
షోరూమ్లో కారు చోరీ
షోరూమ్లో అమ్మకానికి ఉంచి మారుతి షిఫ్ట్ డిజైర్ మాగ్మా గ్రీన్ కలర్ కారును దొంగలు తీసుకుపోయినట్టు దీనిని విలువ సుమారు రూ. 8లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సంఘటన ప్రాంతాన్ని సీఐ పీవీ రమణ, ఎస్సై పీవీ త్రినాథ్లు పరిశీలించారు. కాకినాడ నుండి క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. షోరూమ్ నిర్వహకులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దర్యాప్తులో భాగంగా కారు చోరీ చేసిన వ్యక్తుల ఆచూకీ కోసం జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు.