Showroom
-
సిల్వర్ జ్యువెలరీ ఆవిష్కరించిన సినీ నటి నిధి అగర్వాల్ (ఫోటోలు)
-
హైదరాబాద్ : అర్జున్ టీవియస్ షోరూంను ప్రారంభించిన హరీశ్రావు (ఫొటోలు)
-
ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..
మార్కెట్లో ఎలాంటి కార్లు ఉన్నాయి.. బడ్జెట్ వివరాలతోపాటు మనకు కావాల్సిన ఫీచర్లు ఏ మోడళ్లలో ఉన్నాయి. ఒక ధరల శ్రేణిలో లభిస్తున్న మోడళ్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి.. ఇలాంటి అంశాలన్నీ ఆన్లైన్లో తెలుసుకుంటున్నప్పటికీ అత్యధికులు షోరూంకు వెళ్లే కారు స్టీరింగ్ పడుతున్నారట. ప్రత్యక్షంగా ఔట్లెట్కు వెళ్లి పరిశీలించిన తర్వాతే వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారని అర్బన్ సైన్స్ సర్వేలో తేలింది. భారత్తోపాటు యూఎస్, జర్మనీ, యూకే, చైనా, మెక్సికో నుంచి 9,000 పైచిలుకు మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. భారత్లో 10 మంది కార్ల కొనుగోలుదార్లలో దాదాపు 9 మంది షోరూంను సందర్శించడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. సర్వేలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.నమ్మదగిన విధానం..ఇలా ఔట్లెట్కు వెళ్లడాన్ని ఒక ప్రధాన ఆర్థిక నిర్ణయం తీసుకోవడానికి నమ్మదగిన విధానంగా కస్టమర్లు భావిస్తున్నారు. కారును కొనుగోలు చేయడంలో కుటుంబ పాత్ర ఉంటుంది. షోరూంలతో వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. నేరుగా వెళ్లడం వల్ల కార్లను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇటువంటి అనుభవాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లు ఇవ్వలేవు. డీలర్షిప్లు నమ్మకాన్ని పెంపొందిస్తాయి, వ్యక్తిగతీకరించిన డీల్స్ ఉంటాయి. సంబంధాలు పెంపొందించబడతాయి. అమ్మకాల తర్వాత మద్దతు కూడా ఉంటుందన్నది కస్టమర్ల భావన. ఇందుకు అనుగుణంగా కస్టమర్లలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు తయారీ సంస్థలు నెట్వర్క్లను విస్తరిస్తున్నాయి. ఇదీ చదవండి: వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్ఆన్లైన్లో బ్రౌజింగ్..సంప్రదాయ డీలర్షిప్లు ప్రస్తుతం భారతదేశ ఆటోమోటివ్ వ్యవస్థలో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. డిజిటల్ వేవ్ క్రమంగా ఊపందుకుంటోంది. యువకులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు షోరూమ్లోకి అడుగుపెట్టే ముందు ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తున్నారు. డీలర్షిప్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లు రెండూ భవిష్యత్తులో కొనసాగుతాయి. సంప్రదాయ డీలర్షిప్లు ప్రత్యేకంగా అందించే నమ్మకాన్ని, వ్యక్తిగత సంబంధాలను కాపాడుకుంటూ.. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి సరైన సమతూకం సాధించడం చాలా అవసరం’ అని సర్వేలో వెల్లడైంది. -
ఓలా షోరూంకు తాళం వేసిన కస్టమర్.. ఏం జరిగిందంటే?
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఓలా కస్టమర్ ప్రస్టేషన్ పీక్కు చేరింది. ఏకంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్కి తాళం వేశాడు. బైక్లో పదేపదే సమస్యలు వచ్చినా సిబ్బంది స్పందించడం లేదని కస్టమర్ సీరియస్ అయ్యారు. నడిరోడ్డుపై తరచూ బైక్ ఆగిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ చేయకపోగా బెదిరిస్తున్నారంటూ కస్టమర్ ఆరోపించారు.కాగా, ఇటీవల కర్ణాటకలోని కాలబురగి జిల్లాలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్ తన బైక్ను రిపేర్ చేయడం లేదని షోరూం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఓలా షోరూంకు నిప్పు పెట్టి తగులబెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మరో ప్రాంతంలో ఓలా బైక్కి చెప్పుల దండ వేసి ఊరేగించగా.. మరో ఘటనలో కస్టమర్.. స్కూటీని తగులబెట్టాడు. రిపేర్ వచ్చిన తన స్కూటీని ఆటోలో తీసుకొచ్చి షోరూం ముందే బైక్ను సుత్తితో పగలగొట్టాడు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
భారత్కు టెస్లా.. ఢిల్లీలో షోరూం కోసం అన్వేషణ!
ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్లో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను పునఃప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో షోరూమ్ స్థలం కోసం ఎంపికలను అన్వేషిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్లో తన పెట్టుబడి ప్రణాళికలకు బ్రేక్ ఇచ్చిన టెస్లా మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.భారత్లోకి ప్రవేశించే ప్రణాళికలను టెస్లా గతంలో విరమించుకుంది. గత ఏప్రిల్లో మస్క్ పర్యటించాల్సి ఉండగా అది రద్దయింది. ఆ పర్యటనలో ఆయన 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటిస్తారని భావించారు. అదే సమయంలో అమ్మకాలు మందగించడంతో టెస్లా తన శ్రామిక శక్తిని 10 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించింది.రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. టెస్లా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో షోరూమ్, ఆపరేషనల్ స్పేస్ కోసం దేశంలో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంస్థ దక్షిణ ఢిల్లీలోని డీఎల్ఎఫ్ అవెన్యూ మాల్, గురుగ్రామ్లోని సైబర్ హబ్తో సహా పలు ప్రదేశాలను అన్వేషిస్తోంది.వాహన డెలివరీలు, సర్వీసింగ్ సదుపాయంతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు కోసం 3,000 నుండి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కోసం టెస్లా చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఏదీ ఖరారు కాలేదని, ఇందు కోసం కంపెనీ ఇతర డెవలపర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.భారత్లోకి టెస్లా ప్రవేశం సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా దిగుమతి సుంకాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా.. 100 శాతం వరకు ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతులను కొనసాగిస్తుందా లేదా నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15 శాతం తగ్గింపు సుంకాలను అనుమతించే ప్రభుత్వ కొత్త విధానాలను ఉపయోగించుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది. -
రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!
స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్లు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు. ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది. దాంతో చిర్రెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్ను పగలగొట్టాడు. ఆ స్కూటర్ షోరూమ్కు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్లు చుట్టూ చేరి సుత్తితో బాదే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్ను సంప్రదించాడు. రిపేర్ పూర్తయ్యాక బిల్లు చూసిన తాను షాక్కు గురయ్యాడు. ఏకంగా రూ.90,000 బిల్లు చేసినట్లు గుర్తించాడు. దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్ను సుత్తితో పగలగొట్టాడు. రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్లు తన చర్యను సమర్థించారు. ఈమేరకు తీసిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్గా మారింది.Furious Ola Electric customer smashes scooter with hammer after allegedly receiving ₹90,000 bill from showroom. pic.twitter.com/c6lYSKSUf7— Gems (@gemsofbabus_) November 24, 2024ఇదీ చదవండి: అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లుఓలా స్కూటర్లకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓలా కస్టమర్ల నుంచి 10,644 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. -
ఈవీ బైక్ షోరూం యజమాని అరెస్టు
బనశంకరి: బెంగళూరులోని రాజ్కుమార్ రోడ్డులో ఎలక్ట్రిక్ బైక్ షోరూం అగ్నిప్రమాదం ఘటనలో షోరూం యజమాని పునీత్, మేనేజర్ యువరాజ్ని బుధవారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మంటలు వ్యాపించి పెద్దసంఖ్యలో వాహనాలు, షోరూం మొత్తం కాలిపోయాయి. స్కూటర్లలోని బ్యాటరీలు పేలిపోవడంతో మంటలు ఇంకా విజృంభించాయి. మంటలను చూసి ప్రియా అనే ఉద్యోగిని తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చివరకు మంటలు వ్యాపించి ఆమె సజీవ దహనమైంది. మరికొందరు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రియ బుధవారమే 27వ పుట్టిన రోజును జరుపుకోవాల్సి ఉంది, అంతలోనే ఘోరం జరిగింది. తన కూతురి భద్రత గురించి షోరూం సిబ్బంది పట్టించుకోలేదని ఆమె తండ్రి ఆర్ముగం విలపించాడు. పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది షోరూంని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.ఇష్టపడి కొంటే.. బూడిదైందికృష్ణరాజపురం: ఎంతో మురిపెంగా కొన్న ఈవీ స్కూటర్.. అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఆ దంపతుల బాధకు అంతులేదు. మంజునాథ్ అనే వ్యక్తి ఇటీవల రూ.70 వేలకు రాజాజీనగరలోని షోరూంలో ఓ బ్యాటరీ స్కూటర్ని కొన్నారు. పికప్ లేదని, సర్వీసింగ్ చేసివ్వాలని షోరూంలో వదిలారు. సర్వీసింగ్ చేసి బైక్ను సిబ్బంది సిద్ధం చేశారు. అయితే బైక్ను తీసుకెళ్లేలోగా మంగళవారం సాయంత్రం షోరూంలో అగ్నిప్రమాదం జరిగి ఆయన స్కూటర్ కూడా మంటల్లో కాలిపోయింది. తమకు షోరూంవారు పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. -
అనంతపురంలో జ్యువెలరీ షాప్ ప్రారంభించిన అక్కినేని నాగార్జున (ఫొటోలు)
-
వరదలో టాటా షోరూం
-
శారీ షో రూమ్ లో తళుక్కుమన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ (ఫొటోలు)
-
వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్..
సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ను బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్ జోహార్’ ఆభరణాల స్టోర్ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్లోని షోరూమ్లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ప్రదర్శించారు. -
లేపాక్షిలో థీమాటిక్ ఎగ్జిబిషన్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–69లోని నందగిరిహిల్స్లోని లేపాక్షి హస్తకళా షోరూంలో థీమాటిక్ ఎగ్జిబిషన్ నగరవాసులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రదర్శనలో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, లెదర్ పప్పెట్స్, పెన్ కలంకారీ చీరలు, ఏలూరు కార్పెట్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఈ చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన కళాకారులు తమ చేతులకు పనిచెబుతూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. -
ఇక వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లూ షోరూంలలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషషన్లు చేసేందుకు రవాణా శాఖ తాజాగా కసరత్తు చేపట్టింది. వాహన యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విధానం ఏపీలో విజయవంతంగా అమలవుతుండటంతో ఇక్కడ సైతం అదే పద్ధతిని అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే సాంకేతిక పరిజా్ఙనం తదితర అంశాలపై ఈ కసరత్తు చేపట్టింది. లోక్సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) చేస్తున్నారు. రవాణాశాఖ నుంచే ఈ టీఆర్లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లట్లేదు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్ స్మార్ట్ కార్డులు చేతికి అందుతాయి. 2016లోనే కేంద్రం మార్గదర్శకాలు... కేంద్రం ప్రభుత్వం రహదారి భద్రత చట్టంలో వాహనదారులకు ఊరట కలి్పంచే అనేక అంశాలను పొందుపరిచింది. వాహనాల రిజి్రస్టేషన్లను షోరూంలలోనే పూర్తి చేసేలా 2016లోనే మార్గదర్శకాలు రూపొందించింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ సదుపాయాన్ని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో మొదట టీఆర్ తీసుకొని ఆ తరువాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియ దళారులతోపాటు కొందరు అధికారుల అక్రమార్జనకు దోహదం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలోనూ అమలైతే షోరూంలోనే పీఆర్ స్మార్ట్ కార్డుతోపాటు వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ కూడా లభించనుంది. గ్రేటర్లో భారీగా వాహనాల అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్లోని పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో నిత్యం సుమారు 2,500 కొత్త వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 1,600కుపైగా ద్విచక్ర వాహనాలుకాగా మిగతావి కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాహనదారుల చిరునామా పరిధిలోని ఆర్టీఓ కార్యాలయంలో శాశ్వత రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు వందల సంఖ్యలో శాశ్వత రిజి్రస్టేషన్ల వల్ల వాహనాల రద్దీతోపాటు అందరి సమయం వృథా అవుతోంది. అలాగే ఆన్లైన్లో స్లాట్ నమోదు మొదలు అధికారుల తనిఖీ పూర్తయ్యే వరకు వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. షోరూం రిజిస్ట్రేషన్లు అమల్లోకి వస్తే దళారుల అక్రమ దందాకు తెరపడనుంది. -
నంద్లాల్ షోరూమ్లో సందడి చేసిన సినీ తారలు (ఫొటోలు)
-
HYD: అగ్ని ప్రమాదం.. అన్లిమిటెడ్ షోరూంలో ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, హైదరాబాద్: హబ్సిగూడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్లిమిటెడ్ షోరూంలో మంటలు చెలరేగాయి. మూడు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. రెండు ఫోర్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా పెట్రోల్ బంక్ను పైర్ సిబ్బంది మూయించివేశారు. -
ముచ్చటపడి కొనుక్కున్న బైక్.. మొదటి నుంచీ సమస్యలే.. చిర్రెత్తుకొచ్చి
హిందూపురం: సేవా లోపం కారణంగా అసహనానికి గురైన ఓ యువకుడు షోరూం ఎదుట తన నూతన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. హిందూపురంలోని పెనుకొండ రోడ్డులో ఉన్న టీవీఎస్ షోరూంలో బీరేపల్లికి చెందిన మనోజ్ ఫైనాన్స్ కింద ఓ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. పట్టుమని ఐదు నెలలు కూడా గడవక ముందే వాహనంలో సమస్యలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. సమస్య తలెత్తిన ప్రతిసారీ తాత్కాలిక మరమ్మతులతో సరిబెడుతూ వచ్చారు. అయినా సాంకేతిక సమస్యలు తప్పలేదు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి వాహనం మరమ్మతుకు గురవడంతో షోరూంకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో షోరూం నిర్వాహకులతో వాగ్వాదం జరిగి అసహనానికి గురైన మనోజ్ వెంటనే షోరూం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఘటనతో నివ్వెర పోయిన షోరూం నిర్వహకులు వెంటనే మంటల్ని అదుపు చేశారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. -
Samyuktha Menon: నగల షోరూం ప్రారంభోత్సవంలో నటి సంయుక్త మీనన్ సందడి (ఫొటోలు)
-
500వ షోరూమ్ ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్ - ఎక్కడంటే?
దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ఉత్తమ అమ్మకాలు పొందిన 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఎట్టకేలకు తన 500వ షోరూమ్ ప్రారంభించింది. ప్రారంభంలో ఒక్క షోరూమ్ కూడా లేకుండా మొదలైన ఓలా ఇప్పుడు భారీ స్థాయిలో ఎక్స్పీరియన్స్ సెంటర్స్ & షోరూమ్లను ప్రారంభించడంలో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ఈ షోరూమ్ ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తన 500వ షోరూమ్ను జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 300 నగరాల్లో ఓలా షోరూమ్ ఉన్నట్లు సమాచారం. అయితే 2023 ఆగష్టు నాటికి దేశంలో ఈ షోరూమ్ల సంఖ్య 1000కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ తగిన ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను, షోరూమ్లను పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం ఎక్కువ భాగం కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ల ద్వారా వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. అయితే కంపెనీకి చెందిన షోరూమ్లు వాహనాలను గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా టెస్ట్ రైడ్ వంటి సదుపాయాలను అందించడానికి ఉపయోగపడుతున్నాయి. (ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!) ఓలా 500వ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా కంపెనీ సిఎమ్ఓ 'అన్షుల్ ఖండేల్వాల్' మాట్లాడుతూ.. ప్రస్తుతం 500వ షోరూమ్ ప్రారంభమైంది, అయితే రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. భారత్కు సుస్థిర భవిష్యత్తు అందించడానికి తమ కృషి ఇలాగే కొనసాగుతూ ఉంటుందని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 40 శాతం వరకు ఉంది. కంపెనీ గత నెలలో ఏకంగా 30,000 యూనిట్లకుపైగా విక్రయించి, ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో నిలబడింది. రానున్న రోజుల్లో కూడా కంపెనీ మరింత గొప్ప అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. -
కూకట్పల్లిలో రీతూ వర్మ సందడి (ఫొటోలు)
-
విజయవాడలో అనుపమ, మంత్రి రోజా సందడి (ఫొటోలు )
-
రాజమండ్రిలో అల్లు శిరీష్, అనసూయ, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
దీపావళికి గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్ ...
-
షోరూమ్ ను ప్రారంభించిన అనకాపల్లి ఎంపీ సత్యవతి
-
దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం
న్యూఢిల్లీ: ఒక దుండగుడు దుకాణం వద్దకు వచ్చి కాల్పుల కలకలం సృష్టించాడు. ఈ ఘటన ఢిల్లీలోని దరీపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ పై దుకాణం వద్దకు వచ్చి గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దుండగులు షాపులోకి వెళ్లి యజమానిని భయబ్రాంతులకు గురిచేసి దాదాపు రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్ల తెలిపారు. షాపు యజమానిని భయపట్టేందుకు ఆ దుండగులు ఇలా గాల్లో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం దుకాణం వద్ద ఉన్న సీసీఫుటేజ్లో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నకిలీ వెబ్సైట్లతో చీటింగ్... 12 మంది అరెస్టు) -
కుషాయిగూడ బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో చోరీ
-
మహిళా సిబ్బందితో టాటా మోటార్స్ షోరూం!
హైదరాబాద్: టాటా మోటార్స్ తన డీలర్ భాగస్వామి వెంకటరమణ మోటార్స్తో కలిసి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మహిళా సిబ్బందితో ప్యాసింజర్ వెహికల్స్ షోరూంని ఇటీవల ప్రారంభించింది. మొత్తం 20 మంది మహిళా బృందంతో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ‘‘మహిళా షోరూం’’ అని కంపెనీ తెలిపింది. పెరుగుతున్న మహిళా కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా షోరూంను ప్రారంభించాము. నాయకత్వాన్ని కోరుకునే మహిళలకు ఈ కేంద్రం అంకితమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ ప్రెసిడెంట్ రాజన్ అంబా తెలిపారు. -
సికింద్రాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురి మృతి
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): ఉవ్వెత్తున ఎగిసిన మంటలు.. దట్టమైన పొగ.. వివిధ పనుల మీద నగరానికి వచ్చి లాడ్జీలో బస చేసినవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. మిగతావారు ఎలాగో తప్పించుకునా ఏడుగురు కాలినగాయాలు, పొగతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 13 మంది గాయపడినట్లు సమాచారం కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర దుర్ఘటన సోమవారం రాత్రి సికింద్రాబాద్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సేద తీరుతుండగా..: ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. సెయింట్ మేరీస్ రోడ్డులోని మనోహర్ థియేటర్ ఎదురుగా రంజిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ పేరుతో బైక్ల షోరూమ్ నిర్వహిస్తున్నా రు. ఈ షోరూమ్ సెల్లార్లో ఉండగా, ఆపై నాలుగు అంతస్తుల్లో రూబీ డీలక్స్ హోటల్ను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో సెల్లార్లోని షోరూమ్ నుంచి మంటలు చెలరేగాయి. ఇందులో ఎలక్ట్రికల్ బైక్ల బ్యాటరీలు పేలి భారీ శబ్దాలతో పాటు మంటలు వ్యాపించాయి. నాలుగు అంతస్తుల్లోని లాడ్జీ గదుల్లోకి మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన కొంతమంది హోటల్ గదుల నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు మాత్రం దట్టమైన పొగల కారణంగా బయటకు రాలేక గదుల్లో చిక్కుకుపోయారు. లాడ్జీలో 23 మంది..: హోటల్లో వ్యాపారాల నిమిత్తం ఉత్తర భారత దేశం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 23 మంది ఉన్నట్లు తేలింది. దట్టమైన పొగలు పైన ఉన్న గదుల్లోకి వ్యాపించడంతో చాలామంది పై నుంచి కిందకు దిగేందుకు వీలులేకుండా పోయింది. ఓ మహిళతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు డ్రైనేజీ పైప్ల ద్వారా నాలుగు, మూడో అంతస్తుల నుంచి కిందకు దిగారు. వీళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే దీన్ని ఆనుకుని ఉండే యాత్రి ఇన్ హోటల్ మీదుగా మరికొంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. వీరికి సైతం ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో గాలి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఫైర్ సిబ్బంది స్నారికల్ వాహనం ద్వారా కొంత మందిని కిటికీల నుంచి బయటకు రప్పించి రక్షించారు. ఒక మహిళతో పాటు మరో ముగ్గురు గదుల్లో అపస్మారక స్థితిలో పడిఉండగా బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. కాలిన గాయాలైన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా మిగతా వారిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మార్కెట్ పోలీసులు, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది, పెద్దసంఖ్యలో స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులు కిటికీల నుంచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి నిచ్చెనలు అందించి, పైప్ల ద్వారా దిగేలా సహాయం చేశారు. మరికొంత మంది పొగలోనే లోపలికి వెళ్లి గదుల్లో ఉండే వారిని బయటకు తీసుకుని వచ్చారు. అగ్ని ప్రమాద ఘటన తెలియగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. అంతా క్షణాల్లోనే: కేశవులు, చెన్నై చెన్నై నుంచి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. రాత్రి 9 గంటలకు హోటల్లో దిగాను. అంతలోపే ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. స్థానికుల సహాయంతో 4వ అంతస్తు నుంచి పైౖౖపులు పట్టుకుని కిందకు దిగాను. ఇది మరో జన్మ: ఉమేష్ ఆచార్య, ఒడిశా ఒడిశా నుంచి ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చాను. 4వ అంతస్తులో ఉన్నాను. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. మెట్ల నుంచి వెళ్లే అవకాశం కనిపించలేదు. వెంటనే ప్రాణాలు కాపాడుకోవాలంటే పైపులు పట్టుకుని దిగాలని «ధైర్యం చేశా. పైపులు పట్టుకుని కిందికి దిగాను. ఇది నాకు మరో జన్మ. పొగ పీల్చుకోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఇదీ చదవండి: మళ్లీ.. గోదావరి ఉగ్రరూపం -
ఓలా న్యూ స్టైల్... స్కూటర్ డెలివరీలో కొత్త పంథా
హైదరాబాద్: మార్కెట్లోకి రావడానికి ముందే రిజిస్ట్రేషన్లలో ప్రపంచ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బైకు డిజైన్, డెలివరీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ఎస్ 1 సిరీస్ ఇప్పటికే ఎలక్ట్రిక్ ఓలా స్కూటర్ కావాలంటూ లక్ష మందికి పైగా బుకింగ్లో తమ పేరు నమోదు చేసుకున్నారు. అయితే స్కూటర్ ఎలా ఉంటుంది. మోడల్ ఏంటీ అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ప్రభుత్వ రికార్డుల్లో ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో పేరుతో రెండు స్కూటర్ల పేర్లు నమోదయ్యాయి. దీని ప్రకారం ఓలా స్కూటర్లు ఎస్ 1 సిరీస్లో మార్కెట్లోకి వస్తాయని తెలుస్తోంది. పది రంగుల్లో ఇప్పటి వరకు మూడు నాలుగు రంగుల్లోనే వాహనాలు మార్కెట్లో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కానీ గతానికి భిన్నంగా ఒకే సారి పది రంగుల్లో హల్చల్ చేసేందుకు ఓలా సిద్ధమైంది. లేత నుంచి ముదురు వరకు మొత్తం పది రంగుల్లోఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేస్తున్నారు. మేల్, ఫిమేల్ కస్టమర్ల టేస్ట్కి తగ్గట్టుగా ఈ కలర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది. హోం డెలివరీ ఇప్పటి వరకు ఆటోమోబైల్ మార్కెట్లో వాహనాలు కొనాలంటే మొదటి మొట్టుగా షోరూమ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఓలా షోరూమ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. స్కూటర్ని బుక్ చేసుకున్న కస్టమర్లకు నేరుగా ఇంటికే హోం డెలివరీ ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది. -
వాహన తయారీకి తాత్కాలిక బ్రేక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన పరిశ్రమకూ కోవిడ్–19 దెబ్బ పడింది. తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు వైరస్ బారిన పడడం, లాక్డౌన్లతో షోరూంలు మూతపడడం ఈ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరతతో స్టీల్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాస్తా స్టీల్ను ముడి పదార్థంగా వాడే ఆటో విడిభాగాల తయారీ కంపెనీలకు సమస్యగా పరిణమించింది. ఏప్రిల్లో స్టీల్ వినియోగం 26 శాతం తగ్గిందంటే పరిస్థితికి అద్దంపడుతోంది. ఇంకేముంది వాహన తయారీ సంస్థలు తాత్కాలికంగా తయారీ ప్లాంట్లను మూసివేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు తయారీని తగ్గించివేస్తున్నాయి. మహారాష్ట్రలో గత నెల తొలి వారంలో లాక్డౌన్ ప్రకటించగానే వాహన పరిశ్రమపై ఒత్తిడి పెరిగింది. క్రమంగా ఇతర రాష్ట్రాలూ లాక్డౌన్లు విధించడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కష్టాలు చుట్టుముట్టాయి. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు తయారీ సంస్థలు తెలిపాయి. అయితే షట్డౌన్ కాలంలో వార్షిక నిర్వహణ చేపట్టనున్నట్టు కంపెనీలు వెల్లడించాయి. ఒకదాని వెంట ఒకటి.. వాహన తయారీ సంస్థలు ఒకదాని వెంట ఒకటి తాత్కాలికంగా ఉత్పత్తికి విరామం ప్రకటిస్తున్నాయి. మే 1 నుంచి 9 రోజులపాటు హరియాణాలో రెండు, గుజరాత్లో ఒక ప్లాంటును మూసివేస్తున్నట్టు భారత్లో ప్యాసింజర్ వెహికల్స్ రంగంలో అగ్రశ్రేణి సంస్థ మారుతి సుజుకీ గత నెల ప్రకటించింది. అయితే వైరస్ ఉధృతి నేపథ్యంలో మే 16 వరకు షట్డౌన్ పొడిగిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. వార్షిక నిర్వహణలో భాగంగా జూన్లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన తాత్కాలిక షట్డౌన్ను మే నెలకు మార్చినట్టు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. తెలంగాణలోని జహీరాబాద్తోపాటు చకన్, నాసిక్, కండివాలీ, హరిద్వార్లో సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి. ఎంజీ మోటార్స్ ఏప్రిల్ 29 నుంచి వారంపాటు గుజరాత్లోని హలోల్ ప్లాంటును తాత్కాలికంగా మూసివేసింది. మే 10 నుంచి ఆరు రోజులపాటు చెన్నై ప్లాంటులో తయారీని నిలిపివేస్తున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఏటా ఈ కేంద్రంలో 7.5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి 88 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. హోండా కార్స్ ఇండియా రాజస్తాన్ తయారీ కేంద్రాన్ని మే 7 నుంచి 18 వరకు తాత్కాలికంగా మూసివేసింది. ఏడాదికి ఈ ఫ్యాక్టరీలో 1.8 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. కర్ణాటకలోని రెండు ప్లాంట్లలో ఏప్రిల్ 26 నుంచి మే 14 వరకు మెయింటెనెన్స్ షట్డౌన్ చేపట్టనున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ వెల్లడించింది. ఉత్పత్తిని తగ్గించడంతోపాటు మే నెల కార్యకలాపాలను 7–15 రోజులకే పరిమితం చేయనున్నట్టు అశోక్ లేలాండ్ తెలిపింది. టూ వీలర్స్ రంగంలోనూ.. సెకండ్ వేవ్ ముంచుకొచ్చిన కారణంగా టూ వీలర్ షోరూంల వద్ద నిల్వలు పేరుకుపోయినట్టు సమాచారం. కంపెనీని బట్టి 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ద్విచక్ర వాహన తయారీ రంగంలో భారత్లో అగ్రశేణి సంస్థ హీరో మోటోకార్ప్ మే 16 వరకు తాత్కాలికంగా తయారీని నిలిపివేసింది. గత నెల చివరి నుంచి కంపెనీ తన ప్లాంట్లలో షట్డౌన్ను పొడిగిస్తూ వస్తోంది. వీటిలో చిత్తూరు ప్లాంటుతోపాటు హరియాణా, ఉత్తరాఖండ్, రాజస్తాన్, గుజరాత్లోని ఆరు కేంద్రాలు ఉన్నాయి. నీమ్రానాలోని గ్లోబల్ పార్ట్స్ సెంటర్తోపాటు ఆర్అండ్డీ ఫెసిలిటీ తలుపులు మూసుకున్నాయి. కంపెనీకి 90 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రెండవ అతిపెద్ద సంస్థ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ సైతం ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేసింది. హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, గుజరాత్ ప్లాంట్లలో మే 1 నుంచి మొదలైన షట్డౌన్ 15 వరకు కొనసాగనుంది. మే 15 నుంచి రెండు వారాలు తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ ప్లాంట్లలో తయారీకి తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నట్టు యమహా ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ మే 13–16 మధ్య చెన్నైలోని రెండు ప్లాంట్లలో కార్యకలాపాలు ఆపివేస్తున్నట్టు వెల్లడించింది. -
బిర్యానీ సెంటర్లో కేథరిన్ సందడి
సాక్షి, రాజేంద్రనగర్: అత్తాపూర్లో చిక్పెట్ డోనీ బిర్యానీ సెంటర్ను సోమవారం సినీనటి కేథరిన్ ప్రారంభించారు. వంటకాలను టేస్ట్ చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ప్రముఖ వ్యాపారవేత డి.రమేష్ హైదర్గూడ పిల్లర్ నంబర్–143 వద్ద ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్: రోడ్ నంబర్-36లోని చందూభాయ్ గ్రూప్నకు చెందిన ది డైమండ్ స్టోర్లో వెడ్డింగ్ సీజన్ను పురస్కరించుకొని సరికొత్త బ్రైడల్ కలెక్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అరుదైన ఆభరణాలను సోమవారం మోడల్స్ ప్రదర్శించారు. కోవిడ్ కారణంగా అందరి క్షేమం కోసం మా స్టోర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు వర్చువల్గా కూడా ఆభరణాలు ఎంపిక చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తోందన్నారు. -
షో రూంలో అగ్ని ప్రమాదం
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలో గల ట్రాక్టర్ షోరూంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడు ట్రాక్టర్లు కాలినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. మంటలు అంటుకున్నాయన్న సమాచారం రాగానే వెంటనే అప్రమత్తమై ఘటన స్థలానికి చేరుకున్నామని జిల్లా ఫైర్ ఆఫీసర్ సతీష్రావు తెలిపారు. ఐచర్ ట్రాక్టర్ షోరూంలో రోజువారీ మాదిరిగా షాపును మూసివేసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. మంటలు అంటుకున్న సమయంలో అక్కడున్న కొందరు షోరూంలోని కొన్ని ట్రాక్టర్స్ బయటకు తీశారని, వారికి వెంటనే ఫైర్ సిబ్బంది తోడవ్వగా షోరూమ్లో ఉన్న 13 ట్రాక్టర్స్లో 10 ట్రాక్టర్స్ బయటకు తీశారని తెలిపారు. (కోడలి క్యారెక్టర్పై అనుమానం.. స్నేహితులతో కలిసి) మూడు ట్రాక్టర్స్ కాలిపోగా, రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు జిల్లా ఫైర్ ఆఫీసర్ పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు లేదని, ఏదేని ట్రాక్టర్ ఇంజిన్ నుంచి జరిగిన ప్రమాదమా లేక, ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ట్రాక్టర్స్లోని వివిధ కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని, ఎవరైనా నిప్పు పెట్టినట్లు తనకు అనుమానం లేదని షో రూం నిర్వాహకుడు నాగిరెడ్డి సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో దాదాపు రూ.9 లక్షల పైగా ఆస్తినష్టం జరిగిందని షోరూం నిర్వాహకుడు తెలిపారు. (అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు! ) -
షాపింగ్ తంటా : ప్రముఖ షోరూం మూత
సాక్షి, చెన్నై: పండుగ సీజన్ రావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో షాపింగ్ సందడి నెలకొంది. ముఖ్యంగా కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షలతో గత ఏడు నెలలుగా ఇంటికి పరిమితమైన ప్రజలు షాపింగ్ కోసం భారీ సంఖ్యలో షోరూంలకు క్యూ కడుతున్నారు. ఇదే చెన్నైలోని ఒక దిగ్గజ బట్టల దుకాణానికి షాక్ ఇచ్చింది. కోవిడ్-19 నిబంధనలను భారీగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ చెన్నైలోని ప్రసిద్ధ కుమరన్ సిల్క్స్ను మంగళవారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) మూసివేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) షోరూమ్ లోపల, వెలుపల ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా, ఫేస్ మాస్క్లు ధరించకుండా వందలాది మంది జనం గుమిగూడిన నేపథ్యంలో దానికి సీల్ వేశామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. ప్రజలు భద్రతా ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని జీసీసీ ఒక ట్వీట్లో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించడం చాలా ప్రమాదకరం, బాధాకరమని జీసీసీ కమిషనర్ జీ ప్రకాష్ వ్యాఖ్యానించారు. ఒకేసారి 500 లేదా వెయ్యి మంది కస్టమర్లను అనుమతించమని, వీరిని దుకాణాదారులే నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ ఉల్లంఘనలు ప్రతి దుకాణంలో జరుగుతున్నాయి... ఈ ఒక్కదాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇది పండుగ కాలం కనుక షాపింగ్ చేయాలనుకుంటున్నారని గీతా పద్మనాభన్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. Kumaran Silks in Chennai sealed after video of crowding and lack of physical distancing emerges. @chennaicorp @thenewsminute pic.twitter.com/qIM9HyUxSv — priyankathirumurthy (@priyankathiru) October 20, 2020 A shop in Tnagar has been #locked and #sealed today, since they allowed overcrowding & didn’t follow the COVID-19 safety protocols. Other such shops, which don’t follow the protocols shall be sealed too. Shop owners & public are requested to strictly follow safety protocols.#GCC pic.twitter.com/MncKIWxfIG — Greater Chennai Corporation (@chennaicorp) October 20, 2020 -
తల్వార్ వోల్వో షోరూం ఎండీ అరెస్ట్
బంజారాహిల్స్: కారుకు రుణం పేరిట ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని కారు డెలివరీ చేయకుండా పథకం ప్రకారం మోసగించిన ఘటనలో బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని తల్వార్ వోల్వో షోరూం ఎండీ సాకేత్ తల్వార్ను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నెక్లెస్ రోడ్ బుద్ధ భవన్ వెనక ఉన్న విజయ్కాంత్ ఫైనాన్స్ మేనేజర్ గులాం అబ్రార్ను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 86లోని ఫేజ్–2లో నివసించే అబ్దుల్ యాకుబ్ గత ఏడాది జూన్ 27న కొత్త వోల్వో కారు కొనుగోలు చేయాలనుకుంటున్నానని రుణం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పత్రాలను పరిశీలించిన ఫైనాన్స్ కంపెనీ అబ్దుల్ యాకుబ్కు రూ.70 లక్షలు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు రూ.67.23 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు జమచేసి మొదటి ఈఎంఐ కింద రూ.2.76 లక్షలు ఇచ్చింది. అబ్దుల్ యాకుబ్ ఈ కారును ఇవ్వడంలో సాకేత్ తల్వార్ తీవ్ర జాప్యం చేశారు. ఇదేంటని ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ గులాం అబ్రార్ అలీ నాలుగైదుసార్లు కలిసి సాకేత్ తల్వార్ను ప్రశ్నించారు. తమ మేనేజర్ సొహైల్ను కలవాలంటూ ఒకసారి, ఇంకా మంజూరు కాలేదని మరోసారి సాకేత్ తప్పించుకోసాగాడు. ఇటీవల కారు కోసం ఆరా తీయగా తమ పేరు మీద కారు కేటాయించారని, దాన్ని మరొకరికి సాకేత్ విక్రయించారని తేలడంతో షాక్కు గురయ్యారు. మరింత ఆరా తీయగా ఇప్పటికే సాకేత్ తల్వార్ వంద మంది వరకు ఇలా కార్ల ముసుగులో మోసగించినట్లు తేలింది. తాను మోసపోయానని తెలుసుకున్న ఫైనాన్స్ సంస్థ మేనేజర్ గత నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడు. గట్టి నిఘా వేసిన పోలీసులు కొండాపూర్లోని బొటానికా విల్లాస్లో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సాకేత్తో చేతులు కలిపి మోసానికి పాల్పడ్డ అబ్దుల్ యాకుబ్, ఎంఏ సొహైల్లపై కూడా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరి కోసం గాలిస్తున్నారు. -
దిల్సుఖ్నగర్లో నిధి అగర్వాల్ సందడి
-
ఇక షోరూమ్లోనే నంబర్ప్లేట్..!
సాక్షి, నల్లగొండ: వాహనాలు కొనుగోలు చేసిన చోటే ఇకనుంచి నంబర్ ప్లేట్లను బిగించనున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసిన కార్యాలయంలోనే నంబర్ ప్లేట్లు వేయగా.. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను ఆర్టీఏ కార్యాలయం నుంచి వాహన షోరూమ్లకు బదలాయించింది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వాహనాలకు రిజిస్ట్రేషన్ జరిగితే నంబర్ ప్లేట్లు మాత్రం ఎక్కడైతే వాహనాన్ని కొనుగోలు చేస్తామో అక్కడే బిగించనున్నారు. గత ఇలా.. గతంలో కారు, బైక్, ఆటో, ట్రాక్టర్, లారీ, బస్సు తదితర వాహనాలను షోరూమ్లో కొనుగోలు చేసి.. షోరూమ్ పేపర్ల ద్వారా ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు. అదే సందర్భంలో ఆర్టీఏ కార్యాలయం నుంచి ఆ వాహనానికి నంబర్ను సీరియల్ పద్ధతిలో అలాట్ చేసేవారు. ఫ్యాన్సీ నంబర్ కావాలంటే ఆ నంబర్ను బుక్ చేసుకోవడం, ఎక్కువ మంది అదే నంబర్ కోరుకుంటే డ్రా పద్ధతిన ఎక్కువ రుసుం చెల్లించి పొందాల్సి ఉండేది. రిజిస్ట్రేషన్ అయిన మూడు రోజుల తర్వాత అలాటైన నంబర్ను హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ను ఆర్టీఏకు అనుసంధానంలో ఉన్నటువంటి ఏజెన్సీల ద్వారా వాహనాలకు అమర్చేవారు. కొత్త విధానం ఇలా... ప్రస్తుతం ఏ వాహనాన్ని కొనుగోలు చేసినా షోరూమ్లో వెంటనే కొనుగోలుదారుడి పేరును ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. దాంతో మొదట టీఆర్ నంబర్ వస్తుంది. ఆ తర్వాత ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాలి. అప్పుడు ఆన్లైన్ ద్వారానే నంబర్ అలాట్ అయి సంబంధిత షోరూమ్కు వస్తుంది. ఒకవేళ ఫ్యాన్సీ నంబర్ కావాలంటే మాత్రం ఎక్కువ రుసుము చెల్లించాలి. అది హైదరాబాద్ నుంచే నేరుగా సీల్డ్ కవర్లో సంబంధిత షోరూమ్కు పంపిస్తారు. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లన్నింటినీ సంబంధిత షోరూమ్లకు వస్తాయి. రిజిస్ట్రేషన్ అనంతరం వాహనదారులు షోరూమ్కు వెళ్తే నంబర్ ప్లేట్ను బిగిస్తారు. ఈ ప్రక్రియ గత నెల నుంచి జిల్లాలో అమలు అవుతోంది. వాహనం ధరలోనే ప్లేట్ రుసుము వినియోగదారుడు ఏ వాహనాన్నైతే కొనుగోలు చేస్తాడో దానికి సంబంధించి నంబర్ ప్లేట్కు అయ్యే రుసుమును ముందే చెల్లించాల్సి ఉంటుంది. బైక్కు రూ.245, ఆటో రూ.282, కారు రూ.619, లారీ, బస్సు, ఇతర వాహనాలకు రూ.649 చొప్పున వాహన కొనుగోలు ధరలోనే కలిపి వసూలు చేస్తారు. రోజూ అధికంగా రిజిస్ట్రేషన్లు గతంలో కొందరు వాహనాలు కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్ విషయంలో ఆలస్యం చేసేవారు. టీఆర్ నంబర్ మీదనే వాహనాన్ని నడిపేవారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచి్చన విధానంతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి్సందే. దీంతో జిల్లా వ్యాపంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెద్దయెత్తున రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. జిల్లాలో రోజుకు 200 పైచిలుకు వాహన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సంఖ్య కాస్త తక్కువగా ఉండేది. -
వి–స్ట్రోమ్ 650 ఎక్స్టీ ఏబీఎస్
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్సైకిల్ ఇండియా తన ప్రీమియమ్ బైక్ మోడల్ వి–స్ట్రోమ్ 650 ఎక్స్టీలో కొత్త వేరియంట్ను మార్కెట్లోకి తెచ్చింది. వి–స్ట్రోమ్ 650 ఎక్స్టీ ఏబీఎస్ పేరుతో అందిస్తున్న ఈ బైక్ ధరను రూ.7.46 లక్షలుగా (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) నిర్ణయించామని సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా తెలిపింది. కొత్త గ్రాఫిక్స్తో రూపొందిన ఈ బైక్లో 4 స్ట్రోక్ 645 సీసీ ఇంజిన్, సైడ్ రెఫ్లిక్టర్లు, హజార్డ్స్ లైట్స్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ ఎమ్డీ సంతోషి ఉచిద తెలిపారు. బ్రిడ్జిస్టోన్ బాట్లాక్స్ అడ్వెంచర్ ఏ40 ట్యూబ్లెస్ టైర్లు, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, ఆరు గేర్లు, త్రీ–స్టేజ్ ట్రాక్షన్ కంట్రోల్, మూడు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న విండ్స్క్రీన్, తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. గత ఏడాదే ఈ బైక్ను మార్కెట్లోకి తెచ్చామని, మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ కొత్త బైక్ను ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో రూపొందించామని, పనితీరు మరింతగా మెరుగుపడగలదని వివరించారు. ఈ బైక్ కవాసకి వెర్సీస్ 650, ఎస్డబ్ల్యూఎమ్ సూపర్డ్యూయల్ టీ బైక్లకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా. -
విజయవాడలో లలితా జ్యూవెల్లరీ షోరూం ప్రారంభం
-
విజయవాడలో ఈనెల 21న లలితా జ్యూవెల్లరీ షోరూం ప్రారంభం
-
కార్ల సర్వీసింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం
విశాఖపట్నం, శఢఅక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఆటోనగర్ బి – బ్లాక్లోని కార్ల సర్వీసింగ్ సెంటర్ లక్ష్మీ హుందాయ్ షోరూం అగ్నికి ఆహుతైంది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో షోరూంలో విడి భాగాలు (స్పేర్ పార్ట్స్) ఉండే క్యాబిన్ మొత్తం దగ్ధమైంది. కంపెనీలో స్పేర్ పార్టులు ఉన్న షెడ్డులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పాటు కిందనున్న క్యాబిల్లో కూడా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అయితే కార్మికులు, సిబ్బంది అంతా సుమారు రాత్రి 7 గంటల సమయంలో విధులు ముగించుకుని కంపెనీ నుంచి వెళ్లిపోవడంతో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బందితో కలిసి కంపెనీ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. ప్రమాదం జరగడంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుమారు రాత్రి 7.30 గంటల సమయంలో షోరూం సెక్యూరిటీ చెపుతున్న వివరాల ప్రకారం షోరూం వెనుక నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయని, వెంటనే ఫైర్ స్టేషన్కు, తమ యాజమాన్యానికి ఫోన్లో తెలిపానని చెబుతున్నారు. కొందరు మాత్రం షార్ట్సర్క్యూట్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఆటోనగర్, పెదగంట్యాడ అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాజువాక పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించి, వివరాలు సేకరించారు. ఈ రెండింటిలో ఏది నిజమో దర్యాప్తులో తేలాల్సి ఉందని జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రసాద్ పేర్కొన్నారు. ఆటోనగర్లోని లక్ష్మీ హుందాయ్ కంపెనీ పూర్తిగా కార్ల సర్వీసింగ్ సెంటర్. ఇక్కడ ఉన్న ఈ కంపెనీలో కార్లు తమ సర్వీసింగ్కు తీసుకువస్తుంటారు.అయితే కంపెనీ లోపలి భాగం అంతా రేకుల షెడ్డు మాత్రమే. పైన కార్లకు సంబంధించిన విడిభాగాలు, అందులో కొన్ని సింథటిక్, ఫోం వంటి వాటితో ఉంటాయని సిబ్బంది తెలిపారు. అయితే జరిగిన ప్రమాదం తీవ్రతను బట్టి ఇవి ఎలా అగ్నికి ఆహుతయ్యాయే తెలియాల్సి ఉంది. యాజమాన్యం సిబ్బందిపై అగ్నిమాపక అధికారి ఆగ్రహం... ఆటోనగర్తో పరిశ్రమలతో పాటు గాజువాక పరిధిలో పలు బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదం జరిగితే ఎటువంటి జాగ్రత్తలకు సంబంధించిన అనుమతులు లేవని విలేకరులు ప్రశ్నించగా జిల్లా అగ్నిమాపక అధికారికి విన్నవించగా ఆయన దీనిపై స్పందిస్తూ ఎక్కడ అనుమతుల విషయంలో ఉపేక్షించలేదని తెలిపారు. ప్రమాదం జరిగిన లక్ష్మీ హుందాయ్ కంపెనీకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. -
‘ముగ్ధ’మనోహరం
-
సింహపురిలో సమంత సందడి
నెల్లూరు(బృందావనం): ప్రముఖ సినీనటి సమంత అక్కినేని మినీబైపాస్ రోడ్డు, రామమూర్తినగర్లోని ఉడ్లాండ్ షోరూంపైన నెల్లూరులో మొట్టమొదటి ‘లాక్మే సెలూన్’ ఫ్రాంచైజీని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందం, గ్రూమింగ్ విభాగాల్లో అత్యుత్తమ సేవలందించే ‘లాక్మే సెలూన్’ నెల్లూరులో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్ బ్యాక్ స్టేజ్ నిపుణులు అత్యాధునిక ధోరణులను నెల్లూరీయుల చెంతకు చేర్చారన్నారు. వోగ్ హెయిర్ స్టైల్స్లో గ్లామరస్ హైలెట్స్ మొదలు పునరుత్తేజం కలిగించే ఫేషియల్స్, ఒత్తిడి తగ్గించే మసాజ్లు, క్లాస్సీ మేనిక్యూర్స్, పెడిక్యూర్స్ వరకూ అన్నింటినీ అందించడంలో లాక్మే సెలూన్ అగ్రగామిగా ఉందని అన్నారు. నెల్లూరు రావడం, అభిమానులను చూడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంస్థ సీఈఓ పుష్పరాజ్ షెహనాయ్ మాట్లాడుతూ దేశంలోని 110 నగరాల్లో 380కి పైగా లాక్మే సెలూన్స్ విశిష్ట సేవలందిస్తున్నాయన్నారు. లాక్మే సెలూన్ ఫ్రాంచైజీ లీలాసాయికుమార్ మాదా మాట్లాడుతూ అత్యంత నమ్మకమైన బ్యూటీ సర్వీసెస్ బ్రాండ్ లాక్మే సెలూన్ నెల్లూరులో ప్రారంభించడం హర్షణీయమన్నారు. -
ఆంధ్రప్రదేశ్లో మరో 30 ‘సెల్ పాయింట్’ షోరూంలు
కర్నూలు (టౌన్): ‘‘ గ్యారంటీ లేని సెల్ఫోన్లు అమ్ముతున్న తరుణంలో సెల్ఫోన్ విక్రయాల్లోకి వచ్చా. 2001 సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో సెల్ పాయింట్ ప్రారంభించా. కస్టమర్లు ఆదరించారు. ఇక వెనుతిరిగి చూడలేదు...’’ అని ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ సెల్పాయింట్ షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ ప్రసాద్ పాండే అన్నారు. కర్నూలులో బుధవారం మూడు షోరూంలు ప్రారంభ సందర్భంగా ఆయన ‘సాక్షితో’ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలో 85 షోరూంలు.. సీమలో మరో 30... సెల్ఫోన్ల ప్రాధాన్యం పెరిగింది. అంతే నాణ్యతతో సెల్ఫోన్లు విక్రయిస్తున్నాం. అన్ని వర్గాలు మా వద్ద కోనుగోలు చేసే విధంగా నమ్మకం కలిగించాం. గ్యారంటీ విక్రయాలతో మంచి ఆదరణ వచ్చింది. సెల్ఫోన్ విక్రయాలతో పాటు యాక్ససరీస్కు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఫోన్ కవర్తో పాటు మెమరీ కార్డులు, పౌచెస్, ప్రొటెక్షన్ స్క్రీన్గార్డు, హెడ్సెట్ ఇలా... అన్ని రకాల కంపెనీలకు చెందిన సెల్ఫోన్లు ఉన్నాయి. విలువైన ఫోన్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. అమ్మకాలకే పరిమితం కాకుండా అమ్మకం తరువాతి సర్వీస్కు ప్రాధాన్యం ఇస్తున్నాం. విశాఖపట్నంతో పాటు విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు... ఇలా అన్ని జిల్లాలో మా షోరూంలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కర్నూలులో ఒకేరోజు 3 షోరూంలు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 85 షోరూంలు ఉన్నాయి. త్వరలోనే సీమ జిల్లాలో మరో 30 షోరూంలు ప్రారంభిస్తాం. కర్నూలులో శిక్షణ కేంద్రం ఇప్పుడున్న సెల్ ఫోన్ షోరూంలతో పాటు మరో 30 షోరూంలు రావడం వల్ల ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. అందువల్లే కర్నూలు నగరంలోనూ కంపెనీకి చెందిన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడే 200 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి కంపెనీ షోరూమ్లలో నియమిస్తాం. మా సంస్థలో 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. -
విజయవాడలో అందాల భామలు
-
దుకాణంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
పశ్చిమగోదావరి ,చింతలపూడి : ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది. స్థానిక టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకులు పనిచేయకపోవడంతో పాటు స్టీరింగ్ పట్టేయడంతో బస్సు పక్కనే ఉన్న బజాజ్ షోరూమ్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు డిపోకు చెందిన బస్సు చింతలపూడి మీదుగా అశ్వారావుపేట వెళుతోంది. చింతలపూడిలో ప్రయాణికులను ఎక్కించుకుని బస్టాండ్ నుంచి బయలుదేరింది. టీటీడీ కల్యాణ మండపం సమీపానికి రాగానే బస్సు అదుపుతప్పి బజాజ్ షోరూమ్లోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఏమీ జరగలేదు. ప్రమాదంలో కొక్కిరగడ్డ రాజశేఖర్, మెకానిక్ తేజ, వేమారెడ్డిలకు బలమైన గాయాలవ్వడంతో చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో వేమారెడ్డిని ఏలూరు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రయాణికులను ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు. -
విజయవాడలో బిగ్ సి 9వ షోరూమ్ ప్రారంభం
విజయవాడలో 9వ ‘బిగ్ సి’ షోరూమ్ను ప్రముఖ సినీనటి, బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్, రాశీ ఖన్నా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిగ్ సీ ఈడీ వై. స్వప్నకుమార్ పాల్గొన్నారు. ఈ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నామని, ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితంగా ఒక బహుమతిని గెల్చుకోవచ్చని తెలిపారు. -
బజాజ్ షోరూంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
-
గల్ఫ్లో ఒకే రోజు 7 మలబార్ షోరూమ్లు
హైదరాబాద్: ఆభరణాల విక్రయ రంగంలో ప్రముఖ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గల్ఫ్ దేశాల్లో ఒకే రోజు ఏడు కొత్త షోరూమ్లను ప్రారంభించింది. యూఏఈలో ఐదు, కువైట్లో ఒకటి, బహ్రెయిన్లో ఒకటి వీటిలో ఉన్నాయి. వీటిలో 18, 22, 24 క్యారట్ల బంగారు ఆభరణాలతోపాటు, వజ్రాలు, ఆన్కట్ వజ్రాలు, జాతి రత్నాభరణాలను ప్రదర్శించనున్నట్టు సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ షోరూమ్ల విస్తరణపై రూ.620 కోట్లను వెచ్చించనున్నట్టు మలబార్ గోల్డ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి లోపు అదనంగా 24 షోరూమ్లను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం షోరూమ్ల సంఖ్యను 185కి పెంచుకోనుంది. -
వాహనానికీ ఆన్లైన్ బీమా ఉంది!
ఆఫ్లైన్తో పోలిస్తే చౌకగానే పాలసీలు ప్రీమియంలు తక్కువ మీరో వాహనం కొన్నారు. బీమా తప్పనిసరి కదా!! మరేం చేస్తారు? అంతా షోరూమ్లోని ఏజెంట్లనే ఆశ్రయిస్తారు. కొందరైతే సదరు షోరూమ్ డీలర్నో, తమకు రుణమిచ్చిన బ్యాంకర్నో సంప్రతిస్తారు. బీమా తీసుకుంటారు కూడా. కానీ చౌకగా కావాలంటేనో...!! ఇదిగో ఇక్కడే ఆన్లైన్ మార్గం కనిపిస్తుంది మనకు. ఇంటర్నెట్ చార్జీలు తగ్గుతూ స్మార్ట్ఫోన్ల వాడకం పెరగడం ఆన్లైన్ కొనుగోళ్లకు ఊతమిస్తోంది. ఇపుడీ రూట్లో బీమా పాలసీలు తీసుకునేవారూ పెరుగుతున్నారు. దానిపై అవగాహన కల్పించటమే ఈ కథనం ఉద్దేశం. నిత్యం రోడ్డు ప్రమాదాలతో మన రహదారులు బోలెడంత అపప్రద మూటగట్టుకున్నాయి. దీంతో, ఇటీవలే మోటార్ వెహికల్ బిల్లుకు కొత్త సవరణలు చేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించడం వంటివి ఇందులో ఉన్నాయి. అయినప్పటికీ.. చాలామంది వాహనదారులు.. పాలసీ తీసుకోవడమంటే సంక్లిష్టమైన ప్రక్రియగా భావించి బీమా లేకుండానే వాహనాలు నడిపించేస్తుంటారు. నిజానికపుడు సింపుల్గా ఫారం నింపి, ప్రీమియం లెక్కించుకుని, ఆన్లైన్లో కట్టేస్తే చాలు. అంతే..!! ఎలాంటి పేపర్ వర్కూ లేకుండా అప్పటికప్పుడు బీమా కవరేజీ లభిస్తోంది. ఆఫ్లైన్ పాలసీలతో పోలిస్తే ఆన్లైన్ పాలసీల ప్రీమియం కొంత తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీరు నేరుగా బీమా కంపెనీ పోర్టల్ నుంచే కొనుగోలు చేయడం వల్ల ఏజెంట్లు, ఇతరత్రా అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల వంటివి తగ్గుతాయి. పోల్చి చూసుకోవచ్చు.. ఆన్లైన్ ఇన్సూరెన్స్ విధానంలో ప్రీమియంలను, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తులను, కాల వ్యవధులను, ఇతరత్రా అదనపు ఫీచర్లను పోల్చిచూసుకోవచ్చు. వాహన బీమా విషయంలో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వేల్యూ (ఐడీవీ) చాలా కీలకమైనది. ఆన్లైన్ బీమాతో వివిధ సంస్థలు మీ వాహనానికి లెక్కకడుతున్న ఐడీవీని పోల్చి చూసుకుని, మెరుగైన పాలసీని ఎంచుకోవచ్చు. ఏజంట్లు ఏవో మాయమాటలు చెప్పి తమకు ఎంతమాత్రం ఉపయోగపడని పాలసీలను అంటగట్టారంటూ చాలా మంది పాలసీదారుల నుంచి సాధారణంగా ఆరోపణలు వస్తుంటాయి. అదే ఆన్లైన్లో అయితే అన్ని వివరాలు మీ ముందే ఉంటాయి కాబట్టి మీకు అనువైన పాలసీ గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఎంపిక చేసుకోవచ్చు. సులభతరంగా రెన్యువల్.. పోర్టల్లో లాగిన్ కావడం, అవసరమైన పాలసీని ఎంచుకోవడం (ఇప్పటికే ఉన్నదైనా లేదా వేరే బీమా సంస్థ నుంచి బదలాయించేదైనా), వివరాలు.. ఫోన్ నంబర్ మొదలైనవి ఫారంలో నింపడం చేస్తే చాలు. రెన్యువల్ నోటీసు పేజీ వస్తుంది. అందులో పేమెంట్ ఆప్షన్ను క్లిక్ చేసి చెల్లింపులు చేస్తే చాలు.. కవరేజీ అప్పటికప్పుడు రెన్యువల్ అయిపోతుంది. ప్రాసెసింగ్ ఖర్చులు తగ్గించేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు బీమా కంపెనీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని గణనీయంగా ఉపయోగించుకుంటున్నాయి. పెట్రోల్ బంకులతోనూ భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో వాహనంలో ఇంధనం నింపుకోవడానికి వచ్చిన వారు అక్కడికక్కడే మోటార్ ఇన్సూరెన్స్ తీసుకునే వెసులుబాటు లభిస్తోంది. మొబైల్ ప్రింటర్లతో కస్టమర్లకు అప్పటికప్పుడే పాలసీ కాపీ కూడా లభిస్తోంది. ఆన్లైన్ పాలసీ తీసుకునేటప్పుడు తగిన సలహాలు, సూచనల కోసం ఆన్లైన్ చాటింగ్ సహాయం తీసుకోవచ్చు. షరా మామూలుగా ఆన్లైన్లో అయినా సరే ముందుగా తగినంత అధ్యయనం చేసిన తర్వాతే మీ అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోండి. -
రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం
వాహనాల కొనుగోళ్లకు ముందుకురాని ప్రజలు విజయనగరం ఫోర్ట్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం వాహనకొనుగోళ్లపై పడింది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో చేతిలో డబ్బులు లేకపోవడంతో వాహనాల కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. నవంబర్ 8 వరకు కొనుగోళ్లు ఆశాజనకంగా జరిగినా, ఆ తర్వాత నెమ్మదించారుు. కొంతమంది కొనుగోళ్లు చేస్తున్నా పూర్తిస్థారుు ఫైనాన్స తీసుకుంటున్నారు. అక్టోబర్ కంటే నవంబర్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా తగ్గింది. అక్టోబర్లో 1014 రిజిస్ట్రేషన్లు జరగ్గా, నవంబర్లో 820 జరిగారుు. ఇందులో కూడా సుమారు 500 వరకు రిజిస్ట్రేషన్లు నవంబర్ 8వ తేదీకి ముందు జరిగినవే. ఫైనాన్సర్లను ఆశ్రరుుస్తున్న కొనుగోలుదారులు చేతిలో డబ్బులు లేకపోవడంతో వాహనదారులు పూర్తిస్థారుు ఫైనాన్సపై వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. షోరూం యజమానులు కూడా కేవలం నాలుగైదు వేల రూపాయలు కట్టినా వాహనాలు ఇచ్చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో వాహనాలు కొనుగోలు మందగించడంతో షోరూంలు వెలవెలబోతున్నారుు. -
విశాఖలో సౌత్ఇండియా షాపింగ్మాల్ ప్రారంభం
హైదరాబాద్: సౌత్ఇండియా షాపింగ్మాల్ తాజాగా విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్లో కొత్త షోరూమ్ను ప్రారంభించింది. ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ షోరూమ్ను ప్రారంభించారు. షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, నటుడు అఖిల్ అక్కినేని, నటి సమంత సహా పలువురు ప్రముఖుల పాల్గొన్నారు. అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందిచడమే తమ లక్ష్యమని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్లు సురేశ్, స్పందన, అభినయ్, రాకేశ్, కేశవ్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంప్రదాయశైలి మొదలుకొని ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించే అన్ని రకాల వైవిధ్యభరితమైన వస్త్రాలను అందించడం సౌత్ఇండియా షాపింగ్మాల్ ప్రత్యేకతని అఖిల్ అక్కినేని తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో బట్టల షాపులు దగ్ధం
తప్పిన పెనుముప్పు రూ.కోటి విలువైన వస్రా్తలు దగ్ధం ట్రాన్సఫార్మర్ హేవీ లోడ్తో మంటలు వ్యాప్తి రాజమహేంద్రవరం క్రైం : కరెంట్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో నగరంలోని తాడితోటలో వస్త్ర దుకాణాలు దగ్ధమైయ్యాయి. బుధవారం స్థానిక మహాత్మా గాంధీ హోల్ సేల్ క్లాత్ మార్కెట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల షాపు నెంబర్ 98, 113, 112 షాపులకు మంటలు వ్యాపించాయి. కింద షాపులో శ్రీదుర్గా హోమ్ డెకరేటర్స్ షాపు నిర్వహిస్తుండగా పైన ఉన్న షాపులను గౌడౌన్లుగా వినియోగిస్తున్నారు. ముందుగా మధ్య ఉన్న దుకాణానికి బయట ఏర్పాటు చేసిన ట్రాన్ సఫార్మర్లో హైలోడ్ రావడంతో వైర్ కాలుతూ మధ్య గోడౌ¯ŒSకు మంటలు వ్యాపించాయి. ఈ గొడౌన్ కు రెండు వైపులా షటర్లకు లోపల నుంచి తాళాలు వేసి ఉండడం వల్ల సకాలంలో తాళాలు తీయలేకపోయారు. దీనితో పండుగల కోసం నిల్వ చేసిన దుస్తులు బూడిదయ్యాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. ఇతర షాపుల సిబ్బంది మిగిలి ఉన్న దస్తులను అక్కడ నుంచి తీసి ఆటోలో వేరే ప్రాంతాలకు తరలించారు. తప్పిన ముప్పు ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సభవించకపోవడం ఒకటైతే, మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఫైర్ ఆఫీసర్ పార్ధసారథి అన్నారు. ఈ ప్రమాదంలో కోటి రూపాయలు విలువైన వస్రా్తలు కాలిబూడిదయ్యాయని షాపుల యజమాని ములకల ఆనంద్ తెలిపారు. -
టాటా మోటార్స్ షోరూం ప్రారంభం
48 గంటల్లో వాహనం రిపేర్ పూర్తి అలా చేయలేకపోతే వినియోగదారుడికి అపరాధ రుసుము చెల్లింపు టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.టి.వాస¯ŒS రాంపూర్(ధర్మసాగర్ ) : రాంపూర్ వద్ద వరంగల్ – హైదరాబాద్ హైవేపై ఏర్పాటు చేసిన టాటా మోటార్స్ షోరూంను ఆదివారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆర్.టి.వాస¯ŒS ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన వినియోగదారులకు ఈ షోరూం ద్వారా సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. తమ బ్రాండ్కు చెందిన అన్ని మోడళ్ల ఆటో కమర్షియల్, కమర్షియల్ వెహికిల్స్ సేల్స్, సర్వీస్, స్పేర్పార్ట్్సకు సంబంధించిన సేవలను 24 గంటలు అందిస్తామన్నారు. వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లో వాహనం ఉన్నచోటికి సంస్థ ప్రతినిధులు చేరుకుని రిపేర్ చేస్తారని తెలిపారు. రిపేర్ కోసం షోరూంకు తరలించిన వాహనాన్ని 48 గంటల్లో బాగు చేసి, వినియోగదారుడికి అప్పగిస్తామన్నారు. ఒకవేళ అలా చేయలేకపోతే కస్టమర్కు అపరాధ రుసుమును సైతం కంపెనీ ద్వారా చెల్లిస్తామని ఆర్.టి.వాస¯ŒS వెల్లడించారు. అనంతరం టాటామోటార్స్ అధీకృత డీలర్ గీతా ఆటో కమర్షియల్ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ టాటా మోటార్స్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ షోరూంతో ఒకే పాయింట్ వద్ద అన్ని రకాల సేవలను వినియోగదారులు పొందొచ్చన్నారు. కార్యక్రమంలో టాటామోటార్స్ సౌత్జో¯ŒS సేల్స్ రీజినల్ మేనేజర్ పి.రాయ్, కస్టమర్ ఆర్ఎం అరుణ్ జలాలీ, ప్రశాంత్ ఫడ్నవిస్, తదితరులు పాల్గొన్నారు. -
షోరూమ్ల్లోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్
* హైసెక్యూరిటీ నంబర్ప్లేట్ కూడా అక్కడే * ఇక తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఉండవు * అమలు దిశగా రవాణా శాఖ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్లలో ఇప్పటివరకు ఉన్న రెండు రకాల రిజిస్ట్రేషన్ల విధానానికి త్వరలో తెరపడనుంది. ఇక వాహనం కొనుగోలు చేసిన షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తారు. హైసెక్యూరిటీ నంబర్ప్లేట్ను బిగించి ఇస్తారు. దీంతో వాహనదారులు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్లతోపాటు, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఫీజును షోరూమ్లలోనే చెల్లించే సదుపాయం అందుబాటులో ఉంది. ఇక తాత్కాలిక రిజిస్ట్రేషన్ పద్ధతికి కూడా స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సీఎం పరీశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన కొద్దిరోజుల్లోనే అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇక ఏజెంట్లు, మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త విధానాన్ని తెలంగాణ అంతటా పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ భావిస్తోంది. రోజూ వేలసంఖ్యలో నమోదు ఇప్పటివరకు మోటారు వాహన నిబంధనల ప్రకారం వాహనాలు కొనుగోలు చేసిన నెలరోజుల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొద్దిపాటి జరిమానాతో 6 నెలల వరకు కూడా అనుమతిస్తారు. ఇలాంటి వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, రోడ్డు భద్రతా నిమయాలను అతిక్రమించినప్పుడు చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు తలె త్తుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి వాహనదారులకు ఊరట కల్పించేందుకు ఆర్టీఏ చర్యలు చేపట్టింది. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను షోరూమ్లకు అప్పగించే ప్రతిపాదనపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, తాత్కాలిక రిజిస్ట్రేషన్ల పేరిట కొందరు డీలర్లు వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. రవాణాశాఖ నిర్వహించే దాడుల్లోనూ తరచూ ఇలాంటి అక్రమాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్లను షోరూమ్లకు కట్టబెట్టడం వల్ల డీలర్లపై రవాణాశాఖ నియంత్రణ ఏ మాత్రం ఉండదని ఆందోళన వ్యక్తమవుతోంది. -
షోరూమ్లో కారు చోరీ
రావులపాలెం : తాళాలు వేసి ఉన్న ఒక కార్ల షోరూమ్ షెట్టర్ తాళం పగులగొట్టి కారును దొంగలించిన ఉధంతమిది. వివరాల ప్రకారం స్థానిక అరటి మార్కెట్ యార్డుకు వెళ్లే దారిలో ఉన్న మారుతి సుజికీ షోరూమ్లో సిబ్బంది ఎప్పటిలాగే బుధవారం రాత్రి షోరూమ్కు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. గురువారం వచ్చి చేసే సరికి షోరూమ్ ఒక వైపు షెట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. షోరూమ్లో అమ్మకానికి ఉంచి మారుతి షిఫ్ట్ డిజైర్ మాగ్మా గ్రీన్ కలర్ కారును దొంగలు తీసుకుపోయినట్టు దీనిని విలువ సుమారు రూ. 8లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సంఘటన ప్రాంతాన్ని సీఐ పీవీ రమణ, ఎస్సై పీవీ త్రినాథ్లు పరిశీలించారు. కాకినాడ నుండి క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. షోరూమ్ నిర్వహకులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దర్యాప్తులో భాగంగా కారు చోరీ చేసిన వ్యక్తుల ఆచూకీ కోసం జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. -
షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు
విజయవాడ : జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ఆర్టీవో పురేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 26వ తేదీ నుంచి జిల్లాలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వాహనాలు కొనుగోలు చేసే వారు షోరూంలలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించుకోవాలని సూచించారు. అన్ని కాగితాలు సక్రమంగా ఇస్తే ఒక్క రోజులో రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 974 వాహనాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా 200 దరఖాస్తులు తిరస్కరించామని పేర్కొన్నారు. తిరస్కరించిన దరఖాస్తుదారులు ఆధార్ నంబర్లు ఇవ్వలేదన్నారు. ఆధార్ నంబరు, హెల్మెట్ కొనుగోలు చేసిన బిల్లులు రిజిస్ట్రేషన్ దరఖాస్తులో అప్లోడ్ చేయాలని సూచించారు. ఇంటివద్దకే ఆర్సీ బుక్ను పోస్టులో పంపుతామని వివరించారు. -
జోయాలుక్కాస్ను భారీగా విస్తరిస్తున్నాం
సంస్థ చైర్మన్ జోయ్ ఆలుక్కాస్ వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ జ్యువెలరీ వ్యాపారంలో జోయాలుక్కాస్ విజయవంతం ముందుకు వెళ్తుందని జోయాలుక్కాస్ చైర్మన్ అండ్ ఎండీ జోయ్ ఆలుక్కాస్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని జోయాలుక్కాస్ షోరూమ్లు వ్యాపారంలో అంచనాలకు మించి పోయాయని తెలిపారు. అందుకే మరో పెద్ద జోయాలుక్కాస్ షోరూమ్ను తాజాగా పంజాగుట్టలో ప్రారంభించామన్నారు. శనివారం జోయాలుక్కాస్ షోరూమ్ ప్రారంభం అనంతరం ఆయన సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు... 121వ షోరూమ్ ఇది... ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే జోయాలుక్కాస్ షోరూమ్లు 120 వరకు ఉన్నాయి. పంజాగుట్టలో ప్రారంభమైన దానితో కలిపితే 121వది. మా సంస్థల్లో ఎక్కడ షోరూమ్ ప్రారంభించినా అక్కడి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణలో కలిసి 18 జ్యూయలరీ షోరూమ్లు ఉన్నాయి. ప్రతి ఏడాది 12 నుంచి 18 షోరూమ్లు ఓపెన్ చేస్తున్నాం. 11 దేశాల్లో ఉన్న మా సంస్థల్లో 99% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తున్నాం. 2015-16కు 14 షోరూమ్లు, 2016-17లో 8 నుంచి 9 షోరూమ్లు ప్రారంభించనున్నాం. ఇప్పటికి దేశవ్యాప్తంగా 65 షోరూమ్స్ ఉన్నాయి. జిల్లాలకూ... 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 200 జోయాలుక్కాస్ షోరూమ్లు ప్రారంభించటం ధ్యేయం. అంతేకాదు జిల్లాలకు కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నాం. ఇప్పటి లాగా ప్రజలు ఆదరించి, అభిమానిస్తే విస్తరణ సులభతరం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మా టర్న్వర్ రెండు బిలియన్ డాలర్లు. అందులో ఇక్కడ రూ. 6 వేల కోట్లు టర్నోవర్ ఉంది. పంజాగుట్ట లాంటి షోరూమ్ల్లో రూ. 150 కోట్ల విలువైన స్టాక్ ఉంటోంది. ఇక్కడ జ్యువెలరీ వ్యాపార వృద్ధి 5 నుంచి 6 శాతం ఉంది. అది కాస్తా 12 నుంచి 15 శాతం పెరగాల్సివుంది. ఐపీవో ప్రణాళిక... విస్తరణ కోసం మార్కెట్ ద్వారా నిధులు సమీకరించేందుకు తొలి పబ్లిక్ ఇష్యూ జారీచేయాలన్న ప్రణాళిక వుంది. జ్యువెలరీతో సహా పలు ఇతర వ్యాపారాలు కూడా మేము చేస్తున్నాం. జోయాలుక్కాస్ వ్యాపారాలు భారత్తో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, బెహ్రెయిన్, ఒమన్, కువైట్, కతార్, సింగపూర్, మలేషియా, లండన్లలో నడుస్తున్నాయి. మా వ్యాపారాల్లో జ్యువెలరీ, ద్రవ్య మార్పిడి, ఫ్యాషన్, టెక్స్ టైల్స్, లగ్జరీ విమానాలు, మాల్స్, రియాల్టీలు ఉన్నాయి. జోయాలుక్కాస్ ప్రపంచ వ్యాప్తంగా 7,000 మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించింది. -
సంప్రదాయ దుస్తులపై మక్కువ
కంటోన్మెంట్: సంప్రదాయ, శ్వేత వర్ణ దుస్తులనే తాను ఎక్కువగా ఇష్టపడతానని ప్రముఖ దర్శకుడు, ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ అన్నారు. తిరుమలగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రామరాజ్ కాటన్’ షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరాజ్ కాటన్ కంపెనీ ఉత్పత్తులు నాణ్యత, మన్నికైనవి కావడంతోతాను బ్రాండ్ అంబాసిడర్గా మారానన్నారు. ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మనవడు శ్రవంత్ రాజు, మనవరాలు దివ్య రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షోరూం విజయవంతంగా నడవాలని ఆకాంక్షించారు. రామరాజ్ కాటన్ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ కె.ఆర్.నాగరాజన్ మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశలలో తమ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. తమ కంపెనీ 2015 ‘ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ అట్రాక్టివ్ బ్రాండ్’ జాబితాలో స్థానం దక్కించుకుందన్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ వచ్చారని తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో షోరూముకు చేరుకొని... ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. -
బెలగావిలో మలబార్ గోల్డ్ షోరూమ్ ప్రారంభం
కర్నాటకలోని బెలగావి (బెల్గామ్)లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 150వ షోరూమ్ను ప్రారంభిస్తున్న బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్. చిత్రంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ (ఇండియా) ఆషర్ ఓ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్స్ కె.పి.అబ్దుల్ సలామ్, ఎ.కె. నిషాద్, రీజినల్ హెడ్ రెహ్మన్ తదితరులు. -
అబుదాబిలో జోయాలుక్కాస్ షోరూమ్
జోయాలుక్కాస్ తాజాగా అబుదాబి లోని ముష్రిఫ్ మాల్లో కొత్తగా షోరూమ్ను ప్రారంభించింది. ఇందులో బంగారం, డైమండ్, విలువైన రాళ్లు, ప్లాటినం, రత్నాలు సంబంధిత ఆభరణాలు పలు రకాల మోడళ్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు ఆభరణాల కొనుగోలుపై బంగారు నాణేన్ని ఉచితంగా అందిస్తున్నట్లు జోయలుక్కాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాన్ పాల్ అలుక్కాస్ తెలిపారు. జోయాలుక్కాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాన్ పాల్ అలుక్కాస్, జోయాలుక్కాస్ గ్రూప్ డెరైక్టర్లు ఆంటోనీ జోస్, మేరీ ఆంటోనీ సహా ఇతర ప్రముఖుల సమక్షంలో ఇతిహద్ గెస్ట్ మేనేజింగ్ డెరైక్టర్ యాసర్ అల్ యూసుఫ్ షోరూమ్ను ప్రారంభించారు. -
మహీంద్రా ట్రాక్టర్ షోరూంలో అగ్నిప్రమాదం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మహీంద్రా ట్రాక్టర్ షోరూంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెర్సిడెస్ కొత్త ఎస్యూవీ.. జీఎల్ఈ
ధరలు రూ. 58.9 లక్షల నుంచి రూ. 69.90 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త ఎస్యూవీని బుధవారం ఆవిష్కరించింది. భారత్లోనే తయారు చేసే ఈ జీఎల్ఈ ఎస్యూవీ ధరలు రూ.58.9 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ ఫోల్గర్ చెప్పారు. రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తుందని పేర్కొన్నారు. 250డి (2,143 సీసీ డీజిల్ ఇంజిన్) ఎస్యూవీ ధర రూ.58.90 లక్షలని, 350 డి(2,987 సీసీ డీజిల్ ఇంజిన్) ఎస్యూవీ ధర రూ.69.90 లక్షలని(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు. ఎంఎల్-క్లాస్ ఎస్యూవీలో మార్పులు, చేర్పులు చేసి ఈ మోడల్ను మెర్సిడెస్ బెంజ్ అందిస్తోంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ కాలానికి తమ ఎస్యూవీ పోర్ట్ఫోలియో 70 శాతం చొప్పున వృద్ధి సాధించిందని రోలాండ్ పేర్కొన్నారు. ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను అందిస్తామని చెప్పామని, ఇప్పటివరకూ 13 కొత్త మోడళ్లను తీసుకొచ్చినట్లు చెప్పారు. -
మలబార్ జెమ్స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ జెమ్స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నగరాల్లో నిర్వహిస్తోంది. వినూత్నమైన, ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన ఈ జెమ్స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని తమ షోరూమ్ల్లో ఈ నెల 21న ప్రారంభమైందని, వచ్చే నెల 26న ముగుస్తుందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పచ్చలు, కెంపులు, రత్నాలు, ముడి వజ్రాలు తదితర విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలను ఈ ఫెస్టివల్లో డిస్ప్లే చేస్తామని పేర్కొంది. ముడి వజ్రాలతో రూపొందిన ఎరా బ్రాండ్ ఆభరణాలు, విలువైన రత్నాలతో రూపొందించిన ప్రిసియా బ్రాండ్ ఆభరణాలను ఆకర్షణీయమైన ధరల్లో కొనుగోలు చేయడానికి ఈ ఫెస్టివల్ మంచి అవకాశమని వివరించింది. ఈ ఆభరణాలకు జీవిత కాల ఉచిత మెయింటనెన్స్, ఒక ఏడాది ఉచిత బీమా కవరేజీ, బై-బ్యాక్ గ్యారంటీ వంటి ఆఫర్లున్నాయని తెలిపింది. -
సోనో విజన్ షోరూం లో అగ్నిప్రమాదం
నెల్లూరు: నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సోనో విజన్ ఎలక్ట్రానిక్స్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. షోరూంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ. 25 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని సమాచారం. -
ఫ్యాషన్ ‘ఉష’స్సు
ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్, ప్రథమ మహిళా పైలట్ ఉషా రఘునాథన్.. మరోమారు నగరానికి వచ్చారు. ఆమె తాజాగా డిజైన్ చేసిన దుస్తుల కలెక్షన్స్ను బంజారాహిల్స్ రోడ్నెం.1లోని సింఘానియాస్ బొటిక్లో గురువారం లాంచ్ చేశారు. ఇదే తన చివరి కలెక్షన్ అని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, జీవితానికి ఏదీ చివరిదంటూ ఉండదని, తాను తొలుత పైలట్గా కెరీర్ ప్రారంభించి డిజైనర్ దాకా ఎన్నో రకాల ప్రొఫెషన్స్ను ఎంజాయ్ చేశానని చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పర్యటించడమే తన లక్ష్యమన్నారు. రేఖ, హేమమాలిని, జయాబచ్చన్, షబానా అజ్మీ... వంటి ప్రముఖులు ఇష్టపడే సంప్రదాయ వస్త్రశైలులు అందించిన ఉషా రఘనాథన్ తమ బొటిక్లో కలెక్షన్ లాంచ్ చేయడం ఆనందదాయకమని, బ్లౌజ్లు, పట్టు చీరలు, సిల్క్-కాటన్ మిక్స్ చీరలు.. ఉష కలెక్షన్లో ఉన్నాయని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. - సాక్షి, లైఫ్స్టైల్ప్రతినిధి. -
చెప్పుల షాపులో అగ్నిప్రమాదం
-
‘సాక్షి’ పండుగ సంబరాలు వచ్చేశాయ్..
విజయవాడ, న్యూస్లైన్ : సాక్షి పండుగ సంబ రాలు రోజుకొకరిని లక్షాధికారిని చేయనున్నాయి. నగరంలో ఈ నెల 22 నుంచి జనవరి 5వ తేదీ వరకూ ‘సాక్షి’ఎంపిక చేసిన షోరూమ్ల్లో కొనుగోలు దారులకు అందజేసిన కూపన్లకు ప్రతిరోజూ లక్కీ డిప్ నిర్వహించి, విన్నర్కు లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. ఇంకెందుకు ఈ నెల 22 నుంచి సాక్షి పండుగ సంబరాలు నిర్వహిస్తున్న షోరూమ్లలో షాపింగ్ చేయండి.. లక్షాధికారులు కండి. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఎంజీ రోడ్డులోని కళానికేతన్ షోరూమ్లో ఘనంగా జరిగింది. కొనుగోలుదారుల హర్షధ్వానాల మధ్య నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్ లాంఛనంగా లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమ వివరాలను బ్రాంచి మేనేజర్ సూర్యనారాయణ వివరించారు. కళానికేతన్ ఎండీ వి.నాగభూషణం(చంటి), సాక్షి ఏజీఎం(యాడ్స్) వినోద్ మాదాసు, బ్యూరో ఇన్చార్జి టి.నాగభూషణం, రీజినల్ మేజేజర్ (యాడ్స్) సీహెచ్ అరుణ్కుమార్, బ్రాంచ్ డెప్యూటీ మేనేజర్ జె.ఎస్.ప్రసాద్తో పాటు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు, కళానికేతన్ సిబ్బంది పాల్గొన్నారు. -
కాకినాడలో ప్రత్యక్షమైన హీరోయిన్ కాజల్