్టు చేయించ కలిగిన ప్రజ్ఞయే గణపతి. ఏకాత్మతా భావన కలిగించ గలవాడు గణపతి. ఆ ప్రజ్ఞ లేనట్టయితే సృష్టిలోని అన్ని భాగాలు దేనికవే ఉండేవి. కనుకనే సృష్టి చేసే సమయంలో బ్రహ్మ గణపతిని ప్రార్థించాడట! దేవతారూపాలన్నీ ఆయా తత్త్వాలకి ప్రతీకలు. ముఖ్యంగా ప్రత్యేక రూపాలున్న మూర్తులు. గణపతి అనగానే గుర్తు వచ్చేది పెద్ద పొట్ట. దాని నిండా ఉన్నవి విద్యలు. ‘‘కోరిన విద్యలకెల్ల నొజ్జయయి యుండెడి ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్’’ అంటాము కదా! వొజ్జ అంటే గురువు అని అర్థం. అందుకే గణపతి పూజలో పిల్లల చేత పుస్తకాలు పెట్టించుతాము. పనిలో పనిగా గుంజీలు తీయిస్తాము. గుంజీలు తీయటం వల్ల కుదురు వస్తుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. పెద్ద చెవులు బాగా వినమని చెపుతున్నాయి. చిన్న కళ్ళు సూక్ష్మ మైన అంశాలని ఎంత నిశితంగా ఏకాగ్రతతో చూడాలో తెలియ చేస్తాయి. తొండం ఎప్పుడు నోటిని మూసుకుని ఉండాలని తెలియ చేస్తుంది. చంద్రుణ్ణి చూసిన దోషం తొలగటానికి శమంతకోపాఖ్యానం చదవుకోవాలనటం కూడా విశేషమే. ఆ కథని అర్థం చేసుకుంటే సమాజం ఎంత బాగుంటుందో కదా! ఏదైనా ఒక వరం ఒకరికి ఇస్తే దాన్ని వారు మాత్రమే ఉపయోగించాలి. ఇతరులకి అది ఉపయోగ పడక పోగా ప్రాణాంతకం కూడా కావచ్చును అని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వృత్తాంతమ్ తెలుపుతుంది. ప్రభుత్వం వద్ద కాక వ్యక్తుల దగ్గర ధనం పోగు అయితే ప్రాణాలకే మోసం జరుగుతుందని సత్రాజిత్తు మరణం తెలుపుతుంది. ఎంతటి అవతార పురుషుడికి అయినా దోషఫలం అనుభవించక తప్పదు అని కృష్ణుడికి నీలాపనిందలు రావటం తెలియ చేస్తుంది. సర్వమానవుల మూలాధారంలో కుండలినీ శక్తిగా ఉన్న జగన్మాతకి గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. అదే పార్వతీ దేవి గుమ్మంలో కాపలా పెట్టింది అని కథలో చదువుకుంటాం. విఘ్నాధిపతి కనుక మనం చేసే పనుల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడమని అన్ని కార్యాలకి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించటం సంప్రదాయంగా మారింది. గణపతి పూజ మనకి ఏంచెపుతోంది? 1. మాతా పితృభక్తి అది ఉంటే లోకాలనన్ని చుట్టి రావచ్చు. విజయం సాధించవచ్చు. 2. భౌతిక బలం కన్న బుద్ధి బలం మిన్న తమ్ముడు నెమలి వాహనం మీద ఎగురుతూ వెళ్ళాడు. తాను ఎలుకనెక్కి వెళ్ళి గెలవటం ఎంత కష్టం? కనుక బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. 3. ఆకుపచ్చని ఆహారం తింటే తెలివితేటలు పెరుగుతాయి. ఆకుపచ్చరంగులో ఉన్న ఆహారం తింటే తెలివి తేటలు పెరుగుతాయి, చూపు మెరుగుగా ఉంటుంది. అందుకే గరిక తనకి పరమప్రీతి అని చెప్పాడు. బుద్ధి కావాలంటే ఆరాధించవలసింది గణపతినే. గణపతి నక్షత్రమైన హస్తకి అధిపతి బుధుడు. బుద్ధి కారకుడు బుధుడే కదా! 4. ఏక వింశతి 21 రకాల పత్రితో పూజ చేయటం ఒక్క గణపతి పూజలో మాత్రమే కనిపిస్తుంది. పిల్లలకి పత్రి సేకరణ పేరుతో చెట్లని, పర్యావరణాన్ని పరిచయం చేయటం జరుగుతుంది. అవన్నీ ఆ సమయంలో వచ్చే తరుణ వ్యాధులకి ఔషధాలు. ప్రత్యేకంగా గరిక పూజ ద్వారా గరికకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నాడు. గరిక పవిత్రమైనదే కాదు, భూమి ఆకృతిని పరిరక్షిస్తుంది. 5. రెండుసార్లు ఆవిరిమీద ఉడకబెట్టిన ఆహారం వానాకాలంలో మంచిది. బలం కలిగిస్తుంది. నూనెలో వేయించిన ఆహారం వానలు పడుతున్నప్పుడు అరగటం కూడా కష్టం. 6. మనలో సామర్థ్యం ఉండాలే కాని పరికరాలు ప్రధానం కాదు అని ఎలుక వంటి అతి చిన్న వాహనం ఎక్కి లోకాల నన్నిటిని జయించి చూపించాడు. డా. ఎన్.అనంతలక్ష్మి -
ప్రకృత్యైనమః
గుర్తించాలే కానీ దేవుడు అనేక రూపాల్లో ఉంటాడు. వాటిలో కనిపించనివే కాదు, కనిపించేవీ ఉంటాయి. ఎక్కడో ఉన్నాడనుకునే దేవుడు... మన చేతికందే దూరంలో ఒక మొక్కలోనూ, కొమ్మలోనూ, ఆ కొమ్మకు పూసిన పువ్వులోనూ కూడా ఉన్నాడని గ్రహించడమే లౌకిక, పారలౌకిక సమన్వయంతో కూడిన ఆధ్యాత్మిక ప్రస్థానంలో తొలి ఎరుక. దైవం మానుషరూపేణ అంటారు. అలాగే, దైవం ప్రకృతి రూపేణ కూడా! రామకృష్ణ పరమహంస ఓసారి ఆకాశంలో రెక్కలు విప్పుకుంటూ ఎగిరే పక్షిని చూసి సమాధిలోకి వెళ్లిపోయారట. చెట్టును, పిట్టను, పువ్వును, పసిపాప నవ్వును, పారే ఏటినీ, ఎగిరే తేటినీ చూసి తన్మయులైతే చాలు; ఆ రోజుకి మీ పూజ అయిపోయిందని ఒక మహనీయుడు సెలవిస్తాడు. షడ్రసోపేతంగా వండిన తన వంటకాలను తృప్తిగా ఆరగిస్తే ఇల్లాలు ఎంత ఆనందిస్తుందో, తన వ్యక్తరూపమైన ప్రకృతిని చూసి పరవశిస్తే దేవుడు అంతే ఆనందిస్తాడని ఆయన అంటాడు. నది ఒడ్డున నిలబడి దాని పుట్టుకను, గమనాన్ని, పోను పోను అది చెందే వైశాల్యాన్ని, అది ప్రవహించిన పొడవునా దానితో అల్లుకున్న మన జీవనబంధాన్ని స్మరించుకున్నా అది పుణ్య స్నానంతో సమానమేనని ఒక కథకుడు రాస్తాడు. కృష్ణశాస్త్రి గారు పల్లవించినట్టు అడుగడుగునా, అందరిలోనే కాదు; ప్రకృతిలో అన్నింటిలోనూ గుడి ఉంది. అనాది నుంచీ నేటివరకూ మనిషి ఊహలో, భావనలో మనిషీ, దేవుడూ, ప్రకృతీ పడుగూ పేకల్లా అల్లుకునే వ్యక్తమయ్యారు. ఋగ్వేద కవి చూపులో ప్రకృతి పట్ల వలపు, మెరుపు ఎంతో ముగ్ధంగా, సరళంగా, సహజసుందరంగా జాలువారుతాయి. ‘‘వెలుగులు విరజిమ్మే ఓ ఆకాశపుత్రీ, సకల సంపదలకూ నెలవైన ఉషాదేవీ! వస్తూ వస్తూ మాకు ధనరూపంలోని ఉషస్సును వెంట బెట్టుకుని రా’’ అని ఒక ఋక్కు అంటుంది. ఋగ్వేద కవి చింతనలో అగ్ని ధూమధ్వజుడు; సూర్యకాంతితో తళతళా మెరుస్తూ ధ్వనిచేసే సముద్రపు అలల్లా వ్యాపిస్తాడు. ‘‘తమసానదీ జలాలు మంచివాడి మనసులా స్వచ్ఛంగా ఉన్నా’’యని వాల్మీకి వర్ణిస్తాడు. సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేసిన రాముడు, ‘‘వర్షాకాలంలో మంచి పొలంలో వేసిన పంట ఫలించినట్టు నీకార్యాన్ని సఫలం చేస్తా’’నంటాడు. ఆ మాటలకు సుగ్రీవుడు, ‘‘నదీవేగంలా హఠాత్తుగా ఉరవడించిన కన్నీటివేగాన్ని ధైర్యంతో నిలవరించుకున్నా’’డని రామాయణ కవి అంటాడు. ఏ కాలంలోనూ మనిషీ, ఋషీ, కవీ ప్రకృతి పొత్తిళ్లలో పసివాడిగానే ఉన్నాడు తప్ప ప్రకృతికి దూరం కాలేదు. ఇతిహాస కావ్య ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు తప్పనిసరి భాగాలు. శారద రాత్రుల్లో ఉజ్వల తారకలు, కొత్త కలువ గంధాన్ని మోసుకొచ్చే సమీరాలూ, కర్పూరపు పొడిలా చంద్రుడు వెదజల్లే వెన్నెల వెలుగులూ, చెంగలువ కేదారాలూ, మావులూ క్రోవులూ పెనవేసుకున్న అడవులూ, పక్షులు బారులు కట్టి ఇంటిముఖం పట్టే సూర్యాస్తమయ దృశ్యాలూ, తలను రెక్కల్లో పొదవుకుని పంటకాలువల దగ్గర నిద్రించే బాతువుల సన్నివేశాలూ... ఇలా కవి ఊహల రస్తాకెక్కని ప్రకృతి విశేషం ఏదీ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం రూపంలో ప్రకృతి భాగం కాని పూజా ఉండదు. వినాయకుని పూజలో ఉపయోగించే మాచీ,బృహతి, బిల్వం, ధత్తూరం, బదరి, తులసి, మామిడి, కరవీరం, దేవదారు, మరువకం లాంటి ఇరవయ్యొక్క పత్రాల పేర్లే చెవులకు హాయిగొలిపి ఆకుపచ్చని చలవపందిరి వేసి మనసును సేదదీర్చుతాయి. అమ్మవారి స్తుతుల నిండా పూవులూ, వనాలూ పరచుకుంటాయి. చంపకాలు, సౌగంధికాలు, అశోకాలు, పున్నాగాలతో అమ్మ ప్రకాశించిపోతుంది. కదంబ పూలగుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. చాంపేయ, పాటలీ కుసుమాలు తనకు మరింత ప్రియమైనవి. శిరసున చంద్రకళను ధరిస్తుంది. ప్రకృతి వెంటే పర్యావరణమూ గుర్తురావలసిందే. పర్యావరణ స్పృహ ఇప్పుడే మేలుకొంద నుకుంటాం కానీ, ప్రకృతిలో భాగంగా మనిషి పుడుతూనే పెంచుకున్న స్పృహ అది. రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు వెడుతూ, వానరులు ఎక్కడుంటే అక్కడ చెట్లు సమృద్ధిగా ఉండాలనీ; అవి అన్ని కాలాల్లోనూ విరగ కాయాలనీ; నదుల్లో నీరు నిత్యం ప్రవహిస్తూ ఉండాలనీ ఇంద్రుని వరం కోరాడు. పాండవులు ద్వైతవనంలో ఉన్నప్పుడు ఆ అడవిలోని చిన్న జంతువులు ధర్మరాజుకు కలలో కనిపించి, ‘‘మీరు రోజూ మమ్మల్ని వేటాడి చంపడంవల్ల మా సంఖ్య తగ్గిపోయింది, బీజప్రాయంగా మిగిలాం, మేము పూర్తిగా నశించేలోగా దయచేసి మరో చోటికి వెళ్లం’’డని ప్రార్థించాయి. విశ్వనాథవారు తన ‘వేయిపడగలు’ నవలలో పర్యావరణానికి ప్రతీకగా పసరిక అనే పాత్రనే సృష్టించారు. ఆధునిక వేషభాషల వ్యామోహంలో పడీ, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణ విధ్వంసం ఏ స్థాయిన జరుగుతోందో ఆ పాత్ర ద్వారా గంట కొట్టి చెప్పారు. పూర్వకాలపు రాజులు అడవిని, అటవీ జనాన్ని, సంపదను పర్యావరణ భద్రతకు తోడ్పడే స్వతంత్ర అస్తిత్వాలుగా చూశారు తప్ప, తమ రాజ్యంలో భాగం అనుకోలేదు. ఇప్పుడా వివేచన అంతరించి అడవులు రాజ్యానికి పొడిగింపుగా మారి బహుముఖ ధ్వంసరచనకు లక్ష్యాలయ్యాయి. ప్రకృతికి పండుగకు ఉన్న ముడి తెగిపోయి ప్రతి పండుగా పర్యావరణంపై పిడికిటిపోటుగా మారడం చూస్తున్నాం. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్న సంగతిని గుర్తు చేసుకోడానికి నేటి వినాయకచవితి కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది! -
నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!
కొన్ని నెలల ముందు టాలీవుడ్లో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి తమ జీవితంపైనే ఓ సినిమా చేయడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అవును పైన చెప్పిందంతా కూడా నరేశ్-పవిత్రా లోకేశ్ గురించే. వినాయక చవితి సందర్భంగా ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన షోలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో నరేశ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోస్ట్ బిజీయెస్ట్గా మారిపోయాడు. కెరీర్ పరంగా పీక్స్లో ఉన్న ఇతడు.. వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) నరేశ్, అతడి భార్య రమ్య రఘుపతి మధ్య చాన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే కొన్నాళ్లుగా ఇతడు, నటి పవిత్రా లోకేశ్ తో కలిసి ఉంటున్నారని వార్తలొచ్చాయి. ఇది నిజమనేలా బయటకూడా జంటగా కనిపించడం, 'మళ్లీ పెళ్లి' అని తమ జీవితాన్నే సినిమాగా తీయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అయితే వినాయక చవితి సందర్భంగా నరేశ్-పవిత్రా లోకేశ్ని ఓ ఈవెంట్కి గెస్టులుగా పిలిచారు. నరేశ్.. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. స్టేజీపై సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నరేశ్ ఎమోషనల్ అయ్యాడు. '50 ఏళ్లు అయిపోయింది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లో రకరకాల ఒడిదొడుకులు. గతంలో చేసిన వాటి గురించి నేను బాధపడుతున్నాను' అని అన్నాడు. అయితే అది తన పెళ్లిళ్ల గురించి, లేదా మరేదైనా విషయమా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!) -
మట్టి గణపతే.. మహా గణపతి..
-
18 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
యాదమరి(చిత్తూరు జిల్లా): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నా యి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారు నిత్యం వివిధ వాహన సేవల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వినాయక చవితి మరుసటి రోజు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఆ తర్వాత హంస వాహన సేవ, మయూర వాహన సేవ, మూషిక వాహన సేవ, చిన్న, పెద్ద శేష వాహన సేవ, వృషభ వాహన సేవ, గజవాహన సేవ, రథోత్సవం, అశ్వవాహన సేవ, ఏకాంత సేవలు తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు మాట్లాడుతూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాలు, అనుబంధ ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు. -
గణేషా.. ఒక్క సినిమా లేదు..ఎందుకిలా?
పండగొచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడితో థియేటర్స్ కళకళలాడుతాయి. చిన్న పండుగల రోజు ఏమోగానీ సంక్రాంతి..వినాయక చవితి..దసరా..దీపావళి లాంటి పెద్ద పండగ రోజు అయితే రెండు, మూడు పెద్ద సినిమాలతో పాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరు ఈ పండుగ రోజుల్లో తమ సినిమాను విడుదల చేయాలనుకుంటారు. కొన్నిసార్లు పోటీ భారీగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ బరిలోకి దిగుతారు. ఎందుకలా అంటే.. సినిమా యావరేజ్గా ఉన్నసరే పండుగ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో వర్కౌట్ అయింది కూడా. అందుకే పండుగలపై చాలా సినిమాలు ముందే ఖర్చీఫ్ వేసుకుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వినాయక చవితి లాంటి పెద్ద పండగ రోజు ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కావడంలేదు. బంగారం లాంటి గణేష్ పండుగ డేట్ని వదిలేసి వేరే డేట్కి తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ముందే ఖర్చీఫ్.. చివరల్లో అలా వాస్తవానికి ఈ వినాయక చవితికి చాలా సినిమాలు విడుదల కావాల్సింది. కొన్ని పెద్ద సినిమాలు ముందే డేట్ ఎనౌన్స్ చేయడంతో చిన్న సినిమాలు వెనక్కి తగ్గాయి. కానీ చివరి నిమిషంలో బడా చిత్రాలు సైతం చవితికి రాలేమని ప్రకటించాయి. బోయపాటి-రామ్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘స్కంద’ సెప్టెంబర్ 15న విడుదల కావాల్సింది. కానీ కారణం ఏంటో తెలియదు.. సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. ఇక రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటించిన చంద్రముఖి-2 చిత్రం కూడా సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సింది. అది కూడా వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఆలస్యం కావడం వల్లే సినిమా వాయిదా పడిందని చిత్రయూనిట్ పేర్కొంది. స్కంద రిలీజ్ రోజే చంద్రముఖి-2 రానుంది. అంటే సెప్టెంబర్ 28న ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద పోటీ పడతాయి. టిల్లన్న ఇలాగైతే ఎలాగన్నా? పోటీ ఈ వినాయక చవితికి టిల్లుగాని డీజేకి చిందులేద్దామనుకుంటే.. అది కూడా జరగడం లేదు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ అది కూడా మళ్లీ వాయిదా పడింది. ‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. డబ్బింగ్ సినిమానే దిక్కు వినాయక చవితికి ఒక్క తెలుగు సినిమా కూడా టాలీవుడ్లో విడుదల కావడంలేదు. డబ్బింగ్ సినిమాలనే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాయి. అందులో చంద్రముఖి-2 వాయిదా పడింది. ఇప్పుడిక ఒకే ఒక్క డబ్బింగ్ మూవీ విడుదల కాబోతుంది. అదే మార్క్ ఆంటోని. విశాల్ నటిస్తున్న తమిళ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్కు పిచ్చ క్రేజ్ వచ్చింది. తెలుగులో కూడా విశాల్కు మంచి ఫాలోయింగ్. అందుకే ఈ చిత్రాన్నితెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన చాలు..మార్క్ ఆంటోని పంట పండినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి వీకేండ్ మిస్ ఈ సారి వినాయక చవితి సోమవారం వచ్చింది. ఇది సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే రోజు. ఎందుంటే.. పండగతో కలిసి మొత్తం మూడు హాలిడేస్ వస్తున్నాయి. శుక్రవారం(సెప్టెంబర్ 15)సినిమాను విడుదల చేస్తే.. శని,ఆది వారాలతో పాటు సోమవారం కూడా సెలవు దినమే. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్కి వచ్చే అవకాశం ఉంది. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన చాలు.. ఈ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటొచు. ఇంత మంచి వీకెండ్ని టాలీవుడ్ వదులుకుంది. -
18న వినాయకచవితి.. 28న నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతితో ముడిపడిన పండగల్లో ఎంతో పరమార్థం ఉంది. ప్రధానంగా వినాయకచవితి సందర్భంగా నిర్వహించుకునే కార్యక్రమాల్లో సామాజిక ప్రగతికి, సంఘటిత జీవనానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఎన్నో ముడివడి ఉన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ సాగే గణేష్ ఏకతా యాత్ర భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. వినాయకుడు అందరివాడు అన్ని పండుగల్లోకెల్ల వినాయక చవితి అంటే అందరికీ ఎంతో ఇష్టం. పిల్లా, పెద్ద అందరికీ వినాయకుడు అంటే మక్కువ చూపిస్తారు. దీన్ని పండుగలా కాకుండా.. సొంతింట్లో పుట్టినరోజును జరుపుకున్నట్టుగా భావిస్తారు. వినాయకుడిని తమ వాడిగా అన్వయించుకుంటారు. ఈ పండుగ ఎప్పుడు అన్నదానిపై ఈ సారి భిన్నవాదనలు తెరపైకి వచ్చాయి. (వినాయకుడిని పూజిద్దాం ఇలా..) 18కే భాగ్యనగర్ మొగ్గు వినాయకచవితి ఎప్పుడనే విషయంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఒక ప్రకటన చేసింది. ఈ నెల 18వ తేదీనే వినాయకచవితి పండుగని పేర్కొంది. అలాగే 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని తెలిపింది. అంతకు ముందు 19న వినాయక చవితి, 29న నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించిన సంగతి విదితమే. అయితే.. ఈ ఏడాది తిథి రెండు రోజులు ఉండడం వల్ల.. పండుగ ఎప్పుడనే దానిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. శృంగేరి-కంచి పీఠాధిపతులు గణేష్ ప్రతిష్ట 18వ తేదీనే చేసుకోవాలని సూచించారట. కాబట్టి.. గ్రేటర్ పరిధిలోని మండపాలు 18వ తేదీనే వినాయక చవితి నిర్వహించుకోవాలని సూచించింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ. సంబరం తెచ్చే పండగ భాజాభజంత్రీలు, తప్పెట్లు, కోలాటాలు, కీలుగుర్రాల నృత్యాలు, పండరిభజనలు, కర్రసాము విన్యాసాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో గణేషుడి నవరాత్రులు సందడిగా ఉంటాయి. ఇక నిమజ్జనం గురించి చెప్పనక్కర్లేదు. భాగ్యనగరం అంతా ఏకతా యాత్ర కోలాహలంగా, సందడితో సాగుతుంది. ఈ పండుగ వల్ల ఎంతో మందికి ఉపాధి, మరెంతో మందికి చేతినిండా పని. మట్టి వినాయకుడికి జై వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్పేటతోపాటు కూకట్పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్నగర్, పెద్ద అంబర్పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహం కూడా తుదిమెరుగులు దిద్దుకుంటోంది. The #Khairatabad #Ganesh #Idol in making! #VinayakaChavithi #GaneshChaturthi #Hyderabad #Telangana 📸: @BelieverHemanth pic.twitter.com/HIFcGpULDr — Hi Hyderabad (@HiHyderabad) September 3, 2023 పర్యావరణానికి పెద్దపీట వినాయక ప్రతిమలతో పాటు మట్టి పాత్రలను, ప్రమిదలను, చేనేత పూజా వస్త్రాలను, ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన పెసరపప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 21 రకాల ఆకులను సైతం పల్లెల నుంచి సేకరించి గణపతి కిట్లను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. Ganapati Bappa Morya ♥️#GaneshChaturthi #GaneshChaturthi2023 pic.twitter.com/ByLNMYSef0 — poorna_choudary (@poornachoudary1) September 1, 2023 -
వినాయక చవితి సెప్టెంబర్ 18నే
సాక్షి, హైదరాబాద్: ఈ సంవత్సరం వినాయక చవితి పర్వదినాన్ని సెప్టెంబర్ 18 సోమవారం రోజునే నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. శోభకృత్నామ సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజునే మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉన్నందున అదే రోజున వినాయక చవితిగా నిర్వహించుకోవాలని నిర్ధారించినట్టు తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతిలు ఓ ప్రకటనలో తెలిపారు. చవితి తిథి 18న ఉదయం 9.58కి ఆరంభమై 19వ తేదీ ఉదయం 10.28కి ముగుస్తుందని తెలిపారు. దీని ప్రకారం చవితి తిథి మధ్యాహ్నం సమయానికి 18నే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ కార్యాలయాలకు, ప్రభుత్వ సలహాదారులకు తెలిపినట్టు వెల్లడించారు. జూలై 22, 23 తేదీల్లో వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో జరిగిన షష్ఠమ విద్వత్సమ్మేళనంలో వందమంది సిద్ధాంతుల సమక్షంలో పండుగల తేదీలను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. చదవండి: Hyderabad: నా ఫ్లెక్సీలు తొలగిస్తారా?.. కార్పొరేటర్పై కేసు నమోదు -
Reliance AGM 2023: జియో ఎయిర్ఫైబర్ వచ్చేస్తోంది..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ వృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా వినాయక చవితి కల్లా జియో ఎయిర్ఫైబర్ను అందుబాటులోకి తేనుంది. అలాగే, జియో ఫైనాన్షియల్స్ విభాగం ద్వారా బీమా ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. వచ్చే అయిదేళ్లలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు ప్రకటించారు. అదే క్రమంలో వారసత్వ ప్రణాళికలను కూడా వెల్లడించారు. ఆయన ముగ్గురు సంతానం (ఆకాశ్, ఈషా, అనంత్) కంపెనీ బోర్డులో నియమితులైనట్లు పేర్కొన్నారు. అలాగే, 2024 ఏప్రిల్ 19తో తన పదవీకాలం ముగియనున్నప్పటికీ.. మరో అయిదేళ్ల పాటు చైర్మన్గా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. ఏజీఎంలో మరిన్ని విశేషాలు.. ఎయిర్ఫైబర్తో వైర్లెస్ బ్రాడ్బ్యాండ్.. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్ఫైబర్ సరీ్వసులు ప్రారంభమవుతాయి. ఇది వైర్లు అవసరం లేని 5జీ బ్రాడ్బ్యాండ్ సరీ్వసులాంటిది. నెట్ కనెక్టివిటీకి ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు .. 5జీ నెట్వర్క్ను, అధునాతన వైర్లెస్ టెక్నాలజీలను ఉపయోగించుకుని ఇది వరుసలో చిట్టచివర్న ఉన్న వారికి కూడా బ్రాడ్బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేగలదని ముకేశ్ అంబానీ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్తో రోజూ 15,000 ప్రాంగణాలను కనెక్ట్ చేయగలుగుతుంటే, జియోఎయిర్ఫైబర్ దీనికి పది రెట్లు అధికంగా కనెక్ట్ చేయగలదు. తద్వారా 20 కోట్ల గృహాలు, ప్రాంగణాలకు జియో మరింత చేరువ కాగలదు. ఈ సందర్భంగా జియో ట్రూ5జీ డెవలపర్ ప్లాట్ఫాంను కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో ఏర్పాటు చేసే తొలి జియో ట్రూ5జీ ల్యాబ్లో టెక్నాలజీ భాగస్వాములు, ఎంటర్ప్రైజ్ కస్టమర్లు .. వివిధ పరిశ్రమలకు అవసరమైన సొల్యూషన్స్ను రూపొందించవచ్చు. వాటిని పరీక్షించవచ్చు. అటు, కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనాలను అందరికీ, అన్నిచోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్లాట్ఫామ్స్ కృషి చేస్తోందని ముకేశ్ అంబానీ చెప్పారు. డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తరణ పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయని తెలిపారు. జియోసినిమా వినోదానికి దేశీయంలోనే అతి పెద్ద డిజిటల్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీబీజీ ప్లాంట్లు.. గిగా ఫ్యాక్టరీలు.. 2035 నాటికి కర్బన ఉద్గారాల విషయంలో తటస్థ స్థాయిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. జామ్నగర్లో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) డెమో యూనిట్లను నెలకొల్పాక, కేవలం 10 నెలల వ్యవధిలోనే ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకీలో వాణిజ్యావసరాల కోసం తొలి సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు అంబానీ చెప్పారు. వీటిని త్వరితగతిన 25కి, అటుపైన వచ్చే అయిదేళ్లలో 100కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీ కోసం జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో రూ. 75,000 కోట్లతో నాలుగు గిగాఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బీమాలోకి జేఎఫ్ఎస్... జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ (జేఎఫ్ఎస్) బీమా రంగంలోకి విస్తరించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ఇది సరళమైన ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా పాలసీలను అందిస్తుందని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి విస్తరించేందుకు బ్లాక్రాక్తో కలిసి జేఎఫ్ఎస్ జాయింట్ వెంచర్ను ప్రకటించింది. టెలికం విభాగం జియోకి ఉన్న 45 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లకు తమ ఉత్పత్తులను విక్రయించే యోచనలో ఉంది. టాప్ 4లో రిటైల్.. పలు అంతర్జాతీయ దిగ్గజాలు రిలయన్స్ రిటైల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. ఒకవేళ దీన్ని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసి ఉంటే ప్రస్తుత వేల్యుయేషన్ ప్రకారం టాప్ 4 లిస్టెడ్ సంస్థల్లో రిటైల్ కూడా ఒకటిగా ఉండేదని ఆయన తెలిపారు. ‘‘2020 సెప్టెంబర్లో నిధులు సమీకరించినప్పుడు రిటైల్ వేల్యుయేషన్ రూ. 4.28 లక్షల కోట్లుగా ఉంది. మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధిలోనే ఇది రెట్టింపయింది. రూ. 8.278 లక్షల కోట్ల వేల్యుయేషన్తో ఇటీవలే ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) 1 శాతం వాటాను కొనుగోలు చేసింది. నాణ్యత, నవకల్పన, కస్టమరు ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోగలుగుతుండటం వంటి సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని అంబానీ తెలిపారు. అటు రూ. 22 కోట్లకు కొనుగోలు చేసిన సాఫ్ట్డ్రింక్ క్యాంపా కోలాను ఆసియా, ఆఫ్రికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూ డా తీసుకెళ్లనున్నట్లు ఈషా అంబానీ తెలిపారు. వారసత్వ ప్రణాళికలు.. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన వివిధ వ్యాపార విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వారు ఈ హోదాను ‘కష్టపడి సంపాదించుకున్నారని’ అంబానీ తెలిపారు. ‘‘ఈషా, ఆకాశ్, అనంత్లో నేను, మా తండ్రిగారు ధీరుభాయ్ అంబానీ నాకు కనిపిస్తారు. ధీరుభాయ్లోని ఆ మెరుపు వారిలో నాకు కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జియో ఇన్ఫోకామ్ను ఆకాశ్, రిటైల్ వ్యాపారాన్ని ఆయన కవల సోదరి ఈషా (31), కొత్త ఇంధన వ్యాపార విభాగాన్ని అనంత్ (27) పర్యవేక్షిస్తున్నారు. 2002లో ధీరుభాయ్ మరణానంతరం సోదరుడు అనిల్ అంబానీతో వ్యాపార పంపకాలపరంగా వివాదం తలెత్తిన నేపథ్యంలో ముకేశ్ తాజా వారసత్వ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ముకేశ్ సతీమణి నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే, ఫౌండేషన్ చైర్పర్సన్గా శాశ్వత ఆహా్వనితురాలు హోదాలో ఆమె బోర్డు సమావేశాలన్నింటికి యథాప్రకారంగా హాజరవుతారు. అత్యధిక డిమాండ్ ఉన్నవి, అనేక దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించగలిగేవి అయిన వ్యాపారాలను మేము ఎంచుకున్నాం. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను నిర్మించగలిగాం. మా మూడు వృద్ధి చోదకాలు .. (ఓ2సీ, రిటైల్, జియో డిజిటల్ సర్వీసులు) మరింత విలువ జోడించగలవు. కొత్తగా మా నాలుగో వృద్ధి ఇంజిన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వీటికి తోడుగా చేరింది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్ -
శ్రీ దశ మహా విద్యాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు
ఖైరతాబాద్(హైదరాబాద్): ప్రతియేటా వివిధరూపాల్లో కొలువుదీరే ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం శ్రీ దశ మహావిద్యాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ ప్రతిష్ఠాపన 69వ సంవత్సరం సందర్భంగా మహాగణపతి 63 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పులో ఉండే మహాగణపతి పక్కనే కుడివైపు వరాహాదేవి, ఎడమవైపు సరస్వతిమాత విగ్రహాలు పది అడుగుల ఎత్తు ఉండగా, మహాగణపతి 63 అడుగుల ఎత్తులో నాగశేషుపై నిలబడి ఉండే ఆకారంలో తలపై ఏడు పడగలు, 10 చేతులు ఉంటాయి. మహాగణపతి పక్కన కుడివైపు 18 అడుగుల ఎత్తులో లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి విగ్రహాలు ఉంటాయి. శ్రీ దశ మహావిద్యాగణపతిగా నామకరణం చేయడం ప్రత్యేకతగా ఉందని దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ తెలిపారు. అమ్మవారి ఉపాసనలో దశ మహావిద్యలు అధిక ప్రాధాన్యత కలిగినవనీ, విద్యకు గణపతి అనుగ్రహం కావాల్సి ఉన్నందున దశ మహావిద్యాగణపతిగా నామకరణం చేసినట్లు తెలిపారు. -
ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వినాయకుడికి ఆధార్ కార్డు.. మీ ఆలోచనకు సలాం గురూ!
రాంచీ: ప్రజల జీవితంలో ఆధార్ కార్డు ఒక భాగమైపోయింది. ఏ పని చేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే.. ఒక్క మనుషులకేనా? దేవుళ్లకు కూడా ఆధార్ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు జార్ఖండ్లోని జెంషెడ్పూర్కు చెందిన కొందరు యువకులు.. అందుకు వినాయక చవితి ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. గణేషుడి పేరుపై ఆధార్ కార్డు సృష్టించేశారు. ఆధార్ నమూనాతో భారీ ఎత్తున ఆధార్ కార్డు మండపం వేశారు. ఆధార్ కార్డ్ థీమ్తో వేసిన ఈ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడికి వచ్చి పోయే భక్తులు ఆసక్తితో ఆధార్ కార్డులోని వివరాలను చదువుతూ, సెల్ఫీలు దిగుతూ ముచ్చట పడుతున్నారు. ఆధార్ కార్డు ప్రకారం.. వినాయకుడి అడ్రస్ కైలాసంగా పేర్కొన్నారు. ఫోటో స్థానంలోనే గణేషుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆధార్ కార్డుపై ఉన్న బార్కోడ్ను స్కాన్ చేస్తే.. అది గూగుల్ లింక్కు వెళ్తుంది. అందులో వినాయకుడికి సంబంధించిన ఫోటోలు ప్రత్యక్షమవుతాయి. ఆ వినూత్న ఆధార్పై శ్రీ గణేశ్ S/o మహాదేవ్, కైలాస్ పర్వత శిఖరం, మానస సరోవరం సరస్సు దగ్గర, పిన్కోడ్ 000001 అని రాసి ఉంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ 01/01/600CEగా పేర్కొన్నారు. Jharkhand | A Ganesh Pandal in Jamshedpur has been made in the form of an Aadhar card which identifies the address of Lord Ganesha in Kailash & his date of birth during the 6th century #GaneshChaturthi pic.twitter.com/qupLStkut6 — ANI (@ANI) September 1, 2022 ఇదీ చదవండి: విదేశాల్లో వినాయకుడు.. గణేషునికి దేశదేశాల్లో ప్రత్యేక స్థానం -
ఏపీలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి: ఎంపీ భరత్
-
పీయూష్ గోయల్ ఇంట్లో ప్రధాని మోదీ సందడి, గణపయ్యకు ‘హారతి’
సాక్షి, న్యూఢిల్లీ: వినాయక చవితి ఉత్సవాలు బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు గణపయ్య పూజలు అందుకోనున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లారు. అక్కడ తొలిరోజు గౌరీ తనయుడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గణేష్ చతుర్థి సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతంలోని ఓ శ్లోకాన్ని సైతం ఆయన షేర్ చేశారు. రాష్ట్రపతి శుభాకాంక్షలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాక్షించారు. జ్ఞానానికి ప్రతీక అయిన మంగళమూర్తి గణేషుడు అందరికీ మంచి చేయాలని కోరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘గణపతిబప్పా మోరియా’ అంటూ ట్వీట్ చేశారు. ఆగస్టు 31 మొదలైన లంబోదరుడి ఉత్సవాలు సెప్టెంబర్ 9న ముగియనున్నాయి. గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల నడుమ కొనసాగిన గణనాథుడి వేడుకలు ఈసారి పునర్వైభవం సంతరించుకోనున్నాయి. (చదవండి: కిడ్నాప్ కేసులో ఆరోపణలు.. శాఖ మార్చిన కాసేపటికే బిహార్ మంత్రి రాజీనామా) -
గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి!
సాక్షి, ఆదిలాబాద్: గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా వారం ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకొనే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆగస్టు 31న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించడంతో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నవరాత్రులు సజావుగా జరిగేందుకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని గణేశ్ ఉత్సవ కమిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, విద్యుత్ అధికారులు పలు సూచనలు చేశారు. పోలీస్శాఖ సూచనలు.. ► గణేశ్ మండపాలను ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయరాదు. ►మండపాల వద్ద మద్యం సేవించరాదు. జూదం ఆడరాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు. ►మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ప్రతి రోజు వలంటీర్ల పేర్లను నమోదు చేసి సంతకం తీసుకోవాలి. ►మండపాలను గాలి, వానకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించాలి. రద్దీగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు ఏర్పా టు చేయాలి. వలంటీర్లు భక్తులను తనిఖీ చేశాకే మండపం వద్దకు పంపాలి. ►మండపంలోకి ఎలాంటి మండే పదార్థాలు లేదా పటాకులు ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూనెతో వెలిగించే దీపాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ►మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా వీడియో కెమెరాలు, సీసీటీటీలు ఏర్పాటు చేసుకోవాలి. ►రాత్రి వేళ మండపంలోకి పశువులు, కుక్కలు చొరబడకుండా అడ్డుగా కంచె ఏర్పాటు చేసుకోవాలి. ►ఆగస్టు 31న ఉదయం 6గంటల నుంచి సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై క్రాకర్లు కాల్చడం, పేల్చడం నిషేధం. ►సౌండ్ బాక్స్లను స్థానిక డీఎస్పీ అనుమతి లేకుండా ఉపయోగించరాదు. మండపం వద్ద ఒక బాక్స్ టైపు స్పీకర్ మండప ప్రాంగణంలో మాత్రమే ఇన్స్టాల్ చేయబడాలి. ►శబ్ధ స్థాయిలను అనుమతించదగిన ప రిమితుల్లోనే ఉంచాలి. భారత సర్వోన్న త న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్స్పీకర్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్లను ఉపయోగించకూడదు. ►మండపాల వద్ద ఎలాంటి అసభ్యకరమైన పాటలు, ప్రకటనలు చేయకుండా భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలి. ►ఏదైన సమాచారం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి. విద్యుత్శాఖ సూచనలు.. ►వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. మండపాల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్ తీగలతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పూర్తిగా నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో షార్ట్ సర్క్యూట్లు, విద్యుత్ షాక్లు తగిలితే ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదముందంటున్నారు. ►మండపాల విద్యుద్దీకరణ పనులు లైసెన్స్డ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ ద్వారా మాత్రమే చేపట్టాలి. ►విద్యుత్ సరఫరా కోసం ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్గా అమర్చుకోవాలి. లైన్ల నుంచి వచ్చే వైర్ల నుంచి మండపానికి సరఫరా అయ్యే చోట ఈ బ్రేకర్ను అమర్చుకోవాలి. ►మండపానికి విద్యుత్ అందించే వైర్లు 2.5 చదరపు మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండరాదు. ► ప్రతి సర్క్యూట్పై 800 వాట్ల కంటే అధిక లోడ్ వేయరాదు. ►వరుస విద్యుద్దీపాల కోసం సిల్క్వైర్లను వాడడం మంచిదికాదు. దీని వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదముంటుంది. ►ప్రతి సర్క్యూట్కు ప్రత్యేకించి న్యూట్రల్ ఎర్త్వైర్ను తీసుకోవాలి. ►మండపాల వద్ద ఎర్తింగ్ గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. 25 ఎంఎం డయామీటర్, 3 మీటర్ల లోతైన గుంత తీసి ఎర్తింగ్ పైప్ను అమర్చుకోవాలి. ►మండపాల్లో విద్యుత్ ఎలక్ట్రిక్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టౌవ్లను వాడరాదు. ►ప్రతి మండపం వద్ద 5 కేజీల కార్బన్డయాక్సైడ్ నిండి ఉన్న అగ్నిమాపక సిలిండర్లను అమర్చుకోవాలి. 2 బకెట్లలో ఇసుకను నింపి పెట్టుకోవడం మంచిది. -
కాణిపాక గణపయ్యను దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
వినాయక చవితి వేడుకల్ని జరుపుకున్న ఎమ్మెల్సీ కవిత దంపతులు
-
Khairtabad: మహాగణపతికి తొలిపూజ నిర్వహించిన మంత్రి తలసాని
-
ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
-
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
-
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో సందడి.. తెల్లవారుజాము 3గంటల నుంచే అభిషేకాలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా చలువ పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసి గణనాథుని ప్రతిష్టించిన భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి జోగిరమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి గణేషుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. చదవండి: వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి? కాగా, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు. -
Ganesh Chaturthi 2022: వినాయకుడి 8 అవతారాలు.. వాటి చరిత్ర ఇదే
వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు.. ఆయన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని వేదాంతులు చెబుతుంటారు. గణేశుని ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చని సూచిస్తుంటారు. అందుకే గణేశుడే ప్రముఖంగా ఆరాధించబడే గాణపత్యం అనే శాఖ కూడా ఉంది.వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. ఆ ఎనిమిది వివరాలను, గణనాథుని మహిమలను తెలుసుకుని ఆ వినాయకుని సేవించి తరిద్దాం. వక్రతుండుడు పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోయి దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. ఏకదంతుడు చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే ç్ఛౌలితం దక్కుతుందన్నాడు. లోకాధి పత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండాపోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. మహోదరుడు శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంత కాలమైనా ఆయన ఆ తపస్సుని వీడకపోవడంతో పార్వతి కంగారుపడి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడి రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబో దరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. గజాననుడు కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసు కున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచి స్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాకతప్పవు. లంబోదరుడు దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించగా విష్ణువు తన నిజరూపంలోకి రావడంతో శివుడు భంగపడి క్రోధితుడయి క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు.క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడగా హర్షం,శోకం అనేసంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. వికటుడు పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతట ఆ రుషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షం అయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒకోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్నిఎదుర్కోవచ్చుననీ వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది. విఘ్నరాజు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విç్ఛ్నౌురాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విç్ఛ్నౌూలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి. ధూమ్రవర్ణుడు అరిషడ్వార్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతుని ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ‘నేను’ అనే అహంకారాన్ని పక్కనపెట్టి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పరులకు ఉపకారం చేస్తూ దైవ చింతనతో దైవాన్ని వెతుకుతూ మోక్షంకోసం సాధన చేయడమే దీని సారాంశం. -
వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి?
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం గణేశ చతుర్థి. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ఈ స్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయని ప్రతీతి. భక్తితో పూజిస్తే చాలు అపారమైన కృపావర్షం కురిపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు గురించి కొన్ని విశేషాలు... చదవండి: పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా.. వినాయకుడికి, విద్యకు సంబంధం ఏమిటి? చదువంటే గణపతికి ఇష్టం. నారదుడు, బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగు రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం ఉంది. వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. ‘లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతావా!’ అని అడిగాడట.‘అలాగే రాస్తాను కానీ, మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా!’ అన్నాడట గణపతి. ‘సరే! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేనూ వేగంగా చెబుతా!’ అన్నాడట వ్యాసుడు. అలా సరస్వతి నది తీరాన మహాభారత రచన మొదలైంది. వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతుండేవాడట. వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా అనుకోకుండా వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది! తన నిబంధన ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని విచారించాడట వ్యాసుడు. సరే తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది? ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలిసుండాలి. అంటే వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే వూహించాడు! వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో ‘నీ పుట్టినరోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. వారికి సకల విద్యలు అబ్బుతాయి’ అని ఆశీర్వదించాడట. నాటినుంచి వినాయక చవితినాడు చేసే పూజలో పిల్లలు తమ పుస్తకాలను, కలాలను ఉంచి, పుస్తకాలకు పసుపు కుంకుమలు అలంకరించి పూజించడం ఆచారంగా మారింది. క్షేమం, లాభం కూడా.. ఏ పూజ చేసినా, తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితోబాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికయినా ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది. వీటిలోని ఆంతర్యం ఇదే! వినాయకుని నక్షత్రం ‘హస్త’. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, ఉండ్రాళ్లుగా తయారు చేసి చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి నివేదన చేస్తారు. పత్రిపూజ: అదేవిధంగా వినాయకునిది కన్యారాశి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధునికి ఆకుపచ్చ రంగు ప్రీతికరమైనది. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. మూషిక వాహనం: మూషికం అంటే ఎలుక వాసనామయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. పంజరంలో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పట్టినప్పుడు మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు – వినాయకుడు. చదవండి: గణేశ్ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము -
వెండితెరపై వినాయక విన్యాసాలు.. ఈ సినిమాలపై ఓ లుక్కేయండి
వినాయకుడు.. విఘ్నాధిపతి.. గణనాథుడు.. బొజ్జ గణపయ్య.. ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో స్వామిని కొలిచినా సకల విఘ్నాలు తొలగి జయం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి వినాయకుడికి తెలుగు సినిమాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంది. విఘ్నేశ్వరుడి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి, విజయాలు సాధించాయి. మరెన్నో చిత్రాల్లో స్వామిని కీర్తిస్తూ వచ్చిన సన్నివేశాలు, పాటలు కూడా ప్రేక్షకులను అలరించాయి. గణనాథుడి నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు, పాటలపై ఓ లుక్కేద్దాం.. వినాయక చవితి వినాయక చవితి రోజున వినాయక వ్రత కథ చదువుకుని, పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఈ కథ ఆధారంగా సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన చిత్రం ‘వినాయక చవితి’. ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల తదితరులు నటించారు. కె. గోపాలరావు నిర్మించిన ఈ సినిమా 1957 ఆగస్టు 22న విడుదలైంది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే.. వినాయక చవితి నాడు శ్రీకృష్ణుడు పాలలో చంద్రుణ్ణి చూడటంవల్ల సత్రాజిత్తు సంపాదించిన శమంతకమణిని అపహరించాడన్న అపఖ్యాతి మూటగట్టుకుంటాడు. ఆ తర్వాత వినాయక వ్రతం ఆచరించి, నిర్దోషిగా తనను తాను నిరూపించుకుని బయటపడతాడు. అందరూ చవితి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే, ఆ గజానుని ఆశీస్సులతో ఎలాంటి నీలాప నిందలపాలు కాకుండా ఉంటారనే కథతో ‘వినాయక చవితి’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం విడుదలై 65 ఏళ్లు అయింది. భూ కైలాస్ పరమశివుని భక్తుడైన రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. ఆత్మలింగం సాధించి, అమరత్వం పొందాలన్నది రావణాసురుడి కోరిక. ఆయన తపస్సును మెచ్చుకున్న శివుడు ఆత్మలింగం ఇస్తూ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని షరతు విధిస్తాడు. రావణాసురుడికి అమరత్వం వస్తే భూ మండలాన్ని సర్వనాశనం చేస్తాడని భావించిన నారదుడు ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని వినాయకుణ్ణి ప్రార్థిస్తాడు. రావణాసురుడు సంధ్యా వందనం చేసే సమయంలో శివుడి ఆత్మలింగం రావణుడి పాలు కాకుండా చేస్తాడు వినాయకుడు. చివరకు ఆత్మార్పణకు సిద్ధపడిన రావణాసురుణ్ణి కైలాసపతి కరుణించి, ఆ ప్రదేశం ‘భూకైలాసం’గా మారుతుందని చెప్పి అనుగ్రహించడంతో కథ ముగుస్తుంది. ఎన్టీఆర్ రావణునిగా, ఏఎన్నార్ నారదుడిగా నటించిన ‘భూ కైలాస్’ చిత్రకథ ఇది. కె. శంకర్ దర్శకత్వంలో ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమా 1958 మార్చి 20న రిలీజైంది. శ్రీ వినాయక విజయం వినాయకుడి జీవిత చరిత్రపై తెలుగులో పూర్తి స్థాయిలో వచ్చిన చిత్రం ‘శ్రీ వినాయక విజయం’. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, వాణిశ్రీ శివపార్వతులుగా నటించారు. శివదీక్షా వ్రతాన్ని ఆచరించడానికి పూనుకుని స్నానమాచరించబోతూ పిండితో ఒక బాలుని బొమ్మ తయారు చేసి, దానికి ప్రాణం పోసి, కాపలాగా ఉంచుతుంది పార్వతీదేవి. అప్పుడు వచ్చిన శివుణ్ణి లోనికి అనుమతించడు ఆ బాలుడు. ఆగ్రహించి బాలుని శిరస్సు ఖండిస్తాడు శివుడు. దీంతో పార్వతి తన బిడ్డను ఎలాగైనా బతికించమని శివుణ్ణి కోరుతుంది. ఆ బాలునికి ఏనుగు తలను అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు. ఆ బాలుడు మూషికాసురున్ని సంహరించిన తీరు, మూషికాసురుని జన్మ వృత్తాంతం వంటి ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపించారు. 1979 డిసెంబరు 22న ఈ చిత్రం విడుదలైంది. జై జై గణేశా... తెలుగు సినిమాల్లో గణనాథుణ్ణి కీర్తిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ అనే పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలో సాగుతుంది. వెంకటేష్ నటించిన ‘కూలీ నెంబర్ 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాట ఇప్పటికీ ప్రతి వినాయక మండపంలో వినిపిస్తూ ఉంటుంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘జై చిరంజీవ’ సినిమాలో ‘జై జై గణేశా.. జై కొడత గణేశా..’ పాట సూపర్హిట్గా నిలిచింది. బాలకృష్ణ ‘డిక్టేటర్’ మూవీలోని ‘గం గం గణేశా..’ అనే పాట కూడా ఆకట్టుకుంది. ‘దేవుళ్లు’ సినిమాలోని ‘జయ జయ శుభకర వినాయక..’ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు. మహేశ్బాబు ‘పోకిరి’ సినిమాలోని జగడమే పాటలో ‘గణపతి బప్పా మోరియా..’ అంటూ వచ్చే బిట్ సూపర్గా ఉంటుంది. రామ్ ‘గణేష్’ మూవీలో వినాయకుడిపై ఒక పాట ఉంది. ‘దేవదాస్’ సినిమాలో నాగార్జున, నాని వినాయకుణ్ణి కీర్తిస్తూ పాడే పాట పాపులర్ అయింది. నాని ‘భలే భలే మగాడివోయ్’, రవితేజ ‘పవర్’ సినిమాల్లో వినాయక చవితి ప్రస్తావన ఉంది. ఇవే కాదు.. మరికొన్ని సినిమాల్లోనూ గణేశుణ్ణి కీర్తిస్తూ పాటలున్నాయి. -
పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా..
వినాయక చవితి... యువతరం గుండెల్లో పెట్టుకునే పండగ. ఆనందం, ఆధ్యాత్మిక భావన... వాడవాడల్లో నిండుగా వెలిగే పండగ. కొంతకాలంగా ‘పర్యావరణహితం’ యూత్ ఎజెండాలో మొదటి వరుసలో చేరింది. రసాయన రహిత విగ్రహాలను కొనుగోలు చేయడానికే యువతరంలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకు వేసి, మట్టితో విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణి చేస్తున్నారు. పర్యావరణహిత సందేశానికి రెక్కలు ఇస్తున్నారు... వినాయక చవితి యువతరం సొంతం చేసుకునే పండగ. పండగ ముందు పందిరిగుంజలు పాతడం నుంచి నిమజ్జనం వరకు ప్రతిక్షణం ఆధ్యాత్మిక భావన, ఆనందం వారి సొంతం. అయితే గత కొద్దికాలంగా ‘ఎకో–ఫ్రెండ్లీ గణేశ’ విగ్రహాల వైపు యూత్ మొగ్గుచూపుతోంది. వారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. లక్నోలోని ఐటీ కళాశాల ముందు గత అయిదు సంవత్సరాలుగా వినాయకుడి విగ్రహాలను అమ్ముతున్నాడు ఆకాష్ కుమార్. ‘గతంతో పోల్చితే మార్పు వచ్చిందనే చెప్పాలి. మట్టితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలు కొనడానికి ప్రాధాన్యత ఇస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంది. కొద్దిపాటి కృత్రిమ రంగులు, ప్లాస్టిక్ అలంకరణను కూడా యువత ఇష్టపడడం లేదు’ అంటున్నాడు ఆకాష్ కుమార్. తనీష ఈసారి ఎకో–ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాన్ని కొనుగోలు చేసింది. గత సంవత్సరం కొనుగోలు చేసిన విగ్రహంతో పోల్చితే ఆకర్షణీయంగా లేకపోవచ్చుగాక, కాని తన మనసుకు మాత్రం తృప్తిగా ఉంది. ‘ఆకర్షణీయమైన రసాయన రంగుల కంటే పర్యావరణం ముఖ్యం’ అంటుంది తనీష. మరో కస్టమర్ అనీష కూడా ఎకో–ఫ్రెండ్లీ విగ్రహాన్నే కొనుగోలు చేసింది. ‘నేను కొనడమే కాదు, ఇతరులు కూడా కొనేలా నా వంతు ప్రచారాన్ని చేస్తున్నాను’ అంటుంది అనీష. సాధారణ విగ్రహాలతో పోల్చితే పర్యావరణహిత వినాయక విగ్రహాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని కొనడానికి ఆసక్తి చూపడం విశేషం. సాధారణంగా కోల్కతాలో మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. ముంబైలో మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించి తయారు చేసే విగ్రహాలే ఎక్కువ. అయితే బాంద్రాలోని పాలి హిల్కు చెందిన యువత మట్టిని ఉపయోగించి విగ్రహాలు తయారు చేయడమే కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి విగ్రహాలకు మధ్య తేడా గురించి ప్రచారం చేస్తున్నారు. ‘ఏదైనా మంచి విషయం చెబితే ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తారు చాలామంది. కాని మేము చెప్పే విషయాలను చాలా ఆసక్తిగా వింటున్నారు. మార్పు వస్తుందనే నమ్మకం వచ్చింది’ అంటున్నాడు మట్టితో వినాయక విగ్రహాలు తయారుచేసే సచిన్. బాంద్రా నుంచి బెంగళూరు వచ్చేద్దాం. బెంగళూరుకు చెందిన శ్రీ విద్యారణ్య యువక సంఘ, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్తో కలిసి ఔషధ గింజలతో కూడిన పదివేల మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు. జైపుర్కు చెందిన కెరీర్ కౌన్సెలర్ షల్లీ కపూర్ తన ఫ్రెండ్ శ్వేతతో కలిసి ‘పర్యావరణహిత వినాయక చవితి’ గురించి స్కూల్, కాలేజీలలో విస్తృతంగా ప్రచారం చేయడమే కాదు, మట్టితో చిన్న చిన్న వినాయక విగ్రహాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తుంది. ‘మార్పు అనేది యువతరంతోనే మొదలవుతుందనే బలమైన నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రయత్నం’ అంటుంది శ్వేత. ‘నేను సొంతంగా గణేశుడి విగ్రహాన్ని తయారు చేయడం సంతోషంగా అనిపించింది. వర్క్షాప్లో నేర్చుకున్న, విన్న విషయాలను తల్లిదండ్రులతో పంచుకున్నాను’ అంటుంది అర్చనా గుప్తా. పదిమంది నడిచే బాటే ఆ తరువాత ట్రెండ్ అవుతుంది. యువతరంలో మొదలైన మార్పును చూస్తుంటే పర్యావరణహిత విగ్రహాలను ఇష్టపడే ధోరణి ట్రెండ్గా మారడానికి అట్టే కాలం పట్టకపోవచ్చు. -
Ganesh Chaturthi 2022: ఏకశిలలో భారీ ఏకదంతుడు
సాక్షి, నాగర్కర్నూల్: ఇది దేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడి విగ్రహం. ఇది నాగర్కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. దుందుభి వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. కర్ణాటకలోని శ్రావణబెళగోళలో ఉన్న గోమఠేశ్వరుడు, చాముండీ కొండపై నందీశ్వరుడితోపాటు ఆవంచలోని గణపతి ఏకశిలా విగ్రహాలుగా అతిపెద్దవిగా ప్రసిద్ధి. ఏటా వినాయక చవితి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే ఈ గణనాథుడికి ఆలయం లేదు. నాటి ఆవుల మంచాపురమే.. నేటి ఆవంచ.. పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేక మల్లుడు, భువనైక మల్లుడు, తైలోక్య మల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్ష్యాకులు గణపతి భక్తులు కావడంతో క్రీ.శ.12వ శతాబ్దంలో 26 అడుగుల ఎత్తైన ఏకశిలా గణపతిని ఏర్పాటు చేసినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియం వద్ద భద్రపర్చారు. వీరి కాలంలోనే గ్రామశివారులోని భైరవ ఆలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివ పంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది. ఆదరణ లేక పూజలందుకోని గణనాథుడు దేశంలోనే అతిపెద్ద వినాయక ఏకశిలా విగ్రహంగా ప్రసిద్ధి చెందిన ఐశ్వర్య గణపతికి నీడ లేకుండాపోయింది. ఆలయం నిర్మాణం జరగకపోవడంతో ఈ విగ్రహం వందల ఏళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తోంది. ఏడేళ్ల క్రితం ఓ చారిటబుల్ ట్రస్టు ఆలయం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేశారు. అయితే ఆలయ నిర్మాణపనులు ముందుకుసాగడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టిసారించాలి.. పురాతన కాలం నాటి ఏకశిలా వినాయక విగ్రహానికి ఆలయాన్ని నిర్మించాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు ఆలయం లేక గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుడిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. – వస్పతి శివలింగం, ఆవంచ, నాగర్కర్నూల్ జిల్లా -
Ganesh Chaturthi Recipes: సున్నుండల తయారీ విధానం
కావలసిన పదార్థాలు : మినపప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు, నెయ్యి – 1 కప్పు, యాలకలపొడి – 1/2 టీ స్పూన్ తయారు చేసే విధానం : మినపప్పు దోరగా వేయించుకొని చల్లారిన తరువాత పొడి చేసుకొని నెయ్యి వేడిచేసి పంచదారపొడి, మినప్పిండీ, యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి. -
వినాయకచవితికి సిద్ధమైన ఖైరతాబాద్ విఘ్నేషుడు
-
Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ, పునః పూజ
క్లిక్: Ganesh Chaturthi: వ్రతకల్పము.. పూజా ద్రవ్యములు, వరసిద్ధి వినాయక పూజ క్లిక్: విఘ్నేశుని కథా ప్రారంభం.. తదుపరి... పునఃపూజ : ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి) శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాధునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వారచెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘ సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘ పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘ కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మిదానపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘ అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘ పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘ బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘ పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘ మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘ దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘ మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘ శో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా! (ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను) ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్. (వ్రతకల్ప పూజా విధానం సమాప్తం). -
Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ
క్లిక్: Ganesh Chaturthi: వ్రతకల్పము.. పూజా ద్రవ్యములు, వరసిద్ధి వినాయక పూజ తదుపరి: విఘ్నేశుని కథా ప్రారంభం.. (కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి) సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను. పూర్వం గజరూపంగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందు నివసించి ఉండమని కోరాడు. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించాడు. కైలాసాన పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశాలలో అన్వేషిస్తూ కొంత కాలానికి గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపించింది, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యం చెప్పి పంపాడు. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దుమేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తాను కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరాడు. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చింది. కావున శివునొసంగు’’ అనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారం తెలిపి నందిని ప్రేరేపించాడు నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. అప్పుడు శివుడు గజాసురగర్భం నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్లాడు. పిదప శివుడు నంది నెక్కి కైలాసానికి వేగంగా వెళ్లాడు. కైలాసంలో పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని తెలిపింది. స్నానానంతరం పార్వతి సర్వాభరణాలు అలంకరించుకొని పతి రాకకోసం నిరీక్షించసాగింది. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోయాడు. ఇంతలో వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించాడు. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తనమందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని ఉత్తరించి లోపలికి వెళ్లాడు. అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించింది. వారిరువురు పరమానందంతో ప్రియసంభాషణములు ముచ్చటించుకొంటుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చింది. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టాడు. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొన సాగారు. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవిస్తున్నాడు. అతడు సులభంగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనంగా జేసికొన్నాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. అతని వాహనరాజం నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరారు. గజాననుడు తాను పెద్దవాడు గనుక ఆ ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక ఆ ఆధిపత్యం తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు. సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూసి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వస్తారో, వారికి యీ ఆధిపత్యం ఇస్తాను’’ అని అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయు వేగంగా వెళ్లాడు. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయం తెలిపి రక్షించండి’’ యని ప్రార్థించాడు. అప్పుడు మహేశ్వరుడు దయతో, ‘‘కుమారా! ఒకసారి నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తూ కైలాసాన ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావంతో∙అంతకు పూర్వం గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించాడు. ఆ విధంగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూసి ఆశ్చర్యపడుతూ, కైలాసానికి వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలాన్ని నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియక అట్లా అన్నాను. క్షమించు. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వండి’’ అని ప్రార్థించాడు. అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింప బడుతున్నాడు. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పాలు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించాడు. భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోయాడు. ఎంత ప్రయత్నించినా, ఉదరం భూమికి ఆని, చేతులు భూమికి అందటం లేదు. ఈ విధంగా ప్రణామం చేయడానికి శ్రమిస్తుండగా శివుని శిరస్సున అలంకరించి వున్న చంద్రుడు చూసి వికటంగా నవ్వాడు. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలుకూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయాయి. అతడు మృతుడయ్యాడు. పార్వతి శోకిస్తూ చంద్రుని చూసి, ‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక’’ అని శపించింది. చంద్రునికి కలిగిన శాపం లోకానికి కూడా శాపమైంది. ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నిప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడ్డాడు. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అటువంటి నీలాపనింద కలిగిందన్నమాట. ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య (స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చివచ్చుట తెలియపరచి సప్తఋషులను సమాధాన పరచాడు. వారితో కూడా బ్రహ్మ కైలాసానికి వెళ్ళి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చె. అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీదేవి! నీవిచ్చిన శాపం వలన లోకములకెల్ల కీడు వాటిల్లుతోంది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో, ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపానికి ఉపశమనం చెప్పాడు. అంత బ్రహ్మాదులు çసంతోషించి తమ గృహాలకు వెళ్లి భాద్రపదశుద్ధ చతుర్థియందు మాత్రం చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖంగా ఉన్నారు. యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరు లుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగ వానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్ష మయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చాడు. ఆ సమయాన సూర్యుడు సత్రాజిత్తుతో ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారాన్ని అనుగ్రహిస్తుంది. ఆ మణి ఉన్న దేశంలో అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిముల వల్ల ఉపద్రవాలు, దుర్భిక్షం మొదలగునవి ఉండవు. కానీ అశుచిౖయె ధరిస్తే అది ధరించిన వానిని చంపుతుంది’’ అని చెప్పాడు. ఈ విషయాలను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వస్తుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వస్తున్నాడని భావించి, ఆ విషయం శ్రీ కృష్ణునకు తెలియజేశారు. శ్రీకృష్ణుడు అట్టి రత్నం ప్రభువు వద్ద ఉంటే దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందని ఆ మణిని ప్రభువైన ఉగ్రశేనునికి ఇప్పించాలనుకున్నాడు. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనుడికిచ్చాడు. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్లాడు. కొంత సమయానికి శరీర శోధన కారణంగా ప్రసేనుడు అశౌచాన్ని పొందాడు. ఈ కారణంతో ప్రసేనుడు సింహం దాడిలో మరణించాడు. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకం సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చింది. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యంలోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీ కృష్ణుడు కూడా వేటకై వెళ్ళివున్నాడు. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోషవేళలో ప్రసేనుడు సంహరింపబడ్డాడు. వానికోసం అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుతూ తలెత్తి చూడగా ఆకాశాన శుక్లపక్ష చవితినాటి చంద్రబింబం కనపడ్డాడు. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణముచే శ్రీ కృష్ణుడు తన మందిరానికి తిరిగి వచ్చాడు. దానికి పూర్వం, దేశ ప్రయోజ నాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణం వల్ల, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించిందని సత్రాజిత్తు, పౌరులు భావించారు. అంతట ఆ అపవాదును పోగొట్టు కోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెనని, రాత్రివేళ సింహం ప్రసేనుని, అతని గుర్రాన్ని తిని ఉంటుందని నిష్టూరంగా పలికారు. ఈ అపవాదు నుండి తప్పించు కొనుటకై శ్రీ కృష్ణుడు మరింత ప్రయత్నం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో çపడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను. శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః (తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.) అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగన మొనర్చు కొనవలెనని కోర్కె ఉండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించసాగింది. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి ‘‘దేవాదిదేవ! ఆర్తజనరక్ష! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడు’’ అంటూ పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి ‘‘జాంబవంతా! శ్యమంతకమణి అపహరించా నన్న నింద నాపై వచ్చింది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను’’ అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపాడు. ద్వారాకానగర పౌరులకు ఈ సత్యం తెలిపి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొన్నాడు. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించి నారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసి నప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాస్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖు లుండెడివారు. సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దాన మొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయాడు, ఇది తెలిసి శ్రీ కృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథంలో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్యుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద యుద్దంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతుడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీ కృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయాడు. బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్య ములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను. ఇచ్చట శ్రీ కృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను. శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయ మున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడి నప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతిలేమిచే ఓషదులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువైంది. దీనితో దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయం కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ భాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు,), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు నివేదన మొనరింపవలెనని సూచించాడు. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహాన్ని పొందాడు. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను. అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతాలను స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించాడు. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీ కృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికాడు. అంతట శ్రీ కృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహించమని కోరాడు. భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను. ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖంగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపా ఖ్యానంలో శ్రీకృష్ణపరమాత్మ వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానాన్ని అంటే అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయాలతో శిరమున అక్షతలు ధరించినయెడల చవితి చంద్రుని చూచి ననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మాహా భక్తుడైన అక్రూరుని రాక అవసమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపర లిచ్చుచూండెను. ‘‘మంగళం మహత్’’ చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను. – కథ సమాప్తం – తదుపరి: Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ, పునః పూజ (క్లిక్) -
చవితి పండుగపై ఏ ఆంక్షలూ లేవు.. తప్పుడు సమాచారంపై వెలంపల్లి శ్రీనివాస్ ఫైర్
సాక్షి, అమరావతి: వినాయక చవితి నిర్వహణపై ప్రభుత్వం ఏ ఆంక్షలూ విధించలేదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు. పైగా, గణేష్ మండపాల అనుమతిని సులభతరం చేశామని తెలిపారు. గతంలో అగ్నిమాపక, పోలీసు, విద్యుత్ శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి కోసం వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సింగిల్ విండో విధానాన్ని తెచ్చిందని తెలిపారు. మండపాల రుసుము ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని చెప్పారు. పైగా గత టీడీపీ ప్రభుత్వంలో 250 వాట్స్ వరకు విద్యుత్ వినియోగానికి రూ.1,000 చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు దాన్ని రూ.500కు తగ్గించామని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వినాయక చవితిపై ప్రభుత్వం నిబంధనలు విధించిందంటూ టీడీపీ ఆఫీసు నుంచి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారని చెప్పారు. వాటన్నింటిపై దేవదాయ శాఖ మంత్రి, డీజీపీ, అధికారులు కూడా వివరణ ఇచ్చారని తెలిపారు. అయినా సోము వీర్రాజు, టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. టీడీపీ ఆఫీస్ స్క్రిప్టును సోము వీర్రాజు, ఇతర బీజేపీ నేతలు మాట్లాడటం దుర్మార్గమన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. చీకట్లో ఆలయాలను ధ్వంసం చేసిన నీచ చరిత్ర ఆనాటి టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షానిదని అన్నారు. ఆలయాలు కూల్చి, విగ్రహాలను ధ్వంసం చేసి, రథాలు తగులబెట్టే వారికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పార్టీల నేతలకు చెప్పారు. నిందలు మానాలి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో విపక్షాలకు దిక్కుతోచడం లేదని చెప్పారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఏమైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు వాస్తవాలు గ్రహించి, ప్రభుత్వంపై నిందలు మానాలని చెప్పారు. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ను ఒక మతానికి పరిమితం చేయొద్దని కోరారు. -
గజముఖాసుర వధ
వజ్రదంతుడిగా పేరుమోసిన మూషికాసురుడు వినాయకుడి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. వినాయకుడు తోక పట్టుకుని విసిరితే పడ్డ పాటుకు ఒళ్లునొప్పులు తీరక ముక్కుతూ మూలుగుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో నారదుడు కైలాసం నుంచి నేరుగా మూషికాసురుడి దగ్గరకు వచ్చాడు. మూలుగుతూనే నారదుడికి ఉచితాసనాన్ని చూపించాడు మూషికాసురుడు. నారదుడు సుఖాసీనుడై, ‘వజ్రదంతా! నిన్ను దారుణంగా పరాభవించిన వినాయకుడు గణాధిపతిగా వర్ధిల్లుతున్నాడు మరి...’ అంటూ అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. పుండు మీద కారం చల్లినట్లయింది వజ్రదంతుడికి. ‘ఇప్పుడేం చెయ్యమంటావు నారదా?’ ఉక్రోషంగా అడిగాడు.‘వరాల దేవుడు మా తండ్రి బ్రహ్మదేవుడు ఉండనే ఉన్నాడు కదా! ఆయన కోసం తపస్సు చెయ్యి. ప్రతీకారం సాధించు’ అని చెప్పి, చల్లగా అక్కడి నుంచి నారాయణ నామస్మరణ చేస్తూ నిష్క్రమించాడు. భార్య ధవళ ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా, ఉన్నపళాన బయలుదేరాడు వజ్రదంతుడు. ఒక కీకారణ్యంలోకి చేరుకుని ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు. వజ్రదంతుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘ఏం కావాలో కోరుకో’ అన్నాడు. ‘విఘ్నానికి రూపం కల్పించి, నా ఆజ్ఞానువర్తిగా చెయ్యి’ అడిగాడు వజ్రదంతుడు.‘తథాస్తు’ అన్నాడు బ్రహ్మదేవుడు. విఘ్నాన్ని ఆవాహన చేసి, వజ్రదంతుడి ముందు నిలిపాడు. అతడికేమీ కనిపించలేదు. బ్రహ్మ అతడికి సూక్ష్మదర్శన దృష్టిని అనుగ్రహించాడు. అప్పుడు అతిచిన్న నలుసు రూపంలో ఉన్న విఘ్నాన్ని చూడగలిగాడు వజ్రదంతుడు. నల్లని ఆ నలుసును చూసి, ‘ఈ నలుసును నేనేం చేసుకోను?’ అని ఆశ్చర్యంగా బ్రహ్మను అడిగాడు. ‘విఘ్నబీజం కంటికి కనిపించదు. ఇది కామరూపి. ఏ రూపమైనా ధరించగలదు. ఎంతటి అనర్థాన్నయినా సృష్టించి, లోకాలను అల్లకల్లోలం చేయగలదు. దీన్ని ఏం చేసుకుంటావో చేసుకో!’ అని చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమైపోయాడు. మూషికాసురుడు విఘ్నంతో ‘నువ్వు మహా గజముఖాసుర రూపం దాల్చి వెళ్లి వినాయకుణ్ణి నాశనం చెయ్యి’ అని ఆజ్ఞాపించాడు. అప్పుడే వినాయకుడు కైలాసం నుంచి తాను పుట్టిపెరిగిన విశ్వకర్మ నిర్మించిన భవంతికి చేరుకున్నాడు. అక్కడ సింహద్వారం ఎదుట చంద్రశిలా వేదికపై తీరికగా కూర్చుని, ప్రశాంతంగా పరిసరాలను తిలకిస్తూ సేదదీరుతున్నాడు. అలాంటి సమయంలో ‘వినాయకుడెక్కడ?’ అంటూ భీకర గర్జన వినిపించింది. మహా గజముఖాసుర రూపంలో విఘ్నం వినాయకుడి ఎదుట వాలింది. ‘నువ్వు గజముఖుడివైతే, నేను మహా గజముఖాసురుణ్ణి. నిన్ను చంపవచ్చాను. చంపితీరుతాను’ అంటూ హూంకరించాడు. వినాయకుడు ఆ మాటలు వినిపించనట్లే అమాయకంగా చూస్తూ, ‘అబ్బాయ్! ముక్కలు నరుక్కుని చెరుకుగడ తినాలనుంది. నా గొడ్డలి కాస్త పదునుపెట్టి ఇస్తావంటే నీకు కుడుములు పెడతాను’ అంటూ వాటంగా చేతిలోని పరశువును అతడికేసి విసిరాడు. దెబ్బకు కాళ్లుతెగి, గజముఖాసురుడు పర్వతంలా కుప్పకూలిపోయాడు. ‘మహాప్రభో! నేను విఘ్నాన్ని. వజ్రదంతుడైన మూషికాసురుడికి బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల నేను ఈ రూపంలో నీ ముందుకొచ్చాను. తగిన శాస్తి జరిగింది. రక్షించు’ అంటూ గావుకేకలు పెట్టాడు. ‘నేను విఘ్ననాశకుణ్ణి. నిన్ను తుత్తునియలు చేయక తప్పదు. నీ తునకలు నన్ను, నిన్ను ఏమార్చిన వాళ్లనే పట్టి పీడిస్తాయి’ అంటూ విఘ్నాన్ని సూక్ష్మతి సూక్ష్మ ఖండాలుగా చెండాడాడు వినాయకుడు. -
తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: కొట్టు సత్యనారాయణ
-
Hyderabad: వినాయకుడి ఊరేగింపు ఉత్సవాలు.. ఈ నియమాలు తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: పల్లె, పట్నం, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తున్న వినాయక చవివి రానే వచ్చింది. ఆగస్టు 31 నుంచి చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.భక్తులు మండపాల ఏర్పాటు, విగ్రహాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. మండపాలు ఏర్పాటు, పూజలు, ఊరేగింపు, నిమజ్జనం తదితర అంశాల్లో జాగ్రత్తలు పాటిస్తే నవరాత్రులు విజయవంతమైనట్లే, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లభించినట్లే. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో పాటించాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం. రాకపోకలకు భంగం కలిగించొద్దు... వినాయక మండపాలు ఏర్పాటు చేసే సమయంలో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. రహదారి మధ్యలో మండపాలు నిర్మిస్తే వాహనాల రాకపోకలు, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయి. ఖాళీ స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. విగ్రహాల పరిమాణం.. విగ్రహాల పరిమాణం చిన్నగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే నిమజ్జనం సమయంలో విద్యుత్ తీగలు తాకే ప్రమాదముంది. తరలించే సమయం, మండపాల స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న విగ్రహాలను ప్రతిష్టించాలి. చదవండి: తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1 పర్యవరణాన్ని కాపాడాలి.. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి హానికరమైన వాటితో చేసిన విగ్రహాలతో నీటి కాలుష్యం ఏర్పడుతుంది. మట్టి, పీచు, సహజ సిద్ధమైన రంగులతో తయారైన విగ్రహాలను పూజించాలి. డీజేలకు పోలీసుల అనుమతి తీసుకోవాలి.. పూజా సమయంలో మాత్రమే మైకులు ఉపయోగించాలి. అనవసర సమయంలో బంద్ చేయాలి. భక్తి గీతాలు మాత్రమే వినిపింంచాలి. డీజేలు, భారీ స్పీకర్లకు పోలీసుల అనుమతి తీసుకోవాలి. వ్యయం తగ్గించాలి... మండపాల నిర్వాహకులు చందాలు డిమాండ్ చేయకుండా భక్తులు ఇచ్చింది తీసుకోవాలి. మండపాల అలంకరణ, నిమజ్జనం రోజు భారీగా ఖర్చు చేయడం కంటే అన్నదానం, పిల్లలకు వినోద, విజ్ఞానం వచ్చే అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి. సాఫీగా నిమజ్జనం చేయాలి... నిమజ్జనం రోజున మద్యం సేవించి డ్యాన్స్లు చేస్తూ సమస్యలు సృష్టించవద్దు. చెరువుల వద్ద అధికారుల సూచనలు పాటించాలి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి. పోలీసులకు సహకరించాలి.. పండుగ మూలాలు తెలుసుకొని బాథ్యతగా వినాయక ఉత్సవాలను జరుపుకోవాలి. విగ్రహ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఇతరులతో పోటీ పడకుండా సాంప్రదాయాలు పాటించాలి. ప్రభుత్వ సూచనలను పాటించాలి. శాంతిభద్రతల విషయమై పోలీసులకు సహకరించాలి. – చంద్రబాబు, సీఐ ఘట్కేసర్ -
భారీగా పెరిగిన గణేష్ విగ్రహాల ధరలు
-
ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం
తిరుపతి రూరల్: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‘లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ 1.24 లక్షల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికీ అందిస్తున్న ఆయన అవార్డుకు అర్హత సాధించారు. శనివారం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ అకార్డ్ స్కూల్ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రతినిధులు అవార్డుతో పాటు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా తమ సంస్థ శాశ్వత సభ్యత్వాన్ని కూడా ఉమాశంకర్ అందించారు. ఏటా కొనసాగిస్తాం: ఎమ్మెల్యే చెవిరెడ్డి దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1.24 లక్షల మట్టి విగ్రహాలు ఎక్కడికక్కడ తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వివరించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, అకార్డ్ స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్లు ప్రశాంత్, వివేక్ పాల్గొన్నారు. కాగా, ‘మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను నిషేధిద్దాం’ అంటూ ప్లకార్డ్లు చేత బట్టి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు తుడా వీసీ హరికృష్ణ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. -
వినాయక చవితి స్పెషల్: తిరుపతి బాలాజీ స్టైల్లో 18 అడుగుల ‘స్వర్ణ గణేష్’
లక్నో: వినాయక చవితి పండగ కోసం యావత్ దేశం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 31న గణేష్ చతుర్థి వచ్చింది. పండగ దగ్గరపడుతున్న క్రమంలో గణేషుడి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కో విధంగా, ఒక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు విఘ్నేశుడు. అయితే, ఈసారి ‘స్వర్ణ గణేష్’ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. బంగారంతో సిద్ధం చేస్తున్న 18 అడుగుల వినాయకుడి విగ్రహం వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని చందౌసి ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు ఈ స్వర్ణ గణేషుడి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. 18 అడుగుల విగ్రహానికి మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నట్లు చెప్పారు అజయ్ ఆర్యా అనే నిర్వాహకుడు. ‘గణేషుడి విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది. తిరుపతి బాలాజీ మాదిరిగా బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నాం.’ అని తెలిపారు. బంగారు గణేషుడి విగ్రహం వినాయక చవితి నాటికి పూర్తవుతుందని చెప్పారు అజయ్. #WATCH | 'Swarna Ganesh' adorned with gold is being made in UP's Chandausi for Ganesh Chaturthi "It will be an 18 feet tall idol. It is being prepared with gold decorative items on the lines of Tirupati Balaji," says Ajay Arya, a person associated with the project pic.twitter.com/B5RH2eXTnh — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 25, 2022 ఇదీ చదవండి: ఆవు పేడతో వినాయక విగ్రహాలు -
Hyderabad: మట్టి ప్రతిమలకే జై కొడుతున్న నగరవాసులు
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వినాయకచవితి వేడుకలకు నగరం సన్నద్ధమవుతోంది. మండపాల్లో కొలువుదీరేందుకు బొజ్జ గణపయ్య ముస్తాబవుతున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలపై ఆంక్షలు తొలగిపోవడంతో విగ్రహాల అమ్మకాలు మొదలయ్యాయి. మరోవైపు పర్యావరణహితమైన మట్టి ప్రతిమలకే నగరం పట్టం కడుతోంది. ముఖ్యంగా ఇళ్లల్లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజించేందుకు నగర వాసులు ఒక అడుగు నుంచి అయిదడుగుల మట్టి విగ్రహాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పీసీబీ వంటి ప్రభుత్వ సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి ప్రతిమల పంపిణీకి సన్నాహాలు చేపట్టాయి. సుమారు 6 లక్షల విగ్రహాలు.. ఈ ఏడాది సుమారు 6 లక్షల విగ్రహాలకు డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రైవేట్ సంస్థలు తయారు చేసే మట్టి విగ్రహాలకు సైతం డిమాండ్ భారీగా ఉండనుంది. ‘ప్లాన్ ఏ ప్లాంట్’ వంటి సంస్థలు మొలకెత్తే విగ్రహాలను అందజేస్తుండగా మరి కొన్ని సంస్థలు ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన ప్రకృతి ప్రతిమలను అందుబాటులోకి తెచ్చాయి. ‘బాధ్యత ఫౌండేషన్’ అనే సంస్థ స్వచ్ఛమైన పల్లె మట్టితో చేసిన వినాయక ప్రతిమలను, సేంద్రీయ పద్ధతిలో సిద్ధం చేసిన పూజా ద్రవ్యాలను అందజేస్తోంది. ఈ మట్టి విగ్రహంతో పాటే విత్తనాలు కూడా ఉంటాయి. వేడుకలు పూర్తయ్యే నాటికి మొక్కలై ఎదుగుతాయి. ప్రకృతిని ఆరాధించడమే దైవంగా భావిస్తూ గత 8 ఏళ్లుగా ఏఎస్రావునగర్ కేంద్రంగా ప్రకృతి వినాయకుడి ప్రతిమలను భక్తులకు అందజేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్తో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు, బ్రిటన్, అమెరికా, మలేషియా, తదితర దేశాలకు సైతం పెద్ద ఎత్తున విగ్రహాలను పంపించినట్లు పేర్కొన్నారు. పల్లెల్లోంచి నగరానికి.. బాధ్యత ఫౌండేషన్ అందజేసే గణపతి కిట్లు అన్నీ పూర్తిగా పల్లెల నుంచి సేకరించినవే. పల్లెల్లోని చెరువు మట్టి నుంచి ఈ ప్రతిమలను తయారు చేస్తారు. ఈ ప్రతిమలతో పాటు మట్టి పాత్రలను, ప్రమిదలను, చేనేత పూజా వస్త్రాలను, ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన పెసరపప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 21 రకాల ఆకులను సైతం పల్లెల నుంచి సేకరించి గణపతి కిట్లను అందుబాటులోకి తెచ్చారు. 60 పేజీల వినాయక పూజా పుస్తకాన్ని అందజేస్తారు. పదకొండు రోజుల పాటు పూజలకు అవసరమయ్యే వివిధ రకాల వస్తువులు ఉంటాయి. తేనె, ఆవుపాలు, ఆకుల డొప్పలు, ఖర్జూర వంటివి కూడా ఈ కిట్లో ఉంటాయి. పల్లెల్లోని చేతి వృత్తులను కాపాడేందుకు సహజమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి ప్రతిమలకు శ్రీకారం చుట్టినట్లు చంద్రశేఖర్ తెలిపారు. (చదవండి: ప్రీలాంచ్ మాయ ) -
Hyderabad: 9న గణేష్ నిమజ్జనం.. ఉచితంగా 6 లక్షల విగ్రహాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే నెల సెప్టెంబరు 9న గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సందర్శిస్తామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్లకు అదనంగా మరో 50 పాండ్ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపు రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సెప్టెంబరు 9న నిర్వహించే గణేష్ నిమజ్జనానికి సుమారు 8 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్ల్లో విధుల్లో ఉంటారని చెప్పారు. గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలన్నారు. (క్లిక్: కోట్ల గొంతుకలు.. ఒక్క స్వరమై) సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, విద్యుత్ శాఖచీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, పీసీసీబీ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి రఘోత్తంరెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధి సుదర్శన్, సికింద్రాబాద్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సందడిగా మెగా రికార్డ్స్ అవార్డుల ప్రదానోత్సవం) -
హీరో కార్తీ, అతిథి శంకర్ విరుమన్ రిలీజ్ డేట్ ఫిక్స్
సాక్షి, చెన్నై: ‘విరుమన్’ చిత్రం వినాయక చవితికి విడుదలకు ముస్తాబవుతోంది. కార్తీ కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ముత్తయ్య దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నటుడు రాజ్కిరణ్, ప్రకాష్రాజ్, సూరి, ఆర్కే సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కాగా చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ஆகஸ்ட் 31 விநாயகர் சதுர்த்திக்கு வர்றோம் #விருமன் #VirumanFromAug31@Karthi_Offl @Suriya_offl @2D_ENTPVTLTD @dir_muthaiya @thisisysr @AditiShankarofl @rajsekarpandian @prakashraaj #Rajkiran @sooriofficial @sakthivelan_b pic.twitter.com/qnr2X1NKKT — Actor Karthi (@Karthi_Offl) May 18, 2022 -
న్యూజెర్సీలో ఘనంగా గణేశ్ నిమజ్జనోత్సవం
ఎడిసన్ (న్యూజెర్సీ): అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న సాయి దత్త పీఠం, న్యూజెర్సీ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రులు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలతో ఆ గణనాథుడిని తీర్చిదిద్దారు. తొమ్మిది రోజుల నిత్య పూజల అనంతరం అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవం జరిగింది. డప్పు వాయిద్యాల హోరులో భక్తుల ఆనందంతో చేసిన నృత్యాలతో ఎడిసన్ వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. న్యూజెర్సీ సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులు భారీగా హాజరై ఆ గణనాథుడి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. ఎడిసన్ నడిబొడ్డున ఉన్న శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో హేరంభ పంచముఖ గణపతి కొలువై ఉన్నాడు. చదవండి : షికాగోలో వినాయక చవితి వేడుకలు -
వినాయకుడికి రూ.6 కోట్ల విలువైన 5 కేజీల బంగారు కిరీటం
ముంబై: దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నారు. కోవిడ్ కారణంగా గత ఏడాది ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక వినాయక చవితి ఉత్సవాలు అనగానే ముందుగా ముంబై పేరు గుర్తుకు వస్తుంది. ఇక్కడ పది రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక మహారాష్ట్రలో ముంబై లాల్ బాగ్చా గణేషుడు, పుణెలోని శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణపతి మందిరాలు ఎంతో పురాతనమైనవే కాక చాలా ప్రసిద్ధి చెందినవి కూడా. (చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్) వినాయక చవితి సందర్భంగా ముంబై, పుణె ఆలయాల్లో భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హల్వాయి గణపతి మందిరంలో మహా భోగ్ పేరిట భారీ ఎత్తున మోదక్లు, మిఠాయిలు ప్రసాదంగా నివేదిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులు హల్వాయి గణపతికి 6 కోట్ల రూపాయల విలువ చేసే 5 కిలోగ్రాముల బంగారు కిరీటాన్ని గణేషుడికి సమర్పించారు. పర్వదినం సందర్భంగా భక్తులు వినాయకుడిని కొత్త దుస్తులు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం బంగారు కిరీటాన్ని అలంకరించారు. 21 కేజీల మహాప్రసాదిన్ని నివేదించారు. (చదవండి: జైలులో భర్త.. పండగ వేడుకల్లో శిల్పాశెట్టి) ఓ వైపు కరోనా భయం.. మరోవైపు వినాయక చవితి ఉత్సవాల కారణంగా ముంబై పోలీసులు సెప్టెంబర్ 10-19 వరకు నగరంలో 144 సెక్షన్ విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశించారు. గణపతి ఊరేగింపు వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. అంతేకాక జనాలు ఇళ్ల దగ్గరే వినాయక చవితి జరుపుకోవాలని సూచించారు. ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఆన్లైన్ దర్శనాలు ప్రారంభించారు. ప్రస్తుతం హల్వాయి గణపతి మందిరంలో కూడా హారతి కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. చదవండి: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే.. -
వినాయక చవితి పర్వదినం: గణేశుని పూజలో సెలబ్రెటీలు
-
కొలువుదీరిన శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి
-
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం జగన్
-
కాణిపాకం వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఎస్ బాబు, ఆలయ అధికారి వెంకటేష్.. మంత్రికి ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇవీ చదవండి: మంచి పనులకు విఘ్నాలు తొలగాలి మహా గణపతిం మనసా స్మరామి... -
ప్రతి సంవత్సరం కొత్త విగ్రహాన్నే ఎందుకు పెట్టాలి..?
-
మహాకాయ.. అభయమీయవయా!
సకల జీవకోటికీ వరాలను అనుగ్రహించవయా వరసిద్ధి వినాయకా.. శుభాలను కటాక్షించవయా పార్వతీప్రియసుతా.. విఘ్నాలను తొలగించవయా విఘ్నరాజా.. స్థితిగతులను మార్చవయా గణేశా.. ఐహిక సుఖాల నుంచి విముక్తి ప్రసాదించవయా మహాకాయా.. తెలియక చేసిన పాపాలను హరించవయా మూషిక వాహనా.. మొర ఆలకించి అభయమీయవయా సిద్ధి, బుద్ధి సమేత గణపయ్యా. కాణిపాకం(యాదమరి): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం బ్రహ్మోత్సవశోభను సంతరించుకుంది. చవితి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కళ్లుమిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు.. సుగంధ పరిమళాలను వెదజల్లే సుమమాలికలతో కనువిందు చేస్తోంది. 21 రోజులపాటు ఏకాంతంగా సాగే ఉత్సవాలకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తోంది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేసింది. కొరత లేకుండా గణనాథుని లడ్డూ ప్రసాదాలను తయారు చేసింది. ప్రత్యేక ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వేర్వేరు క్యూలను ఏర్పాటు చేశారు. అందులో రూ.50, రూ.100 దర్శన టికెట్ కొనుగోలు చేసిన వారికి విడిగా ఆలయం వెలుపల నుంచి క్యూ నిర్మించారు. వీఐపీలు, చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం మరోవైపు క్యూ ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. క్యూలో లైట్లు, ఫ్యాన్లు, శానిటైజర్, తాగునీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు అన్నదానం బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయంలో 5వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే కోవిడ్ కారణంగా భక్తులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. సిద్ధంగా ప్రసాదం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు కొరత లేకుండా స్వామివారి ప్రసాదం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు 60 వేల రూ.15 లడ్డూలు, 5వేల రూ.75 లడ్డూలు, 2వేల రూ.150 లడ్డూలను సిద్ధం చేశారు. భక్తుల సెల్ఫోన్లు భద్రపరిచేందుకు, పాదరక్షలు పెట్టుకునేందుకు పలుచోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానంతరం భక్తులకు పులిహోర, చక్కెర పొంగలిని పంపిణీ చేయనున్నారు. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం చవితి రోజున కేవలం సామాన్య భక్తులనే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీలు 11వ తేదీన దర్శనానికి రావాలని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా వాహనసేవలు, అభిషేకాలకు 50 మంది ఉభయదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గణేశ దీక్ష చేపట్టేవారి కోసం వరదరాజస్వామివారి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భారీ బందోబస్తు బ్రహ్మోత్సవాల సందర్భంగా డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు కలి్పంచారు. నలుగురు సీఐలు, 9 మంది ఎస్ఐలు, 130 మంది సిబ్బందిని బందోబస్తుకు నియమించారు. ఆలయ పరిసరాల్లో 32 సీసీ కెమెరాలను అమర్చారు. భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం తిరుపతిలోని వినాయక సాగర్లో నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. పూజా కార్యక్రమంలో ఐదుగురికి మించి పాల్గొనకూడదని చెప్పారు. చవితి మండపాల వద్ద డీజే సౌండ్స్కు అనుమతి లేదని తెలిపారు. -
సుముఖః, ఏక దంతః, కపిలః, గజకర్ణికః.. 8 నామాలు తెలుసా?
మనం ఎలా ఉండాలో, ఏయే గుణాలు మనకి అవసరమో, ఆవశ్యకమో తనని పఠిస్తూండే శ్లోకంలో ఇమిడిపోయి మహాగణపతి మనకి అద్భుతంగా తెలియజేసాడు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ విశేషాలు.... సుముఖ శ్చైకదంత శ్చ కపిలో గజకర్ణికః లంబోదర శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః అష్టా వష్టౌ చ నామాని యః పఠే ఛృణుయా దపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా! సంగ్రామే సర్వకార్యేషు విఘ్న స్తస్య న జాయతే అంటూ వినాయకుని గురించి చెప్పే నామాలు 8. వినాయకునిలో నుండి గ్రహించవలసిన గుణాలని వినాయకుని రూపాన్ని వర్ణిస్తూ కళ్లలో ఆయన రూపాన్ని నిలుపుకునేలా చేసే నామాలు 8. మొత్తం 16 నామాలు పై శ్లోకంలో ఉన్నాయి. ఈ విశేషాన్ని గుర్తించవలసిందని చెప్పేందుకే అష్టౌ (8), అష్టౌ(8) చ (కలిపి) నామాన్ని అని కన్పిస్తుంది శ్లోకంలో. రూపాన్ని వర్ణిస్తూ, ఇలాంటి గుణాలని మనం ఆయననుండి నేర్చుకోవాలనే యదార్థాన్ని తెలుసుకుందాం! 1. సుముఖః: సు–ముఖః అంటే ఎవరు ఏ కోరికని తన ముందుకొచ్చి చెప్పదలిచినా, మనసులో అనుకుంటున్నా ఆ అభిప్రాయాన్ని ఎంతో సుముఖంగా ఉంటూ (వినాలనే ఆసక్తితోనూ, చెప్పేవానికి తప్పక తన పని తీరుతుందనే నమ్మకం కలిగేలానూ) ఆ విషయాన్నంతటినీ వింటాడాయన. లోకంలో కొందరి దగ్గరికి పోయి ఏదైనా చెప్పుకోదలిస్తే ఏదో పరాకుగా వింటూనో మధ్యమధ్యలో ఎవరినుండో వచ్చిన మాటల్ని వింటూనో ఆ మధ్యమధ్యలో ‘ఏం చెప్పా?’ వంటూ అడుగుతూనో వినే మనుషులుంటారు. అలాంటివాళ్ళకి వినాయకుడు చెప్పాడు... వినదలిస్తే సుముఖునిగా ఉండి విను లేదా తర్వాత వింటానని చెప్పు తప్ప వింటున్నట్టుగా వినకుండా ఉండడం సరికాదని. సు–ముఖః అనే పదంలో ముఖమనే మాటకి చక్కని నోరు కలవాడనేది కూడా అర్థం. ఇలా ముఖమనే మాటకి నోరు అనే అర్థం. వినాయకుడు చక్కని నోరు కలవాడనేది దీనర్థం. నోటితో సంభాషిస్తాం కాబట్టి ‘నొప్పించకుండా మాట్లాడేవాడు’ అనేది ఈయనకున్న మరో చక్కని గుణం. ఆ గుణం మనకి రావాలని ఆయన చెప్తున్నాడు. 2. ఏక+ దంతః: గజముఖం కలిగిన ఆయనకి నిజంగా 2 దంతాలుండాలి. వ్యాసుడంతటి వాడు భారతగ్రంథమంతనీ తన బుద్ధిలో నిల్చుకుని ‘నేను చెప్తూంటే రాయగల బుద్ధిమంతుడెవరా?’ అని బ్రహ్మను ప్రార్థిస్తే ఆయన గణపతి పేరు చెప్పాడు. గణపతిని ప్రార్థిస్తే ఆయన తప్పక రాస్తాను. అయితే నా రాతవేగానికి సరిపోయేలా నువ్వు కవిత్వాన్ని చెప్పాలనే నియమాన్ని పెట్డాడు. దాన్ని విని వ్యాసుడు మరో నియమాన్ని పెడుతూ నేను చెప్పే ప్రతి అక్షరాన్ని నువ్వూ అర్థం చేసుకున్నాక మాత్రమే రాయాలి తప్ప ఏదో యధాలాపంగా రాయకూడదన్నాడు. వ్యాసుని నియమాన్ని వింటూనే మహాగ్రంథాన్ని రాయబోతే తప్ప తనంతటి వానితో ఇలాంటి ఒప్పందాన్ని చేయనే చేయదలచడని భావించిన గణపతి ఆ రాయబోయే గ్రంథాన్ని తన చేతులతో వీక్షించడం కోసం తన దంతాన్నే పెరికి (పెకిలించి) గంటంగా చేసి మరీ రాసాడు. దీన్ని గమనిస్తూ మనమూ అర్థం చేసుకోగలగాలి. మన శరీరంలోని ఏ అవయవమైనా అవతలివానికి సహాయపడేలా చేయాలని. మరి మన స్థాయిలో మనం చేదోడు వాదోడు అంటే పనిలో సహాయపడడం... మాట సహాయం చేయడం గా ఉండగలిగితే చాలు. నిందని ఎదుటివాళ్ళమీద నెట్టేలా సముఖంలో మాట్లాడడం, చాటున చాడీలు చెప్పడం వంటివి మానేస్తే చాలు. శరీరావయవాలన్నీ ఎదుటివారికి తోడ్పడేలా చేయగలగాలి. 3. కపిలః: రెండు రంగులు కలిసిన తనాన్ని ‘కపిల’ మంటారు. ఇటు శివలక్షణమూ, అటు విష్ణువిధానమూ కలిగినవాడు కాబట్టి కపిలుడు. దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరైన నేరాన్ని చూస్తే ‘వాడు మనవాడా? మనకి ఉపయోగపడతాడా? ..’ అన్న తీరుగా లెక్కించి తప్పుచేసినా రక్షించదలిచే పని (రావణుడికి కుంభకర్ణునిలా) చేయరాదనీ, శిక్షించే తీరాలని చెప్తుంది ఒక పద్ధతి. అదేతీరుగా ధర్మబద్ధంగా పనిచేస్తూ ఉండేవాణ్ణి మెచ్చుకోవడమే కాక వానికి కొంత వెసులు బాటుని కల్పించాలని కూడా దీని భావంగా అర్థం చేసుకోవాలి. 4. గజకర్ణికః : ఏనుగు చెవులే తనకి చెవులుగా కలవాడనేది పై పదానికి అర్థం. ఏనుగుకున్న లక్షణాల్లో రెండు మరింత ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అంత ఎత్తున్న ఏనుగుకన్నా ఆ చిన్నకళ్లు నేలమీద పడ్డ బట్టలు కుట్టే సూదిని కూడా గుర్తించగలవు. అలాగే ఆ చెవులు కూడా దూరంగా పాము బుసకొడుతుంటే వినగలిగినంతటి శక్తివంతమైనవి. గజకర్ణికః నామం ద్వారా చెవులవరకే దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరు మన ప్రవర్తన గురించి తేడాగా అనుకుంటున్నారో గమనించుకుంటూ ఉండాలి. లోకం నుండి అపవాదు వస్తుందేమో అనే భయంతో మన ప్రవర్తన ఉండాలి. గణపతి చెప్పేదేమంటే, వేటిని వినాలో వేటిని వినకూడదో గమనించుకోవాలి తప్ప చెవికి చేరిన అన్నింటినీ నమ్మడం సరికాదని. అసలు చెవి దగ్గరకి ఎవరినీ చేరనీయవద్దనీ కూడ. 5. లంబోదరః: పెద్దబొజ్జ ఉన్నవాడనేది దీనిపై అర్థం. “లంబ’ మనే మాటకి వేలాడుతున్న అనేది సరైన అర్థం. బొజ్జ మరింతగా అయినప్పుడు కిందికి వేలాడుతూ ఉంటుంది. ‘నా కడుపులో ఎన్నో రహస్యాలని దాచున్నా’నంటుంది తల్లి. అలా రహస్యాలెందరు తనకొచ్చి చెప్పినా వాటిని తన పైత్యాన్ని కూడా జోడించి ప్రచారం చేయడం కాకుండా “కడుపులో దాచుకోగలగడమనే గొప్ప లక్షణాన్ని అలవర్చుకోవాలనేది గణపతి మనకి చెప్తున్నాడన్నమాట. 6. వికటః: కటకమంటే చెక్కిలి. ఏనుగురూపం అయిన కారణంగా ఏటవాలుగా అయి దృఢంగా అయిన చెక్కిలి కలవాడనేది దీనర్థం. దీన్ని మనకి అన్వయించుకుంటే చెక్కిలి అనేది వ్యక్తి చెప్పదలిచిన అభిప్రాయాన్ని చెప్పించగల ముఖ్య అవయవం ముఖంలో. ఏ పదం తర్వాత ఏ పదాన్ని పలకాలో, ఎంతగా ఊది ఏ పదాన్ని పలకాలో దేన్ని తేల్చి పలకాలో, ఏ మాటని ముందు చెప్పి తర్వాత దేన్ని పలకాలో వివరించేది ఈ నామం. మనం కూడా స్పష్టంగా నిదానించి మాట్లాడాలనే గుణాన్ని గ్రహించాలన్నమాట. 7. విఘ్నరాజః : ప్రారంభించిన పని– ఇక ఎప్పటికీ ముడిపడనే పడదన్న రీతిలో వచ్చిన అభ్యంతరాన్ని విఘ్నమంది శాస్త్రం. అలాంటి విఘ్నాలకి రాజు ఆయన అని అర్థం. రాజుకి చతురంగ బలాలు (పదాది– అశ్వ– గజ– రథ) ఉన్నట్లే విఘ్నాలని తొలగించేందుకై నాలుగు విధాలుగా ప్రయత్నించడం, నలుగురి సహాయాన్ని అర్థించడం, నాలుగు చోట్లకి వెళ్లి విచారించి ఆ విఘ్నాన్ని తొలగించుకోవాలి తప్ప విఘ్నం వచ్చిందనుకుంటూ దుఃఖిస్తూ్త ఉండిపోవడం సరికాదని గణపతి చెప్తున్నాడన్నమాట. 8. గణాధిపః: యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, విహంగ, నాగ రాక్షస, దేవ .... మొదలైన అన్ని గణాలకీ అధిపతి అనేది దీనర్థం. లోకంలో ఏ ఒక్కరూ శత్రువంటూ లేనివాళ్లుండరు. కాబట్టి ఏకగ్రీవంగా (ముక్తకంఠంతో) ఎన్నుకోవడమనేది అసాధ్యమైన అంశం. అయితే వినాయకుడు మాత్రం సర్వగణాధిపతి కాగలిగాడంటే దీనిద్వారా అందరూ మెచ్చుకునే తీరులో తన ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ నడుచుకోవాలనే గుణాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట. మరో విశేషమేమంటే పై కన్పిస్తున్న అన్ని గణాలవీ ఒకే తీరు లక్షణం కలవి కావు. ఎవరి తీరు వారిది. అయితే అలాంటి భిన్న భిన్న లక్షణాలున్న అందరినీ ఒకే తీరుగా అంగీకరించేలా చేసి ఆధిపత్యాన్ని సాధించగలిగాడంటే ఆ తీరుగా అధికారి ఉండాల్సిందేనని చెప్తున్నాడన్నమాట గణపతి. – డా. మైలవరపు శ్రీనివాసరావు చదవండి: శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ -
బహిరంగ ప్రదేశాల్లో.. వినాయక విగ్రహాలను అనుమతించలేం
సాక్షి, అమరావతి: బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటుచేయరాదని, ప్రైవేటు స్థలాల్లోనే ఏర్పాటుచేసుకుని గణేష్ ఉత్సవాలు జరుపుకోవచ్చునంటూ ప్రభుత్వ యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సైతం సమర్థించింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రజలందరికీ అనుమతినివ్వాలంటూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కోవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే బహిరంగ ప్రదేశాల్లో చవితి ఉత్సవాల నిర్వహణకు అధికారులు అనుమతివ్వలేదని, ఇందులో తప్పులేదని హైకోర్టు స్పష్టంచేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించరాదంటూ కృష్ణాజిల్లా కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్ సరైనవేనని తెలిపింది. వీటిని రద్దుచేయాలని కోరుతూ వీహెచ్పీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వీహెచ్పీ కృష్ణాజిల్లా కార్యదర్శి సిద్ధినేని శ్రీసత్య సాయిబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అసలు పిల్ ఎలా దాఖలు చేస్తారు? పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మత విశ్వాసాలకు అనుగుణంగా వేడుకలు జరుపుకునే హక్కు పౌరులందరికీ ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుచేయరాదని సింగిల్ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారు కదా? అని ప్రశ్నించింది. అసలు ఎలా పిల్ దాఖలు చేస్తారని, మీ హక్కులు ఉల్లంఘన జరిగిందని భావిస్తే రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందులో పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనాల్లేవని, ప్రజలందరి తరఫున ఈ వ్యాజ్యం దాఖలు చేశామని న్యాయవాది తెలిపారు. పెళ్లిళ్లకు 150 మందిని అనుమతినిస్తున్నప్పుడు ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో అనుమతినివ్వకపోవడం సరికాదన్నారు. వినాయక ఉత్సవాలపై ఆధారపడిన చిన్న వ్యాపారులకూ నష్టం చేకూరుతుందన్నారు. దీంతో.. వారెవ్వరూ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని, అందువల్ల ఆ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. జీవించే హక్కే ముఖ్యమని ‘సుప్రీం’ చెప్పింది... తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వినాయక ఉత్సవాలు జరుపుకోకుండా ఎవరినీ అడ్డుకోవడంలేదని, కేవలం బహిరంగ ప్రదేశాల్లో మండపాలు, విగ్రహాలు ఏర్పాటుచేయడంపైనే ఆంక్షలు విధించామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుచేస్తే అక్కడికి ప్రజలు రాకుండా అడ్డుకోవడం అసాధ్యంగా మారుతుందన్నారు. ప్రజల జీవించే హక్కే అత్యంత ముఖ్యమైనదన్న సుప్రీంకోర్టు తీర్పును సుమన్ వివరించారు. కరోనా థర్డ్వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారని, దీనిని పరిగణనలోకి తీసుకుని బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుపై ఆంక్షలు విధించామన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే సింగిల్ జడ్జి ప్రైవేటు స్థలాల్లోనే విగ్రహాలు ఏర్పాటుచేసుకోవాలని ఉత్తర్వులిచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏ రకంగానూ జోక్యం అవసరంలేదు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కలెక్టర్ ప్రొసీడింగ్స్పై ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని చెప్పింది. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వాలకు పరమావధి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే ఆంక్షలు విధించిందని తెలిపింది. ప్రభుత్వం చెబుతున్నట్లు బహిరంగ ప్రదేశాల్లో జన సమూహాలను నిలువరించడం అసాధ్యమేనని స్పష్టంచేసింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారన్న ధర్మాసనం.. వీహెచ్పీ దాఖలుచేసిన ఈ వ్యాజ్యా న్ని కొట్టేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
మంచి పనులకు విఘ్నాలు తొలగాలి
సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, అందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని అభిలషించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని, మీరు తలపెట్టే ఏ కార్యమైనా విఘ్నాలు లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు.#HappyGaneshChaturthi — YS Jagan Mohan Reddy (@ysjagan) September 10, 2021 (చదవండి: మహా గణపతిం మనసా స్మరామి...) -
వినాయకుడి గెటప్లోని ఈ నటుడెవరో మీకు తెలుసా?
Sri Vinayaka Vijayam Movie: కొన్ని సినిమాలు ఎప్పటికీ వన్నెతరగవు. అందుకే బుల్లితెరపై ఎన్నిసార్లు ప్రజెంట్ చేసినా వ్యూయర్స్ ఆదరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పండుగల లాంటి టైంలో వీటి ప్రత్యేకత ఏంటో జనాలకు తెలిసి వస్తుంది కూడా. అలాంటి సినిమాల్లో ‘శ్రీ వినాయక విజయం’ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రతీ వినాయక చవితికి క్రమం తప్పకుండా ఈ సినిమా టీవీలో వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది మళ్లీ టెలికాస్ట్ ప్రొమో రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పూర్తి స్థాయిలో గణేషుడి కథను చూపిస్తూ తెలుగులో వచ్చిన మొదటి సినిమా ‘శ్రీ వినాయక విజయం’(1979). ఈ మూవీలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వినాయకుని జన్మ వృత్తాంతం చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. ‘ఎవరవయ్యా.. ఎవరవయ్యా’ అంటూ సాగే గానం.. దేవులపల్లి రచన, సాలూరి స్వరాలు, సుశీలమ్మ పాడిన పాట ఇప్పటికీ పండపూట టీవీల్లో మారుమోగుతుంటుంది. అయితే ఆ వినాయకుడి గెటప్లో ఉన్న ఆర్టిస్ట్ ఎవరంటూ? గూగుల్ను ఆశ్రయించడంతో సినిమా ట్రెండింగ్లోకి వచ్చింది. శ్రీ వినాయక విజయం చిత్రం భారీ సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో బాల గణేషుడిగా కనిపించింది బేబీ లక్ష్మి సుధా. ఆ తర్వాత ఏనుగు తల గెటప్తోనూ కాసేపు ఈ చిన్నారి అలరించింది. ఇక పెద్దయ్యాక వినాయకుడి గెటప్లో నటించింది ఎంజీవీ మదన్గోపాల్ అనే ఆర్టిస్ట్. ఈయన గురించి పూర్తి సమాచారం, ఫొటో గురించి .. వెతకాలని ప్రయత్నిస్తున్నారు చాలామంది. కానీ, ఎలాంటి సమాచారం దొరకడం లేదు. అలా చాలా మంది వెతకడం వల్ల వినాయక విజయం మూవీ గూగుల్ ద్వారా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఇప్పుడు. చదవండి: ‘తండ్రి ఎవరు?’.. ఫైర్ అయిన హీరోయిన్ -
బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్టకు ఏపీ హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్టకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని.. కానీ ఐదుగురికి మించి వేడుకల్లో పాల్గొనకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను హైకోర్టు సమర్థించింది. (చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి) పబ్లిక్ ప్రాంతాల్లో విగ్రహాలు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన హక్కును నిరాకరించలేమని.. అదే సమయంలో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కునూ కాదనలేమని వ్యాఖ్యానించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్టకు అనుమతి నిరాకరిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. -
జైలులో భర్త.. పండగ వేడుకల్లో శిల్పాశెట్టి
Shilpa Shetty Brought Home an Idol of Lord Ganesha: ప్రస్తుతం శిల్పా శెట్టి, ఆమె కుటుంబం గడ్డు పరిస్థితులను చూస్తోంది. శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఇటీవల పోర్నోగ్రఫీ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో శిల్పా ఇమేజ్ డ్యామేజవడంతో ఆమె మీడియా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు. అంతేగాక 15 రోజుల పాటు ఇంట్లోనే ఉంది. షూటింగ్లకు కూడా హాజరు కాని శిల్పా ఇటీవల బయటకు వచ్చి తిరిగి సెట్స్లో సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా వినాయకచవితి పండగ సందర్భంగా ఆమె వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చదవండి: Shilpa Shetty: 'శిల్పా శెట్టి దంపతులు నా డబ్బుతో పోర్న్ వీడియోలు తీశారు' ప్రతి ఏడాదిలాగే శిల్పా ఈసారి కూడా వినాయకుడి ప్రతిష్టిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతిసారి శిల్పా తన కుమారుడు వియాన్, భర్త రాజ్కుంద్రా కలిసి విగ్రహాన్ని కొనుగోలు చేసి ఆటా పాటలతో అడంబరంగా ఇంటికి తీసుకుని వెళ్లేది. కానీ ఈ సారి ఆమె తన పనివారితో వచ్చి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసింది. అంతేగాక గణపతి బప్ప మోరియా అంటూ అందరితో కలిసి ఆడంబరంగా విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్లింది. చాలా రోజుల తర్వాత శిల్పా ఇలా బయటకు రావడంతో మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. ఆమె చుట్టూ చేరి ఫొటోలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. చదవండి: షాకింగ్.. నటిని బంధించి రూ.6 లక్షలు దోచుకెళ్లారు! అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ‘భర్త జైలు ఉన్నప్పటికీ కుటుంబ సంప్రదాయాన్ని మాత్రం శిల్పా మరవడం లేదు’ అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. ‘భర్త జైలు పాలైనా శిల్పా మాత్రం సంతోషంగా పండగ చేసుకుంటోంది’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల శిల్పా శెట్టి, ఆమె భర్త మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోయెల్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన దగ్గర రూ.41 లక్షలు తీసుకొని మోసం చేశారని, ఈ డబ్బును అడల్ట్ మూవీస్ తీసేందుకు ఉపయోగించారని ఆరోపించాడు. స్వలాభం కోసం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చాలామంది దగ్గర డబ్బు తీసుకుని, వాటి ద్వారా పోర్న్ వీడియోలు తీశారని తీవ్ర ఆరోపణలు చేశాడు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమైన బాలాపూర్ గణేషుడు
-
వినాయక చవితి వేడుకలపై ఢిల్లీ ఆంక్షలు
న్యూఢిల్లీ: వినాయక చవితి వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వినాయక చవితి ఉత్సవాలపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గణేశ్ చతుర్థికి(సెప్టెంబర్ 10) మరో రెండు రోజులు మాత్రమే సమయమున్న నేపథ్యంలో డిల్లీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. బహిరంగ మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయకుండా జిల్లా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే సామూహిక ప్రదేశాలలో జనాలు భారీగా గుమిగూడకుండా చూడాలని పేర్కొంది. గణేశుడి ఊరేగింపులకు కూడా అనుమతి లేదని ఉత్తర్వులో పేర్కొంది. ప్రజలు ఇంట్లో పండుగను జరుపుకోవాలని డీడీఎంఏ సూచించింది. చదవండి: కోతుల గుంపు దాడి.. భయాందోళనతో బీజేపీ నాయకుడి భార్య మృతి బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు పేలుడు -
‘సీఎం జగన్ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారు’
సాక్షి, విజయవాడ: వినాయక చవితి పండగపై టీడీపీ, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయి అని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో ఇక్కడ కూడా అవే అమలు చేస్తున్నాం అని కొడాలి నాని తెలిపారు. ఏపీలో అడ్రస్ లేని బీజేపీ రాజకీయం చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోంది అంటూ కొడాలి నాని మండి పడ్డారు. (చదవండి: పని కట్టుకుని ఇన్ని అబద్ధాలా?) సోము వీర్రాజుకి విగ్రహాలతోనూ వినాయక చవితితోను రాజకీయం చేయడం అలవాటే అన్నారు కొడాలి నాని. తుప్పు చంద్రబాబు.. పప్పు లోకేశులు వినాయక చవితిపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్ళిద్దరికీ శవం ఎక్కడ దొరుకుతుందో అని ఎదురుచూస్తున్నారు.. కరోనాతో ప్రజలకి ఇబ్బంది వస్తే రాజకీయం చేయడం కోసం ఇప్పుడు ఈ డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారు అని కొడాలి నాని స్పష్టం చేశారు. చదవండి: ఉన్నది ఉన్నట్లుగా రాయండి -
ఈ వారంలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవు
మీకు బ్యాంకులో ఏమైనా అత్యవసర పనులు ఉంటే? వెంటనే సెప్టెంబర్ 7 లోపు చేసుకోండి. ఎందుకంటే, సెప్టెంబర్ 8 బుధవారం నుంచి వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. అయితే, ఈ బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా మారతాయి. పైన పేర్కొన్న పండుగలు అన్నీ జరుపుకునే రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పై పండుగలు అన్నీ ముఖ్యమైనవి కావు. కాబట్టి, ఆ రాష్ట్రాల్లో ఏ పండుగ అయితే జరుపుకోరో ఆ రోజు ఆ రాష్ట్రంలో బ్యాంకులు పనిచేస్తాయి. ఈ వారంలో వరుసగా రానున్న సెలవులు ఈ క్రింద విధంగా ఉన్నాయి.(చదవండి: ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయిన రాకెట్....!) సెప్టెంబర్ 8 తిథి ఆఫ్ శ్రీమంత శంకర్దేవ(గువాహటి) సెప్టెంబర్ 9 తీజ్(హరిటలికా) (గ్యాంగ్టక్) సెప్టెంబర్ 10 వినాయక చవితి సెప్టెంబర్ 11 గణేశ్ చతుర్థి (రెండో శనివారం) సెప్టెంబర్ 12 ఆదివారం పై లిస్ట్లో కేవలం వినాయక చవితి పండుగ నాడు మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంక్ లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మిగతా తేదీలలో రాష్ట్రాల వారీగా సెలవులు ఉంటాయి. అయితే, ఈ సెలవు సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలకు ఎటువంటి అంతరాయం ఉండదు. -
ఏపీ బీజేపీపై వామపక్ష పార్టీల ఆగ్రహం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సామరస్య, శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నాయకులు వినాయక చవితిని ఒక వివాదంగా మారుస్తున్నారని వామపక్ష పార్టీలు ఏపీ బీజేపీపై మండిపడ్డాయి. కాషాయ పార్టీ కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో సోమవారం వామపక్ష పార్టీలు ఓ లేఖను విడుదల చేశాయి. ‘‘ప్రస్తుతం కోవిడ్ మూడవ దశ ప్రమాదం పొంచి ఉంది. ఈ తరుణంలో ప్రజలంతా కోవిడ్ నియమ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ వినాయక చవితి జరుపుకోవాలి’’ అని లేఖలో కోరాయి. (చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి) ‘‘రాష్ట్రంలో కోవిడ్ విజృంభించినప్పుడూ కేంద్ర బీజేపీ రాష్ట్రానికి ఏ సహాయమూ చేయలేదు. రాష్ట్రం కోరిన మేరకు వ్యాక్సిన్లనూ ఇవ్వకుండా వివక్షను చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం పండగ సీజన్లో తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సైతం విస్మరించి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రజల విశ్వాసాలతో రాజకీయ కుతంత్రం నడుపుతోంది’’ అంటూ వామపక్ష పార్టీలు మండిపడ్డాయి. -
వినాయక చవితి చేసుకోవద్దని మేం చెప్పలేదు: వెల్లంపల్లి
-
మతాల మధ్య సోము వీర్రాజు చిచ్చు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోము వీర్రాజు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఆదేశాలతో వినాయక చవితి వేడుకలపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలకతీతంగా పాలన చేస్తున్నారన్నారని మంత్రి అన్నారు. బీజేపీ నేతలకు హిందూమతంపై గౌరవం ఉంటే గతంలోనే ప్రశ్నించేవారని, ఆలయాలను కూల్చిన టీడీపీని బీజేపీ ఏనాడూ ప్రశ్నించలేదని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు. ‘‘వినాయక చవితి చేసుకోవద్దని మేం చెప్పలేదు. దీనిపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మతం ముసుగులో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై మతం పేరుతో బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకే గణేశ్ ఉత్సవాలపై నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వమే కోవిడ్ గైడ్లైన్స్ ఇచ్చింది. గైడ్లైన్స్ మార్చమని కేంద్రాన్ని అడగండి. కుల,మతాల రాజకీయాలు చేసే ప్రభుత్వం మాది కాదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోమని చెప్పాం. దయ చేసి ప్రజలను రెచ్చగొట్టొదు. వినాయక చవితి అందరి పండుగ పెద్ద విగ్రహాలు, ఊరేగింపులు పెట్టకూడదని మాత్రమే సూచించాం. మత విద్వేషాలతో లబ్ధి పొందాలని చూడొద్దని’’ మంత్రి హితవు పలికారు. ఇవీ చదవండి: కేంద్రం సూచనలతోనే ఏపీలో ఆంక్షలు: నరసింగరావు నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు! -
మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితికి నాలుగు రోజుల ముందే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ చరిత్రలోనే ఇది మొదటిసారి. శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి పనులు పూర్తికావడంతో నిర్వాహకులు ఆదివారం కర్రలను పూర్తిగా తొలగించారు. ఏటా వినాయక చవితికి ఒక రోజు ముందు కర్రలు తొలగిస్తారు. కానీ.. ఈసారి నాలుగు రోజుల ముందే వీటిని పూర్తిగా తొలగించారు. చదవండి: ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ముస్తాబవుతున్న ఖైరతాబాద్ -
బహిరంగ ప్రదేశాల్లో చవితి వేడుకలకు అనుమతిలేదు..
సాక్షి,గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను ఈ ఏడాది కూడా నిరాడంబరంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ జె.నివాస్ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై విజయవాడ, నూజివీడు, మచిలీ పట్నం, గుడివాడ రెవెన్యూ డివిజన్ల సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల పదో తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని ఇంటిలో మాత్రమే పూజలకు పరిమితం కావాలని భక్తులను కోరారు. చవితి వేడుకల్లో భాగంగా బహిరంగ ప్రదేశాలు, కూడళ్లలో గణనాథుని విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని, నిమజ్జన కార్యక్రమాలు జరపొద్దని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. వినాయక చవితి నిర్వహణ కమిటీలు పూర్తిస్థాయిలో జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు రెవెన్యూ డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిలో వినాయక చవితి నిర్వహణ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులను ఆహ్వానించి, వారితో సమావేశాలు నిర్వహించి, వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ నివాస్ ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రజలు గుమిగూడకుండా ఉండడమే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తిచేశారు. చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. -
మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్
సాక్షి, బంజారాహిల్స్: ఈ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెల 10వ తేదీనుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి తలసాని అధ్యక్షతన గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, ప్రభుత్వ విప్ ప్రభాకర్రావు, డీజీపీ మహేందర్రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్రవీంద్ర, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు రాఘవరెడ్డి, భగవంతరావు, ఖైరతాబాద్ బాలాపూర్ సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ. .సెప్టెంబర్10న విగ్రహ ప్రతిష్టతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 19న శోభాయాత్రతో నిమజ్జన కార్యక్రమం ముగుస్తుందన్నారు. చదవండి: ‘డబుల్’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్ మాదిరే ఇక్కడ కూడా ఎలాంటి ఆంక్షలు లేవు... ►విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆంక్షలు లేవని, నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లోని అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రతినిధులకు స్పష్టత నిచ్చారు. ►ఈ విషయంలో పోలీసులనుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ►పోలీస్ అధికారులు కూడా ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనిచేసేలా ఆదేశాలివ్వాలని డీజీపీకి మంత్రి సూచించారు. ►ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు ధ్వంసం అయ్యాయని ఉత్సవకమిటీ నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాన్ని సోమవారం సందర్శించి మరమ్మతు పనులు చేపట్టాలని అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్కు సూచించారు. ►ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనానికి గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోలీసులు సహకరించాలని, క్రేన్ను ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ విజ్ఞప్తి చేశారు. ►అత్యధిక విగ్రహాలను నిమజ్జనం చేసే హుస్సేన్ సాగర్, సరూర్నగర్, సఫిల్గూడ, మీరాలం చెరువుల్లో పూడిక తొలగింపు పనులను చేపట్టాలని నిర్వాహకులు కోరగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ను ఆదేశించారు. ►దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. పీసీబీ ఆధ్వర్యంంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మల్లేశం, వాణీదేవి, దయానంద్ గుప్తా, కాటేపల్లి జనార్దన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటే‹Ù, హోంశాఖ ప్రత్యేక ప్ర«ధాన కార్యదర్శి రవిగుప్తా, మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్కుమార్, ఆర్అండ్బీ కార్యదర్శి సునీల్«శర్మ, ఈఎన్సీ గణపతి రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ పాల్గొన్నారు. -
వినాయక చవితికి థియేటర్లో సందడి చేసే భారీ చిత్రాలివే!
కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ఎంతగా పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది మార్చిలో విధించిన లాక్డౌన్ కారణంగా 9 నెలల పాటు సినీ పరిశ్రమతో పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఆ తర్వాత పాక్షికంగా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రజలు బిగ్స్క్రిన్పై సినిమా చూసేందుకు భయపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి పండగలసందర్భంగా విడుదలయ్యే సినిమాల సందడి లేకుండా పోయింది. దీంతో ఓటీటీలోనే సినిమాలు చూడ్సాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే థియేటర్లు మెల్లిగా తెరుచుకుంటున్నాయి. వరసగా సినిమాలు థియేటర్లో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత మళ్లీ పండగ కళ తెచ్చేందుకు పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. నాని టక్ జగదీష్, నాగ చైతన్య లవ్ స్టోరీ, రానా విరాట పర్వం, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, నాగశౌర్య వరుడు కావలెను, గోపిచంద్ సీటీమార్ వంటి సినిమాలు వినాయక చవితి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్లో ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రం ఉన్న నేపథ్యంలో ఆ లోపే ఈ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కాగా ఇటీవల టక్ జగదీశ్, సీటీమార్, లవ్స్టోరీతో పాటు మరిన్ని చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు అయోమంలో పడ్డారు. ఈ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలన్ని కూడా థియేటర్లోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే జూలై 30న విడుదలైన తిమ్మరసు చిత్రం మంచి విజయం సాధించగా, రీసెంట్గా విడుదలైన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా నిబంధనల మేరకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కాగా, వినాయక చవితికి వంద శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడనున్నాయి. ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. -
సింగపూర్లో వినాయక చవితి సంబరాలు
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక శివన్ టెంపుల్లో వినాయక చవితి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ -19 నిబంధనలకి అనుగుణంగా అన్ని నియమాలను పాటిస్తూ ఆన్లైన్లో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో సుమారు 100 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాన్ని, పూజా ద్రవ్యాలను అందించామన్నారు. అలాగే కోవిడ్ -19 కారణంగా పరోక్షంగా పాల్గొనే అవకాశం కల్పించామని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు రవి సోమా మాట్లాడుతూ అందరికి ఆ వినాయకుని ఆశీస్సులు అందాలనే ఉద్దేశ్యంతో పూజా కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రసారం చేశామన్నారు. అందరి మంచికోసం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కార్యవర్గసభ్యులకు, దాతలకు, పూజాకార్యక్రమంలో పాల్గొన్నవారికి, పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. -
వినాయక చవితి: కానరాని సందడి
సాక్షి, హన్మకొండ : జిల్లావ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు శనివారం ఆరంభమయ్యాయి. కరోనా నిబంధనల కారణంగా గతంతో పోలిస్తే ఈసారి సందడి కనిపించడలేదు. చాలాచోట్ల మండపాలు ఏర్పాటుచేయకపోగా, ఎక్కువ మంది ఇళ్లలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. కాగా, హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో మహాగణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన పూజలు చేయగా, వేదికపై విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ – రేవతి దంపతులు ప్రారంభించారు. ఆ తర్వాత మూషిక వాహనసేవలో చీఫ్ విప్తో పాటు గ్రేటర్ డిప్యూటీ మేయర్ సిరాజుదీ్దన్, ఈఓ పనతుల వేణుగోపాల్, అర్చకులు మణికంశర్మ, ప్రణవ్, నాయకులు పులి రజనీకాంత్, గండ్రాతి రాజు పాల్గొన్నారు. ఇక మేయర్ గుండా ప్రకాశ్రావు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. కాగా, తొలిరోజు గణపతిని హరిద్రాగణపతిగా అలంకరించగా, రెండో రోజైన ఆదివారం ద్విముఖ గణపతిగా అలంకరించి పూజలు చేయడంతో పాటు ఐరావత వాహనసేవ, పల్లకీసేవ నిర్వహించారు. భద్రకాళి ఆలయంలో... హన్మకొండ కల్చరల్ : వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీగణపతి నవరాత్రయాగం ప్రారంభమయింది. గణపతినవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం ఆయప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన వల్లభగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి ఉపాసకులు అర్చకులు అరవింద్శర్మ, వేముగంటి కాళీప్రసాదశర్మ నేతృత్వంలో శ్రీ గణపతి నవరాత్రి యాగాన్ని నిర్వహించారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ – రేవతి దంపతులు పూజల్లో పాల్గొనడంతో పాటు గణపతి ఉత్సవాల నిర్వహణకు రూ.10వేల విరాళం అందజేశారు. మల్లన్న ఆలయంలో... ఐనవోలు : ఐనవోలులోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. అర్చకులు పాతర్లపాటి రవీందర్, పురోహిత్ ఐనవోలు మధుకర్ శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్వేతార్కుడిపై సూర్య కిరణాలు కాజీపేట: కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూలగణపతి స్వామి వారిపై ఆదివారం సూర్య కిరణాలు ప్రసరించాయి. ఈ మేరకు ప్రత్యేక పూజల్లో ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంతమల్లయ్యశర్మ, గణపతి ఉపాసకులు త్రిగుళ్ల శ్రీనివాస్శర్మ, కార్పొరేటర్ జక్కుల రమ, రవీందర్యాదవ్, మహతి – రాధాకృష్ణ, కళ్యాణి – సాయికృష్ణ, చొక్కరపు శ్రీనివాస్, దేవులపల్లి సదానందం, శనిగరపు రాజ్మోహన్, రవి, మణిదీప్, సుధీర్ పాల్గొన్నారు. ఖిలా వరంగల్: వరంగల్ పెరకవాడలోని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్యాంప్ కార్యాలయంలో విత్తన గణనాథుడిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ పూజలో ఎమ్మెల్యే సతీమణి వాణి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరీమాబాద్ : వినాయక చవితి సందర్భంగా హన్మకొండలోని ‘కుడా’ కార్యాలయంలో చైర్మన్ మర్రి యాదవరెడ్డి పూజలు నిర్వహించారు. హన్మకొండ: హన్మకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చైర్మన్ మార్నేని రవీందర్రావు, వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రె రెడ్డి, డైరెక్టర్ అన్నమనేని జగన్మోహన్రావు, సీఈఓ ఉషశ్రీ పూజలు చేశారు. ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేగేట్ ప్రాంతంలో భక్త సమాజ్ అధ్యక్షుడు నిషాంత్ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, కార్పొరేటర్ ఝెంబాడి రవీందర్, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాశ్, సదానందం, మహ్మద్ అయూబ్ దర్శించుకున్నారు. వరంగల్: వరంగల్లో 28వ డివిజన్ కార్పొరేటర్ ఝెలగం లీలావతి పసుపుతో వినాయక ప్రతిమ తయారుచేసి పూజలు చేశారు. కాజీపేట అర్బన్ : హన్మకొండలోని సిద్ధేశ్వరాలయంలో అర్చకులు సిద్ధేశుని రవికుమార్, సురేష్కుమార్ ఆధ్వర్యాన లక్ష్మీగణపతిని సిద్దిబుద్ధి సమేత వరసిద్ది వినాయకుడిగా అలంకరించి పూజలు చేశారు. వరంగల్ లీగల్ : కరోనా నిబంధనల కారణంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. కాజీపేట: కాజీపేట ప్రశాంత్నగర్లోని సహృదయ వృద్ధాశ్రమంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ముస్లింలైన నిర్వాహకులు ఎం.డీ.యాకూబీ – చోటు సమాజ కట్టుబాట్లను పక్కన బెట్టి వృద్ధులతో కలిసి పూజలు చేశారు. -
నిరాడంబరంగా చవితి వేడుకలు
సాక్షి, ఖమ్మం : కోవిడ్ నేపథ్యంలో ప్రజలు శని వారం సాదాసీదాగానే చవితి వేడుకలు నిర్వహించారు. భక్తులు మాత్రం తమ శక్తిమేరా చిన్నచిన్న మట్టి, విత్తన విగ్రహాలను ఇంట్లో ఏర్పాటు చేసుకొని స్వామివారికి పూజలు చేశారు. అధికారుల ఆదేశాలతో 3 అడుగుల లోపు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. బస్టాండ్ సెంటర్, బొమ్మనబజార్, శ్రీనివాసథియేటర్, వినోద థియేటర్, బ్రాహ్మణబజార్ శివాలయం సెంటర్, మామిళ్లగూడెం, బస్డిపోరోడ్డు, గాంధీచౌక్ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను ఏర్పాటు చేయకపోవడంతో సందడి కనిపించడంలేదు. ఏకో ఫ్రెండ్లీ గణేష్ ప్రాచుర్యం కావడంతో భక్తులంతా మట్టి, విత్తన విగ్రహాలను పూజించేందుకు ఆసక్తి చూపించారు. ప్రధాన ఆలయాల్లో మాత్రం బొజ్జ గణపయ్యకు నిరాడంబరంగా పూజలు చేశారు. మట్టి గణపతులను పూజిద్దాం ఖమ్మంమయూరిసెంటర్: పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరం మట్టి గణపతులనే పూజిద్దామని కార్పొరేటర్, కాంగ్రెస్ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు ఎర్రం బాలగంగాధర్ తిలక్ పిలుపునిచ్చారు. గాంధీచౌక్ ట్రంక్రోడ్లోని సాయి విశ్వనాథ అపార్ట్మెంట్లో మటి విగ్రహానికి శనివారం పూజలు నిర్వహించారు. కృష్ణారావు, వెంకటరమణ, నాగరాజు, రమేష్ పాల్గొన్నారు. ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెంలో.. ఖమ్మంఅర్బన్: నగరంలోని పలు కాలనీలు, రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలకు శనివారం పూజలు చేశారు. మధురానగర్లోని సాయి మందిరంలో జిల్లా కేంద్రసహకార బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం దంపతులు వినాయకుడికి పూజలు నిర్వహించారు. ఇందిరానగర్లోని బాలగణపతి దేవాలయంలో కమిటీ అధ్యక్షుడు బా జిన్ని వీరయ్య, తిరుపతిరావు దంపతులు పూజలు చేశారు. దిశ కమిటీ సభ్యుడు మెంటం రామారావు ఆధ్వర్యంలో చింతగుర్తిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాణిపాక వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో.. ఖమ్మంమయూరిసెంటర్: త్రీటౌన్ ప్రాంతంలో కాణిపాక వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించి శనివారం పూజలు చేశారు. మహంకాళి మల్లికార్జున్, జి.వెంకట్రెడ్డి, భానోత్ రాందాస్, భాస్కర్, కేసగాని రవి తదితరులు పాల్గొన్నారు. కాణిపాక వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజలు -
ఖైరతాబాద్ వినాయకుడు వద్ద సందడి
-
కరోనా నుంచి విముక్తి కల్గించు విఘ్నేశ్వరా..
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరి జీవితాల్లో ప్రవేశించిన ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుంచి ఆ విఘ్నేశ్వరుడు త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు. (బ్రహ్మీ మట్టి గణపతి.. ఫ్యాన్స్ ఖుషీ) అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులు వినాయక చవితి విషెస్ తెలిపారు. ‘మీ అందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు. కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచమంతా ఇబ్బంది పడుతోంది. అందుకు అనుగుణంగా అందరూ ఎకో ఫ్రెండ్లీ గణేశుని విగ్రహాలను పూజించండి. సామాజిక సమావేశాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించాలి’ అని ట్వీట్ చేశారు. (చిరు బర్త్డే.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్) వినాయక చవితితో పాటు ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన పుట్టిన రోజున విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అందరి జీవితాల్లోంచి అడ్డంకులను తొలగించి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని అక్కినేని సమంత పేర్కొన్నారు. ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కాగా సకల విఘ్నాలు తొలిగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్తో పాటు పలువురు సెలబ్రిటీలు ట్వీట్ చేశారు. అయితే ప్రతి ఒక్కరూ కరోనా పరిస్థితులు చక్కబడేంత వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించి.. సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ క్రమంలో హీరో నితిన్ ఇంట్లో వినాయక పూజ నిర్వహించుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఏడాది నితిన్.. శాలినిని వివాహం చేసుకొని ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. పెళ్లి అయ్యాక మొదటి పండగ అవ్వడంతో ఇంట్లో సతీసమేతంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. -
బ్రహ్మీ మట్టి గణపతి.. ఫ్యాన్స్ ఖుషీ
హాస్య బ్రహ్మగా టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు కమెడియన్ బ్రహ్మానందం. ఆయన లేనిదే సినిమాలో కామెడీ లేదు అనేంత పేరును సంపాదించారు. బ్రహ్మానందం అంటే ఒక ట్రెండ్ సెట్ అనే చెప్పవచ్చు. రెండు దశాబ్దాలకుపైగా వెండితెరపై తనదైన శైలిలో కామెడీని పండించి సినిమాలకు ఒక స్పెషల్ క్రేజ్ను అందించారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి ఓ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఈ మధ్య సినిమాల్లో నటించడం బ్రహ్మనందం తగ్గించేశారు. దీంతో ఇటీవల కాలంలో ఆయన గురించి మాట్లాడుకోవడం తగ్గిపోయింది. (ఆంజనేయుని ఆనందబాష్పాలు) ఈ క్రమంలో తాజాగా ఆయన వార్తల్లో నిలిచారు. శనివారం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని బ్రహ్మనందం తయారు చేశారు. తమ స్వగృహంలో తన చేతితో మట్టి వినాయకుడిని తయారు చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే పర్యావరణానికి హానీ కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజించాలని సందేశం ఇస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే వీటిని ముందుగా ఎవరూ పోస్టు చేయారో తెలియదు కానీ.. బ్రహ్మీ అభిమానులు తమ ట్విటర్లో షేర్ చేసేస్తున్నారు.. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘బాలీవుడ్ కంటే సౌత్ యాక్టర్స్ బెటర్.. సాంప్రదాయలకు, పండగలకు విలువిచ్చే వ్యక్తి అని కొనియాడుతున్నారు. రియల్ యాక్టర్ బ్రహ్మనందం. బ్రహ్మ ద క్రియేటర్’ అంటూ పొగిడేస్తున్నారు. (ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ) -
‘హైదరాబాద్.. ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుంది’
సాక్షి, చిత్తూరు : కాణిపాకం ఆలయంలో శనివారం వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి.తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణమని, ఆయన మంత్రి పదవి ఇవ్వడం వల్లే ఈ అదృష్టం దక్కిందన్నారు. కాణిపాకం గుడిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. (‘చంద్రబాబు డైరెక్షన్లో రఘురామ కృష్ణంరాజు’) సెప్టెంబర్ 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని గుడిల అభివృద్దే తమ లక్ష్యమని తెలదిపారు. కాణిపాకానికి మాస్టర్ ప్లాన్ దృష్టిలో ఉందని, దానిని త్వరలోనే అమలు చేస్తామన్నారు. వినాయక చవితి ఉత్సవాల గురించి ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడుతున్నారని, వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో చంద్రబాబు, రఘురామ కృష్ణమ రాజులు కాణిపాకానికి వచ్చి చూడాలని సవాలు విసిరారు. చంద్రబాబు హైదరాబాద్, రఘురామ కృష్ణమ రాజులు ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. (ఏపీ: జిల్లాల పునర్విభజనపై కీలక ఆదేశాలు) -
సాక్షి టీవీ లైవ్ చూస్తు చిన్నారుల మట్టి వినాయకుల తయారీ
-
‘సాక్షి’ చూస్తూ ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణేశా తయారీ..
వినాయక చవితి.. ఈ పేరు వినగానే ఎక్కడలేని ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఊరు వాడా మొత్తం అసలైన పండగ వాతావరణం నెలకొంటుంది. గణేష్ నవరాత్రి వేడుకలు ప్రారంభం కాకముందే ప్రతి వీధిలో మండపాల ఏర్పాటు, విగ్రహ కొనుగోలు వంటి పనులతో బిజీగా ఉంటుంది. అయితే ఈ ఏడు వినాయక చవితికి ఈ హంగామా అంతా కనిపించేలా లేదు. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేనట్లు తెలుస్తోంది. గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగే నినాదాలు ఈసారి వినిపించేలా లేవు. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేనట్లు స్పష్టం చేసింది. ఇళ్లలోనే కరోనా నియమాలు పాటిస్తూ ఎవరిళ్లలో వారు వినాయక చవితి జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (కరోనా మార్గదర్శకాలకు లోబడే చవితి వేడుకలు) మచిలిపట్నం : ఈ క్రమంలో ‘సాక్షి’ టీవీలో మట్టి వినాయకుడిని ఎలా తయారు చేయాలో వివరించడాన్ని చూస్తూ మచిలిపట్నంలోని చిన్నారులు ఇంట్లోనే మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడి ప్రతిమను చిన్నారులు తమ చిట్టి చిట్టి చేతులతో తయారు చేసేందుకు పూనుకున్నారు. అయితే ఈ ఏడాది పర్యావరణహిత గణేశ విగ్రహాల ప్రాధాన్యం పెరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతీక అయిన వినాయక చవితి పండగను జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఏకో ప్రెండ్లీ గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిద్దాం. (‘ఎకో’దంతుడికి జై!) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పరిసరాలు మరింత కాల్యుష్యం అయ్యే అవకాశం ఉన్నందున మట్టి గణపతికి భక్తులు జై అంటున్నారు. దీంతో ఎకో ఫ్రెండ్లీ విత్తన వినాయకుడిని రూపొందించి పూజించాలనే ఈ ఏడు ప్రచారం కొనసాగుతోంది. పర్యావరణ స్నేహపూర్వక గణేష్ విగ్రహాలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నాయి. ఇంతక ముందు కేవలం బంకమట్టి, సహజ రంగులతో తయారు చేసేవి. కానీ ఇప్పుడు మట్టి లోపల వివిధ చెట్ల గింజలతో రానున్నాయి. రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆకు పచ్చ కవచాన్ని పెంచే విధంగా గణేష్ పండుగను జరుపుకునేందుకు ప్రజలు సంకల్పించారు. (‘ఈ ఏడాది లడ్డూ వేలం లేదు’) -
కరోనా మార్గదర్శకాలకు లోబడే చవితి వేడుకలు
సాక్షి, విజయవాడ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేశారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారని, యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొనటం ప్రత్యేకమని గవర్నర్ పేర్కొన్నారు. భక్తులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా చేసే ప్రయత్నాలను సఫలం చేసుకునే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించాలని విఘ్నేశ్వరుడిని పూజిస్తారని బిశ్వ భూషణ్ హరిచందన్ వివరించారు. ఈ పర్వదినాన ప్రజలు తమ భవిష్యత్తు కార్యక్రమాల విజయవంతాన్ని అకాంక్షిస్తూ గణేశుడికి ప్రార్థనలు చేయడం ఆచారంగా వస్తుందని గవర్నర్ తెలిపారు. (మళ్లీ ఉద్యోగ ‘సంబరం’) కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితులను అధిగమించి, శాంతి, సామరస్యంతో జీవితాన్ని గడపడానికి అవసరమైన శక్తిని విశ్వ జనావళికి ప్రసాదించాలని తాను విగ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అధికారులు జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలు, ఆరోగ్య ప్రోటోకాల్లను ఖచ్చితంగా పాటించాలని, ఇంటి వద్దే ఉండి పండుగను జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించటంలో అధికార యంత్రాంగానికి సహకరించడం ద్వారా దానికి వ్యతిరేకంగా సాగే యుద్దంలో భాగస్వాములు కావాలని గవర్నర్ హరిచందన్ పిలుపునిచ్చారు. (సీఎం వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన రద్దు) -
ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్ గణపతి దర్శనం ఎలా?
-
ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్ గణపతి దర్శనం ఎలా?
వినాయక చవితి పండగ వచ్చిందంటే ప్రతి గల్లీలు జైబోలో గణేష్ మహరాజ్ కీ... అంటూ మారుమోగిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో సందడి ఇంతా అంతా ఉండదు. అందులోనూ హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో విశిష్టత ఉంది. ఈ గణనాధుడిని దర్శించుకుంటే లోకకల్యాణం జరుగుతుందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ప్రజల ఒక విశ్వాసం. ఎంతో వ్యయప్రయాలకోర్చి హైదరాబాద్ మహా నగరాన్ని చేరుకోవడం ఒక ఎతైతే అక్కడి నుండి ఖైరతాబాద్ గణేషుడిని చేరుకోవడం మరో పెద్ద సమస్య. నగరంలో రోజురోజుకు పెరిగిన ట్రాఫిక్ ప్రజలను చికాకుల్లోకి నెడుతుంటుంది. రెండు మూడు బస్సులు ఎక్కి దిగుతూ చాలా కష్టం మీద గౌరీపుత్రుడి దర్శనం చేసుకునేవారు. ఈసారి ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. వివరాలు వీడియోలో చూడండి. -
సింగపూర్లో వినాయకచవితి వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయకచవితి పూజావేడుకలను పిజిపి హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది స్థానిక తెలుగువారు సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు బాల గణపతి పూజను అద్భుతంగా చేశారు. చిట్టి చేతులతో చేసిన బాల గణపతి పూజ భక్తులను విశేషంగా ఆకట్టుకొంది. కార్యక్రమం అంతా, ప్రత్యేకించి మండప అలంకరణను ప్రకృతి పరిరక్షణ చైతన్యానికి ప్రేరణనిచ్చేదిగా రూపొందించారు. అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతూ, సుమారు 800 మందికి పైగా తెలుగు సమాజ సభ్యులకు 21 రకాల పత్రిని, ప్రత్యేకంగా రూపొందించిన వినాయక వ్రతకల్పాన్ని ఉచితంగా అందించామని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు వినయ్ మాట్లాడుతూ అందరికీ మంచిజరగాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంకావడానికి చాలామంది సహాయసహకారాలనందించారని తెలిపారు. కార్యవర్గసభ్యులకు, దాతలకు, పూజాకార్యక్రమంలో పాల్గొన్నవారికి, పూజలో పాల్గొన్న పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో వినాయకచవితి వేడుకలు
-
‘ఎకో’దంతుడికి జై!
ఏకదంతుడు.. క్రమంగా ‘ఎకో’దంతుడవుతున్నాడు..మట్టి గణపతికి జై..రంగు ప్రతిమలకు బై.. అంటున్నారు భక్తులు. మట్టి విగ్రహాలకే మొక్కుతున్నారు..నీటి వనరుల కాలుష్యాన్ని పెంచుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీవోపీ) మోజు నుంచి బయటపడుతున్నారు. నాలుగైదేళ్లుగా మట్టి విగ్రహాల వైపు భక్తజనం దృష్టి సారిస్తున్నారు. నేడు వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలపై ప్రత్యేక కథనం.. - సాక్షి, హైదరాబాద్ సాగర్ నిమజ్జనంలో 43 శాతం మట్టివే.... గతేడాది నగరంలోని హుస్సేన్సాగర్లో నిమజ్జనమైన విగ్రహాల్లో 43 శాతం మట్టివేనని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) లెక్కలు తేల్చింది. ఈసారి ఆ సంఖ్య 55 శాతాన్ని దాటుతుందని అంచనా. ప్రజల్లో అవగాహన మెరుగుపడిందన్న స్పష్టమైన సంకేతాలున్నాయని పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్కుమార్ చెప్పారు. నగరంలోనే కాకుండా గ్రామాల్లో కూడా అవగాహన పెరిగిందన్నారు. ఎకోఫ్రెండ్లీ గణపతి ఐడియాలు కొన్ని.. చెరకు గణపతి... తమిళనాడులో 20 మంది కార్మికులు రెండు టన్నుల చెరకుతో భారీ గణపతిని తయారుచేశారు. ఆ తరువాత నిమజ్జనానికి బదులు ఆ చెరకుగడలను తీసి, భక్తులందరికీ పంచిపెట్టడంతో ఇప్పుడు చాలా చోట్ల చెరకు గణపతులు వెలుస్తున్నారు. తద్వారా వేస్టేజ్ ఉండదు, భక్తులకు ఉపయోగకరంగానూ ఉంటుంది. గోబర్ గణేషుడు... హిందువులు ఆవుని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆవు నెయ్యికీ, పేడకూ అంతే పవిత్రత ఉంది. పేడ నీటిలో త్వరగా కరిగిపోతుంది. అందుకే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మట్టిలో ఆవుపేడని కలిపి వినాయక విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇది పర్యావరణానికి మేలుతో పాటు పవిత్రతకి పవిత్రతా చేకూరుతుంది. చేప మిత్రుడిగా... నిమజ్జనం చేసే నీటిలో ఉన్న చేపలకి ప్రమాదకరంగా మారకుండా ఉండడమే కాకుండా ఫిష్ ఫ్రెండ్లీ గణపతులను ముంబైకి చెందిన స్ప్రౌట్స్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్ ఎన్జీవో తయారుచేస్తోంది. ఆనంద్ పెంధార్కర్ అనే పర్యావరణ వేత్త ఫిష్ ఫ్రెండ్లీ వినాయకుల తయారీని పరిచయం చేశారు. ఇలాంటి గణపతి విగ్రహాలు చేపలకు హానిచేయకపోవడమే కాదు, చేపలకు ఆహారంగా ఉపయోగపడతాయి. అంటే చేపలు తినే పదార్థాలతోనే ఈ గణేషులను తయారుచేస్తారన్నమాట. తీపి గణపతి... వినాయకచవితికి కొంత మధురంగా మలచాలనుకున్న ముంబైకి చెందిన రింటూ రాథోడ్ 50 కేజీల చాక్లెట్ గణేషుడిని తయారు చేసింది. దీన్ని నీటిలో నిమజ్జనం చేయకుండా ఆ చాక్లెట్నంతా తీసి పిల్లల నోళ్లు తీపిచేశారు. అంతేనా పాలల్లో నిమజ్జనం చేసి మిల్క్షేక్ని భక్తులకు పంపిణీ చేశారు. గణపతిని విత్తుకోండిలా... ముంబైకి చెందిన దత్తాద్రి కొత్తూర్ ఓ సరికొత్త గణపతిని తయారుచేశారు. విత్తగణపతి అన్నమాట. అన్ని గణపతి విగ్రహాల్లా దీన్ని నీటిలో ముంచక్కర్లేదు. కుండీలో పెట్టుకుని కొద్దిగా నీరు పోస్తుంటే చాలు పండుగ రోజులు పూర్తయ్యేనాటికి మీ యింట్లో మీకు నచ్చిన కూరగాయ మొక్కల్ని ప్రసాదించేస్తాడు ఎకోఫ్రెండ్లీ వినాయకుడు. విత్తనాలేవైనా మీ యిష్టం, ధనియాలో, బెండకాయ, తులసి విత్తనాలో ఏవైనా మీకు కావాల్సిన విత్తనాలను మట్టితో కలిపి గణేషుడిని తయారుచేయడమే. తలా ఓ చేయి... పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు,ప్రభుత్వ విభాగాల అధికారులు ఈసారి మట్టి విగ్రహాలపై ముమ్మర ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రసార మాధ్యమాలు కూడా తోడవడంతో జనంలో మార్పు కనిపిస్తోంది. - మట్టి విగ్రహాలపై దేవాలయాల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. - గతేడాది 40 వేల మట్టి విగ్రహాలను రూపొందించి ఉచితంగా అందజేసిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఈ సారి ఆ సంఖ్యను 60 వేలకు పెంచింది. - వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నీటి వనరులకు చెడుపు చేయకుండా సహజ రంగులతో విగ్రహాలు తయారు చేశారు. - నగరంతోపాటు జిల్లాల్లో ఉన్న కొన్ని కుమ్మరి సంఘాలు కూడా మట్టి విగ్రహాల తయారీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. - కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, భక్త మండళ్లు, మహిళా మండళ్లు కూడా మట్టి విగ్రహాలకే జైకొట్టాయి. -
విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో అంతా బాగుండాలి : ఏపీ గవర్నర్
సాక్షి, అమరావతి : వినాయక చవితి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరించదన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హిందువులంతా ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ శుభ దినాన భక్తుల సమస్యలు తొలగిపోయి వారి ప్రయత్నాలు విజయవంతం అయ్యేలా వినాయకుడు ఆశీర్వదించాలని ఆకాంక్షినట్లు తెలిపారు. ప్రజలంతా శాంతి, సామరస్యాలతో జీవించేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్ ప్రకటించారు. -
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
అమరావతి: వినాయక చవితి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలన్నారు. ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. -
గణేష్ చందా ముసుగులో మహారాష్ట్ర దొంగలు
సాక్షి, నిజామాబాద్ : గణేష్ చందాల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ చందా ఇవ్వని వారింట్లో దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన నగరంలో సంచలనం రేపింది. సాయికృప నగర్ కాలనీలో ఉన్న మొదటి అంతస్థులోని ఓ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు వినాయక చవితి పండుగ నిమిత్తం చందా అడగడానికి వెళ్లారు. ఇంటి ఇల్లాలు చందా డబ్బులు ఇవ్వననడంతో మంచి నీళ్లు కావాలని అడిగి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. దీంతో భయపడ్డ ఇల్లాలు అరుస్తూ ఇంట్లోకి పరుగు తీసింది. అప్రమత్తమైన ఇల్లాలి భర్త వెంటనే గేటు తాళం వేసి వారిని ప్రశ్నించగా, వారిలో ఒకరు భర్తను తోసేసి గేటు దూకి పారిపోయాడు. మిగిలిన మరొకరిని పట్టుకొని స్థానికులు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమందించగా వారు విచారించి నిందితులు మహారాష్ట్రకి చెందినవారుగా గుర్తించారు. పారిపోయిన మరో నిందితుడి కోసం పోలీసులు నగరమంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తోపులాటలో భర్తకు స్పల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గణేష్ చందాల పేరుతో వచ్చేవారి విషయంలో సాయికృప నగర్, వినాయక నగర్ కాలనీ వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. -
సమన్వయంతో సక్సెస్ చేద్దాం
సాక్షి, సిటీబ్యూరో: అన్ని శాఖలు, విభాగాలు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ వారు సమన్వయంతో పనిచేసి ఈ ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను సక్సెస్ చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. గణేష్ ఉత్సవాల నిర్వాహణపై మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ కమిషనర్లు అనిల్ కుమార్, చౌహాన్, జోనల్ కమిషనర్ దాసరి హరిచందన, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణ ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుపుతున్నప్పటికీ ప్రతి సారి కొత్త అంశాలతో ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అదనపు సిబ్బంది, మౌలిక సదుపాయల కల్పనతో పాటు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఏవిధమైన తప్పుడు ప్రచారాలు జరిగినా వాటిని నమ్మొద్దన్నారు. వాటిని పంపేవారి సమాచారాన్ని అధికారులకు అందించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో గణేష్ నిమజ్జనం సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశామన్నారు. దీనిలో భాగంగా 254 క్రేన్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు నగరంలోని అన్ని గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. రూ.8.24 కోట్ల వ్యయంతో క్రేన్లు, వాహనాలు, రూ.9.20 కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మతులు, నిమజ్జన చెరువుల క్లీనింగ్ తదితర ఏర్పాట్లను చేపడుతున్నామని వివరించారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గాల్లో పారిశుధ్య నిర్వహణకుగాను గణేష్ యాక్షన్ టీమ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు రూ.కోటి రూపాయల వ్యయంతో 36,674 అదనపు లైట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిమజ్జనం సందర్భంగా 115 ప్రత్యేక క్యాంపుల ద్వారా 30.52 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందించనున్నట్టు జలమండలి అధికారులు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరం 40 వేల విగ్రహాలను ప్రతిష్టించారన్నారు. ఈ ఏడాది మరింత మంది విగ్రహాలను పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. దాదాపు 21 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఐదు కంపెనీల సి.ఆర్.పి.ఎఫ్ బలగాలను శాంతిభద్రతల పరిరక్షణకు నియమిస్తున్నట్లు వివరించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు గాను ఆన్లైన్ ద్వారా అనుమతులు పొందాలని, దరఖాస్తు చేసిన ప్రతి విగ్రహానికి క్యూఆర్ కోడ్ను జారీచేయనున్నట్టు అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శోభాయాత్ర దారిపొడువునా పబ్లిక్ టాయ్లెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంక్బండ్ వద్ద ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. నిర్ణీత సమయం కంటే ముందు విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ వారు అభిప్రాయపడ్డారు. -
‘గణేష్’ చందా అడిగారో..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 2న ప్రారంభమై, 12న జరిగే నిమజ్జనంతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో మండపాల ఏర్పాటు కోసం చందాలు వసూలు చేయడం పరిపాటి. దీనిని అదనుగా తీసుకుని కొన్ని అసాంఘికశక్తులు చందాల వసూలు పేరుతో దౌర్జన్యాలకు తెగబడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సోమవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎవరైనా చందాల పేరుతో దౌర్జన్యాలకు దిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు ఎవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నగరంలో మండపం ఏర్పాటు చేసేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి 26 వరకు ప్రతి పోలీసుస్టేషన్లోనూ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, పూర్తి చేసిన దరఖాస్తులను 29లోగా తిరిగి ఠాణాల్లోనే సమర్పించాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు అవసరమైన ఎన్ఓసీ సహా ఇతర పత్రాలు సైతం దరఖాస్తుతో జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటులో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేస్తారు. అందుకు అనుకూలంగా ఉంటేనే అనుమతి ఇస్తారు. మండపాల వద్ద కేవలం బాక్సుటైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే వాడాలని సీపీ పేర్కొన్నారు. ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు.. సిటీ పోలీసులకు అత్యంత కీలక ఘట్టంగా భావించే గణేష్ ఉత్సవాలు సమీపిస్తుండటంతో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. గణేష్ ఉత్సవ కమిటీతో పాటు మండప నిర్వాహకులతో తరచు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. బందోబస్తు చర్యల్లో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వద్దని, సున్నిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గణేష్ మండప నిర్వాహకులు పోలీసులు నిర్దేశించిన ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న దక్షిణ, పశ్చిమ, తూర్పు మండలంపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు నిఘా, గస్తీ పెంచాలని సీపీ అధికారులకు సూచించారు. నగర వ్యాప్తంగా తనిఖీలు, సోదాలు నిర్వహించాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధించనున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఎలాంటి ఏమరుపాటు, నిర్లక్ష్యానికి తావిచ్చినా ఉపేక్షించేది లేదని సీపీ తెలిపారు. అవసరానికి తగ్గట్టుఅదనపు బలగాలు.. మరోపక్క పోలీసుస్టేషన్లు, డివిజన్ల వారీగా ఉన్న సిబ్బంది, అవసరమైన అదనపు ఫోర్సులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీపీ అధికారులకు సూచించారు. ఉత్సవాలు ప్రారంభమయ్యేలోగా మరిన్ని విడతల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. టాస్క్ఫోర్స్, స్పెషల్బ్రాంచ్, డిటెక్టివ్ విభాగం, సిటీ సెక్యూరిటీ వింగ్ తదితర విభాగాలకు చెందిన పోలీసులు నిర్వర్తించాల్సిన విధులను ఎప్పటికప్పుడు నిర్దేశిస్తున్నారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన తరవాత ఉత్సవాలు జరిగే 12 రోజులూ ఆయా ప్రాంతాల్ని బాంబు నిర్వీర్య నిపుణులు, డాగ్ స్క్వాడ్లు ప్రతి రోజూ రెండు సార్లు తనిఖీ చేయనున్నాయి. గణేష్ ఉత్సవాలకు చందాల పేరుతో దందాలకు దిగే వారిపై కన్నేసి ఉంచాలని, ఈ విషయంలో అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా చర్యలు తీసుకోవాలని సీపీ స్పష్టంచేశారు. మొహర్రం సంతాప దినాలకు భారీ భద్రత యాకుత్పురా: మొహర్రం సంతాప దినాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 10న మొహర్రం సందర్భంగా నిర్వహించే సంతాప దినాలను పురస్కరించుకొని సోమవారం ఎతేబార్చౌక్లోని రాయల్ క్లాసిక్ కాన్వెషన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మొహర్రం సంతాప దినాలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ఈ సందర్భంగా పురానీహవేలి, దారుషిఫా, ఎతేబార్చౌక్, పంజేషా, ఆలిజాకోట్లా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తల్తెకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మరాదని సూచించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో యాకుత్పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ హఫందీ, కార్పొరేటర్ సోహేల్ ఖాద్రీ, నగర అదనపు కమిషనర్ (శాంతి భద్రతలు) దేవేంద్ర సింగ్ చౌహన్, జాయింట్ కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) తరుణ్ జోషి, సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, మత పెద్దలు సయ్యద్ నజఫ్ అలీ షౌకత్, మౌలానా నిస్సార్ హుస్సేన్, సయ్యదుద్దీన్ జాఫ్రి, బీబీకా అలావా ముతవల్లీ అలీవుద్దీన్ ఆరీఫ్ పాల్గొన్నారు. -
ఏటీఎమ్లో వినాయకుని ప్రసాదం
-
ఏటీఎమ్ వినాయకుడు; ఎనీ టైమ్ మోదక్
పుణె: గణపతి నవరాత్రుల సందర్భంగా తాము ప్రతిష్టించే వినాయక విగ్రహాలు అందరి దృష్టిని ఆకర్షించాలని భక్తులు కోరుకుంటారు. అయితే మహారాష్ట్ర, పూణెలోని శంకర్నగర్కు చెందిన గణేష్ భక్తులు మాత్రం విగ్రహా ఏర్పాటులో సాంకేతికతను వినియోగించారు. నూతనంగా ఆలోచించిన వారు.. ఏటీఎమ్(ఎనీ టైమ్ మోదక్) వినాయకున్ని ఏర్పాటు చేశారు. మోదక్ అంటే వినాయకునికి ఇష్టమైన ప్రసాదం. ఏటీఎమ్ స్క్రీన్ మీద వినాయకని చిత్రాన్ని ఉంచారు. ప్రత్యేకంగా రూపొందించిన కార్డు ద్వారా ఈ ఏటీఎమ్ సేవలను పొందవచ్చు. మాములు ఏటీఎమ్లలో డబ్బులు వచ్చినట్టే ఇక్కడ వినాయకుని ప్రసాదం లభిస్తుంది. భక్తులు కార్డు వినియోగించినప్పుడు ఏటీఎమ్లో నుంచి ప్రసాదం వస్తుంది. ఈ ఏటీఎమ్పై నంబర్లకు బదులు ప్రత్యేకమైన బటన్లు ఉంటాయి. వాటిపై క్షమాపణ, శాంతి, భక్తి, జ్ఞానం, అభిమానం.. అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఏటీఎమ్ వినాయకునికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
లడ్డూతినే పోటీలు నిర్వహిస్తున్నారా జాగ్రత్త..!
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుడికి నైవేధ్యంగా పెట్టిన లడ్డూల వేలం పాటతో పాటు ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారనే పోటీలు జరగడం పరిపాటి. ఆఖరి నాలుగు రోజులు ఇవి జోరుగా సాగుతాయి. లడ్డూ వేలం పాటల వరకు ఓకే అయినా అవి తినే పోటీలు మాత్రం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని సరదా కోసం ఓ ఎఫ్ఎం రేడియో సంస్థ ఏర్పాటు చేసిన లడ్డూ తినే పోటీ తార్నాకలో జోషి అనే వ్యక్తి ప్రాణాలు తీసిందని గుర్తు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో కొందరు మండపాల నిర్వాహకులతో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలు ప్రచారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటు, టోపీలు, టీ–షర్టుల పంపిణీ, లడ్డూలు తినే పోటీటూ నిర్వహిస్తారు. ఆయా పోటీల్లో అందరికంటే ఎక్కువ లడ్డూలు తిన్న వారిని విజేతగా ప్రకటించి, బంగారు నాణాలు, నగదు బహుమతులు అందజేస్తారు. ఇలాంటి పోటీలు ప్రాణాలు తీస్తాయని, ఎవరికి వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని పేర్కొంటున్నారు. గొంతులో ఇరుక్కుంటే ప్రాణాంతకమే... ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారు విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎక్కువ లడ్డూలు తినే ప్రయత్నం చేస్తారు. దీనికోసం లడ్డూను పూర్తిగా నమలకుండా మింగేయడం, విరామం లేకుండా ఒకదాని తర్వాత మరోటి తినాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో లడ్డూలు గొంతులో ఇరుక్కుంటాయని, కొన్ని సందర్భాల్లో బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తరలించినా.. ఫలితాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో కనీసం మంచినీళ్లు సైతం తాగలేని పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. చివరకు గొంతులో ఇరుక్కున్న లడ్డూ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి, బాధితుడు మృత్యు ఒడికి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ట్రేకియా దెబ్బతినడం వల్లే... ఇలాంటి పోటీ నేపథ్యంలో లడ్డూను కంగారుగా తినడంతో అది శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరాడక బాధితులు మరణిస్తూ ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠంలో ముందు భాగంలో ఉండే శ్వాసనాళం (ట్రేకియా) ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. దీని ద్వారానే మనిషి శ్వాస తీసుకుంటాడు. దానికి వెనుక వైపు వెన్నుపూసల మధ్య అన్నవాహిక ఉంటుంది. ఆహారం తీసుకునేప్పుడు గొంతులో కొండనాలిక పని తీరు వల్ల ఆ పదార్థం శ్వాసనాళంలోకి కాకుండా అన్నవాహికలోకి వెళ్తుంది. ఈ కొండనాలిక సరిగ్గా పని చేయనప్పుడే పొలమారుతూ మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. లడ్డూ పోటీల నేపథ్యంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో, కంగారుగా లడ్డూలు తినడంతో కొండనాలిక సరిగ్గా పని చేయకపోవచ్చు. ఫలితంగా ఆ ఆహారపదార్థాలు ట్రేకియాలోకి వెళ్లి ఇరుక్కుపోతుంటాయి. ఫలితంగా బాధితుడికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి కన్ను మూస్తుంటాడు. ఒక్కోసారి స్వరపేటిక పైన ఉండే వేగస్ నర్వ్పై ఒత్తిడి పెరగడంతో వేగ ఇగ్విబిషన్ అనేది ఏర్పడుతుందని ఫలితంగానూ గుండె ఆగిపోతుందని వివరిస్తున్నారు. లడ్డూలపై కన్నేసి ఉంచండి: పోలీసులు గణేష్ మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహానికి ప్రసాదంగా పెట్టే లడ్డూపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లడ్డూలకు ఓ విశిష్టత ఉంటుంది. విభిన్న తరహాలో ఏర్పాటు చేయడం, వేలంలో భారీ రేటు పలకడం, ఉచితంగా పంపిణీ చేయడం... తదితర చర్యలతో నిర్వాహకులు భక్తులను ఆకర్షిస్తుంటారు. అయితే ఇలాంటి లడ్డూలు తస్కరిస్తే ‘శుభం’ అనే సెంటిమెంట్ సైతం కొందరికి ఉంటుందని సూచిస్తున్నారు. గతంలో ఇలాంటి నేరం చేసే ఐదుగురు యువకులు కటకటాల్లోకి చేరినట్లు తెలిపారు. అయితే సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని లడ్డూలు తస్కరణకు గురైతే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు దాటే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండపాల నిర్వాహకులు పక్కాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో తమ ప్రసాదాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు. -
‘సందేశాల’ గణపతి
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశ మండపమది. దాంట్లో చేతిలో ఘంటంతో రాస్తున్న భంగిమలో వినాయకుడి విగ్రహం ఉంది. భక్తుడు మండపంలోకొచ్చి అక్కడున్న గంటను మోగించగానే వినాయకుడు తల ఊపుతూ రాయడం మొదలు పెడతాడు.రాత పూర్తవగానే అక్కడున్న ప్రింటర్లోంచి ఒక కాగితం బయటకు వస్తుంది. దాంట్లో రోడ్డు భద్రత, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన సందేశం ఒకటి ఉంటుంది. ఆ కాగితాన్నే గణపతి ప్రసాదంగా భక్తుడు ఇంటికి తీసుకెళ్లిపోతాడు... ఇది గోవాలోని ఫాంటైన్హాస్ దగ్గరున్న వారసత్వ ప్రాంతమైన ఫాంటే ఫోనిక్స్లో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రత్యేకత. సామాజిక సందేశాలను స్వయంగా రాసి ఇచ్చే ఈ వినాయకుడిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. యువ అనే సామాజిక స్వచ్ఛంద సంస్థ ఈ యాంత్రిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించింది.ఊరికే వినాయకుడి విగ్రహాన్ని పెట్టే బదులు దాని ద్వారా ఏదైనా సామాజిక ప్రయోజనం సాధించాలని భావించాం. అందుకే ఈ యాంత్రిక గణపతిని నెలకొల్పాం. రహదారి భద్రత, పరిశుభ్రత, మహిళా సాధికారత, కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగాలకు సంబంధించిన సందేశాలు ఆయన రాసి భక్తులకు ఇస్తున్నారు. వాటిని భక్తులు ఎంతో భక్తితో ఇంటికి తీసుకెళుతున్నారు.’అంటూ తమ ఉద్దేశాన్ని వివరించారు యువ వ్యవస్థాపకుడు రఘువీర్ మహలే. ఈ విగ్రహాన్ని సుద్ద ముక్కలతో తయారు చేశారు. విగ్రహం తయారీకి నెలన్నర పట్టిందని,5వేల సుద్దముక్కలు వాడామని మహలే తెలిపారు. కరెంటు ఎక్కువ ఖర్చు కాకూడదన్న ఉద్దేశంతో గంట మోగినప్పుడే వినాయకుడి విగ్రహం కదిలేలా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. -
గణపతి బప్పా మోరియా..
మహబూబాబాద్ రూరల్: భక్తుల విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉత్సవ మండళ్లు ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథులు కొలువుదీరారు. మానుకోట జిల్లాగా మారిన తర్వాత రెండోసారి వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,160 వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పలు మండపాల్లో గణపతి విగ్రహాలను ఆకట్టుకునేలా సెట్టింగులు వేశారు. 6వ వార్డులో కౌన్సిలర్ గుండా స్వప్న పోతురాజు ఆధ్వర్యంలో 10 అడుగులు మట్టి గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చాలామంది భక్తులు మట్టి వినాయక విగ్రహాలను ఏ ర్పాటు చేయగా, మరికొన్ని చోట్ల పీవోపీ విగ్రహాలను కొలువుదీర్చి పూజలు చేశారు. గణపతి నవరాత్రులు ఈనెల 21 వ తేదీ వరకు జరగనున్నాయి. 22వ తేదీ న గణేషుడి నిమజ్జనం చేయనున్నారు. జీఎస్టీ ప్రభావం.. వినాయకుడి విగ్రహాల ఏర్పాటు విషయంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తులు జీఎస్టీ ప్రభావంతో తక్కువగా ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ పట్టణంలో గత ఏడాది 187 విగ్రహాలను ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 150కు తగ్గడమే ఇందుకు ఉదాహరణ. కాగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీలు ఆంగోత్ నరేష్కుమార్, జి.మదన్లాల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత పోలీస్ బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. -
నిమజ్జనానికి ఏర్పాట్లు!
సాక్షి,సిటీబ్యూరో: గణపతి నవరాత్రి ఉత్సవాలు గ్రేటర్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహానగరం పరిధిలో ఈసారి వీధులు, ముఖ్య కూడళ్లలో సుమారు 35 వేల గణనాథులను(పెద్ద పరిమాణం) ప్రతిష్ఠించినట్టు జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు అంచనా వేస్తున్నాయి. ఇక కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన స్ఫూర్తితో ఇళ్లలో మరో 5 లక్షల మట్టి గణపతులను(చిన్నవి) ప్రతిష్ఠించి పూజలు చేసినట్టు లెక్కవేస్తున్నారు. అయితే గ్రేటర్ సిటీజన్లు ఈసారి పర్యావరణ హితంగానే గణేష్ చతుర్థిని జరుపుకోవడం విశేషం. శాస్త్రోక్తంగా పూజలందుకొన్న గణనాథులను మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల్లో నిమజ్జనం చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హుస్సేన్సాగర్ సహా గ్రేటర్ పరిధిలోని 50 చెరువుల వద్ద బల్దియా ఏర్పాట్లు చేసింది. నిమజ్జన పనులకోసం రూ.10 కోట్లు కేటాయించింది. నిమజ్జనం జరిగే ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో అవసరమైన పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. నిమజ్జనాలు జరిగే చెరువుల మార్గాల్లో, చెరువుల వద్ద సదుపాయాల కల్పనతో పాడు ఆయా మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. శోభాయాత్రకు సైతం.. నగరంలో జరిగే గణేశ్ శోభాయాత్రలో సైతం మార్గం పొడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్రకు మూడు రోజుల మందే పూర్తిస్థాయిలో పనులు చేపడతామని ఇంజినీర్లు చెబుతున్నారు. తాత్కాలిక విద్యుత్ దీపాల ఏర్పాటు, గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసం 107 మొబైల్ క్రేన్లు, 81 స్టాటిక్ క్రేన్లను నిమజ్జనం జరిగే చెరువుల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. శోభాయాత్ర సందర్భంగా మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు తదితర సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు. పీఓపీ విగ్రహాలతో కాలుష్య ముప్పు గణపతి నవరాత్రులు ఎంత వైభవంగా జరిగినా.. నిమజ్జనంతో తలెత్తే కాలుష్యంతో పర్యావరణ వాదులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో చేసిన ప్రతిమలను జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో ఉండే వివిధ రకాల హానికారక రసాయనాలు జలాశయాల్లో చేరి కాలుష్య కాసారంగా మారడం తథ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చెరువుల్లో కలిసే రసాయన అవశేషాలివే.. లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పైంన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్. హానికారక మూలకాలు కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జిక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా. పీఓపీ విగ్రహాల నిమజ్జనంతో అనర్థాలు.. ⇔ జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ⇔ పర్యావరణం దెబ్బతింటుంది. దుర్వాసనతో సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. ⇔ ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తుంటారు. వీటిని తిన్నవారి శరీరంలోకి హానికారక మూలకాలు చేరతాయి. చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. ⇔ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. ⇔ నగరంలో జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్షజాతులు నాశనమవుతాయి. ⇔ ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు భారతీయ ప్రమాణాల సంస్థ, వైద్య పరిశోధనా సంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ⇔ క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనం, సిలికాన్ జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. గ్రేటర్లో జోన్ల వారీగా నిమజ్జన ఏర్పాట్ల పనులు, మంజూరైన నిధులు జోన్ పనులు నిధులు(రూ.లక్షల్లో) ఎల్బీనగర్ 22 187.40 చార్మినార్ 82 432.28 ఖైరతాబాద్ 22 135.51 శేరిలింగంపలి16 83.96 కూకట్పల్లి 15 74.86 సికింద్రాబాద్13 84.61 మొత్తం 170 998.62 -
సప్తముఖ కాళసర్పుడిగా మహాగణపతి
-
పండగవేళ
-
ఖైరతాబాద్ గణనాథుడి విశేషాలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకునికి తొలి పూజలు నిర్వహించారు. సప్త ముఖ కాళ సర్ప రూపంలో ఈ ఏడాది మహా గణపతి భక్తులకు దర్శనమిచ్చారు. నయన మనోహరంగా శిల్పి రాజేంద్రన్ దీన్ని రూపొందించారు. స్వామి వారికి జరిగిన తొలి పూజ కార్యక్రమంలో పరిపూర్ణనంద స్వామి, ఆపద్ధర్మ మంత్రి నాయిని నరసింహా రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి 50 కిలోల లడ్డును శిల్పి రాజేంద్రన్ సమర్పించారు. ఈ సారి 57 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పులో స్వామి వారు ఖైరతాబాద్లో కొలువుదీరారు. ఏడు తలలు, 14 చేతులు, తలలపై 7 సర్పాలతో స్వామి వారు కనువిందు చేస్తున్నారు. మహాగణపతికి కుడివైపు శ్రీనివాస కల్యాణ ఘట్టం, ఎడమవైపు శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తుతున్నారు. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని ఉత్సవ కమిటీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ చెప్పింది. -
నయనానందకరం నారికేళ గణపతి
శ్రీకాకుళం,కవిటి: కవిటి మండలం బొరివంక కేంద్రంగా ఉన్న ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలకు వినూత్నరీతిలో నారికేళసుమాలబాల గణపతి నయనానందకరంగా సిద్ధం చేశారు. యూత్క్లబ్కు చెందిన శిల్పి భైరి తిరుపతి ఉద్దానం ప్రధాన పంట అయిన కొబ్బరి ఉత్పత్తులతో వినూత్నంగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు.పర్యావరణానికి పెద్దపీటవేస్తూ ఎటువంటి రసాయనాల వినియోగం లేకుండా బొమ్మను రూపొందించారు. 2014వ సంవత్సరంలో వరినారుతో చేసిన గణపతి విగ్రహానికి ఇండియన్బుక్ఆఫ్ రికార్డ్స్అవార్డు, 2015లో తయారుచేసిన ఆయుర్వేద మూలికలతో చేసిన గణపతికి లిమ్కాబుక్ఆఫ్రికార్డ్స్ అవార్డు, 2017లోచేసిన గోధుమనారు గణపతికి హైరేంజ్బుక్ఆఫ్ రికార్డ్స్లో చోటుదక్కింది. ఈ ఏడాది వినూత్నంగా కొబ్బరిపువ్వు, కొబ్బరిపీచుత్రాడు, తదితర పదార్ధాలతో దీనిని సర్వాంగసుందరంగా శిల్పి తిరుపతిరావు తీర్చిదిద్దాడు. గతంలో పామాయిల్కాయలతో కూడాగణపతి విగ్రహం తయారుచేశాడు. -
తొలి పూజలందుకున్న మహాగణపతి
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి వస్తుందంటే దేశవ్యాప్తంగా అందరి చూపూ ఖైరతాబాద్వైపే ఉంటుంది. ఈ ఏడాది ఏ రూపంలో దర్శనమిస్తాడా అని అందరిలోనూ చర్చ మొదలవుతుంది. అందుకు తగ్గట్టే బొజ్జ గణపయ్య వివిధ రూపాల్లో భక్తులకు దర్శమిస్తుంటాడు. ఖైరతాబాద్లోని మహాగణపతికి గురువారం ఉదయం 11.52 గంటలకు ప్రథమ పూజ నిర్వహించారు. సప్తముఖ కాళసర్ప మహాగణపతిగా వినాయకుడు దర్శమిచ్చారు. ఈసారి మహాగణపతి 57 అడుగుల ఎత్తులో కొలువుదీరాడు. మహాగణపతి కుడివైపు శ్రీనివాస కల్యాణ ఘట్టం ప్రతిమ ఏర్పాటు చేశారు. ఎడమవైపు శివపార్వతుల విగ్రహాలు పెట్టారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిరోజు కావడంతో ఖైరతాబాద్ వినాయకుడికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులు వచ్చే మార్గాలు, దర్శనం చేసుకుని వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఖైరతాబాదు వినాయకుడిని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కార్పొరేటర్లు మన్నె కవిత, విజయా రెడ్డి, టీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇంచార్జ్ మన్నె గోవర్దన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామి, విజయా రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా: నాయిని తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు నాయిని నర్సింహా రెడ్డి వినాయకుడి దర్శన అనంతరం మీడియాతో తెలిపారు. అన్నిపార్టీల వాళ్లు గెలవాలని కోరుకుంటారు.. ప్రజలకు మంచి చేసిన వాళ్లనే గెలిపించాలని కోరుకున్నానని వెల్లడించారు. అందులో భాగంగానే తాము గెలవాలని ఖైరతాబాద్ గణనాథుడిని విన్నవించుకున్నట్లు చెప్పారు. వినాయకుడి పూజ తర్వాతే ఏదైనా: తలసాని వినాయకుడి పూజ తర్వాతనే ఏదైనా కార్యక్రమం తలపెడతానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తే గానీ తృప్తి కలగదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండగలను సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నారుని తెలిపారు. ఎంతో శోభాయమానంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో మన పోలీస్ దేశానికే ఆదర్శంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. -
రాయలసీమలోనే అతిపెద్ద ముత్యాల వినాయకుడు
తిరుపతి రూరల్: రాయలసీమలోనే అతిపెద్ద ముత్యాల వినాయకుడిని చంద్రగిరి నియోజవర్గం తుమ్మలగుంటలో ఏర్పాటు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సహకారంతో బాల వినాయక కమిటీ, కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఈ మట్టి ముత్యాల వినాయక విగ్రహాన్ని సిద్ధం చేశారు. పర్యావరణానికి అనుకూలంగా 7 వేల కిలోల బంకమట్టితో 34 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పుతో దేశ, విదేశాల నుంచి తెప్పించిన వెలుగులు విరజిమ్మే 25 వేల ముత్యాలతో ఈ భారీ ముత్యాల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. బాహుబలి సినిమా సెట్టింగులకు పనిచేసిన సినీ కళాకారులు 43 మంది 16 రోజులు శ్రమించి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 1,001 దీపాలతో అలంకరణ చేశారు. మెరిసే ముత్యాలకు ఈ వెలుగులు తోడుకావడంతో విగ్రహం దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. మండపంలో 10 వేల మట్టిగాజులతో చేసిన ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విగ్రహం చుట్టూ దశావతారాలతో కూడి న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశా రు. శంఖు, చక్రం, నామాలతో ఏర్పాటు చేసిన స్వాగత ఆర్చ్లు రా...రమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నాయి. 1,116 కిలోల భారీ లడ్డు.. తుమ్మలగుంట వినాయకచవితి వేడుకలకు భారీ వినాయక విగ్రహాలతో పాటు లడ్డు ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రికార్డు స్థాయిలో ఈ ఏడాది 1,116 కిలోల భారీ లడ్డును ఏర్పాటు చేశారు. దీన్ని మత సామరస్యానికి నిదర్శనంగా ముస్లింలు అష్రాఫ్, షరీష్ తయారు చేసి స్వామి వారికి మొదటి నైవేద్యంగా సమర్పించనున్నారు. ముత్యాల వినాయకుడిని దర్శించుకుని, ఆది దేవుని ఆశీస్సులు పొందాలని శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కోరారు. -
గణేశ్ ఉత్సవాలకు రెడీ
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానుండటంతో నిమజ్జన ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. పండగ మూడోరోజు నుంచి చిన్న విగ్రహాల నిమజ్జనాలు జరిగే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో, రహదారుల మార్గాల్లో అవసరమైన పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. నిమజ్జనాలు జరిగే చెరువులకు దారి తీసే మార్గాల్లో, చెరువుల వద్ద సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించారు. నిమజ్జన శోభాయాత్ర నాటికి దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో అవసరమైన సదుపాయాలు కల్పించనున్నారు. ఈనిధులతో గ్రేటర్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగే దాదాపు 50 చెరువుల వద్ద, హుస్సేన్సాగర్ వద్ద అవసరమైన ఏర్పాట్లతోపాటు ఆయా మార్గాల్లో గుంతల పూడ్చివేత , దెబ్బతిన్నరోడ్ల మరమ్మతులు తదితర పనులు చేయనున్నారు. ఈపనుల్లో 98 పనులు తాత్కాలిక ఏర్పాట్లకు సంబంధించినవి కాగా, మిగతా 72 పనుల్లో బీటీ, సీసీ రోడ్ల మరమ్మతులు, రీకార్పెటింగ్, క్యాచ్పిట్ మరమ్మతులు తదితరమైన వాటికి సంబంధించినవి. శోభాయాత్ర మార్గం పొడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు శోభాయాత్రకు మూడు రోజుల మందు పూర్తిస్థాయిలో పనులు చేపట్టనున్నట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. ఇవి కాక తాత్కాలిక విద్యుత్ దీపాల ఏర్పాటు, గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసం 107 మొబైల్ క్రేన్లు, 81 స్టాటిక్క్రేన్లు తదితరమైనవి వినియోగంలోకి తేనున్నారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా మెడికల్క్యాంపులు, మొబైల్ టాయ్లెట్లు తదితర సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్లు చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు. పండగొచ్చినా.. పూర్తికాని గుంతల పూడ్చివేత.. నిమజ్జన పనులతో సంబంధం లేకుండా వినాయక చవితి నాటికి రోడ్లపై గుంతలన్నింటినీ పూడ్చివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించడంతో అందుకు కార్యాచరణ రూపొందించిన అధికారులు పనులు మాత్రం పూర్తిచేయలేకపోయారు. సోమవారం వర్షం కురవడంతో పనులు నిలిచిపోయాయని, వర్షం వల్ల కొత్త గుంతలు ఏర్పడ్డాయని అధికారులు పేర్కొన్నారు. వీటిని పూడ్చివేసేందుకు మరికొన్ని రోజులు పట్టనుంది. ఈలోగా మళీ వర్షాలు వస్తే గుంతలు పెరగనున్నాయి. రూ. 3 కోట్లతో మొహర్రం పనులు ఓవైపు గణేశ్ నిమజ్జనం పనులతోపాటు మరోవైపు మొహర్రం సందర్భంగా అవసరమైన సదుపాయాల కల్పనకు కూడా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. దాదాపు రూ. 3 కోట్లతో ఈ పనులు చేయనున్నారు. జీహెచ్ఎంసీ ఆరు సర్కిళ్ల పరిధిలో దాదాపు 50 పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. జోన్ల వారీగా నిమజ్జన ఏర్పాట్లకుసంబంధించిన పనులు ..మంజూరైన నిధులు జోన్ పనులు నిధులు (రూ. లక్షల్లో) ఎల్బీనగర్ 22 187.40 చార్మినార్ 82 432.28 ఖైరతాబాద్ 22 135.51 శేరిలింగంపల్లి 16 83.96 కూకట్పల్లి 15 74.86 సికింద్రాబాద్ 13 84.61 మొత్తం 170 998.62 -
ఆ రూపం.. అపురూపం..
సాక్షి, సిటీబ్యూరో: నవరాత్రి ఉత్సవాల కోసం ఖైరతాబాద్ గణనాథుడు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాడు. ఏటా అద్భుతమైన వైవిధ్యంతో, ఎన్నెన్నో ప్రత్యేతలతో, మరెన్నో విశేషాలతో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ మహాగణపతి 64వ ఏట సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా కనువిందు చేయనున్నాడు. ప్రత్యేకతలెన్నో.. ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది ఏడు ముఖాలు, 14 చేతులు, ఏడు మూషికాలు, ఏడు సర్పాలు, ఏడు గజాలతో పాటు శ్రీనివాసుడు, లక్ష్మీ, శివపార్వతులు, బ్రహ్మ, సరస్వతి, గరుత్మంతుడు, నారద మహర్షి, హోమం చేస్తున్న రుషుల విగ్రహాలు ప్రధాన విగ్రహానికి కుడి, ఎడమ వైపులా ప్రతిష్ఠించారు. ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో ఈ అందమైన విగ్రహం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది విగ్రహం బరువు కూడా బాగా పెరిగింది. గత సంవత్సరం 60 అడుగుల విగ్రహాన్ని రూపొందించగా ఈ సారి 57 అడుగులకే పరిమితమయ్యారు. 28 అడుగుల వెడల్పుతో భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మహాగణపతి బరువు సుమారు 45 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఈ విగ్రహం రూపకల్పన కోసం 15 టన్నులకుపైగా ఇనుము, 30 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, 10.5 టన్నుల క్లే వినియోగించారు. 2450 కిలోల కొబ్బరి పీచు, 9450 వెల్డింగ్ రాడ్లను వినియోగించారు. విగ్రహాన్ని అందంగా అలంకరించేందుకు 500 లీటర్ల రంగులను వాడారు. 1750 కిలోల ఫినిషింగ్ పౌడర్ను వినియోగించారు. సుమారు 190 మందికిపైగా కళాకారులు, సిబ్బంది ఈ మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు. నేటి ఉదయంమొదటి పూజతోవేడుకలు ప్రారంభం.. ఖైరతాబాద్ గణనాథుడి ఉత్సవాలు గురువారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు పద్మశాలీ సంఘం ప్రతినిధులు పోచంపల్లి నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలు, కండువా సమర్పించి పూజలు చేస్తారు. అనంతరం ఉదయం11.52 గంటలకు మొదటి పూజ ప్రారంభమవుతుంది. కాకినాడ శ్రీ పీఠం స్వామీజీ పరిపూర్ణానందస్వామి ఈ తొలిపూజలో పాల్గోనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం హాజరయ్యే గవర్నర్ నరసింహన్ దంపతులు ఈసారి వేడుకలు రావడం లేదు. గవర్నర్ మాతృమూర్తి కన్నుమూయడంతో ఆయన వేడుకలకు రాలేకపోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు ఈ సంవత్సరం కూడా తాపేశ్వరం లడ్డూ ఏర్పాటు చేయడం లేదు. స్థానికంగా తయారు చేసే 50 కిలోల లడ్డూను ప్రసాదంగా అలంకరిస్తున్నారు. 10 అడుగుల అంబికా అగరుబత్తులు ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి 11రోజుల పాటు వెలుగుతూ ఉండేందుకు అంబికా దర్బార్ బత్తి వారు సమర్పించే 10 అడుగుల అగరుబత్తులను ఈ సంవత్సరం కూడా అందజేస్తున్నట్లు అంబికా దర్బార్బత్తి టెక్నికల్ డైరెక్టర్ అంబికా రామాంజనేయులు, మార్కెటింగ్ మేనేజర్ మహేందర్ తెలిపారు. -
వినాయక విహారం
వినాయకుడు చవితి పండగ నాడు భూలోకానికి విహారానికి వస్తే?తన జనని పార్వతీదేవికి ఇక్కడి వింతలు విడ్డూరాలు చూపిస్తే..నారదుడు ఆ ట్రిప్కు లైవ్ రిపోర్టింగ్ అందిస్తే.. చదివిన వారికి పుణ్యమూ, ఫలమూ దక్కినట్టే కదా! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే‘‘ కృష్ణద్వీపంలో నివసించే వేదవ్యాసుడికి మదిలో ఒక కథ మెదిలింది. ఆ కథను అక్షరీకరించాలనుకున్నాడు. తాను నిరాఘాటంగా చెబుతుంటే, ఆపకుండా రాయగలిగే వ్రాయసగాని కోసం వెదికాడు వ్యాసుడు.అప్పుడాయన మదిలో వినాయకుడు మెదిలాడు. ఈ సత్కార్యం విఘ్ననాయకుడైన వినాయకుని పవిత్ర హస్తాల మీదుగా సాగితే బాగుంటుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, వినాయకుడి దగ్గరకు స్వయంగా వెళ్లి, ‘నాయనా! నేను మహాభారత రచన చేద్దామనుకుంటున్నాను. నాకు వ్రాయసకాడు కావాలి. నేను వేగంగా చెబుతుంటే, అంతే వేగంగా రచన చేయాలి. ఇలా రాయాలంటే తప్పనిసరిగా వ్రాయసకాడు కూడా జ్ఞాని అయి ఉండాలి. అందుకు నువ్వే తగినవాడివని భావించాను. మన భారత రచన ఎప్పుడు ప్రారంభిద్దాం గణేశా’ అని ఆప్యాయంగా పలకరించాడు వ్యాసభగవానుడు. అందుకు ఆ గజాననుడు వినమ్రంగా శిరసువంచి, ‘మహర్షీ! మీ అంతటివారు నన్ను ఎంచుకున్నందుకు సదా ధన్యుడిని. మీరు ఎప్పుడు సుముహూర్తం నిర్ణయిస్తే అప్పుడే ప్రారంభిద్దాం’ అన్నాడు ఉమాపుత్రుడు.‘మంచిపనికి ముహూర్తం అక్కర్లేదు నాయనా! తక్షణమే ప్రారంభిద్దాం ఈ శుభకార్యాన్ని’ అన్నాడు బాదరాయణుడు. లంబోదరుడు పాదప్రక్షాళనం చేసుకుని, తాళపత్రాలు, ఘంటం చేతబట్టి, మనస్సులో ఆదిదంపతులను స్మరించి, మనస్సును భ్రూమధ్యంలో లగ్నం చేసి, రచనకు సన్నద్ధుడయ్యాడు. వ్యాసుడి నోటి నుంచి శ్లోకాలు నిశిత శరాలుగా వెలువడుతున్నాయి, వినాయకుడి ఘంటం కూడా అంతే వేగంగా పరుగులు తీస్తోంది, భారత రచన సాగింది. రచన పూర్తయ్యేవరకు వినాయకుడు కదలలేదు, మెదలలేదు, పెదవి కదపలేదు. శ్రీమన్మహాభారతం నిర్విఘ్నంగా పద్దెనిమిది పర్వాలు లక్ష శ్లోకాలు పూర్తయ్యాయి. వ్యాసుడికి నమస్కరించి, ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని కైలాసంలో ఉండే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. క్షేమసమాచారాలు కనుక్కున్నారు పార్వతీపరమేశ్వరులు. వ్యాసభగవానుడి అద్భుత సృష్టికి తమ కుమారుడు ఘంటం పట్టినందుకు ఆనందపారవశ్యం చెందారు వారు. భూమి మీద భారతం ఉన్నంతకాలం వినాయకుడి పేరు కూడా నిలబడిపోతుందని ఆనందించారు ఆది దంపతులు. ‘‘అమ్మా! ఇంతకాలం వ్యాసభగవానుడి దగ్గర ఉండి, జ్ఞానసముపార్జన చేశాను. ఎంతో అందమైన భారతాన్ని ఆయనకు లేఖకుడిగా ఉన్న కారణంగా అందరికంటె ముందుగా తెలుసుకోగలిగాను. ఇంతటి మహేతిహాసాన్ని మరెవ్వరూ కొన్ని యుగాలు గడిచినా రచించలేరమ్మా! ఇంతకాలం మీకు దూరంగా ఉన్నందుకు నేను ఎన్నడూ చింతించలేదమ్మా. నా రచనా ప్రావీణ్యాన్ని చూసి మీరు కూడా సంబరపడే ఉంటారు. ఇప్పుడు నా మనసుకి కొంచెం విశ్రాంతి కావాలనిపిస్తోంది. కొంతసేపు భూలోకంలో సంచరించాలని ఉంది. నా పుట్టినరోజు వేడుకలను భూలోక వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కదా. ‡ నీ అనుమతితో భూలోకంలో సంచరించాలనుకుంటున్నానమ్మా’ అన్నాడు గణనాయకుడు. అందుకు పార్వతి, ‘నాయనా! నాకు నీ వెంట రావాలని ఉంది. నిన్ను ఒక్కో సంవత్సరం ఒక్కో కొత్త అవతారంలో భూలోకవాసులు చూసుకుంటున్నారు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు నిన్ను ఎలా పూజిస్తున్నారో కనులారా చూసి ఆనందించాలని ఉంది’ అంది పార్వతి. ‘నా మూషికం మీద ఈ యావత్ప్రపంచం నీకు చూపిస్తానమ్మా. ముందుగా నన్ను ఆశీర్వదించు’ అని తల్లి దగ్గర దీవెనలు అందుకుని, ఆమెను తన వాహనం మీద కూర్చుండబెట్టుకుని బయలుదేరాడు వినాయకుడు. వినాయకుడు భూలోక సంచారానికి బయలుదేరుతున్నాడన్న వార్త తెలిసిన త్రిలోక సంచారి నారదుడు, ఈ సమాచారాన్ని తానే ముందుగా అందరికీ అందించాలని, వినాయకుడి కంటె ముందుగానే తన సామాగ్రితో బయలుదేరాడు. వినాయకుడి వెంట తల్లి కూడా ఉండటం చూసి, వెంటనే ‘తాజా వార్త’ అంటూ ప్రచారం చేసేసి, మళ్లీ వారి వెంట బయలుదేరాడు నారదుడు మరింత సమాచార సేకరణ కోసం.‘నాయనా! నిన్ను రకరకాల వేషాలతో విగ్రహాలుగా తయారు చేస్తుంటారు కదా! నీకు కోపం రాదా’ అని ప్రశ్నించింది పార్వతి. వినాయకుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘అమ్మా! నాకు ఏది కావాలన్నా నిన్నే అడుగుతాను, అలాగే నువ్వు నీకు కావలసిన విధంగా నన్ను అలంకరించుకుంటావు. అవునా. ఎందుకంటే నాకు నీ దగ్గర చనువు, నీకు నా మీద వాత్సల్యం ఉన్నాయి కాబట్టి. ముందుగా నీవు నీ ఒంటి నలుగు పిండితో నన్ను రూపొందించావు. అందుకే అందరూ నన్ను మట్టితో రూపొందించాలి. అయితే, కొందరు బంగారంతోనూ నన్ను తయారుచేస్తారు. నన్ను వారి ఇంటి బిడ్డగా చూసుకుంటారు. సాధారణంగా మనకు చనువైన వారి దగ్గరే మనకు కావలసినవి అడుగుతాం, చిలిపిచేష్టలు ప్రదర్శిస్తుంటాం. భూలోక వాసులకు నేనంటే ఎంతో ప్రేమ, ఎంతో చనువు ఉంది కాబట్టే నన్ను వారి ఇంటి మనిషిగా భావించి, వారికి నచ్చిన రూపంలో నన్ను అలంకరిస్తుంటారు. అంతేనా! కుంచె పట్టిన ప్రతి చిత్రకారుడు ఈ మాసమంతా నా మీద వ్యంగ్య చిత్రాలు వేస్తూనే ఉంటాడు, హాస్యకథలు రాసేవారు నన్ను ఆధారంగా చేసుకుని హాస్యకథలు రాస్తూనే ఉంటారు’ అన్నాడు వినాయకుడు. ‘‘నాయనా! నీ మాటలు బాగానే ఉన్నాయి. నిన్ను కొందరు నులక మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వినాయకుడిగా చూపుతారు, కొందరేమో స్కూటర్ వినాయకుడిగా కొలుస్తారు, మరికొందరు నీకు నల్ల కళ్లజోడు పెడతారు. సంగీతాభిలాష ఉన్న కొందరు, నవవినాయకులుగా తొమ్మిది రకాల వాద్యపరికరాలతో నిన్ను సంగీత వినాయకుడిగా చూపుతున్నారు. కొందరు నిన్ను ఓంకార స్వరూపంగా తలుస్తున్నారు, కొందరు నువ్వు క్రికెట్ ఆడుతుంటే చూసి మోజుపడుతున్నారు, నిన్ను వెంకటేశ్వరునిగా మరికొందరు చిత్రీకరిస్తుంటారు. కొందరు నట వినాయకుడిగా చిత్రీకరించారు’ అని ఒక్కొక్క రూపాన్ని పార్వతీదేవి ఏకరువు పెడుతుంటే, మధ్యలోనే వినాయకుడు అడ్డుతగిలి, ‘అంతేనా అమ్మా! కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, నాకు పెళ్లి కూడా చేసేశారు, నాలో ఉన్న సిద్ధి, బుద్ధి అనే లక్షణాలను నా భార్యలుగా చేశారు. ఎవరు ఏం చేసినా, వారంతా నా మీద ప్రేమతో చేసినట్లే భావన చేశాను’ అంటుండగా మధ్యలో నారదుడు ప్రవేశించి, ‘అయ్యా! వినాయకా! మీరు చూసినవాటి కంటె నేను మరిన్ని రూపాలు చూశాను. మిమ్మల్ని హనుమ రూపంలో చూడాలనే కుతూహలంతో కొందరు మీ చేతితో గద ఉంచారు. మరికొందరు సర్ప వినాయకుడిని చేశారు, కొందరైతో మీతో కోలాటం ఆడించారు. ఆకులను మీ రూపంగా మలిచారు. మరికొందరు ముచ్చటగా మీ ఒడిలో శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టారు. మరో అడుగు ముందుకు వేసి లక్ష్మీదేవిగా కూడా మిమ్మల్ని రూపొందించుకున్నారు’ అంటూ రకరకాల రూపాలను వివరించాడు నారదుడు.నారదుడి మాటలకు ముసిముసిగా తొండం వెనుక నుంచి నవ్వుతూ, ‘త్రిలోక సంచారీ! నాకు నచ్చేది ఒకటేనయ్యా! నా పుట్టినరోజు పేరుతో ఎంతో మంది తమలోని సృజనను వెలికి తీస్తున్నారు. దేవతలలో ఎవ్వరికీ దక్కని ఈ ఘనత నాకు మాత్రమే దక్కింది. నా భక్తులు నన్ను వారి ఇంటి కుమారుడిగా భావించి, వారికి కావలసిన విధంగా నన్ను అలంకరించారు. మంచి తివాసీ మీద పడుకోబెడతారు, పిల్లలు తినే మిఠాయిలతో నన్ను తయారు చేస్తారు, రకరకాల పూసలతో రూపొందిస్తారు. విలాసంగా కూర్చున్నట్లుగా కొందరు నన్ను చెక్కుతారు. ఎవరు ఎలా అలంకరించినా, ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధించినా నాకు అందరి మీద ఒకే ప్రేమ ఉంటుంది’ అని పలికాడు గణనాథుడు. ఇంతలోనే నారదుడు మళ్లీ, ‘‘వినాయకా! ఇవన్నీ సామాన్యుల ఆలోచనలైతే, ఋషులు సైతం నిన్ను విడిచిపెట్టలేదు నాయనా! నిన్ను పదహారు మంది గణపతులుగా పేర్కొన్నారు. నిరుక్త్త గణపతి నుంచి మళ్లీ నిరుక్త గణపతిగా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా అర్చిస్తున్నారు. ఎంతటి ఘనత గణనాథా నీది. నాది ఒక్కటే చిన్న విన్నపం గణనాథా! నీ పేరు చెప్పుకుని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు అని కొందరు నిందిస్తున్నారు. ఈ నీలాపనిందలు పడకుండా, నీ భక్తులందరికీ నిన్ను మీ అమ్మ రూపొందించినట్టుగా మట్టితోనే తయారుచేయమని ఆశీర్వదించు’ అంటూ నారదుడు సాష్టాంగపడ్డాడు. వినాయకుడు అందుకు తాను ఏమీ చేయలేనంటూ, జగజ్జనని అయిన తన తల్లితో... నాది ఒక్కటే కోరిక అమ్మా.. నా పేరున జరుగుతున్న ఈ తొమ్మిది రోజుల పండగ సందర్భంగా ప్రతి పందిరిలోను, భక్తిపాటలను మాత్రమే వేయాలని కోరుకుంటున్నాను. మనం తల్లి దగ్గర ఒకలా, తండ్రి దగ్గర ఒకలా, పిల్లల దగ్గర ఒకలా మాట్లాడతాం. అలాగే దేవుడి పందిళ్లలో కొన్ని పాటలు వేయకుండా ఉంటే మనకు మంచిది అనిపించింది. నా పేరున అసభ్యపు పాటలు వింటున్నారని నలుగురూ నా భక్తుల గురించి అనుకోవడం నాకు బాధగా ఉందమ్మా. అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా ఆశీస్సులు అందజేస్తున్నాను’’ అంటూ ముగించాడు విఘ్నేశ్వరుడు. ప్రసాదం... అమ్మా! నువ్వు ఎప్పుడూ నా ప్రసాదం గురించి, ‘రుచిపచిలేని ప్రసాదం’ అని బాధపడుతుంటావు. శివాలయంలో అంటే నా తండ్రి నివసించే ఆలయంలో కేవలం తీర్థం మాత్రమే ప్రసాదంగా ఇస్తారు కదా! నా తండ్రి జన్మదినం నాడు భక్తులంతా ఉపవాసం కూడా ఉంటారు. నా తండ్రి సామాన్య జీవితం గడప డానికే ఇష్టపడతాడు. నేను కూడా అంతేనమ్మా. అందుకే నాకు పెట్టే నైవేద్యం అందరికీ అరగడానికి అనువుగా, అందరికీ అందుబాటు లో ఉండే విధంగా నిర్ణయించిన మహాను భావుడు ఎవరో కాని, ఆయనకు శతకోటి వందనాలమ్మా. భక్తితో చేసే నా పూజకు అసలు ఖర్చే ఉండదమ్మా. పిల్లలంతా తోటల లోకి వెళ్లి, రకరకాల ఆకులు కోసుకు వస్తే చాలు. ఏవీ దొరక్కపోతే, నాలుగు గడ్డి పరకలు తెచ్చినా చాలు సంతోషిస్తాను. నా తయారీ కూడా అలాగే సులువుగా ఉండాలి. బంకమట్టితో నన్ను తయారు చేస్తే చాలు. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల దాకా అందరికీ అందుబాటు లో ఉండే పూజ కదమ్మా నాది. నా మీద ప్రేమతో ముత్తుస్వామి దీక్షితార్ ‘వాతాపి గణపతిం భజే’, ‘మహాగణపతిం మనసాస్మరామి’ అంటూ... రచించిన కీర్తనలను నేటి తరం కూడా పాడు కోవాలనే ధ్యేయంతో కొందరు వీటికి ఆధునిక పోకడలను సైతం సంత రించారు. – డా. వైజయంతి పురాణపండ -
డెకో గణపతి
ఎకో గణపతిలా.. ఈయన ‘డెకో’ గణపతి. ఎకో గణపతికి రంగులు ఉండవు. స్వచ్ఛమైన మట్టి ముద్దతో తయారౌతాడు. ఆ మట్టి గణపయ్యను డెకరేట్ చేస్తే ఆయనే.. డెకో గణపతి. బుజ్జి గణపతిని ఎలా సింగారించినా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. మట్టితో రూపమిచ్చి, ప్రకృతిలో దొరికే వస్తువులతో ఆ రూపానికి అలంకరణ చేస్తే అంతకు మించిన అందం ఉండదేమో అనిపిస్తుంది. ఇందుకోసం పెద్దగా కష్టపడనక్కర్లేదు. చిన్న చిన్న మార్పులతో, ఇంట్లో దొరికే వస్తువులతోనే గణపయ్యను అందంగా అలంకరించవచ్చు. మనసారా గణపయ్యను అలంకరించుకొని భక్తిగా కొలుచుకోవచ్చు. పూసల తలపాగా అట్ట ముక్కను తలపాగాకు కావల్సిన పరిమాణంలో కత్తిరించి, ‘గ్లూ’తో సెట్చేయాలి. తెల్లని పూసలను వరుసలుగా ఆ తలపాగాకు గ్లూతో అతికించాలి. మధ్య ఒక నెమలి పింఛాన్ని అతికిస్తే గణపతి తలపాగా రెడీ. ఇదే అట్టముక్కకు రంగు రంగుల నెట్ ఫ్యాబ్రిక్, చమ్కీలు వాడి మరో అందమైన తలపాగాను సిద్ధం చేయవచ్చు. పూల సింహాసనం ఎరుపు రంగు పేపర్ చార్ట్ని తామర పువ్వు రేకలుగా ఒకే సైజులో కత్తిరించాలి. ఒక్కో పువ్వు రేక చుట్టూతా బంగారు రంగు లేస్ని అతికించాలి. లేదంటే పసుపు రంగు స్కెచ్తో డిజైన్ని కూడా గీయవచ్చు.రెండు తెల్ల చార్ట్లను గుండ్రంగా కత్తిరించి, సిద్ధంగా ఉన్న పువ్వు రేకలను చార్ట్కు అతికించాలి. రెండు వరసలుగా అతికించిన పువ్వు రేకలను పై వరుస పైకి, కింద వరస కిందకు అమర్చాలి. ఈ తామరపువ్వు సింహాసనం.. గణేషుడిని ఉంచడానికి సిద్ధమైనట్టే. గట్టి కాటన్ బాక్స్ను తగినంత పరిమాణంలో కత్తిరించి, దానికి వెల్వెట్ పేపర్, లేసు, చమ్కీలు, పూసలు వాడి సింహాసనాన్ని సిద్ధం చేయవచ్చు. రంగోలి అలంకరణ పసుపు, కుంకుమ, బియ్యప్పిండి కాంబినేషన్లతోనే మట్టి గణపయ్యకు రంగులుగా వాడవచ్చు. అదే పసుపు, కుంకుమ, పిండిలతో అందమైన రంగవల్లులను గణపతి ప్రతిమను ఉంచే పీఠం ముందు తీర్చిదిద్దవచ్చు. నెమలిపింఛం హిందూమతంలో నెమలిపింఛానికి ఓ ప్రత్యేక స్థానం. కృష్ణుడి తల మీదనే కాదు, గణపతి చేతిలో రాయడానికి అనువుగా నెమలి పింఛం ఉన్నట్టు దేవతామూర్తుల ఫొటోలలో చూస్తుంటాం. గణేశ ప్రతిమను ఉంచే చోట ఓ నెమలి పింఛాన్ని ఫ్లవర్వేజ్లో వేసి, ఉంచితే ఆ అలంకరణలో ఓ ప్రత్యేక కళ వచ్చేస్తుంది. రంగు రంగుల కర్టెన్లు గణపతి ప్రతిమ వెనక భాగంలో రంగు రంగుల కర్టెన్లను వేలాడదీస్తే చాలు అలంకరణలో ఒక కొత్త కళ కనిపిస్తుంది. వీటికి ప్లెయిన్ సిల్క్ తెరలను వాడచ్చు. గుమ్మాలకు, కిటికీలకు వేలాడదీసేవే కాకుండా డెకొరేటివ్ కర్టెన్లు కూడా విడిగా మార్కెట్లో లభిస్తున్నాయి. చమ్కీల గొడుగులు గణనాథుడికి పట్టే గొడుగును ఇంట్లోనే అందంగా తయారుచేసుకోవచ్చు. పేపర్ చార్ట్తో గొడుగును తయారు చేసి, దానికి వెల్వెట్ పేపర్, ఆ పైన చమ్కీలు, పూసలు గ్లూతో అతికించి అలంకరించవచ్చు. పూల దండలు వరుసలుగా కట్టిన రంగు రంగుల పూలదండలు గణపతి ప్రతిమ వెనకాల మండపానికి అలంకరణ కోసం ఉపయోగిస్తే పండగ కళ పరిమళమై వికసిస్తుంది. – ఎన్.ఆర్ -
మహా గుణపతి
విఘ్నేశ్వరుడు గణాలకే కాదు... గుణాలకూ అధిపతే! మన సంప్రదాయంలో ఓ దైవం గురించీ, ఓ పూజ గురించీ దేన్ని గురించైనా సరే తెలుసుకోదగ్గ ఎన్నో విశేషాలను తెలుసుకోగలుగుతున్నాం. అలా తెలుసుకోగలిగినంత సమాచారం మనకి అందేలా చేయాలని భావించిన నాటి రుషులు అంతంతటి సమాచారాన్ని చిన్న చిన్న శ్లోకాల్లో పెట్టి మనకి అందించి ఉంచడం మరింత గొప్పదనం నిజంగా. వీటిప్రాముఖ్యాన్నీ ప్రాశస్త్యాన్నీ గమనించిన వాళ్లు కాబట్టే నాటి వారంతా నేటికాలంలో లాగా ఏ విధమైన దృశ్య– శ్రవణ మాధ్యమాలు లేకున్నా అలా నిత్యం పఠిస్తూ పఠింపజేస్తూ కేవలం నోటి ద్వారా చెవి ద్వారా మనందరికీ వాటిని సంప్రదాయపు ఆస్తి సుమా అంటూ అందజేసి వెళ్లారు. వీటిని పరిరక్షించుకో(లేని) పక్షంలో నిజమైన కళ్లున్న గుడ్డివాళ్లం అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మన మహాగణపతి మనకి ఎలా ఉండాలో, ఏయే గుణాలు మనకి అవసరమో ఆవశ్యకమో అద్భుతంగా తెలియజేశాడు తనని పఠిస్తుండే శ్లోకంలో ఇమిడిపోయి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదర శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః అష్టా వష్టౌ చ నామాని యః పఠే చ్ఛృణుయా దపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. వినాయకునిలో నుండి గ్రహించవలసిన గుణాలని చెప్పే నామాలు 8. వినాయకుని రూపాన్ని వర్ణిస్తూ ఆ రూపం ద్వారా ఆయన గుణ సౌందర్యాన్ని అర్థం చేసుకుంటూ కళ్లలో ఆయన రూపాన్ని నిలుపుకునేలా చేసే నామాలు 8. మొత్తం 16 నామాలు పై శ్లోకంలో ఉన్నాయి. ఈ విశేషాన్ని గుర్తించవలసినదిగా చెప్పేందుకే అష్టౌ అష్టౌ చ నామాని అని కనిపిస్తుంది శ్లోకంలో. రూపాన్ని వర్ణించదలచడం ప్రస్తుత వ్యాస శీర్షిక ప్రకారం అప్రస్తుతం కాబట్టి నేరుగా ఆయన గుణాలని గురించి వివరించుకుంటూ, ఇలాంటి గుణాలని మనం ఆయన నుండి నేర్చుకోవాలనే యథార్థాన్ని తెలుసుకుందాం! 1 సుముఖః సు– ముఖః అంటే ఎవరు ఏ కోరికను తన ముందుకొచ్చి చెప్పదలిచినా, మనసులో అనుకుంటున్నా ఆ అభిప్రాయాన్ని ఎంతో సుముఖునిగా ఉంటూ (వినాలనే ఆసక్తితోనూ, చెప్పేవానికి తప్పక తన పని తీరుతుందనే నమ్మకం కలిగేలాగానూ ఆ విషయాన్నంతటినీ వింటాడాయన. లోకంలో కొందరి దగ్గరకు పోయి ఏదైనా చెప్పుకోదలిస్తే, ఏదో పరాకుగా వింటూనో మధ్యమధ్యలో ఎవరినుండో వచ్చిన మాటల్ని వింటూనో ఆ మధ్య మధ్యలో ‘ఏం చెప్పా?’వంటూ అడుగుతూనో వినే మనుషులుంటారు. అలాంటి వాళ్లకి వినాయకుడు చెప్తాడు– వినదలిస్తే సుముఖునిగా ఉండి విను. లేదా తర్వాత వింటానని చెప్పు తప్ప వింటున్నట్టుగా వినకుండా ఉండటం సరికాదని. సు–ముఖః అనే పదంలో ముఖమనే మాటకి చక్కని నోరు కలవాడనేది కూడా అర్థం. అందుకే ముఖం కడిగావా? అనే వాక్యానికి దంతధావన చేశావా? అనేదే అర్థం. ‘నీ మొహం అంటాం. అంటే నోటితో చెప్పే ఆ మాటలెంత పేలవంగా ఉన్నాయో గుర్తించు!’ అని చెప్పడం దాని భావం. ఇలా ముఖమనే మాటకి నోరు అనేదే అర్థం. వినాయకుడు చక్కని నోరు కలవాడనేది దీనర్థం. నోటితో సంభాషిస్తాం కాబట్టి నొప్పించకుండా మాట్లాడేవాడనేది ఈయనకున్న మరో చక్కని గుణమన్నమాట. ఎందరిలోనో కొరవడేది ఇదే కదా!కాబట్టి ‘సుముఖ’ నామం ద్వారా ఎవరేది తనకి చెప్పుకోదలిచి ఏదైనా చెప్పదలిచి వచ్చినా – తల్లి తన బిడ్డ తన దగ్గరకొచ్చి ఏదో చెప్పదలిచి వస్తే – ఎలా వింటుందో అలా వినాలన్నమాట. రెండవది దానికి సమాధానాన్ని కూడా అతని కష్టం. తీరేలాగా చక్కని శైలిలో చక్కని స్వరంలో చెప్పాలన్నమాట. ఆయన నోటి నుండి అంతా విన్నాక ‘ఆ మాటొచ్చింది. చాలు’ అనుకున్నానని అంటుంటామే! అలా మాట్లాడుతాడన్నమాట గణపతి. ఆ గుణం మనకి రావాలని ఆయన చెబుతున్నట్లుగా ఆయన నామాన్ని బట్టి మనం గ్రహించాలి. 2 ఏక+దంతః గజ ముఖం కలిగిన ఆయనకి నిజంగా 2 దంతాలుండాలి. వ్యాసుడంతటివాడు భారత గ్రంథమంతనీ తన బుద్ధిలో నిలుపుకుని ‘నేను చెప్తూంటే రాయగల బుద్ధిమంతుడెవరా?’ అని బ్రహ్మ గురించి ప్రార్థిస్తే ఆయన గణపతి పేరుని చెప్పాడు. గణపతిని ప్రార్థిస్తే ఆయన – తప్పక రాస్తాను. అయితే నా రాత వేగానికి సరిపోయేలా నువ్వు కవిత్వాన్ని చెప్పా–లనే నియమాన్ని పెట్టాడు. (...భవేయం లేఖకోహ్యహమ్). దాన్ని విని వ్యాసుడు మరో నియమాన్ని పెడుతూ – ‘నేను చెప్పే ప్రతి అక్షరాన్నీ నువ్వు అర్థం చేసుకున్నాక మాత్రమే రాయాలి తప్ప ఏదో యథాలాపంగా రాయకూడ’దన్నాడు. (అబుద్ధ్వామా విఖ! క్పచిత్) వ్యాసుని నియమాన్ని వింటూనే మహాగ్రంథాన్ని రాయబోతే తప్ప తనంతటివానితో ఇలాంటి ఒప్పందాన్ని చేయనే చేయదలచడని భావించిన గణపతి ఆ రాయబోయే గ్రంథాన్ని తన చేతులతో బిగించడం కోసం తన దంతాన్నే పెరికి (పెకలించి) గంటంగా చేసి మరీ రాశాడు.దీన్ని గమనిస్తూ మనమూ అర్థం చేసుకోగలగాలి. మన శరీరంలోని ఏ అవయవమైనా అవతలివానికి సహాయపడేలా చేయాలని. దధీచి మహర్షి తన వెన్నెముకని రాక్షస వధ కోసం ఇంద్రునికి వజ్రాయుధంగా చేశాడంటేనూ, అలర్కుడనే మహారాజు తన కన్నుల్ని దానం చేశాడంటేనూ... ఇలాంటివన్నీ దీనికుదాహరణలే. మరి మన స్థాయిలో మనం చేదోడు వాదోడు (పనిలో సహాయపడటం – మాట సహాయం చేయడం)గా ఉండగలిగితే చాలు. నిందని ఎదుటివాళ్ల మీద నెట్టేలా సముఖంలో మాట్లాడటం, చాటున చాడీలు చెప్పడం వంటివి మానేస్తే చాలు. ఒక్కొక్కరికి ఓ వింత వ్యాధి ఉంటూంటుంది. ఈ రోజు ఆకాశానికెత్తెయ్యడం, రేపటి రోజున పాతాళంలోకి పడేస్తూ పదిమంది మధ్య అవమానించడం. ఇదుగో ఇలాంటివన్నీ మానాలని చెప్పడం దీని భావం. శరీరావయవాలన్నీ ఎదుటివారికి తోడ్పడేలా చేయగలగాలి. 3 కపిలః రెండు రంగులు కలిసిన తనాన్ని ‘కపిల’మంటారు. ఇటు శివ లక్షణమూ అటు విష్ణు విధానమూ కలిగినవాడు కాబట్టి కపిలుడు (శుక్లాం బరధరం విష్ణుమ్... కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా!) దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరైనా నేరాన్ని చేస్తే ‘వాడు మనవాడా? మనకి ఉపయోగపడేవాడా?’ అని ఈ తీరుగా లెక్కించి తప్పుచేసినా రక్షించదలిచే (రావణుడికి కుంభకర్ణునిలా) చేయరాదనీ శిక్షించే తీరాలని చెప్తుంది ఒక పద్ధతి. అదే తీరుగా ధర్మబద్ధంగా పనిచేస్తూ ఉండేవాణ్ని మెచ్చుకోవడమే కాక వానికి కొంత వెసులుబాటుని కల్పించాలని కూడా దీని భావంగా అర్థం చేసుకోవాలి! 4 గజకర్ణికః ఏనుగు చెవులే తనకి చెవులుగా కలవాడనేది పై అర్థం. ఏనుగుకున్న లక్షణాల్లో రెండు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. అంత ఎత్తున్న ఏనుగుకున్న ఆ చిన్న కళ్లు నేలమీద పడ్డ సూదిని కూడా గుర్తించగలవు.అలాగే ఆ చెవులు దూరంగా పాము బుసకొడుతూంటే వినగలిగినంతటి శక్తిమంతమైనవి. చెవుల వరకే దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరు మన ప్రవర్తన గురించి తేడాగా అనుకుంటున్నారో గమనించుకుంటూ ఉండాలి. లోకం నుండి అపవాదు వస్తుందేమో అనే భయంతో మన ప్రవర్తన ఉండాలి తప్ప ‘ఎవ్వరేమనుకున్న నాకేమి సిగ్గు?’ అన్నట్టుగా ఉంటే పశువుకీ వీనికీ భేదం లేనట్టే. ఇక ఏనుగు తన చెవుల్ని నిరంతరం ఆడిస్తూనే ఉంటుంది. ఇదే తీరుగా అధికారికి ఎందరెందరో ఇచ్చకాలు పలుకుతూ పొగిడేస్తూ దగ్గరైపోతుంటారు. మరోపక్క గిట్టనివారి మీద చెప్పేస్తూ వ్యతిరేకతని నూరిపోస్తూ ఉంటారు. అంటే వేటిని వినాలో వేటిని వినకూడదో గమనించుకోవాలి తప్ప చెవికి చేరిన అన్నిటినీ నమ్మడం సరికాదని. 5 లంబోదరః పెద్ద బొజ్జ ఉన్నవాడనేది దీనిపై అర్థం. ‘లంబ’మనే మాటకి వేలాడుతున్న (లంబమానః) అనేది సరైన అర్థం. బొజ్జ మరింతగా అయినప్పుడు కిందికి వేలాడుతూ ఉంటుంది.‘నా కడుపులో ఎన్నో రహస్యాలని దాచుకున్నా’నంటుంది తల్లి. అలా రహస్యాలెందరు తనకొచ్చి చెప్పినా వాటికి తన పైత్యాన్ని కూడా జోడించి ప్రచారం చేయడం కాకుండా ‘కడుపులో దాచుకోగలగడ’మనే గొప్ప లక్షణాన్ని అలవర్చుకోవాలనేది గణపతి మనకి చెప్తున్నాడన్నమాట! 6 వికటః కటమంటే చెక్కిలి. ఏనుగు రూపం అయిన కారణంగా ఏటవాలుగా అయి దృఢంగా అయిన చెక్కిలి కలవాడనేది దీనర్థం. దీన్ని మనకి అన్వయించుకుంటే చెక్కిలి (కటం) అనేదే వ్యక్తి చెప్పదలిచిన అభిప్రాయాన్ని చెప్పించగల ముఖ్య అవయవం ముఖంలో. అందుకే ఆంజనేయుడికి ‘హనుమాన్’ చక్కని హనువులు కలవాడనే పేరు. ఏ పదం తర్వాత ఏ పదాన్ని పలకాలో, ఎంతగా ఊది ఏ పదాన్ని పలకాలో దేన్ని తేల్చి పలకాలో, ఏ మాటని ముందు చెప్పి తర్వాత దేన్ని పలకాలో ఆ విశేషాన్ని వివరించేది ఈ నామం. మనం కూడా స్పష్టంగా అవగాహనతో నిదానించి మాట్లాడాలనే గుణాన్ని గ్రహించాలన్నమాట. 7 విఘ్నరాజః ప్రారంభించబడ్డ పని – ఇక ఎప్పటికీ ముడిపడనే పడ–దన్న రీతిలో వచ్చిన అభ్యంతరాన్ని విఘ్నమంది శాస్త్రం. (ప్రారబ్ధం కర్మ విశేషేణ ఘ్నంతీతి విఘ్నః) అలాంటి విఘ్నాలకి రాజు ఆయన అని అర్థం.రాజుకి చతురంగ బలాలు (పదాద్రి–అశ్వ–గజ–రథ) ఉన్నట్లే విఘ్నాలని తొలగించేందుకై నాలుగు విధాలుగా ప్రయత్నించడం నలుగురి సహాయాన్ని అర్ధించడం నాలుగు చోట్లకి వెళ్లి విచారించి ఆ విఘ్నాన్ని తొలగించుకోవాలి తప్ప విఘ్నం వచ్చిందనుకుంటూ దుఃఖిస్తూ ఉండిపోవడం సరికానిదని గణపతి చెప్తున్నాడన్నమాట! 8 గణాధిపః యక్ష కింనర కింపురుష గంధర్వ విహంగ నాగ రాక్షస దేవ... మొదలైన అన్ని గణాలకీ అధిపతి అనేది దీనర్థం.లోకంలో ఏ ఒక్కరూ శత్రువంటూ లేనివాళ్లుండరు. కాబట్టి ఏక–గ్రీవంగా (ముక్తకంఠంతో) ఎన్నుకోవడమనేది అసాధ్యమైన అంశం. అయితే వినాయకుడు మాత్రం సర్వగణాధిపతి కాగలిగాడంటే దాని ద్వారా ‘అందరూ మెచ్చుకునే తీరులో తన ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ నడుచుకోవాలనే గుణాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట.మరో విశేషమేమంటే పైన కనిపిస్తున్న అన్ని గుణాలవీ ఒకే తీరు లక్షణం కలవి కావు. ఎవరి తీరు వారిది అయితే అలాంటి భిన్న భిన్న లక్షణాలున్న అందరినీ ఒకే తీరుగా అంగీకరించేలా చేసి ఆధిపత్యాన్ని సాధించగలిగాడంటే ఆ తీరుగా అధికారి ఉండాల్సిందేనని చెప్తున్నాడన్నమాట గణపతి.తనకి తగిన శక్తి లేకపోయినా తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తూ నారాయణాష్టాక్షరీ మంత్ర మననం చేస్తూ విజయాన్ని సాధించగలిగాడు కాబట్టీ, గణాధిపుడు ఆ కారణంగానే కాగలిగాడు కాబట్టీ అధికారికి ఉండాల్సింది దైవ విశ్వాసమూ తన తల్లిదండ్రుల మీద గౌరవమున్నూ – అని గణపతి తెలియజేస్తున్నాడన్నమాట! ఇలాంటి 8 గుణాలలో సంవత్సరానికొకటి చొప్పున అయినా పొందగలిగే ప్రయత్నాన్ని ప్రారంభిస్తే వ్యక్తిలో మార్పు సంభవం అవుతుంది. లేని పక్షంలో పూజావస్తువులు కొన్న మూల్యం, పూజ చేసిన కాలం దండగ అవుతాయి. కాలక్షేప పూజే అవుతుంది!ఈ 8 గుణాలనీ అర్థం చేసుకున్నాక ఈ మొత్తం మీద మనకి అర్థమయ్యే మరో గుణం – దాన్ని 9వ గుణం అనుకోవచ్చు – గురించి అనుకుందాంగణాధిపత్యాన్ని పొందడానికి – ఎవరు అన్ని నదీ నద సముద్ర జలాల్లో స్నానం చేసి వస్తే వాళ్లు అర్హు–లనేది విషయం. ఈ మాటని వింటూనే సన్న శరీరం వాడూ, నెమలి వాహనం వాడూ అయిన కుమారస్వామి వాయు వేగంతో ఆకాశంలోకి దూసుకుపోతూంటే వినాయకుడు అసూయపడలేదు. తమ్మునికి పరాజయం లభించేలా శపించవలసిందనో అనుకూలత లేకుండా చేయవలసిందనో ప్రార్థించలేదు – లేదా – తనకి తానే ఓ మంత్రాన్ని మననం చేయడం చేయలేదు.మనకి అసాధ్యమైన పనిని మరొకరు చేస్తూంటే దాన్ని చెడగొట్టించుదాం – చెడగొడదామనే ఆలోచన లేకపోవడాన్ని నేర్చుకోవాలి గణపతి నుండి. తనకి ఆ పదవి ఎలాగైనా లభించేలా ఏ అకృత్యాన్నో చేయవలసిందని అనలేదు – తల్లిదండ్రుల్ని తూలనాడలేదు. గమనించుకోవాలి. లోకంలో ఎందరో చేసే సర్వసాధారణమైన పని ఇదే.వినాయకుడు చేసింది – తన అçశక్తతని అంగీకరిస్తూ తల్లిదండ్రుల దగ్గరికి మౌనంగా వెళ్లి కన్నీరు పెట్టడం. అంటే ఏమన్నమాట? గుండె నిండు దుఃఖానికి మన అశక్తత గాని కారణమయ్యుంటే, ఆ బాధ నుండి తాము బయటపడాలంటే శత్రువుని ఓడించడం, ఓడించే ప్రయత్నాలని ఇతరుల ద్వారా చేయించడం, తనవాళ్లని నిందించడం కాదు – కనిపించే దైవాల్లా ఉండే తల్లిదండ్రుల్ని ఆరాధించడమే అని చెప్తున్నాడన్నమాట! ఎంత గొప్ప ఉపాయం ఇది! ఎవరైనా తమ తల్లిదండ్రులకి గౌరవాన్నిస్తూ చూసుకుంటూ ఉంటే – వీళ్లెవరో తనలాగా తల్లిదండ్రుల పట్ల గౌరవం కలవాళ్లనే అభిప్రాయంతో విజయాన్నిస్తాడన్నమాట! ఎంత గొప్ప గుణం అది!! – డా. మైలవరపు శ్రీనివాసరావు పౌరాణిక ప్రవచకులు -
పైసా వసూల్ !
సాక్షి, అమరావతిబ్యూరో : వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా తాత్కాలిక పందిళ్లు వేసుకునేందుకు పైసలిస్తేనే అనుమతులు అన్న ధోరణిలో జిల్లాలో అడ్డగోలు దందాకు ప్రభుత్వ శాఖలు తెరదీశాయి. విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా వేలాది ఉత్సవ విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు అత్యంత నిష్టతో జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా ఘనంగా జరుపుకోవడమే ఇటు పోలీసులకు, అటు అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీ/మున్సిపాలిటీ సిబ్బందికి వరంగా మారింది. అనుమతులు ఇచ్చే పేరిట ఒక్కో శాఖ ఒక్కో తీరున ప్రజల నుంచి పండుగ మామూళ్లను దండుకుంటున్న వైనం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. పంచాయతీలో ఫీజు తక్కువ..బాధుడు ఎక్కువ సాధారణంగా వినాయక ‘విగ్రహ ప్రతిష్ట పందిళ్లు’ ఏర్పాటు చేసుకోవడానికి, ఊరేగింపునకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు దరఖాస్తు పెట్టే ముందుగా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ నుంచి పంచాయతీ అయితే పంచాయతీ కార్యాలయంతో పాటు అగ్నిమాపక, విద్యుత్ శాఖల నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. ఇదే అదనుగా ఆయా శాఖలు నిర్వాహకుల నుంచి ముక్కుపిండి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ నుంచి పందిళ్ల ఏర్పాటు కోసం ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పంచాయతీకి రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఎన్ఓసీ కోసం రూ.100తో పాటు మరో రూ.500 చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి. లేదంటే కొర్రీలతో ఇబ్బందులు పెడుతున్నారు. అగ్నిమాపక శాఖ అడిగినంత ఇవ్వాల్సిందే.. పండుగకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదే సందర్భంలో వినాయక విగ్రహలు ఉంచే పందిళ్లు కూడా ఎలాంటి అగ్ని ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ నియమ నిబంధనలకు లోబడి ఈ పందిళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పందిళ్ల ఏర్పాటు సమయంలో ఈ శాఖ నుంచి కూడా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడే అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలంటే అడిగినంతా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం విజయవాడ సెంట్రల్ జోన్ పరిధిలో ఉండే ఓ అగ్నిమాపక శాఖ కార్యాలయ సిబ్బంది దరఖాస్తుకు రూ.వెయ్యి డిమాండ్ చేయడం గమనార్హం. రూ.వెయ్యి ఇవ్వకుంటే అనుమతులు ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పడంతో చేసేదీ లేక దాదాపు 40 మందికిపైగా మామూళ్లు ఇచ్చి అనుమతి పత్రాలు తీసుకెళ్లినట్లు తెలిసింది. విద్యుత్ శాఖది అదే తీరు.. తొమ్మిది రోజులు నిర్వహించే ఈ ఉత్సవాలకు విద్యుత్ శాఖది కీలక పాత్ర. ముఖ్యంగా చాలా చోట్ల ఈ పందిళ్లు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలుగొందేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం ఏకంగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. వాస్తవానికి విద్యుత్ శాఖకు ఓ వెయ్యి ఓల్టుల విద్యుత్తు కోసం అనుమతి తీసుకోవాలంటే రూ.100 చలానా, మీ సేవా సెంటర్కు రూ.45, వెయ్యి ఓల్టుల విద్యుత్తు వాడకానికి గానూ రూ.2,250 చెల్లించాలి. ఆ మొత్తం చెల్లించినా ఒక్కో దరఖాస్తుదారుడు పందిళ్ల ఎత్తు తదితరాలను బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు మళ్లీ అదనంగా సమర్పిస్తేనే అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు మామూళ్లు సరేసరి.. పందిళ్ల వద్ద మైక్ సెట్టు, ఊరేగింపు తదితరాలకు పోలీసు శాఖ నుంచి అనుమతి పొందాలి. ఈ అనుమతుల కోసం మైక్ కోసం రోజుకు రూ.100, ఊరేగింపు రోజున రూ.250 చెల్లించాలి. మిగిలిన శాఖలతో పోలిస్తే పోలీసు శాఖ వసూలు చేస్తున్న మొత్తం చాలా చిన్నదనే చెప్పాలి. కానీ అనుమతుల మాటున ఎంతెంత మామూళ్లు వసూళ్లు చేస్తున్నారని తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రాంతం.. నిర్వాహకులను బట్టి ఒక్కో పందిరికి రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఊరేగింపునకు మరో రేటు. రూ. లక్షల్లో దోపిడీ.. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 2 వేలకు పైగా విగ్రహాలు ఏర్పాటు చేస్తే విజయవాడ నగరంలో 1,350 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఈ సంఖ్య 4 వేలకు చేరుకుంటుందనే అంచనా. ఇలా ఒక్కో పందిరికి నాలుగు శాఖలు కలిపి సగటున రూ.3 వేలు మామూళ్ల రూపంలో వసూలు చేసినట్లయితే మొత్తం 4 వేల పందిళ్లకు రూ. 1.20 కోట్ల వరకు దోపిడీకి అవకాశముందని తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులు సిఫార్సులు వల్ల అనుమతులన్నీ టీడీపీ వర్గీయులకు ఇవ్వడం జరుగుతుందన్న ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా మైలవరం, జగ్గయ్యపేట, బందరు, పెనమలూరు నియోజవర్గాల్లో టీడీపీ నాయకుల హవా నడిచినట్లు సమాచారం. ఇక్కడ కూడా భారీగా దండుకున్నట్లు తెలుస్తోంది. -
దేవదాస్ : వినాయక చవితి స్పెషల్ సాంగ్
కింగ్ నాగార్జున, యంగ్ హీరో నాని హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. వైజయంతీ మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్, లిరికల్ వీడియోలతో సందడి చేస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా మరో సాంగ్ను విడుదల చేశారు. మా పండుగ కొంచెం ముందే మొదలయ్యింది అంటూ లక లక లకుమీకర లంభోదర అంటూ సాగే వినాయక చవితి పాటను రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
వినుమా వినాయక సినిమా కోరిక
కోరిన కోరికలు తీర్చేవాడు సిద్ధి వినాయకుడు.ఆ కోరికలు విఘ్నాలు రాకుండా చూసే వాడు విఘ్న నాయకుడు.దేవుడి ఎదుట కోరినా, తెర మీద కోరినా కోరికలు కోరికలే.కొన్ని సినిమా కోరికలు చిత్రంగా ఉంటాయి.చూసేవాళ్లలో చోద్యం కలిగిస్తాయి. విజయానికి ‘కీ’గా మారిన సినీ కోరికలు ఇవి. చదువులు కావాలంటే ఇస్తావు. స్కూటర్ కొనిపెట్టమంటే పెడతావు. ఫలానా పొరుగమ్మ మెడలో ఉన్నట్టున్న మామిడి పిందెల గొలుసు కావాలంటే పోనీలే పాపం అని ప్రసాదిస్తావు. కొడుకును అమెరికా పంపించమంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా శాంక్షన్ చేసి శాన్ప్రాన్సిస్కో ఫ్లయిట్ ఎక్కిస్తావు. చిన్న చాక్లెట్ కావాలన్నా పెద్ద మినిస్టర్ పోస్ట్ కొట్టాలన్నా ఆ కోరికలన్నీ తీర్చల్సిన దేవుడివి తీర్చే దేవుడివి నీవే.వినాయకునివే. సిద్ధి వినాయకునివే.ప్రతి మనిషిలో కోరికలు కామన్. సినిమాల్లో కోరికలు కోరుకునే క్యారెక్టర్లూ కామన్. కాని అన్ని సినిమాలు ఒక్కలా ఉండవన్నట్టే అన్ని కోరికలూ వొక్కలా ఉండవు. ఈ సినీ వింత కోరికలు నీకు గుర్తున్నాయా స్వామీ. ఈ కోరికలే కాసులు కురిపించాయి కదా స్వామీ. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడని తెలిస్తే ‘చేసుకో అనో.. చేసుకోవద్దు’ అనో తండ్రి అంటాడు. ‘బొమ్మరిల్లు’ సినిమాలో కూడా తండ్రి ప్రకాష్రాజ్ తన కొడుకు సిద్ధార్థ ప్రేమ సంగతి విని ఆ మాటే అంటాడు.దానికి సదరు పుత్రరత్నం తిరగబడాలి. లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయి కోరిన ఆర్యసమాజ్లో ఆర్భాటం లేకుండా మూడుముళ్లు వేసి ఆటో ఎక్కి అద్దె పోర్షన్కు చేరుకోవాలి.కాని కొడుకు ఒక వింత కోరిక కోరుతాడు.‘ఆ అమ్మాయిని తెచ్చి వారం రోజులు ఇంట్లో పెడతాను. నీకు నచ్చేలా చేస్తాను. ఛాన్స్ ఇవ్వు నాన్నా’ అంటాడు.ఇలాంటి కోరిక ఇంతకు ముందు నిజ జీవితంలో ఎవరూ కోరలేదు.సినిమాలోనూ కోరలేదు.అందుకనే ఈ కోరిక పండింది. బాక్సాఫీస్ బొజ్జ కలెక్షన్లతో నిండింది. అదేం చిత్రమో ప్రేమ అనేసరికి వింత వింత కోరికలే వస్తాయి. ‘మరో చరిత్ర’లో అరవ బాలు కమలహాసన్, తెలుగు స్వప్న సరిత ప్రేమించుకోలేదూ? వాళ్లు మరో మాట లేనట్టుగా పెళ్లి చేసుకుంటాము మొర్రో అంటే పెద్దలు కోరిన వింత కోరిక ఇంతకు మునుపు విన్నామా కన్నామా? ‘మీరిద్దరు సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకూడదు. మాట్లాడుకోకూడదు. లవ్ లెటర్స్ రాసుకోకూడదు. ఇలా చేసిన తదుపరి కూడా మీలో ప్రేమ ఉన్నచో అప్పుడు పెళ్లి’ అంటారు. ఈ కోరిక విని అంత పెద్ద దేవుడుని నీవు కూడా కలవర పడి ఉంటావు కదూ. ఏవో పూజలు చేస్తే వ్రతాలు చేస్తే ఫలితంగా సిరిసంపదలు కోరుకుంటే వాటిని నువ్వు నెరవేరుస్తే అర్థముంది. స్ట్రయిట్ కోరికలకు స్ట్రయిట్ రిజల్ట్సు. కాని ‘లేడిస్ టైలర్’లో బట్టలు కొట్టే సుందరం కోరుకునే కోరిక ఏమిటి? ‘తొడ మీద రూపాయి కాసంత పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని చేసుకోవాలని’ కదూ. అదేం కోరిక. అట్లాంటి అమ్మాయిని ఎలాగని వెతికేదిక. సెర్చ్ వారెంట్ తీసుకొని బయలుదేరితే అరెస్టు వారెంటు వస్తుందే. చివరకి అతడికి అలాంటి అమ్మాయిని ఇవ్వకనే నువ్వు బుద్ధొచ్చేలా చేస్తావు. దారిలో పెడతావు. అంతేనా? మరుజన్మలో అతడే ‘ఆ ఒక్కటి అడక్కు’లో హస్తరేఖను నమ్ముకొని సంవత్సరం తర్వాత నేనే కింగ్ని అని విర్రవీగితే అలాంటి వెర్రి కోరికతో కలలు గంటూ కూర్చుంటే నష్టమేనని శ్రమ కంటే మించిన వరం లేదని తెలిసొచ్చేలా చేసి ట్రాక్ ఎక్కిస్తావు. సరే. ‘ఏప్రిల్ ఒకటి విడుదల’లో ఇతని గర్ల్ఫ్రెండ్ కోరిన కోరిక చాలా తమాషా. నోరు తెరిస్తే అడ్డమైన అబద్ధాలు కూసే ఇతణ్ణి దారిలో పెట్టడానికి స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి సైన్ చేయించి ‘నెల రోజులు పాటు ఒక్క అబద్ధం చెప్పకూడదని’ కోరితే ఆ కోరికలోంచి కోటి నవ్వులు పుట్టడం ఈ సందర్భంగా గుర్తు చేసుకుని నవ్వుకోవాలిలే. అసలు ఈ వింత కోరికలు కోరే జాడ్యం మన హీరోలకు ముందు నుంచీ ఉంది. రాజ్యాభిషేకం చేస్తూ నీ కోరిక ఏమిటి నాయనా అని ‘జగదేక వీరుని కథ’లో ఎన్టీఆర్ను ముక్కామల అడిగితే ‘మీ పాద సేవ చేసుకోవడలై తండ్రీ’ అని అనకుండా అతడు గొప్పలు పోతూ ‘వెన్నెల రాత్రిలో కలువపూల పాన్పు మీద తాంబూలం సేవిస్తూ ఉంటే ఒక చెంత ఇంద్ర కుమార్తె, మరో చెంత వరుణ కన్య, కనుల ముందు నాగకన్య, ఎదుట నాట్యం చేస్తూ అగ్నికూమారి’ఇలా నలుగురు సావాసకత్తెలు కావాలనే వింత కోరిక కోరి నీ దయ వల్ల క్లయిమాక్స్ సమయానికి ‘శివశంకరీ’ పాడి సాధిస్తాడనుకో. అక్కినేని మాత్రం తక్కువ తిన్నాడా. ‘తెనాలి రామకృష్ణ’లో మీ అమ్మ కాళికాదేవి దయతలిచి ఒక గిన్నెలో పాల రూపంలో ‘జ్ఞానం’, మరో గిన్నెలో పెరుగు రూపంలో ‘ధనం’ ఇచ్చి ఏది కావాలో కోరుకో అంటే చిటికెలో రెండూ మిక్స్ కొట్టి తాగి ‘నాకు రెండూ కావాలి ఇవ్వు’ అని రెటమతం కోరిక కోరితే ఆమెకు తిక్కరేగి ‘వికటకవిగా మిగులుతావు పో’ అని శపిస్తే ఆ వికటత్వంలో నీకెంతో ఇష్టమైన హాస్యాన్ని ఆ మహా కవి పుట్టించాడు కదా స్వామీ. ఆ నవ్వులు నేటికీ తలుచుకుంటున్నాము. అందుకు నీకు ఎన్ని అహ్హహ్హలూ ఓహ్హొహ్హోలు చదివించాలో. సరే పోనీ... నిన్న మొన్న ‘బాహుబలి’లో ఏమైంది. ‘నేను ప్రేమించిన దేవసేనను నాకే ఇవ్వు రాజమాతా’ అని శివగామి విఎఫ్ఎక్స్ ఎలివేటెడ్ కళ్లలోకి బాహుబలి సూటిగా చూస్తూ కోరితే ఆమె ఏమి కోరింది.‘నీకు రాచపదవి కావాలా? ఆ దేవసేన కావాలా తేల్చుకో’ అని ఎదురు కోరింది. కోరికకు కోరికే సమాధానం అయినప్పుడు బాహుబలి దేవసేన చిటికెన వేలినే చటుక్కున పట్టుకున్నాడు రాజ్యం పోతుందన్న చీకూ చింత చీమంతైనా లేకుండా. అందుకే సాహోరే బాహుబలి అనిపించుకున్నాడు. ఇలాంటి సీరియస్ కోరికలే కాకుండా గిలిగింతలు పెట్టే సిల్లీ కోరికలు కూడా ఉంటాయనుకో. ‘పడమటి సంధ్యారాగం’ సినిమా గుర్తుందిగా. అందులో ఐస్క్రీమ్ పార్లర్ ఆసామికి పుట్టిన బకాసురుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దొరికే అన్ని ఆహార పదార్థాల మీదా దాడి చేసి గుటకాయ స్వాహా చేస్తుంటే ఆ తండ్రి కోరే కోరిక ఏమిటో తెలుసా? ‘కులాసా అని ఎవరైనా అడిగితే కులాసే. అంటే కుమారుడి వల్ల లాసు’ అని జవాబు చెప్పే పరిస్థితి కల్పించవద్దని. ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మి కోరిక కూడా చిన్నదే. ‘నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా’ అని వ్రాసే ఆమె యొక్క కవితా ఖండికల్ని అచ్చులో చూసుకోవాలనేగా.‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో అలీ కోరిక కూడా చిన్నది. ‘ఎంద పరంద ఇన్న చేటా’ అంటూ అతడు బ్యాంకు మేనేజర్ బ్రహ్మానందం చుట్టూ తిరిగి అర్థం కాని భాషలో కోరే కోరిక ఒక్కటే –‘చేటల వ్యాపారం చేసుకుంటాను. లోను ఇమ్మని’.స్వామీ. సినిమాల్లో ఎన్నో కోరికలు చూశాము.ఆ కోరికలు తీరుతుంటే సంతోషపడ్డాము.కాని కొన్ని కోరికలు మాత్రం నువ్వు తీర్చనందుకు కొంచెం నిష్టూరం కూడా ఉంది. ‘అంతులేని కథ’లో పెళ్లి చేసుకుని స్థిరపడదామనుకున్న జయప్రద కోరిక నువ్వు తీర్చలేదు. నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో ఢిల్లీలో డాన్స్ చేయాలన్న కమలహాసన్ కోరికను ‘సాగర సంగమం’లో నువ్వు తీర్చలేదు. భర్త చనిపోయాక పిల్లలను తానుగా చూసుకుందామనుకున్న మాధవి కోరికను ‘మాతృదేవోభవ’లో నువ్వు తీర్చలేదు. అన్న ఆది పినిశెట్టిని నాయకుడిగా చూసుకోవాలనుకున్న తమ్ముడు రామ్చరణ్ కోరికను ‘రంగస్థలం’లో నువ్వు తీర్చలేదు. లేటెస్టుగా ‘కేరాఫ్ కంచరపాలెం’లో ముప్పై అడుగుల నీ బొమ్మను తయారు చేసి మార్కులు కొట్టేయాలనుకున్న నత్తి రామ్మూర్తి కోరికను నువ్వు తీర్చలేదు. ఇక మీదట సినిమాల్లో ఏ కోరికకూ విఘ్నం కలిగించవద్దు. అవిఘ్నంగా సినిమా కోరికలన్నీ తీరే వరం ప్రసాదించు స్వామీ. -
జీవితాంతం వినాయక విగ్రహాల పంపిణీ
చిత్తూరు, శ్రీకాళహస్తి రూరల్ : తాను బతికినంతకాలం ఏటా వినాయక చవితి సందర్భంగా ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తానని పర్యాటక శాఖ జాతీయ మాజీ డైరెక్టర్ తురిమెళ్ల సురేంద్రకుమార్రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 13న వినాయక చవితిని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని ముచ్చువోలులో విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 22 ఏళ్లుగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పట్టణాలు, గ్రామాల్లో విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మూడు విగ్రహాలతో ప్రారంభించి నేడు 1,500 విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా నిరుపేదలు తమ గ్రామాల్లో వినాయక చవితి జరుపుకోవాలంటే విగ్రహాన్ని కొనే స్థోమత ఉండదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. రశీదులు తీసుకున్న గ్రామస్తులు ఈ నెల 11న తిరుపతి ప్రాంతంలోని మంగళం సమీపంలో విగ్రహాలను తీసుకోవాలని కోరారు. విగ్రహాల కోసం వచ్చే వారికి అన్నదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ సురేంద్రరెడ్డి చేపట్టిన కార్యక్రమం మహోన్నతమైందని కొనియాడారు. రష్ ఆసుపత్రి అధినేత సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ ఎంతో మంది డబ్బులు సంపాదిస్తారే కాని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అరుదన్నారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కార్యదర్శి పోతుల రాజ్కుమార్ మాట్లాడుతూ భావితరాల వారికి మన ఆధ్యాత్మిక సంపదను తెలియజేయటానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన బీఎస్పీ నాయకుడు వెంకటరామారావు, రూరల్ సీఐ సుదర్శన్ప్రసాద్, శుకబ్రహ్మాశ్రమం మేనేజర్ ఈశ్వర్స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ ‘గణేశ్’!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వాస్తవంగా సాధారణ సమయంలోనే నగర పోలీసులకు గణేశ్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడం ఓ సవాల్. ఇదే సమయంలో అటు పదోన్నతులు, ఇటు ఎన్నికల ఎఫెక్ట్తో ఇన్స్పెక్టర్లు భారీ సంఖ్యలో బదిలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్వాల్ అంజనీ కుమార్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. గతానికి భిన్నంగా జోన్ల వారీగా ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఎస్సైలకూ భాగస్వామ్యం కల్పిస్తూ వారి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు జవాబుదారీతనం పెంచుతున్నారు. ఇప్పటికే సెంట్రల్ జోన్కు పూర్తి కాగా ఆదివారం కొత్వాల్ దక్షిణ మండల అధికారులతో భేటీ అయ్యారు. బషీర్బాగ్లోని కమిషనరేట్లో జరిగిన ఈ సమావేశంలో నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ అధికారులూ పాల్గొన్నారు. గతంలో ఒకే సమావేశం... ‘గణేశ్’ సన్నాహాల్లో భాగంగా ప్రతి ఏడాది పోలీసు విభాగానికి సంబంధించి కొత్వాల్ ఒకే సమావేశం నిర్వహిస్తుంటారు. ఇందులో కీలక ఆదేశాలు జారీ చేసిన తర్వాత జోన్ల వారీగా ఆయా డీసీపీలు ఎస్సై తదితర స్థాయి అధికారులతో సమావేశం అవుతుంటారు. అయితే ఈసారి పదోన్నతులు, బదిలీల ఎఫెక్ట్ భారీగా ఉంది. ఇటీవల ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీలుగా నగరానికి చెందిన దాదాపు 20 మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) పదోన్నతి పొందారు. దీనికి తోడు ఎన్నికల వేడి నేపథ్యంలో ఈసీ నిబంధనల ప్రకారం నిర్ణీత కాలం సిటీలో పని చేసిన ఇన్స్పెక్టర్లకు బయటకు పంపకం తప్పదు. ఈ సంఖ్య దాదాపు 100కు పైగా ఉంది. ఈ ఎఫెక్ట్ గణేష్ ఉత్సవాలతో పాటు మొహరం బందోబస్తుపైనా ఉండకూడదని కొత్వాల్ అంజనీ కుమార్ నిర్ణయించారు. దీనికోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ఒకే సమావేశానికి బదులు జోన్ల వారీగా సమీక్షలు చేస్తూ ఎస్సైలనూ వీటికి పిలుస్తున్నారు. ఎస్సై స్థాయి అధికారులు ఠాణాలోకి సెక్టార్స్కు నేతృత్వం వహిస్తుంటారు. ఈ చర్యలతో సెక్టార్ల వారీగా గణేష్ మండపాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అవుతోంది. ఒక్కో జోన్ తీరు ఒక్కోలా... వీటితో పాటు జోన్ల వారీగా సమావేశాలు నిర్వహించడానికి మరో కారణం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. నగరంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ పేర్లతో మొత్తం ఐదు జోన్లు ఉన్నాయి. దక్షణ మండలంలో సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువ. ఆపై తూర్పు, పశ్చిమ మండలాల్లోనూ ఈ ఛాయలు ఉంటాయి. ఉత్తర మండల వీటికి పూర్తి భిన్నం కాగా... హుస్సేన్సాగర్తో కూడిన సెంట్రల్ జోన్ నిమజ్జనానికి కేంద్రం. ఇలా ఒక్కో జోన్ తీరు ఒక్కోలా ఉండటంతో పాటు అక్కడి పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న కొత్వాల్ అక్కడి అవసరాలకు తగ్గట్టు చర్యలకు ఆదేశిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి మండపం పైనా పోలీసులకు పూర్తి పట్టు ఉండాలని, ఎస్సైలు స్వయంగా వెళ్ళి పరిస్థితులు గమనిస్తుండాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఫ్లాగ్ మార్చ్లు సైతం పోలీసు స్టేషన్ల వారీగా నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు కలిసి తమ పరిధిలో కాలినడకన తిరుగుతూ ఆ ప్రాంతంపై పూర్తి పట్టు సంపాదించడాన్నే ఫ్లాగ్మార్చ్ అని పిలుస్తారు. అతి చిన్న విషయాల పైనా దృష్టి... బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో భాగంగా పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రతి చిన్న అంశాన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. కేవలం మండపాలు, వాటి వద్ద పరిస్థితులే కాకుండా నిమజ్జనం జరిగే ప్రాంతాలు, ఆ మార్గాలనూ పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కోసారి రహదారిలో ఉన్న గుంతల కారణంగా లారీల్లో వస్తున్న విగ్రహాలు ధ్వంసం కావడం, తర్వాత ఇతర సమస్యలు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యలలోనే ఆయా సెక్టార్లలో నిమజ్జనానికి వచ్చే గణేషులు ప్రయాణించే మార్గాలు ఏమిటి? అక్కడి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలి? చెట్లు అడ్డంకిగా మారే అవకాశం ఉందా? ఇలాంటి ప్రతి విషయానికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా స్పష్టం చేశారు. నగర కమిషనరేట్లో మొత్తం 17 సబ్–డివిజన్లు, 60 ఠాణాలు ఉన్నాయి. డివిజన్కు ఏసీపీ, ఠాణాకు ఇన్స్పెక్టర్లు నేతృత్వం వహిస్తుంటారు. వీరు సైతం తమ పరిధిలో ఉండే జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయ, సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని కొత్వాల్ ఆదేశించారు. అసాంఘిక శక్తులతో పాటు రౌడీషీటర్ల పైనా కన్నేసి ఉంచాలని, అవసరమైన వారికి కౌన్సిలింగ్నిర్వహణ, బైండోవర్ చేయడం వంటివి చేపట్టాలని కొత్వాల్ ఆదేశించారు. ప్రతి కేసు పైనా ప్రత్యేక దృష్టి... కొత్వాల్ ఓపక్క గణేష్ సన్నాహక సమావేశంతో పాటు త్రైమాసిక నేర సమీక్షనూ నిర్వహిస్తున్నారు. ఎస్సైల వారీగా వారు దర్యాప్తు చేస్తున్న కేసుల వివరాలు, వాటి తీరు తెన్నుల్ని సమీక్షిస్తున్నారు. కేవలం నేరస్తుల్ని పట్టుకోవడంతో బాధ్యత పూర్తయి పోదని, దోషులకు శిక్షపడేలా చూడాలని స్పష్టం చేశారు. దర్యాప్తు, విచారణల్లో ప్రతిభ కనబర్చిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. దక్షిణ మండలంలో పని చేస్తూ కేసుల దర్యాప్తులో ఉత్తమంగా పని చేసిన ఎస్సైలను ఆదివారం కొత్వాల్ అంజనీ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు టి.మురళీకృష్ణ, షికా గోయల్, డీసీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వ వినాయకమ్
సెప్టెంబర్ 13 వినాయకచవితి సనాతన సంప్రదాయం ప్రకారం ఏ పూజలు చేపట్టినా, ఏ యజ్ఞ యాగాదులు చేపట్టినా వినాయకుడికే తొలిపూజ చేసి, ఆ తర్వాత మిగిలిన క్రతువులను కొనసాగించడం ఆనవాయితీ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు ప్రమథ గణాలకు ఆధిపత్యం పొందినందున గణపతిగా, విఘ్నాలను నివారించే దేవుడు కనుక విఘ్నేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. పార్వతి తయారు చేసిన వినాయకుడు శివుడి చేతిలో ప్రాణాలు కోల్పోగా, ఏనుగు తలను తగిలించి తిరిగి బతికించినందున గజాననుడిగా, ఒకే దంతం మిగిలినందున ఏకదంతుడిగా, మోదకాలంటే ఇష్టం కలిగిన వాడు కావడంతో మోదకప్రియుడిగా, పెద్ద ఉదరం కలిగి ఉన్నందున లంబోదరుడిగా, మూషికాన్ని వాహనం చేసుకున్నందున మూషిక వాహనుడిగా, స్కందుడిగా పేరుపొందిన కుమారస్వామికి అన్న అయినందున స్కందాగ్రజుడిగా వినాయకుడు వినుతికెక్కాడు. వినాయకుడికి గల సహస్రనామాలు, ఆయన గురించిన ప్రసిద్ధ పురాణగాథలు వినాయక వ్రతకల్పంలో జనానికి తెలిసినవే. వినాయకుడి గురించిన కొన్ని అరుదైన అపురూపమైన విశేషాలు... పార్వతీదేవి స్నానం చేస్తుండగా నలుగుపిండి ముద్దతో వినాయకుడిని రూపొందించి, అతడికి ప్రాణం పోసిందనే కథనం అందరికీ తెలిసిందే. బాల వినాయకుడిని కావలి ఉంచగా, అతడు బయటి నుంచి కైలాసానికి తిరిగి వచ్చిన శివుడిని అడ్డగించి తలపడటం, శివుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం, ఏనుగు తలను తగిలించి అతడిని బతికించడం కూడా దాదాపు అందరికీ తెలిసిన సంగతే. వినాయక వ్రతకల్పంలోని గాథ వినాయకుడి సృష్టి ఎలా జరిగిందో మాత్రమే చెబుతుంది. అయితే, పార్వతీ పరమేశ్వరులు గణపతిని ఎందుకు సృష్టించారనే దానికి సంబంధించిన గాథ స్కాంద పురాణంలో ఉంది. ఇది వ్రతకల్పంలోని గాథకు కొంత భిన్నమైనది. గణపతిని ఎందుకు సృష్టించారంటే..? స్వర్గలోకం సకల భోగాలకు నిలయం. భూలోకంలో జీవితాంతం అలాంటి భోగాలను అనుభవించడం అసాధ్యం. జరామరణాలతో కూడిన మర్త్య జీవితం కంటే, స్వర్గాన్ని చేరి అమర సౌఖ్యాలను అనుభవిస్తేనే కదా సార్థకత అనుకున్న మానవులు ఘోర తపస్సులు ఆచరిస్తూ, తపః ఫలితంగా ఒక్కొక్కరే స్వర్గానికి వెళ్లసాగారు. స్వర్గంలో దేవతల కంటే మనుషులే ఎక్కువయ్యారు. స్వర్గంలో తమ ఆధిక్యత పెరగడంతో మానవులు ఏకంగా దేవతల మీద ఆధిపత్యం చలాయిస్తూ స్వైరవిహారం చేయడం ప్రారంభించారు. మానవులంటేనే దేవతలు భయపడే పరిస్థితి దాపురించింది. మానవులకు భయపడుతూ బతకడం దుస్సహంగా ఉందని, వాళ్లను ఎలాగైనా నియంత్రించాలని స్వర్గంలోని దేవతలందరూ దేవేంద్రుడితో మొరపెట్టుకున్నారు. తపస్సులు సాగించి స్వర్గానికి వచ్చిన వాళ్లను ఎలా నియంత్రించాలో దిక్కుతోచని దేవేంద్రుడు నేరుగా కైలాసానికి బయలుదేరాడు. కైలాసంలో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులకు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి, వారిని పరిపరి విధాల స్తుతించాడు. ‘దేవేంద్రా! నీ రాకకు కారణమేమిటి?’ అని పరమేశ్వరుడు ప్రశ్నించగా, తన మొర వినిపించాడు. ‘పరమేశ్వరా! ఘోర తపస్సులు చేసి, తపః ఫలాల కారణంగా స్వర్గానికి చేరుకున్న మానవులు దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇదేమని నిలదీసిన దేవతలను నానా రకాలుగా బాధిస్తున్నారు. వారి దాష్టీకాలకు స్వర్గంలో ప్రశాంతత లేకుండా పోయింది. మానవజాతి అంటేనే దేవతలు భయభ్రాంతులయ్యే పరిస్థితి దాపురించింది. మానవుల బెడద నుంచి మమ్మల్ని నీవే కాపాడాలి తండ్రీ!’ అని వేడుకున్నాడు. దేవేంద్రుడి మాటలు విన్న పరమేశ్వరుడు సాలోచనగా పార్వతీదేవి వైపు చూసి చిరునవ్వు చిందించాడు. అప్పుడు పార్వతీదేవి మట్టి తీసుకుని తన చేతులతో ఒక ఆకృతిని రూపొందించింది.ఏనుగు ముఖం, పెద్దబొజ్జ, భారీ శరీరం, నాలుగు చేతులు కలిగిన వింత ఆకారం ప్రాణం దాల్చి, పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, పార్వతీదేవితో ఇలా అన్నాడు. ‘అమ్మా! నన్ను ఎందుకు సృష్టించారో చెబుతారా?’అందుకు పార్వతీ దేవి, ‘నాయనా! నీవల్ల నెరవేరవలసిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్లు. అక్కడ స్వర్గానికి వెళ్లాలనుకుంటున్న మానవులకు విఘ్నాలు కలిగించు. ఈ బృహత్కార్యంలో నీకు నంది, మహాకాలుడు సహాయకులుగా ఉంటారు’ అని బదులిచ్చింది. ప్రమథ గణాలకు అధిపతిగా తానే స్వయంగా గణేశుడికి అభిషేకం చేయించింది. ఈ కార్యక్రమాన్ని తిలకించిన దేవతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గణేశునికి జయజయ ధ్వానాలతో ఆశీస్సులు పలికి, పుష్పవృష్టి కురిపించారు. పరమేశ్వరుడు గణపతికి పరశువును, బ్రహ్మ తికాలజ్ఞతను, విష్ణువు బుద్ధిని, కుబేరుడు ఐశ్వర్యాన్ని , సూర్యుడు పరాక్రమాన్ని, చంద్రుడు కాంతిని, దేవేంద్రుడు సౌభాగ్యాన్ని, పార్వతీదేవి మోదకపాత్రను ఇచ్చారు. కుమారస్వామి మూషికాన్ని గణేశునికి వాహనంగా బహూకరించాడు. ఇలా దేవతలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చి, గణేశుని గణాధిపత్యాన్ని ఆమోదించడంతో అతడు అమిత బలశాలిగా మారి, పార్వతీదేవి అనుజ్ఞతో దేవతలంతా తనపై ఉంచిన కార్యభారాన్ని నెరవేర్చేందుకు భూలోకానికి పయనమయ్యాడు. స్వార్థబుద్ధులై స్వర్గప్రాప్తిని ఆశించే మానవులకు ప్రతి పనిలోనూ విఘ్నాలు కలిగించడం ప్రారంభించాడు. వినాయకుడు కల్పించిన విఘ్నాలను అధిగమించడం మానవులకు దుస్సాధ్యంగా మారింది. వినాయకుడి ప్రభావంతో స్వర్గలోకానికి వెళ్లే మానవుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.స్వర్గంలో తిరిగి ప్రశాంతత ఏర్పడింది. మానవుల్లో గణపతి పట్ల భయభక్తులు ఏర్పడ్డాయి. అందుకే ఏ పని మొదలుపెట్టినా, విఘ్నాలు తొలగించుకోవడం కోసం వినాయకుడికి తొలిపూజలు చేయడం ప్రారంభించారు. భక్తి శ్రద్ధలతో పూజించి వినాయకుడి అనుగ్రహం పొందిన వారు తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని, ఆయనకు ఆగ్రహం కలిగిస్తే విఘ్నాలు తప్పవనే నమ్మకం బలపడింది. వినాయకుడు అవతరించిన రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక వ్రతం ఆచరించడం అప్పటి నుంచే మొదలైందని ప్రతీతి. వినాయకుడు ఎలా ఏకదంతుడయ్యాడంటే..? వినాయకుడికి గల గజముఖానికి మొదట్లో రెండు దంతాలూ ఉండేవట. పరశురాముడి గొడ్డలి దెబ్బ వల్ల ఒక దంతాన్ని పోగొట్టుకుని ఏకదంతుడయ్యాడట. అదెలాగంటే... కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరుశురాముడు పరమశివుడి దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని అడ్డగించి, ‘ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడద’న్నాడు. ‘పరమేశ్వరుడిని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవ్వడివి‘ అంటూ పరుశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాటా మాటా పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలైంది. వినాయకుడు తన తొండంతో పరశురాముడిని పైకెత్తి గిరగిరా తిప్పి కిందకు పడేశాడు. దెబ్బకు పరశురాముడి కళ్లు బైర్లుకమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడి పైకి విసిరాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీపరమేశ్వరులు బయటకు వచ్చారు. దంతం విరిగి నెత్తురోడుతున్న బాల గణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముడిని మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటి ఆ కథ ముగిసినా, వినాయకుడు ఏకదంతుడిగా పేరుపొందాడు. ప్రణవరూపుడు వినాయకుడు ప్రణవరూపుడు. ప్రణవనాదమైన ఓంకారం ఆకారంలోనే వినాయకుడు కనిపిస్తాడు. దేవనాగరి లిపిలోని ఓంకారం ఆకారంలోనే చాలా వరకు పురాతన వినాయక విగ్రహాలు కనిపిస్తాయి. అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఉపపురాణాలలో వినాయకుని ప్రస్తావన కనిపిస్తుంది. వినాయకుని గురించిన విపులమైన కథనాలు గణేశ పురాణంలోను, ముద్గల పురాణంలోను కనిపిస్తాయి. ముద్గల పురాణం ప్రకారం వినాయకునికి ఎనిమిది అవతారాలు ఉన్నాయి. అవి: వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు. ఈ ఎనిమిదింటిలోనూ ఐదు అవతారాలకు వినాయకుని వాహనం ఎలుక. వక్రతుండ అవతారానికి సింహం, వికటావతారానికి నెమలి, విఘ్నరాజ అవతారానికి శేషువు వాహనాలు. గణేశ పురాణం ప్రకారం వినాయకునికి నాలుగు అవతారాలు ఉన్నాయి. అవి: మహోటక అవతారం, మయూరేశ్వర అవతారం, ధూమ్రకేతు అవతారం, గజానన అవతారం. మహోటక అవతారానికి సింహం, మయూరేశ్వర అవతారానికి నెమలి, ధూమ్రకేతు అవతారానికి గుర్రం, గజానన అవతారానికి ఎలుక వాహనాలుగా ఉన్నట్లు గణేశ పురాణ కథనం. చారిత్రకంగా చూసుకుంటే తొలినాటి వినాయక శిల్పాలలో ఎక్కడా ఎలుక వాహనం కనిపించదు. ఏడో శతాబ్ది తర్వాతి నాటి శిల్పాలలో మాత్రమే వినాయకునితో పాటు ఎలుక వాహనం కనిపిస్తుంది. పురాణాల్లో చూసుకుంటే మత్స్య పురాణంలో వినాయకుని మూషిక వాహన ప్రస్తావన తొలిసారిగా కనిపిస్తుంది. ఎలుకను తామస ప్రవృత్తికి చిహ్నంగా భావిస్తారు. ఎలుకపై స్వారీ చేయడం ద్వారా వినాయకుడు మానవులలోని కామ క్రోధ లోభ మోహాది తామస ప్రవృత్తిని నియంత్రిస్తాడని ప్రతీతి. వినాయకుని ముందు ఎందుకు గుంజీలు తీస్తారంటే..? వినాయక వ్రతం ఆచరించిన వారు పూజ ముగించిన తర్వాత వినాయకుడి ముందు గుంజీలు తీయడం ఆచారంగా వస్తోంది. ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. పార్వతీదేవికి శ్రీమహావిష్ణువు సోదరుడు. అందుకే పార్వతీదేవిని నారాయణి అని కూడా అంటారు. బావగారైన శివుడిని చూడటానికి ఒకసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడు. సుదర్శనం, గద తదితర ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టి, శివుని పక్కన కూర్చుని ముచ్చట్లలో పడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాల గణపతి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్న సుదర్శనచక్రాన్ని తీసుకుని, అమాంతం అప్పడంలా నోట్లో వేసుకుని మింగేశాడు. శివుడితో కబుర్లలో మునిగిన విష్ణువు దీనిని గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనిపించలేదు. ఎక్కడ ఉంచానో మరచానేమోనని సుదర్శనం కోసం వెదకడం ప్రారంభిస్తాడు. విష్ణువు వెదుకులాడుతుండటం చూసిన వినాయకుడు ‘మామా! దేనికోసం వెదుకుతున్నావు?’ అని అడిగాడు. ‘నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో మరచాను. దాని కోసమే వెదుకుతున్నాను’ అని చెప్పాడు విష్ణువు. ‘ఓహో! సుదర్శనమా! దానిని నేను మింగేశాగా!’ అని నవ్వుతూ అన్నాడు వినాయకుడు. బాలుడైన వినాయకుడిని ఏమీ చేయలేక తన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని నానా రకాలుగా బతిమాలుకుంటాడు. గణపతి విష్ణువు బతిమాలుతున్న కొద్దీ నవ్వుతూ అతడిని ఆటపట్టిస్తాడు. అప్పుడు అంతటి మహావిష్ణువు తన కుడిచేత్తో ఎడమ చెవిని, ఎడమచేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెడతాడు. విష్ణువు గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు పగలబడి నవ్వుతాడు. విపరీతంగా నవ్వడంతో అతడి కడుపున ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది. విష్ణువు ఆ చక్రాన్ని తీసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువంతటి వాడు వినాయకుడి ముందు గుంజీలు తీయడంతో వినాయక వ్రత పూజ తర్వాత గుంజీలు తీయడం ఆచారంగా మారింది. వినాయకుడి కుంటుంబం వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడని సాధారణంగా తెలిసిన విషయం. అయితే, వినాయకుని జననానికి సంబంధించి పురాణాలలో రకరకాల గాథలు ఉన్నాయి. పార్వతి నలుగు పెట్టుకునేటప్పుడు నలుగుపిండితో వినాయకుడిని రూపొందించినట్లుగా చెబుతున్న గాథ ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే, శివుడే ఇతడిని సృష్టించాడని, పుణ్యక వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి వినాయకుడిని కన్నదని, పార్వతీ పరమేశ్వరులు వినాయకుడిని సృష్టించారని, స్వయంభువుగా వెలసిన వినాయకుడిని పార్వతీ పరమేశ్వరులు కనుగొన్నారని... ఇలా రకరకాల గాథలు ఉన్నాయి. వినాయకుడి తమ్ముడు కుమారస్వామి. ఇతడికే కార్తికేయుడని, స్కందుడని కూడా అంటారు. వినాయకుడు బ్రహ్మచారి అని కొన్ని గాథలలోను, అతడికి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని మరికొన్ని గాథలలోను ఉంది. శివపురాణం ప్రకారం వినాయకుడికి క్షేమం, లాభం అనే ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారని ప్రతీతి. సనాతన సంప్రదాయంలో ఆరు మతాలు ఉన్నాయి. వీటినే షణ్మతాలు అంటారు. అవి: శైవ వైష్ణవ సౌర శాక్తేయ గాణపత్య స్కంద మతాలు. వీటిలో శైవ వైష్ణవ మతాలు మాత్రమే ఇప్పటికీ ప్రధానంగా ఉనికిలో ఉన్నాయి. శాక్తేయం కొంతవరకు ఉనికిలోల ఉన్నా, ఆరాధన పద్ధతులు చాలావరకు మారాయి. చరిత్రను తరచి చూస్తే క్రీస్తుశకం ఆరో శతాబ్ది వరకు స్కంద ఆరాధన ఎక్కువగా ఉండేది. స్కందుని పూజను వీర పూజ అనేవారు. ఆరో శతాబ్ది తర్వాతి నుంచి వినాయకుని ఆరాధన క్రమంగా పెరిగింది. వినాయకుని ఆరాధనకు ప్రాచుర్యం పెరిగిన తొలినాళ్లలో గాణపత్య మతం ప్రత్యేక మతంగా ఉనికిలో ఉండేది. గాణపత్యాన్ని అవలంబించే వారిలో కొందరు గణపతిని తాంత్రిక పద్ధతుల్లో పూజించేవారు కూడా. ఉచ్చిష్ట గణపతి సాధన వంటి తాంత్రిక ఆరాధనలు అప్పట్లో మొదలై ఉంటాయని చరిత్రకారుల అంచనా. వినాయకుని తొలినాటి శిల్పాలు అఫ్ఘానిస్థాన్లో దొరికాయి. ఇవి క్రీస్తుశకం నాలుగో శతాబ్దం నాటివని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహలు, రామగఢ్ కొండ, భుమరా ఆలయంలో కూడా వినాయకుని అతి పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఇవన్నీ గుప్తుల కాలం నాటివని, అంటే సుమారు క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటివని చెబుతున్నారు. గణపతిని ప్రధాన దైవంగా ఆరాధించే గాణపత్య మతం క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికి బాగా ప్రాచుర్యంలో ఉండేదని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. విదేశాల్లో వినాయకుడు భారత ఉపఖండం నుంచి వినాయకుడు అనతి కాలంలోనే సముద్రాలకు ఆవల ఉన్న పలు ఇతర దేశాలకూ విస్తరించాడు. నౌకా వాణిజ్య సంబంధాల కారణంగా వినాయకుని ఆరాధన విదేశాలకూ పాకింది. చైనాలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నాటికే వినాయకుని ఆరాధన ఉండేదనేందుకు అక్కడ దొరికిన గణపతి శిల్పాలే నిదర్శనం. గణపతి ఆరాధన క్రీస్తుశకం ఐదు–ఆరు శతాబ్దాల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చినా, దీనికి మూలాలు సింధులోయ నాగరికత కాలంలోనే ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇరాన్లోని లోరెస్తాన్ ప్రావిన్స్లో జరిపిన తవ్వకాల్లో దొరికిన లోహఫలకంపై గణపతిని పోలిన ఆకారం ఉండటంతో గజాననుడి ఆరాధనకు మూలాలు క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్ల కిందటే ఏర్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వైదిక సాహిత్యాన్ని తీసుకుంటే రుగ్వేదంలో వినాయకుని ప్రస్తావన ‘బ్రాహ్మణస్పతి’ అనే పేరిట కనిపిస్తుంది. కృష్ణ యజుర్వేదంలోను, తైత్తరీయ అరణ్యకంలోను కూడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వమే ఏర్పడిన జైన, బౌద్ధ మతాలు కూడా గణపతి ఆరాధనను స్వీకరించాయి. ఈ మతాలు వ్యాపించిన దేశాల్లో కూడా గణపతి ఆరాధన విభిన్నమైన విలక్షణమైన పద్ధతుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. నేపాల్లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. హేరంబ రూపంలోని వినాయకునికి ఐదు తలలు ఉంటాయి. హేరంబుని వాహనం సింహం. నేపాల్, టిబెట్లలో నృత్యముద్రలో ఉన్న గణపతిని కూడా ఆరాధించేవారు. శ్రీలంక, బర్మా, చైనా, జపాన్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా దేశాల్లో కూడా వినాయకుడు విలక్షణ రూపాల్లో కనిపిస్తాడు. జైన గ్రంథాలలో వినాయకుని ప్రస్తావన లేకున్నా, జైనులు మాత్రం వినాయకుడిని ఆరాధిస్తారు. జైనులు తమ సంప్రదాయంలో గణేశునికి కొన్ని కుబేరుని లక్షణాలను ఆపాదించినట్లు కనిపిస్తుంది. బౌద్ధ గ్రంథాలలో అక్కడక్కడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. – పన్యాల జగన్నాథదాసు -
మట్టే మాణిక్యం!
నగరవాసుల్లో పర్యావరణ స్పృహ పెరుగుతోంది. వినాయక చవితికి మట్టి విగ్రహాలు ఉపయోగించే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో మట్టి విగ్రహాలే కొలువుదీరనున్నాయి. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ, ఇతర ప్రైవేట్ సంస్థలు దాదాపు మూడు లక్షల విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: భక్తకోటి ఇష్టదైవం బొజ్జగణపయ్య పర్యావరణ ప్రియమైన రంగులతో కనువిందు చేసేందుకు ముస్తాబవుతున్నాడు. మట్టి గణపతులకే నగరం పట్టం కడుతోంది. సహజ రంగులు, మట్టి విగ్రహాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన,ఆసక్తులకు అనుగుణంగానే తెలంగాణ కాలుష్య నియంత్రమండలి, హెచ్ఎండీఏలు ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో మట్టి విగ్రహాలను అందజేస్తున్నాయి. ఈ ఏడాది కాలుష్య నియంత్రణ మండలి సుమారు 2.10 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుండగా, హెచ్ఎండీఏ మరో 40 వేల విగ్రహాలను అందజేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో 1.75 లక్షలకు పైగా 8 ఇంచుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాల కోసం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 22 టన్నుల సహజ రంగులను సిద్ధం చేసింది. ఈ మహోద్యమంలో మట్టి విగ్రహాలను రూపొందించే సంస్థలు, వ్యక్తులు, సైతం భాగస్వాములవుతున్నారు. సహజ రంగులకు ఇలా శ్రీకారం... ప్రమాదకరమైన రసాయనాల కారణంగా హుస్సేన్సాగర్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువులన్నీ కాలుష్య కాసారాలయ్యాయి. పర్యావరణానికి కూడా ఈ రసాయనాలు పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో 2006 లో యునెస్కో సహకారంతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. సహజమైన రంగుల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ ఈ సదస్సు లక్ష్యం.ఆ మరుసటి సంవత్సరం నుంచి నేషనల్ అగ్రికల్చరల్ ఇన్నొవేటివ్ ప్రాజెక్టులో భాగంగా హోమ్సైన్స్ కళాశాల సహజరంగులను రూపొందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది. మొదట వస్త్రాలకు ఈ సహజమైన రంగులను అద్దారు. ఆ తరువాత హోలీ రంగులను సిద్ధం చేశారు. క్రమంగా వినాయక విగ్రహాలను సైతం సహజమైన రంగులతో అలంకరించేందుకు పళ్లు, పూలు,ఆకులు, బెరళ్లు,వివిధ రకాల దుంపల నుంచి రంగులను తయారు చేయడంపైన దృష్టి సారించారు. 2008లో 500 విగ్రహాలతో ప్రారంభమైన ఉద్యమం 2014 లో 5000 దాటింది. చిన్న చిన్న విగ్రహాలతో పాటు, 5 నుంచి 6 ఫీట్లు ఉన్న వినాయక విగ్రహాలకు సైతం సహజరంగులను సిద్ధం చేశారు. అలా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు రూ.75 లక్షలతో అతి పెద్ద ప్రాజెక్టుగా ముందుకు వచ్చింది. తెలుపు, నలుపు,నీలం, పసుపు,ఆకుపచ్చ,నారింజ,ఎరుపు,గులాబీ వంటి 14 ప్రాథమిక రంగులు,వివిధ రకాల రంగుల కాంబినేషన్లతో మొత్తం 56 రకాల రంగులతో విగ్రహాలను అలంకరించేవిధంగా ఈ సహజరంగులను తయారు చేశారు. ఈ ఏడాది 2.5 లక్షల విగ్రహాలకు సరిపోయేవిధంగా 22 టన్నుల రంగులు సిద్ధం చేశారు. అందులో 12 టన్నులు తెలుపు రంగు. కాగా మిగతా 10 టన్నులలో అన్ని రకాల రంగులు ఉన్నాయి. గత సంవత్సరం 18 టన్నుల రంగులను తయారు చేశారు. ఈ ఏడాది 22 టన్నులకు పెంచారు. అందుబాటు ధరల్లో సహజ రంగులు.... వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు,సైఫాబాద్లోని హోంసైన్స్ కళాశాలలోనూ, ఎంపిక చేసిన హస్తకళా కేంద్రాలు,సూపర్మార్కెట్లలోనూ ఈ రంగులను విక్రయిస్తారు. వివిధ రకాల సహజ రంగులు రూ.500 లకు లీటర్ చొప్పున విక్రయిస్తుండగా, నలుపు రంగు రూ.600 లకు లీటర్, తెలుగు రంగు రూ.100 కు లీటర్ చొప్పున విక్రయిస్తున్నారు. వినియోగదారులు సైఫాబాద్ హోంసైన్స్ కళాశాలలోనూ. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని నేచురల్ డై ప్రాసెసింగ్ ఇంక్యుబేటర్ సెంటర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఏడాది పొడవునా ఉత్పత్తి జరగాలి ఏడాదిలో కేవలం 3 నెలలు మాత్రమే ఈ సహజ రంగులను తయారు చేసి ఇస్తున్నాం. దీనివల్ల ప్రజల్లో ఉన్న డిమాండ్ను భర్తీ చేయలేకపోతున్నాం.ప్రస్తుతం హైదరాబాద్ వరకే మా రంగులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించడం వల్ల తెలంగాణ అంతటికీ సహజ రంగులను అందజేయవచ్చు. – డాక్టర్ ఆర్.గీతారెడ్డి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం – సహజ రంగుల కోసం ప్రజలు,సంస్థలు,కళాకారులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 040–23241059,హోంసైన్స్ కళాశాల. -
వ్యంజనం జనరంజకం
ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక భారతదేశం. మన సాంప్రదాయపు పర్వదినాలను జరుపుకోవటంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాలలో ఉండే చిన్న చిన్న వైరుధ్యాలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానం గా ఇవి ఆహారవిహారాలలో గల ప్రాంతీయ భేదాల్ని సూచిస్తాయి. భాద్రపద మాసంలో వచ్చే ‘వినాయక చవితి’ కి కూడా ఇది వర్తిస్తుంది. కుడుములు, ఉండ్రాళ్లు, గొట్టెక్క బుట్టలు వంటి పిండి వంటలను ఆస్వాదించేటప్పుడు రకరకాల పచ్చళ్లను నంజుకోవడం తెలుగువారి ప్రత్యేకత. అప్పటికప్పుడు తాజాగా తయారుచేసుకునే వాటిలో విశిష్టమైనవి... ‘చింతకాయ, కొత్తిమీర, అల్లం, నువ్వుల పప్పు’ పచ్చళ్లు. ప్రధాన భక్ష్యాలతో పాటు నంజుకునే సహద్రవ్యాలు లేదా‡అనుద్రవ్యాలను ‘వ్యంజనాలు’ అంటారు. ఇవి నాలుకకు రుచిని కలిగించడమే కాకుండా, తెలుగువారి మనసులకు కూడా ఆనందం కలిగిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. వీటి అవసరాలను, ఆరోగ్య ప్రయోజనాలను ఆయుర్వేదం చక్కగా వివరించింది.స్థూలంగా చెప్పాలంటే భాద్రపద మాసం వర్ష ఋతువు, వాత ప్రకోపం, పిత్త సంచయం కలిగి ఉండే వాతావరణం. ప్రాణుల్లో శక్తి కొంచెం తక్కువగా ఉండే సమయం. వినాయకచవితి పండుగ రోజున కనిపించే పిండి వంటలు, వ్యంజనాలకు బలం కలిగించే గుణం, వాతపిత్తాలను తగ్గించి ఆరోగ్య పరిరక్షణ చేసే లక్షణం కూడా ఉన్నాయి. పచ్చళ్లకు వాడే ప్రధాన పదార్థాలతో పాటు, వాటి తయారీలో ముఖ్యపాత్రను పోషించే ఉప్పు పులుపు కారాలు, ముఖ్య అతిథిగా దర్శనమిచ్చే ఇంగువ, నువ్వుల నూనె గుణగణాలను ఆయుర్వేదం అభివర్ణించింది. చింతకాయ (పచ్చడి) ‘‘అమిలకా అమ్లా గురుః వాతహరా పిత్త కఫాస్రకృత్‘పక్వాతు దీపనీరూక్షా రస ఉష్ణా కఫవాత నుత్‘‘చించా, తింత్రిణీ, తింతిడీ, అమ్లీ, చుక్రికా... మొదలైనవి చింతకాయ/చింతపండుకు పర్యాయ పదాలు. కొత్తిమీర ఇవి ధనియాల యొక్క ఆకులు. ధాన్యకం, ధానకం, కునటీ, కుస్తుంబురు మొదలైనవి ధనియాలకు పర్యాయ పదాలు. ఇవి కొంచెం కారంగా, ఘాటుగా ఉంటాయి. జీర్ణమైన తరవాత మృదువుగా ఉంటుంది. ఆకలిని పుట్టించి అరుగుదలకు సహకరిస్తుంది. ఉష్ణవీర్యమైనప్పటికీ మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. జ్వరం, అతిసారం, దగ్గు, ఆయాసం, దప్పిక, వాంతులను తగ్గిస్తుంది. త్రిదోష హరం, బల్యం, క్రిమి హరం. ధనియాలు వాటి ఆకులైన కొత్తిమీరకు సమాన గుణకర్మలు ఉంటాయని చెప్పారు. ఆర్ద్రంతు తద్గుణం స్వాదు విశేషాత్ పిత్త నాశనం అల్లం దీనికి ఆర్ద్రక, కటుభద్ర, శృంగబేర వంటి పర్యాయపదాలు ఉన్నాయి. కటురస ప్రధానమైనప్పటికీ, జీర్ణమైన తరువాత మృదువుగా ఉంటుంది. శరీరంలోని నీటిని ఆర్చి, వాతకఫాలను తొలగిస్తుంది. అగ్నిదీపకం, శరీరానికి వేడి కలిగిస్తుంది. కొంచెం ఉప్పును కలిపి అల్లం తింటే, అరుచిని, కంఠ రోగాల్ని తగ్గిస్తుంది. తీక్ష›్ణగుణం కలిగి ఉంటుంది కాబట్టి ఏ కారణం చేతనైనా శరీరంలో రక్తం కారుతున్నప్పుడు , జ్వరం వచ్చినప్పుడు, వేసవికాలంలోను అతిగా సేవించకూడదు.‘భోజనాగ్రే సదా పథ్యం లవణార్ద్రక భక్షణం!అగ్ని సందీపనం, రుచ్యం, జిహ్వా కంఠ విశోధనమ్ నువ్వులు నలుపు, తెలుపు, ఎరుపు రంగులలో ఉంటుంది. బలకరం, కేశాలకు మంచిది. స్తన్య వర్ధకం. ఆకలిని, బుద్ధిని పెంచుతాయి. నల్ల నువ్వులు శ్రేష్ఠం. తెల్లనివి మధ్యమం. నువ్వుల నూనె: తిలతైలం గురుస్థైర్యం బలవర్ణకరం సరం, వృష్యం... వాతపిత్త కఫాపహం... కృశానాం తేన బృంహణం... లేఖనం, బద్ధ విణ్మూత్రం గర్భాశయ విశోధనం...’’ బరువైన ద్రవ్యం, త్రిదోష హరం. నీరసించిన వారికి బలం కలిగించి బరువును పెంచుతుంది. కొవ్వును కరిగించే గుణం కలిగి స్థూలకాయులకు బరువును తగ్గిస్తుంది. గట్టిగా ఉన్న మలాన్ని మెత్తబరచి నెట్టివేస్తుంది. స్త్రీలలో గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంగువ (హింగు): ఉష్ణం, పాచనం, రుచ్యం తీక్షవాత కఫఘ్నం, పిత్త వర్ధనంశరీరానికి వేడిని కలిగిస్తుంది, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. కడుపు నొప్పి, కడుపులోని వాయువుని పోగొడుతుంది. గుర్తు ఉంచుకోవలసిన సారాంశం: పిండివంటలు శోభిల్ల పండుగలనుగురుతరంబుగ చేయుడి కూర్మి మీరసాంప్రదాయపు భక్ష్యముల్ శాస్త్రహితముమనసు రంజిల్ల సేవించి మనగ వలయుకొత్తిమిరి చింత అల్లముల్ కోరుకొనుచుమంచి పచ్చళ్లు చేయంగ మరువ వలదుహింగు తిల తైల సంపర్క హిత గుణాన అఖిల జనరంజకములయ్య వ్యంజనములు డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వే వైద్య నిపుణులు -
నైన్వేద్యాలు
మంచి పెంచు స్వామీ.సంపద ఇవ్వు స్వామీ.సంతోషం పంచు స్వామీ.సోదరభావం నేర్పించు స్వామీ.దానాన్ని బోధించు స్వామీ.సంస్కారం అలవర్చు స్వామీ.దయను కలిగించు స్వామీ.స్వస్థత చేకూర్చు స్వామీ.శాంతిని ప్రసాదించు స్వామీ.తొమ్మిది నైవేద్యాలు స్వీకరించి నవ జీవనాన్ని దయ చేయి తండ్రీ. పాల తాలికలు కావలసినవి: పాలు – ఒక లీటరు; బెల్లం పొడి – పావు కేజీ; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; సగ్గు బియ్యం – 50 గ్రా.; బియ్యం – పావు కేజీ; జీడి పప్పు – 50 గ్రా.; నెయ్యి – 6 టీ స్పూన్లు; ఉప్పు – చిటికెడు తయారీ ∙ముందురోజు బియ్యాన్ని తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీళ్లు శుభ్రంగా ఒంపేసి, పొడి వస్త్రం మీద బియ్యం ఆరబోసి, బియ్యంలోని తడి పోయిన తరవాత, మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఈ పిండికి బెల్లం పొడి, వేడి పాలు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙ కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని సన్నగా పొడవుగా తాలికలుగా ఒత్తి పక్కన ఉంచాలి ∙ఒక మందపాటి గిన్నెలో లీటరు పాలకు కప్పుడు నీళ్లు జత చేసి, సగ్గుబియ్యం కూడా వేసి స్టౌ మీద ఉంచి, సగ్గు బియ్యం ఉడికేవరకు మరిగించాక, తయారుచేసి ఉంచుకున్న తాలికలను పాలలో వేసి జాగ్రత్తగా కలపాలి ∙ చివరగా బెల్లం, నెయ్యి, ఏలకుల పొడి జత చేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి దింపేయాలి ∙చల్లగా అందించాలి. పప్పు ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పెసర పప్పు – ఒక కప్పు (నానబెట్టి, నీరు ఒంపేయాలి); బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నీళ్లు పోసి మరిగించాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి కలుపుతుండాలి ∙పిండి గట్టిపడ్డాక బాణలి దింపేసి, పిండి కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙వేరొక బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙నానబెట్టి ఉంచుకున్న పెసర పప్పును వేసి కలపాలి ∙బెల్లం పొడి జత చేసి మరోమారు కలిపి, తగినన్ని నీళ్లు జత చేయాలి ∙పెసర పప్పు బాగా ఉడికిన తరవాత ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న చిన్ని చిన్ని ఉండ్రాళ్లను ఇందులో వేసి కలిపి దింపేయాలి ∙అంతే పప్పు ఉండ్రాళ్లు సిద్ధమైనట్లే. ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యపు రవ్వ – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; సెనగ పప్పు/పెసర పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద మందపాటి ఇత్తడి గిన్నె కాని బాణలి కాని ఉంచి వేడి చేయాలి ∙వేడెక్కిన తరవాత టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙జీలకర్ర వేసి వేయించాలి ∙శుభ్రంగా కడిగిన కరివేపాకు వేసి బాగా వేయించాలి ∙ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి ∙సెనగపప్పు, ఉప్పు జత చేసి కలియబెట్టాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యపు రవ్వ వేసి ఆపకుండా కలుపుతుండాలి ∙మంట బాగా తగ్గించి, మూత పెట్టాలి ∙ మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బాగా ఉడుకుపడుతుండగా టేబుల్ స్పూను నెయ్యి వేసి కలపాలి ∙ పూర్తిగా ఉడికిన తరవాత గిన్నె/బాణలి దింపేసి ఉడికిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.చల్లారాక కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని గుండ్రంగా ఉండ్రాళ్లు తయారుచేసుకోవాలి ∙వినాయకుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ఫ్రైడ్ మోదక్ కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను; గోరు వెచ్చని నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని ఫిల్లింగ్ కోసం: బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు. పైభాగం తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, గోరు వెచ్చని నూనె, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి, సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. ఫిల్లింగ్ తయారీ: ∙ఫిల్లింగ్ కోసం చెప్పిన పదార్థాలను ఒక మందపాటి పాత్రలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపి పక్కన ఉంచాలి. మోదకాల తయారీ: ∙గోధుమపిండి మి్రÔ¶ మాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తి చేతిలోకి తీసుకోవాలి ∙ఫిల్లింగ్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఒత్తిన చపాతీ మధ్యలో ఉంచి, అన్నిపక్కలా కొద్దికొద్దిగా దగ్గరకు తీసుకుంటూ (బొమ్మలో చూపిన విధంగా) మూసేయాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసి పక్కన ఉంచుకోవాలి ∙ బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, కాగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి. చాకొలేట్ మోదక్ కావలసినవి: పచ్చి కోవా – ఒక కప్పు (సన్నగా తురమాలి); చాకొలేట్ చిప్స్ – అర కప్పు; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; నెయ్యి – కొద్దిగా గార్నిషింగ్ కోసం: పిస్తా పప్పుల తరుగు – రెండు టీ స్పూన్లు; గులాబీ రేకలు – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడి చేసి, మంట బాగా తగ్గించి పచ్చి కోవా తురుము వేసి, ఆపకుండా కలుపుతుండాలి ∙కోవా కరగడం మొదలైన తరవాత, పంచదార పొడి వేసి బాగా కలిపాక, చాకొలేట్ చిప్స్ వేసి వెంటనే కలిపేయాలి ∙చాకొలేట్ చిప్స్ కరిగి, మిశ్రమం చిక్కబడుతుండగా ఏలకుల పొడి వేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం బాగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙మిశ్రమం మరీ గట్టిపడకుండా చూసుకోవాలి ∙ఉడుకుతున్న మిశ్రమం అంచులను విడవగానే, ఒక పాత్రలోకి తీసుకుని, చల్లారనివ్వాలి ∙బాగా చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙మోదక్ మౌల్డ్స్ తీసుకుని ఒక్కో ఉండను అందులో ఉంచి జాగ్రత్తగా మూత తీసి మోదకాలను, నెయ్యి పూసిన ప్లేట్లో ఉంచాలి ∙గులాబీ రేకలు, పిస్తా తరుగు తో అందంగా అలంకరించి, వినాయకుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా సేవించాలి (ఇష్టపడేవారు ఫ్రిజ్లో ఉంచి, చల్లగా కూడా తినొచ్చు. వీటిని త్వరగా తినేయాలి, లేదంటే చాకొలేట్ కరిగిపోయే అవకాశం ఉంటుంది) డ్రైఫ్రూట్స్ మోదక్ కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – పావు టీ స్పూను మోదక్ ఫిల్లింగ్ కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి కోవా – 100 గ్రా.; గసగసాలు – ఒక టీ స్పూను; బాదం పప్పులు – పావు కప్పు; జీడి పప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా తరుగు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; చిరోంజీ – ఒక టేబుల్ స్పూను; ఖర్జూరాల తరుగు – ఒక టేబుల్ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – పావు కప్పు. తయారీ: ∙ఒక పాత్రను స్టౌ మీద ఉంచి వేడయ్యాక నీళ్లు పోసి మరిగించాలి ∙పావు టీ స్పూను ఉప్పు వేసి కలియబెట్టాలి ∙నీళ్లు బాగా మరుగుతుండగా మంట తగ్గించి, బియ్యప్పిండి వేస్తూ కలపాలి ∙కొద్దిగా ఉడికించి వెంటనే దింపేయాలి ∙ఉడికిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙పిండి బాగా చల్లారాక చేతితో బాగా కలిపి మూత పెట్టి పావు గంట సేపు పక్కన ఉంచాలి. డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్ తయారీ: డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙తరిగి ఉంచుకున్న బాదం పప్పులు, జీడి పప్పు పలుకులు, పిస్తా, ఖర్జూరం, చిరోంజీ, కిస్మిస్లను వేసి రెండు నిమిషాల పాటు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ∙గసగసాలు వేసి చిటపటలాడేవరకు వేయించి డ్రైఫ్రూట్స్తో పాటు పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో కోవా వేసి బాగా కలపాలి ∙కోవా కరుగుతున్న సమయంలో పావు కప్పు పంచదార వేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం ఉడుకుపట్టగానే, పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, గసగసాలు వేసి కలిపి దింపేసి, మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకోవాలి. మోదకాల తయారీ: ∙ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఒత్తాలి ∙డ్రైఫ్రూట్స్ మిశ్రమం కొద్దిగా తీసుకుని అందులో ఉంచి, అన్నివైపులా మూసేయాలి (మౌల్డ్స్లో చేసుకుంటే చూడటానికి బాగుంటాయి) ∙అన్నీ తయారుచేసుకున్నాక ఇడ్లీ స్టాండులో ఉంచి, స్టౌ మీద పెట్టి ఆవిరి మీద ఉడికించి దింపేయాలి. కొబ్బరి ఉండ్రాళ్ల పాయసం కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – రుచికి తగినంత; నూనె – ఒక టీ స్పూను; పంచదార – 3 టేబుల్ స్పూన్లు; పాలు – 3 కప్పులు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకులు – 2 (పొడి చేయాలి); కిస్మిస్ – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద మందపాటి పాత్ర పెట్టి వేడి చేయాలి ∙నీళ్లు పోసి మరిగించాక, ఉప్పు జత చే సి బాగా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి మరోమారు కలపాలి ∙నీళ్లు మరిగాక బియ్యప్పిండి వేసి మంట తగ్గించి, పిండి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి ∙పిండి ఉడికి బాగా గట్టిపడ్డాక దింపి, చల్లారనివ్వాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద మరో బాణలి పెట్టి, వేడయ్యాక పాలు పోసి మరిగించాలి ∙పంచదార, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న చిన్న ఉండ్రాళ్లను పాలలో వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ∙కొద్దిగా పాలలో టేబుల్ స్పూను బియ్యప్పిండి వేసి కలిపి, ఉడుకుతున్న పాలలో వేయాలి ∙జీడి పప్పులు వేసి మరోమారు కలియబెట్టాలి ∙కొద్దిగా ఉడుకుçపట్టాక కొబ్బరి తురుము వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి. ఉండ్రాళ్ల పాయసం కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; పాలు – అర లీటరు; పంచదార – ఒక కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీస్పూను; జీడి పప్పు – కొద్దిగా; సార పలుకులు – కొద్దిగా తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, సార పలుకులు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి ∙నీళ్లు మరిగిన వెంటనే టీ స్పూను పంచదార వేసి కలపాలి ∙బియ్యప్పిండి (కొద్దిగా పిండి పక్కన ఉంచుకోవాలి) వేసి కలపాలి ∙పిండి ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతూ, పిండి గట్టి పడ్డాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙వేరే బాణలిలో పాలు పోసి మరిగించాలి ∙ఒక కప్పు పంచదార వేసి కరిగించాలి ∙కొద్దిగా ఏలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి ∙ఏలకుల వలన సువాసన వస్తుంది ∙పాలు మరిగి చిక్కబడేవరకు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న చిన్నచిన్న ఉండ్రాళ్లను మరుగుతున్న పాలలో వేయాలి ∙పక్కన ఉంచుకున్న బియ్యప్పిండిని కొద్దిగా చన్నీళ్లలో వేసి కలిపి, ఉడుకుతున్న పాలలో వేసి మరోమారు కలియబెట్టాలి ∙చివరగా... వేయించి ఉంచుకున్న జీడి పప్పులు, సార పలుకులను వేసి బాగా కలిపి దింపేయాలి ∙వినాయకుడికి నివేదన చేసి సేవించాలి. పూర్ణం కుడుములు కావలసినవి: సెనగ పప్పు – ఒక కప్పు; నీళ్లు – 3 కప్పులు; బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా తయారీ: ∙సెనగ పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేయాలి ∙బాణలిలో బెల్లం, కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించాలి ∙పాకం బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి వేసి మరోమారు కలియబెట్టాలి ∙పొడి చేసి ఉంచుకున్న సెనగపప్పును వేసి కలియబెట్టాలి ∙పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం దగ్గరపడేవరకు ఆపకుండా కలిపి దింపేయాలి ∙చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి.వేరొక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙కొద్దిగా నెయ్యి జత చేసి కలపాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి బాగా కలిపి ఉడికించాలి ∙ఉడికిన పిండిని ఒక పళ్లెంలోకి తీసి, చేతితో మెదుపుతూ ఉండలా చేయాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసుకోవాలి ∙ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా తీసుకుని చేతితో ఒత్తాలి ∙సెనగ పప్పు + బెల్లం ఉండను మధ్యలో ఉంచి బియ్యప్పిండితో మూసేసి నున్నగా చేసి పక్కన ఉంచాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙వీటిని ఇడ్లీ స్టాండ్లో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి ∙ఉడికిన తరవాత దింపేసి, బయటకు తీసి, చల్లారాక తినాలి. -
గీత దాటితే.. వేటు తప్పదు!
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని గురువారం అర్బన్, రూరల్ ఎస్పీలు విజయారావు, వెంకటప్పలనాయుడు స్పష్టంచేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపులు, నిమజ్జనాలను తమ సూచనలు, ఆదేశాల మేరకు నిర్వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను మాత్రమే వినియోగించాలని సూచించారు. గుంటూరు:వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొనసాగే అన్ని కార్యక్రమాల నిర్వహణ, జాగ్రత్తలు, పోలీసుల ఆంక్షలను అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని పోలీస్ బాస్లు హెచ్చరించారు. అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు, రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పల నాయుడు గురువారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. నిర్వాహకులు తీసుకోవాల్సిన బాధ్యతలు, ముందస్తు అనుమతులు, జాగ్రత్తలు తదితర అంశాల గురించి వివరించారు. ఈనెల 13 నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల కొనసాగింపు విషయంలో పోలీసుల సూచనలు, ఆదేశాల మేరకు సహకరించి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నిబంధనలు ఇవీ... పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను మాత్రమే వినియోగించాలి. భారీగా మండపాలు ఏర్పాటు చేసేవారు విధిగా సీసీ కెమెరాలను ప్రధాన ద్వారాల వద్ద ఏర్పాటు చేయాలి. అగ్ని నిరోధక యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. బహిరంగ, ప్రయివేటు ప్రాంతాల్లో అనుమతులు తీసుకున్న అనంతరం మాత్రమే ఏర్పాటు చేయాలి. హైటెన్షన్ వైర్లకు దూరంగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. మండపాలు ఏర్పాటు కారణంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకోవాలి. కాలుష్య నివారణలో భాగంగా 10 డెసిబుల్స్ లోపు శబ్ధం వుండేలా మైకులు ఏర్పాటు చేయాలి. రా>త్రి 10 గంటలకు కార్యక్రమాలను ముగించుకోవాలి. విగ్రహాలు, మండపాల వద్ద శాంతి నిర్వాహక కమిటీలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకొని నిరంతరం గస్తీ కొనసాగిస్తుండాలి. ముఖ్యంగా అశ్లీల నృత్యాలు, డాన్స్లను వేయించకూడదు. మండపాల్లో విధిగా తొక్కిసలాట లాంటివి జరుగకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలి ఆదేశాలు ఇవీ... మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు ముందుగా నిర్వాహక కమిటీ సభ్యులు పోలీసుల నుంచి అనుమతి పొందాలి. గతంలో విగ్రహాలు ఏర్పాటు చేసి ఘర్షణలు జరిగిన కమిటీలకు అనుమతులు ఇచ్చేదిలేదు. ఊరేగింపు విషయాన్ని ముందురోజునే పోలీసులకు తెలియజేయాలి. వారు సూచించిన మార్గం నుంచి మాత్రమే విగ్రహాలను తరలించాలి. ఊరేగింపులో బాణసంచా పేల్చడం నిషేధం. పోలీసులు సూచించిన చోటనే విగ్రహాల నిమజ్జనం చేయాలి. ఎలాంటి అల్లర్లు జరిగినా నిర్వాహక కమిటీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సంతోషంగా జరుపుకోవాలి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలి. పోలీసు అంక్షలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ సహకరించాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. పోలీసుల గస్తీ ఆయా ప్రాంతాల్లో నిరంతరం కొనసాగుతుంది. నిర్వాహక కమిటీ సభ్యులు పోలీసుల సూచనలు పాటించాలి. ఏదైనా సమస్య ఉంటే 94910 67826 సెల్ నంబరుకు సమాచారం అందించాలి. –సీహెచ్ విజయారావు, అర్బన్ ఎస్పీ -
ఆధ్యాత్మికం..పాతబస్తీ ప్రత్యేకం
చార్మినార్: మొహర్రం సంతాప దినాలతో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒకరోజు తేడాతో కలిసి వస్తున్నాయి. 1985లో మొహర్రం సంతాప దినాలతో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒకే రోజు కలిసి వచ్చాయి. తిరిగి ఈసారి ఒక రోజు తేడాతో ఉత్సవాలు జరగనున్నాయి. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకుని షియా ముస్లిలు నగరంలోని ఆషుర్ఖానాలను తీర్చిదిద్దుతుండగా... వినాయక నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించుకోవడానికి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకే నెలలో ఒక రోజు తేడాతో మొహర్రం సంతాప దినాల ప్రారంభం...వినాయక విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు వెంటవెంటనే ప్రారంభమవుతున్నాయి. అలాగే 10వ,మొహర్రం సందర్బంగా పాతబస్తీ వీధుల్లో నిర్వహించే బీబీకాఆలం సామూహిక ఊరేగింపు ముగిసిన మరుసటి రోజే వినాయక నిమజ్జనోత్సవాలు జరుగనున్నాయి. ఒక వైపు మొహర్రం సంతాప దినాలు కొనసాగనుండగా...మరోవైపు వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగనున్నాయి. దీంతో నగరంలోని హిందువులు వినాయక ఉత్సవాల్లో నిమగ్నమవుతుండగా... షియా ముస్లిం ప్రజలు మొహర్రం సంతాప దినాల్లో పాల్గొననున్నారు. దీంతో ఇరువర్గాల ప్రజల కార్యక్రమాలతో పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది. ఇందుకోసం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో అటు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు షియా ముస్లింలతో సమావేశాలు నిర్వహించి తగిన సలహాలు,సూచనలు అందిస్తున్నారు. అదనపు బలగాలతో గట్టి బందోబస్తును నిర్వహించనున్నారు. 12నుంచి సంతాప దినాలు... హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ షియా ముస్లిం ప్రజలు ఈ నెల 12వ తేదీ నుంచి మొహర్రం సంతాప దినాలను కొనసాగించనున్నారు. ఈ నెల 11న రాత్రి ఆకాశంలో నెల వంక కనిపించిన వెంటనే మరుసటి రోజు సంతాప దినాల్లో పాల్గొంటారు. సంతాప దినాల్లో భాగంగా 21న, పాతబస్తీ వీధుల్లో అంబారీతో 10వ మొహర్రం సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. డబీర్పురా బీబీకాఅలావాకు చెందిన బీబీకాఆలంతో షియా ముస్లింలు ఊరేగింపులో పాల్గొంటారు. సంతాప దినాలను పురస్కరించుకొని డబీర్పురా బీబీకాఅలావాలో ఆలంలను ప్రతిష్టించి 1వ మొహర్రం నుంచి 10వ మొహర్రం వరకు మజ్లిస్, మాతం నిర్వహిస్తారు. 13నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 13వ, తేదీ నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 23వ తేదీన విగ్రహాలను నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించే సామూహిక నిమజ్జనోత్సవ ఊరేగింపు అనంతరం నిమజ్జనం చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఖరీదు చేసి మండపాలకు తరలిస్తున్నారు. పది రోజుల ముందుగానే ఉత్సవాల నిర్వాహకులు మండపాలు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆయా మండపాల వద్ద ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించనున్నారు. -
మట్టికి జై..
సాక్షి,సిటీబ్యూరో: వినాయక చవితి అంటే మహానగరానికి అతిపెద్ద వేడుక. గ్రేటర్లో అత్యంత వైభవంగా జరిగే నవరాత్రి ఉత్సవాలను ఈసారి పర్యావరణ హితంగా జరపుకోవాలంటోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అందుకు తగ్గట్టే వచ్చేనెల రెండో వారంలో జరగనున్న చవితి ఉత్సవాలకు ‘మట్టి గణపతుల’ పంపిణీ చేసేందుకు పీసీబీ సమాయత్తమవుతోంది. మహానగరంలో కాలుష్య ఆనవాళ్లు లేకుండా చూసేందుకు ఈ సారి సుమారు 2 లక్షల మట్టి ప్రతిమల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో ఇళ్లలో పూజించుకునే చిన్న ప్రతిమలు 1.75 లక్షలు ఉన్నాయి. మిగతావి వివిధ పరిమాణాల్లో తయారు చేస్తున్నారు. ఈ బాధ్యతలను రెండు సంస్థలకు అప్పజెప్పినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. అయితే చిన్న ప్రతిమలను నగరంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఔట్లెట్లు ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. సింహభాగం పీఓపీ విగ్రహాలే.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏటా గ్రేటర్ వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా భారీ విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. ఇందులో మట్టి విగ్రహాల సంఖ్య 25 వేలకు మించడం లేదు. మిగతావన్నీ వివిధ పరిమాణాల్లో ఉండే ‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్’ విగ్రహాలే. వీటిని నగరంలోని వివిధ చెరువులతో పాటు హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు. అయితే వీటివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పీఓపీ’తో పర్యావరణ హననం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి హానికారక రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను నగరంలోని పలు జలాశయాల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఆ సమయంలో వాటిలోని ప్రమాదకర మూలకాలు జలాశయాల్లో చేరుతున్నాయి. ముఖ్యంగా రంగుల్లో ఉండే లెడ్ సల్ఫేట్, చైనాక్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్ వంటివి కలుస్తున్నాయి. వాటితోపాటు కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా వంటి హానికారక మూలకాలు సైతం నీటిలో కలుస్తున్నాయి. ఆ విగ్రహాలతో అనర్థాలు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. ⇔ జలాశయాల్లో పట్టిన చేపలను నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని తిన్న వాకి శరీరంలోకి హానికర మూలకాలు చేరుతున్నాయి. చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. ⇔ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్ష జాతులు నాశనమవుతాయి. ⇔ ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు భారతీయ ప్రమాణాల సంస్థ, వైద్య పరిశోధనా సంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ⇔ వీటితోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనం, సిలికాన్ వంటి మూలకాలు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. ⇔ జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికర మూలకాలు అవక్షేపంగా ఏర్పడతాయి. ప్రత్యామ్నాయం తప్పనిసరి ⇔ జల, వాతావరణ కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇందుకు మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే ప్రతిష్టించి, నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణం సైతం చిన్నవిగానే ఉండాలి. ⇔ ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసే విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించాలి. ఎక్కడి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసేందుకు కృషి చేయాలి. ⇔ నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు. ⇔ విగ్రహాలతో పాటు జలాశయాల్లోకి పూవులు, కొబ్బరి కాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథిన్ కవర్లను పడవేయరాదు. నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను తొలగించాలి. ⇔ పర్యావరణంలో త్వరగా కలిసిపోయే పదార్థాలనే విగ్రహాల తయారీలో వాడాలి. ⇔ పీఓపీ(ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్)తో చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితిలో నిమజ్జనం చేయరాదు. ఇలాంటి విగ్రహాలను వచ్చే ఏడాది వినియోగించేలా ప్రోత్సహించాలి. -
నిమజ్జనం ఇక ఈజీ
సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల నిమజ్జనాన్ని మరింత వేగవంతం చేసేందుకు పోలీసుశాఖ అధునాతన క్రేన్ హుక్కులను అందుబాటులోకి తెచ్చింది. నగరంలో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాల సంఖ్య ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో విగ్రహాలను నిర్ణీత సమయంలో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో కొంత వరకుక్రేన్ల సంఖ్య పెంచుకుంటూపోయారు. అయితే వీటి సంఖ్యను పెంచడం కంటే ఉన్న క్రేన్లతోనే వీలైనన్ని ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతేడాది ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని క్రేన్లకు ప్రత్యేక డిజైన్తో కూడిన కొండీలను (హుక్స్) ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి మరింత అడ్వాన్డŠస్ హుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని రెండురోజుల క్రితం ట్యాంక్బండ్ వద్ద పరీక్షించిన నగర పోలీసు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీచక్ర ఇంజినీరింగ్ సంస్థ నిర్వాహకుడు టి.మురళీధర్ రూపొందించిన ఈ ‘క్విక్ రిలీజ్ డివైజ్’ (క్యూఆర్డీ) హుక్స్ ఈసారి ట్యాంక్బండ్ మీద ఉండే అన్ని క్రేన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనాకి వినియోగించే అవకాశం ఉంది. తొలిసారిగా ఈ క్యూఆర్డీ హుక్స్ను గతేడాది వినియోగించారు. హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న 36 క్రేన్లలో 20 క్రేన్లను వీటిని వాడారు. క్రేన్ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్ చేశారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్... అది నీటిని తాకిక వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే విడిపోతాయి. గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తయింది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్లిన తర్వాత క్రేన్పై ఉండే వ్యక్తులు కొండీలను డీలింక్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలు సైతం జరిగేవి. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేస్తే.. క్యూఆర్డీ హుక్స్ వినియోగించిన క్రేన్ ఇదే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. ఈసారి వీటినిపై మరింత రీసెర్చ్ చేసిన మురళీధర్.. ‘అడ్వాన్డŠస్ వెర్షన్’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత హుక్ 15 కేజీల వరకు బరువు ఉండి, నిర్వహణ కష్టంగా ఉండేది. దీంతో దీని బరువును గరిష్టంగా 5 కేజీలకు తగ్గించారు. ఇవి ఉన్న క్రేన్ ఓ విగ్రహాన్ని గరిష్టంగా 15 సెకన్లతో నిమజ్జనం చేస్తుంది. నాలుగు హుక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. రెండింటితోనూ నిమజ్జనం పూర్తి చేయవచ్చు. -
శ్రేయస్కరం... శుభస్కరం
సాధారణంగా లోకంలో ఎన్నో దీక్షలున్నాయి. కాని అన్నింటిలోనూ గణపతి దీక్ష అత్యంత సులభసాధ్యమైనది, అన్నివేళల్లో అందరూ సులభంగా ఆచరించదగినది. ఎక్కువ నియమ నిబంధనలు లేకుండా, ఏ ఇబ్బందులూ కష్టాలూ లేకుండా బాలల నుంచి వృద్ధుల వరకూ, స్త్రీ, పురుషులందరూ చేయగలిగినది. వ్యాసభగవానుడు ముద్గల పురాణంలో తెలిపిన ఈ గణపతి దీక్షను ఆచరించి, కోరిన కోరికలను నెరవేర్చుకోగలిగేందుకు ఈ వారం మీకోసం... ఈ గణపతి దీక్షను వినాయకుడి ఆలయంలో ఒక శుభముహూర్తాన స్వీకరించాలి. దీక్ష తీసుకునే రోజు అభ్యంగ స్నానమాచరించి గణపతి ముందు రెండు చేతులు జోడించి, ‘ఓ గణేశా! ఈ రోజు నుంచి నీ దీక్షావ్రతాన్ని అవలంబించి యథాశక్తి నిన్ను సేవిస్తాను. దీక్షా సమయంలో ఏ విధమైన విఘ్నాలూ కలగకుండా నా కోరికను నెరవేర్చి నీ అనుగ్రహాన్ని ప్రసాదించ’మని ప్రార్థించుకోవాలి. ఏ రంగు వస్త్రాలంటే..? బంగారు రంగుతో మెరుస్తూ ఉన్న కొత్త వస్త్రాలను లేదా లేత ఎరుపురంగు వస్త్రాలు, గణపతి చిహ్నంతో ఉన్న ఒక మాల, కంకణ ం ధరించాలి.దీక్షను స్వీకరించే ముందు –ఆదిదేవ గణాధ్యక్ష! త్వదనుగ్రహకారకం!దీక్షాం స్వీకృత్యత్వతేవాం కరోమీప్సిత సిద్ధయే! అనే దీక్షా మంత్రాన్ని పఠిస్తూ మాలను మెడలో ధరించాలి. చేతికి కంకణాన్ని ధరించాలి. మన కోరికను అనుసరించి 3, 5, 11, 21, 41 రోజులు లేదా శుద్ధ చవితి నుంచి బహుళ చవితి వరకు లేదా బహుళ చవితి నుంచి శుద్ధ చవితి వరకు లేదా వినాయక చవితి నాటికి 11, 5, లేదా 3 రోజులు పూర్తయే విధంగా సులభమైన తిథిని ఎంచుకుని మనకు అనుకూలంగా దీక్షను స్వీకరించాలి. ప్రతిరోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని గణపతిని యథాశక్తి ఆరాధించి, అల్పాహారం చేసి, సాయంత్రం ప్రదోష పూజ చేసుకుని, స్వామికి నివేదించిన భోజనాన్ని స్వీకరించాలి. మధ్యలో పండ్లు లేదా పాలు వంటివి తీసుకోవచ్చు. రోగగ్రస్థులు, పిల్లలు, గర్భిణులు, వృద్ధులు తమకు అనుకూలంగా ఆహారాలను స్వీకరించవచ్చు. తూర్పు ముఖంగా కూర్చొని, గణపతి ప్రతిమను లేదా విగ్రహాన్ని లేదా పటాన్ని ముందుంచుకొని పూజించాలి. అవకాశముంటే దీక్షరోజు పళ్లెంలో బియ్యం పోసి, పసుపుతో ముగ్గువేసి, ఒక కలశాన్ని పెట్టి దానిలో నీరుపోసి, అందులో మామిడి మండలు ఉంచి పైన నిండు కొబ్బరికాయను మూతగా ఉంచి, రవికెల గుడ్డను చుట్టి, ఆవాహన చేసి పూజించవచ్చు. ఈ కలశాన్ని దీక్ష ముగిసే వరకు పూజించి ఉద్వాసన చేయవచ్చు. ఎక్కడ ఉన్నా రెండుపూటలా పూజించుకోవడమే ప్రధానం. పూజ ఎక్కువ సమయం చేయలేనివారు మానసిక పూజ చేయవచ్చును. ప్రయాణాలలో ఇది బాగా ఉపకరిస్తుంది. ‘ఓం గం గణపతయే నమః’ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇరుముడికి ప్రత్యామ్నాయంగా గణపతికి ప్రీతికరమైన కొబ్బరి, చెరకు, బెల్లం, అటుకులు, పేలాలు, తేనె, అరటిపండ్లు, ఖర్జూరాలు, తెల్లనువ్వులు, ఉండ్రాళ్ళు సమర్పించడం శుభప్రదం. దీక్షా నియమాలుపూజలో పసుపు, కుంకుమ, అక్షతలు, ఎర్రని పూలు, అగరువత్తులు, హారతి కర్పూరం, దీపం, నైవేద్యం ముందే సిద్ధం చేసుకోవాలి. గరిక (గడ్డిపరకలు), ఎర్రని లేదా తెల్లని పూలు విధిగా ఉంచాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మద్యమాంసాలను విసర్జించి, అందరితోనూ సాత్వికంగా మెలగాలి. దీక్షలో ఉన్నప్పుడు అవకాశాన్ని బట్టి గణపతిని ఆయా దేవాలయాల్లో దర్శించుకోవడం మంచిది. నుదుట విభూతి, గంధం, కుంకుమ ధరించాలి. తినే ప్రతి ఆహార పదార్థాన్ని ‘గణేశార్పణమస్తు’ అని స్వీకరించాలి. దీక్షలో ఉన్నప్పుడు ప్రతి ప్రాణిని గణపతి స్వరూపంగా చూడగలగాలి. దీక్షా ఫలితం ఈ దీక్షను సక్రమంగా పూర్తి చేసిన విద్యార్థులకు సద్బుద్ధి, అఖండ విద్యాప్రాప్తి కలుగుతాయి. సంతానార్థులకు సంతానం, ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుందని విశ్వాసం. వరంగల్కు చేరువలోని కాజీపేటలో శ్వేతార్క గణపతి దీక్షలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. -
స్వచ్చ గణేష్ సాక్షిగా..2nd Sep 2017
-
వినాయక చవితి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా విఘ్నాలు తొలగిపోయి అన్నీ విజయాలే సిద్ధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. Happy Vinayaka Chavithi to one and all. May this Ganesh Chaturthi bring peace & prosperity to you. — YS Jagan Mohan Reddy (@ysjagan) 25 August 2017 తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ... రెండు రాష్ట్రాల ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని మనసారా కోరుకున్నారు. రెండు రాష్ట్రాలకు విఘ్నాలు తొలగిపోయి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
పర్యావరణ పరిరక్షక దేవుడు గణనాథుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు సాక్షి, అమరావతి : వినాయకుడు ప్రకృతికి ప్రతీకగా నిలిచే ఆరాధ్యదైవమని, గణేశ్ పూజలకు మట్టి ప్రతిమలనే ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగు వారికి ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పురోభివృద్ధికి విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. విఘ్నేశ్వురుణ్ణి 21 రకాల చెట్ల ఆకులతో పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయని, ఔషధ గుణాలున్న అటువంటి వృక్ష జాతులను రక్షించి, భావితరాలకు అందించాలన్న సందేశం ఇందులో ఇమిడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. -
పంచమి నుంచి చవితి వరకు..
వినాయక చవితి...సంవత్సరానికి ఒక్కసారే వచ్చే పండుగైనా సంవత్సరమంతా గుర్తుండేలా ఎవరికి వారు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే అనంతపురం సప్తగిరి సర్కిల్లోని వినాయక చౌక్లో ప్రతిష్టించే గణపతికి విశేష ప్రాముఖ్యం ఉంది. అందుకే ఇక్కడే చేసే ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ నెల 12న పంచమి రోజున భూమిపూజతో ప్రారంభమైన పనులు 25వ తేదీ చవితి నాటికి పూర్తయ్యాయి. ఆగస్టు 12 : చవితి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతపురం నగర మేయర్ స్వరూప, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పరిచూరి రమేష్ ఆధ్వర్యంలో వినాయక చౌక్లో వేదపండితులు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల ప్రారంభానికి ప్రతీకగా కాషాయ జెండాను ఎగురవేశారు. ఆగస్టు 17 : వినాయకచౌక్లో వేసే గణేష్ మంటపం నమూనా ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది. ఈసారి రాజస్థాన్ నుంచి విచ్చేసిన కళాకారులు తమ నైపుణ్యంతో మంటపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే 17వ తేదీ నాటికి మంటపం ముఖ ద్వారం పనులు ప్రారంభించారు. ఆగస్టు 19 : గణేష్ మంటపం కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఉంటుంది. ముఖద్వారం నుంచి దాదాపుగా 100 మీటర్ల వరకు ఉండే మంటపంపై రేకులు వేయడంతో పాటు ముఖద్వారానికి ఓరూపు తీసుకువచ్చారు. ఆగస్టు 22 : రాజస్థాన్లోని రణతంబోర్లోని ఆలయ నమూనాతో మంటపాన్ని ప్రారంభించిన కళాకారులు 22వ తేదీ నాటికి ముఖద్వారాన్ని చక్కగా తీర్చిదిద్దారు. మంటపం ఎదురుగా రెండు ఏనుగులు ఘీకారం చేస్తున్నట్లుగా అద్భుతంగా తీర్చిదిద్దారు. చుట్టప్రక్కల పరదాలను ఏర్పాటు కూడా పూర్తి చేశారు. ఆగస్టు 23 : మంటపం ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చింది. 23వ తేదీ బుధవారం నాటికి మంటపం పనులు పూర్యయ్యాయి. మంటపం లోపల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అవసరమైన నమూనా కూడా పూర్తి చేశారు. మంటపం బయట, లోపల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆగస్టు 24 : పనులన్నీ పూర్తికాగా...విద్యుత్దీపాల వెలుగులో వినాయక చౌక్ కాంతులీనింది. సప్తగిరి సర్కిల్ నుంచి మంటపం వరకు విద్యుత్ దీపాలతో స్వాగత తోరణాలు...అమ్మవారి రూపాలను రూపొందించారు. మంటపం లోపల ‘గంగా–పార్వతీ సంవాదం’ పేరిట కదిలే విగ్రహాలను సిద్ధం చేశారు. ఆగస్టు 25 : సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన మంటపంలో రణతంబోర్ ఆలయంలోని విగ్రహాన్ని పోలిన రీతిలోనే తయారు చేసిన స్వామివారి విగ్రహాన్ని తెల్లవారుజామున ప్రతిష్టించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించి..దర్శనానికి ఏర్పాట్లు చేశారు. -
వినాయక..నమో నమః
– వాడవాడలా సిద్ధమైన మండపాలు - విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్న వీధులు – పూజ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట విఘ్ననాయకుడు చవితికి సిద్ధమయ్యాడు. ఉత్సవాలకు జనం వినాయక చవితి వచ్చిందంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా ఉత్సవంలో పాల్గొనే ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. పల్లె నుంచి పట్నం దాకా సంబరాలు అంబరాన్నంటుతాయి. అందుకే అందరూ గణేష్ ఉత్సవాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తుంటారు. అందరినీ ఒక్కటి చేసే ఈ పండుగ రానే వచ్చింది. ఇలా పండుగ రానే వచ్చింది.నేడు వినాయక చవితి. కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు,,చిన్నాపెద్దా తేడా లేకుండా ‘అనంత’ వాసులంతా ‘జైబోలో గణేశ్ మహారాజ్కి...జై’ అంటూ విగ్రహాలను తమ ప్రాంతాలకు తీసుకెళ్లారు. – అనంతపురం కల్చరల్: భాద్రపదమాస బహుళ చవితి నాడు వినాయక చవితి పండుగ వస్తుంది. భక్తులంతా బహురూపాల్లో వినాయకుడి ప్రతిమలు రూపొందించి పూజలు చేస్తారు. పండుగ నేపథ్యంలో గురువారమే జిల్లా వ్యాప్తంగా వినాయకుడి ప్రతిమలను కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. ఇక పర్యావరణ హితం కోసం చేపట్టిన మట్టి విగ్రహాల పంపిణీకి విశేష స్పందన లభించింది. అనంతపురం, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరితో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణప్రాంతాలు గురువారం ఉదయం నుంచి విగ్రహాల కొనుగోళ్లతో సందడి మారాయి. ఆటోలు, ట్రాక్టర్లు, భారీ లారీలలో విగ్రహాలను తీసుకెళ్లారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు కూడా పెద్దలతో పాటు విగ్రహాల వద్దకు వచ్చారు. కాషాయరంగు రిబ్బన్లు తలకు ధరించి ‘జైబోలే గణేశ్ మహారాజ్కి జై...గణపతిబప్ప మోరియా...అంటూ ఈలలు, కేకలు వేసుకుంటూ విగ్రహాలను తరలించారు. ముస్తాబైన మండపాలు గణనాథుడు కొలువుదీరే మండపాలను అందంగా ముస్తాబు చేశారు. అనంతపురంలోని వినాయక్చౌక్లో 13 రోజులుగా మండపం నిర్మాణపనులు సాగాయి. 35 ఏళ్లుగా ఇక్కడ ఖరీదైన మండపాన్ని నిర్మించి అంగరంగ వైభవంగా పండుగను చేస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుదీపాలు, లైటింగ్బోర్డులు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మండపాలను అలంకరించారు. కిటకిటలాడిన ప్రధాన కూడళ్లు జిల్లాలోని అన్ని పట్టణప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మార్కెట్తో పాటు ప్రధాన వీధులన్నీ జనంతో పోటెత్తాయి. నూతన వస్త్రాల కొనుగోళ్లతో షాపింగ్మాళ్లు కిటకిటలాడాయి. చెరుకు గడలు, పూలు, గరిక, పండ్లు లాంటి పూజా సామగ్రి, వినాయక ప్రతిమలను ఇంటి తీసుకెళ్లడానికి వచ్చిన జనంతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. అనంతపురం నగరంలోని పండుగ మొత్తం పాతూరుమార్కెట్ వద్దే కన్పించింది. పూల దుకాణాల వద్ద రద్దీతో జనాలు అడుగుతీసి అడుగేయడమే కష్టంగా మారింది. రాష్ట్రంలోనే సం‘చలనం’ వినాయక చవితి వేడుకల్లో భాగంగా జిల్లా వాసులు తొలిసారి విగ్రహాలను కదిలేలా రూపొందించారు. 35 ఏళ్ల కిందట నుంచే వినాయక చవితి పర్వదినానికి సంబంధముండే పురాణేతిహాసాలతో సంగీతంతో మమేకమై సాగే కదలికలు రాష్ట్రంలోనే తొలిసారి నగరంతోనే ప్రారంభమయ్యాయి. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం ‘గంగా–పార్వతీ సంవాదం’ పేరిట భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ రణతంబోర్ వినాయక ఆలయ నమూనాతో పాటు దాదాపు రూ.30 లక్షల వ్యయంతో సాగుతున్న విగ్రహ కదలికలు జిల్లాకే తల మానికం కానున్నాయి. 10 వేల విగ్రహాలు అనంతపురం నగరంలో అధికారికంగా 510 విగ్రహాలకు అనుమతి తీసుకున్నారు. అనధికారికంగా మరో 500కుపైగా విగ్రహాలను ఏర్పాటు చేసి ఉంటారు. వీటితో పాటు ఇళ్లలో ఏర్పాటు చేసినవి అదనం. ఇలా జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లోని పట్టణ, పల్లె ప్రాంతాల్లో కలిపి కనీసం 10 వేల విగ్రహాలు ఏర్పాటు చేసి ఉంటారని అంచనా. ఈ లెక్కన ఈ పండుగ ఖర్చు కనీసం రూ.50 కోట్ల మేర ఉంటుంది. అనంతపురంలోని మొదటిరోడ్డులోని వినాయక చౌక్, కోర్టురోడ్డు, రాణీనగర్లలో సైతం కదలిక వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అన్ని చోట్లా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. -
ఉత్సవాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
అనంతపురం అగ్రికల్చర్: వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అనంతపురం డివిజన్ డీఈ ఎస్.నారాయణనాయక్ తెలిపారు. మంటపాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ విద్యుత్ సరఫరా కోసం సమీపంలో ఉన్న సబ్స్టేషన్, సెక్షన్ ఆఫీసు, పాతవూరు పవర్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్, సర్కిల్ ఆఫీసుల్లో ఎక్కడైనా సంప్రదించవచ్చన్నారు. తాత్కాలిక సరఫరా కింద సర్వీసు కోసం అనుమతి తీసుకుని డీడీ రూపంలో డబ్బు చెల్లించాలన్నారు. లేదంటే సమీపంలో ఉన్న నివాసాల నుంచి కూడా అనుమతితో సరఫరా తీసుకునే వీలుందన్నారు. ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ కొక్కీలు తగిలించడం, ఇతరత్రా అక్రమంగా విద్యుత్ను వాడితే అపరాధ రుసుము విధించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లైన్మెన్, ఏఈ, ఏడీఈ, డీఈలను సంప్రదిస్తే విద్యుత్ సరఫరా, ఇరతత్రా జాగ్రత్తలపై అవసరమైన చర్యలు, అలాగే ఫోన్ నంబర్లు కూడా ఇస్తారని తెలిపారు. మంటపాలకు విద్యుత్ సరఫరా చేసే సమయంలో స్టాండర్డ్ సర్వీసు వైర్లు ఉపయోగించాలన్నారు. ఎటువంటి జాయింట్లు ఉండకూడదన్నారు. ఫీజు కటౌట్లు, మంటలు ఆర్పడానికి అవసరమైన సామగ్రి (ఫైర్ ఎక్స్టెన్యుడసర్) అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎక్కువ విద్యుత్ ఖర్చు అయ్యే సోడియం వెపర్ లైట్లు కాకుండా ఎల్ఈడీ లేదా సీఎస్ఎల్ బల్బులు వాడితే మేలన్నారు. పెద్ద పెద్ద మంటపాల నిర్వాహకులు ఎలక్ట్రీషియన్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వివరాలకు 08554–276567, 08554–272213, లేదంటే 1912 టోల్ఫ్రీ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. -
నిమజ్జనం.. ఓ విఘ్నం!
►ముంచుతారా.. తేలుస్తారా! ►గణనాథునికి నిమజ్జన కష్టాలు ►జిల్లాలో ఎక్కడా చుక్కనీరు లేని వైనం ►హెచ్ఎల్సీ నీటి విడుదల అనుమానమే.. ►ప్రత్యామ్నాయం శూన్యం అనంతపురం సెంట్రల్: కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. మరో మూడు రోజుల్లో మొదలవనున్న ఈ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్న వేళ.. ఓ విఘ్నం భక్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు నీటి జాడ లేకపోవడంతో నిమజ్జనం ఎలా చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పండుగకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో.. నిమజ్జనానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు.. జిల్లా కేంద్రంలో ఐదు రోజులకు నిమజ్జనం కోలాహలంగా నిర్వహిస్తారు. గతంలో ఎప్పుడూ ఈ సమయానికి చెరువులు జల కళ సంతరించుకునేవి. తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్ఎల్సీ)కి పుష్కలంగా నీళ్లొచ్చేవి. అయితే ఈ ఏడాది ఈ పరిస్థితి కరువయింది. ఎక్కడా చుక్క నీరు లేని పరిస్థితుల్లో నిమజ్జనం ఎలాగనే చర్చ తలెత్తుతోంది. అనంతపురంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను గుత్తిరోడ్డులోని హెచ్ఎల్సీ కాలువ వద్ద పెద్ద క్రేన్ సాయంతో నిమజ్జనం చేస్తారు. అలాంటిది.. ఇప్పటి వరకు కాలువకు నీటి విడుదల లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ఇటీవల జరిగిన టీబీ బోర్డు సమావేశంలో జలాశయానికి నీటి లభ్యత తక్కువగా ఉందని.. సెప్టెంబర్ నాటి పరిస్థితి ఆధారంగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మిడ్ పెన్నార్ జలాశయం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. పీఏబీఆర్లో మాత్రమే ఒక టీఎంసీ నీరు ఉంది. ఈ నీరు నెల రోజులకు మాత్రమే సరిపోతుంది. ఆ తర్వాత శ్రీరామరెడ్డి తాగునీటి పథకం, వైఎస్ఆర్ తాగునీటి పథకాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ టీబీ డ్యాం నీటి విడుదల విషయమై బళ్లారి జిల్లా కలెక్టర్తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో నిమజ్జనం విషయంలో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నడూ చూడని విధంగా జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవానికి నీటి కష్టాలు చుట్టుముట్టడం గమనార్హం. గతంలో యల్లనూరు, పుట్లూరు మండలాల్లో ఒట్టి చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం తెలిసిందే. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనూ అలాంటి పరిస్థితి తప్పదేమోననే చర్చ జరుగుతోంది. తాగునీటిని వదిలేది లేదు తుంగభద్ర జలాశయం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరాం. మంగళవారం నుంచి 500 క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల అడుగుతున్నాం. ఇప్పటి వరకూ అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఎంపీఆర్, సీబీఆర్ జలాశయాలు ఇప్పటికే డెడ్స్టోరేజీకి చేరుకున్నాయి. పీఏబీఆర్లో నెలరోజులకు సరిపడా మాత్రమే నీళ్లున్నాయి. ఎట్టి పరిస్థితిలో నీళ్లు వదిలేది లేదు. వినాయక నిమజ్జనం ఎలా అనేది నా పరిధిలో లేదు. - టి.వి.శేషగిరిరావు, ఎస్ఈ, హెచ్చెల్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం జిల్లా కేంద్రంలో మాత్రమే 500లకు పైగా విగ్రహాలు కొలువు దీరుతాయి. ఐదవరోజు వేలాది మంది జనసందోహం నడుమ నిమజ్జనం జరుపుకోవడం ఆనవాయితీ. నిమజ్జనానికి నీళ్లు వదలాలని గతంలో హెచ్చెల్సీ అధికారులను కోరాం. జిల్లా అధికారులతో పాటు నాయకులు చొరవ చూపాలి. - పరుచూరి రమేష్, వినాయక ఉత్సవ సమితి, ప్రధాన కార్యదర్శి నీళ్లు వస్తాయి తాగునీటి కోసం నీటిని విడుదల చేయాలని తుంగభద్రబోర్డు అధికారులను కోరాం. రెండు రోజుల్లో తుంగభద్ర నుంచి నీటిని వదులుతారు. వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాం. ఒకవేళ రాని పక్షంలో ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం. - వీరపాండియన్, జిల్లా కలెక్టర్ -
వినాయకుణ్ని పెంచుకుందాం..!
దేవుడికి అలసట అంటూ ఒకటి ఉండదేమో! ఎలా కొలిచినా తనవాణ్ని చేసేసుకుంటాడు. ఇక విఘ్నాలను తొలగించే దేవుడిగా పేరున్న వినాయకుడికైతే ఏటా పెద్ద ఉత్సవమే నిర్వహిస్తాం. ఇంట్లో చిన్న వినాయకుణ్ని పెట్టుకుంటాం. వీధిలో పదడుగులు ఉంటుంది ఒక విగ్రహం. ఓ ఊర్లో యాభై అడుగులు ఉంటుంది ఇంకో విగ్రహం. ఎలా కొలిచినా సరే కదా అని చెప్పి రకరకాల రంగులు వాడేస్తున్నాం. విగ్రహం తయారీకి ఏవేవో కృత్రిమ పదార్థాలు వాడేస్తున్నాం. అవన్నీ నిమజ్జనం రోజున చెరువుల్లో, నదుల్లో మునిగిపోయి ప్రకృతిని పాడు చేస్తున్నాయి. విఘ్నాలను తొలగించే దేవుణ్ని కొలిచేందుకు ప్రకృతికి ఎన్ని విఘ్నాలు కలిగిస్తున్నాం? అందుకే ఇప్పటికైనా ఎకో ఫ్రెండ్లీ (పర్యావరణహిత) మార్గానికి వెళ్దాం అంటూ పుట్టుకొచ్చిన కొత్త వినాయకుణ్ని కొలుద్దాం... దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే వినాయకుడికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజున మొదలయ్యే ఈ ఉత్సవాన్ని ఏటా తొమ్మిది నుంచి 21 రోజుల పాటు జరుపుతున్నాం. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించడం మొదలుపెట్టారు. ఆయన మరణం తర్వాత ఈ వేడుక మళ్లీ ఇంటివరకే చేసుకునే పండుగగానే మిగిలిపోయింది. 1880వ దశకంలో, బ్రిటిష్ పాలన జరుగుతున్న రోజుల్లో లోకమాన్య బాలగంగాధర తిలక్ నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలను మరోసారి పెద్ద ఎత్తున నిర్వహించడం మొదలైంది. ఇక నాటినుంచి ఏటా వినాయక చవితి ఉత్సవాలు అదే స్థాయిలో జరుగుతూనే వస్తున్నాయి. మొదట్లో వినాయక చవితి ఉత్సవాలకు పూర్తిగా మట్టి విగ్రహాలనే తయారు చేసేవారు. ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రాకతో విగ్రహాల తయారీల ఖర్చు ఊహించని స్థాయిలో తగ్గడం, సులువుగా, కలర్ఫుల్గా విగ్రహాలను తయారుచేసే అవకాశం దొరకడంతో దాదాపుగా సమాజమంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకే ఓటు వేస్తూ వచ్చింది. అయితే విగ్రహాల తయారీకి ఇలా వాడుతోన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కృత్రిమ రంగులు వినాయక నిమజ్జనం తర్వాత నీటిని కలుషితం చేస్తున్నాయని, పర్యావరణానికి హాని చేస్తున్నాయని చెబుతూ గత ఐదారు సంవత్సరాలుగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల వైపుకు సమాజం అడుగులేస్తోంది. ఏటా ఇదే విషయంపై ఎన్నో క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగానే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. అలాంటి కొత్త వినాయకుడి విశేషాలు.. వినాయకుణ్ని పెంచుకుందాం..! వినాయకుణ్ని తొమ్మిది రోజుల పాటు ఇష్టంగా కొలుస్తాం. పూజలు చేస్తాం. ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను పెడతాం. పదోరోజు భారీగా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేసి, కైలాసానికి సాగనంపుతాం. అక్కడితో మన పని అయిపోతుంది. నిమజ్జనం జరిగాక కూడా ఆ దేవుడే చెట్టంతై మనతోనే ఉంటే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన వచ్చింది 30 ఏళ్ల కొతూర్ దత్తాద్రికి. అనుకున్నదే తడవు ట్రీ వినాయకుణ్ని తయారు చేశాడు. ఎర్ర మట్టిలో కొన్ని రకాల విత్తనాలను కలిపి, ఆ మట్టితో చిన్న వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని ఓ కుండీలో పెట్టి పూజించుకున్నాడు. పదో రోజున దగ్గర్లో ఉన్న చెరువులో కాకుండా అదే కుండీలో నీళ్లు పోసి నిమజ్జనం చేశాడు. ఆ మట్టిలోని విత్తనం మొక్కగా మారింది. నిమజ్జనం తర్వాత కైలాసానికి వెళ్లిపోయినా, ఆ దేవుడింకా మొక్కలా అదే ఇంట్లో కొలువై ఉన్నాడు. వినాయకుణ్ని పెంచుకోవాలన్న దత్తాద్రికి వచ్చిన ఈ ఆలోచన ఎంత బాగుందీ!! ఎకో ఫ్రెండ్లీ క్యాంపెయిన్లో భాగంగా గతేడాది చాలామంది ఈ దారిని ఎంచుకున్నారు. ఈ ఏడాది ట్రీ వినాయకుడికి మరింత క్రేజ్ పెరిగింది. ఆకలి తీర్చిన వినాయకుడు రింతూ రాథోడ్కు వినాయకుణ్ని పూజించడం ఎంతిష్టమో, పర్యావరణాన్ని కాపాడుకోవడమూ అంతే ఇష్టం. దీంతో ఎకో ఫ్రెండ్లీ వినాయకుణ్ని తయారు చేయాలని నిశ్చయించుకుంది. స్వతహాగా హోమ్ బేకర్ అయిన రింతూ, చాకొలేట్తో 35 కిలోల వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసింది. కొన్ని ఫుడ్ కలర్స్ను వాడుతూ ఆ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దింది. తొమ్మిది రోజులు ఏసీ గదిలో ఆ వినాయకుణ్ని పూజించింది. నిమజ్జనం రోజున 90 లీటర్ల పాలు తీసుకొచ్చి, చాకొలేట్ వినాయకుణ్ని నిమజ్జనం చేసింది. నిమజ్జనం అయ్యాక ఆ పాలు, చాకొలేట్లతో తయారైన ఆహారాన్ని ఏం చేసిందో తెలుసా? దగ్గర్లోని నిరుపేద పిల్లలకు పంచి పెట్టింది. పండుగరోజున చాకొలేట్ వినాయకుడు ఎంతమంది పిల్లల చిన్ని బొజ్జలను నింపాడో!! టేస్టీ వినాయకుడు ఈ వినాయకుడు నిజంగానే టేస్టీ! తినే పదార్థాలతోనే ఈ వినాయకుణ్ని తయారు చేస్తున్నారు. బిస్కెట్స్, బాదం, జీడిపప్పు, గోధుమ పిండి, క్యాండీలు.. ఇలా రకరకాల తినే పదార్థాలను వాడుకుంటూ అందంగా, ఆకర్షణీయంగా వినాయకుణ్ని తయారు చేయడం కూడా ఇప్పుడు బాగా కనిపిస్తోంది. కొంత శ్రమ, ఆసక్తి ఉంటే సొంతంగానే ఈ టేస్టీ వినాయకుణ్ని తయారు చేసుకోవచ్చు. విశ్వ వినాయకుడు వినాయకుడు కేవలం హిందూమతానికి మాత్రమే, కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు. వినాయకుణ్ని జైనులు, బౌద్ధులు కూడా తమ తమ రీతుల్లో ఆరాధిస్తారు. భారతదేశంతో పాటు పలు ఆసియా దేశాల్లో వినాయకుడి ఆరాధన వేల ఏళ్ల కిందటే ఉండేదనేందుకు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రమథ గణనాయకుడైన వినాయకుడు నిజానికి విశ్వవినాయకుడు. భారత భూభాగానికి వెలుపల గజాననుడి ఆరాధన విశేషాలు మీ కోసం... వినాయకుణ్ని వ్యాపారవర్గాల వారు విశేషంగా ఆరాధించేవారు. సముద్ర వర్తకుల పుణ్యమా అని వినాయకుడు భారత భూభాగాన్ని దాటి బర్మా, థాయ్లాండ్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా, వియత్నాం, జపాన్ తదితర దేశాలకు విస్తరించాడు. హిందువుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్లోను, శ్రీలంకలోను, నేపాల్కు పొరుగునే ఉండే భూటాన్, టిబెట్ ప్రాంతాలలో కూడా శతాబ్దాల కిందటే వినాయకుడి ఆరాధన ఉండేది. హిందూ మతస్తులతో పాటు వారితో సన్నిహితంగా మెలగిన జైనులు, బౌద్ధులు కూడా వినాయకుణ్ని ఆరాధించేవారు. జైన వినాయకుడు జైన మత నిబంధనలకు సంబంధించిన సాహిత్యంలో ఎక్కడా వినాయకుడి ప్రస్తావన కనిపించకపోయినా, జైనులు వినాయకుణ్ని శతాబ్దాల కిందటే ఆరాధించేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. పన్నెండో శతాబ్దికి చెందిన జైన గురువు హేమచంద్ర రాసిన ‘అభిధాన చింతామణి’, పదిహేనో శతాబ్దికి చెందిన జైన గురువు వర్ధమాన సూరి రాసిన ‘ఆచార దినకర’ వంటి గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. వినాయకుణ్ని ఈ గ్రంథాలలో హేరంబుడిగా, గణవిఘ్నేశుడిగా, వినాయకుడిగా అభివర్ణించారు. ఇవి శ్వేతాంబర జైన గ్రంథాలు. దిగంబర జైన గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన పెద్దగా కనిపించదు. ఒడిశా రాజధాని భువనేశ్వర్కు చేరువలోని ఖండగిరి, ఉదయగిరి గుహలలోను, మథురలోను మధ్యయుగాల నాటి జైన ఆరాధనా కేంద్రాలలో వినాయకుడి శిల్పాలు కనిపిస్తాయి. రాజస్తాన్, గుజరాత్లలోని జైన ఆలయాల్లోనూ వినాయకుడి చిత్రాలు కనిపిస్తాయి. బౌద్ధ వినాయకుడు ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. గుప్తుల కాలం నాటి బౌద్ధ శిల్పాలలో వినాయకుడి శిల్పాలు కూడా కనిపిస్తాయి. టిబెటన్ల వినాయకుడు రుధిరవర్ణంలో ఉగ్రరూపంలో కనిపిస్తాడు. ‘మహారక్త’ గణపతిగా టిబెటన్లు వినాయకుణ్ని తాంత్రిక పద్ధతుల్లో కొలిచేవారు. టిబెట్లోని వజ్రయాన బౌద్ధులు, చైనాలోని షింగాన్ బౌద్ధులు వినాయకుణ్ని ఆరాధించేవారు. షింగాన్ బౌద్ధుల ద్వారానే వినాయకుడి ఆరాధన జపాన్కు పాకింది. జపాన్ రాజధాని టోక్యో శివార్లలోని అసాకుసా ప్రాంతంలో పన్నెండో శతాబ్ది నాటి గణపతి ఆలయం ఉంది. బౌద్ధులు గణపతిని తమ దైవాలలో ఒకరిగా ఆరాధిస్తే, హిందువుల గణపతి పురాణం, ముద్గల పురాణాలు బుద్ధుణ్ని గణపతి అవతారంగా అభివర్ణించడం విశేషం. థాయ్లాండ్ వాసులు వినాయకుణ్ని ఆరాధించడం ద్వారా అదృష్టం కలసి వస్తుందని, విజయాలు వరిస్తాయని విశ్వసిస్తారు. ఇండోనేసియన్లు గణపతిని జ్ఞానప్రదాతగా పూజిస్తారు. ఇండోనేసియాలోని బేండుంగ్లో గణేశుడి పేరిట ఒక వీధి ఉంది. జావాకు చేరువలోని ఒక దీవిలో క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటి పురాతన వినాయకుడి విగ్రహం బయటపడింది. ఇండోనేసియాలోని ప్రంబానన్ ఆలయంలో తొమ్మిదో శతాబ్ది నాటి వినాయకుడి విగ్రహం ఉంది. ఇవన్నీ ప్రాచీనకాలం నుంచే ఇతర దేశాల్లోని వినాయకుడి ఆరాధనకు, ఉనికికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉన్నాయి. లంబోదరునికి నైవేద్యం... వినాయక చవితి అనగానే గుర్తొచ్చేవి... తొమ్మిది లేదా పదకొండు రోజులు జరిగే పూజలు, పెట్టే రకరకాల ప్రసాదాలు. అలాగే పండుగ రోజు ఇళ్లలో దేవుడికి పెట్టే నైవేద్యాలు. ఇవి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కానీ ఉండ్రాళ్ల పాయసం, కుడుములు మాత్రం తప్పనిసరిగా చేస్తారు. అలాగే పులిహోర, శనగ గుగ్గిళ్లు కూడా ఉంటాయి. వీటితో పాటు వాళ్లవాళ్ల ఆచారాలను, ఇష్టాలను బట్టి స్వీట్లు, రకరకాల పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. తెలంగాణలో ప్రత్యేకంగా ఆరోజు పెసర పప్పులో తుమ్మికూర, చింతకాయ వేసి పప్పు చేస్తారు. తుమ్మికూరంటే వినాయకుడికి బాగా ఇష్టమని నమ్ముతారు. ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు... వీధిలో పెద్ద వినాయకుడు ఉన్నా, ఇంట్లో చిన్న వినాయకుణ్ని ప్రతిష్టించుకొని కొలుస్తూనే ఉంటాం కదా! ఆ వినాయకుణ్ని స్వయంగా మనమే సులువుగా 9 అంచెల్లో తయారు చేసుకోగల మార్గం ఇది. కావాల్సినవి : ఒక కిలో బంకమట్టి పౌడర్ (క్లే పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుంది) పౌడర్ను ముద్దగా చేసేందుకు సరిపడేన్ని నీళ్లు విగ్రహంపై మార్క్స్ పెట్టుకునేందుకు టూత్పిక్స్ 1 ముందుగా క్లే పౌడర్ను తీసుకొని నీళ్లు కలిపి ముద్దగా తయారు చేసుకోవాలి. ఆ మట్టి ముద్దను కింద ఫొటోలో చూపిన విధంగా 5 చిన్న ముద్దలుగా, 3 మధ్యస్థంగా ఉండే సైజు ముద్దలుగా, 2 పెద్ద ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. 2 రెండు పెద్ద ముద్దలతో అడుగు భాగం, ఉదర భాగం రెడీ చేసుకోవాలి. 3 మరో మట్టి ముద్దను తీసుకొని కింద చూపినట్టు నాలుగు పొడవు ముద్దలను రెడీ చేసుకోవాలి. 4 పొడవు ముద్దను ఉదర భాగం చుట్టూ కింద చూపినట్టు పేర్చుకోవాలి. 5 మరో పొడవు ముద్దను కూడా అలాగే పేర్చుకొని, చేతులుగా రెండు చిన్న ముద్దలను పెట్టుకోవాలి. ఒకటి లడ్డుగా కనిపించేలా, ఇంకొకటి దీవించే చెయ్యిగా కనిపించేలా చూస్కోవాలి. 6 మధ్యస్థ సైజులో ఉన్న ఓ ముద్దను తీసుకొని ఉదర భాగం పైన నిలబెట్టాలి. 7 మరో పొడవు ముద్దను తొండంగా పేర్చుకోవాలి. ఇక రెండు చిన్న ముద్దలను చెవులుగా తీర్చి దిద్దుకోవాలి. 8 తల మీద మూడు ముద్దలను పేర్చుకుంటూ వెళ్లాలి. తల ముందు భాగానికి కూడా రెండు ముద్దలను ఫొటోలో చూపించినట్లు పెట్టుకోవాలి. ఉదర భాగం మీదుగా చిన్న జంజం ఒకటి పెట్టుకోవాలి. 9 ఇప్పుడు మరీ చిన్న చిన్న ముద్దలను రెడీ చేసుకొని ముఖ భాగాన్ని మరింతగా డెకరేట్ చేసుకోవాలి. టూత్ పిక్ తీసుకొని ఫొటోలో చూపినట్లు మార్క్స్ గీసుకుంటూ పోవాలి. అంతే! మన ఇంట్లోనే మట్టి వినాయకుడు రెడీ అయిపోతాడు. ఇక కొన్ని సహజ సిద్ధమైన రంగులను వాడుతూ ఇదే విగ్రహాన్ని కలర్ఫుల్గానూ చేసుకోవచ్చు. నీటిని శుద్ధి చేసే వినాయకుడు వినాయక నిమజ్జనం అంటే ఇప్పుడు పర్యావరణానికి హాని తలపెడుతున్న ఓ చర్యగానే చెప్పుకుంటూ ఉంటారు పర్యావరణ ప్రేమికులంతా! అందులో వాడుతున్న కలర్స్, మెటీరియల్స్ ఇందుకు కారణం. అయితే కొందరు యువకులు ఇందుకు భిన్నంగా నీటిని కలుషితం చేయకుండా, అదే వినాయక నిమజ్జనంతో నీటిని శుద్ధి చేయగలిగితే ఎలా ఉంటుంది? అని ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే పటిక (ఆలమ్) వినాయకుడు. రెండు పెద్ద సైజులో ఉండే పటికలను తీసుకొని వాటిని వినాయక విగ్రహంగా తీర్చిదిద్దారు. అదనపు హంగుల కోసం కొన్ని సహజ సిద్ధమైన రంగులను వాడారు. పటికకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంది. దీంతో పటిక వినాయకుణ్ని నిమజ్జనం చేస్తే, ఆ నీరు ఇంకా శుద్ధి అవుతుంది. గతేడాది ముంబైలో పటిక వినాయక విగ్రహాలతో ఎగ్జిబిషన్ కూడా జరిగింది. ఈ ఆలోచనకు మూల కారకుడైన బిçశ్వరంజన్ రథ్ తన టీమ్తో కలసి రాబోయే కాలంలో పటిక వినాయకుడి విగ్రహాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వినాయకుడంటే చేపలకు భలే ఇష్టం! ‘‘ఏటా వినాయక నిమజ్జనంతో నీళ్లన్నీ కలుషితం అవుతున్నాయి. విగ్రహాల తయారీకి వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటివి లక్షల్లో చేపలను చంపేస్తున్నాయి.’’ ఈ ఆలోచన స్ప్రౌట్స్ ఎన్విరాన్మెంట్ ట్రస్ట్ను కలచివేసింది. ఇందుకోసం ఏదైనా చేయాలని తపించింది. అలా పుట్టిందే ఫిష్ ఫ్రెండ్లీ వినాయకుడు. చేపలకు ఇష్టమైన ఆహార పదార్థాలతో స్ప్రౌట్స్ టీమ్ వినాయకుణ్ని తయారు చేసింది. ఆ విగ్రహానికి ఫుడ్ కలర్స్ కూడా ఇచ్చేసి తీర్చిదిద్దారు. నిమజ్జనం రోజున నీటిని కాలుష్యం చేస్తున్నామన్న ఒక ఫీలింగ్ కూడా ఉండదు. చక్కగా నీళ్లలో కలిసిపోయిన దేవుడి వైపుకు ఇష్టంగా చేపలన్నీ పరుగులు పెడతాయి. ఈ వినాయకుడికి ఇప్పుడు దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ‘గాడ్ సేవ్ ఓషియన్’ పేరుతో స్ప్రౌట్స్ టీమ్ మరింత మందికి ఫిష్ ఫ్రెండ్లీ వినాయకుడు చేరువయ్యేలా ప్లాన్ చేస్తోంది. దేవుడంటే ఎవ్వరికైనా ఇష్టమే! ఇలా కడుపు నింపే దేవుడంటే..! పండ్లు, కూరగాయల వినాయకుడు! అచ్చంగా పండ్లు, కూరగాయలు వాడుతూ తయారు చేసే వినాయకుడికి కూడా ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగింది. కాస్తంత శ్రద్ధ పెడితే ఇంట్లోనే కూరగాయలతో వినాయకుణ్ని తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే చాలా రకాల కూరగాయలను తీసుకొని కొందరు డిజైనర్స్ ప్రత్యేకంగా ఈ తరహా వినాయకుణ్ని తయారు చేయడం మొదలుపెట్టారు. కొత్తగా ఉంటుందని చెప్పి యువత కూడా ఈమధ్య కాలంలో వెజిటెబుల్, ఫ్రూట్స్ వినాయకుడికి ఓటేస్తున్నారు. ‘గ్రీన్ గణేశ’ పేరుతో జరుగుతున్న క్యాంపెయిన్స్లో పర్యావరణానికి హాని కలిగించని ఐడియాల్లో ఈ కొత్త వినాయకుడూ బాగా వినిపిస్తోంది. వెదురుతో, కొబ్బరికాయలతో, చెరకు గడలతో, సొరకాయలతో.. ఇలా అన్నిరకాలతో వినాయకుణ్ని తయారు చేస్తున్నారు. ఏటా ఈ ట్రెండ్ను చాలామందే అందిపుచ్చుకుంటున్నారు. మట్టి వినాయకుడు ఎకో ఫ్రెండ్లీ కొత్త వినాయకుడిలో పైన చెప్పుకొచ్చిన విధంగా ప్రయత్నించాలంటే ఆసక్తి ఎక్కువ ఉండాలి. సమయం కూడా ఎక్కువే పట్టే అవకాశం ఉంది. సులువుగా తయారు చేసుకోగల ఎకో ఫ్రెండ్లీ వినాయకుడంటే మట్టి వినాయకుడే! అదేవిధంగా కాస్త పెద్ద సైజులో వినాయకుడి విగ్రహం ఉండాలనుకునే వారికీ ఇదే మంచి ఆప్షన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు ఇదొక్కటే అతిపెద్ద ప్రత్యామ్నాయంగా కనిపిస్తూ ఉండటంతో గత ఐదారు సంవత్సరాలుగా మట్టి వినాయకుడికి క్రేజ్ బాగా పెరిగింది. చాలా మండపాల్లో యువతరం మట్టి వినాయకుణ్ని ప్రతిష్టించేందుకే మక్కువ చూపుతున్నారు. కలర్స్ కూడా న్యాచురల్గా వాడుతూ ఉండటంతో పర్యావరణాన్ని పరిరక్షించుకునే భాగంలో సమాజం వేస్తున్న గొప్ప ముందడుగు మట్టి వినాయకుడు. దేవుణ్ని పూజించేదే అందరం బాగుండాలని. ఇంత పెద్ద ఉత్సవానికి అడ్డుచెప్పని ప్రకృతి ఫలాలు తరువాతి తరాలకూ అందాలను కోరుకోవడం కూడా ఓ అవసరమే! ఆ అవసరాన్ని గుర్తించడమే ఎకో ఫ్రెండ్లీ కొత్త వినాయకుడి వైపుకు వేసే అడుగు. జై ఎకో ఫ్రెండ్లీ గణేశ్!! – ఫన్డే డెస్క్ -
జై లవ కుశ : రెండో టీజర్ రెడీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై లవ కుశ. పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ బయటకు వచ్చాయి. ముఖ్యం గా జై పాత్రకు సంబంధించిన టీజర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా సినిమాలో రెండో పాత్ర లవ కుమార్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 25న వినాయక చవితి సందర్భంగా లవ కుమార్ టీజర్ రిలీజ్ కానుంది. తొలి టీజర్ లో ఎన్టీఆర్ లుక్స్, డైలాగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మరి రెండో టీజర్ మరోసారి అదే హైప్ తీసుకురావటంలో చిత్రయూనిట్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.