గుత్తి: రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మహిళ రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గుత్తిలో చైన్స్నాచింగ్
Published Sun, Jun 5 2016 6:11 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM
Advertisement
Advertisement