తాడిపత్రిలో చైన్‌స్నాచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో చైన్‌స్నాచింగ్‌

Sep 27 2023 1:32 AM | Updated on Sep 27 2023 11:22 AM

బాధితురాలు కృష్ణవేణి   - Sakshi

బాధితురాలు కృష్ణవేణి

తాడిపత్రి: స్థానిక రూరల్‌ పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసముంటున్న కృష్ణవేణి మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద ఉన్న పశువుల పాక వద్ద చెత్తను కృష్ణవేణి శుభ్రం చేస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అక్కడకు చేరుకున్నారు. వీరిలో ఒకరు కిందకు దిగి కృష్ణవేణి మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కొని ద్విచక్ర వాహనంపై ఉడాయించాడు.

మంకీక్యాప్‌ ధరించడం వల్ల వారు ఎవరైంది తెలియకుండా పోయింది. కృష్ణవేణి కేకలతో చుట్టపక్కల వారు అక్కడకు చేరుకునే లోపు దుండగులు కంటికి కనిపించకుండా పోయారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలోని ఓ ఇంటి వద్ద ఉన్న సీసీకెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement