Krishnaveni
-
సీనియర్ నటి కృష్ణవేణి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
-
నటి కృష్ణవేణి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: సినీ నటి, నిర్మాత, నేపథ్య గాయని కృష్ణవేణి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు అని అన్నారు. కృష్ణవేణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.సినీ నటి కృష్ణవేణి మృతి పట్ల వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ జగన్.. ఈ సందర్బంగా సంతాపం తెలిపారు. అనేక భాషల్లో నటించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు. అనేక గొప్ప చిత్రాలు తీసి నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. కృష్ణవేణి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. -
తెలుగువారికి గొప్ప బహుమతిని అందించారు: మంచు విష్ణు
సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి మరణం పట్ల మా అధ్యక్షుడు మంచు విష్ణు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమాలో ఒక చిరు దీపం వెలిగించిన లెజెండరీ కృష్ణవేణి.. నందమూరి తారక రామారావును బిగ్ స్క్రీన్కి పరిచయం చేసి మన ఇండస్ట్రీకి ఒక అమూల్యమైన బహుమతి ఇచ్చారు. ఆమె జ్ఞాపకాలు ఎప్పుడు మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతాయన్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని మంచు విష్ణు పోస్ట్ చేశారు.కాగా.. కృష్ణవేణి సినిమాల్లోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేశారు. 1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో దాదాపు 15 చిత్రాలలో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించారు. కృష్ణవేణికి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా మేకా రంగయ్యతో వివాహం జరిగింది. కేవలం నటిగానే కాదు.. తానే స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేశారు.ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. 1957లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషికి గానూ 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. ఆమె భర్త స్థాపించిన సంస్థ జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్నారు.కృష్ణవేణి నిర్మించిన సినిమాలుమన దేశం (1949)లక్ష్మమ్మ (1950)దాంపత్యం (1957)గొల్లభామ (1947)భక్త ప్రహ్లాద (1042) Telugu cinema lo oka chiru deepam veliginchina Legendary Krishnaveni Garu kalasina tidhi 🙏. Aame parishrama tho Nandamuri Taraka Rama Rao Garu ni big screen ki introduce chesi, mana industry ki oka amulya mayina gift icharu. Aame gnapakalu eppudu mana hrudayallo undipothayi.… pic.twitter.com/dYYqz6nmxK— Vishnu Manchu (@iVishnuManchu) February 16, 2025 -
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ఎన్టీఆర్ను పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. వయోభారంతో కన్నుమూశారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఆదివారం ఉదయమే తమ మాతృమూర్తి తుది శ్వాస విడిచినట్లు ఆమె కూమార్తె అనురాధ తెలిపారు.ఎన్టీఆర్ను పరిచయం చేసిన కృష్ణవేణి1949 నవంబరు 24వ తేదీన మనదేశం చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన నటన విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించాడు. రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న కృష్ణవేణి నందమూరి తారక రామారావును సినిమా రంగానికి పరిచయం చేశారు.కృష్ణవేణి సినీ ప్రస్థానం..శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్నా, నృత్యం అన్నా అభిమానంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే నాటకాలలో నటించటం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు. కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయమైంది. ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1937) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు.ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్ జయా పిక్చర్స్–శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. -
వైఎస్సార్సీపీ మహిళా నేతపై కక్ష సాధింపు
-
‘కిమ్స్’ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు నమోదైంది. రెండో భార్యకు పుట్టిన సంతానం మెదటి భార్య, సమీప బంధువులకు జన్మించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్నది ఆరోపణ. వీటి ఆధారంగా బర్త్ సర్టిఫికెట్లు, పాస్పోర్టులు కూడా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రెండో భార్య కృష్ణవేణి రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశారు. బొల్లినేని కృష్ణయ్యతో పాటు ఆయన సమీప బంధువులు లోటస్ హాస్పిటల్ యజమానులు హేమ, ప్రసాద్లనూ నిందితులుగా చేరుస్తూ కేసు నమోదైంది. నేరం మొత్తం నగరంలో జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సీసీఎస్కు బదిలీ చేశారు. విశాఖపటా్ననికి చెందిన కృష్ణవేణి 2003లో నాంపల్లిలోని మెడ్విన్ ఆస్పత్రిలో పని చేస్తుండగా కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్న కృష్ణయ్యతో పరిచయమైంది. తన భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ కృష్ణవేణిని నమ్మించిన కృష్ణయ్య 2004 ఫిబ్రవరిలో ఆమెను వివాహం చేసుకున్నారు. వీళ్లు బంజారాహిల్స్లో కాపురం పెట్టారు. కొన్నిరోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లడంతోపాటు బంధువులకూ భార్యగా పరిచయం చేస్తానంటూ నమ్మబలికారు. వీరికి 2004లో కుమారుడు అర్జున్ జన్మించాడు. కృష్ణయ్య, కృష్ణవేణి తల్లిదండ్రులుగా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారు. 2006లో అనారోగ్య కారణాలు చెప్పిన కృష్ణయ్య తన కుమారుడిని తనతో తీసుకెళ్లారు. తర్వాత ఇద్దరు కుమార్తెలు... 2006లో కృష్ణవేణి కుమార్తె కృష్ణ వైష్ణవికి జన్మనిచ్చింది. రెండేళ్ల తర్వాత వివిధ కారణాలు చెప్పిన కృష్ణయ్య వైష్ణవినీ తీసుకెళ్లిపోయారు. వీరికి 2011లో రెండో కుమార్తె శ్రీనిక పుట్టింది. ఆ తర్వాత నుంచి కృష్ణయ్య... కృష్ణవేణి వద్దకు రావడం మానేశారు. కుమారుడు, మొదటి కుమార్తె వివరాలను కూడా ఆమెకు తెలియనీయలేదు. కృష్ణవేణి ఎన్నిసార్లు కోరినా అర్జున్, వైష్ణవిలను చూపించడానికి సుముఖత చూపలేదు. ప్రతి నెలా కృష్ణవేణికి నిర్ణీత మొత్తం చెల్లిస్తూ వచ్చారు. 2016లో ఆమెను ఖాజాగూడలో ఉన్న తన విల్లాలోకి మార్చారు. తనతోపాటు తన పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని కృష్ణవేణి కోరారు. దీంతో ఆయన వీళ్లు నివసిస్తున్న విల్లాను మాత్రం శ్రీనిక పేరుతో బదిలీ చేశారు. ఆ తర్వాత నుంచి కృష్ణవేణిని పట్టించుకోవడం మానేశారు. తన కుమారుడిని కలవడానికి అనేక ప్రయత్నాలు చేసిన కృష్ణవేణి ఎట్టకేలకు 2021లో కలవగలిగారు. ఆమె తన తల్లి అని తెలుసుకున్న అర్జున్ షాక్ అవడంతోపాటు తండ్రి కృష్ణయ్య తన మొదటి భార్యనే తన తల్లిగా నమ్మించినట్లు చెప్పాడు. ఈమె అర్జున్ను కలుస్తున్న విషయం తెలుసుకున్న కృష్ణయ్య మానుకోవాలని బెదిరించారు. నకిలీ పత్రాలు సృష్టించి.. 2022లో విదేశాలకు వెళ్లిన అర్జున్ ఇక్కడకు వచ్చినప్పుడు తల్లిని కలిసేవారు. వైష్ణవి తన సోదరి అని తల్లి కృష్ణవేణి ద్వారా తెలుసుకున్నాడు. ఆమె కృష్ణయ్య సమీప బంధువులైన హేమ, ప్రసాద్ల కుమార్తెగా పెరుగుతున్నట్లు చెప్పాడు. కృష్ణయ్య తదితరులు అర్జున్, వైష్ణవిలకు సంబంధించి కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి, ధ్రువీకరణలు పొందినట్లు కృష్ణవేణి గుర్తించారు. వీటి ఆధారంగానే జీహెచ్ఎంసీ నుంచి బర్త్ సర్టిఫికెట్లు, రీజనల్ పాస్పోర్టు కార్యాలయం నుంచి పాస్పోర్టులు పొందినట్లు తెలుసుకున్నారు. ఈ ఆధారాలన్నీ పొందుపరుస్తూ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు కొట్టేయాలంటూ కృష్ణయ్య కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. తొలుత చీటింగ్, ఆపై అదనపు ఆధారాలతో ఫోర్జరీ కేసుగా మారింది. సీసీఎస్ పోలీసులు కేసును రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. -
నారా లోకేష్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన టీడీపీ మహిళ
-
ఎన్టీఆర్ని వెండితెరకు తెచ్చిన 'కృష్ణవేణి' ఎవరో తెలుసా..?
మణిలాంటి నటి... మణిలాంటి గాయని... మణిలాంటి నిర్మాత... కృష్ణవేణి చిత్రసీమకు ఒక అమ్యూలమైన మణి. మంచి నటీమణిగా తెరపై తన అభినయాన్ని కనబర్చారు. మంచి గాయనీమణిగా తన గాత్రాన్ని వినిపించారు. ‘మన దేశం’ వంటి చిత్రంతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. నేడు నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు సి. కృష్ణవేణి. ఈ సందర్భంగా కృష్ణ‘మణి’ జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న జన్మించారు కృష్ణవేణి. తండ్రి యర్రంశెట్టి కృష్ణారావు డాక్టర్. పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు కృష్ణవేణి. ఆ తర్వాత వెండితెరపైనా ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్లినప్పుడు ఆయన ‘తులాభారం’ నాటకం చూశారు. అందులో కృష్ణవేణి నటన నచ్చి, సినిమాలో నటించమని అడి గారు. అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాలో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి. ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1973) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్ జయా పిక్చర్స్–శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. నటిగా ఆమెకు ‘గొల్లభామ, లక్ష్మమ్మ’ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. ‘కచదేవయాని, గొల్లభామ, అనసూయ’ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి. ‘తిరుగుబాటు’ సినిమాలో ఆమె చేసిన వ్యాంప్ క్యారెక్టర్పై ప్రేక్షకులు పెదవి విరిచారు. 1942లో రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనూరాధ జన్మించడం.. భర్త రాజా సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాలతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి. కుమార్తె పేరుపై ‘ఎంఆర్ఏ’ప్రోడక్షన్ స్థాపించి, తొలి ప్రయత్నంగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘మన దేశం’ (1949) సినిమా తీసి, విజయం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ని వెండితెరకు పరిచయం చేశారు కృష్ణవేణి. కాగా ‘వరూధుని’ సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వీ రంగారావుని పిలిపించి, ‘మన దేశం’లో ఓ పాత్రకు అవకాశం ఇచ్చారామె. తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తి ఇచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి పేర్కొన్నారు. ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్గానూ తన ప్రత్యేకత చాటుకున్నారామె. ‘ధర్మాంగద’కి రూ. నలభై ఐదు వేలు పారితోషికం తీసుకున్నారు. ఆమె నిర్మించిన ‘గుడ్ ఈవెనింగ్, లేడీ డాక్టర్’ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావడం, ‘కుమ్మరి మొల్ల’ వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురయ్యారు కృష్ణవేణి. ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ‘సావాసం’ (1952). మహారాష్ట్ర గవర్నర్గా చేసిన కోన ప్రభాకరరావు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి నిర్మించిన చిత్రాల్లో ‘భక్త ప్రహ్లాద’ (1942) ఒకటి. నిర్మాతగా 1957లో విడుదలైన ‘దాంపత్యం’ కృష్ణవేణి చివరి సినిమా. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న ఆమె 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. గత ఏడాది ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు కృష్ణవేణి. తల్లి బాటలో కుమార్తె కృష్ణవేణి బాటలో ఆమె కుమార్తె ఎన్ఆర్ అనురాధా దేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి, లక్ష్మి ఫిలింస్ కంబైన్స్పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం ‘భక్త కుంబారా’ (1974)ని నిర్మించారు. ఇందులో రాజ్కుమార్ హీరో. తెలుగులో అనురాధ నిర్మించిన తొలి చిత్రం ‘చక్రధారి’ (1977). అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ, జయప్రద కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. నిర్మాతగా మొత్తం 17 చిత్రాలు నిర్మించారు అనురాధ. ఆమె నిర్మించిన చివరి చిత్రం ‘మా పెళ్లికి రండి’ (2000). జేడీ చక్రవర్తి, సాక్షీ శివానంద్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధా దేవి 2001లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ని సొంతం చేసుకున్నారు. - అనురాధా దేవి -
వీణను బహుమతిగా ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి
-
తాడిపత్రిలో చైన్స్నాచింగ్
తాడిపత్రి: స్థానిక రూరల్ పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసముంటున్న కృష్ణవేణి మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద ఉన్న పశువుల పాక వద్ద చెత్తను కృష్ణవేణి శుభ్రం చేస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అక్కడకు చేరుకున్నారు. వీరిలో ఒకరు కిందకు దిగి కృష్ణవేణి మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కొని ద్విచక్ర వాహనంపై ఉడాయించాడు. మంకీక్యాప్ ధరించడం వల్ల వారు ఎవరైంది తెలియకుండా పోయింది. కృష్ణవేణి కేకలతో చుట్టపక్కల వారు అక్కడకు చేరుకునే లోపు దుండగులు కంటికి కనిపించకుండా పోయారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలోని ఓ ఇంటి వద్ద ఉన్న సీసీకెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్ఆర్సీపీ నాయకురాలు కృష్ణవేణి దంపతులపై దాడి
-
వైఎస్ఆర్సీపీ నాయకురాలు కృష్ణవేణి దంపతులకు లోకేష్ టీం వార్నింగ్
-
‘పూజారమ్మా... అర్చన చెయ్యి’.. ఇక అక్కడ ఇదే మాట వినపడుతుంది
‘పూజారి గారూ... అర్చన చెయ్యండి’ అనే మాట ప్రతి గుడిలో వినపడేదే. కాని తమిళనాడులో ఒక మార్పు జరిగింది. పూజారులుగా స్త్రీలు నియమితులయ్యే ప్రయత్నం మొదలయ్యింది. ‘పూజారమ్మా... అర్చన చెయ్యి’ అనే ఇకపై మాట వినపడనుంది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు అర్చకత్వం కోర్సును ముగించి త్వరలో పూజారులుగా నియమితం కానున్నారు. ‘మహిళలు పైలెట్లుగా, వ్యోమగాములుగా దిగంతాలను ఏలుతున్నప్పుడు దేవుని అర్చనను ఎందుకు చేయకూడదు’ అనే ప్రశ్న తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తింది. అంతేకాదు దానికి సమాధానం కూడా వెతికింది. జవాబును ప్రజల ముందుకు తెచ్చింది. గతంలో ఛాందస దృష్టితో బహిష్టు కారణాన స్త్రీలను ‘అపవిత్రం’ అని తలచి గర్భగుడి ప్రవేశానికి, అర్చనకు దూరంగా ఉంచేవారు. గ్రామదేవతల అర్చనలో స్త్రీలు చాలా కాలంగా ఉన్నా ఆగమశాస్త్రాలను అనుసరించే దేవాలయాలలో స్త్రీలు అర్చకత్వానికి నిషిద్ధం చేయబడ్డారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పును తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మహిళా అర్చకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనుంది. అందులో భాగంగా ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సును ముగించి సహాయక అర్చకులుగా శిక్షణ పొందనున్నారు. ఒక సంవత్సరంపాటు ఆలయాల్లో శిక్షణ పొందాక ప్రధాన అర్చకులు కానున్నారు. అందరూ యోగ్యులే డి.ఎం.కె నేత కరుణానిధి 2007లో అర్చకత్వానికి అన్ని కులాల వాళ్లు యోగ్యులే అనే సమానత్వ దృష్టితో తమిళనాడులో ఆరు అర్చక ట్రైనింగ్ స్కూళ్లను తెరిచారు. అయితే ఆ కార్యక్రమం అంత సజావుగా సాగలేదు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కులాల వాళ్లు అర్చకత్వం కోర్సు చేసి పూజారులుగా నియమితులు కావచ్చన్న విధానాన్ని ప్రోత్సహించింది. దాంతో గత సంవత్సరం నుంచి చాలామంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే తిరుచిరాపల్లిలోని అర్చక ట్రైనింగ్ స్కూల్లో ముగ్గురు మహిళలు ఈ కోర్సులో చేరడంతో కొత్తశకం మొదలైనట్టయ్యింది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సులోని థియరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ హిందూ ధార్మిక మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్లు పొందారు. ప్రాక్టికల్స్లో భాగంగా ఒక సంవత్సరం పాటు వివిధ ఆలయాల్లో సహాయక అర్చకులుగా పని చేసి తదుపరి అర్చకులుగా నియమితులవుతారు. కోర్సు చదివిన కాలంలో వీరికి 3000 రూపాయల స్టయిపెండ్ లభించింది. దేవుడు కూడా బిడ్డడే ‘దేవుడు కూడా చంటిబిడ్డలాంటివాడే. గర్భగుడిలో దేవుణ్ణి అతి జాగ్రత్తగా ధూపదీపాలతో, నైవేద్యాలతో చూసుకోవాలి. స్త్రీలుగా మాకు అది చేతనవును’ అంది రమ్య. కడలూరుకు చెందిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం మాని మరీ అర్చకత్వం కోర్సులో చేరింది. మరో మహిళ కృష్ణవేణి ఇంటర్ వరకూ చదివి ఈ కోర్సు చేసింది. మూడో మహిళ రంజిత బి.ఎస్సీ చదివింది. ‘మా బ్యాచ్లో మొత్తం 22 మంది ఉంటే మేము ముగ్గురమే మహిళలం. కాని గత నెలలో మొదలైన కొత్తబ్యాచ్లో 17 మంది అమ్మాయిలు చేరారు. రాబోయే రోజుల్లో ఎంతమంది రానున్నారో ఊహించండి’ అంది రమ్య. తమిళనాడులో మొదలైన ఈ మార్పును మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయో లేదో ఇప్పటికైతే సమాచారం లేదు. కాని స్త్రీలు దైవాన్ని కొలిచేందుకు ముందుకు వస్తే ఇకపై వారిని ఆపడం అంత సులువు కాకపోవచ్చు. -
ఇల్లే సేవా కేంద్రం
కావల్సినన్ని వనరులు సమకూరినప్పుడు కూర్చుని సేద తీరుదామనుకుంటారు చాలామంది. తమ చుట్టూ ఉన్న నలుగురికైనా వారి స్వశక్తిని నమ్ముకునేలా చేయూతనిద్దాం అనుకుంటారు అతి కొద్దిమంది. అలాంటివారిలో కొత్తమాసు కృష్ణవేణి ఒకరు. సికింద్రాబాద్లోని టెలికాం కాలనీ, కానాజీగూడలో ఉంటున్న ఈ గృహిణి తన ఇంటినే సేవాకేంద్రంగా మలిచి పదేళ్లుగా మహిళలకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందిస్తున్నారు. మహిళలకు శిక్షణ ఇస్తూ బిజీగా ఉన్న కృష్ణవేణిని కలిసినప్పుడు, ఆమె సేవామార్గం వివరాలను ఇలా పంచుకున్నారు.. ‘‘పదిహేనేళ్ల క్రితం మావారు రంగారావు సత్యసాయి సేవాకార్యక్రమాలలో పాల్గొనేవారు. నేనూ ఆ కార్యక్రమాలకు వారి వెంట వెళ్లేదాన్ని. ఆ సమయంలోనే గ్రామాలలోని మహిళలకు స్వయం ఉపాధికి పనికి వచ్చే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనుకున్నాను. అప్పుడే మల్లాపూర్ గ్రామంలో మొట్ట మొదటిసారిగా నాకు వచ్చిన కుట్టు పనులను అక్కడి మహిళలకు నేర్పించి, వారికి ఆదాయ మార్గం చూపటం సంతృప్తినిచ్చింది. ఇంటి వద్ద నుంచి.. సేవా కార్యక్రమాలు ఎలా చేయచ్చో ఆ ఆడుగులు ఎలాగూ నేర్పించాయి. ఇంట్లో మా వారికి చెప్పి పైన ఓ గదిని ఏర్పాటు చేశాను. ఇంట్లోనే ఉంటాను కాబట్టి మహిళలకు టైలరింగ్, సాయంకాలాలు పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. ఇక్కడ ఒక్కచోటే సేవ చేస్తూ ఉంటే కాదు, మరికొందరికి ఉపాధిని అందిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో గ్రామాలకి వెళ్లడం ్రపారంభించాను. వెళ్లిన ఊళ్లో ముందుగా అక్కడ అనువైన స్థలం చూసుకొని, ఒక టీచర్ని ఏర్పాటు చేసి, నేర్చుకునేవారిని ఎంపిక చేసేదాన్ని. సాయిసంస్థ ద్వారానే రెండు నెలల పాటు 200 మందిని 10 బృందాలుగా చేసి, స్వయంగా శిక్షణ ఇచ్చాను. గృహిణిగా ఇంటి పనులు చేసుకుంటూ ఉండే నేను అలా ఒక్కో ఏడాది దాటుతూ సేవాకార్యక్రమాల్లో తీరికలేకుండా అయిపోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. ఈ 10 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని 300 గ్రామాలలో దాదాపు çపన్నెండు వేల మంది గ్రామీణ మహిళలకు కుట్టు మిషను, మెహెందీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పేపర్ వర్క్, ఫ్యాషన్ జ్యువెలరీ తయారీ, బ్యూటీషియన్ .. వంటి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహించాం. ఆ తర్వాత ఈ సేవామార్గంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్లు పరిచయమయ్యారు. అలా మేధా చారిటీ, అభయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి గ్రామీణ మహిళలకు ఎనిమిది వేల కుట్టుమిషన్లు, ఇతర ఉపాధులకు అవసరమయ్యే పని ముట్లను ఏర్పాటు చేశాం. పిల్లలకు ఫ్రీ ట్యూషన్లు కరోనా తర్వాత పిల్లలకు చదువులు బాగా తగ్గిపోయాయి. డల్గా ఉన్న స్టూడెంట్స్ మరీ వెనకబడిపోకుండా ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్స్ ఏర్పాటు చేశాం. ఇందుకు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులనే ఎంచుకుంటాం. ఉపాధికి దారులు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో తెలిసినవారి నుంచి ఇక్కడి మహిళలకు ఆర్డర్ మీద వర్క్స్ ఇప్పిస్తుంటాను. ఈ ఆర్డర్లు తెచ్చుకోవడానికి ఈ బృందంలోని వారి నుంచి కొందరిని నియమిస్తాను. అమెరికాలో, దూర్రపాంతాల్లో తెలిసినవారుంటే వారికి మావాళ్లు చేసిన వర్క్స్ ఫోన్ల ద్వారా చూపించి, ఆర్డర్స్ తెప్పిస్తుంటాం. వారికి కొరియర్ ద్వారా పంపిస్తుంటాం. దీని ద్వారా ఈ మహిళలకు కొంత ఆదాయం లభిస్తుంది. కోర్సు తర్వాత వారి ఇంటి వద్దనే నేర్చుకున్న పనిని కొనసాగించేలా కూడా చూస్తున్నాం’’ అని కృష్ణవేణి వివరించారు. – నిర్మలారెడ్డి -
కృష్ణవేణికి ఘంటసాల శతాబ్ది పురస్కారం
ప్రముఖ సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి ‘ఆకృతి– ఘంటసాల శతాబ్ది పురస్కారం’ అందుకున్నారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆకృతి–ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని కృష్ణవేణికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఎవరినైనా సక్సెస్ తర్వాతే గుర్తు పెట్టుకుంటారు. కానీ, ఎంతోమందికి సక్సెస్ ఇచ్చిన కృష్ణవేణిగారికి తగినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం’’ అన్నారు. ‘‘నేటి తరం సినిమా వాళ్లకు కృష్ణవేణిగారి జీవితం పుస్తకంలా ఉపయోగపడుతుంది’’ అన్నారు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్. ‘‘కృష్ణవేణిగారు ఒక లెజెండ్’’ అన్నారు నటి రోజా రమణి. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలు అజిత, ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీష్ చంద్ర, నటుడు మోహనకృష్ణ, ‘ఆకృతి’ సుధాకర్ పాల్గొన్నారు. -
మంగళగిరి రూరల్ పోలీసులకు మరోసారి కృష్ణవేణి ఫిర్యాదు
-
నా భర్తను కరెంట్ వైర్లతో కాల్చి పీక పిసికి చంపారు
1979లో 'నగ్న సత్యం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నటి కృష్ణవేణి. 43 సంవత్సరాల కెరీర్లో హీరోయిన్గా, సహాయక నటిగా, కమెడియన్గా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిందావిడ. సుమారు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించింది. 'నేను 'వారాలబ్బాయి' డైరెక్టర్ రాజచంద్రను పెళ్లి చేసుకున్నాను. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వాళ్లు ఏమీ లేనివారు. ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా కష్టాలు పడ్డారు. తీరా ఒక్కో మెట్టు ఎదిగి ఒక సినిమాకు రెండు, మూడు లక్షల రూపాయలు తీసుకునే సమయానికి చచ్చిపోయాడు. మేం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక కలిసి నాలుగేళ్లున్నాం. నిజానికి నాకు నలుపంటేనే నచ్చదు. టీ నల్లగా ఉంటేనే తాగను, అలాంటిదాన్ని అనుకోని పరిస్థితుల వల్ల నల్లగా ఉండే అతడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీలాంటోళ్లు నాకు హెల్ప్గా ఉంటే నేనెక్కడో ఉండేవాడిని అని తరచూ అంటుండేవాడు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు వందరోజులు ఆడాయి. ఇది చూసి ఓర్వలేక ఇండస్ట్రీవాళ్లే ఆయనను హత్య చేశారు. కరెంట్ వైర్లతో కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. పోలీసువాళ్లు కూడా ఎవరు చేయించారో మాకు తెలుసు, కానీ మేం ఏం చేయలేం అని చేతులెత్తేశారు. మా కుటుంబాన్ని లేపేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులు రెండేళ్లపాటు ఇంటిచుట్టూ కాపలాగా ఉన్నారు. దీనికంతటికీ కారణమైన హీరోయిన్ చనిపోయింది' అని చెప్పుకొచ్చింది కృష్ణవేణి. కానీ ఆ హీరోయిన్ ఎవరన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. -
ఊరు ఇంటర్ పాసైంది
ఇరులపట్టి గ్రామం. ఎక్కడుంది? డెంకణికొట్టయ్ తాలూకా. ఎక్కడుంది? బొమ్మతతనూర్ పంచాయితీ. ఎక్కడుంది? కృష్ణగిరి జిల్లా. ఓ.. తమిళనాడు! తమిళనాడులోని ఆ ఇరులపట్టి గ్రామం ఇప్పుడు వార్తలలోకి రావడానికి మంచి కారణమే ఉంది. ఆ ఊరి ఇంటర్ విద్యార్థిని కృష్ణవేణి గురువారం వచ్చిన ఫలితాలలో 600 మార్కులకు 295 మార్కులతో పాసై ఊరికి గుర్తింపును తెచ్చింది. ఇరులపట్టి గ్రామంలో ఇంటర్ పాస్ అయిన తొలి విద్యార్థి కృష్ణవేణి. పక్క జిల్లా అయిన ధర్మపురిలో.. పాలాకోడ్ సమీపంలోని కొత్తూరు ప్రభుత్వ కళాశాలలో ఆమె చదివింది. టెన్త్ కూడా అక్కడే. తొంభై తొమ్మిది, తొంభై ఎనిమిది శాతాలతో పిల్లలు పాస్ అవుతున్న కాలం ఇది. అయితే కృష్ణవేణిని వారితో సమానంగా అభినందించడానికి ఆమె సాధించిన మార్కులను కాకుండా, ఆమె ప్రయత్నాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్లో కామర్సు, అకౌంట్స్ సబ్జెక్టులతో పాసైంది కృష్ణవేణి. ఇరులపట్టి చుట్టుపక్కల చాలావరకు తెలుగు, కన్నడ మీడియం పాఠాశాలలే. అందుకని తమిళ మీడియం కోసం పొరుగు జిల్లాల్లోని హాస్టల్లో ఉండి.. అక్కడే ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంది. బ్యాంక్ పరీక్షలు రాస్తూ, సివిల్ సర్వీసుకు ప్రిపేర్ అవుతూ ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమె లక్ష్యం. తండ్రి రైతు. తల్లి గృహిణి. ఇద్దరు తోబుట్టువులు. వాళ్ల చదువు టెన్త్ తర్వాత ఆగిపోయింది. కృష్ణవేణి ఆ ఊరి చరిత్రలోనే ఇంటర్ పాస్ అయిన తొలి విద్యార్థి అనే వార్త రాగానే చుట్టుపక్కల డిగ్రీ కళాశాలల నుంచి ఆమెకు సీటు ఇస్తామన్న ఆఫర్లు మొదలయ్యాయి! ధర్మపురిలోని ‘ఆర్ట్స్ అండ్ సైన్స్’ ప్రైవేటు కాలేజీ ఇప్పటికే ఆమె కోసం అడ్మిషన్ను రిజర్వు చేసి ఉంచింది! ఇంటర్ ఫలితాలు వచ్చిన రోజు డెంకణికొట్టయ్ డిఎస్పీ సంగీత, కేళమంగళం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇరులపట్టి గ్రామంలోనే ఉన్నారు. స్థానికులకు రేషన్ బియ్యం, పప్పు, నూనెల పంపిణీ సక్రమంగా జరుగుతున్నదో లేదో పర్యవేక్షిస్తున్నారు. ఆ పనిలో ఉన్నప్పుడే కృష్ణవేణి గురించి డిఎస్పీ సంగీతకు తెలిసింది. వెంటనే ఆమెను పిలిపించి అభినందించారు. ‘‘నేనూ నీ లాగే పల్లె ప్రాంతం నుంచి వచ్చాను. మా ఇంట్లో నేనే తొలి గ్రాడ్యుయేట్ని’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు సంగీత. ఆర్థికంగా కృష్ణవేణికి సహాయం చేకూరేలా చేస్తానని కూడా చెప్పారు. ఇరులపట్టి గిరిజన గ్రామం. ఇకముందు కృష్ణవేణి ఏం సాధించినా అది ఊరు పంచుకునే విషయమే అవుతుంది. కృష్ణవేణి ర్యాంకు సాధించలేదు. నైంన్టీ నైన్ పర్సెంటేమీ రాలేదు. ఇంటర్ పూర్తి చేసింది.. అంతే! ఊరి పేరు మార్మోగిపోతోంది. ఊరి చరిత్రలోనే.. తొలి.. ఇంటర్ ఉత్తీర్ణురాలు కృష్ణవేణి!! -
తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం
ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుది శ్వాస విడిచారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా చిత్ర నిర్మాతే. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై ‘లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్ బాబు’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు కృష్ణమూర్తి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్ బాబు చనిపోయారు. చిన్న కుమారుడు భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు. మొదటి నుంచి వీరిది వామపక్ష భావాలున్న కుటుంబం. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న నా మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నందున నన్ను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దు’’ అని కోరారు. కాగా కృష్ణవేణి మరణ వార్త లె లుసుకున్న చిరంజీవి ఫో¯Œ లో తమ్మారెడ్డి భరద్వాజను పరామర్శించారు. -
తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కృష్ణవేణి(94) సోమవారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నేడు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. తన తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. తన తల్లి మరణవార్త తెలిసి మిత్రులు, శేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించేందుకు ఎవరు ఇంటికి రావద్దని కోరారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా నిర్మాత అనే సంగతి తెలిసిందే. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్ బాబు వంటి హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. కృష్ణమూర్తి, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్బాబు మరణించాడు. చిన్న కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు. తొలి నుంచి వీరిది వామపక్ష కుటుంబం. కాగా, కృష్ణమూర్తి 2013లో మృతిచెందారు. తమ్మారెడ్డి భరద్వాజను ఫోన్లో పరామర్శించిన చిరంజీవి.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనను ఫోన్లో పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశాన్ని తెలియజేశారు. సినిమా ఒక మజిలీ, సమ సమాజం నా అంతిమ లక్ష్యం అనే కృష్ణమూర్తి.. తెలుగు సినిమా పరిశ్రమకు ఇతోదిక సేవలదించారని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. -
మగవాళ్ల రాజ్యంలో ‘స్త్రీ మహాలక్ష్మి’
స్త్రీకి ఉండనిదే ఆర్థిక స్వాతంత్య్రం. అదుంటే అన్ని స్వాతంత్య్రాలూ వచ్చేస్తాయి. ఆర్థిక స్వాతంత్య్రం అంటే.. చేతి నిండా డబ్బు ఉండటం కాదు. ఆ డబ్బును ఇష్టానికి ఖర్చు చేసే స్వేచ్ఛ ఉండటం. కృష్ణవేణి, ఆమె కూతురు అనురాధ.. స్వప్నాదత్, ప్రియాంకాదత్, లక్ష్మీ మంచు .. వీళ్లకు.. సినిమాలు నిర్మించడం ఇష్టం. నిర్మిస్తే డబ్బు రావచ్చు.. పోవచ్చు. పోతుందేమోనని ఇష్టాన్ని చంపుకోలేదు వీళ్లు! మంచి మంచి సినిమాలు తీశారు. తీస్తున్నారు. రేపు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా.. మగవాళ్ల రాజ్యంలో ‘స్త్రీ మహాలక్ష్మి’గా వెలిగిన.. వెలుగుతున్న.. సినీ మహిళా నిర్మాతలతో సాక్షి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు ఇవి. ►చిత్రసీమకు సంబంధించిన తొలి తరం తారల్లో గాయనిగా, నటిగా, నిర్మాతగా మీకు మంచి పేరు ఉంది. నటిగా కెరీర్ ఎలా మొదలైందో చెబుతారా? కృష్ణవేణి: ‘సతీ అనసూయ’ (1936)లో బాలనటిగా నటించాను. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. అంతకుముందు డ్రామాల్లో నటించాను. అప్పట్లో మా పాత్రలకు మేమే పాడుకోవాలి. అలా గాయనిగా కూడా మంచి పేరు వచ్చింది. మీర్జాపురం రాజా మేకా వెంకటరామయ్య అప్పారావుగారు నిర్మించిన ‘భోజ కాళిదాసు’కి నన్ను సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. అందులో కన్నాంబ ఫస్ట్ హీరోయిన్. ఆ తర్వాత ఆయన బేనర్లోనే ‘జీవన జ్యోతి’ సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేశాను. నటిగా నన్ను బాగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది. 15 సినిమాలకు పైగా హీరోయిన్గా నటించాను. ►మరి నిర్మాణరంగంవైపు ఎలా వచ్చారు? కృష్ణవేణి: ‘జీవనజ్యోతి’ తర్వాత మీర్జాపురం రాజాగారితో నా పెళ్లయింది. మాది ప్రేమ వివాహం. అప్పుడు నాకు 17 ఏళ్లు. జయా పిక్చర్స్పై నా భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేదాన్ని. అలా నిర్మాణరంగంవైపు వచ్చాను. ఆ సంస్థ పేరుని ఆ తర్వాత ‘శోభనాచల పిక్చర్స్’గా మార్చాం. ‘గొల్లభామ’ (1947), ‘మన దేశం’ (1949), ‘లక్ష్మమ్మ’ (1950), ‘దాంపత్యం’ (1957) వంటి సినిమాలు నిర్మించాం. కొన్నింటిలో నేను కూడా నటించాను. ‘మన దేశం’తో ఎన్టీఆర్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాం. ఇది నిర్మాతగా నాకు కంప్లీట్ సినిమా. ఎన్టీఆర్తో ‘పల్లెటూరి పిల్ల’ కూడా తీశాం. నా భర్తతో కలిసి ప్రొడక్షన్ చూసుకునేదాన్ని. స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్లో కూడా కూర్చునేదాన్ని. షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ అంతా చేసేదాన్ని. ►భానుమతిగారు, విజయ నిర్మలగారు, మీరు.. ఇలా కొందరు నిర్మాతగా చేశారు. తర్వాత మీ అమ్మాయి (అనురాధా దేవి). ఇప్పుడు కూడా వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మహిళా నిర్మాతలే ఉన్నారు... కృష్ణవేణి: భానుమతి డైనమిక్. ఆవిడని చూసి అందరూ గడగడలాడేవాళ్లు. అంత ధైర్యం ఉంటే ఇక్కడ నిర్మాతగా రాణించవచ్చు. లేకపోతే కష్టం. ఇక విజయనిర్మల కూడా చాలా ధైర్యవంతురాలు. చాలా స్వీట్ పర్సన్. భానుమతి, విజయనిర్మలలది ఒక మొండి వైఖరి. అలా ఉంటే నిర్మాతలుగా చేయొచ్చు. నిర్మాత అంటే మగవాళ్లే అనే ఫీలింగ్ ఏదో పడిపోవడం వల్ల కొందరు రావడంలేదేమో. అనురాధ: అమ్మాయి అంటే నటిగా ఓకే కానీ నిర్మాతలుగా రానివ్వరు. బ్యాకింగ్ ఉంటే ఓకే. కోట్లు ఉన్నాయి.. నిర్మాత అయిపోవచ్చు కదా అనుకుంటే కుదరదు. ర్యాపో ఉండాలి. ఎంతోమంది నా దగ్గరకు సినిమాలు తీస్తామని వస్తారు. కానీ ఎంకరేజ్ చేయను. ఎందుకంటే బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టం. ►మీరన్నట్లు నిర్మాతలంటే పురుషులే అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. అలాంటి పరిస్థితిలో మీకు నిర్మాణం ఏమైనా అసౌకర్యంగా అనిపించేదా? కృష్ణవేణి: చాలా హ్యాపీగా ఉండేది. కాశీమజిలీ కథలు చదివేదాన్ని. ఇంకా చాలా పుస్తకాలు చదివి, వాటిలో ఉన్న మంచి పాయింట్స్తో సినిమాలు నిర్మించేవాళ్లం. అంతా సాఫీగా సాగేది. కొన్ని సినిమాల్లో డబ్బులు పోయినా అదేం పెద్ద బాధ అనిపించలేదు. అనురాధ: శోభనాచల స్టూడియో మాదే. నాన్నగారు పెద్ద బ్యాకింగ్. ఇక అసౌకర్యంగా ఎందుకు ఉంటుంది? (నవ్వుతూ). చెప్పాలంటే చాలామంది అవకాశాల కోసం అమ్మని కాకాపట్టేవాళ్లు. స్ట్రాంగ్ బ్యాగ్రౌండ్ ఉంటే ఎలాంటి అసౌకర్యం ఉండదు. ►అమ్మ తర్వాత మీరు నిర్మాతగా మారారు. మీరు ఇష్టపడి వచ్చారా? వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనా? అనురాధ: నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నన్ను నిర్మాతగా కంటిన్యూ అవ్వమన్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన నాకంతగా లేదు. అయితే అప్పటికి కన్నడంలో రాజ్కుమార్గారితో ‘భక్త కుంభార’ అనే సినిమాని నాన్నగారు నిర్మిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో కంటిన్యూ చేయలేనని నన్ను, నా భర్త (నంగనూరు శ్రీనివాసరావు) ను ఆ సినిమా ప్రొడక్షన్ చూసుకోమన్నారు. ఆ సినిమాని నాగేశ్వరరావుగారితో తెలుగులో ‘చక్రధారి’గా రీమేక్ చేశాను. ఆ తర్వాత ఆయనతోనే ‘రాముడే రావణుడైతే’ సినిమా తీశాం. ఈ సినిమాకి దాసరిగారు డైరెక్టర్. మా బేనర్లో ఆయనకు ఫస్ట్ సినిమా. ఏయన్నార్గారికి ఇది ఫస్ట్ సినిమా స్కోప్ పిక్చర్. ఆ తర్వాత ఏయన్నార్–దాసరిగార్ల కాంబినేషన్లో ‘శ్రీవారి ముచ్చట్లు’ అనే సినిమా తీశాం. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే తీసిన ‘రాముడు కాదు కృష్ణుడు’ కూడా సూపర్ హిట్ అయింది. అలాగే ఏయన్నార్ హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో తీసిన ‘అనుబంధం’ సూపర్ హిట్ అయింది. మురళీమోహన్, శోభన్బాబులతో కూడా సినిమాలు తీశాం. ►నిర్మాణం మీకెలా అనిపించింది? ఏవైనా చేదు అనుభవాలు? అనురాధ: నేను పెరిగిందే సినిమా ఇండస్ట్రీలో. నాగేశ్వరరావుగారు నన్ను బాగా ఎత్తుకునేవారు. ఎన్టీఆర్గారు బాగా తెలుసు. మా బేనర్లో శోభన్బాబుగారు నటించారు. అందరూ తెలిసినవాళ్లే కావడంతో నిర్మాతగా ఇబ్బందిపడలేదు. పైగా దాసరి నారాయణరావుగారు నన్ను సొంత సిస్టర్లా అనుకునేవారు. ఆయన నాకు ‘రాఖీ బ్రదర్’. ►బ్యాగ్రౌండ్ లేనివాళ్లకయితే ఇబ్బందులు ఎదురవుతాయా? అనురాధ: బ్యాడ్ సైడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ నాకు తెలియదు. ఎందుకంటే నా లైఫ్ అంతా బాగా గడిచింది. అయితే ఇక్కడ పురుషాధిక్యం ఉంటుంది. నిర్మాత పురుషుడైతే ఒక రకంగా, ఆడవాళ్లయితే ఒకరకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. బేసిక్గా మేల్ డామినేషన్. అంత ఈజీగా స్త్రీలను నిర్మాతలుగా అంగీకరించే పరిస్థితి లేదు. చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి. కానీ ఎక్కడ లేవని సినిమా పరిశ్రమ విషయాలను బయటకు చెప్పమంటారు? ప్రపంచం మొత్తం జరుగుతున్నదే సినిమా పరిశ్రమలోనూ జరుగుతోంది. ►అయితే ఒక లేడీ నిర్మాత ఉన్నప్పుడు ఫీమేల్ టెక్నీషియన్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వీలు ఉంటుంది కదా? అనురాధ: అది కరెక్ట్. నా బేనర్లో సినిమా చేసిన ఎవరూ ఇబ్బందిపడలేదు. వాళ్లు సురక్షితంగా పని చేసుకునే వాతావరణం కల్పించేవాళ్లం. అయితే హీరోయిన్ సాక్షీ శివానంద్ లాంటి వాళ్లు మమ్మల్నే ఇబ్బందిపెట్టేవాళ్లు. వాళ్లంతట వాళ్లు కాస్ట్యూమ్స్ తెచ్చుకుని, డైరెక్టర్కి కూడా చూపించకుండా నేరుగా లొకేషన్కి వచ్చేయడం వంటివి చేసేవాళ్లు. ►17 సినిమాలు నిర్మించిన క్రెడిట్ మీది. ఎక్కువ సినిమాలు నిర్మించిన లేడీ ప్రొడ్యూసర్గా ‘లిమ్కా బుక్’ రికార్డ్ని సొంతం చేసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు సినిమా నిర్మాణం ఆపేశారు? అనురాధ: ఆలయ దీపం (1984), ఇల్లాలే దేవత (1985) వంటి సినిమాలు తీశాం. ‘ఇల్లాలే దేవత’ సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఓ పదేళ్లు నిర్మాణం మానుకున్నాం. నవీన్, అబ్బాస్, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా ‘ప్రియా ఓ ప్రియా’ (1997) సినిమాతో మళ్లీ నిర్మాణం మొదలుపెట్టాను. ఆ తర్వాత నవీన్, రవితేజతో ‘ప్రేమించే మనసు’, జేడీ చక్రవర్తి, సాక్షీ శివానంద్ జంటగా ‘మా పెళ్లికి రండి’ సినిమాలు నిర్మించాను. అయితే ‘మా పెళ్లికి రండి’ (2001) సినిమా అప్పుడు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ సినిమా థియేటర్లో ఉండగానే మాకు తెలియకుండా ఎవరో అమ్మేశారు. దాంతో కేబుల్లో వచ్చింది. సినిమా బాగున్నా నిర్మాతగా నష్టపోయాను. ఇక ఆ తర్వాత నిర్మాతగా ఫుల్స్టాప్ పెట్టేశాను. ఆ సినిమా అప్పుడు నిర్మాతగా నన్ను అణగదొక్కాలని చాలామంది ప్రయత్నించారు. సినిమా విడుదల చేయకుండా అడ్డుకోవడానికి ట్రై చేశారు. దాసరిగారి సహాయంతో ఎలాగో విడుదల చేశాను. 2005లో మావారు చనిపోయారు. నాకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. మూడో అమ్మాయి మ్యారీడ్ లైఫ్ బాగుంది. అయితే భర్త, ఇద్దరు కుమార్తెలు చనిపోవడంతో ఇక నేను ప్రొడక్షన్ కొనసాగించలేకపోయాను. సౌత్ అంటే చిన్నచూపు – అనురాధ నాకు ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు వచ్చింది. ఆ అవార్డుకి ఎవరో ఒకరు నా పేరుని రిఫర్ చేయాలి. అవార్డు తీసుకుని వచ్చేశాక ఎవరు రిఫర్ చేసి ఉంటారా? అని అడిగితే.. మన తెలుగు పరిశ్రమ నుంచి నా పేరుని ప్రతిపాదించలేదు. కన్నడ పరిశ్రమ తరఫున నాకు వచ్చిన అవార్డు అది. కన్నడంలో మమ్మల్ని చాలా గౌరవిస్తారు. రాజ్కుమార్గారితో తీసిన ‘భక్త కుంభార’కి బోలెడన్ని అవార్డులు వచ్చాయి. కన్నడ స్టేట్ అవార్డు కూడా వచ్చింది. అయితే నేషనల్ అవార్డు విషయంలో చిన్న చేదు అనుభవం ఎదురైంది. మన దక్షిణాది పరిశ్రమవారంటే ఉత్తరాదివారికి చిన్న చూపు. ‘భక్త కుంభార’ సినిమాని నేషనల్ అవార్డుకి పంపించాం. అయితే అవార్డు దక్కలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. అసలు ఆ సినిమా బాక్సుని అవార్డు కమిటీవాళ్లు ఓపెన్ కూడా చేయలేదట. సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటే అక్కడివారికి అంత చిన్న చూపు. -
పుట్టుక వెక్కిరించినప్పుడు
డెబొరా జియాంగ్ స్టయన్ రాసిన, ‘ప్రిసన్ బేబీ: ఎ మెమోయిర్’లో, పన్నెండేళ్ళ డెబొరా– అమెరికా, సియాటెల్లో ఉండే యూదులైన ఇంగ్లిష్ ప్రొఫెసర్ల జంట దత్తత తీసుకున్న పిల్ల. నవలికకి కథకురాలు డెబొరాయే. ఆమె దత్తు తల్లిదండ్రులు తెల్లవారు. ఆమె చామనఛాయతో, బహుళజాతి రూపురేఖలున్నది. డెబొరా తన గతం గురించి ప్రశ్నించినప్పుడల్లా, తల్లిదండ్రులు సమాధానం ఇవ్వకుండా దాటవేసేవారు. ఆమె ఆరవ తరగతి చదువుతున్నప్పుడు, ఒకరోజు వారి పడగ్గదిలోకి వెళ్తుంది. ‘డెబొరా జనన ధృవీకరణ పత్రాన్ని మార్చేయండి. తను వర్జీనియా జైల్లో ఉన్న, హెరాయిన్ వ్యసనానికి లోనైన తల్లికి పుట్టిందని తెలియకూడదు. సియాటెల్లోనే పుట్టిందని రాయండి. ఆమె మా హృదయాల్లో పుట్టిన పిల్లే కదా! తనకు నిజం తెలిస్తే, తల్లి గురించీ, తను రెండు మూడేళ్ళున్న పెంపుడిళ్ళ గురించీ ప్రశ్నిస్తుంది’ అంటూ, దత్తు తల్లి తన లాయరుకు రాసిన ఉత్తరం కంటబడుతుంది. ‘నా తల్లిదండ్రుల పడగ్గదిలో టేబుల్ అరలో ఉన్న ఆ కాగితాన్ని చదివి, వెనక్కి తోసేశాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు, నా శరీరం అతిబరువుగా అనిపించింది’ అంటారు రచయిత్రి. ఆమె తనను తాను ద్వేషించుకుంటుంది. ‘జైల్లో ఉన్నవారిని ప్రేమించేదెవరు?’ అని ప్రశ్నించుకుంటుంది. ప్రతీ అవసరాన్నీ ప్రేమతో తీర్చే పెంపుడు తల్లి గానీ, తనకు రెండు సంవత్సరాల ముందట, తల్లిదండ్రులు దత్తత తీసుకున్న అన్న తెల్లరంగు జోనాథన్ తనను ముద్దుగా చూసుకుంటాడని గానీ గుర్తురాదు. పైగా, ఊచల వెనకున్న జీవసంబం«ధి అయిన తల్లిని కలుసుకోవాలన్న కోరిక హెచ్చవుతుంది. ‘1960ల వరకూ, వెయ్యి తెల్ల కుటుంబాలు కూడా నల్ల పిల్లలను దత్తు తీసుకోలేదని దత్తత పరిశోధన సర్వేక్షణలు సూచిస్తాయి. నా మార్గదర్శక తల్లిదండ్రులు నన్ను దత్తత తీసుకుని, ఆ పరిమితులను దాటారు. నా పంచదార పాకపు రంగు, బొత్తాం ముక్కు, బాదం ఆకారపు కళ్ళ గురించి అడిగినప్పుడల్లా– తను నన్ను ప్రేమిస్తోందనీ, నేను కుటుంబంలో భాగమే అనే చెప్పేది అమ్మ. నేనిప్పుడు, దేనికీ భాగం అనుకోవడం లేదని చెప్పాలంటే భయం వేసేది’ అంటారు. ఆ సంఘటన తరువాత, రక్తంలో హెరాయిన్నిండి పుట్టి, తొలి ఏడాది ఖైదులో ఆ వాతావరణంలోనే గడిపిన డెబొరా– తన సొంత తల్లిని అనుకరిస్తూ, సులభంగానే మాదక ద్రవ్యాలకు అలవాటుపడతారు. 19 ఏళ్ళొచ్చేటప్పటికి వాటిని సరఫరా కూడా చేసేవారు. దత్తు తల్లిదండ్రులతో సాన్నిహిత్యం కోల్పోతారు. ‘మాదక ద్రవ్యాలు సామాజిక వినోదం, మద్యం కేవలం పానీయం కావు నాకు. అవి నాకు మత్తు కలిగించే మాసికలా, మందులా అయి స్వస్థపరిచి– స్వేచ్ఛ కలిగించాయి. ఎడ్రినలిన్ వేగం మిగతా ప్రతీదాన్నీ ముంచేసేది.’ డెబొరా తన 30లకు చేరినప్పుడు, వ్యసనం వదిలిపెట్టడానికి అవసరమైన సహాయాన్ని పొందారు. పెంపుడు కుటుంబంతో తిరిగి సంబంధం పెంపొందించుకుని, తన జీవితపు ఉనికితో రాజీపడ్డారు. తను పుట్టిన జైలుకెళ్ళి– అక్కడ సహాయం అందించడం, ఉపన్యాసాలివ్వడం మొదలుపెట్టారు. అప్పటికి ఆమె సొంత తల్లి మరణించి ఉంటారు. పుస్తకపు చివర్న, తన కూతుళ్ళ గురించి ప్రస్తావిస్తారు రచయిత్రి. అయితే, పెళ్ళి గురించి గానీ, పిల్లలెప్పుడు పుట్టారో అన్న వివరాలు గానీ ఇవ్వరు. 2012లో– జైళ్ళలో ఉండే స్త్రీలకు అక్షరాస్యతను అందించే, ‘అన్ప్రిజన్ ప్రాజెక్ట్’ ప్రారంభించారు డెబొరా. ‘వారు జైలు నుండి బయట పడి, తిరిగి వెనక్కి వచ్చే అగత్యం లేకుండా, విజయవంతమైన జీవితం గడిపేందుకు– ఏదో ఒక ప్రావీణ్యత నేర్పే పనిది’. ఇప్పుడు పేరు పొందిన వక్తయిన యీ రచయిత్రి, తన ఉపన్యాసాలను అమెరికా జైళ్ళ సంస్కరణ, పట్టుదల, రెండవ అవకాశాలు, ఆశకుండే శక్తిపైన కేంద్రీకరిస్తారు. 176 పేజీలుండి, నిజాయితీగా రాసినదనిపించే, స్ఫూర్తినిచ్చే ఈ ఆశ్చర్యకరమైన సంస్మరణను బీకన్ ప్రెస్ 2014లో ప్రచురించింది. కృష్ణ వేణి -
ఆమె భార్య అయ్యాక
జెన్నీ ఓఫ్ఫిల్ రాసిన డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పెక్యులేషన్–‘ఆమె’ ‘భార్య’ అవకముందు మొదలవుతుంది. కథకురాలూ ప్రధానపాత్రా అయిన ‘ఆమె’ అమెరికాలోని బ్రూక్లిన్లో తను చేపట్టిన చిన్న ఉద్యోగాలు, గుమ్మంలో నిలుచున్న బాయ్ఫ్రెండ్, అతడి బీరు సీసాలనుండి తను పీకేసిన లేబెళ్ళను గుర్తు చేసుకుంటుంది. ‘పెళ్ళి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కళా రాక్షసిని అవుదామనుకున్నాను. వారికి కళ తప్ప, లౌకిక విషయాలు పట్టవు కనుక, స్త్రీలెప్పుడూ కళా రాక్షసులు కాలేరు. వ్లాదిమిర్ నబకోవ్ తన గొడుగునే మూసేవాడు కాదు. అతని స్టాంపులను అతని భార్య వీరా నాకి అతికించేది’ అనుకుంటుంది. ‘ఆమె’ కోసం రేడియో పాటలను పెట్టే ‘నీవు’ను కలుసుకుంటుంది. వారికి పెళ్ళవుతుంది. ‘మేము అరువు గదిలోకి చటాల్న దూరి, అరువు మంచంమీద పడ్డాం. మమ్మల్ని ప్రేమించేవారందరూ బయటున్నారు. ఒక ఇల్లు ఉండటం అంటే– కొంతమందినే ఇంట్లోకి రానిచ్చి, మిగతావారందరినీ బయటే పెట్టడం. ఇంటికి ఒక చుట్టుకొలత ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని ఇరుగుపొరుగులూ, యహోవా సాక్షులూ అతిక్రమించేవారు’ అంటుంది ‘భార్య’. వారిద్దరూ, ఒకరికి మరొకరు ఉత్తరాలు పంపుకునేవారు. తిరుగు చిరునామా ఎప్పుడూ ఒకటే అయుండేది, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెక్యులేషన్’. ‘అప్పటికి వారు చిన్నవారు, ధైర్యవంతులు, తమ భవిష్యత్తు గురించిన కలల మైకంలో ఉండేవారు’. కొద్దికాలంలోనే, తాము త్వరపడి సంబంధం ఏర్పరచుకున్నామేమో అన్న అనుమానం ఇద్దరికీ కలుగుతుంది. అయితే, వొంటరిగా ఉండటం ఇష్టంలేక, వారా సందేహాన్ని కొట్టి పారేస్తారు. కూతురు పుట్టినప్పుడు ‘భార్య’ సంతోషపడుతుంది. అయితే, పిల్ల అరుపులూ, కేకలూ పెట్టే రకం అయినందువల్ల, తనను తీసుకుని బయటకు వెళ్ళడం కష్టమవుతుంది. పాప ప్రకాశవంతమైన ఫ్లోరోసెంట్ లైట్లు ఇష్టపడుతుందని తెలిసిన తరువాత, పక్కనున్న సూపర్ మార్కెట్కు తీసుకెళ్ళి, అక్కడే వీలయినంత సమయం గడుపుతుంది. ‘నీవు నన్ను ఆలోచించుకోనివ్వడం లేదు. ఒక్క నిముషంపాటు ఆలోచించుకోనియ్యేం’ అంటూ కూతుర్ని బతిమిలాడుతుంది. ‘కొందరు స్త్రీలు ఇంక తమకు పట్టని ఖరీదైన కోటును పక్కకి తోసేసినంత సులభంగా ఉద్యోగాన్ని వదిలేస్తారు’ అంటుంది– ప్రసవానికి ముందు సృజనాత్మక రచనల ప్రొఫెసర్ అయిన భార్య. ఈ డైరీలాంటి రాతలు హెచ్చవుతూ, సంసార జీవితం కలిగించే స్థలభీతిని ఎక్కువ చేస్తాయి. పెళ్ళి, తల్లిదనం గురించిన భయాందోళనలను, తత్తరబాటును– సునిశితంగా వర్ణిస్తారు ఓప్ఫిల్. నీవుకు మరెవరితోనో సంబంధం ఉందని భార్యకు తెలుస్తుంది. భార్య, ఆ వేరే అమ్మాయిని నిలదీసినప్పుడు, తను ముందెలా ఉండేదో, అలాగే ఉన్న అమ్మాయిని భర్త ఎంచుకున్నాడని గ్రహిస్తుంది. ‘ఎవరికీ, ఏదీ చెప్పొద్దు. ఆమెకు ప్రాముఖ్యతనివ్వకు’ అని బంధువు సలహా ఇస్తుంది. ఈ స్థితికి తమని తెచ్చిన అడుగులని వెనక్కి లెక్కబెట్టుకుంటూ– ఏది పోయిందో, మిగిలినదేమిటో అని విశ్లేషించుకుంటూ, కాఫ్కా, కీట్స్ నుండీ – శిక్షించబడిన రష్యన్ వ్యోమగాముల వ] రకూ, అందరినీ వేడుకొంటుంది భార్య. తమ సంబంధం చక్కబడ్డానికి జంట ఆ ప్రదేశం వదిలిపెడతారు. పోట్లాటలవుతూనే ఉంటాయి. కూతుర్ని స్కూల్లో చేర్పించి, జీవితంలో ఓడిపోయినట్టనిపించినప్పటికీ – భార్య విధిని అంగీకరించడంతో 160 పేజీల పుస్తకం హఠాత్తుగా ముగుస్తుంది. నవలికలో ఉన్న అధ్యాయాలు 46. కొన్ని ఒకే ఆలోచనతో, గమనింపుతో నిండి ఉన్నవి. అతి తక్కువ పాత్రలున్న పుస్తకంలో, ఎవరికీ పేరుండదు. నవలికలా కాక, దానికోసం రాసిపెట్టుకున్న గమనికల్లాగా అనిపించే పుస్తకం, వంకరటింకర అంచులున్న ఆధునిక వివాహాన్ని చూపుతుంది. పెళ్ళి, గుర్తింపు కోసం అన్వేషణ అన్న ఇతివృత్తం కొత్తదేమీ కాకపోయినా, నిశితమైన గమనింపుతో రాసినది. ఈ నవలికను కాఫ్ బుక్స్ 2014లో ప్రచురించింది. ఓప్ఫిల్ రచయిత్రి, ఎడిటర్. కొలొంబియా, క్వీన్స్ విశ్వవిద్యాలయాల్లో ‘మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ బోధిస్తారు. -కృష్ణ వేణి -
నమ్మాలనుకునే గతం
‘మనకి గుర్తున్నదే, మనం చూసినదై ఉండనవసరం లేదు.’ ఇలా మొదులయ్యే బ్రిటిష్ రచయిత జూలియస్ బార్న్స్ రాసిన ‘ద సెన్స్ ఆఫ్ యాన్ ఎండింగ్’ నవలకు ప్రధాన పాత్రా, కథకుడూ అయిన టోనీ, అరవైల్లో ఉన్న వ్యక్తి. ‘జీవితం నన్నెక్కువ అల్లరి పెట్టకూడదనుకున్నాను. జీవితపు చివరి దశలో కొంతయినా విశ్రాంతి అవసరం. దానికి నేను అర్హుడిని’ అనుకునే సగటు మనిషి. అలాంటి వ్యక్తిని, 40 ఏళ్ళ కిందకి లాక్కెళ్లే పరిస్థితులు ఎదురవుతాయి. టోనీ హైస్కూల్లో చదువుతున్నప్పుడు, యేడ్రియన్ అన్న తెలివైన అబ్బాయి అదే స్కూల్లో చేరతాడు. ఇద్దరూ స్నేహితులవుతారు. యూనివర్సిటీలో టోనీకి, వెరోనికా గర్ల్ఫ్రెండ్ అవుతుంది. ఒక వారాంతం, టోనీ ఆమె ఇంట్లో గడపడానికి వెళ్తాడు. వెరోనికా తల్లయిన సారా– కూతురి గురించి చెడుగా చెప్పి, టోనీతో సరసాలాడుతుంది. వెనక్కి వచ్చిన తరువాత, వెరోనికా– టోనీ మధ్య అన్యోన్యత పోతుంది. యూనివర్సిటీ చివరి సంవత్సరంలో, టోనీకి– తను వెరోనికాతో కలిసున్నానని రాసిన యేడ్రియన్ ఉత్తరం అందుతుంది. ‘ప్రియమైన యేడ్రియన్, (వెరోనికా, దీన్ని నువ్వూ చదువుతూనే ఉండి ఉంటావని తెలుసు.) మీరు ఒకరికొకరు సరిగ్గా సరిపోతారు. నేను మిమ్మల్నిద్దరినీ పరిచయం చేసిన రోజుని మీరు తిట్టుకుంటారని అనుకుంటాను. కాలం తీర్చుకునే ప్రతీకారాన్ని నమ్ముతాను కనుక మీకిద్దరికీ ఒక బిడ్డ తప్పక పుట్టాలి. ఆ బిడ్డ, తల్లిదండ్రుల పాపాలకు వెల చెల్లించాలి. వెరోనికా తల్లే నన్ను కూతురి గురించి హెచ్చరించింది. నేనే నీ స్థానంలో ఉండివుంటే, నిర్ణయం తీసుకునేముందు ఒకసారి సారానూ సంప్రదించేవాడిని’ అని విషం కక్కుతూ జవాబు రాసిన టోనీ, దాని గురించి ఇక మరచిపోతాడు. ఆ 40 ఏళ్ళ పాత ఉత్తరం, అందరి జీవితాలనూ మార్చేస్తుంది. కొన్ని నెలల తరువాత యేడ్రియన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న కబురు అందుతుంది టోనీకి. ప్రస్తుత కాలపు పుస్తకపు రెండవ భాగంలో, సారా– టోనీకి అయిదు వందల డాలర్ల ‘బ్లడ్ మనీ’తో పాటు రెండు పత్రాలను వదిలిపెట్టిందని లాయర్ ఉత్తరం వస్తుంది. యేడ్రియన్ డైరీ వెరోనికా వద్దే ఉందని తెలుస్తుంది. లాయర్, టోనీకి అతని గతపు ఉత్తరం అందించాక, ‘అది రాసినది నేనేనా!’ అనుకుని, నమ్మడానికి నిరాకరిస్తాడు. వెరోనికా తన వద్దున్న యేడ్రియన్ డైరీ ఇవ్వనన్నప్పుడు, టోనీ ఆమెతో ‘మర్యాదగా, స్నేహంగా’ ప్రవర్తిస్తున్నట్టు నటిస్తాడు. వెరోనికా, టోనీని మానసిక వికలాంగులుండే చోటుకి తీసుకెళ్తుంది. వాళ్ళలో ఒక వ్యక్తికి యేడ్రియన్ పోలికలుండటం గమనించిన టోనీ, ‘నీకూ, యేడ్రియన్కూ కొడుకున్నాడని తెలియలేదు’ అన్నప్పుడు, తిరుగు మెయిల్లో, ‘నీకె ప్పుడూ, ఏదీ అర్థం కాదేం?’ అన్న ప్రశ్న సమాధానంగా వస్తుంది.‘అప్పుడు జరిగినదాని గురించిన నా పక్షపు కథ ఇది. ఆ సంఘటనల నా జ్ఞాపకం అనుకోండి’ అని టోనీ, పాఠకులకు చెప్తాడు. ఆ వ్యక్తి నిజానికి యేడ్రియన్కూ, సారాకూ పుట్టినవాడు. వెరోనికా సవతి తమ్ముడు. యేడ్రియన్, వెరోనికాల సంబంధం తెగిపోవడానికీ, సారాతో అతని సంబంధానికీ, అతని ఆత్మహత్య కారణాలనూ పాఠకుల ఊహకే వదిలేస్తాడు రచయిత. గతంలో– ఏది, ఎలా జరిగిందని టోనీ నమ్మాడో, వాటికి వ్యతిరేకంగా జరిగినవే అన్నీ. కాలం, అవగాహనను మార్చేస్తుందని చెప్తుంది పుస్తకం. కష్టపెట్టే నిజాలను మరచిపోడానికి– వాటిని అణచిపెట్టి, మనసులో అల్లుకున్న కథలనే నమ్ముతాం అని కూడా చెబుతుంది. ‘భద్రంగా బతికే ప్రవృత్తి నాలో ఉండివుంటుంది. దాన్ని పిరికితనం అనేది వెరోనికా. నేనైతే అది ప్రశాంతంగా బతకడం అనుకున్నాను’ అని ఆధారపడలేని కథకుడైన టోనీ గుర్తిస్తాడు. స్ఫుటమైన, సంక్షిప్తమైన బ్రిటిష్ వచనం ఉన్న యీ 150 పేజీల పుస్తకాన్ని ‘జోనథన్ కేప్’ 2011లో ప్రచురించింది. నవల– బుకర్ ప్రైజుతో పాటు అనేకమైన అవార్డులు గెలుచుకుంది. దీని ఆధారంగా 2017లో భారత దర్శకుడు రితేష్ బత్రా దర్శకత్వంలో ఇదే పేరుతో సినిమా వచ్చింది. కృష్ణ వేణి -
బండలు
ఒకరోజు నీరజ్ అగర్వాల్ నుండి ఫోనొచ్చింది– మీ ఎయిర్లైనుని కోర్టుకీడ్చకపోతే చూడండి. ‘విలువైన సామాను కాజేసి, అందరూ కలిపి డబ్బు పంచుకుంటున్నట్టుగా ఉంది,’ అన్న బెదిరింపులతో, కోపంతో భగభగమంటున్నాడు. ప్రైవేట్ ఎయిర్లైన్స్ మొదలవకముందు, ఇండియన్ ఎయిర్లైన్సే రాజై వెలుగుతున్నప్పటి కాలంలో– ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో పనిచేస్తుండేవాళ్ళం. ‘‘ఇందూ, గంట వరకూ గ్యాంగుకి డ్యూటీలేవీ లేవు. మళ్ళీ ఎండ పోతుంది. బండలు ఖాళీగానే ఉన్నాయా?’’ ఇంటర్కామ్లో అడిగింది ప్రీతి. మా గ్యాంగులో వారి డ్యూటీలు– ఎయిర్బస్ టెర్మినల్లోనూ బోయింగ్ టెర్మినల్లోనూ. నన్ను మాత్రం ఈ రెండిటికీ మధ్యనున్న డొమెస్టిక్ కార్గో సెక్షన్లో పడేశారీ మధ్య. ‘‘వచ్చేయండి, ఖాళీగానే ఉన్నాయి. నేనూ నా డ్యూటీ బ్రేక్ ఇప్పుడే తీసేసుకుంటాను.’’ చెప్పాను. మూడవ వస్తోంది. కార్గో బిల్డింగ్కి సరిగ్గా బయట, టార్మాక్ వైపు, అందరికీ ‘అడ్డా’ –అడ్డంగా పడేసున్న ఆ పొడుగాటి స్తంభాలు. మూడడుగుల వెడల్పున్న ఆ భారీ, చదరపు, నలుపురంగు స్తంభాలు కార్గో డివిజన్లో భాగమే అనిపిస్తాయి. అవే మా అందరి బండలు! ఎండలకి కాలవు. వానలకి జడవవు. చలికి వణకవు. వడగళ్ళకి చితకవు. ఏ పది నిముషాలో ఖాళీ ఉన్న ప్రతీ ఒక్కరమూ శీతాకాలంలో వాటిమీద కూర్చోక మానం. అటునుంచిద్దరూ, ఇటునుంచిద్దరూ వచ్చారు. కాంటీన్ ట్రాలీ తోసుకుంటూ ఎటెండర్లు వస్తుంటే– సాండ్విచ్లూ సమోసాలూ పేపర్ ప్లేట్లలో సర్దుకుని, టీ, కాఫీలూ అక్కడే వున్న ప్లాస్టిక్ టేబుల్స్ మీద పెట్టుకున్నాం. కబుర్లూ, టీలూ పూర్తయాయి. ఎవరి డ్యూటీ పాయింట్లకి వాళ్ళు తిరిగి వెళ్ళారు. నేనూ కార్గో బిల్డింగ్ లోపలికి వచ్చాను.నాకోసమే ఎదురు చూస్తున్నాడు ఫెడ్ఎక్స్ ఏజెంట్, ‘‘మాడమ్, నా కన్సైన్మెంట్ సంగతేమయింది?’’ అంటూ. నక్షత్రకుడు! పది రోజుల కిందట సీ–నోట్ అని మేం పిలుచుకునే ఏడేళ్ళనాటి పాత కన్సైన్మెంట్ నోట్ ఒకటి తెచ్చినప్పటినుంచీ విసుగూ విరామం లేకుండా రోజూ ఇక్కడే చక్కర్లు కొడుతున్నాడు. ఆ నోట్లో బుక్ చేసిన వ్యక్తి పేరు సతీష్ అగర్వాల్ అని రాసుంది. ‘‘బాబూ, కార్గోలోనే కాదు, ఎయిర్పోర్టంతటా వెతికించినా మీ సామాను కనబడలేదు. అయినా 40 కోట్ల విలువయిన సామాను అని ఇన్వాయిస్లో ఉంది. అదీ, పన్నెండు టన్నుల మెటల్!’’ అరిగిపోయిన రికార్డులా చెప్పి, ‘‘అయినా ఇన్నేళ్ళూ మీ క్లయింట్ పట్టించుకోనేలేదేం?’’ చివరికి కుతూహలం పట్టలేక అడిగాను.‘‘నేను కొత్తగా చేరాను మామ్, నాకంత తెలియదు. బుక్ చేసిన సతీష్గారు పోయి ఆరేళ్ళు దాటిందట. ఇప్పుడు ఆయన కొడుకు నీరజ్ అగర్వాల్, ‘సామాను వెతికిస్తారా, చస్తారా!’ అంటూ మా పీకలమీద కూర్చున్నారు. మీకూ ఫోన్ చేస్తానన్నారు. ప్లీజ్, మళ్ళీ చూడండి’’ బతిమాలుకున్నాడు. జాలేసింది కానీ కనిపించని వాటి నెక్కడినుంచి తెచ్చేది! ఏ ఈగో దోమో చిన్న పాకెట్టో కూడా కాదు, ఎక్కడో పోయిందనుకోడానికి. ‘‘మళ్ళీ రెండ్రోజుల్లో రండి. ఇంకెక్కడైనా దొరికే వీలుంటుందేమో ప్రయత్నిస్తాను.’’ వాగ్దానం లాంటిది చేశాను.సీ–నోట్ కాపీలు తీయించి, అవేవో కరపత్రాలయినట్టు హెల్పర్లకి పంచి, కన్సైన్మెంట్ వెతకమని అన్ని చోట్లకీ పరిగెత్తించాను.ఈ వ్యవహారం అంతు తేలనప్పటికీ మా బండల మీది సంబంధాల్లో మాత్రం మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పట్లాగే. మిత్రులు శత్రువులవుతున్నారు. ఒకరి మొహం ఇంకొకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ప్రాణస్నేహితులయి పోతున్నారు. కొత్త రొమాన్సులు మొదలవుతున్నాయి. అత్తగారి ఆరళ్ళ గురించిన కబుర్లకి అంతమే లేదు. ‘రాజకీయాలు చర్చించుకోవద్దు మొర్రో!’ అని ఒకళ్ళిద్దరు గీపెట్టినా వినక, వాటి గురించిన వాదనలూ భేదాభిప్రాయాలూ మొహాలు ముడిచెట్టుకోవడం, రుసరుసలూ ఎలాగూ సామాన్యమే. కొత్తగా హైదరాబాదు నుంచి బదిలీ అయి వచ్చిన రాధిక నోట్లోంచి వచ్చీరాని హిందీ తప్ప ఇంకో భాష ఊడిపడదు.‘పోనీ, ఇంగ్లీష్లో ఏడవ్వమ్మా,’ అన్నా వినదు. పూనమ్ మగవాళ్ళందరి అందాన్నీ గ్రేడ్ చేస్తూ ఉంటుంది. మేం విన్నా వినకపోయినా, తనకున్నాయని ఊహించుకునే రోగాలన్నిటినీ రాజ్ ఏకరువు పెడుతుంటాడు. డైటింగ్ చిట్కాలు చెప్తుంది అనుభ. సునీతకి ఎప్పుడూ తన వంటల గోలే!ఈ మధ్యెవరో కొత్తమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఆ వేటలో పడి జయంత్ రానే రావడంలేదు. వినితకి ఎప్పుడూ ‘నేను, నాకు’ అన్న టాపిక్ తప్ప మరేదీ పట్టదు.అన్ని సమస్యలకూ పరిష్కారం అజయ్ దగ్గిర మాత్రం తప్పక ఉంటుంది. వద్దు నాయనా అన్నా, ఉచిత సలహాలు ఇవ్వడం మానడు. ఒకరోజు మామూలుగా ఏ మూలో కూర్చుని ప్రేమ ఒలకబోసుకుంటుండే నీలేష్, నీనా ఎప్పుడూ లేనిది ఇక్కడికి వచ్చారు, మొహాలు చిటపటలాడించుకుంటూ! ఒక బండ చివర్న కూర్చుని లోగొంతుకలతో వాదించుకున్నారు. ఉన్నట్టుండి ఒకపక్క చెమర్చిన కళ్ళని అద్దుకుంటూనే నీనా అతన్ని చెంప మీద కొట్టింది. అతనూ తిరిగి కొట్టాడు. మేం నిశ్చేష్టులమై, చలనం లేకుండా బండలలో కలిసిపోయాం. తను ఇంచుమించు పరిగెత్తుతూ బోయింగ్ టర్మినల్ వైపు నడిచింది. అతనూ అనుసరించాడు. అదృష్టం కొద్దీ మేము తప్ప అక్కడింకెవరూ లేరు. లేకపోతే, అదో కేస్ అయి కూర్చునేది. అదంతా చూసి మేము కంగారుపడ్డాం. బండలు మాత్రం నిర్వికారంగానే గమనించాయి అంతా. ఇంతలో ఎండాకాలం వచ్చింది. బండలు వేడెక్కాయి. వాటిమీద కూర్చోవడం కాదు కదా సమీపించాలన్నా కాల్చేస్తున్న ఎండ వద్దు, వద్దంటూ వారిస్తోంది. మరవి చిన్నబుచ్చుకున్నాయో ఏమో కానీ కారునలుపుకి మారాయి.కొన్నాళ్ళు ఫెడ్ఎక్స్ అబ్బాయీ రాలేదు, నీరజ్ అగర్వాల్ నుంచి ఫోనూ లేదు. ‘హమ్మయ్యా, ప్రస్తుతానికి కొంత ఉపశమనం’ అనుకుంటూ కార్గోలో పనిచేస్తున్న వాళ్ళందరం ఊపిరి పీల్చుకున్నాం. హెల్పర్లు కూడా ఆకాశంవైపు తలెత్తి దండాలు పెట్టుకున్నారు. ఒకరోజు నీరజ్ అగర్వాల్ నుండి ఫోనొచ్చింది– మీ ఎయిర్లైనుని కోర్టుకీడ్చకపోతే చూడండి. ‘విలువైన సామాను కాజేసి, అందరూ కలిపి డబ్బు పంచుకుంటున్నట్టుగా ఉంది,’ అన్న బెదిరింపులతో, కోపంతో భగభగమంటున్నాడు.‘‘సర్, అంత భారీ సామాను సెక్యూరిటీ కంటపడకుండా ఎవరు బయటకి తీసుకెళ్ళగలరో మీరే ఒక్కసారి ఆలోచించండి’’ అనునయంగా చెప్పాను. కొంత వాదన తరువాత, నా శాంతస్వరం వినో ఏమో కానీ అతనే చల్లబడి, ‘‘మా ఫాక్టరీ మేనేజర్ చాలాకాలంగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్ళో లేడు. వెంట తెస్తాను. ఆయనే గుర్తుపడతాడు.’’ అన్నాడు. సరే ఆయనొచ్చాక చూడచ్చులే అని నేనూ మర్చిపోయాను. హఠాత్తుగా ఒకరోజు, రీజినల్ డైరెక్టర్ నన్ను వెంటనే రమ్మంటున్నారన్న కబురుతో, ఎయిర్పోర్ట్ మేనేజర్ ఫోనొచ్చింది. ఎందుకా! అనుకుంటూ, ఉరుకులూ పరుగులతో ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టాను. ‘‘ఈయన నీరజ్ అగర్వాల్!’’ అక్కడ కూర్చుని తీరిగ్గా టీ తాగుతున్న ఒక వ్యక్తిని పరిచయం చేశారాయన. ‘ఓహో, ఇతనేనా! పైనుండి నరుక్కు వస్తున్నాడన్నమాట! అందుకే, ఉలుకూ పలుకూ లేదీ మధ్య’ అనుకున్నాను. ‘‘ఏమమ్మా, ఈయన కన్సైన్మెంట్ పోయిందట. మీరెవరూ సహకరించడం లేదంటున్నారీయన. మీరే కదూ ఈ కేసు చూస్తున్నదీ?’’ తిన్నగా విషయానికి వచ్చారు డైరెక్టర్. పని అయిందో లేదో అని తప్ప ఆయన వివరాలు పట్టించుకోరని, నెపాలు చెప్తున్నానని అనగలిగే అవకాశం ఉందని తెలిసీ ఉండబట్టలేక, వెతికించడానికి ఎంత కష్టపడుతున్నామో క్లుప్తంగా చెప్పాను. ‘‘దాని విలువెంతో చూశారా! ఇంత నిర్లక్ష్యం ఏమిటి?’’ అడిగారాయన. అవును, చూశాను కానీ ‘మెటల్’కి ఆ ధరెందుకో అంతు పడితే కదా! ‘‘అది బుక్ చేసినదెవరో, ఏమిటో కనుక్కోండి. రేపట్లోగా రిపోర్ట్ కావాలి నాకు.’’ ‘‘ఇంక నువ్వు దయచేయి’’ అన్నారని అర్థమై, తిరుగు మొహం పట్టాను. నాకెందుకు తట్టలేదీ సంగతి? బుక్ చేసిన ఆ కొలీగ్నే అడిగుంటే సరిపోయేది కదా! నన్ను నేను తిట్టుకుంటూ నా ఫైల్లో ఉన్న కాపీ తీశాను. ఆర్.కె.జి. అన్న ఇనీషియల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి తప్ప సంతకం గిలికేసినట్టుంది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. అది పట్టుకుని ఎయిర్పోర్ట్ మేనేజర్ వద్దకి వెళ్ళాను. ‘‘ఆ టైములో మీ సెక్షన్లో ఎవరెవరి పోస్టింగ్ అయిందో కనుక్కుంటాను,’’ అన్నారాయన. మర్నాడే, ఆ వ్యక్తి రాధాకృష్ణ గుప్తా అని తెలిసింది. ఇండోర్ నుంచి శ్రీనగర్కి బదిలీ అయే మధ్యన మూడ్రోజులు ఇక్కడ టెంపరరీ డ్యూటీ పడిందట. ఇప్పుడతని పోస్టింగ్ బాంకాక్లో అట. ఫోన్లో మాట్లాడితే, ‘‘అవును. మొదటిరోజే భారీ సీ–నోటేదో తయారుచేశానన్న గుర్తే. కార్గోలో పనిచేసిన అనుభవం లేదప్పటికి. సలహా అడగడానికి చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఏజెంటెవరో తెచ్చిన కాపీలో ‘ఇంత ఇనుమో, ఏదో’ అని రాసుందని లీలగా తప్ప మరేదీ జ్ఞాపకం రావడం లేదు. ఎన్నేళ్ళ కిందటి సంగతో!’’ అని చెప్పాడట.అయినా, బుక్ చేసింది తనే కాబట్టి అతన్ని మర్నాటి ఫ్లైటులోనే రప్పించారు. మొత్తానికి గుప్తా అయితే వచ్చాడు కానీ సామాను ఆకారం కూడా గుర్తు లేదు అన్నాడు. సిటీ, ఇంటర్నేషనల్ కార్గోతో సహా అన్ని చోట్లకీ ఇద్దరు హెల్పర్లని వెంటబెట్టుకుని తిరిగొచ్చాం. ఫలితం లేకపోయింది. రెండ్రోజుల తరువాత, మరేం తోచిందో ఏమో కానీ ఆత్రంగా వచ్చి మా బండల చుట్టూ తిరుగుతూ, ‘‘ఇదే ఆ కన్సైన్మెంట్ అనుకుంటాను’’ అన్నాడు.కనుక్కోడానికి జూనియర్ అగర్వాల్కి ఫోన్ చేస్తే, తన మేనేజర్ ఊరినుంచి తిరిగి వచ్చాడనీ, అతన్నీ తనతో పాటు తెస్తాననీ అన్నాడాయన ఉత్సాహంగానే.మేనేజర్కి 50 ఏళ్ళుంటాయి. వచ్చీ రావడంతోనే బండల్ని చూసి, ‘ఇవే, ఇవే!’ అంటూ సంతోషం పట్టలేక ఇక గెంతులేయడమొక్కటే తక్కువ!అంతటా కబురు పాకింది. ఎయిర్పోర్ట్ మేనేజర్ కూడా వచ్చి అయోమయంగానే ఆయన్ని అడిగారు, ‘‘అయితే, మీ బిల్లు మీద కోట్ల విలువ రాసుందేమిటండీ? అసలే మెటలైనా అంత ధర పలుకుతుందా!’’మేనేజర్ చిద్విలాసంగా నవ్వి, ‘‘ఇది వెండండీ!’’ అన్నాడు.అందరం నోళ్ళు వెళ్ళబెట్టాం. ‘‘అసలేమయిందంటే, వీటిని మా చెన్నై ఫాక్టరీకి పంపించాలనుకున్నాం. ఇంత బరువున్న వెండి కడ్డీలు వంగిపోతాయి కదా అని వాటికి ఇనప తాపడం చేయించాం. అప్పటికే సతీష్గారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన వీటిని బుక్ చేయించినప్పుడు నేను లేనక్కడ. నీరజ్గారేమో యుఎస్లో ఉన్నారు. ఫెడ్ఎక్స్ వాళ్ళే సలహా ఇచ్చారట, ఏదో మెటల్ అని రాసేయమని. సతీష్గారు పోయాక, ఎవరూ వీటి సంగతి పట్టించుకోలేదు. ఫాక్టరీ లెక్కలు చూస్తున్నప్పుడు అవి తేలకపోయి ఫైల్సన్నీ చెక్ చేస్తుంటే ఈ మధ్యే నీరజ్గారి కంటపడింది.’’ ప్రశ్నార్థకంగా పెట్టిన మా మొహాలని చూస్తూ తేలిగ్గా తేల్చేశాడాయన. హమ్మయ్యా, చిక్కు ముడి విడింది! మర్నాటి చెన్నై ఫ్లైట్లో వాటిని లోడ్ చేయడానికి పెద్ద క్రేనులూ పటాటోపం కనిపించాయి. దూరంగా ఉన్న బే మీద నిలుచున్న ఎయిర్బస్ వెనకాతల హెల్పర్లందరూ గుమిగూడి ఉన్నారు. వెళ్ళి చూస్తే, వెనకనున్న కార్గో హోల్డుల్లో కడ్డీలు పట్టలేదు. వాటిని దింపేసి మళ్ళీ ఎత్తి, ముందు హోల్డులో ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటే పొడుగు చాలలేదు. ఇంక వీలవక రెండిటినీ దించేశారు. ఇన్నేళ్ళూ అవిక్కడే ఎందుకు పడున్నాయో అర్థమయింది. అవసలు మా విమానాలు వేటిల్లోనూ పట్టగలిగే కొలతలున్నవి కావు!అవి తిరిగి అగర్వాలుల ఇంటికి రాజసంగా పెద్ద ట్రక్కులో ప్రయాణమయాయి. గుప్తా తప్పు కేవలం సీ–నోట్ సరిగ్గా తయారు చేయకపోవడం మాత్రమే అనుకున్నారు ముందు. కానీ, ఈ సంఘటన తరువాత కడ్డీల పొడుగు సరిగ్గా కొలిపించకుండానే బుక్ చేసి, ఆ తరువాత అవి లోడ్ అయ్యాయో లేదో అని కూడా పట్టించుకోని అతని నిర్లక్ష్యానికి అతని ఇంటర్నేషనల్ పోస్టింగ్ రద్దు చేసి, మూడు నెల్లు సస్పెండ్ చేశారు.ఇప్పుడు కాంక్రీట్ మీద మా అందరి అనుభూతులకీ సాక్షిగా ఉండే చలనరహితమైన మా బండలైతే లేవు కానీ వాటి కింద ఇన్నేళ్ళూ వర్షం, ధూళి, నుండి తప్పించుకున్న తారూ ఇసుకా మేళవించిన టార్మాక్ భాగం మట్టుకు తళతళలాడుతోంది!కానీ మేము మాత్రం మా కబుర్లకి మరో చోటేదే వెతుక్కోవాలి. -
డబ్బు అక్కరలేని చివరి మనిషి
ముంబయిలో, విమానాశ్రయం దగ్గరే ఉన్న ‘వకోలా’ అన్న ప్రాంతంలో ఉన్న ‘విశ్రామ్ టవర్స్ సొసైటీ’లో రెండు బిల్డింగులుంటాయి. అవి శిథిలమవుతున్నప్పటికీ ‘పక్కా’వే. రోజుకి రెండుసార్లు నీళ్ళొస్తాయి. వాటిల్లో ఉండేది, వివిధ వర్గాలకు చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబాలు. చుట్టుపక్కలుండేవి గుడిసెలు. అరవింద్ అడిగా రాసిన, ‘లాస్ట్ మాన్ ఇన్ టవర్’లో ‘ఇతరుల వద్దనున్నవాటి గురించీ, నీ వద్ద లేకపోయిన వాటి గురించీ కలలు కను. అదే నిన్ను ధనవంతుడిని చేస్తుంది’ అని నమ్మే– ధర్మేష్ షా, ‘వంటినిండా బంగారం, ఉబ్బసం’ ఉన్న వ్యక్తి. ఆ బిల్డింగులను పడగొట్టి, ‘షాంఘై’ అన్న ఆకాశహార్మాన్ని కడదామనుకుంటాడు. ప్రతీ అపార్టుమెంటు యజమానికీ 1.52 కోట్ల రూపాయలు ఇస్తాననీ, సెప్టెంబర్ చివరికల్లా ఇళ్ళు ఖాళీ చేయాలనీ, మే నెలలోనే ప్రకటిస్తాడు. ఏ వొక్కరు ఒప్పుకోకపోయినా, తన ప్రతిపాదన వెనక్కి తీసుకుంటానని, తన సహాయకుడైన షణ్ముగం ద్వారా వారికి చెప్పిస్తాడు. అంత సొమ్ముకి రెండు అపార్టుమెంట్లు కొనుక్కోవచ్చుననుకున్న బిల్డింగ్ నివాసులలో కొందరు, వెంటనే ఒప్పేసుకుంటారు. అయితే ‘పింటో’లు, శ్రీమతి రేగో, శ్రీ కుడ్వా లాంటివారు తమతమ కారణాలవల్ల నిరాకరిస్తారు. అందరికన్నా ఎక్కువ బలంగా నిలుచుని, ఆ డబ్బుని తోసిపుచ్చిన వ్యక్తి, ‘మాస్టర్జీ’ అని అందరూ పిలిచే, ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన యోగేశ్ మూర్తి. చనిపోయిన తన భార్యా, కూతురి జ్ఞాపకాలతో బతుకుతున్నవాడు. ‘అతను ముంబయిలో 44 ఏళ్ళు గడిపాడు. నాస్తికుడయినప్పటికీ, ‘మురికి చెరువులో కమలంలా లోకంలో ఉండు కానీ, దానిలో భాగం అవకు’ అని బోధించిన హిందూ తత్వవేత్తల మాటలను తు.చ. తప్పకుండా పాటించేవాడు.’ ‘నా ఇల్లు అమ్మకపోవడం నా ఇష్టం అయి ఉండాలి’ అని నమ్మే వ్యక్తి. అయితే, దీని తరువాత, మాస్టర్జీ–భార్య చనిపోయిన తరువాత మొట్టమొదటిసారి, లోకంలో తను ఒంటరివాడిని కాననుకుంటాడు. అపార్టుమెంట్ల అమ్మకాన్ని ఆపేందుకు– సామాజిక సంస్థలనూ, పోలీసులనూ, వకీలునూ, వార్తాపత్రిలనూ, పాత విద్యార్థులనూ సమీపిస్తాడు కానీ ఫలితం ఉండదు. అతని నిర్ణయాన్ని మార్చడానికి మొదట్లో షా బతిమాలతాడు, సున్నితంగా ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, మాస్టర్జీ ఆదర్శవాదాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. ‘డబ్బవసరం లేని వ్యక్తి తన హృదయంలో రహస్య అరలు లేనివాడు. ఎటువంటివాడితను! బేరసారాల విధానాలన్నిటినీ చూశాను. ఇలా ‘వద్దు’ అని స్థిరంగా చెప్పే ఎత్తుగడని ఎప్పుడూ చూడలేదు’ అనుకుంటాడు. సొసైటీ ప్రెసిడెంట్, సెక్రెటరీ ఒత్తిడికి లోనై, మొదట ప్రతిఘటించినవారు తమ నిర్ణయం మార్చుకుంటారు. ఈ లోపల, సెప్టెంబర్ వస్తుంది, పోతుంది. షా నుండి ఏ స్పందనా రాకపోవడంతో ఆదుర్దాపడిన కొందరు సొసైటీ సభ్యులు, మాస్టర్జీని సుత్తితో కొట్టి స్పృహ తప్పించి, డాబా మీదినుంచి కిందకి తోసేస్తారు. అతని మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటిస్తారు. షా అందరి డబ్బూ చెల్లిస్తాడు. రెండు నెల్ల తరువాత, మిగతావారు కొత్త చోట్లలో నివాసం ఏర్పరచుకుంటారు. కొందరు మాస్టర్జీ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, షా ఇచ్చిన డబ్బు తీసుకోరు. తమ అపరాధ భావాన్ని తొలగించుకునేందుకు, పేదపిల్లలకు చదువు చెప్పడం ప్రారంభిస్తారు. మాస్టర్జీ పోరాటం విజయవంతం అవనప్పటికీ, అర్థవంతమైనదిగా అయితే మారుతుంది. నవల చివర్న, విశ్రామ్ సొసైటీ బయటున్న మర్రిచెట్టు, మాస్టర్జీ ఆత్మలాగే– కూల్చివేతను, ముళ్ళకంచెలను, గాజుపెంకులను తట్టుకొని, కొత్తగా వేళ్ళూనుతుంది. రచయిత రాస్తారు: ‘స్వేచ్ఛ పొందాలనుకున్న దేన్నీకూడా, ఆపేదేదీ ఉండదు’. దురాశా, కలలూ– మనిషిని ఎలా నిర్బంధిస్తాయో చెబుతుందీ నవల. అయితే, ఉన్నదాని కన్నా ఎక్కువ కావాలనుకోవడం పాపమా? అని కూడా ప్రశ్నిస్తుంది. షా కన్నా మాస్టర్జీ తక్కువ స్వార్థపరుడా? అన్న సందేహమూ కలిగిస్తుంది. ఈ పుస్తకాన్ని 2011లో ప్రచురించినది అట్లాంటిక్ బుక్స్. చెన్నైలో పుట్టిన కన్నడిగుడు అరివింద్ అడిగా. ప్రస్తుతం ఆస్ట్రేలియా పౌరుడు. వృత్తి రీత్యా పాత్రికేయుడు. 2008లో తన తొలి నవల ‘వైట్ టైగర్’కుగానూ మ్యాన్ బుకర్ బహుమతి పొందారు. -కృష్ణ వేణి -
అలాంటి ఒకమ్మాయి చనిపోతే...
సౌదీ అరేబియా, జెడ్డాలో – పదహారేళ్ళ జరీన్ వాడియా, ఆమె స్నేహితుడైన 18 ఏళ్ల పోరస్ – రహదారిపై కారు ప్రమాదంలో చనిపోతారు. ఇద్దరూ చేతులు పట్టుకుని గాల్లో తచ్చాడుతుండగా, తనాజ్ భాతేనా తొలి నవలైన ‘ఎ గర్ల్ లైక్ దట్’ మొదలవుతుంది. వారి ఆత్మలు – కింద గుమిగూడిన వారిని గమనిస్తుంటాయి. ‘జీవితంలో ఎంత అపఖ్యాతి పాలయిందో, మరణంలోనూ అలాగే ఉన్న’ అమ్మాయి జీవితం గురించి ఆమె స్నేహితులూ, బంధువులూ, పోలీసులూ– తమ తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతుంటారు. ‘పిన్ని ఏడుస్తున్న విధానం మనస్సును కలిచివేస్తోంది. తను నన్నొకసారి పిలిచినట్టు ‘తన అక్క గర్భం నుండి వచ్చిన పరాన్నజీవి’ని కాకుండా నేను తనకే పుట్టిన కూతుర్ని అన్నట్టుగా ఏడుస్తోంది’ అని వ్యంగ్యం కనబరుస్తుంది జరీన్. ‘సహోదరుడూ, భర్తా కాని మగవాడితో ఒకమ్మాయి ఉండటం కన్నా సౌదీ అరేబియా పోలీసులను ఇబ్బంది పెట్టేదీ మరేదీ ఉండదు’ అంటుంది. యీ సంఘటన తరువాత, నవల ఏ కాలక్రమాన్నీ పాటించక, గతానికి మళ్ళుతుంది. జరీన్ ముంబయిలో పుడుతుంది. బార్ డాన్సర్ అయిన ఆమె తల్లి పార్సీ. ముఠాకోరుడైన తండ్రి హిందూ. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడే వారు చనిపోతారు. పిన్ని, బాబాయి– జరీన్ను దత్తత తీసుకుని, తమతోపాటు జెడ్డా తీసుకెళ్తారు. పిన్నికి మానసిక అస్వస్థత ఉన్నప్పటికీ, జరీన్ తల్లిదండ్రులకు పెళ్ళవలేదని దెప్పే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోదు. జరీన్ను కొడుతుంది. అబ్బాయిలను దూరంగా ఉంచేందుకు జరీన్కు ప్యాంట్లు తొడుగుతుంది. జుట్టు పొట్టిగా కత్తిరిస్తుంది. పినతండ్రి భార్యావిధేయుడు. వీటన్నిటిపట్లా తిరగబడిన జరీన్ తనకు 14 ఏళ్ళు వచ్చేటప్పటికే, అబ్బాయిలతో కార్లలో తిరగడం, వాళ్ళను ముద్దు పెట్టుకోవడం, వాళ్ళ సిగరెట్లు పంచుకోవడం మొదలుపెడుతుంది. అయితే వారెవరికీ మానసికంగా దగ్గరవకుండా తన ఉదాసీనతను కవచంలా వాడుకుంటుంది. పరుషమైన భాష ఉపయోగిస్తుంది. జీవితంలోనూ, ఆన్లైన్లోనూ కూడా వేధింపులకు గురవుతుంది. ‘అలాంటి పిల్ల’కి దూరంగా ఉండమని అబ్బాయిల తల్లిదండ్రులు, కొడుకులను హెచ్చరిస్తుంటారు. ఆమెకి స్వతహాగా ఉన్న తెలివి, తిరగబడే లక్షణం, స్వయం ప్రతిపత్తి గమనించిన స్కూలు పిల్లలు, పుకార్లు పుట్టిస్తుంటారు. సౌదీ సమాజంలో– పురుషులకుండే, స్త్రీలకు లేని హక్కుల లాంటి ద్వంద్వ ప్రమాణాలు జరీన్కు విసుగు పుట్టిస్తాయి. ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూసే బోయ్ఫ్రెండ్స్ చిరాకు తెప్పిస్తారు. ‘నువ్వు తప్పని, చెడ్డదానివని– సంవత్సరాలుగా అనేకమంది అనేకసార్లు చెప్పినప్పుడు, వాళ్ళను నమ్మడం ప్రారంభిస్తావు. మొహం దాచుకోవడం ప్రారంభిస్తావు. వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తున్నారనుకుంటావు. బతికేటందుకు అసలు జీవితానికే విలువైనా ఉందా! అని ఆలోచించే స్థితికి చేరతావు’ అంటుంది. చిన్ననాటి స్నేహితుడైన ‘పోరస్ దుమాసియా’ జెడ్డాలో పని చేస్తూ, ఆమె జీవితంలోకి తిరిగి ప్రవేశిస్తాడు. ముంబయి పార్సీ ‘కామా’ కాలనీ నివాసి అతను. జరీన్కు ఉండే ‘జాగ్రత్తయిన చిరునవ్వులూ, సిగ్గుగా ఊపే చేతులూ’ గుర్తు చేస్తాడు. గుజరాతీ ధారాళంగా మాట్లాడతాడు. ఆమెకు ఇంటిని గుర్తుకు తెస్తాడు. గమ్యం లేకుండా, గంటల తరబడి పోరస్తో కార్లో తిరుగుతుంది జరీన్. ఆమె అంత్యక్రియల మీదకన్నా, ఆమె మరణానికి ముందేమి జరిగిందన్న వివరాల మీదే నవల కేంద్రీకృతమవుతుంది. బహుళ దృక్పథాలతో సాగే కథనం– తమ సొంత భావోద్వేగాలనూ, మారుతున్న శరీరాలనే అర్థం చేసుకోలేకపోయే టీనేజీ పిల్లలను చెదిరిన కుటుంబ బంధాలు మరింత గాయపరుస్తాయని చెబుతుంది. కిశోరావస్థలో ఉండే పిల్లల అతిరిక్త ప్రవర్తనకు అవి మూలకారణాలు అవుతాయంటుంది. లింగ అసమానత్వం, మానసిక అస్వస్థత, మతం గురించి మాట్లాడే ఈ నవల్లో– మానభంగపు ప్రయత్నం కూడా ఉంటుంది. ఫరార్, స్ట్రౌస్, జిరూ బుక్స్ దీన్ని 2018లో ప్రచురించింది. భాతేనా ఇండియాలో పుట్టి– సౌదీ అరేబియాలోనూ, కెనడాలోనూ పెరిగారు. ఈ నవల 2019 ఒలా(ఒంటారియో లైబ్రరీ అసోసియేషన్) వైట్ పైన్ అవార్డుకి షార్ట్ లిస్ట్ అయింది. -కృష్ణ వేణి -
చీకటికి అలవాటుపడని కళ్లు
‘మమ్మల్నెవరూ చూడకుండా చీకటి పడ్డాక, ఆఖరి బస్సెక్కాం.’ కొడుకులైన తొమ్మిదేళ్ల స్టాన్, స్టాన్ సవితి తమ్ముడైన కెవిన్ని వెంటబెట్టుకుని– పేరుండని ఊరి నుంచి, అజ్ఞాతమైన ఊర్లో ఉన్న సముద్రతీరానికి బయల్దేరుతుంది ‘ఆమె.’ ఫ్రెంచ్ రచయిత్రి రేవనిక్ ఓల్మీ రాసిన ‘బిసైడ్ ది సీ’ నవలికలో– ‘అది పిల్లల ఆఖరి ప్రయాణమని ఆమెకు తెలుసు’. ‘ఉన్న డబ్బంతా మార్చి చిల్లర’ తెచ్చుకుంటుంది. తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోదు. ‘నా ఊడిన పళ్ళ వల్ల నోటికి చెయ్యడ్డం పెట్టుకోకుండా నవ్వలేను’ అనే ఆమె– కలుసుకునే సామాజిక కార్యకర్త, ఆస్పత్రి ప్రస్తావన వంటి స్వల్ప సూచనలు తప్ప, ఆమె నేపథ్య వివరాలేమీ ఉండవు. పేరు తెలియని మానసిక రోగానికని మందులు తీసుకుంటుంటుంది. వాటినీ పట్టుకెళ్లదు. ‘‘పొద్దున్నే పిల్లల్ని స్కూల్లో దింపే ఓపిక నాకుండదు. ‘స్టాన్ నన్ను తీసుకెళ్తే నాకెప్పుడూ ఆలస్యం అవదు,’ అంటాడు కెవిన్. తిన్న ప్రతిసారీ పళ్ళు తోముకోవాలని తన టీచర్ చెప్పిందంటాడు స్టాన్. వాడికి ఆత్మవిశ్వాసం ఎక్కువవుతోంది. క్రూరమైన లోకంలో ఇమిడిపోతున్నాడు. నా మినహా, సమర్థవంతుడెలా అవుతున్నాడు?’’ అనుకునే ఆమెకు అభద్రత కలుగుతుంది. ప్రయత్నించినాగానీ, మానసిక పొందిక చేతనవదు. పిల్లలకు ‘విశేషమైన చివరి రోజు’ అందించేందుకు– ఉన్మాదిలా, అలిసిపోయేవరకూ వాళ్ళను తిప్పుతుంది. హాట్ చాక్లెట్, భోజనం కొనడం కూడా కష్టమైన పనామెకు. చివర్న, తిరునాళ్ళలో ‘గంటల మ్రోత ఆగడం లేదు. ఎంత వానో, ఎంత శబ్దమో, ఎన్ని లైట్లో! అన్ని దిక్కులనుండీ జనాలు వచ్చేస్తున్నారు. అన్నీ కొనేయగలంత డబ్బెక్కడ నుండి వచ్చింది వారికి?’ అనడుగుతుంది. ‘ఇక ఇంటికి పోదాం’ అని స్టాన్ మృదువుగా చెప్తాడు. లోకం చీకటితో నిండి ఉందనీ, జీవించేందుకు అనుకూలమైనది కాదనీ ఆమె ఏర్పరచుకున్న అభిప్రాయం గట్టిపడుతుంది. కొడుకులు పెద్దయితే, తనకి ఎదురయిన నిరాశ, ఒంటరితనమే వారూ అనుభవిస్తారని ఊహించుకుంటుంది. వారిని కాపాడుకోవాలనుకుంటుంది. హోటెల్లో, వారికి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ‘నాకైతే చనిపోయిన పిల్లలిద్దరున్నారు. వాళ్ళకేముంది! దుప్పట్లు, కంబళ్ళ మధ్య దాగున్న వారి శరీరాలను చూడ్డానికి నిలుచున్నాను. కెవిన్ శరీరం బంతిలా ముడుచుకునుంది. స్టాన్ది జాచుకొనుంది. కెవిన్ మొహం గోడవైపు తిరిగి ఉంది, స్టాన్ది కిటికీ వైపు. మరణం యందు కలిసే ఉంటారనుకున్నాను. నేనిది ఊహించలేదు.’ ఆ ఆరవ అంతస్తు కిటికీ బయటకి చూసి, ‘వాన నాకింద ఉన్నవారికోసం కురుస్తోంది. నేను వీటన్నిటికీ పైన ఉన్నాను’ అంటుంది. చైతన్య స్రవంతిలో సాగే వాడుక భాష కథనం, ఆమె చదువుకున్నది కాదని సూచిస్తుంది. తల్లి ప్రేమకుండే శక్తికీ, తల్లి బాధ్యతలు నిర్వర్తించలేకపోయే పర్యవసానాలకీ మధ్యనుండే సంఘర్షణను ఎత్తి చూపుతుంది నవలిక. ‘పిల్లలకు తిరునాళ్ళలో చిప్స్ తినిపించి, చంపేసిన తల్లి’ అన్న వార్తాపత్రిక శీర్షిక చదివిన తరువాత, ‘పిచ్చితనం’ వంటి సాధారణీకరణాలని పట్టించుకోకుండా– ఏ ఆలోచనా రుగ్మత, సొంత పిల్లల ప్రాణాలను సైతం తీయడానికి ప్రేరేపిస్తుందో అని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ– నాటకకర్తా, రచయిత్రీ అయిన ఓల్మీ యీ పుస్తకం రాశారు. ‘ఇలాంటి విషాదాలని అరికట్టాలంటే, మానసిక అనారోగ్యపు సంక్లిష్టతలను అర్థం చేసుకోవాలి’ అంటారామె. 120 పేజీల యీ నవలికను, యేడ్రియానా హంటర్ ఇంగ్లిష్లోకి అనువదించారు. దీన్ని 2010లో ప్రచురించినది ప్రిరనీ ప్రెస్. తొలి ప్రచురణ 2001లో. ఫ్రెంచ్లో ‘బార్డ్ డె మేర్’ పేరుతో వచ్చిన యీ పుస్తకం ఎన్నో యూరోపియన్ భాషల్లోకి అనువదించబడింది. ఇంగ్లిష్లోకి ప్రచురించడానికి మాత్రం చాలాకాలం ఎవరూ ముందుకు రాలేదు. యీ అనువాదానికి అనువాదకురాలు ‘స్కాట్ మోన్క్రీఫ్’ బహుమానం పొందారు. కృష్ణ వేణి -
స్త్రీత్వం కనబడని లోకం
వుల్ఫ్గోంగ్ హిల్బీస్ రాసిన ‘ద ఫిమేల్స్’ జర్మన్ నవలిక– తూర్పు జర్మనీలో చిన్న పారిశ్రామిక సంఘపు నేపథ్యంతో ఉన్నది. పేరుండని కథకుడి మాటల్లో, అతను ‘అపరిశుభ్రమైన, అప్రయోజకుడైన, సమాజంలో ఇమడని మధ్యవయస్కుడు’. తల్లితో కలిసుంటాడు. ‘పదో తరగతి దాటని నీకు రాతలెందుకు?’ అని తల్లి కోపగించుకున్నా, సాహిత్యం రాస్తాడు. స్త్రీల పట్ల పరిపక్వత చెందని కిశోర ప్రాయపు అభిప్రాయాలుంటాయి. పుస్తకపు ప్రారంభంలో– కథకుడి నుంచి వచ్చే దుర్వాసనా, అతని చేతగానితనంవల్లా, ఒక కర్మాగారంలో నేలమాళిగలో పనికి పెడతారు. అతని తలపైనున్న ఇనుపచట్రాల్లోంచి పైన పని చేసే స్త్రీలు కనబడతారు. వారతనికి భౌతికంగా అందుబాటులో ఉండనప్పటికీ, వారిని చూడ్డానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ‘నాపైన స్థిరమైన శక్తితో, పొగ కక్కుతున్న ఆ వేడి కింద– సగం చీకట్లో, కుర్చీలో కూర్చున్నాను. నా చుట్టూతా అనేకమైన ఖాళీ బీరు సీసాలు దొర్లుతున్నాయి. స్త్రీలను చూడ్డానికి తల పైకైనాఎత్తాలి లేకపోతే కుర్చీలోనైనా నిలబడాలి.’ బస్సుల్లో యువతులను ఒక పర్యవేక్షకుడు వేధించాడని తెలిసిన కథకుడు, అతన్ని బెదిరిస్తాడు. ఉద్యోగం పోతుంది. తన జీవితం గురించీ, తప్పెక్కడ జరిగిందో ఆలోచిస్తూ, మతిభ్రమతో– ‘స్త్రీలు, స్త్రీత్వపు జాడలూ కూడా ఊరినుండి మాయమైపోయాయన్న నా అనుమానాన్ని నిర్ధారించుకునేందుకు రాత్రిళ్ళు వీధివీధికీ తిరిగాను’ అంటాడు. ‘లైంగిక కోరికలు అస్వాభావికమైనవన్న వికలోద్వేగ వైద్యుల నియమాలను పాటిస్తూ పెరిగాను’ అనే కథకుడు, స్త్రీల పట్ల ఆకర్షితుడూ అవుతాడు, వారతనికి చీదరా పుట్టిస్తారు. ప్రేమించబడాలనుకొని, మానవ సాహచర్యం కోసం తహతహలాడతాడు. తన ఆత్రుత తనను ఇతరులకి దూరం చేస్తుందేమోనని భయపడతాడు. అతని నిరాశ హెచ్చవుతుండగా, అతనంటే పాఠకులకు చిరాకు ఎక్కువవుతుంది. ఏకభాషణతో సాగే నవలికలో–నిర్బంధ శిబిరంలో అతను గడిపిన కాలం, రచయితయే ప్రయత్నాలు, ఒక ఉద్యోగంలో నిలకడగా ఉండలేకపోవడానికి ఉండే కారణాలతో– ఒక క్రమంలేకుండా సాగుతుంది కథనం. ‘ప్రభుత్వం నా చేతిలో ఉన్న ప్రతి ఉపకరణాన్నీ లాక్కుంది’ అనే అతను, తన సమస్యల మూల కారణాలను వెతుకుతాడు. చివరకు బెర్లిన్ చేరుకుని, జైల్లో ఉద్యోగం చేపడతాడు. జైలు ఆవరణలో ఆడ ఖైదీలను చూసినప్పుడు, ‘ఇప్పుడు స్త్రీలెక్కడ కనిపిస్తారో తెలిసింది. వారిని తిరిగి చూసి, నా హృదయంలో పదిలపరచుకున్నాను’ అంటాడు. తనపట్ల తనకు సిగ్గు, అసహ్యం ఉండే వ్యక్తి చిత్రం ఇది. సృజనాత్మకతనూ, లైంగికతనూ, కోరికలనూ అణచివేసే ప్రభుత్వం పట్ల కోపాన్ని చూపే కథ. ఆ పరిధీకృత సమాజంలో– పాత్రలు, మగతనం గురించుండే కఠినమైన నిర్వచనాలతో సతమతమవుతాయి. దీన్లో ఉన్న స్త్రీలు పశుప్రాయులు, పురుషులకన్నా మెరుగైనవారు. మగవారు మానసిక నపుంసకులు. కథనంలో భాష– ముతకగా, అసభ్యంగా ఉన్నప్పటికీ, చివరకు గుర్తింపు కోసం కథకుని శోధన– సానుభూతి కలుగజేసి, బలవంతంగానైనా సరే, చదివిస్తుంది. అధ్యాయాల విభజన కనపడదు. హిల్బీస్ 1987లో రాసిన ‘డీ వీబర్’ పేరుతో వచ్చిన యీ నవలికను ఇంగ్లిష్లోకి అనువదించినది ఈసబెల్ ఫార్గో కోల్. 136 పేజీలున్న పుస్తకాన్ని ‘టూ లైన్స్ ప్రెస్’ 2018లో ప్రచురించింది. హిల్బీస్ (1941–2007) యుద్ధానంతర యుగంలో పేరు తెచ్చుకున్న జర్మన్ రచయితల్లో ఒకరు. ఆయన తరంలో చాలామందికిలాగానే హిల్బీస్కు కూడా తండ్రి లేకుండా పోయారు. ఆయన తూర్పు జర్మనీలో పెరుగుతున్నప్పుడు– అధికారులకు ఇబ్బందికరంగా మారడంతో, బెర్లిన్ గోడ పడగొట్టడానికి ముందే 1985లో ఆయన్ను పశ్చిమ జర్మనీకి వలసపోయేందుకు అనుమతించింది ప్రభుత్వం. జర్మన్ ప్రధాన సాహిత్య బహుమతుల్లో ఇంచుమించు అన్నిటినీ హిల్బీస్ పొందారు. కృష్ణ వేణి -
యుద్ధంలో చివరి మనిషి
తూర్పు ఐరోపా. 1944. రెండవ ప్రపంచ యుద్ధపు ఆఖరి నెలలు. డచ్ నవలిక అయిన ‘యాన్ అన్టచ్డ్ హౌస్’లో– పేరు, నేపథ్యం ఉండని ఒక డచ్ సైనికుడే ప్రధాన పాత్రా, కథకుడూ. అతను తన పక్షపు భిన్నదేశాల సైనిక దళాలతో కలిసి, పేరుండని ప్రాంతం లో యుద్ధంలో పాల్గొంటూ నాలుగేళ్లు కావస్తుంది. జర్మన్లు అతన్ని అనేకసార్లు పట్టుకున్నా, ఎలాగో తప్పించుకోగలుగుతాడు. మురికి పట్టి, దిక్కుతోచకుండా, అలిసిపోయుంటాడు. ఆ ‘హొలాందర్’ సైనికుని పటాలం దారి తప్పినప్పుడు, అతను ఒంటరిగా ఒక ఊర్లో ఖాళీగా పడున్న విలాసవంతమైన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. చుట్టుపక్కల ఆవహించిన భీతావహమైన వాతావరణం నుండి ఆ ఇల్లు అతనికి తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పుడు, ‘ఎంతో కాలానికి మొట్టమొదటిసారి ఒక నిజమైన ఇంటికి వచ్చాను,’ అనుకుంటాడు. ‘యుద్ధం జరగనే లేదు’ అనిపించడం మొదలవుతుంది. అలసట వల్ల బయటి కాల్పులూ, పేలుళ్ళనీ మరచిపోయి, ఆ సంపన్నమైన ఇంట్లో స్నానం, భోజనం చేసి, బీరువాలో ఉన్న బట్టలు తొడుక్కుని వైన్ తాగి నిద్రపోతాడు. జర్మన్ సైన్యం తలుపు తడుతుంది. పట్టుబడకుండా బతికుండేందుకూ, తిరిగి యుద్ధానికి వెళ్ళకుండా తప్పించుకోడానికీ, తానే ఇంటి యజమానినైనట్టు నటిస్తూ, శత్రువులైన ఆ నాజీలకు ఇంట్లో చోటిస్తాడు. వారి కల్నల్ పలికే డాంబికాలను వింటాడు. ఆ తరువాత, అసలైన ఇంటి యజమాని తిరిగి వచ్చినప్పుడు, ‘యీ ఇల్లు, చుట్టూతా ఉన్న పచ్చగడ్డి ఉన్నంత కాలమూ, సమస్త లోకం మాయమైనప్పటికీ నాకెందుకు!’ అనుకుంటూ, తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదలుకోవడం ఇష్టపడక, అతన్ని చంపేస్తాడు. జర్మన్లు ఆ ఊరిమీద అధికారాన్ని మరొకసారి కోల్పోయినప్పుడు, తన మారువేషాన్ని వదిలి జయప్రదమైన ప్రజాసైనిక దళాలతో కలిసిపోతాడు. వారందరూ ఉద్రేకంతో ఆ ఇంటిని సర్వనాశనం చేస్తారు. జర్మన్ కల్నల్ను పియానో తీగతో కట్టి వేళ్ళాడదీసి, సైనికులను హత్య చేస్తారు. కథకుడు తన వంతుగా ఒక చేతి బాంబును ఇంట్లోకి విసిరి, వినాశనాన్ని పూర్తి చేస్తాడు. ఆఖరిసారి ఆ ఇంటిని చూస్తూ, ‘ఇంతకాలమూ ఇది నటిస్తూ ఉండి, ఇప్పుడు మాత్రమే తన నిజ స్వరూపాన్ని చూపించుకుంది. నిజానికి ఇదెప్పుడూ బోలుగానే ఉంటూ, మధ్యభాగంలో కుళ్ళుతూ కంపు కుడుతున్న బిలమే’ అనుకుంటాడు. గతంలో యుద్ధ తాకిడికి గురవని ఆ ఇంటి కథ అలాగున ముగుస్తుంది. తన్ని తాను సమర్థించుకుంటూ, ‘యుద్ధాలు జరగకపోయినా కానీ మృత్యువు ఎవరినీ వదలదు. తేడా ఏముంది?’ అని ప్రశ్నిస్తాడు కథకుడు. అతనికి కారణాలు కానీ నైతికత కానీ అనవసరం. బతికుండటమే అత్యవసరం. బాధితులకీ, అపరాధులకీ మధ్యనుండే తేడా కనిపించదు. యుద్ధపు హింసాత్మక ప్రవర్తనలో– సభ్యత అనే ముసుగు జారినప్పుడు కలిగే తీవ్రమైన భయాన్ని, వణుకు పుట్టించేలా వర్ణిస్తారు డచ్ రచయిత విలియమ్ ఫ్రెడరిక్ హర్మన్స్ (1921–95). నూటా ఇరవై పేజీల యీ చిన్న పుస్తకం– మానవత్వానికుండే క్రూరత్వాన్ని కనబరుస్తుంది. విజేతలంటూ ఎవరూ ఉండని యుద్ధానికుండే అసంబద్ధత యొక్క నిస్తేజ చిత్రణ ఇది. కేవలం ఒకే అధ్యాయంతో నడిచే నవలికలో– కథనం పరధ్యానంగా చెప్తున్నట్టుంటుంది. ఇంపైన శైలే అయినా భాషలో నిశ్శబ్దమైన కఠినత్వం కనబడుతుంది.1951లో ప్రచురించబడిన పుస్తకాన్ని డేవిడ్ కోమర్ ఇంగ్లిష్లోకి అనువదించారు. పుష్కర్ ప్రెస్ దీన్ని 2018లో ప్రచురించింది. 1939 సెప్టెంబర్ 1న నాజీ జర్మనీ– పోలండ్ మీద దాడి మొదలుపెట్టిన రోజే హర్మన్స్కు 18 ఏళ్ళొచ్చాయి. సంవత్సరంలోపే తన దేశమైన నెదర్లాండ్స్ కూడా పోలండ్ను అనుసరిస్తూ జర్మన్ ఆక్రమణ కిందకి రావడాన్ని చూశారాయన. అది ఇంచుమించుగా 1945లో యుద్ధం పూర్తయేవరకూ కొనసాగింది. హర్మన్స్ తొలిరాతలు ప్రపంచయుద్ధాన్నే ఇతివృత్తంగా చేసుకుని రాసినవి. ఆయన రాతలన్నీ జ్ఞానాత్మాక శూన్యవాదంపైనే ఆధారపడినవి అంటారు పండితులు. -కృష్ణ వేణి -
మంచివాళ్లు చేయలేని న్యాయం
దక్షిణ కొరియా రాజధాని స్యోల్లో ఉండే పేరుండని యూనివర్సిటీ లెక్చరర్కు తన ఉద్యోగమంటే విసుగు. ఊర్లో ఉన్న భార్యాపిల్లల వద్దకి రెండు మూడు వారాలకొకసారి వెళ్తుంటాడు. అతనుండే అపార్టుమెంట్ల బ్లాక్, ఊరి శివార్లలో ఉంటుంది. అతను రచయిత కూడా. కానీ బద్ధకం వల్ల ఏదీ రాయలేకపోతాడు. అతనికెప్పుడూ కోపమే. ‘అమాయకులమీద నాకెందుకు కోపం వస్తుంది? కోపం రావాలని నాకెందుకనిపిస్తుంది?’ అని తనని తాను ప్రశ్నించుకుంటాడు. నిద్రపట్టక, మిక్ఛొ అనే స్థానిక బీర్ తాగడానికి పక్కనున్న బార్కు వెళ్తుంటాడు. ఇలా 8 ఏళ్ళు కొనసాగుతుంది. అతని యీ బండిగాడి వంటి జీవితం ఒకరోజు దిశ మళ్ళుతుంది. ‘పనికెళ్ళే దారిలో కొండ ముందున్న ఖాళీ స్థలంలో రెండు దేవదారు చెట్లున్నాయి. స్తంభాల్లా నిలుచున్న ఆ చెట్లకి నీలి పందిరి వేళ్ళాడుతోంది. దానికింద చాపేసుకుని ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను రెండు పెద్ద విజ్ఞాపన పత్రాలను పట్టుకున్నాడు... ఒకదానిమీద రాసున్నది స్పష్టంగా చదవగలిగాను.’ ‘అపార్ట్మెంట్ బిల్డింగ్ 103లోని 502వ నంబర్ యూనిట్లో ఉండే వడ్డీ వ్యాపారైన శ్రీమాన్ కిమ్ సియోక్ నా ఏడు వేల వొన్లు వెనక్కియ్యాలి. నేను తీసుకున్న ఒకే అప్పుకి– నానుంచీ, నా మరణించిన తల్లినుంచీ కూడా డబ్బు రాబట్టాడు’ అని రాసిన ఆ పత్రాన్ని పట్టుకున్నతను– కొరియన్ రచయితైన లీ కీహో రాసిన నవలిక పేరైన ‘క్వాన్ సన్ చన్ అండ్ నైస్ పీపుల్’లోని క్వాన్ సన్ చన్. అయితే, 502లో ఉండేది వృద్ధురాలు. ఊతకర్రతో నడుస్తూ, బతుకు దెరువు కోసం చిత్తుకాగితాలు ఏరుకుంటుంది. ‘అతను అదే చోట రోజుల తరబడి ఉండటం ఆశ్చర్యం కలగజేసింది. అతనొక్క మాటా మాట్లాడలేదు. బిల్డింగ్ లోపలికి కూడా రాలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు.’ వ్యాపారి కనిపిస్తాడనే ఆశతో క్వాన్ నెలల తరబడి అక్కడినుండి కదలడు. మొదట చిరాకుతో అతన్ని వదిలించుకోవాలనుకున్న అపార్ట్మెంట్ నివాసులు చివరకు, ‘తప్పుగా అనుకోకు. నీ ప్రవర్తన వల్ల ఏ పరిష్కారం దొరకదు. నీక్కావల్సిన వ్యక్తి 502లో లేడని నీకు తెలిసినదే. యువకుడివి. ఇలా ఆరుబయట పడుకోవడం బాలేదు. అక్టోబర్ వచ్చేసింది. చలి మొదలయింది’ అని నచ్చజెప్పినప్పుడు, క్వాన్ మౌనం వహిస్తాడు. ‘వేడి భోజనం తింటున్నప్పుడూ, వేణ్ణీళ్ళ స్నానం చేస్తున్నప్పుడూ అతని పలచని డేరాయే నా ముఖం ముందు మెదులుతోంది. అపార్టుమెంట్ల నివాసులకూ అలానే అనిపించింది కాబోలు. చందా పోగు చేయడం ప్రారంభించారు. నవంబర్ కల్లా ఏడు వొన్లకి మరి రెండు ఎక్కువే కూడాయి. డబ్బుని కవర్లో క్వాన్కు అందజేసి, నివాసులందరూ ఒకరొకరుగా అతనితో కరచాలనాలు చేస్తున్నప్పుడు సూపర్ మార్కెట్ యజమాని వీడియో తీయాలని నిర్ణయించుకుంటాడు’ అంటాడు కథకుడు. అయితే, క్వాన్ ‘నేను వడ్డీ వ్యాపారితో సంగతేదో తేల్చుకుందామనుకున్నానంతే. నాకీ డబ్బొద్దు’ అని నిరాకరించినప్పుడు, ‘మన ఔదార్యాన్ని తోసిపారేస్తాడా!’ అనుకుంటూ అందరూ వెళ్ళిపోతారు. క్వాన్ నిరసన కేవలం న్యాయం కోసమేనని వారికి తట్టదు. కొద్ది రోజుల తరువాత పెద్ద సెడాన్ కార్ నుంచి ఒక మనిషి దిగి, అయిదవ అంతస్తుకి వెళ్తాడు. అతనే వడ్డీవ్యాపారి. అతను తన తల్లి ఫ్లాట్ నంబర్నే తన చట్టబద్ధమైన చిరునామాగా ఉపయోగించుకున్నాడని కథకుడు అర్థం చేసుకుంటాడు. 2015లో ఏష్యా పబ్లిషర్స్ ప్రచురించిన యీ 128 పేజీల నవలికను అనువదించినది స్టెల్లా కిమ్. లీ కీహో– 1972లో పుట్టారు. శైలి అసాధారణమైనదనీ కథకు కావల్సిన మర్యాదలను పాటించరనీ పేరుంది. ఆయన పాత్రలన్నీ సగటు జీవితాలపైన ఆధారపడినవే. యీ గందరగోళమైన లోకంలో జనాలకు ఇతరులతో తరచూ సంఘర్షణలు రగిలే కాలంలో ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండటమెలా! అన్న ఆందోళనకరమైన అంశానికి రచయిత చమత్కారం, సూక్ష్మదృష్టితో కాల్పనిక రూపం ఇచ్చారు. -కృష్ణ వేణి -
మూడు జీవితాల ముచ్చటకు బుకర్
కొత్త బంగారం ఒమాన్ రాజధాని నగరం మస్కట్కు దగ్గర్లోనే ఉన్న కాల్పనిక ఊరైన ‘అల్ అవాఫీ’ లో ధనిక కుటుంబపు సలీమా, అజ్జాన్లకు ముగ్గురు కూతుళ్ళు. మయ్యాకు కుట్టుపనంటే ఇష్టం. తనిష్టపడిన అలీతో ప్రేమ విఫలమై, ధనవంతుడైన అబ్దల్లాని పెళ్ళి చేసుకుంటుంది. పుస్తక పురుగైన అస్మాకు తల్లిదండ్రుల ఇష్టప్రకారం ఖాలిద్తో పెళ్ళవుతుంది. ఆఖరిదైన ఖ్వాలా, కెనెడా నుంచి తిరిగి వచ్చిన తండ్రి సహోదరుడి కొడుకును వివాహమాడుతుంది. మయ్యా తన కూతురుకి ‘లండన్’ అన్న పేరు పెడుతుంది. భర్తను పట్టించుకోదు. ‘మయ్యా, ప్రేమంటే తెలియదా? నీ కళ్ళెప్పుడూ కుట్టు మెషీన్ మీదే ఉంటాయి తప్ప నన్ను గానీ నా ప్రేమని గానీ ఎందుకు చూడలేవు?’ అని అబ్దల్లా అడిగి, ‘యీ టీవీ డైలాగులేమిటి? నీవు చూసే ఈజిప్షియన్ సినిమాల ప్రభావమా!’ అన్న మయ్యా ఎగతాళిని ఎదురుకుంటాడు. అజ్జాన్– ‘చందమామంత అందంగా ఉండే’ నాజియాతో ప్రేమలో పడి, సలీమాను నిర్లక్ష్యపెడతాడు. జరీఫా– అబ్దల్లా తండ్రి సులేమాన్ ఇంటి బానిస. ఒమాన్ సమాజంలో చోటు చేసుకుంటున్న సామాజిక మార్పులను అంగీకరించే ముగ్గురు అక్కచెల్లెళ్ళనీ, వారి కుటుంబాలనీ అనుసరిస్తుంది జోఖా అల్హార్తీ రాసిన ‘సెలెస్టియల్ బాడీస్’ నవల. గత సంఘటనల ద్వారా– రచయిత్రి, పాఠకులకు ఒమాన్ దేశపు పేదరికాన్నీ, పడిన కష్టాలనూ చిన్నచిన్న సంఘటనల ద్వారా చూపుతారు (బ్రిటిష్ పాలన, తిరుగుబాటు, ఒప్పందం) . అబ్ద్దల్లా– తండ్రి చేసిన బానిసల వర్తకం గుర్తు చేసుకుంటాడు. ‘‘ఆయన అరవడం మానలేదు. ‘ఒరేయ్, సంజర్ను గుంజకు కట్టేయండ్రా. వాడికి ఎవరు నీళ్ళిచ్చినా, నీడ కలిపించినా నాకు సమాధానం చెప్పాలి’ అన్నప్పుడు– ‘నాన్నా, ప్రభుత్వం బానిసలను విడిపించి ఎన్నేళ్ళో అయింది’’ అంటాడు అబ్దల్లా. అతనికి నిద్రలో ఒకే జ్ఞాపకం కలలో వస్తుంటుంది. తండ్రి తనను నూతిలో తలకిందులా వేళ్ళాడదీయడం. ‘అయ్యో, వద్దు, వద్దు’ అని వేడుకుంటున్నప్పుడు మెలకువ వస్తుంది. తనను పెంచిన జరీఫాను తన తల్లి గురించి ఎన్నిసార్లు అడిగినా, ఆమె మరణించిందని తప్ప సరైన సమాధానం ఎప్పుడూ దొరకదు. తల్లి జీవించే ఉందన్న సూచన మాత్రం నవల చివర్న కనబడుతుంది. జరీఫా కొడుకు, ‘నాకు పెళ్ళి చేసి మమ్మల్నిద్దరినీ పని చేయిస్తాడు సులేమాన్. ఇప్పుడు మనం బానిసలం కాము’ అన్నప్పుడు, తల్లి ‘అతనే లేకపోతే మనం ముష్టెత్తుకునేవాళ్ళం’ అంటుంది. ఒమాన్లో బానిసత్వం 1970 లోనే రద్దయినప్పటికీ, బానిసల ప్రవర్తన గానీ బానిసల యజమానుల ఆలోచనలు గానీ మారవు. లండన్– బానిస సంతతిని పెళ్ళి చేసుకుని– అతని దాంపత్య ద్రోహం, అతను తన్ని కొట్టడం భరించలేక విడాకులు తీసుకుంటుంది. ఒమాన్లో కాన్పు తరువాత పొట్ట రాకుండా, 40 రోజులు కడుపుకి రాయిని కడతారు. ఇంటి బయట వేరే గదిలో ఉంచుతారు. పెళ్ళికి ముందు వారంపాటు పెళ్ళి కూతుర్ని ఎవరూ చూడకూడదు. ఆస్మా పెళ్ళప్పుడు, అందరూ ఒక బంధువు ఉదంతం చెప్పుకుంటారు: శోభనపు రాత్రి భర్తను ఏడిపించేందుకు ఒకామెకు సూది కొనలుండే గాజులు తొడుగుతారు. అదర్థం కాని ఆమె– రాత్రి భర్త తనను సమీపించినప్పుడల్లా గాజులతో గుచ్చిగుచ్చి పెడుతుంది. నెలరోజుల తరువాత భయపడిన భర్త అడుగుతాడు: ‘నన్ను బలవంతంగా కట్టబెట్టారా, నన్నిలా గాజులతో చంపుతున్నావు!’ అని. చితక్కొట్టి్టన వెల్లుల్లి రెబ్బకి సూది గుచ్చి(ఇన్ఫెక్షన్ రాకుండా), ఆడపిల్లల చెవులకి పైనుండి కిందవరకూ పది కన్నాలు పొడుస్తారు. ఇలాంటి ఆచారాల వివరాలెన్నో ఉంటాయి పుస్తకంలో. ఒమాన్ ఉన్నత వర్గం– అత్తరు మానేసి, గూచీ పెర్ఫ్యూమ్ ఆధునికతనైతే అలవరచుకుంటుంది గానీ దృక్పథం మాత్రం సనాతనమైనదే. అధికారం ఉండేది పురుషుని చేతిలోనే. రచయిత్రి అల్హార్తీ బానిసలను గొప్పగానూ చూపించరు, బానిసల యజమానులను దుయ్యనూబట్టరు. అక్కచెల్లెళ్ళ జీవితాల కథలు చూపుతూ ఎడారి ప్రాంతం నుండి రాజధానికి చేరిన మూడు తరాల కథలనూ చెప్తారు. రచనకున్న నిర్మాణ క్రమం గమనింపతగ్గది. 60 అధ్యాయాలున్న నవల్లో– ఒక అధ్యాయం ప్రథమ పురుషలో ఉన్న ఒక పాత్ర కథనం అయితే, రెండోది విమానంలో కూర్చుని తన జీవితం గురించి ఆలోచించుకుంటున్న అబ్దల్లా గొంతుతో ఉంటుంది. అయితే, ఒక క్రమం అంటూ లేని కథనాలన్నీ గతంలో జరిగిన సంఘటనలను వర్ణించేవే. ప్రతీ అధ్యాయం భిన్నమైన పాత్రల మీద కేంద్రీకరిస్తుంది. ఎవరెవరికి ఏ విధమైన చుట్టరికమో తెలుసుకోడానికి, మొదటి పేజీలో ఉన్న వంశవృక్షాన్ని అస్తమానం చూడాల్సి వస్తుంది. నవలకున్న కొద్దిపాటి కథాంశమేదో మొదట్లోనే ఉంటుంది. అల్హార్తీ చేసినదల్లా అక్కడున్న ఖాళీలని పూరించడమే. జాతి, బానిసత్వం, లింగం గురించిన పడికట్టు మాటలేవీ ఉపయోగించరు రచయిత్రి. ఒక నిర్దిష్టమైన ముగింపు లేని నవలిది. సంభాషణలు తక్కువ. అవి కూడా కథనంలో కలిసిపోయి ఉంటాయి. ప్రతి పాత్రా ఏదో విధానంలో చరిత్రలో చిక్కుకునే ఉంటుంది. విమోచన కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. లండన్ డాక్టర్ అయివుండి కూడా ముందుకు కదలలేకపోతుంది. నవలకు ఈ వారంలోనే ‘మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్’ ప్రదానం చేశారు. అరబ్ దేశాల నుండి మొట్టమొదటి మ్యాన్ బుకర్ అవార్డ్ పొందిన రచయిత అల్హార్తీ. 2016 నుంచి మారిన నియమాల ప్రకారం, యాబై వేల పౌండ్ల అవార్డ్ సొమ్ముని పుస్తకాన్ని ఇంగ్లిష్లోకి అనువదించిన మారిలిన్ బూథ్తో పంచుకున్నారు. అల్హార్తీ– ఎడిన్బర్ యూనివర్సిటీ నుండి క్లాసికల్ అరబిక్ లిటరేచర్లో పీహెచ్డీ పొందారు. ప్రస్తుతం ఒమాన్లోని సుల్తన్ ఖాబూస్ యూనివర్సిటీలో అరబిక్ డిపార్టుమెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. - కృష్ణ వేణి -
ఒక సంపూర్ణ మానవుడి జీవితం
‘అతనికి ఎవరూ లేరు, కానీ అవసరం అయినవన్నీ అతనికి ఉన్నాయి, అది చాలు.’ ఇవి రాబర్ట్ షీతేలర్, జర్మన్లో రాసిన ‘ఎ హోల్ లైఫ్’ పుస్తకంలో ప్రధాన పాత్ర అయిన ఆండ్రెయస్ ఎగర్ గురించిన మాటలు. 1902లో ఎగర్కు నాలుగేళ్ళు ఉన్నప్పుడు, ఆస్ట్రియన్ పర్వత గ్రామంలో ఉన్న రైతు అయిన బంధువు హ్యూబర్ట్ వద్దకి వస్తాడు. పిల్లాడిని రైతు తనింట్లో పెట్టుకునే ఒకే కారణం– పిల్లాడి మెడ చుట్టూ కట్టిన సంచీలో కొన్ని బ్యాంక్ నోట్లు ఉండటం. పిల్లాడి చేతినుండి పాలు తొణికినా, ప్రార్థనలో మాటలు తప్పు దొర్లినా హ్యూబర్ట్ చావబాదుతాడు. 8 ఏళ్ళ ఎగర్ తొడ ఎముక విరుగుతుంది. స్థానిక డాక్టర్ కూడా ఎముకను అతికించలేకపోవడంతో ఎగర్ కుంటివాడౌతాడు. అయితే పిల్లాడు శారీరకంగా బలవంతుడు. ఒకసారి సూప్ గిన్నె అతని చేతిలోనుండి పడిపోయినప్పుడు రైతు మళ్ళీ కొట్టడానికి సిద్ధపడతాడు. ‘నా మీద చెయ్యి పడిందంటే నిన్ను చంపేస్తాను’ అంటూ ఎగర్ బెదిరించిన తరువాత, అతను అబ్బాయిని ఇంటినుంచి పొమ్మంటాడు. అప్పటికి ఎగర్ వయస్సు 18. లోయలో ఒక కేబిల్ కారు కంపనీ మొదలవుతుంది. ఎగర్ దాన్లో కార్మికునిగా చేరతాడు. ‘అతను అవిటివాడు అయినప్పటికీ పనిమంతుడు. అత్యాశకు పోడు. మితభాషి. పొలాల్లో వేడినీ, అడవుల్లో చలినీ భరించగలడు. ఏ పనిచ్చినా– సణక్కుండా విశ్వాసపాత్రంగా చేస్తాడు.’ కొండల పక్కనున్న స్థలం కొనుక్కుంటాడు. కాయకష్టం చేసే మేరీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. అక్కడి పర్వతాలు మహోన్నతమైనవి. అయితే, హిమపాతాలను తప్పించుకోవడమే అసాధ్యం. ఒకరాత్రి పెద్ద శబ్దం విన్న ఎగర్ నిద్ర లేచి, ‘అది దేనికో సంకేతం అయుంటుంది. గోడల చుట్టూతా మృదువైన గుసగుస... చీకటి ఆకాశంలో పరిగెడుతున్న నల్లటి మబ్బులు. వాటి మధ్యలో వివర్ణమైన, ఆకారం కోల్పోయిన చంద్రుడు’ అన్న గమనింపుతో చూస్తే, గర్భవతైన భార్య చనిపోయి ఉంటుంది. కుంగిపోయిన ఎగర్, లోయ వదిలి రెండవ ప్రపంచ యుద్ధంలో చేరతాడు. రష్యన్లకి పట్టుబడి కౌకసస్ ప్రాంతంలో యుద్ధఖైదీగా ఎనిమిదేళ్ళు గడుపుతాడు. తన పల్లెకి తిరిగొచ్చి, ఆ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఆధునికతకు అలవాటు పడి టూరిస్ట్ గైడ్గా పని చేస్తాడు కొంత కాలం. తనింటికి మరెప్పుడూ వెళ్ళడు. ఒక స్కూల్ టీచర్తో పరిచయం అయ్యాక, ఇద్దరూ శృంగారం చేయలేకపోయి కించపడిన సంఘటనను అతి సున్నితంగా వర్ణిస్తారు షీతేలర్. ‘అతనికి దేవునిపై నమ్మకం ఉండి తీరాలనిపించదు. మరణమంటే భయపడడు. తనెక్కడినుండి వచ్చాడో గుర్తు చేసుకోడు. ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. అయితే, తన జీవితపు ఆ మధ్య సమయాలను అతను– హృదయపూర్వకమైన నవ్వుతోనూ, అమితాశ్చర్యంతోనూ చూసుకోగలడు.’ తన మరణానికి కొన్ని నెలల ముందు అతను బస్సు ప్రయాణం చేస్తాడు. ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అని ఎవరో అడిగినప్పుడు, ‘తెలియదు.. అసలే మాత్రం తెలియదు’ అంటాడు. ఎంత సీదాసాదాగా జీవించాడో అలాగే మరణిస్తాడు. కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎగర్ తనపైన తాను జాలి పడడు. ‘గాయపు మచ్చలు సంవత్సరాల వంటివి. ఒకదాని తరువాత మరొకటి. ఒక మనిషి అలా ఎందుకుంటాడో అని తేల్చేది వాటన్నిటినీ కలిపితేనే... అందరికి లాగానే ఎగర్ ఉనికిని రూపొందించినవి కూడా ఐహిక సంఘటనలూ, వ్యక్తిగత సంబంధాలూ. అతను తన ఏకాంతంతోనే సంతుష్టి చెందినవాడు’ అంటారు రచయిత. కథనంలో ఆత్మీయత కనిపిస్తుంది. శైలి ఆకర్షిస్తుంది.149 పేజీల యీ నవలికను, పాన్ మెక్మిలన్ 2015లో ప్రచురించింది. ఛార్లెట్ కొలిన్స్ సూక్ష్మంగా అనువదించిన యీ పుస్తకం ‘ద మాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2016’కు షార్ట్లిస్ట్ అయింది. కృష్ణ వేణి -
కమ్మదనమేనా అమ్మతనం?
ప్రతీ స్త్రీ తల్లితనం కోరుకుంటుందన్నది సామాజిక అభిప్రాయం. అయితే, ఆరియానా హార్చిక్స్ రాసిన స్పానిష్ నవలికైన ‘డై, మై లవ్’లో, పేరుండని ప్రధానపాత్రా, కథకురాలూ అయిన యువతికి– తల్లి కావాలనుకోకపోయినా కొడుకు పుడతాడు. ‘ఆమె’ ఒక అనామకమైన ఫ్రెంచ్ పల్లెటూర్లో, అత్తగారి కుటుంబంతో ఉంటుంది.ఇంటి గోడలు ఆమెకు ఊపిరాడకుండా చేసినప్పుడు, 35 డిగ్రీల వేసవి వేడిలో, ‘పడిపోయిన చెట్ల మధ్యనున్న గడ్డిలో వాలి పడుకున్నాను. నా అరిచేతిమీద పడుతున్న ఎండ, కత్తిలా అనిపిస్తోంది. దాన్తో హఠాత్తుగా నా మెడ కోసేసుకుంటే రక్తమంతా కారిపోతుంది’ అన్న మాటలు చదవడంతోనే, పాఠకులు ఆమె లోకంలోకి ప్రవేశిస్తారు. ఆ చిన్న సమాజంలో ఇరుక్కున్న ఆ ‘ఫారినర్’ సంతోషంగా ఉండదు. విధవరాలై, నిస్తేజంగా జీవితం గడుపుతున్న అత్తగారిలో ఆమె తన భవిష్యత్తుని చూసుకుంటుంది. కోపం వచ్చినప్పుడు పురుగులని నలిపేస్తుంది. కథకురాలు ఉన్నత చదువున్న పట్టణపు యువతనీ, శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం అనీ తప్ప ఆమె గురించిన వివరాలుండవు. ‘‘భోజనం చేసినప్పటినుంచీ బాత్రూమ్కు వెళ్దామనుకుంటున్నాను... కానీ వీడు ఎంత ఏడుస్తాడో! ఆపడే! నా మతి పోతోంది. తల్లినయ్యాను. దానికి చింతిస్తున్నాను కానీ అలా ఎవరికి చెప్పకోను?’ అని అడుగుతుంది. ‘ఇంత ఆరోగ్యమైన, అందమైన యువతులు యీ ప్రాంతంలోనే ఉండగా, నా భర్త స్థిరంలేని నాతోనే ప్రేమలో పడాలా? బాగుపడే ఆస్కారం లేని నావంటి పరదేశితో!’అని చిరాకు పడుతుంది. ఆమె అప్పుడప్పుడూ ఇతరుల ఎదుట తల్లిగా తన పాత్ర పోషించినప్పటికీ అది ఎంతోసేపు సాగదు. అనర్గళమైన ఏకభాషణ తప్ప కథాంశానికి గానీ పాత్రలకు గానీ ప్రాముఖ్యత లేని పుస్తకమిది. సామాజికంగా అంగీకరించబడని– తల్లులకు కలిగే ఆలోచనలను, వాటిని వ్యక్తపరచలేని నిస్సహాయతను ‘తల్లితనం ఒక రకమైన జైలు, ఉచ్చు’ అనే రచయిత్రి, ‘ఆమె’ ద్వారా వ్యక్తపరుస్తారు. ఇంత గందరగోళంలోనూ, ‘పక్కింటి మోటర్ సైకిల్ వ్యక్తి’ రంగ ప్రవేశం చేసి ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు. కాకపోతే, ఆమె జీవితంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నదవడం వల్ల– అది యధార్థమో, ఆమె ఊహో అర్థం కాదు. ఆమె పక్కింటికి వచ్చే నర్సును తిడుతుంది. సూపర్ మార్కెట్లోనూ, పిజ్జా డెలివరీ అబ్బాయితోనూ పోట్లాడుతుంది. ‘అందరిముందే వాళ్ళమీద అరిచాను. వారిలో ఎవరూ నన్ను ఎదుర్కోరెందుకు! నా దేశానికెందుకు పంపేయరు?’ అన్న ఆ మనస్తత్వం తన చదువునీ, దేశాన్నీ వదిలిపెట్టినందుకా! అయిష్టంగా కొడుక్కి జన్మనివ్వడం వల్లా? సమాధానాలందవు. దీనివల్ల, పాఠకులకు తమకిష్టమైన విధానంలో కథను అర్థం చేసుకోగల స్వేచ్ఛ దొరుకుతుంది. అప్పుడప్పుడూ ఆమె తన్ని తాను జంతువులతో, పక్షులతో పోల్చుకుంటుంది: ‘కూత పెడదామనుకున్నాను... సాలెపురుగుననుకున్నాను.. రహస్యంగా లేడికూనలా..’ కుటుంబ సభ్యులెవరూ ఆమె కనబరిచే అపసవ్య ధోరణి పట్ల అభ్యంతరం తెలపరు. తల్లిదనం, స్త్రీత్వం, యాంత్రికమైన ప్రేమనీ– గాఢతతో ప్రశ్నిస్తారు రచయిత్రి. కథనంలో వినిపించే గొంతు కటువుగా ఉండి ప్రేరేపిస్తున్నప్పటికీ, కవితాత్మకంగా ఉంటుంది. చైతన్యస్రవంతిలో సాగే ఈ పుస్తకంలో ఉన్న కొన్ని పేరాలు రెండు, మూడు పేజీలు ఆక్రమించుకుంటాయి. ‘మై లవ్’ అన్న మాటలు, కథకురాలు భర్తను వ్యంగ్యంగా సంబోధించే విధానం. నవలిక పెద్దలకుండాల్సిన బాధ్యతలతో సహా, పెళ్ళి వంటి మానవ సంబంధాల మధ్యనుండే హింసాత్మకతను అన్వేషిస్తుంది. తుదీ, మొదలూ లేని యీ పుస్తకాన్ని– సారా మోసెస్, కెరోలినా ఓలాఫ్ ఇంగ్లిష్లోకి అనువదించారు. 128 పేజీల యీ నవలికను చార్కో ప్రెస్ 2017లో ప్రచురించింది. తొలి ముద్రణ 2012లో. 2018లో ‘మ్యాన్ బుకర్ ఇంటనేషనల్ ప్రైజ్’కు లాంగ్లిస్ట్ అయింది. కృష్ణ వేణి -
మొక్కై వంగని స్త్రీ జీవితం
‘ద వెజెటేరియన్’ నవల్లో, యొంగ్ హై– తనంటే పెద్ద గౌరవం లేని, ఉదాసీనుడైన భర్త ఛోమ్తో ఉంటుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగర నేపథ్యంతో ఉన్న యీ నవల, యొంగ్ చుట్టూ తిరిగే ముగ్గురి కథనాలతో సాగుతుంది. ఛోమ్, అక్క–ఇన్ హై భర్తయిన ‘ఆర్టిస్ట్’, ఆఖరిగా ఇన్. ఇటాలిక్సులో ఉండే యొంగ్ ఆలోచనలు తప్ప ఆమె గొంతు వినపడదు. ఛోమ్తో కలిసి సామాన్యమైన జీవితం గడుపుతున్న యొంగ్కు పశువధ గురించిన పీడకలలు రావడం మొదలయినప్పుడు, శాకాహారిగా మారి తను ‘మొక్క’ని అన్న భావం ఏర్పరచుకుంటుంది. తనకి ఆహారం అవసరం లేదనుకుంటుంది. ఇంట్లో ఉన్న మాంసాహారాన్ని పారేస్తుంది. భార్య మానసిక స్థితి ఛోమ్కు తన సహోద్యోగుల ముందు ఇబ్బందికరంగా మారుతుంది. యొంగ్ తండ్రి ఛాందసుడు. సంగతి విని, భోజనాల బల్ల వద్ద కూతురి నోట్లో బలవంతంగా పంది మాంసాన్ని కుక్కుతాడు. యొంగ్ తిరుగుబాటుతనంతో, తన్ని తాను పొడుచుకుంటుంది. తండ్రి అందరిముందూ ఆమెను కొడతాడు. ఆ చర్య ఇన్ను కఠినపరుస్తుంది. యొంగ్ను శక్తి్తహీనం చేస్తుంది. ‘తను యీ లోకంలో ఎప్పుడూ జీవించనేలేదన్న అనుభూతి ఆమెను ఆశ్చర్యపరుస్తుంది. అది నిజం కూడా. తనకి గుర్తున్నంతవరకూ, చిన్నపిల్లగా కూడా ఆమె భరించడం తప్ప చేసినదేదీ లేదు.’ ‘యొంగ్ నాకన్నా నాలుగేళ్ళు చిన్నది. పోటీ పడేంత వయోభేదం లేదు. మేము పిల్లలముగా ఉన్నప్పుడు మా లేత చెంపలు నాన్న భారీ చేతులకి గురయ్యేవి. తనే నాన్న దెబ్బలని ఎక్కువ భరించింది. అణుకువగా, అమాయకంగా ఉంటూ– నాన్న కోపాన్ని మళ్ళించలేక, ప్రతిఘటించలేక– బాధనంతా తనలోనే దాచుకుందని ఇంత కాలం తరువాతే అర్థం చేసుకోగలిగాను’ అంటుంది ఇన్. ఛోమ్ విడాకుల ప్రక్రియ ప్రారంభిస్తాడు. యొంగ్ ఇల్లు వదులుతుంది. క్రమేపీ, మానసిక అనారోగ్యపు అంచులను చేరుకుంటుంది. పోషణ లేక క్షీణిస్తున్న శరీరంతో, అక్కను అడుగుతుంది: ‘చనిపోవడం అంత చెడ్డదా?’ రచయిత్రి హేన్ కాంగ్ యీ ప్రశ్నకి పుస్తకమంతటా ఏ సమాధానం అందించరు. మామగారి చర్య వల్ల ధైర్యం పొందినది వీడియోగ్రాఫర్గా ఎదగలేకపోయిన ‘ఆర్టిస్ట్’. యొంగ్ ఇంటికి వచ్చి, ఆమె శరీరం మీద పువ్వులు గీస్తాడు. తను మొక్కననుకున్న యొంగ్, అతనితో పడుకోడానికి ఒప్పుకుంటుంది. ఇంతలో ఇన్ రావడం ఘర్షణకి దారి తీస్తుంది. ఆమె చెల్లెల్ని మానసిక చికిత్సాలయానికి తీసుకెళ్తుంది. యొంగ్, అక్కడ అడపా తడపా నెలల తరబడి ఉంటుంది. ఇన్ భర్తను వదిలేస్తుంది. ఇక్కడి నుండి వినిపించే ఇన్ కథనం, మానసిక ఆరోగ్యానికుండే నిర్వచనం మీద కేంద్రీకరిస్తుంది. ‘చెల్లి నాకు గుర్తు చేస్తున్న సంగతులతో ఇంక పోటీ పడలేను. నేను దాటలేకపోయిన ఎల్లలను తనొక్కతే దాటేయడాన్ని క్షమించలేను.సామాజిక నియమాలకి ఖైదీగా ఉన్న నన్ను వెనక్కి నెట్టేసింది. ఇంతటి అద్భుతమైన బాధ్యతా రాహిత్యాన్ని క్షమించలేకపోతున్నాను. ఆ కడ్డీలను తను పగలగొట్టకముందు, అవి ఉండేవని కూడా యొంగ్కు తెలియదు’ అంటుంది ఇన్. ఇద్దరూ కలిసి అంబులెన్సులో వెళ్తూ– ఎదురవుతున్న చెట్ల నుంచి సహకారం, సత్యం కోసం చూస్తుండగా కథ ముగుస్తుంది. వాంఛకీ, నిర్లిప్తతకీ– తీరిన/తీరని కోరికల మధ్యనుండే సంఘర్షణలని పుస్తకం పలుమార్లు కనపరుస్తుంది. యొంగ్ మారుతున్నప్పుడల్లా, భాషా మారుతుంటుంది. తిరుగుబాటు, నిషేధం, దౌర్జన్యం, కామోద్రేకం గురించిన వివరాలతో ఉండి, కలవరపెట్టే తన పుస్తకం, ఆధునిక దక్షిణ కొరియాకి దృష్టాంతం అని రచయిత్రే చెప్తారు. డెబ్రా స్మిత్ ఇంగ్లిష్లోకి అనువదించిన యీ నవలను హోగార్థ్ ప్రెస్ ప్రచురించింది. నవల 2016లో ‘మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్’ గెలుచుకుంది. -కృష్ణ వేణి -
గేర్లు మార్చుకోలేని జీవితం
41 ఏళ్ళ సోన్యా స్వీడిష్ క్రైమ్ నవళ్ళ డానిష్ అనువాదకురాలు. కోపెన్హేగెన్లో ఉంటుంది. ఆమె సహచరుడు, ఇరవై ఏళ్ళ ‘ఫ్రెంచ్ జడలు వేసుకునే’యువతి కోసం సోన్యాను వదిలిపెడతాడు. డానిష్ నవలయిన ‘మిర్రర్, షోల్డర్, సిగ్నల్’లో సోన్యా– డెన్మార్క్లో ఉండే తన జట్లండ్ పల్లెటూరుని వదిలిపెట్టి అప్పటికి 20 ఏళ్ళు దాటుతుంది. అయినా, అక్కడి మనుష్యులను గుర్తు చేసుకుంటూ, వరిపొలాల మధ్య తిరిగిన తన బాల్య జ్ఞాపకాలను పదిలపరచుకుంటుంది. తనకీ, అక్క కేట్కీ ఉండిన అన్యోన్యతను తలచుకుంటుంటుంది. ‘పాశ్చాత్య సంస్కృతి యొక్క బ్రహ్మాండమైన శవం మీద, నేనొక పరాన్నజీవిని’ అనుకుంటుంది. ‘నా జీవితపు యీ దశలో, నేనుండవల్సిన స్థితిలోనే ఉన్నానా!’ అన్న సందేహం తలెత్తినప్పుడు, జీవితంలో మార్పును ఆశించి డ్రైవింగ్ లైసెన్స్ కోసం పాఠాలు నేర్చుకోవడం మొదలెడుతుంది. తనకు డ్రైవింగ్ నేర్పించే యూటై చెప్పే, ‘అద్దం చూడు, భుజం తిప్పు, సిగ్నల్ వెయ్యి’ అన్న పాఠాలను మంత్రంలా జపిస్తుంది. అయితే, హఠాత్తుగా మెడ తిప్పినప్పుడు, తల తిరిగే ‘వర్టిగో’ సమస్య ఉంటుంది సోన్యాకు. దాన్ని నయం చేసుకోడానికి, ఆధ్యాత్మిక మర్దనలు చేసే ఎలెన్ వద్దకి వెళ్తుంది. అన్నిటినీ తప్పించుకునే అలవాటు ఆమెకు. బాత్రూమ్కు వెళ్ళాలన్న నెపంతో ఎలెన్ క్లాసుల నుండి పారిపోతుంది. యూటై వెకిలితనం నచ్చక, డ్రైవింగ్ టీచర్ని మారుస్తుంది. అక్క కేట్కి ఫోన్ చేస్తే ఆమె ఎత్తకపోయినప్పుడు, ఉత్తరాలు రాసి, చెత్తబుట్టలో పడేస్తుంది. ‘నా అంతట నేను గేర్లు మార్చలేను’ అని యూటైకు చెప్పిన సోన్యా– నిజ జీవితంలో కూడా ఏదీ మార్చుకోలేకపోయిన ‘మూఢవిశ్వాసం, అనిశ్చితి’ నిండి ఉన్న మహిళ. అయితే, తమ అక్కచెల్లెళ్ళ గత అన్యోన్యత గురించిన సోన్యా కథనం, ఆమె ఊహించుకున్న పరిపూర్ణమైన బంధం కాదనీ, నిజానికి వాళ్ళిద్దరికీ పడేది కాదనీ పాఠకులకు తెలుస్తుంది. గతంలో బోయ్ఫ్రెండ్తో ఉండే సంబంధం కూడా బలవంతంగా ఏర్పరచుకున్నదే తప్ప, సోన్యాకి లైంగిక భావనలు కలగవన్నదీ స్పష్టమే. ‘నాతో ఏ సంబంధం పెట్టుకోవాలనుకోని రాజధాని నగరపు వీధి అంచుల్లో నిలబడ్డాను’ అనే సోన్యా కోపెన్హేగెన్లో ఉంటున్నప్పటికీ, దానిలో భాగం అవలేకపోతుంది. నవల ఆఖరున ఆమె గుర్తిస్తుంది: ‘నీవు వచ్చిన చోటు నీవు తిరిగి వెళ్లలేకపోయేది. నీవే పరాయిదానివయావు’. సోన్యాకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా? ప్రేమ దొరుకుతుందా? లేదు. భవిష్యత్తులో ఏ మంచో జరుగుతుందన్న అస్పష్టమైన సూచన తప్ప, సోన్యా ఏమీ సాధించదు. కథ టైటిల్, కథనంలో అనేకసార్లు కనిపిస్తుంది. నవల్లో అధికభాగం– డ్రైవింగ్ పాఠాలూ, ఎలెన్ మాలిష్ బల్ల వివరాలూ ఉన్నదే. ఇతరులు తనని చూసే విధానంలో తనని తాను చూసుకోలేని సోన్యా గురించి పాఠకులు తమ సొంత అభిప్రాయాలను ఏర్పరచుకునే వీలు కలిపిస్తారు రచయిత్రి డోర్తే నోర్స్. ఉత్తమ పురుషలో ఉండే పుస్తకంలో స్పష్టమైన కథాంశం ఉండదు. జరిగే సంఘటనలే వరుసగా కనిపిస్తాయి. ప్రేమ, సస్పెన్స్, చమత్కార సంభాషణలు ఉండవు. తన ప్రత్యక్షత కోసం ఒక స్త్రీ చేసే పోరాటం మాత్రమే కనిపిస్తుంది. నెమ్మదిగా సాగే కథనంలో వచనం ఎంత సరళంగా ఉన్నప్పటికీ, రచయిత్రి పదాలు ఉపయోగించే తీరు మాత్రం ఆసక్తికరమైనది. ‘ఆమెయందు, ఆకాశం తన్ని తాను పరిష్కారం లేని రీతిలో ఖాళీ చేసుకుంటోంది... ఫ్రిజ్లో పేరు పెట్టేంత విలువైనది ఏదీ లేదు.’ కథనం– వర్తమానానికీ, బాల్య జ్ఞాపకాలకీ మధ్య ఊగిసలాడుతుంది. దీన్ని మీకా హుక్స్ట్రా ఇంగ్లిష్లోకి అనువదించారు. పుష్కిన్స్ ప్రెస్ ప్రచురించింది. ‘మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఇంటర్నేషనల్, 2017’ కోసం షార్ట్లిస్ట్ అయింది. -కృష్ణ వేణి -
ముత్తాతను ముద్దాడిన చరిత్ర
1970ల చివర్న. హైదరాబాదులో ఉండే కృష్ణ– దక్షిణాఫ్రికాలో పని చేసిన తన ముత్తాత వీరయ్య గురించి, నాయనమ్మ చెప్పే కథలు వింటూ పెరుగుతాడు. ముత్తాత– తన భార్యా, ఆరుగురు కొడుకులూ, కూతురు చెంగమ్మతో దిగిన ఫొటో దొరికినప్పుడు, తమ వంశవృక్షం గీయడం ప్రారంభిస్తాడు. ఇంటర్నెట్ వచ్చిన తరువాత– వీరయ్య వివరాల కోసం దౌత్య కార్యాలయాలకూ, పరిశోధకులకూ మెయిల్ చేసినా ఫలితం కనబడదు. సౌత్ ఆఫ్రికాలో ముత్తాత ఉండిన డర్బన్లో ఉన్న నటాల్ వెళ్ళి, అక్కడున్న దూరపు బంధువులని కలుసుకుంటాడు. ఆఫ్రికా నేషనల్ ఆర్కైవ్స్ వెతికినప్పుడు, వీరయ్య వలస కూలీగా వచ్చినవాడని తెలుస్తుంది. వీరయ్య తన స్వగ్రామం కొర్లపాడు(కృష్ణా జిల్లా) నుండి బెజవాడ పారిపోతాడు. సౌత్ ఆఫ్రికాలో కూలీల ఉద్యోగాలిప్పించే కంపెనీ, అతనితోపాటు మరికొందరిని మద్రాస్ తీసుకెళ్ళి, డర్బన్ వెళ్ళే ఓడెక్కెస్తుంది. ఆ ప్రయాణంలో షేక్, వెంకటస్వామితో స్నేహం కుదురుతుంది. ఓడ దిగిన కూలీలు తమకి తోచిన పేర్లనీ, కులాన్నీ రెజిస్టర్ చేయించుకున్నప్పటికీ– అక్కడా కుల వ్యవస్థ ఉండేది. తమ వారసులు మెరుగైన జీవితం గడిపేందుకు కూలీలు అమానవీయమైన పరిస్థితులను ఎదురుకుంటూ, చెరుగ్గడల తోటల్లో పని చేసేవారు. తిట్లూ, కొరడా దెబ్బలూ భరించేవారు. జీతం, భోజనపు సరుకులూ– సమయానికి అందివ్వడం ఇండియన్ సిర్దార్ల్ల(సర్దార్ల) మనఃస్థితి మీద ఆధారపడేది. పాస్ లేకుండా కూలీలు తోట బయటకి వెళ్ళకూడదు. ఆడకూలీల సంఖ్య తక్కువ అయినందున, పెళ్ళిళ్ళలో ఎదురు కట్నం ఇచ్చేవారు. ఒకసారి– జబ్బు పడిన తోటి కూలీని బయటకి తీసుకెళ్ళినప్పుడు, గాంధీజీని కలుసుకుంటాడు వీరయ్య. అలా, ఏళ్ళ కష్టం తరువాత హ్యూలెట్ పొలాలకి సర్దార్ అవుతాడు. ఇతరుల పట్ల సానుభూతి, మర్యాద ఉండే అతనంటే అందరికీ ఇష్టం. రాజమ్మని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటాడు. కొర్లపాడు చుట్టాలకి రాసిన ఉత్తరాలకి సమాధానం రాదు. అప్పటికి ఆఫ్రికా వాసులే దాస్యంలో చిక్కుకోవడంతో, వలస కూలీల గిరాకీ తక్కువవుతుంది. 1904లో తన 22వ ఏట ఆఫ్రికా వెళ్ళిన వీరయ్య, 1932లో కుటుంబంతో ఇండియా తిరిగి వస్తూ– కూతుర్నీ, అల్లుడినీ కూడా వెంటబెట్టుకొస్తాడు. వీరయ్య ఓడ దిగుతున్నప్పుడు, ‘ఆరుగురు కొడుకులున్నారు. బంగారపు గోడలతో ఇల్లు కడతావు’ అంటాడు కెప్టెన్. అప్పటికే వీరయ్య తల్లిదండ్రులు మరణిస్తారు. ఎవరెవరో వీరయ్య ఆస్తి కోసం చుట్టరికాలు కలుపుకుని– ఇంట్లో ఉన్న డబ్బూ, నగలూ దొంగిలించి– అతన్ని మళ్ళీ పేదరికంలోకి నెడతారు. చెంగమ్మ భర్తతో పాటు డర్బన్ తిరిగి వెళ్ళిపోతుంది. కొడుకులు ఉద్యోగాలు చేపడతారు. అక్కలైన దుర్గ, సరస్వతిని కలుసుకున్న తరువాత, ‘గణేశ్ చతుర్థి’ నాడు, తన 70వ ఏట వీరయ్య చనిపోతాడు. ‘నా ముత్తాత అనుభవాలు కథనంలో ఇమిడేలా, కొన్ని చారిత్రక ఘటనలను కాల్పనికం చేయవల్సి వచ్చింది’ అంటూ రచయిత కృష్ణ గుబిలి– పున:సృష్టించిన వృత్తాంతమే యీ ‘వీరయ్య’. తన మూలాలను కనుక్కోవాలని బయల్దేరిన కృష్ణ– ఏ దేశంలోనూ, ఇన్నేళ్ళ తరువాత కూడా వలస కూలీల జీవితాల్లో మార్పు రాలేదని గుర్తించి, ‘అప్పటి చెరుగ్గడల పొలాలకీ, యీనాటి ఆకాశ హార్మ్యాలకీ ఏ తేడా లేదు’ అంటాడు. ‘చరిత్రలో నిర్లక్ష్యపెట్టబడిన యీ అధ్యాయాన్ని లోకానికి పరిచయం చేయాలనుకున్నాను. పారిశ్రామిక ప్రపంచంలో భారతదేశపు కూలీల గురించినదీ పుస్తకం’ అని చెబుతాడు. ఆఖరి పేజీల్లో– ఎన్ని దేశాలకు, ఏ ఏ ప్రాంతాల నుండి ఎంతమంది కూలీలుగా వెళ్ళారు, అన్న గణాంకాలుంటాయి. కథనం, ప్ర«థమ పురుష నుంచి ఉత్తమ పురుషకు మారుతుంటుంది. ఫొటోలూ, గ్రాఫులూ, చేతిరాతలూ– అనేకమైన పేజీలు ఆక్రమించిన యీ పుస్తకాన్ని నోషన్ ప్రెస్, 2018 డిసెంబర్లో ప్రచురించింది. -కృష్ణ వేణి -
వదిలిన దేశం తాలూకు ఇంటి బెంగ
అబ్బూ చనిపోతూ, ఇంక తమది కాని పూర్వీకుల రూప్నగర్ ఇంటి తాళాలను జాకిర్ చేతుల్లో పెడుతూ, ‘ఇవి నమ్మకానికి చిహ్నం. దాన్ని కాపాడుకో. మనం వదిలిన భూమి, మనపై చూపిన దయని జాపకం పెట్టుకో’ అని చెప్తాడు. ఏనాటి కిందటో, ‘ప్రపంచం కొత్తగానూ, ఆకాశం స్వచ్ఛంగానూ ఉన్నప్పుడు, భూమి ఇంకా మలినపడనప్పుడు’ కాల్పనిక ఊరైన రూప్నగర్ (ఇండియా) లో ‘బస్తీ’ నవల మొదలవుతుంది. కథకుడైన జాకిర్ పుట్టినది అక్కడే. అతని అబ్బూజాన్, అమ్మీ, చెల్లెల్నీ– పరిచయం చేస్తారు రచయిత ఇంతిజార్ హుసేన్. ‘తాబేలు మీద నిలుచున్న ఏనుగు తలపైనే భూమి ఉంటుంది’ అనే ఊరి పెద్దయిన భగత్జీ కథకీ, ‘కాదు, చేప మీద నిలుచున్న ఆవుకొమ్ము మీద భూమి ఉంటుంది’ అనే అబ్బూ కథకీ మధ్యన ఏ వైరుధ్యతా కనపడని హిందూ–ముస్లిమ్లకున్న సామరస్యమైన వాతావరణంలో పెరుగుతాడు జాకిర్. దేశ విభజన సమయంలో, పాకిస్తాన్ తరలి వెళ్తుంది అతని కుటుంబం. జాకిర్ చిన్నప్పటి స్నేహితురాలైన సబీరా మాత్రం ఊర్లోనే ఉండిపోతుంది. జాకిర్, లాహోర్లో ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం పెట్టుకోకుండా, టీ తాగుతూ దేశ భవిష్యత్తు గురించి చర్చిస్తుంటాడు. హిస్టరీ ప్రొఫెసర్గా చేరతాడు. సబీరాను తలచుకుంటూ– గతం, వర్తమానం, కల, యథార్థతలకి మధ్య ఊగిసలాడుతూ– రూప్నగర్, లాహోర్ కలిసిపోతాయన్న ఆశ వదలడు. తన ఊరి వేపచెట్టుని తలచుకుంటూ, లాహోర్లో ఉన్న మర్రిచెట్టుకి అలవాటు పడతాడు. అయితే, ‘పాత తరం మాత్రం తమ శరీరాలనైతే కొత్త దేశానికి తెచ్చుకుంది కానీ తమ ఆత్మలను తమ ఇళ్ళలోనే వదిలి వచ్చినది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారలేకపోతూ, గతంలోనే బతుకుతున్నది’. కొత్త దేశానికి వెళ్ళినవారి ఆశలు, ఆశయాలు నవలంతటా ప్రతిధ్వనిస్తాయి. నవల పాకిస్తాన్ దేశపు మొదటి పాతికేళ్ళనీ ఒక శరణార్థి దృష్టితో చూపిస్తుంది. లాహోర్ పట్టణానికి– చరిత్ర గురించి రూప్నగర్కు ఉన్నంత పట్టింపు ఉండదు. ‘సూర్యుడు, తుపాన్లు, వర్షం, పక్షి రెట్టల వల్ల తప్ప– దేశంలో కలిగిన సంక్షోభం– ఊర్లో ఉన్న ఏ బిల్డింగుకీ గతంతో సంబంధం కల్పించదు. ఉన్న కేంద్రీకరణంతా రాజకీయాల మీదే’. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడ్డాక, జాకిర్ ఆశావాదం మాయం అవుతుంది. ‘రూప్నగర్ సాంప్రదాయాలు, లాహోర్ నాగరికత కూడా పోయాయి. మాట్లాడగలిగేవారు మౌనంగా ఉన్నప్పుడు బూట్ల లేసులే మాట్లాడతాయి’ అన్న తండ్రి మాటలు తలచుకుంటాడు. మొదటి రోజున లాహోర్లో గమ్యం లేకుండా తిరుగుతూ, ‘సంతోషమైన రోజది. తాజా భూమి మీద, నిర్మలమైన ఆకాశం కింద నడిచాను. ఎంతో స్వచ్ఛంగా అనిపించింది’ అనుకున్న జాకిర్ కొన్నేళ్ళ తరువాత, ‘రోజులు మురికి పట్టాయి. ఆ రోజుల తేటదనం ఎక్కడ పోయిందో?’ అని దిగులు పడి, ‘నా అడుగులు ఏ భూమ్మీద పడుతున్నాయో!’ అన్న అయోమయ స్థితికి చేరతాడు. అబ్బూ చనిపోతూ, ఇంక తమది కాని పూర్వీకుల రూప్నగర్ ఇంటి తాళాలను జాకిర్ చేతుల్లో పెడుతూ, ‘ఇవి నమ్మకానికి చిహ్నం. దాన్ని కాపాడుకో. మనం వదిలిన భూమి, మనపై చూపిన దయని జాపకం పెట్టుకో. అదే నీ కర్తవ్యపాలన’ అని చెప్తాడు. ‘ఏ కథా అంతం అవదు. దానినుండి మరొక కొత్త కథ పుడుతుంది. అలా కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి’ అనే హుసేన్– గతంలోనే కూరుకుపోకుండా, దానినుండి ప్రేరణ పొందుతారు. ఏ దేశాన్నీ సమర్థించరు. పుస్తకంలో–విభజన వివరాలు కానీ విషాదం కానీ కనిపించదు. ఒక కాలక్రమాన్ని పాటించని నవలకి నిర్దిష్టమైన ముగింపేదీ ఉండదు. 1979లో రాసిన యీ పుస్తకాన్ని ఉర్దూ నుండి ఇంగ్లిష్లోకి అనువదించినది ఫ్రాన్సిస్ డబ్ల్యూ ప్రిట్చెట్. -కృష్ణ వేణి -
నీ మరణాన్ని నీవే చూస్తున్నప్పుడు...
‘నీ భార్యతో పాటు ఇంటి బయటకి వెళ్తావు. తోట మధ్యకు చేరుకున్నప్పుడు, టెన్నిస్ రాకెట్టు ఇంట్లో మరచిపోయావని ఆమెకి చెప్తావు. దానికోసం వెనక్కి వెళ్ళి,‘నీవు’ రాకెట్టుని పెట్టే ప్రవేశద్వారం వద్దున్న అల్మారాకి వెళ్ళకుండా, బేస్మెంటు వైపు దారి తీస్తావు. బయటే ఉన్న నీ భార్య, తుపాకీ శబ్దం విని, ఇంట్లోకి పరిగెత్తి నిన్ను పిలుస్తుంది. బేస్మెంట్ తలుపు తెరిచుందని గమనించి, కిందకెళ్తుంది. నీవు, రైఫిల్ని నీ కణత మీద పెట్టుకుని కాల్చుకున్నావని చూస్తుంది.’ మధ్యమ పురుషలో ఉండే ‘సూయిసైడ్’ నవల ప్రారంభం ఇది. యీ ఫ్రెంచ్ పుస్తకంలో ఉన్న మాటలు, 20 ఏళ్ళ క్రితం–తను పాతికేళ్ళకన్నా ఎక్కువ జీవించనని చాటి, తన 25వ ఏటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ఉద్దేశించి కథకుడు చెప్పినవి. మొదట్లో యధార్థ జీవితకథ అనిపించే నవల–20 పేజీల తరువాత కథకుని ఉనికి గురించిన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ‘నీవు బతికే ఉంటే నాకు అపరిచితుడివి అయి ఉండేవాడివి. మరణించిన తరువాత స్పష్టంగా కనిపిస్తున్నావు’ అన్న మాటలు, కథకునికీ ‘నీవు’కీ ఉన్న సంబంధాన్ని వివరించవు. అయితే, ‘నీ ఆత్మహత్యను వివరిస్తూ, కామిక్ పుస్తకపు పేజీ ఒకటి తెరిచి పెడతావు. నీ భార్య చేయి తగిలి, పుస్తకం మూసుకుపోతుంది. ఏ పేజీ నీ ఆత్మహత్యను ఉదహరించిందో, ఎవరికీ తెలియకుండా పోతుంది’ అన్న మాటలు ఆతృత హెచ్చిస్తాయి. ‘ఆమె నిన్ను తన చేతుల్లోకి తీసుకుని వెక్కుతూ, నీ మీదకి వాలుతుంది. నీ శరీరం చల్లబడ్డం గమనిస్తుంది... నీ అంతాన్ని నీవే యోచించి పెట్టుకున్నావు. నీ మరణానికి వెనువెంటనే, నీ శరీరం కనుక్కోబడే ఏర్పాట్లు చేసుకున్నావు. అదక్కడే కుళ్ళుతూ పడి ఉండటం నీకిష్టం లేకపోయింది’ అన్నలాంటి– నీవు జీవితపు ఉదంతాలను, అనుభూతులను, అలవాట్లను, వస్త్రధారణను, పడగ్గది వివరాలను – ఒకదానికొకటి సంబంధం లేకుండా చెప్పే కథనం కాబట్టి, కథకుడికి ‘నీవు’ గురించిన వ్యక్తిగత వివరాలు ఎలా తెలుసా!’ అన్న అనుమానం కలుగుతుంది. నవల ఆత్మహత్య అనే చర్యను ప్రశ్నించదు. కానీ, ఆ నిర్ణయం తీసుకున్న మనిషిని నిలదీస్తుంది. అయితే ఏ సమాధానమూ దొరకదు. యీ 104 పేజీల నవలికలో ఉన్న అధ్యాయాల చివర్న, నీవు కుండే ఇష్టాయిష్టాలు కనబడతాయి: ‘నవ్వు రక్షిస్తుంది. సంతోషం నిరాశ పరుస్తుంది. వార్తాపత్రికలు విసుగు పుట్టిస్తాయి’. ‘నీ మరణం తరువాత ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకుందా? ఆమె శృంగారం జరుపుతున్నప్పుడు నీవు గుర్తుకొస్తావా! నీ పుట్టిన రోజున ఆమె ఏమిటి చేస్తుంది? నీ వర్ధంతి దినాన, నీ సమాధి మీద పూలు ఉంచుతుందా! ఇంకా నీ బట్టలు అట్టేపెట్టిందా?’ అన్న క్రూరమైన ప్రశ్నలు హృదయవిదారకంగా అనిపిస్తాయి. పుస్తకంలో కథకుడి వివరాలేవీ లేనప్పటికీ నవల వెనుక అట్టమీదున్న, ‘తన యీ చివరి పుస్తకపు అచ్చుప్రతి పబ్లిషరుకి ఇచ్చిన పది రోజులకి, రచయిత ఎద్వార్ద్ లేవే ఉరి వేసుకున్నాడు’ అన్న వాక్యాలే – నవలను పాఠకులు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాయి. ‘నీవు’ అన్న పేరులేని వ్యక్తంటూ ఎవరూ లేరనీ, రచయితే తన రెండు పక్షాల వ్యక్తిత్వాలనీ సమర్థించుకుంటూ, అంతర్గత సంభాషణలు జరిపినవాడనీ అన్నవారు అనేకమంది. భయం పుట్టించే పుస్తకం కాదిది. జాలి కలిగించే ప్రయత్నం చెయ్యదు. వ్యాకులత, నిస్పృహతో బాధను విపరీతం చేయదు. వచనం సరళంగా, సాఫీగా ఉంటుంది. జాన్ సై్టన్, ఇంగ్లిషులోకి అనువదించిన యీ నవలికను 2011లో డాకీ ఆర్కైవ్స్ ప్రెస్ ప్రచురించింది. కృష్ణ వేణి -
దైనందిన జీవితంలోని ఆశనిరాశలు
కొత్త బంగారం ‘ఎమాంగ్ స్ట్రేంజ్ విక్టిమ్స్’ నవల్లో, ప్రధాన పాత్ర అయిన రోడ్రీగో తెలివైనవాడు. కాకపోతే, మధ్యలోనే చదువు ఆపేస్తాడు. తనది కాదనిపించే జీవితాన్ని గడుపుతూ– మెక్సికోలో ఉన్న తన అపార్టుమెంట్లో, పెచ్చులూడుతున్న గోడలని చూడ్డంలోనే సంతృప్తి పొందుతుంటాడు. విమర్శించబడకుండా గడిపే నిదానమైన జీవితం అతడికి ఇష్టం. ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో తిరగాడే కోడిని గంటల తరబడి చూస్తుంటాడు. ‘నా జీవితంలో జడత్వం నిండి ఉంది. ఒక శనివారం తరువాత వచ్చే మరిన్ని శనివారాల పునరుక్తే అది’ అనుకుంటాడు. మ్యూజియమ్లో కాపీ ఎడిటరుగా ఉద్యోగం దొరికినప్పుడు అయిష్టంగానే చేరతాడు. ‘నాలెడ్జ్ అడ్మినిస్ట్రేటర్’ అని తనకు తాను నియమించుకున్న హోదాలో, ‘ఎన్నో గంటలు– ప్రెస్ రిలీజులు, కరపత్రాలు’ రాస్తుంటాడు. నాలుగు భాగాలుగా ఉండే ఈ నవల్లో, ‘పెళ్ళి చేసుకోవడం మహాపరాధం’ అని తల్లి ఏడెలా చెప్తుందని తెలిసిన తరువాత కూడా, యాదృచ్ఛికంగా సిసీలియాను పెళ్ళి చేసుకుంటాడు. ‘సిసీలియాతో కలిసి జీవించడం నన్ను నేను పెట్టుకుంటున్న హింసే. నా పట్ల ఆమె తిరస్కారం వారం వారానికీ పెరుగుతోంది’ అనుకుంటాడు. ఆర్థిక సంక్షోభం వల్ల ఉద్యోగం పోయినప్పుడు, భార్యను తప్పించుకోడానికి తమ ఊర్లో ఉన్న తల్లి వద్దకి వెళ్తాడు. ఏడెలా పీహెచ్డీతో పాటు అనేకమైన డిగ్రీలు ఉన్న స్త్రీ. అక్కడ తల్లి ప్రేమికుడైన స్పెయిన్ దేశస్తుడు మార్సేల్లో కనిపించినప్పుడు, రోడ్రీగోకి ‘ఆలస్యంగా నిద్రలేచి, లోబట్టలు మాత్రమే వేసుకుని, సీసానుండే నేరుగా చీదరపుట్టించే పాలు తాగడానికి వంటింట్లోకి వెళ్ళే సౌకర్యం’ లేకుండా పోతుంది. తల్లికీ, మార్సేల్లోకీ మధ్య ఉన్న అన్యోన్యత చూసిన తరువాత, భార్య గుణాలని పునఃపరిశీలిస్తాడు రోడ్రిగో. సిసీలియా– జోనాథన్ లివింగ్ సెగల్ పుస్తకాలు చదవడం అతనికి కంపరం కలిగిస్తుంది. ఆమె నమ్మే స్వయం సహాయక గురూలు అతనికి నచ్చరు. మార్సేల్లో– రోడ్రీగోకి డ్రగ్స్, టెకిలా, హిప్నాటిజం లాంటివి పరిచయం చేసినప్పుడు, కథ విపరీత మలుపులు తిరుగుతుంది. వారిద్దరి స్నేహం, రోడ్రీగోను తనమీద తను జాలిపడ్డంనుంచి బయట పడేస్తుంది. ‘ఒంటరితనం ఎప్పుడూ ఒక్కటే. ఒంటరివారు ఒకేలా ఉండరు. ఇతరుల ఎదుట బయటపడకుండా మనం నిగ్రహించుకునే మాటలని, ఎవరూ విననప్పుడు మనం బయటకి చెప్పుకున్నప్పుడు, దానికుండే విలువ భిన్నమైనది’ అన్న నిశితమైన పరిశీలనలు పుస్తకం పట్ల కుతూహలాన్ని హెచ్చిస్తాయి. ‘తన దైనందిన జీవితాన్నే గుచ్చిగుచ్చి పరిశీలించుకునే నిరాశావాది, దాన్ని ప్రేమించగలడా? జీవితాన్ని సంతోషంగా గడపడానికి అవసరం అయినది ఏది!’ అన్న ప్రశ్నలు వేస్తుంది ఈ నవల. నవల ముగింపు–బాగా చదువుకున్న, ఉన్నత వర్గాలకి చెందినవారి గురించిన మానసిక అధ్యయనంలా అనిపిస్తూ, కథకున్న పోగులన్నిటినీ కలిపి కడుతుంది. వీరు, తమలో గట్టిగా పాతుకుపోయున్న అభిప్రాయాల ప్రకారమే బతకడం వల్ల, ఆ మొండితనమే తమని అవిటివారిగా చేస్తోందని గుర్తించరంటారు మెక్సికన్ రచయిత డేనియల్ సల్దాన్యా పేరిస్. కోడిని ఖాళీ స్థలంలో చూడ్డం కూడా ఒక విధమైన భాగస్వామ్యమే అంటారు. తనతో తానూ, ప్రపంచంతోనూ సంధానం కనుక్కోడానికి ప్రయత్నించే వ్యక్తి గురించిన హాస్య కథ ఇది. ఈ స్పానిష్ నవలని ఇంగ్లిష్లోకి అనువదించినవారు క్రిస్టీనా మెక్స్వీనీ. 2016లో ‘బెస్ట్ ట్రాన్స్లేటెడ్ బుక్ అవార్డ్’కు లాంగ్లిస్టు అయిన ఈ నవలని ప్రచురించింది కాఫీ హౌస్ ప్రెస్. - కృష్ణ వేణి -
పుట్టిన చోటును వెతికే సింహం
కొత్త బంగారం 1986. ఐదేళ్ళ సరూ, పక్క ఊరి రైల్వే స్టేషన్లో తప్పిపోయి, పొరపాటున కలకత్తా వెళ్ళే రైలెక్కుతాడు. తన ఊరు ‘గినెస్తలే’ అనీ, తల్లి ‘అమ్మీ’ రాళ్ళు మోస్తూ, తమ నలుగురు పిల్లల్నీ పోషిస్తుందనీ తప్ప మరేదీ తెలియదు. హిందీ తప్ప మరే భాషా రాదు. సరూ కలకత్తా రోడ్లమీదతిరుగుతూ మూడు వారాలు గడిపిన తరువాత, పిల్లాడిని వొక అనా«థాశ్రమంలో పెడుతుంది ప్రభుత్వం. ఆస్ట్రేలియా జంటయిన సూ, జాన్ బ్రియలీ– కుర్రాడిని దత్తు తీసుకుంటారు. సరూ నిజ జీవిత కథ అయిన, ‘ఎ లాంగ్ వే హోమ్’ నవలకి కథకుడు– తన అసలు పేరైన ‘షేరూ’ (సింహం) పలకడానికి నోరు తిరగని సరూయే. ఆ తరువాత, బ్రియలీ దంపతులు మానసిక సంతులనం లేని మాంతోష్ని దత్తు తీసుకుంటారు కానీ అతని ప్రస్తావన ఎక్కువ ఉండదు. సరూకి మాతృదేశం గుర్తుండేలా, సూ– కొడుకు గదిలో అనాథాశ్రమంలో తీసిన అబ్బాయి ఫొటోతో పాటు ఇండియా మ్యాప్ కూడా పెడుతుంది. సరూ తన గత జీవితపు అస్పష్టమైన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకుంటాడు. ‘మరొక దేశానికి, సంస్కృతికి మారడం అంత కష్టం కాలేదు నాకు. ఇండియాలో నా జీవితంతో పోలిస్తే ఆస్ట్రేలియాలోనే చక్కగా గడిపాను. కాకపోతే, అమ్మీ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉండేది. అది అసాధ్యం అని తెలిసిన తరువాత, బతకాలంటే దొరికిన ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకోవాలని అర్థం అయింది’ అంటాడు. అతను హాస్పిటాలిటీ మానేజ్మెంట్ చదువుతున్నప్పుడు, గూగుల్ ఎర్త్ రిలీజ్ అవుతుంది. జ్ఞాపకం ఉన్న కొండగుర్తులతోనూ, తన ఇండియన్ క్లాస్మేట్స్ సహాయంతోనూ– ఇండియన్ రైల్వే లైన్ల పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ, శాటిలైట్ ఇమేజెస్ వెతుకుతాడు. మధ్యప్రదేశ్లో ఉన్న ఖాండ్వా పక్కనున్న గణేష్ తలై తన పల్లె అని కనుక్కోడానికి ఆరేళ్ళు పడుతుంది. 2012లో సరూ తన ఊరు వస్తాడు. షేరూ తిరిగి వస్తాడన్న ఆశతో అమ్మీ ఊరు మారదు. సరూ అమ్మీకి ఇల్లు కొనిస్తాడు. ఇంటివారితో వీడియో చాట్లు చేస్తూ అనేకసార్లు ఇండియా వస్తూపోతాడు. ఆఖరికి, అతని ఇద్దరు తల్లులూ కలుసుకుంటారు. సరూ నవల చివర్న చెప్తాడు: ‘‘నా ఊరిని, కుటుంబాన్ని కనుక్కోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయితే, అది నా పాత జీవితానికి తిరిగి వెళ్ళడం కోసం కాదు. జీవితమంతా ఆస్ట్రేలియాలోనే గడిపాను. ఇక్కడ నాకు తెంచుకోలేని కుటుంబ బంధాలున్నాయి... నేనెవరో, ‘ఇల్లు’ అని దేన్ని పిలవాలో అన్నదాని గురించి నాకే అయోమయమూ లేదు. ఒక్క కుటుంబమూ లేని తప్పిపోయిన కుర్రాడిని. ఇప్పుడు నాకు రెండు కుటుంబాలు ఉన్నాయి, రెండు గుర్తింపులు కావు. నేను సరూ బ్రియలీని.’’ సరూ జ్ఞాపకాలనీ, అతని వెతుకులాటనీ చూపిస్తూ, కథనం వెనక్కీ ముందుకీ మారుతుంటుంది. రచయిత సరూ బ్రియలీ కథ– సగం ప్రపంచాన్ని చుట్టివచ్చి, తన గతాన్ని తిరిగి చేజిక్కించుకుని, రెండు భిన్నమైన సంస్కృతులని తనవిగా చేసుకున్న అతని దృఢచిత్తం గురించినది. ఉద్విగ్నభరితంగా ఉండే పుస్తకం –పట్టుదల, ప్రయత్నాల కొదవ లేకపోయినప్పుడు దేన్నైనా సాధించవచ్చన్న ఆశ లేవనెత్తుతుంది. కథనం స్పష్టంగా, సరళంగా ఉంటుంది. ‘కుటుంబం అంటే ఏమిటి!’ అన్న ప్రశ్న పుస్తకమంతటా కనిపిస్తుంది. స్ఫూర్తిదాయకమైన బ్రియలీ ప్రయాణపు పుస్తకం, కట్టుకథకున్నంత ఆశ్చర్యాన్ని కనపరుస్తుంది. నవలని వైకింగ్ 2014లో పబ్లిష్ చేసింది. దీని ఆధారంగా తీసిన ‘లయన్’ సినిమా 2016లో వచ్చింది. - కృష్ణ వేణి -
చెదిరిన జీవిత చిత్రం
‘ద గర్ల్ యు లెఫ్ట్ బిహైండ్’ నవల మొదలయ్యేది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పటి 1916లో. ఫ్రెంచ్ చిత్రకారుడైన ఇద్వార్డ్, భార్య సోఫీ చిత్రాన్ని వేస్తాడు. యుద్ధానికి వెళ్ళి పట్టుబడినప్పుడు, జర్మన్ జైల్లో పెడతారు అతణ్ని. జర్మన్లు ఫ్రాన్సులో చిన్న పల్లెటూరైన, సెయింట్ పేహోన్ను ఆక్రమించుకుంటారు. అక్కడే సోఫీ కుటుంబం చిన్న హోటెల్ నడుపుతుంటుంది. ప్రతీ సాయంత్రం జర్మన్ క్యాంప్ కమాండంట్కూ, సిపాయిలకూ తినుబండారాలు, పానీయాలూ అందించవల్సిన పని తప్పించుకోలేకపోతుంది సోఫీ. కమాండెంట్ను మొదట సోఫీ చిత్రం ఆకర్షిస్తుంది. ఆ తరువాత సోఫీ. ‘నేను శత్రుసైన్యం వాడినన్న సంగతి మరచిపో. నువ్వు ప్రతి క్షణం ఆ సైన్యాన్నే ఎలా నష్టపరచాలా అని యోచిస్తున్న స్త్రీవని నేనూ మరచిపోతాను. మనం కేవలం ఇద్దరు మనుష్యులుగా మాత్రమే ఉందాం’ అని సోఫీకి సూచిస్తాడు. ‘ప్రతీ క్షణపు సారాన్నీ ఆస్వాదిస్తూ, అది రుచిగా ఉన్నందుకు సంతోషపడుతూ గడపాలి’ అని భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చిన సోఫీ– ఇద్వార్డును జైలునుండి విడిపించడం కోసం, కమాండంట్ షరతును ఒప్పుకుంటుంది. అనుకోకుండా జర్మన్ ఆర్మీ ఆమెను అరెస్ట్ చేస్తుంది. ఆ తరువాత ఆమె జాడ కనబడదు. రచయిత్రి జోజో మోయ్స్– కథను 90 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళి, నాలుగేళ్ళ కిందట భర్తను కోల్పోయిన, 33 ఏళ్ళ లండన్ నివాసి అయిన లివ్ వద్దకు చేరుస్తారు. పెళ్ళయిన కొత్తల్లో, భర్త ఆమెకు బహూకరించిన సోఫీ చిత్రమే లివ్ గోడమీద వేళ్ళాడుతుంటుంది. ‘కొన్నిసార్లు, జీవితం అడ్డంకుల వరుసలా కనిపిస్తుంది. మరొక అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది’ అనుకుంటూ జీవితం ఈడుస్తున్న స్త్రీ లివ్. దొంగిలించబడిన కళాఖండాలను వాటి హక్కుదారులకు అప్పగించే బాధ్యత తీసుకున్న అమెరికన్ అయిన పౌల్, పోలీసుగా పని చేసిన తరువాత, తన సొంత ఏజెన్సీ నడుపుతుంటాడు. ఇద్వార్డ్ కుటుంబం సోఫీ చిత్రం కావాలని కేసు పెట్టినప్పుడు, ఆ కేసు చూస్తున్నదే పౌలే. లివ్, పౌల్ను కలుసుకున్న తరువాత, జీవితం పట్ల ఆమె ఆశ తిరిగి చిగురిస్తుంది. ‘లోకం అంతం అయిందనుకున్నాను. తిరిగి ఎప్పుడూ మంచి జరుగుతుందని ఆశించలేదు. నేను ఇన్నాళ్ళూ ఎక్కువ తినలేకపోయాను. ఎవరినీ కలవాలని ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ బతుకంటే ఇష్టం ఏర్పడింది’ అని పౌలుకు చెప్తుంది. అయితే, చిత్రం గురించి తెలిసిన తరువాత వారిద్దరి సంబంధం బీటు పడుతుంది. ఇద్వార్డ్ వేసిన చిత్రాల ధర ఆకాశాన్ని అంటుతోందని తెలియని లివ్, చిత్రాన్ని వదులుకోనంటుంది. అది కమాండెంట్కు బహూకరించబడిందని తెలిసిన పౌలు, ‘కేసు గెలవడం కన్నా జీవితంలో మరెంతో ఉంది’ అనుకుని కేసు వదిలేస్తాడు. వాస్తవానికి– సోఫీ భర్తను కలుసుకుని స్విట్జర్లాండ్లో, అతనితో కలిసి సంతోషంగా జీవించిందని ఆఖర్న తెలుస్తుంది. సోఫీ దృష్టికోణంతో ఉన్న కథ హటాత్తుగా లివ్ జీవితానికి చేరిన తరువాత, చాలా త్వరగా– ముందుకీ వెనక్కీ నడుస్తుంది. సోఫీకి ఏమయిందన్న రహస్యాన్ని అన్వేషిస్తూనే, లివ్ వద్దనున్న చిత్రం గురించిన ఆసక్తిని హెచ్చిస్తుంటుంది. చిత్రాలను పూర్వస్థితీకరణ చేయడంలో ఉన్న సంక్లిష్టతలను విపులీకరిస్తుంది నవల. యుద్ధకాలంలో దొంగిలించబడిన కళాఖండాల గురించి చెప్తూ కూడా రచయిత్రి– వదంతులు నిజాలని ఎలా కప్పెడతాయో అన్న తన కథనం నుంచి దృష్టి మళ్ళించరు. ‘సరైన కారణాల కోసం ఏదైనా చేసినప్పుడు కూడా అది నమ్మకద్రోహమే అవుతుందా?’ అని కథ ప్రశ్నిస్తుంది. ప్రేమ, త్యాగం, కోల్పోవడం గురించిన పుస్తకంలో యుద్ధపు వివరాలు, అమానుష ప్రవర్తన, విశదమైన లైంగిక వివరాలు ఉంటాయి. వార్తా శీర్షికల వెనకనుండే వ్యక్తిగత కథలను కనబరిచే ఈ నవలను పెంగ్విన్ బుక్స్ 2014లో ప్రచురించింది. ‘సరైన కారణాల కోసం ఏదైనా చేసినప్పుడు కూడా అది నమ్మకద్రోహమే అవుతుందా?’ అని కథ ప్రశ్నిస్తుంది. కృష్ణ వేణి -
జీవితం నాలుగ్గోడల గది అయినప్పుడు...
‘రూమ్’ నవల, జాక్ ఐదో పుట్టినరోజున మొదలవుతుంది. జాక్కు తెలిసినది కేవలం పేరుండని ‘మా’ తో పాటు తనుండే సౌండ్ ప్రూఫ్ చేసిన పదకొండడుగుల చదరపు గదే. తన 19 ఏళ్ళప్పుడు అపహరించబడిన ‘మా’– ఏడేళ్లుగా ఆ ‘గది’లో ఉంటూ జాక్ను కంటుంది. కథకుడు పిల్లవాడే. పగలు ఇంటికప్పు నుంచి సూర్యరశ్మి వస్తుంది. రాత్రి అయినప్పుడు, ‘రాక్షసుడు వచ్చి సూర్యుడిని మింగేశాడు’ అనుకుంటాడు మా చెప్పే కథలు వినే జాక్. గది తలుపు, కోడ్ వాడితే తప్ప తెరుచుకోదు. ఆ కోడ్, ‘మా’ను అపహరించిన ‘ఓల్డ్ నిక్’ వద్దే ఉంటుంది. కొడుక్కి నేర్పించడంలో, పెంచడంలో, సంతోషపెట్టడంలో తనకున్న మానసిక శక్తినంతటినీ వెచ్చిస్తుంది మా. ఆ ప్రక్రియలో తన స్వస్థచిత్తతనూ కాపాడుకుంటుంది. గదిలో ఉండేవి– ఒక టీవీ, బీరువా, కొన్ని పుస్తకాలు. ‘ఓల్డ్ నిక్’ వచ్చినప్పుడు, జాక్ బీరువాలో దాక్కోవాలని మా ఆజ్ఞాపిస్తుంది. నిజమైన మనుషులకు చెప్పేలాగానే గదిలో ఉన్న వాటన్నిటికీ, ‘గుడ్ నైట్ గది, గుడ్ నైట్ కార్పెట్’ అని చెప్తుంటారిద్దరూ. బయట కూడా ఒక లోకం ఉంటుందని జాక్కు తెలియదు. తల్లికి గది జైలయినా కొడుక్కి అదే స్వర్గం. టీవీలో కనిపించేవి మరే గ్రహంవో అని తలపోస్తాడు. ‘నేను మనిషిని అయి ఉంటాను. మా కూడా మనిషేనేమో!’ అనుకుంటాడు. మా చనుబాలు తాగడం, ఆమెతోపాటు స్నానం చేయడంలో ఊరట పొందుతాడు. ‘ఓల్డ్ నిక్’ వచ్చినప్పుడు, బీరువాలో దాక్కుని, వినిపిస్తుండే శబ్దాలని లెక్కపెడుతూ, అతను మా మీద చేసే బలాత్కారం పూర్తయిందో లేదో గ్రహిస్తాడు. దృఢ సంకల్పంతో, మా– జాక్ కోసం ఒక జీవితాన్నయితే సృష్టిస్తుంది కానీ అది తమిద్దరికీ సరిపోదనుకున్నప్పుడు, తప్పించుకునే ప్రణాళిక వేస్తుంది. ‘జాక్ జబ్బు పడ్డాడు. హాస్పిటల్ అవసరం’ అని ఓల్డ్ నిక్కు చెప్తుంది కానీ అతను వినడు. అప్పుడు జాక్ను కార్పెట్లో చుట్టేసి, అబ్బాయి చనిపోయాడని అబద్ధం చెప్తుంది. అతను జాక్ను తనతో తీసుకువెళ్తాడు. పిల్లాడు– తల్లి చెప్పినట్టే, ఓల్డ్ నిక్ను తప్పించుకుని ఒక అపరిచితుడిని సమీపిస్తాడు. అతని సహాయంతో పోలీసులకు– అతి కష్టం మీద, గదికుండే దారి చెప్పగలుగుతాడు. అప్పుడు మా కూడా బయటపడుతుంది. ఓల్డ్ నిక్ జైలు పాలవుతాడు. మా – తన కుటుంబాన్ని కలుసుకుంటుంది. అయితే అపరిచితులు, కొత్త అనుభవాలు నచ్చని జాక్, ‘ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూశాను, చాలు. అలిసిపోయాను. గదికి వెళ్ళిపోదాం’ అంటాడు. ఈ లోపల కేసు మీడియా దృష్టికి రావడం వారిద్దరి జీవితాలనీ దుర్భరం చేస్తుంది. రచయిత్రి ఎమ్మా డానహ్యూ– అద్భుతమైన నైపుణ్యంతో గందరగోళమైన ప్రపంచ స్వేచ్ఛను జాక్కు పరిచయం చేస్తారు. ‘‘పిల్లల్ని గమనిస్తుంటే, తల్లిదండ్రులకి వాళ్ళంటే ఇష్టం అనిపించడం లేదు. ‘ఎంత ముద్దుగా ఉంటారో!’ అంటూ వాళ్ళ ఫొటోలు తీసుకుంటూనే, కబుర్లు చెప్పుకుంటారు తప్ప, పిల్లలతో ఆడుకోరెందుకో!’’ అంటూ ఆశ్చర్యపోతాడు జాక్.మా కు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది. ఆమె స్వేచ్ఛ ఎక్కువవుతున్నకొద్దీ ఆమె కేవలం తనతోనే ఉండాలన్న జాక్ అసహనమూ పెరుగుతుంది. ‘గదిలో మాకు అన్ని పనులూ చేసే టైముండేది. ఇక్కడ కాలం ఒక చోట నిలవకుండా, వెన్నలాగా ప్రపంచమంతటా పాకిపోవడంవల్లనేమో, అందరికీ పరిమితమైన సమయమే ఉంది’ అనుకుంటాడు. ఒకసారి గదిని చూసి రావడానికి వెళ్తారిద్దరూ. ప్రపంచం గురించిన తన కొత్త దృక్కోణంతో చూసినప్పుడు, దానితో తనకుండే పాత అనుబంధం మరుగై, ఆ నిర్బంధకరమైన చోటుకి సులభంగానే వీడ్కోలు పలకగలుగుతాడు జాక్. తల్లీకొడుకులు కొత్త జీవితం ప్రారంభిస్తారు.పుస్తకం– జీవితంలో తగిలిన దెబ్బలని తట్టుకుని తిరిగి నిలుచోవడం గురించినది. కథనం– మితిమీరిన అమాయకత్వం కనబరచకుండా, పిల్లల వాస్తవికమైన కంఠాన్ని వొడిసి పట్టుకోగలుగుతుంది. మనం జీవించే లోకం గురించిన ఒక తాజా కోణాన్ని చూపుతూనే, ప్రేమకి ఒక వినూత్నమైన నిర్వచనం ఇస్తుంది నవల. ఐదేళ్ళ బాలుడి కథనాన్ని పాఠకులు తమ గ్రహింపు ప్రకారం వివరాలు జోడించుకుంటూనో, తీసివేసుకుంటూనో అర్థం చేసుకోవాలి. బుకర్ ప్రైజుకి షార్ట్ లిస్ట్ అయిన ఈ నవలని లిటిల్ బ్రౌన్, 2010లో ప్రచురించింది. దీని ఆధారంగా ఇదే పేరుతో 2015లో సినిమా కూడా వచ్చింది. కృష్ణ వేణి -
పూర్తిగా ఎప్పుడు బాగుంటాం!
‘నేనంటూ ఉన్నానా, లేనా!’ అని సందేహపడే ఎలినర్ వయస్సు 29. తన చుట్టూ ఒంటరితనాన్ని కూడగట్టుకున్న యువతి ఆమె. గ్లాస్గో (స్కాట్లాండ్) ఆఫీసులో తొమ్మిదేళ్ళగా పని చేస్తుంటుంది. వారంలో అయిదు రోజులు పనితో, వారాంతాలు– పిజ్జాలు, రెండు వోడ్కాలు, ‘మమ్మీ’ తనని కించపరుస్తూ సలహాలిచ్చే ఫోన్ సంభాషణలతోనూ గడుస్తాయి. ‘ఎలినర్ ఒలిఫంట్ ఈజ్ కంప్లీట్లీ ఫైన్’ నవలకు ప్రధాన పాత్రా, కథకురాలూ అయిన ఎలినర్ నిజానికి ‘ఫైన్’గా ఏమీ ఉండదని త్వరలోనే తెలుస్తుంది. ‘నిశ్శబ్దం, ఒంటరితనం నన్ను నలిపివేస్తున్నప్పుడు, జీవించే ఉన్నానన్న సాక్ష్యం కోసమైనా కొన్నిసార్లు బిగ్గరగా మాట్లాడవలసి వస్తుంది’ అనుకునే ఎలినర్ తెలివైనదే. కాకపోతే, తను మనస్సులో అనుకునేది బయటకు చెప్పేసే సామాజిక మర్యాదలు తెలియని యువతి. ట్రెయిన్లో వినిపించే అనౌన్సుమెంట్లని విన్నప్పుడు, ‘యీ యంత్ర ప్రకటనల ముత్యాలని ఎవరికోసం పంచుతున్నారో! గ్రహాంతర వాసుల కోసం కాబోలు’ అంటుంది. ఆఫీసులో హేళనకు గురవుతుంటుంది. ఆమె పెరిగినది పెంపుడు తల్లిదండ్రుల ఇంట్లో. ‘నాకు 30 ఏళ్ళు వస్తున్నాయి. మగవాడి చేతిలో చేయి వేసుకుని నడవడం ఎరగను’ అనే ఎలినర్ సగం మొహం బాల్యంలోనే కాలిపోయుంటుంది. ఏనాడూ బ్యూటీ పార్లర్లోకి అడుగు పెట్టినది కాదామె. ఎత్తు మడమల జోళ్ళు తొడుక్కోలేదెప్పుడూ. ఒకరోజు ఆఫీసునుండి బయటకు వస్తుండగా, ఐటీ విభాగంలో పని చేస్తుండే రేమండ్ ఎదురవుతాడామెకి. రోడ్డుమీద పడిపోయిన ముసలాయన సామ్యూల్ని ఇద్దరూ కలిసి కాపాడినప్పుడు, వంటరివాళ్ళైన ముగ్గురికీ స్నేహం కుదురుతుంది. సరైన సమయాన జరిగిన ఆ సంఘటన, ఎలినార్ జీవితాన్నే మార్చేస్తుంది. ‘అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఒక వయస్సంటూ ఉండదు’ అంటారు రచయిత్రి గెయిల్ హనీమాన్. ఆఫీసు లాటరీలో ఎలినర్ సంగీత కచేరీ టికెట్లు గెలుచుకుంటుంది. అక్కడి గాయకుడైన జానీయే తన జీవితంలో ప్రవేశించబోయే వ్యక్తనుకుని, పార్లర్లకి వెళ్ళడం ప్రారంభించి, కొత్త బట్టలు కొనుక్కుంటుంది. అతను తననుకున్న పెద్దమనిషి కాడని గ్రహించినప్పుడు, ఆత్మహత్య చేసుకుందామన్న ప్రయత్నంలో– నొప్పి మాత్రలు కలుపుకుని, పీకలకొద్దీ తాగి, తన ఫ్లాట్లో కింద పడిపోతుంది. ఆమె ఆఫీసుకి రాలేదని గుర్తించిన రేమండ్ ఆమెని తెలివిలోకి తెచ్చి, కొన్ని రోజుల తరువాత సైకియాట్రిస్ట్ వద్దకి తీసుకెళ్తాడు. ఎలినర్ తన అస్పష్టమైన బాల్య జ్ఞాపకాల/అనుభవాల గురించి, ‘మమ్మీ’తో తనకుండే సంబంధం గురించీ థెరపిస్టుతో మాట్లాడుతుంది. తన బాల్యంలో ఇంటికి నిప్పంటించినది తల్లే అనీ, ఆమె అక్కడే చనిపోయిందనీ గ్రహించినప్పుడు, తను తల్లితో జరిపే సంభాషణలు ఏకపక్షమైనవని అర్థం చేసుకుంటుంది. ‘జీవితం సరిగ్గా ఉంటే సరిపోదు, జీవితం మెరుగ్గా ఉండాలి’ అని రేమండ్ చెప్తాడామెకు. అలా ఉండాలంటే– తన అపార్టుమెంటు గోడల వెనుకా, వోడ్కా వెనుకా దాక్కోడం సరిపోదని తెలుసుకుని, తను తప్పించుకున్న లోకాన్ని పరిచయం చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఆఫీసుకు తిరిగి వెళ్ళినప్పుడు, అందరూ ఆమెని ఆదరిస్తారు. ‘నా జీవితమంతా చావు కోసమే ఎదురుచూస్తూ గడిపాను. నిజమైన మరణం అని కాదు కానీ సజీవంగా ఉండాల్సిన అవసరం లేని మృత్యువు’ అని పుస్తకం మొదట్లో చెప్పిన ఎలినర్– ఆఖర్న, ‘ఇంకా బతికే ఉన్నాను. అదే ముఖ్యం’ అనే స్థితికి చేరుకుంటుంది. లాంఛనప్రాయమైన భాషతో రాసిన నవలలో విశదమైన వర్ణనలుంటాయి. ఎలినర్ ఎదుగుదలని చూడటం వల్ల పాఠకులకు కలుగుతుండే విచారం దూరం అవుతుంది. ఉన్న కొద్ది పాత్రలనీ నేర్పుతో తీర్చిదిద్దిన రచయిత్రి యీ తొలి నవలని, వైకింగ్– పామెలా డొమన్ బుక్స్, 2017లో ప్రచురించింది. - కృష్ణ వేణి -
వివాహిత మృతి.. గ్రామంలో ఉద్రిక్తత
వరికుంటపాడు: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో కోనేపల్లి కృష్ణవేణి (24) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు చెబుతుండగా, ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, దీనికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన కోనేపల్లి వెంకట్రామిరెడ్డి ఐదేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో ఎచ్చెర్లలో బేల్దారి పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో చత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన కృష్ణవేణి కుటుంబం ఆ ప్రాంతంలో బేల్తారి పనులు చేసేవారు. వెంకట్రామిరెడ్డి కృష్ణవేణితో పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి మూడేళ్ల హిమాయత్రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. ఏడాదిన్నర క్రితం వెంకట్రామిరెడ్డి భార్యను తన స్వగ్రామమైన తిమ్మారెడ్డిపల్లిలోని కుటుంబసభ్యుల వద్ద వదిలి ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. కొంత కాలానికి కృష్ణవేణిని ఆమె భర్త కుటుంబసభ్యులు ఇంటినుంచి గెంటివేశారు. దీంతో ఆమె బెంగళూరులోని తన సోదరి ఇంట్లో ఉంటోంది. వారంరోజుల క్రితం వెంకట్రామిరెడ్డి సౌదీ నుంచి వచ్చాడు. ఆదివారం ఉదయం కృష్ణవేణి అత్తవారి ఇంటికి వచ్చింది. అదేరోజు సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆమె ఉరేసుకుని చనిపోయినట్లుగా కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు వారికి చెప్పారు. దీంతో గ్రామస్తులు ఇంట్లోకి వెళ్లి కృష్ణవేణి శవాన్ని పరిశీలించి హత్య చేసినట్లుగా అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉదయగిరి సీఐ ఎంవీ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించి పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి వెళ్లారు. రాళ్లతో దాడి సోమవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వెంకట్రామిరెడ్డి కుటుంబసభ్యులను అరెస్ట్ చేసి మృతరాలి బంధువులు వచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళితే ఒప్పుకోమని చెప్పారు. ఓ దశలో పోలీసుల వైఖరిపై గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆ ఇంటిపై రాళ్లతో దాడిచేశారు. విషయం తెలుసుకున్న కావలి డీఎస్పీ రఘు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగారు. రాత్రి పొద్దుపోయే వరకూ మృతదేహాన్ని గ్రామస్తులు తీసుకెళ్లనివ్వలేదు. పెద్దసంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. తహసీల్దార్ జి.శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా మృతిరాలి భర్త, అత్తామామ, బావ, తోడికోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఇంతకీ నీ కథ ఏమిటి?
ఒక పేరుండని అమెరికన్ పట్టణంలో, బేస్మెంట్లో ఉన్న ఇండియన్ వీసా ఆఫీసు అది. మధ్యాహ్నం మూడు అవుతుంది. ఉన్నట్టుండి భూకంపం వస్తుంది. తొమ్మిదిమంది అక్కడ చిక్కుకుంటారు. ఆఫీసులోకి నీరు రావడం మొదలవుతుంది. ఫోన్లు పని చేయడం మానేస్తాయి. అక్కడ ఉన్నవారందరూ, భిన్నమైన నేప«థ్యాలు, సంస్కృతులకు చెందినవారు. వారిలో ఉమ సిన్హా కూడా ఉంటుంది. అమెరికాలో పాతికేళ్ళు ఉండి, స్వస్థలం అయిన కోల్కతా తిరిగి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పోరితే, అయిష్టంగానే వీసా కోసం వచ్చిన ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్థిని ఉమ. ఆ తొమ్మండుగురిలో, ప్రతీ ఒక్కరూ మిగతావారి ‘రూపురేఖల, కుల/మత భిన్నత్వాల ఆధారంగా’ తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ‘ఈ పట్టణంలో భిన్నమైన జాతులవారు ఒకే చోట యాదృచ్ఛికంగా కలిసి ఉండటం అసాధారణమైనదేమీ కాదు. అయినప్పటికి, ఇదేదో యూఎన్ సమ్మిట్లా అనిపిస్తోంది’ అనుకుంటుంది ఉమ. అందరిలోనూ మొదట గాభరా, ఆ తరువాత స్వార్థం మొదలయినప్పుడు – ‘బతికి ఉండాలంటే ఒకే ఒక్క దారి మితంగా ఉన్న తిండీ, నీరు పంచుకోవడమే’ అంటూ, ఆర్మీలో పని చేసిన ఆఫ్రికన్ అమెరికన్ అయిన ‘కామెరాన్’ ఆ గుంపుకి నాయకత్వం వహిస్తాడు ‘వన్ అమేజింగ్ థింగ్ నవలలో. తను చదువుతున్న ఛాసర్ రాసిన, ‘కాంటర్బరీ టేల్స్’ పుస్తకం వల్ల ప్రేరణ పొందిన ఉమ అందరికీ సూచిస్తుంది: ‘ప్రతీ ఒక్కరికీ ఏదో కథ ఉండే ఉంటుంది. కనీసం ఒక ‘ఆశ్చర్యకరమైన సంగతి’ అయినా ఎదుర్కోకుండా ఎవరి జీవితమూ సాగదు. మీ మీ కథలు చెప్తే, సమయం గడుస్తుంది. భయమూ తగ్గుతుంది’. మిగిలిన వారు ముందు ప్రతిఘటించినప్పటికీ, కథలు మొదలవుతాయి. ‘ఉమ ఎప్పుడూ అంతే. అపరిచితుల జీవితాలపైన అనవసరమైన ఆసక్తి పెంచుకునే యువతి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, నేలమీదున్న ఇళ్ళని చూసి వాటి నివాసుల బతుకులను ఊహించుకునేది’ అంటారు రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని. అందరూ తమ ప్రేమ, పెళ్ళి, కుటుంబం గురించిన కథలు చెప్తారు. వారి జీవితాల్లో ఉన్న సిగ్గు పడవలసిన రహస్యాలూ, అంతర్గత సంఘర్షణలూ, అనుభూతులూ బయట పడటం మొదలవుతుంది. గుంపు చేయవలసినదల్లా వాటిని వినడమే. ఏ ఒక్క కథ మీదా దృష్టి నిలపదు నవల. కథలూ విశేషమైనవి కావు. ఆ గుంపులో ఒకరైన జియాంగ్, ‘మనం పూర్తిగా మారిపోయి ఉండి కూడా దాన్ని గుర్తించకపోవచ్చు. మనం ఎదుర్కొన్న బాధాకరమైన అనుభవాల వల్ల మనం రాయిగా మారామనుకుంటాం. కానీ, మన జీవితాల్లోకి ప్రేమ నెమ్మదిగా ప్రవేశించి, లోలోపలే మనల్ని తునకలుగా చేసే గొడ్డలిగా మారుతుంది’ అన్న మాటలు, మిగతావారి మీద ప్రభావం చూపినప్పుడు, ఆ జీవన్మరణపు పరిస్థితిలో తాము చెప్పిన కథల వల్లే, తమని తాము అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు వారు. సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారనుకున్న తల్లిదండ్రుల్లో, తండ్రి తనకి ఫోన్ చేసి తల్లికి విడాకులిస్తున్నానని చెప్పాడన్న తన కథను ఉమ చెబుతుంది. కథలు పూర్తయేటప్పటికి రక్షణ దళం వచ్చిందని తెలుస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరి నేపథ్యానికున్న కులం, ప్రాపంచిక దృక్పథం, చర్మపు రంగు కూడా మూలపడతాయి. వారి కథల ద్వారానే ఆ పాత్రలను నిర్వచిస్తారు దివాకరుని. అందరి దృష్టికోణాలకి ప్రామాణికతను ఆపాదిస్తారు. కథలు మనకి సాధికారతనిచ్చి, విముక్తి కలిగించి మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం ఇస్తాయంటారామె. పుస్తకంలో ఉన్న శైలి స్పష్టమైనది. భాష సరళమైనది. నిర్దిష్టమైన ముగింపేదీ ఉండని ఈ నవలని ‘హేషెట్ బుక్స్’ 2010లో ప్రచురించింది. - కృష్ణ వేణి -
విసిగి.. వేసారి !
తెనాలి: తన 25 సెంట్ల భూమి సర్వేకు 2007 నుంచి రెవెన్యూ అధికారులు కాళ్లరిగేలా తిప్పుతున్నారని కృష్ణవేణి అనే మహిళ స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ‘మీకోసం’లో తన గోడును మరోసారి ఆర్డీవోకు విన్నవించుకుందామని ఆమె గుంటూరు నుంచి వచ్చారు. తీరా ఆర్డీవో జి.నరసింహులు బదిలీపై వెళ్లారని తెలిసి నిరాశకు లోనయ్యారు. తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ఏళ్లుగా తిరగడమే తనకు సరిపోతోందనీ, సర్వేలకని, పట్టాదారు పుస్తకాలకని, కిందిస్థాయి ఉద్యోగులకని, ఖర్చులకనీ ఇప్పటికే లక్ష రూపాయలకు పైగా ఖర్చయ్యాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... తెనాలి రూరల్ మండలం గుడివాడలో సర్వేనంబరు 148సి–5బిలో 25 సెంట్ల మాగాణి భూమి కృష్ణవేణి తండ్రి కంచర్ల నాగేశ్వరరావు పేరిట ఉంది. 2007 నుంచి సర్వే చేయించాలని కోరుతూ వచ్చారు. సాధ్యపడలేదు. ఆయన మరణించాక వీలునామా ప్రకారం తన పేరును అడంగల్లో చేర్చి, పట్టాదారు పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేశారు. ఎలాంటి స్పందన లేకపోవటంతో జిల్లా కలెక్టరును కలిశారు. జిల్లా సర్వే, లాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.కెజియాకుమారి కూడా ఆర్డీవోకు రిఫర్ చేశారు. ఈ క్రమంలోనే కృష్ణవేణి 2015లో 20 సెంట్ల భూమిని వేరొకరికి విక్రయించారు. అడంగల్లో నమోదు కానందున అగ్రిమెంటు ప్రకారం వారు రూ.25 వేల అడ్వాన్సు మినహా డబ్బు మొత్తాన్ని చెల్లించలేదు. ఇదిలా ఉంటే, వీలునామాను పరిగణనలోకి తీసుకోవాల్సిన మండల తహసీల్దారు ఆ భూమి వివాదంలో ఉందనీ, కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలంటూ ఇటీవల నివేదించారని కృష్ణవేణి చెప్పారు. ప్రస్తుతం ఆ భూమి ఇతరుల స్వాధీనంలో ఉందనీ, 1987లోనే వారి పెద్దలకు కృష్ణవేణి తండ్రి నాగేశ్వరరావు విక్రయ అగ్రిమెంటు రాశారనీ, మళ్లీ ఇప్పుడు వారి వారసుడితోనే కృష్ణవేణి విక్రయ అగ్రిమెంటు చేసుకున్నారని తహసీల్దారు ఆ నివేదికలో పేర్కొన్నారు. అడ్వాన్సు రూ.25 వేలు మినహా మిగిలిన రూ.4.75 లక్షలు చెల్లించనందున వివాదం నెలకొందని, కోర్టులో పరిష్కరించుకోవాలని హితవు చెప్పారు. 1987లో విక్రయ ఒప్పందం ఉంటే ఎందుకు రిజిస్టరు చేసుకోలేదు? అలాంటి ఒప్పందం ఉంటే వారి వారసులే ఈ భూమిని తన దగ్గర ఎందుకు కొంటారు? అడంగల్లో నమోదు కానపుడు పూర్తి డబ్బులు ఎందుకు చెల్లిస్తారు? అసలు వీలునామా ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇవన్నీ ఎందుకు? అనే కృష్ణవేణి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పటం లేదు. గుడివాడ గ్రామ అధికార పార్టీ నేత జోక్యంతో మండల తహసీల్దారు ఈవిధంగా చేశారని కృష్ణవేణి ఆరోపించారు. విసిగివేసారి తక్కువ ధరకు భూమిని అమ్మేసుకొనేలా చేయాలనే కుట్ర జరుగుతోందన్న సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు. ‘మీకోసం’లో మూడు అర్జీలు... ‘మీకోసం’లో అర్జీలను ఆర్డీవో కార్యాలయ ఏవో ఎ.చెంచులక్ష్మి స్వీకరించారు. రూరల్ మండలం బుర్రిపాలెంలో తన 18 సెంట్ల స్థలంలో రోడ్డు నిమిత్తం వదిలిన 3 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందనీ, విచారించి న్యాయం చేయాలని శాఖమూరి సామ్రాజ్యం అర్జీనిచ్చారు. అమృతలూరు మండలం మూల్పూరులో తన పొరుగు రైతు పసుపులేటి శ్రీను పంటకాలువ మూసేసి, తన పొలానికి నీళ్లు రాకుండా చేస్తున్నారని భవనాసి ఆశీర్వాదం అర్జీలో ఆరోపిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ బాలాజీరావుపేటలో ప్రభుత్వ ఖాళీస్థలంలో రేకుల షెడ్డు వేసుకుని గత 30 ఏళ్లుగా జీవిస్తున్న తనకు పట్టాను ఇప్పించాలని కోరుతూ పాలపర్తి మహాలక్ష్మి అనే మహిళ అర్జీనిచ్చారు. విద్యుత్ సమస్యలపై రూరల్ మండలం చావావారిపాలెం నివాసి భవతుల రవి, అమృతలూరు మండలం యడవూరు గ్రామస్తులు ఇచ్చిన అర్జీలను ‘మీకోసం’లో ఉన్న విద్యుత్ డీఈఈకి చర్యల నిమిత్తం ఇచ్చారు. వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
నా బిడ్డను చంపేశారు...మమ్మల్నీ చంపేస్తారు
నా బిడ్డను చంపేశారు. మమ్మ ల్నీ చంపేస్తారు. భయపడి వేరే ఇంట్లో తలదాచుకుంటున్నాం. ప్రాణభయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వారూ పట్టించుకోలేదు. నా కొడుకును చంపేసినోళ్లే మా చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడేం చేస్తారోనని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని గడుపుతున్నాం. నోట్ల మార్పిడిలో నా కొడుకును ఓ పావుగా వాడుకున్నారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు, బయటకు తీసుకువెళ్లి చంపేశారు. చావును ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు అనుమానాస్పద మృతిగా చెబుతున్నప్పటికీ నమ్మకం కలగడం లేదు. నా బిడ్డ చావుకు నలుగురు వ్యక్తులు కారణం, వారి పేర్లతో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. దీంట్లో అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేల ప్రమేయం ఉంది. ఇప్పుడా వ్యక్తులే మమ్మల్ని కూడా చంపేసేలా ఉన్నారు. పోలీసులకు మొర పెట్టుకున్నాం. ఓ న్యాయవాదిని ఆశ్రయించాం. కానీ న్యాయం జరగలేదు. ఎవరికి చెప్పాలన్నా భయమేస్తోంది. అందుకే మీడియా ముందుకు వచ్చాం...కాపాడండి. – 27 ఏళ్ల వయసున్న కుమారుడిని పోగొట్టుకున్న కర్రి కృష్ణవేణి కన్నీరుమున్నీరు... సాక్షి ప్రతినిధి, కాకినాడ : పెదపూడి మండలం అచ్యుతాపురత్రయానికి చెందిన కర్రి నాగేశ్వరరావు, కృష్ణవేణికి ఇద్దరు పిల్లలు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యం కోసమని తిమ్మాపురంలో ఓ ఇంటిలో అద్దెకుంటున్నారు. నాగేశ్వరరావు, కృష్ణవేణి దంపతుల రెండో కుమారుడు కర్రి దుర్గా ప్రసాద్ తొలుత కేబుల్ టీవీలో పనిచేసేవారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు. కొంతకాలం క్రితం ఈయన భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా నోట్ల రద్దు తర్వాత కొంతమంది వ్యక్తులతో కలిసి నోట్లు మార్పిడి చేసేవారు. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కూడా వీరిని వినియోగించుకుని నోట్లు మార్పిడి చేయించుకున్నారన్న వినికిడి ఉంది. ఈ క్రమంలో వ్యవహారాలు ఏరకంగా బెడిసికొట్టాయో తెలియదు గానీ ఈ ఏడాది జనవరి 24వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లిన దుర్గాప్రసాద్ తిరిగి రాలేదు. ఆ రోజు సాయంత్రం దుర్గా ప్రసాద్ స్నేహితుడికి దుర్గా కుటుంబీకులు ఫోన్ చేసి అడిగారు. దుర్గా ప్రసాద్ ఊరు వెళ్తున్నాడని, బట్టలు, ఛార్జర్ తనను తీసుకు రమ్మన్నాడని, సామర్లకోట రైల్వే స్టేషన్కు వెళ్తున్నానని సదరు స్నేహితుడు చెప్పాడు. ఆ తర్వాత రెండు రోజులు దుర్గా ప్రసాద్ స్నేహితులు ఇంటికొచ్చి అక్కడ బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు. తన కుమారుడు ఎంతకీ రాలేదని అదే నెల 27వ తేదీన దుర్గా ప్రసాద్ కుటుంబీకులు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన దుర్గా ప్రసాద్ ‘తాను ఆపదలో ఉన్నానని, డబ్బు తినేశాననే అనుమానంతో నన్ను బంధించారని, మన ఇల్లును ఫలానా వ్యక్తుల పేరున రాసి ఇచ్చేయాల’ని అదే ఫోన్లో ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. ఎవరి పేర్లైతే దుర్గా ప్రసాద్ చెప్పాడో ఆ నలుగురు అదే నెల 28, 29వ తేదీల్లో ఇంటికొచ్చి ఇల్లును తమ పేరున రిజిస్ట్రేషన్ చేసేయాలని సతాయించడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే దుర్గా ప్రసాద్ను చంపేస్తామని బెదిరించారు. ఫిబ్రవరి 3వ తేదీన దుర్గా ప్రసాద్ నేరుగా ఫోన్ చేసి, ‘మన ఇల్లును వారి పేరున రిజిస్ట్రేషన్ చేసేయ’మని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అదే రోజున బెదిరింపులకు దిగినవారి పేరున రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఎటువంటి బాకీ లేదని లిఖిత పూర్వకంగా> ఆ నలుగురు వ్యక్తులు రాసిచ్చారు. ఆ వెంటనే తన కుమారుడ్ని ఇంటికి పంపించేయండని ఆ వ్యక్తులను కోరారు. వణికిపోతున్న కుటుంబీకులు అటు తాడేపల్లి గూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి న్యాయం జరగలేదని దుర్గా ప్రసాద్ కుటుంబీకులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. మధ్యలో ఒక న్యాయవాది వద్దకు వెళ్లి చెప్పుకున్నా...ఫలితం లేదు సరికదా కొంత డబ్బు గుంజేసి పలాయనం చిత్తగించాడని దుర్గా ప్రసాద్ తల్లి కృష్ణవేణి రోదిస్తూ చెబుతున్నారు. పెద్ద వ్యక్తులు (మంత్రి, ఎమ్మెల్యేలు) ఉండటంతో తమనేం చేస్తారేమోనన్న భయంతో దుర్గా ప్రసాద్ కుటుంబీకులు వణికిపోతున్నారు. ఎవరూ న్యాయం చేయడం లేదని, కనీసం మీరైనా లోకం దృష్టికి తీసుకురావాలని, మేలు జరిగేలా చూడాలని కృష్ణవేణి ‘సాక్షి ప్రతినిధి’ని కలిసి మొరపెట్టుకున్నారు. వాస్తవమేంటో నిగ్గు తేల్చాలి అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఎవరిపైనైనా అనుమానాలు వ్యక్తం చేస్తే తప్పనిసరిగా ఆ దిశగా విచారణ జరపాలి. అనుమానాల్నే క్లూస్గా తీసుకుని విచారణ చేస్తే వాస్తవమేంటో బయటికొస్తుంది. మృతుడు దుర్గాప్రసాద్ కుటుంబీకుల ఆరోపణల్లో పస ఎంత ఉందో స్పష్టమవుతుంది. ముఖ్యంగా నోట్ల మార్పిడి వ్యవహారంతో సంబంధాలుండటంతో ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలున్నారని వెనక్కి తగ్గితే ఇలాంటి బాధితులు బలి అయిపోవల్సి వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దుర్గాప్రసాద్ కుటుంబీకులకు రక్షణ కల్పించడమే కాకుండా వారి అనుమానాలను నివృత్తి చేయవల్సిన అవసరం ఉంది. చనిపోయినట్టు ఫోన్ కాల్... రెండు రోజుల్లో వచ్చేస్తాడని చెప్పిన మూడో రోజే (ఫిబ్రవరి 6వ తేదీ) తాడేపల్లిగూడెం పోలీసుల నుంచి ‘దుర్గా ప్రసాద్ చనిపోయాడని, నవాబుపాలెం అనే గ్రామంలో మృతదేహం ఉందని’ ఫోన్ వచ్చింది. ఎవరైతే ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారిలో ఓ వ్యక్తితో కలిసి దుర్గా ప్రసాద్ కుటుంబీకులంతా తాడేపల్లిగూడెం వెళ్లారు. ‘తన చావుకు ఎవరూ కారణం కాదని’... అని చెప్పి సూసైడ్ నోట్ రాసి పెట్టాడని దుర్గా ప్రసాద్ కుటుంబీకుల దృష్టికి అక్కడి పోలీసులు తీసుకొచ్చారు. సదరు వ్యక్తే పోలీసులతో మాట్లాడి, సంతకాలు చేయించి, మృత దేహాన్ని తీసుకొచ్చేసేలా చేశాడు. రెండు రోజుల అనంతరం ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు వచ్చి, మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కనిపించడం మానేశారు. జరిగిన పరిణామాలన్నీ గమనించాక దుర్గా ప్రసాద్ కుటుంబీకులు తాడేపల్లిగూడెం వెళ్లి, నలుగురిపై అనుమానం ఉందని, వారే చంపేసి ఉంటారని, సూసైడ్ నోట్లో ఉన్న అక్షరాలకు ... దుర్గాప్రసాద్ రాసే అక్షరాలకు తేడా ఉందని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి సదరు వ్యక్తులు వెంబడిస్తూ, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండటంతో ప్రాణభయం ఉందని తిమ్మాపురంలో ఉన్న ఇంటిని ఖాళీ చేసి, వారి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ తలదాచుకుంటున్నారు. ఇదే విషయమై జిల్లా ఎస్పీ విశాల్ గున్నీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని సదరు ఫిర్యాదులో అభ్యర్థించారు. ఫిర్యాదు వచ్చింది మృతుడు దుర్గాప్రసాద్ కుటుంబీకుల నుంచి ఫిర్యాదు వచ్చింది. దాన్ని కాకినాడ రూరల్ సీఐకి రిఫర్ చేశాను. –విశాల్ గున్నీ, జిల్లా ఎస్పీ అనుమానాస్పద మృతిగా విచారణ చేస్తున్నాం తాడేపల్లిగూడేం మండలం నవాబుపాలెంలో మృతి చెందిన దుర్గా ప్రసాద్ కేసుపై విచారణ జరుపుతున్నాం. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ వద్ద నుంచి మాకు సమాచారం వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదులో ఆరోపించిన వ్యక్తులను కూడా పిలిచి విచారించాం. వారి స్టేట్మెంట్ రికార్డు చేశాం. మృతుడికి చెందిన ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఫోరెన్సిక్ నుంచి రావల్సి ఉంది. సూసైడ్ నోట్లో అక్షరాలు దుర్గాప్రసాద్వి కావని మృతుడి తల్లిదండ్రులు చెప్పారు. కాకపోతే, అందుకు తగ్గ ఆధారాలు అడిగాం. మృతుడు తల్లిదండ్రులు సహకరించాల్సిన అవసరం ఉంది. ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ముందుకెళ్తాం. – చంద్రరావు, ఎస్ఐ, తాడేపల్లి గూడెం -
కొవ్వొత్తి చుట్టూ తిరిగే చిమ్మట జీవితాలు
పాకిస్తానీ రచయిత మొహ్సీన్ హమీద్ తొలి నవల అయిన, ‘మోథ్ స్మోక్’ 1998లో లాహోర్లో మండుతున్న వేసవిలో, ఒకానొకప్పుడు జూనియర్ బ్యాంకర్ అయిన దారాషికో (దారూ) తను చేయని హత్యకి, జైల్లో కూర్చునుండగా ప్రారంభం అవుతుంది. పేదింటి దారూ ధనిక కుటుంబానికి చెందిన ఔరంగజేబ్ (ఓజీ)షాకి స్నేహితుడు. దారూ బాల్యం కాలేజీలో చేరేంతవరకూ సామాన్యంగానే గడుస్తుంది. తరువాత అతని స్నేహితులు ఉన్నత విద్యకోసం అమెరికాకు వెళ్ళిపోతారు. ఓజీ తిరిగి అమెరికా నుండి వెనక్కి రావడంతో దారూ అభద్రతాభావం ఎక్కువవుతుంది. తనకి లేకపోయిన ప్రతీదీ ఓజీ వద్ద ఉంటుంది. పెజొరో కారు, మంచి ఉద్యోగం, అందమైన భార్య ముంతాజ్, కొడుకు. వాళ్ళవల్ల దారూ తిరిగి ఆ ధనిక వృత్తంలోకి అడుగుపెట్టి , బ్లాక్ లేబెల్ విస్కీలు తాగే పార్టీకి వెళ్ళిన మర్నాడే అతని ఉద్యోగం పోతుంది. అదే దారూ అంతానికి ప్రారంభం. ముంతాజ్ పట్ల అతనికున్న కాంక్షా, అతని హెరాయిన్ సేవనం హెచ్చవుతుండగా, అతని సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతుంటాయి. ‘నేను ఆమె పట్ల ఆకర్షితుడైనట్టే ఆమె కూడా అయింది. ముంతాజ్ అనే కొవ్వొత్తి చుట్టూ తిరిగే చిమ్మటని నేను. ఆమె కూడా కొవ్వొత్తి అయిన నా చుట్టూ తిరిగే చిమ్మటే’ అంటాడు దారూ. నవల శీర్షిక– దారూ, ముంతాజ్ మధ్యన పెంపొందిన ప్రేమకి రూపకం. కొవ్వొత్తి చుట్టూ ప్రాణాంతకమైన మోహంతో తిరిగి, పొగగా మారి స్వీయ నాశనాన్ని ఎదురుకునే చిమ్మటని ఉటంకిస్తుంది. నవల్లో అధికభాగం దారూ దృష్టికోణంతోనే ఉన్నదైనప్పటికీ, అతనికి డ్రగ్స్ సరఫరా చేసే రిక్షా అతనితో సహా నవల్లో ఉన్న పాత్రలందరి ఆలోచనా ధోరణులూ పాఠకులకు పరిచయం చేయబడతాయి. తను ఎందుకు ‘మంచి/చెడ్డ వ్యక్తో’ అని ప్రతీ పాత్రా వివరిస్తుంది. లంచగొండి అవడం ఎంత అవసరమో అని ఓజీ, భర్త ఆప్త మిత్రుడితో ఎందుకు సంబంధం పెట్టుకోవలిసి వచ్చిందో అని ముంతాజ్, తను డ్రగ్స్ తీసుకోవడమేకాక అమ్మే దశకి కూడా ఎందుకు చేరుకున్నానో అని దారూ చెప్తారు. జీవితం గిరగిరా తిరుగుతూ చేతుల్లోంచి ఎలా జారిపోగలదో అర్థం అవుతుంది పాఠకులకి. తన్ని తాను లోకువ చేసుకుంటూ వినిపించే దారూ స్వగతాలకి అదనంగా, ఇతర గొంతులూ వినిపిస్తాయి. ‘డ్రమెటిక్ మొనొలోగ్’ అన్న ప్రక్రియని నవల్లో విరివిగా ఉపయోగించారు రచయిత. నవల పాకిస్తాన్ ధనిక వర్గపు దురాశా, అభద్రతనీ కనపరిచి– ధనిక వర్గానికీ, పేదవారికీ ఉన్న వ్యత్యాసాన్ని కూడా విశదపరుస్తుంది. పాత్రలని సాంప్రదాయికమైన నైతిక చట్రంలో చూపకుండా– వైరుధ్యం, వంచనతో నింపారు హమీద్. అమెరికన్ పదజాలాన్ని భారీగా ఉపయోగించారు. నవల్లో సమకాలీన పాకిస్తాన్ కనిపించినప్పుడు, ఇది నిజంగా ప్రపంచానికి తెలిసిన దేశమేనా! అన్న అనుమానం కలుగుతుంది. పుస్తకంలో ఉన్న ఏ పాత్రా అనవసరమయినది అనిపించదు. పాకిస్తానుకీ, ఇండియాకీ మధ్యనున్న పరమాణు సంబంధమైన పోటీ అన్న ప్రస్తావన పలుమార్లు కనిపిస్తుంది. నవల– మానవ ఘర్షణలు, ప్రేమ, ద్రోహం, ఓటమి, అసమానతల గురించినది. కథనంలో చమత్కారం, నిష్కల్మషతా కనబడతాయి. పుస్తకం బెట్టీ ట్రాస్క్ అవార్డు గెలుచుకుని, పెన్/హెమింగ్వే అవార్డుకి ఫైనలిస్టుగా ఎంచుకోబడింది. దీని ఆధారంగా, అజ్ఫర్ అలీ దర్శకత్వంతో తీసిన పాకిస్తానీ ఫిల్మ్ ‘దాయిరా’(వృత్తం) వచ్చింది. రాహుల్ బోస్తో తీయాలనుకున్న హిందీ సినిమా ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. యు. కృష్ణ వేణి -
యాంత్రికంగా బతకడమూ అవసరమైనప్పుడు
కాథరిన్ లేసీ రాసిన ప్రప్రథమ నవల ‘నోబడీ ఈజ్ ఎవర్ మిస్సింగ్’లో 28 ఏళ్ళ వయసున్న కథకురాలైన ఎలిరియ రయిలీది ప్రధాన పాత్ర. బెనార్డ్ గ్రేడ్యుయేట్. టీవీ సీరియళ్ళు రాస్తుంటుంది. మనహాటన్లో ఉంటుంది. న్యూయార్క్ నుండీ న్యూజెర్సీకి వన్ వే టికెట్టు కొనుక్కుని ఆరేళ్ళ కిందట పెళ్ళి చేసుకున్న ప్రొఫెసర్ అయిన భర్తకు కూడా ఒక్క ముక్కా చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఎవరికీ ఫోన్ చేయదు, మెయిల్ చేయదు. భర్తని ‘భర్త’ అని, లేక ‘ప్రొఫెసర్’ అని తప్ప, పేరుతో ప్రస్తావించదు. న్యూయార్కులో జరిగిన ఒక కవి సమ్మేళనంలో వర్నర్ అనే పేరున్న కవి ఆమెకు తన న్యూజెలాండ్ చిరునామా కాగితం మీద రాసిస్తాడు. న్యూజెలాండ్లో ఎలిరియ వీపు మీద బ్యాగ్ తగిలించుకుని అపరిచితులని లిఫ్టు అడుగుతూ, తల దాచుకోడానికీ, తినడానికీ చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదించుకుంటుంది. లేనప్పుడు పొలాల్లో, అడవుల్లో, పార్కుల్లో పడుకుంటుంది. భయప్రమాదాలని ఎదుర్కుంటూ దేశం తిరుగుతుంటుంది. తన్ని తాను ‘అడవి మృగం’ అనుకుంటుంది. నిజానికి ఇలా తిరగడానికి కారణం ఆమె తన నుంచి తానే పారిపోవడమే కాక, తనకున్న భయానికి గల మూలకారణాన్ని వెతుక్కోవడం కూడా. తను ‘ప్రతీదీ తప్పుగా చేసింది’ అన్న భయం. ఎలిరియ మనసులో జరిగే అంతర్గత పోరాటం గురించి పాఠకులకి అర్థం అవుతూనే ఉంటుంది. వర్నర్ ఇంటికి ఆమె చేరేటప్పటికే ఈ చిన్న నవలలో వంద పేజీలు దాటతాయి. అప్పటికే, పాఠకులకు ఆమె గురించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. వయస్సు తేడా ఉన్న భర్తతో ఆమెకి పెళ్ళి జరిగిన అసాధారణమైన పరిస్థితులు, తను పొరపాటు చేసినప్పుడల్లా తనేదో చిన్నపిల్లయినట్టు, ‘ఏం? నోరు పెగలడం లేదా!’ అని మందలించే భర్త, తను గడిపే జీవితం తనదే అనిపించని భావన... తల్లి దత్తత తీసుకున్న కొరియా అమ్మాయి రూబీ ఆత్మహత్య, తనకన్నా రూబీని ఎక్కువ ప్రేమించే మద్యానికి బానిస అయిన తల్లితో తనకున్న సంతోషం లోపించిన సంబంధం... వర్నర్ ఆమెకొక గది కేటాయించి మొదట ఆమె పట్ల ఆకర్షితుడైనప్పటికీ, కొన్నాళ్ళ తరువాత ఆమెని భరించడం చాలా బాధాకరం అనుకుని ఆమెని రోడ్డుమీద వదిలేస్తాడు. ఆఖర్న ఏ ప్రేరణా, యోచనా, పరిష్కారమూ లేకుండానే ఇంటికి తిరిగి వెళ్తుంది. నెమ్మది నెమ్మదిగా ఏఏ పరిస్థితుల్లో, ఎంత యాంత్రికంగా ప్రవర్తించాలో అని నేర్చుకుంటుంది. చైతన్య స్రవంతిలో నడిచే ఈ నవల ఎలిరియ తనలో తను పడే తర్జన భర్జన గురించినది. సంభాషణలని సూచించడానికి కొటేషన్ మార్క్స్ చోట ఇటాలిక్స్ ఉపయోగిస్తారు రచయిత్రి. నవలలో కనబరిచిన హాస్యం వ్యంగ్యంగా ఉండి, బాధ కలిగిస్తుంది. శైలి స్ఫుటంగా, కచ్చితంగా ఉంటుంది. కథ ప్రారంభం పాఠకులు కథకురాలితో సంభాషిస్తూ ఉండి, వారికి ముందే సగం కథ తెలిసినట్టు అనిపించేలా ఉంటుంది. వ్యక్తిగత సంక్షోభం అనుభవిస్తున్న ఒక యువతి యొక్క అధివాస్తవిక చిత్రం ఈ పుస్తకం. నవల శీర్షిక, జాన్ బెరీమాన్ కవిత ‘డ్రీమ్ సాంగ్ 29’ నుంచి తీసుకోబడినది. ఫర్రార్, స్ట్రౌస్ మరియు జిరూ కంపనీ ఈ నవలని 2014లో ప్రచురించింది. 2016లో రచయిత్రి కాథరీన్ లేసీ ‘వైటిన్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిక్షన్’ అవార్డు గెలుచుకున్నారు. కాథరిన్ లేసీ, రచయిత్రి -కృష్ణ వేణి -
అన్న... తమ్ముడు... క్రికెట్!
కొత్త బంగారం అరవింద్ అడిగా ముంబయిలో నివసిస్తున్న కుమార్ల కుటుంబంతో నవల ప్రారంభం అవుతుంది. 14 ఏళ్ల రాధాకృష్ణ (రాధ), 13 ఏళ్ల మంజునాథ్ (మంజు), తండ్రి మోహన్! ఆయన తన కొడుకులను పేరొందిన క్రికెటర్లుగా తయారు చేయడానికి, కర్ణాటక నుండి ముంబయి మురికివాడకు వస్తాడు. కుర్రాళ్లు తమ బాల్యాలను ఆరోగ్యం, శుభ్రత కోసం త్యాగం చేయవలసి వచ్చినప్పుడు, తండ్రిని అసహ్యించుకుంటారు. భార్య వదిలేసి పోతుంది. మోహన్ రైల్లో ప్రయాణికులతో చెప్తుంటాడు: ‘నేను అద్భుతమైన చట్నీలమ్ముతాను. రోజుకి 24 రకాలైన చట్నీలు. పుదీనా, వెల్లుల్లీ, మిరపా, తీపీ. అన్నీ నూరు శాతం శాకాహారం’. అబ్బాయిలు టీనేజీలోకి ప్రవేశించినప్పుడు, ముంబయి క్రికెట్ అసోసియేషన్ కోసం పని చేసే ‘టామీ సర్’ కుర్రాళ్ళ ప్రతిభ గుర్తించి, స్పాన్సర్షిప్ ఇప్పిస్తాడు. ఆ డబ్బుని మితంగా ఖర్చుపెడుతూ కుమార్ల కుటుంబం చెంబూర్కు మారుతుంది. మంజూ, రాధా క్రికెట్ ఆడుతున్నప్పుడు, వారి జట్టులో ఉండే జావెద్ అన్సారీ వాళ్ళకి పోటీగా నిలబడతాడు. అన్నదమ్ములకీ తండ్రికీ మధ్య ఘర్షణ ఎక్కువవుతూ ఉంటుంది. సెలెక్షన్ డే సమీపిస్తున్నప్పుడు, తనవల్ల ఇతరులకి కావలసినదేమిటో, తనకోసం తాను కోరుకున్నదేమిటో అని పరిశీలించుకునే అవసరం పడుతుంది మంజుకి. ఇక, సెలెక్షన్ డే నాడు తండ్రి నమ్మకం పెట్టుకున్న రాధ ఎంపికవక, క్రికెట్ ఆడటం ఇష్టం లేని మంజు ఎంపికవుతాడు. అన్నదమ్ముల మధ్య ఈర్షా్యద్వేషాలు పుడతాయి. మంజుకీ, జావెద్కీ ఉన్న సంబంధం లైంగిక రూపం దాలుస్తుంది. పుస్తకంలో స్త్రీలు ఉండరు. వారి గురించిన క్లుప్తమైన ఉదహరింపులుంటాయంతే. నవలలో అధికభాగం తోబుట్టువుల మధ్య పోటీ గురించినదే. పుస్తకం, క్రికెట్లో పేరు ప్రఖ్యాతుల కోసం మార్గం వెతకడం కన్నా, ఆ క్రీడవల్ల మూసుకోబడిన ఇతర మార్గాల గురించినది. తన పాత్రలకున్న భయాలనీ, మనఃస్థితులనీ, తమకి తాము నిర్మించుకున్న వారి ఖైదులనీ– రచయిత వారి అంతర్గత కంఠాల లోపలకీ, బయటకీ త్వరితంగా ప్రయాణిస్తూ, వర్ణిస్తారు. చిన్న పాత్రలకి కూడా రచయిత విషాదాన్నీ, గంభీరతనీ ఆపాదిస్తారు. వ్యంగ్య చిత్రాలు లేవు నవల్లో. ఇతివృత్తం ఆహ్లాదకరమైనది. 1983 అనంతరపు క్రికెట్ చుట్టూ కథ అల్లారు రచయిత. నవల నేపథ్యం క్రికెట్ మీదనున్న భారతదేశపు ఆరాధన. ఆ క్రీడ మీద సవిమర్శక పరిశీలనతోనే నడిచే నవల ఇది. క్రికెట్ అంటే మనకి దేవుడు, అది జాతీయ వ్యామోహమే కాక ఒక మతంలా కూడా తయారయిందన్న ఉదహరింపులున్నాయి. పుస్తకం, లైంగిక మేల్కొలుపు గురించినది కూడా! రచయిత రాసిన విధానం వల్ల కథను ఆస్వాదించాలంటే పాఠకులకి క్రికెట్ గురించి తెలియాల్సిన అవసరం ఉండదు. క్రీడల మీద రాయబడిన ఇతర పుస్తకాల్లాగే ఇక్కడ కూడా, క్రికెట్ అన్న అంశం– విస్తృత సమస్యలను అన్వేషించే పరికరం మాత్రమే. ఈ క్రీడ మనుష్యులని ఎలా ఏకం చేస్తుందో, విడదీస్తుందో, ఉత్తేజపరుస్తుందో అన్న సంగతులనీ, తెర వెనకాతల సాగే లంచగొండితనాలూ, సాధికారతలన్నిటినీ రచయిత వర్ణిస్తారు.తన తొలి నవల ‘ద వైట్ టైగర్’కు 2008లో బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరవింద్ అడిగా మూడో నవల ఈ ‘సెలెక్షన్ డే’. 2016లో వచ్చింది. u క్రిష్ణవేణి -
బాంబులు విసిరే చేతుల వెనుక
1996లో ఒకరోజు తన పిల్లలు తుషార్, నకుల్లని– మరమ్మత్తుకిచ్చిన టీవీ తెమ్మని ఢిల్లీలో రద్దీగా ఉన్న లాజ్పత్నగర్ మార్కెట్కు పంపుతాడు వికాస్ ఖురానా. వాళ్ళిద్దరూ స్నేహితుడైన మన్సూర్ని కూడా తీసుకెళ్తారు. అక్కడ ఒక బాంబు పేలి పదమూడు మందిని చంపి, మరి ముప్పై మందిని గాయాలపాలు చేస్తుంది. మరణించిన వాళ్ళల్లో ఖురానా పిల్లలు కూడా ఉంటారు. మన్సూర్ చేతి మీద గాయాలతో, రక్తం కారుతూ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అబ్బాయి తల్లిదండ్రులకి సంతోషం కలిగినప్పటికీ, కుర్రాడు మాత్రం ఖురానా దంపతులు పడే దు:ఖాన్ని పంచుకుంటాడు. కొడుకులు ఎందుకు చనిపోయారో, బాంబు విసిరినది ఎవరో, కారణాలేమిటో అని ఖురానా అతని భార్య దీపా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి దు:ఖం, కోపం, అపరాధభావం– వారి దాంపత్య జీవితం, ఆరోగ్యం, భవిష్యత్తు పైనా ప్రభావం చూపుతాయి. బాంబుదాడి వల్ల మన్సూర్ భౌతికంగా, మానసికంగా కూడా కదిలిపోయి– పెద్దయి ఉద్యోగం కోసం యూఎస్కు వెళ్ళినప్పుడు, అతని పాత మణికట్టు గాయాలు ఎక్కువై, తన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయలేక ఇండియా తిరిగి వస్తాడు. ప్రపంచాన్ని మార్చాలన్న ఆశయం ఉన్న అయూబ్తో స్నేహం పెంచుకుంటాడు. వాళ్ళిద్దరి దృష్టి నుంచీ చూస్తే 9/11 తదుపరి లోకంలో పరిస్థితులూ, అనుభూతులూ ఎంత త్వరగా మారాయో అన్నది అర్థం అవుతుంది. అయూబ్ కానీ బాంబు తయారు చేసే షౌకీ కానీ, గతానుగతిక విషం చిమ్మే మూఢవిశ్వాసులుగా వర్ణించబడరు. కరణ్ మహాజన్ రాసిన ఈ రెండో పుస్తకం ‘ది ఎసోసియేషన్ ఆఫ్ స్మాల్ బాంబ్స్’ అనూహ్యమైనది. ప్రభావితులైన వారి, బాధితుల, నేరస్థుల కథన దృక్కోణాలను ఇటూ అటూ మారుస్తూ రాయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. తీవ్రవాదానికి గల కారణాలూ, ప్రభావాలూ గురించిన ఆలోచనలని రేకెత్తిస్తుందీ పుస్తకం. అయినాగానీ కథనం మాత్రం విషాదకరంగా ఉండదు. కథనంలో నిపుణత, నిమ్మళం ఉన్నాయి. తీవ్రవాదుల్లో ఎవరూ కరడుగట్టిన ముస్లింలూ, అల్లా పేరుని దుర్వినియోగిస్తూ హత్యలూ చేసేవారూ కారు. బదులుగా వారు రాజకీయ కార్యకర్తలు. కొందరు కశ్మీర్ కోసం స్వాతంత్య్రం కోరుకునేవారు. ముస్లింల హింసని అంతం చేయాలనుకునేవారు. అనేక సంవత్సరాలుగా సాగుతున్న శోకపు ఆసక్తికరమైన చిత్రాలనీ, విషాదాన్ని భరించగలిగే పద్ధతులనీ, సైద్ధాంతిక మార్పులనీ వివిధ దృష్టి కోణాలతో వర్ణిస్తారు రచయిత. జీవితపు వాస్తవాలని సమర్థవంతంగా ప్రతిబింబిస్తారు. పాఠకులనుండి సానుభూతి పొందే ప్రయత్నమేదీ చేయలేదు. తీవ్రవాదులకి ఒక మానవ ఆకారాన్ని ఆపాదించడం వల్ల చిన్న వివరాలు కూడా ప్రాముఖ్యతని సంతరించుకోవడమే కాక తికమక పరుస్తాయి కూడా. ఏ కారణాలవల్ల ఎవరైనా ఒక తీవ్రవాదిగా లేక హంతకుడిగా మారతారో అన్నది ఎప్పుడూ ఆసక్తి కలిగించేదే. బహుశా అందుకే తీవ్రవాదుల దృక్పథాలకీ, ఆలోచనా ధోరణికీ, భావజాలానికీ ఎక్కువ పేజీలు కేటాయించబడ్డాయి. కరణ్ మహాజన్ 1984లో పుట్టి, కొత్త ఢిల్లీలో పెరిగారు. ఈ నవల 2016 ‘నేషనల్ బుక్ అవార్డ్ ఫర్ ఫిక్షన్’ కోసం ఫైనలిస్టుగా పేర్కొనబడింది. -క్రిష్ణవేణి -
నాలుగు నెలల వైవాహిక చీకటి
కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు, కార్యకర్త అయిన మీనా కందసామి గతంలో రెండు కవితా సంకలనాలూ, ‘ద జిప్సీ గాడెస్’ అన్న నవలా రాశారు. ఆమె కొత్త నవల When I Hit You చాలామట్టుకు ఆమె స్వీయచరిత్రే! కథకురాలికి పెళ్ళయి, భర్తతో ఒక కొత్త పట్టణానికి మారినప్పుడు ఆమె జీవితం పీడకలగా మారుతుంది. ‘‘నీ ఫేస్బుక్ ఖాతాను డీయాక్టివేట్ చేస్తావా, లేదా?’’ అని పంతంగా అగ్గిపుల్లలు ముట్టించి మోచేతి వెంట్రుకల మీద రుద్దుతూ ఆర్పేస్తున్న భర్తకుగానీ, ప్రధాన పాత్ర అయిన యువతికిగానీ దీన్లో పేర్లుండవు. ‘‘నేనొక రేపిస్టును పెళ్లి చేసుకున్నాను. అతను నన్ను కొట్టేవాడు. అతణ్ని వదిలిపెట్టినా, నేనింకా బతికేవున్నాను,’’ అంటుందామె. కొట్టడానికి కారణాలు అమితమైనవి. కొట్టే పరికరాలకూ కొదవుండదు. మెలితిప్పిన కంప్యూటర్ వైర్లు, లెదర్ బెల్టులు, పీక పిసకడాలు... ఇంటర్నెట్/ఫోన్ వాడకం మాన్పించినప్పుడు, కాల్పనిక బాయ్ఫ్రెండ్సుకు ఉత్తరాలు రాస్తూ, భర్త ఇంటికి రాకముందే, వాటిని డిలీట్ చేసేస్తూ ఉంటుంది. ‘‘నీ పాస్వర్డ్స్ అన్నీ నాకియ్య’’మని భర్త అడిగినప్పుడు వాదించలేక, ఓడిపోతుంది. పెళ్ళయిన నెల తిరగకుండానే, అతను తన మెయిల్స్కు సమాధానాలిస్తున్నాడని గ్రహిస్తుంది. తన జీమెయిల్ ఖాతా నుండి 25,000 మెయిల్స్ డిలీట్ చేసినప్పుడు, ఉనికినే కోల్పోయాననుకుంటుంది. రూపకాలతోనూ, నిజ జీవిత సంఘటనలతోనూ నిండి ఉన్న పుస్తకం ఇది. దీని గురించి రచయిత్రి ఔట్లుక్ పత్రికకు అయిదేళ్ళ కిందట, ఒక వ్యాసం రాశారు. పుస్తకం చదువుతున్నంతసేపూ, ‘ఇంత చదువుకుని, ప్రపంచం చూసిన యువతి– గృహహింసను తట్టుకోవలసిన అవసరం ఏమిటా!’ అని వేధించే ప్రశ్నలకు సమాధానం, చివరి పుటల్లో దొరుకుతుంది. ‘‘ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే, ఆశ నన్ను అడ్డగిస్తుంది. నా మనస్సులో మిగిలున్న ఈ ఆశే, పారిపోవడాన్ని నిషేధించేది. ఈ వివాహబంధానికి నన్ను కట్టిపడేసినది విశ్వాసఘాతకి అయిన ఈ ఆశే. రేపటికల్లా అంతా సర్దుకుంటుందన్న ఆశ’’. తమ ఎంపికవల్ల ఎదురయ్యే పరిణామాలతో రాజీపడే ప్రతి స్త్రీకీ ఈ యువతి ప్రతినిధి. సమాన హక్కులు అన్నవి కేవలం కలలే తప్ప, నిజ జీవితంలో ఉండవని నేర్చుకుంటుంది. మన దేశంలో, వైవాహిక మానభంగాలు లెక్కలోకి తీసుకోబడవు. జీవితంలో భౌతిక, భావోద్వేగ అవమానం హెచ్చవుతూ ఉండటంతో– మిగతా చాలామంది స్త్రీలలాకాక, ‘పీపాలతో నిండిన నిరంతర విచారణ’ను భరించలేక, ‘‘నా కాళి చంపుతుంది. నా ద్రౌపది దిగంబరి అవుతుంది. నా సీత పరాయిపురుషుడి ఒళ్ళో కూర్చుంటుంది. నా స్త్రీలందరూ తిరగబడతారు. బాంబులను ఎదుర్కొంటారు. రాజులను కించపరుస్తారు. నాలా ఉంటారు’’ అంటూ, నాలుగు నెలల్లోపే తన పరిష్కారాన్ని తానే వెతుక్కుని, ఇంట్లోంచి బయటపడగలుగుతుంది. కథనంలో ప్రతీ వాక్యం వ్యంగ్యం నుంచి విషాదానికి మారుతూ చమత్కారంగా ఉన్నప్పటికీ కూడా వాటి నుండి తొంగి చూసే వ్య«థను మనం నిర్లక్ష్యపెట్టలేం. అక్కడక్కడా ఉన్న తవికలు మాత్రం కథ చదవడానికి అడ్డం పడతాయి. క్రిష్ణవేణి -
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
- భర్త, కుమార్తె పరిస్థితి విషమం మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి శివారులోని సోనియా దాబా వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కుమార్తెతో పాటు దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భార్య కృష్ణవేణి అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
గర్భ వ్యూహం
సుభద్ర నిండు గర్భంతో ఉంటుంది. అర్జునుడు పద్మవ్యూహం గురించి చెబుతుంటే... అమ్మ కడుపులోని అభిమన్యుడు వింటాడు. అలాగే కృష్ణవేణి కూడా ‘జెండర్ వ్యూహం’ గురించి వినింది. జెండర్ వ్యూహంలోకి ప్రవేశించి, మిస్టర్ కృష్ణవేణిగా ఎదిగింది. కానీ ఆ ట్రాప్లోంచి బయటికి రాలేకపోయింది! జెండర్ వ్యూహం అంటే.. లింగ వివక్ష అనే పద్మవ్యూహం. మన సమాజంలో ఆడమగ జెండర్ వ్యూహాలు కురుక్షేత్ర వ్యూహాల కంటే తక్కువేం కాదు. మరి ఈ గర్భవ్యూహాన్ని కృష్ణవేణి ఎలా ఛేదించింది? కొడుకు, కొడుకు అని...‘కొడుకు పిచ్చితో’ కలవరించే వారికి కృష్ణవేణి కథ ఎలాంటి గుణపాఠం అయింది? ఈ పాస్ట్ లైఫ్ స్టోరీ చదవండి. మీ ఫ్యూచర్ లైఫ్కి ఓ దారి దొరుకుతుంది. ‘‘కృష్ణవేణి గారూ! మీ అండాశయంలో కణుతులు (ఒవేరియన్ సిస్ట్లు) ఏర్పడడం వల్ల మీకు నెలసరి క్రమంగా రావడం లేదు. ఈ సమస్య వల్లే పిల్లలు పుట్టడం లేదు. మందులు రాసిస్తాను. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి..’’ డాక్టర్ చెప్పిదానికి తలూపి బయటకు వచ్చింది కృష్ణవేణి. తను రోజూ జిమ్కి వెళుతుంది. స్పోర్ట్స్ ఆడుతుంది. మంచి ఫుడ్ తీసుకుంటుంది. అయినా ఈ సమస్యలో మార్పు లేదు. మెచ్యూర్ అయిన దగ్గర నుంచీ ఈ సమస్య బాధిస్తూనే ఉంది. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ, పెళ్లయ్యాక మరీ ఈ రెండేళ్లుగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ‘‘ముప్ఫై మూడేళ్లు దాటాయి. ఇంకా పిల్లలు పుట్టడం లేదు’’ అని మేనత్త అన్నప్పటి నుంచీ ఆందోళన ఎక్కువైంది. ఆఫీసు పనుల్లో తలమునకలుగా ఉంటోంది కానీ, రోజు రోజుకూ ఒంటరినైపోతున్నట్టు అనిపిస్తోంది. ఏడాది క్రితం అమ్మనాన్న చనిపోయినప్పటి నుంచీ ఈ ఒంటరితనం మరీ పెరుగుతోంది. ఆలోచిస్తూనే కారులో ఇంటికి చేరుకుంది కృష్ణవేణి. కృష్ణవేణి ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్. భర్త రాకేశ్ టూరిజమ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. ఎవరికైనా తన జీవితం చూస్తే కుళ్లుగా ఉంటుంది. కానీ, తను ఎంతగా కుమిలిపోతోందో ఎవరికీ తెలియదు. చివరకు భర్త రాకేశ్కి కూడా. ఈ మధ్య రాకేశ్, ఆఫీసులో కొలీగ్తో తిరుగుతున్నాడని తెలిసింది. అప్పటి నుంచి తమ మధ్య గొడవలు. ఈ గొడవలు ఇలాగే పెరిగితే కలిసుండడం కష్టమే! తలనొప్పిగా అనిపిస్తే మాత్ర వేసుకొని తన రూమ్లోకి వెళ్లిపోయింది కృష్ణవేణి. తను తనులా ఉండలేక..! ఉదయాన్నే ఆఫీసుకు బయల్దేరుతూ అద్దంలో తనను తాను చూసుకుంది. భుజాలను తాకుతుండే హెయిర్. ఒంటి మీద ఖరీదైన సూట్. మెడలో సన్నటి డైమెండ్ చైన్. తనకు ఇలాగే ఉండటం ఇష్టమా?! ఏదో సందిగ్ధం. ఆ వెంటనే తన హోదా, దర్పం గుర్తుకు వచ్చాయి. ఇంట్లో, ఆఫీసులో తన కనుసన్నల్లో మెలిగే పనివారు. తను ఈ దశకు రావడానికి కట్టుకున్న ఒక్కో మెట్టు గుర్తుకు వచ్చింది కృష్ణవేణికి. ‘అమ్మానాన్నలకు తను ఒక్కర్తే కూతురు. చిన్నప్పటి నుంచీ తను చాలా ట్యాలెంటెడ్. స్కూల్లో టాపర్. స్పోర్ట్స్లో టాపర్. గోల్డ్మెడల్ సాధించినప్పుడల్లా అమ్మానాన్న కళ్లలో మెరుపులు. వాళ్లను ఇంకా ఇంకా సంతోషపెట్టడానికి గెలుచుకున్న పతకాలు. ‘సూర్యారావుకు పుట్టింది కూతురు కాదు, కొడుకే’ అనేవారు అంతా! తనను పూర్తి పేరుతో కాకుండా అందరూ ‘కృష్ణ’ అనే పిలిచేవారు. ‘మా కూతురు అని చెప్పడం కాదు కానీ, అబ్బాయిలకు కూడా ఉండదు అంత ధైర్యం’ అని గర్వంగా ఫ్రెండ్స్కు పరిచయం చేసేవాడు నాన్న. అలా తను అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా పెరిగింది. అమ్మానాన్నలు ఏది చెప్పినా అది చేసెయ్యడానికి సిద్ధం అన్నట్టు ఉండేది. కుటుంబం... ఇమడని బంధం ‘‘లక్ష్యసాధనలో పెళ్లి ఎప్పుడూ వాయిదా పడుతూనే వచ్చింది. నా వయసు వారందరికీ పెళ్లై పిల్లలు ఉన్నా నాకెప్పుడూ పెళ్లి ధ్యాస లేదు. స్నేహితులలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. కానీ, వారిలో ఎవరినీ పెళ్లి చేసుకోవాలనిపించలేదు. ముప్ఫై ఏళ్లు దాటుతుండగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు అమ్మనాన్న. అప్పటికీ అయిదారు సంబంధాలు చాలా దగ్గరగా వచ్చాయి. కానీ, ‘మా అబ్బాయి కొంచెం నెమ్మదస్తుడనో, మీ అమ్మాయిని అందుకోలేడనో...’ వారి నుంచి తర్వాత కబురు వచ్చేది. ఆ కబురు నాన్నకు చాలా గర్వంగా అనిపించేది. అది చూసి నాకు సంతోషం కలిగేది. చివరకు నాన్న స్నేహితుడి కొడుకు రాకేశ్తో పెళ్లి ఓకే అయ్యింది. హడావిడి లేకుండా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్, తర్వాత రిసెప్షన్ అంటే రాకేశ్ ‘సరే’ అన్నాడు. పెళ్లయ్యింది. ఇగోల రాజ్యం నాకెప్పుడూ నా చుట్టూ ఉన్నవారి మీద పైచేయి సాధించడం చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ప్రతిభే నన్ను శిఖరాలకు చేర్చింది. రాకేశ్ సంపాదన కన్నా నా జీతం మూడు రెట్లు ఎక్కువైంది. మొదట్లో మేం ఇద్దరం బాగానే ఉన్నాం. కానీ, ఇంట్లో తన పెత్తనమే సాగుతున్నట్టు పనివాళ్ల ముందు తన గొప్పలు చూపించేవాడు రాకేశ్. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్దగా గొడవలు అవడం మొదలుపెట్టాయి. ఇప్పుడు మరొకామెతో తిరుగుతున్నాడు అనే వార్త. ఇక ఈ కుటుంబ జీవనం నాకు సెట్ కాదు. విడాకులకు అప్లై చేయాల్సిందే!’ అనుకోగానే దుఃఖం కమ్మేసింది. చనిపోయిన అమ్మానాన్న గుర్తుకువచ్చారు. ‘ఎంతో గెలిచాను అనుకున్న జీవితంలో ఏం గెలుచుకున్నాను...’ ఈ ఆలోచనే రోజు రోజుకూ కుంగదీస్తోంది. అంతర్ శిశువు గుర్తింపు... కృష్ణవేణి చెప్పిందంతా విన్న కౌన్సెలర్... ‘‘మీరు కుటుంబ జీవనం వద్దనుకుంటారు. అదే క్షణంలో ‘ఈ జీవితం చేజారిపోతే...’ అనే భయంలోనూ ఉన్నారు. ఫిట్నెస్ పట్ల ఎంత శ్రద్ధ చూపినా ఆరోగ్యం ఎందుకు సరిగా ఉండడం లేదో ప్రశ్నార్థకంగా ఉంది మీకు..’’ కౌన్సెలర్ చెబుతున్న మాటలకు అవునన్నట్టుగా తలూపింది కృష్ణవేణి. బ్యాంక్ పని మీద టూర్ వెళ్లినప్పుడు అనుకోకుండా ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ వర్క్షాప్’కి అటెండ్ అయ్యింది కృష్ణవేణి. ‘నాలో ఏమిటీ సందిగ్ధం? ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నానంటూ...’ తన మనసులో దాగున్న సందేహాలను కౌన్సెలర్ ముందుంచింది. ‘‘అది మీరే తెలుసుకోండి..’’ అంటూ థెరపీని మొదలుపెట్టారు కౌన్సెలర్.కౌన్సెలర్ ఇచ్చిన సూచనల మేరకు కృష్ణవేణి కళ్లు మూసుకొని విశ్రాంతిగా పడుకుంది. ధ్యానచక్రంలో తనను తాను దర్శించడం మొదలుపెట్టింది. అంతర్నేత్రంతో తన జీవన ప్రయాణాన్ని దర్శిస్తోంది. కాసేపటికి ఎవరో తనను చూస్తూ గట్టిగట్టిగా నవ్వుతూ, హేళన చేస్తున్నట్టు అనిపించింది. ‘చూడు... బాగా చూడు. నేను ఎవరినో కాదు.. నీలో ఉన్న చిన్ని శిశువును. నీ జీవితాన్ని ఆనందమయం చేసే అంతర్ శిశువును. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను నిర్లక్ష్యం చేశావు. నువ్వు అందరిలో అబ్బాయిలా ప్రశంసలు పొందడానికి నన్ను దూరం చేసుకున్నావు...’ ఈ మాటలు ఎక్కడ నుంచో కాదు. తన అంతరాంతరాళాలలో నుంచి వస్తున్నవి. ఆశ్చర్యంగా వింటోంది ఆ మాటల్ని. ఆ గొంతు మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది– ‘నీ జీవితమంతా దర్శించు. ఎక్కడ నన్ను పోగొట్టుకున్నావో చూడు. నేను ఎన్నిసార్లు బాధ పడ్డానో గమనించు’ అంది. ఆ మాటలకు కృష్ణవేణి తన 33 ఏళ్ల వయసు హోదా నుంచి 23 ఏళ్ల వయసు ఆలోచనల్లోకి ప్రయాణించింది. అటు నుంచి 13 ఏళ్ల వయసుకు... ఆ తర్వాత మూడేళ్లకు, ఆ తర్వాత తల్లి గర్భంలోకి ప్రయాణించిన కృష్ణవేణికి ఏదో చేజారిన గొలుసు చేతికి చిక్కినట్టు ఆగిపోయింది. తన స్థితిని చెప్పడం మొదలుపెట్టింది– ఆశయం పేరుతో నిర్లక్ష్యం... ‘అమ్మ పొట్టలో హాయిగా ఉన్న నాకు ఎవరివో మాటలు వినిపించాయి. అవి మా నానమ్మవి. ‘చూడమ్మాయి! పురిటికి పుట్టింటికి వెళుతున్నావ్. వచ్చేటప్పుడు ఈ ఇంటికి వారసుడిని తీసుకురా!’ అంటోంది అమ్మతో. ‘అబ్బాయి పుడితే ఎలా పెంచుతానో చూడు..’ అంటున్నాడు అమ్మతో నాన్న.నాన్నమ్మ, నాన్న మాటలతో అమ్మలో రకరకాల ఒత్తిళ్లు. అబ్బాయే పుట్టాలని అమ్మ దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది. మరి, నేను ఆడపిల్లనే. ఇలా పుడితే వీళ్లంతా చాలా డిసప్పాయింట్ అవుతారు ఎలా?! ఈ ఆలోచనతో అలాగే పుట్టాను. ఆడపిల్ల పుట్టిందని నానమ్మ, నాన్న నన్ను చూడడానికి కూడా రాలేదు. అప్పుడు ‘ఆడపిల్లను కాబట్టి వీళ్లు వద్దనుకున్నారు. కానీ, అబ్బాయి కంటే దేనిలోనూ తక్కువ కాదు నిరూపిస్తాను’ అనుకున్నాను. ‘అక్కడేరా బుజ్జీ నిన్ను దూరం చేసుకున్నాను. అమ్మనాన్నలకు నచ్చేట్టు అబ్బాయికన్నా మిన్నగా ఉండాలనుకున్నాను. చదువులో టాప్, ఆటల్లోనూ టాప్ అనిపించుకున్నాను. నేను అబ్బాయిలా ఉండటానికి చేసే ప్రయత్నంలో నాలో ఉన్న నిన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాను. మగవారికన్నా బెస్ట్ అనిపించుకోవాలని రేయింబవళ్లు కష్టపడ్డాను. ఉద్యోగంలోనూ ఉన్నత స్థాయికి వెళ్లాను. కానీ, స్త్రీత్వాన్ని నిర్లక్ష్యం చేశాను. అబ్బాయిలా మారిపోయాను. అందుకే నాలో గైనిక్ సమస్యలు మొదలయ్యాయి. దీనివల్లే పీరియడ్స్ సరిగా రాకపోవడం, ఒవేరియన్ సిస్ట్లు ఏర్పడటం జరుగుతున్నాయి...’’ ఉద్వేగంగా చెబుతూనే ఉంది కృష్ణవేణి. బాల్యమంతా తల్లిదండ్రిని గెలిపించడం కోసం తలపెట్టిన ప్రతి పని ఎంత కష్టంగా నెగ్గుకువచ్చిందో తెలుసుకున్న కొద్దీ ఆమె హృదయం కరిగి నీరై, కళ్ళ వెంట వర్షిస్తోంది. అంతర్శిశువు సంతోషంగా ఉండడానికి ఏమేం చేయాలో సూచనలు అందిస్తున్నారు కౌన్సెలర్. ఆ సూచనలతో కృష్ణవేణి అంతర్శిశువుతో ముచ్చటించడం మొదలుపెట్టింది– ‘నా కన్నవారికి అబ్బాయిలా ఆనందాన్ని పంచాలనే సాధనలో నిన్ను పోగొట్టుకుని, నన్ను నేను కోల్పోయాను. స్త్రీగా ఏ సంతోషాన్నీ అనుభవించలేకపోయాను. నిన్ను సంతోష పెట్టలేకపోయాను. నన్ను క్షమించు. నువ్వు సంతోషంగా ఉంటే, నేనూ సంతోషంగా ఉంటాను..’ చిన్ని పాపకు చెప్పినట్టుగా చెప్పింది. కాసేపటికి తెరిపిన పడిన మనసుతో మేల్కొంది. తెరిపినపడిన బంధం స్త్రీ–పురుషులిద్దరిలోనూ అంతర్ శిశువు ఉంటుందనీ, ఆ శిశువును మాలిమి చేసుకుంటే జీవితం సంపూర్ణంగా అనుభవించవచ్చుననే అవగాహనకు వచ్చింది. అంతర్ శిశువు స్నేహంతో కృష్ణవేణి మనసు ఆనందపరవశం పొందింది. ఆ ప్రేమ ఆమె ఉన్న ప్రతీచోటా ప్రతిఫలిస్తోంది. రాకేశ్ను అపార్థం చేసుకున్నానని తెలిసి, తన ప్రేమ పరిధిని విస్తృతం చేసుకుంది. తను హోదాలో పై స్థాయిలో ఉండడం వల్ల భర్త తనను అణచడానికి ప్రయత్నిస్తున్నాడేమో అనే అనుమానమూ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. – నిర్మల చిల్కమర్రి సమస్య మనలోనే! ఆడామగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ అంతర శిశువు (ఇన్నర్చైల్డ్) ఉంటుంది. చాలా సందర్భాలలో రకరకాల వ్యక్తుల వల్ల, మన ప్రవర్తనల వల్ల ఆ శిశువు మనసు గాయపడుతుంది. తనకు నచ్చినవీ, నచ్చనివీ, అలాగే ఉండాల్సిన విధానాన్నీ ఆ శిశువు హెచ్చరిస్తుంటుంది. అయినా సరే దాన్ని పట్టించుకోకపోతే, అలాంటి వారి నుంచి దూరమైపోతుంది. దీంతో వారిలో ప్రేమ స్థానంలో ద్వేషం చోటుచేసుకుంటుంది. అందాల్సిన ఫలాలు అందడం లేదనే నిస్పృహలోకి వెళుతుంది. ఈ ప్రభావం జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తుంది. ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కృష్ణవేణికి జరిగింది అదే! చాలామంది సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనే తపనలో తమను తాము కోల్పోతుంటారు. కుటుంబ జీవనంలో ఇబ్బందులు పడుతుంటారు. వీటిని తట్టుకోలేక కుటుంబం నుంచి దూరం అవడం, వ్యసనాల బారిన పడటం చూస్తుంటాం. లేదంటే ఒంటరివారైపోయి జీవితం చాలించాలనే నిర్ణయం తీసుకుంటారు. ఈ ఆలోచనల వల్ల సంపూర్ణ జీవితాన్ని అనుభవించలేరు. ఎవరికి వారు తమలోని అంతర్ శిశువుతో గుర్తిస్తే, ఆ ప్రేమను అందరికీ పంచాలనే భావన చిగురిస్తుంది. – లక్ష్మీ న్యూటన్, పాస్ట్ లైఫ్ థెరపిస్ట్,లైఫ్ రీసెర్చ్ అకాడమీ, హైదరాబాద్ ఇన్నర్చైల్డ్ మన జీవితంపై చూపే ప్రభావం గురించి చెప్పిన ఆంగ్ల రచయితలు... జాన్బ్రాడ్ షా అమెరికాలో మంచి వక్త, కౌన్సెలర్, విద్యావేత్త. కుటుంబ జీవనంలో గాయపడుతున్న అంతరశిశువు (ఇన్నర్చైల్డ్) గురించి సమగ్రంగా వివరించారు.‘హోమ్ కమింగ్’ పుస్తకం ద్వారా ఇన్నర్చైల్డ్ విజేత అవ్వాలంటే ఏం చేయాలో తెలియజెప్పారు, అలీస్ మిల్లర్ ఇంగ్లండ్ సైకోఎనలిస్ట్. ‘పేరెంటల్ చైల్డ్ అబ్యూజ్’ బుక్స్ రాశారు ఈమె. వీటిలో ‘ది డ్రామా ఆఫ్ ద గిఫ్టెడ్ చైల్డ్’ అనే పుస్తకం ఇన్నర్ చైల్డ్ గురించి తెలియజేస్తుంది. వర్జీనియా సచీర్ అమెరికన్ రచయిత్రి, సామాజికవేత్త. ‘మదర్ ఆఫ్ ఫ్యామిలీ థెరపిస్ట్’గా ఈమెకు పేరు. ఎంతోమంది జీవితాలను తరచి చూసిన ఈమె బాల్యదశలో పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం, ఒత్తిడి ఎంతగా ఉంటుందో వివరించారు. ‘కంజాయింట్ ఫ్యామిలీ థెరపీ’ పుస్తకం ద్వారా ఎన్నో సూచనలు ఇచ్చారు. -
జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలకు కృష్ణవేణి ప్రాజెక్టు ఎంపిక
పొదిలి: రాజమండ్రిలో జరిగిన ఇన్ స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శనలో పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మోరా కృష్ణవేణి ప్రాజెక్టు జాతీయ స్థారుుకి ఎంపికై ంది. ’స్మార్ట్ ఫోన్ మైక్రోస్కోప్’ ప్రాజెక్టును గైడ్ ఉపాధ్యాయుడు పూర్ణచంద్రరావు సహకారంతో కృష్ణవేణి తయారు చేశారు. స్మార్ట్ ఫోన్కు అదనంగా రూ.250 ఖర్చు చేయటం ద్వారా, మైక్రోస్కోప్ కంటే మరింత నాణ్యతగా ఈ యంత్రం పనిచేస్తుంది. రూ.20 వేల విలువ చేసే మైక్రోస్కోప్ను మరింత తక్కువగా అందుబాటులోకి తీసుకురావచ్చు. సాధారణ స్మార్ట్ ఫోన్ను మైక్రోస్కోప్గా ఏవిధంగా మార్చవచ్చో ప్రాజెక్టు ద్వారా కృష్ణవేణి నిరూపించింది. ప్రభుత్వ పాఠశాలల్లోని ల్యాబ్లో ఈ మైక్రోస్కోప్ను అమర్చటం ద్వారా దాని సేవలను విద్యార్థులకు అందుబాటులోకి తేవచ్చు. కరెన్సీలో నిగూఢంగా ఉన్న సెక్యూరిటీ ఫొటోగ్రఫీని కూడా గుర్తించవచ్చు. జాతీయ స్థారుుకి ఎంపికై న ప్రాజెక్టును ప్రదర్శించిన కృష్ణవేణి, గైడ్గా వ్యవహరించిన పూర్ణచంద్రరావును, జిల్లా సైన్సు అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, ఎంఈవో బాషురాణి, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ అభినందించారు. న్యూఢిల్లీలో డిసెంబర్ 9-11వ తేదీల్లో జాతీయ స్థారుు ప్రాజెక్టుల ప్రదర్శన జరుగుతుందని గైడ్ టీచర్ పూర్ణచంద్రరావు తెలిపారు. -
తెలుగుపై ప్రభుత్వం చిన్నచూపు
ఏ ఒక్క హామీని అమలు చేయడంలేదు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన డాబాగార్డెన్స్(విశాఖ): తెలుగు భాషను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవల్సిన దుస్థితి త్వరలోనే రానుందని లోక్నాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరపు కోటేశ్వరరావు రచించిన ‘కృష్ణవేణి’ నృత్య రూపకానికి సంబంధించి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో తెలుగు సంస్కృతి గూర్చి తెలుసుకునేందుకు విదేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును ఒక సబ్జెక్ట్గా బోధించాలని చెబితే, తప్పనిసరి చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత విస్మరించిందన్నారు. రాష్ట్రంలో సుమారు నాలుగు వేల తెలుగు మీడియం పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని యార్లగడ్డ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్నారు. కార్మిక దినోత్సవం రోజున శ్రీశ్రీ గహాన్ని మంచి మ్యూజియంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చినా ఆ దిశగా పనిచేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నెల 24న కూచిపూడి అకాడమీ ఆఫ్ సెయింట్ లూయిస్(అమెరికా)కు చెందిన వింజమూరి సుజాత బృందంచే విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో ‘కృష్ణవేణి’ నృత్యరూపకం ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బృందంలో అమెరికాకు చెందిన నలుగురు కళాకారులు ఉన్నారని చెప్పారు. తెలుగు సంస్కృతిని పరిరక్షించే క్రమంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో కళాకారులు వింజమూరి సుజాత, మానస, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
భక్త కృష్ణవేణి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కృష్ణా పుష్కరాల్లో ఐదో రోజు జనప్రవాహం కొంత తగ్గింది. మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు పనిదినం కావడంతో పుష్కర భక్తులసంఖ్య కొద్ది తగ్గడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. గద్వాల సమీపంలోని జూరాల పుష్కరఘాట్లో నీళ్లు లేకపోవడంతో ఘాట్ను మూసివేశారు. జూరాల ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు వచ్చే వరదనీరు భారీగా తగ్గడంతోపాటు అదే క్రమంలో ప్రాజెక్టునుంచి దిగువ ప్రాంతాలకు నీటి విడుదలను నియంత్రించడంతో పలు ఘాట్లలో నీటిమట్టం భారీస్థాయిలో తగ్గింది. జూరాల పుష్కరఘాట్లో మినహా ఎక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లుచేశారు. మరో వారం రోజుల పాటు పుష్కరాలు ఉండడంతో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా ఘాట్లలో నీటిమట్టం ఉండే లా చూడాలని నీటి పారుదల శాఖాధికారులు ఆదేశాలు జారీచేశారు. మంగళవారం సైతం బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్, పస్పుల, నదీ అగ్రహారం, కృష్ణ, పంచదేవులపాడ్, పెద్దచింతరేవుల ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరం..ప్రముఖం ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్జె.దొర బీచుపల్లి పుష్కరఘాట్లో పుణ్యస్నానం ఆచరించగా, రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసమేతంగా వచ్చి గొందిమళ్ల పుష్కరఘాట్లో పుణ్యస్నానమాచరించి అనంతరం జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తొలుత జూరాలలో పుణ్యస్నానమాచరించాలని పర్యటన ఖరారు చేసుకున్నప్పటికీ ఆ ఘాట్ నీళ్లు లేవన్న సమాచారంతో రంగాపూర్ ఘాట్ వద్ద పుణ్యస్నానమాచరించారు. గొంది మళ్లలో మంత్రి లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా స్నానమాచరించారు. కర్నూల్ వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక గొందిమళ్ల వీఐపీ ఘాట్లో స్నానమాచరించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నది అగ్రహారంలో సంధ్యా హారతిఇచ్చారు. మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి పలు ఘాట్లను సందర్శించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కలెక్టర్ శ్రీదేవి బీచుపల్లి, రంగాపూర్ ఘాట్లను పరిశీలించారు. బీచుపల్లిలో స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను పరిశీలించడంతోపాటు అక్షయ పాత్ర ఫౌండేషన్ పుష్కర డ్యూటీలో ఉన్న స్వచ్ఛంద సేవకులకు, ఉద్యోగులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్వచ్ఛంద సేవకులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. అన్ని ప్రాంతాల్లో నది హారతి విధిగా ఇవ్వాలని, హారతి ప్రాధాన్యతను ఆధ్యాత్మిక ప్రశస్తిని ప్రజలకు వివరించాలని ఆమె అధికారులకు సూచించారు. ఇటు సోమశిలలోనూ మంగళవారం భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో పుష్కరస్నానం చేసే భక్తుల రద్దీ కొంత తగ్గడంతో హైవేపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కొంతమేర సడలించారు. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. నేడు మంచాలకట్టలో వైఎస్కు పిండ ప్రదానం కొల్లాపూర్ సమీపంలోని మంచాలకట్ట ఘాట్ వద్ద బుధవా రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదా నం చేయనున్నారు. ఉదయం 11 గంట లకు శాస్త్రోకంగా పిండప్రదానం చేయనున్నారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు భగవంత్రెడ్డి కోరారు. -
కృష్ణవేణి .. జీవనవాణి
జిల్లాలో 295 కిలోమీటర్ల పొడవునా కృష్ణానది ప్రవహిస్తోంది.. నదీతీరం వెంట గ్రామాలు దీనిపైనే ఆధారపడ్డాయి.స్వాతంత్య్రానంతరం ఈ నది వెంట వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు.. వీటి ద్వారా సాగునీటితోపాటు దాదాపు సగం పట్టణాలు, పల్లెలకు తాగునీటిని అందిస్తున్నారు.. ఇలా పాలమూరు ప్రజల జీవనవేదంగా మారింది. జూరాల : మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మహాబలేశ్వరంలో ప్రారంభమైన కృష్ణానది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా సముద్రంలో విలీనమవుతుంది. ఇది కర్ణాటక నుంచి జిల్లాలోకి మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం కృష్ణావద్ద ప్రారం¿¶ మవుతుంది. గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు వరకు నదీ ప్రవహిస్తోంది. నదీతీరంలో ఉన్న గ్రామాల మత్స్యకారులు తరతరాలుగా చేపల వేటలో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు బావులు, బోర్ల ద్వారా వివిధ పంటలను సాగు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గుర్రంగడ్డ దీవి ప్రజలు ఈ నదీ ప్రవాహంపైనే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల, జటప్రోలు మొదలుకుని శ్రీశైలం వరకు టూరిజం బోట్లు, కొల్లాపూర్ నుంచి రాయలసీమ వైపు ఉన్న ఆత్మకూరు వరకు నిత్యం జనాన్ని తరలించే బోట్లపై ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 1981లో కష్ణానదిపై జూరాల ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి 1996లో పూర్తిచేసింది. దాదాపు 7.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా 2005లో జలయజ్ఞం ద్వారా నాలుగు ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ఈ ప్రాజెక్టులతో సగం జిల్లా సస్యశ్యామలంగా మారేలా కష్ణానది నీళ్లు పారనున్నాయి. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి భారీ తాగునీటి పథకాలను నిర్మించడం ద్వారా సగం జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలు, గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించే రక్షిత పథకాలను నిర్మించారు, ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు. గతేడాది కష్ణానదికి వరద రాకపోవడంతో ప్రాజెక్టులకు నీళ్లు రాక పట్టణాలకు తాగునీరందక, నదిలో ప్రవాహం లేక చేపలు దొరకక వేలాది కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రస్తుత ఏడాది నైరుతి రుతుపవనాల ప్రారంభం నుంచే వర్షాలు కురుస్తుండటంతో కష్ణానదిలో ప్రవాహం బాగా ఉండటంతో రైతులు, మత్స్యకారులు బోట్లపై ఆధారపడిన కుటుంబాలు, ప్రజల తాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఏయే ప్రాజెక్టులు కృష్ణానదిపై 1981లో ధరూరు మండలం రేవులపల్లి వద్ద జూరాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. చివరకు ఇది 1996లో ప్రారంభమైంది. ప్రాజెక్టు రిజర్వాయర్, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ద్వారా రెండేసి లక్షల ఎకరాలకు, కోయిల్సాగర్ ద్వారా 50వేల ఎకరాలకు సాగునీటిని అందించే పథకాలు చేపట్టారు. ఈ ఏడాది నుంచే వీటిద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వబోతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మితమైంది. ఈ పథకం ద్వారా 3.3లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు. ఇలా ప్రాజెక్టుల ద్వారా 8.87లక్షల ఎకరాలకు కృష్ణానది నీళ్లను అందించే పథకాలు నిర్మించారు. గద్వాల, మక్తల్, వనపర్తి, మహబూబ్నగర్, దేవరకద్ర, నారాయణపేట, నాగర్కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాల్లోని భూములకు కష్ణానది నీళ్లు అందనున్నాయి. మత్స్య సంపదకు నిలయం కృష్ణానది జిల్లాలో అడుగిడిన ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు దిగువన వరకు మత్స్యసంపద పుష్కలంగా ఉంది. దీనిపై నదీతీర గ్రామాలు, పట్టణాల్లోని మత్స్యకారులు ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్నారు. వేలాది కుటుంబాలు కృష్ణానది మత్స్యసంపదపై ఆధారపడి జీవిస్తూ కృష్ణానది ప్రవాహాన్నే నమ్ముకున్నారు. మక్తల్, గద్వాల, అలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని నదీతీర గ్రామాల్లో వందలాది కుటుంబాలకు చెందిన వారు పుట్టిలలో ప్రజలను నదికి రెండువైపులా ఒడ్డుకు చేర్చుతూ వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నారు. తరాలుగా జీవిస్తున్న కుటుంబాలు ఇప్పటికీ అదే పుట్టి ప్రయాణాన్నే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారు. కొత్తగా మర పడవలు వచ్చాయి. గద్వాల మండలం గుర్రంగడ్డ దీవి ప్రజలను ఒడ్డుకు చేర్చేందుకు ప్రభుత్వం మరబోటును అందజేసింది. అలాగే సోమశిల ప్రాంతంలోనూ మరబోట్లను ఉపయోగిస్తూ మహబూబ్నగర్, కర్నూలు జిల్లాల ప్రజలను ఆవలి ఒడ్డులకు చేరుస్తున్నారు. నదీతీర గ్రామాల రైతులు నది నీటిని బోర్లు, బావులు, మోటార్ల ద్వారా పొలాలకు మళ్లించుకుని పంటలను పండిస్తున్నారు. కష్ణానది ప్రవాహంపై టూరిజం, పర్యాటకాన్ని అభివద్ధి చేసేందుకు గత ప్రభుత్వాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం కొల్లాపూర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు నల్లమల అడవిలో అందాలను చూస్తూ ప్రయాణించేలా టూరిజం బోట్లను ఏర్పాటు చేసింది. గద్వాల మండలం జమ్ములమ్మ రిజర్వాయర్ వద్ద టూరిజం అధికారులు మర, సైక్లింగ్బోట్లను ఏర్పాటు చేశారు. నదీతీరంలో పర్యాటక వసతిగహాలను నిర్మించారు. ఇలా పర్యాటకంపై వందలాది కుటుంబాలు జీవిస్తుండగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. నది నుంచి తాగునీరు జూరాల ప్రాజెక్టు వద్ద నిర్మితమైన భారీ తాగునీటి పథకాల ద్వారా గద్వాల, అలంపూర్, మక్తల్, మహబూబ్నగర్, దేవరకద్ర, వనపర్తి, జడ్చర్ల, నాగర్కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు కష్ణానది నీటిని ఇప్పటికే పలు పట్టణాలకు అందిస్తున్నారు. మరికొన్ని పట్టణాలు, గ్రామాలకు రెండేళ్లలో పూర్తిస్థాయిలో తాగునీటిని అందించనున్నారు. -
కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి
కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ల వద్ద ప్రధాన ఆకర్షణగా నిలిచేలా అధికార యంత్రాంగం కృష్ణవేణి విగ్రహాలను ఏర్పాటు చేయిస్తోంది. గత పుష్కరాల సమయంలో పలు ఘాట్లలో కృష్ణవేణి విగ్రహాలను ప్రతిషి్ఠంచారు. పన్నెండేళ్ల క్రితం జరిగిన పుష్కరాల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా బీచుపల్లి, జూరాల ప్రాంతాల్లో కృష్ణవేణి విగ్రహాలను ప్రతిష్ఠించారు. గద్వాలలో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని పుష్కరాలు సమయంలో పట్టణ ప్రధాన కూడలిలో విగ్రహాలను ఏర్పాటు చేయించారు. పుష్కరాలకు గుర్తుగా కృష్ణవేణి విగ్రహాలు గద్వాల: ‘కృష్ణానది సహ్య పర్వతాలపై పుట్టింది. శ్రీకృష్ణ పరమాత్మ సహ్యాద్రిపైన వేదగిరి వద్ద అశ్వత్థరూపంలో నిలిచినపుడు ఆ వేళ్ల నుంచి ఈ నది పుట్టిందని పురాణం చెబుతోంది. కలియుగంలో మునులంతా పాపాన్ని నశింపజేసుకోవడానికి ఈశ్వరుడిని ప్రార్థంచారు. అప్పుడు శివయ్య లింగంరూపంలో సహ్యాద్రిపై అవతరించారని, అక్కడున్న ఉసిరిచెట్టు నుంచి వేణినది పుట్టి, కృష్ణానదిలో కలవడంతో కృష్ణవేణి అయింది.’ పన్నెండేళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాల పురస్కరించుకుని వాటి జ్ఞాపకార్థం గద్వాలలో చెరగని ముద్ర వేశారు. పుష్కరాల గుర్తుగా రెండు విడుతలగా కృష్ణవేణి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మొదటిసారి 1992లో గద్వాల పట్టణం నుంచి కృష్ణానదికి వెళ్లే మార్గంలో అప్పటి న్యాయశాఖ మంత్రి డీకే సమరసింహారెడ్డి కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ విగ్రహం అలాగే ఉంది. విగ్రహం ఏర్పాట్లుతో అది కృష్ణవేణి చౌరస్తాగా మారిపోయింది. పట్టణంలో అత్యంత రద్దీ ఉండేది ఇదొక్కటే. 2016 కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే డీకే అరుణ కృష్ణవేణి విగ్రహా ఏర్పాటుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. పాత కృష్ణవేణి విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మొదట సంకల్పించారు. అయితే రాజకీయ కారణాలు, సెంటిమెంట్లు అడ్డురావడంతో విగ్రహ ఏర్పాటులో కొంత జాప్యం జరిగింది. తదనంతరం పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తా నుంచి కృష్ణానదికి స్వాగతం పలికే విధంగా తొమ్మిది అడుగుల కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని డీకే అరుణ సొంత ఖర్చులతో చేయించారు. మే 4వ తేదీన కృష్ణవేణి విగ్రహాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రజలను ఆకట్టుకునే సహజత్వంతో కృష్ణవేణి విగ్రహం ఉట్టిపడుతోంది. ప్రస్తుతం కృష్ణ పుష్కరాలకు గుర్తుగా శోభాయమానంగా మారింది. తల లేని కృష్ణమ్మ.. ఆత్మకూర్: పన్నెండేళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందిమల్ల పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణవేణి అమ్మవారి విగ్రహాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రతిషి్ఠంచి, ప్రారంభించారు. ఆ తర్వాత ఆలనాపాలన లేకపోవడంతో కృష్ణవేణి విగ్రహం ధ్వంసమైంది. ప్రస్తుతం విగ్రహానికి తల లేదు. అక్కడ నిర్మించిన ఆలయం కూలిపోయి విగ్రహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇక్కడ ఉన్న గుడిని పునరుద్ధరించాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. కొత్తఘాట్లో కొత్త విగ్రహం.. ఇటిక్యాల: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని 2004లో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణవేణి విగ్రహాన్ని ప్రతిషి్ఠం చారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ ఏడాది నూతనంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్పై సైతం కృష్ణవేణì విగ్రహాన్ని ప్రతిషి్ఠంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.గురువు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి ముక్కోటి దేవతామూర్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. -
వార్డు సభ్యురాలి ఆత్మహత్య
మిడుతూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా మిడుతూరులో వార్డు సభ్యురాలు కృష్ణవేణి కుటుంబ కలహాల కారణంగా ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల వల్ల గత కొంతకాలంగా మనస్థాపానికి గురవుతున్న కృష్ణవేణి జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వనస్థలిపురంలో మహిళ ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ: వనస్థలిపురంలో కృష్ణవేణి(29) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని తెలిసింది. కృష్ణవేణి చనిపోతూ సూసైడ్నోట్ రాసింది. సంఘటనాస్థలం నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సంతకం పెట్టకుంటే దూకేస్తా
అనంతపురం : పొలం విక్రయానికి భార్య సంతకం పెట్టలేదని భర్తకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో వాటర్ ట్యాంక్ ఎక్కాడు. సంతకం పెట్టకపోతే అక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ ఘటన మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం పట్టణంలోని ఉల్లిగమ్మ దేవాలయం వద్ద దంపతులు ఎర్రస్వామి, కృష్ణవేణి నివసిస్తున్నారు. అయితే మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. కోర్టు ద్వారా విడాకులు కూడా తీసుకున్నారు. అయితే వీరికి ముగ్గురు పిల్లలున్నారు. నాలుగు ఎకరాల పొలం కూడా ఉంది. చెరో రెండెకరాల పొలం పంచుకున్నారు. కాగా పొలం అంతా భార్య పేరు మీద ఉంది. విడాకుల వ్యవహారం పూర్తయిన తర్వాతే సంతకం పెడతానని భార్య అనడంతో ఎర్రస్వామి ట్యాంకెక్కి కిందకు దూకుతానని బెదిరిస్తున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. -
'రాయితో కొట్టి భార్యను చంపేశాడు'
ముదిగొండ (ఖమ్మం): అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామానికి చెందిన రాపోలు శ్రీను, కృష్ణవేణి (24) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే, శ్రీను తరచూ భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. గత నెల 26న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా భార్యను రాయితో బలంగా మోదటంతో ఆమె తలపై గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే శ్రీను ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు భార్యను వరంగల్ ఎంజీఎంకు తరలించాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తరచూ తన కుమార్తెను అనుమానించేవాడని, అదే కారణంతో ఆమెను కొట్టి చంపాడని శ్రీనుపై కృష్ణవేణి తండ్రి సంపంగి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాములుది నల్లగొండ జిల్లా అనుముల గ్రామం. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నాకూతురిని బతికించండి !
-
డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ బాలిక మృతి
కరీంనగర్ : డ్యాన్ ప్రాక్టీస్ చేస్తుండగా బాలిక మృతి చెందిన సంఘటన వెలగటూరు మండలంలో కుమ్మర్పల్లిలో చోటు చేసుకుంది. వెలగటూరు మండలానికి చెందిన కృష్ణవేణి(13) అనే బాలిక కుమ్మర్పల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో డ్యాన్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను పాఠశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించే లోపే కృష్ణవేణి ప్రాణాలు విడిచింది. -
అందంగా ఉండను... బయటకు వెళ్లలేను... ఎలా?
నేనో గృహిణిని. మావారు ఆఫీసుకి, పిల్లలు స్కూలుకి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగానే ఉంటాను. దాంతో ఊసుపోక అప్పుడప్పుడూ పక్కింటి వాళ్లతో కబుర్లు చెబుతుంటాను. ఈ మధ్యనే మా పక్కింట్లోకి కొత్తగా ఒక కుటుంబం వచ్చింది. ఆ ఇంటావిడే వచ్చి నన్ను పరిచయం చేసుకుంది. మంచిదానిలాగే ఉంది కదా అని స్నేహం చేశాను. కానీ ఆమె ధోరణి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. మా వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటోంది. మాట తప్పించినా పదే పదే గుచ్చి అడుగుతుంటుంది. అలాగే వాళ్ల ఇంట్లో విషయాలూ నాకు చెబుతుంది. నాకు ఈ రెండూ ఇష్టం లేదు. అలాగని ఆమె చెడ్డదేమీ కాదు. అందుకే స్నేహం చెడగొట్టుకోలేకపోతున్నాను. ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్లం కదా? ఆవిడ మనసు బాధపడకుండా ఆమెలో మార్పు ఎలా తీసుకురావాలో తెలియజేయండి. - కృష్ణవేణి, రేణిగుంట ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు... చాలామందిది. ‘స్నేహితుల్ని ఎలా చేసుకోవాలి?’ అని డేల్ కార్నీ దగ్గర్నుంచి చాలామంది రాశారు కానీ... ‘ఎలా వదిలించుకోవాలి’ అనే పుస్తకాలు చాలా తక్కువ వచ్చాయి. తెలుగులో అయితే అస్సలు రాలేదు. ముక్తసరిగా మాట్లాడటమనేది ఒక కళ. ఆసక్తిగా వినకుండా ‘ఏదైనా పని ఉంది’ అని తప్పించుకోవచ్చు. బాధలు వినడంలో ఆసక్తి తగ్గించుకోండి. మీరొక జ్ఞానమూర్తిగా ఊహించుకుని సలహాలివ్వడం మానెయ్యండి. ఆమెలో మార్పు తీసుకురావడానికి మీరేమీ ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు మారండి. వీలైనంత వరకూ స్నేహాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడి వరకూ ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఆమె చెడ్డదేమీ కాదు అన్నారు. మనల్ని బాధపెట్టడానికి అవతలివారు చెడ్డవారు కానవసరం లేదు. ఇద్దరు మంచి వ్యక్తులు కూడా మంచి ఇరుగూ పొరుగూ అవ్వకపోవచ్చు. నేను నల్లగా పొట్టిగా ఉంటాను. మొహం మీద మచ్చలు. దానికి తోడు కళ్లజోడు. జుట్టు కూడా బాగా ఊడిపోతోంది. బయటకు వెళ్లాలన్నా, అందరితో మాట్లాడాలన్నా ఫ్రీగా ఉండలేకపోతున్నాను. నామీద నాకు అసహ్యం వేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదైనా సలహా ఇవ్వగలరా? - నందిత, చేబ్రోలు సమస్యలు రెండు రకాలు. మనం అధిగమించగలిగేవి, అధిగమించలేనివి. సమస్యల్ని మర్చిపోవాలి. అధిగమించగలిగిన ఉన్నత స్థానాల్ని చేరుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా రంగాల్లో పెద్ద పెద్ద స్థానాలు అలంకరించిన వారందరూ కాస్త అందవిహీనంగానే ఉంటారు. ఆ ఆత్మన్యూనతా భావమే బహుశా వారి వెనుక స్ఫూర్తి. మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. అందంతో కాదు, ఏదైనా కళతో గెలవండి. సచిన్ టెండూల్కర్ పొట్టి. స్టీఫెన్ హాకింగ్ అంగవైకల్యుడు. అయినా కూడా కృషితో, పట్టుదలతో పైకొచ్చారు. అందరిచేతా గుర్తింపబడ్డారు. వారిని ప్రేరణగా తీసుకుంటే మీకంటూ ఒక ప్రపంచం ఏర్పడుతుంది. బెస్టాఫ్ లక్! ఫలానా రోజు, ఫలానా చోట, ఫలానా నదిలో మునిగితే పుణ్యం వస్తుంది అనే నమ్మకంలో తర్కం ఉందా? దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? - ప్రహ్లాద్, హైదరాబాద్ నమ్మకం వేరు, తర్కం వేరు. నలుగురు మనుషులు కూర్చుని ఒక చేదు ద్రవాన్ని తాగుతూ ఇదే ఆనందం అనుకోవడంలో ఏం తర్కం ఉంది? కానీ ఎంతమంది దాన్ని ఆనందిస్తున్నారో తెలుసు కదా! భక్తి కూడా అలాంటిదే. అది ఒక తదాత్మ్యత. అయితే చాలామంది దాన్ని ఆస్వాదించడం, ఆనందించడం మానేసి పాపభయంతో చేయడమే విచారకరం. ఆచారాలు మనిషికి ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. కానీ వాటిని పాటించకపోతే మాత్రం ఘోరమైన కష్టాల్లో పడతామనే భయం వాటిని పాటించేలా చేస్తోంది. అదే నిజం కాకపోతే పుణ్యక్షేత్రాలు దర్శించినవారు, పుణ్యనదుల్లో స్నానం చేసినవారు చాలా సంతోషంగా, ఒక రకమైన అలౌకిక ఆనందంలో ఉండాలి. కానీ ఉండరు. మొక్కు తీర్చకపోతే మాత్రం వచ్చిన ప్రతి కష్టాన్నీ దానికి ఆపాదించుకుంటారు. అంతవరకూ సరేగానీ తమ మొక్కుల కోసం పసిపిల్లల్ని కూడా ఆ కష్టాల్లో ఇరికించడం... ఆ ఒత్తిడికీ, కష్టాలకీ గురి చేయడాన్ని మాత్రం భగవంతుడనేవాడుంటే అతడు కూడా క్షమించడు. -
పరీక్ష తప్పానని ప్రాణం తీసుకుంది..!
‘ఖని’లో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య కోల్సిటీ : తొలుసూరి కాన్పులో ఆడపిల్ల పుడితే బంగారుతల్లి అని తల్లిదండ్రులు సంబురపడ్డారు. బాగా చదివి ప్ర యోజకురాలవుతుందని ఆశపడ్డారు. పెరిగి పెద్దాయ్యక, టెన్త్ చదువుతూ పరీక్షలో తప్పాననే మనోవేదనతో బాలిక బలవన్మరణానికి పాల్పడిం ది. కన్న వారికి శోకం మిగిల్చింది. ఈ సం ఘటన గోదావరిఖని గాంధీనగర్లో మూ డురోజుల తర్వాత మంగళవారం వెలుగు చూసింది. మృతురాలి తల్లిదండ్రులు తెలి పిన వివరాల మేరకు... గాంధీనగర్కు చెందిన ఎనగందుల శ్రీనివాస్-లక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. శ్రీనివాస్ ఆటో న డుపుతూ, లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పెద్దకూతు రు కృష్ణవేణి(15) స్థానిక సింగరేణి స్కూల్ లో పదో తరగతి చదివింది. ఆదివారం పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ ద్వారా ఫలితాలు చూసుకోగా మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైనట్లు తేలింది. మనస్తాపం చెందిన కృష్ణవేణి.. తాను టీచర్ను కలిసి వస్తానని తనతో వచ్చిన అత్తకూతురుకు చెప్పి ఇంటికి పంపించింది. అప్పట్నుంచి కనిపించకుండా పోయిన కృష్ణవేణి రాత్రి వరకూ ఇంటికి చేరలేదు. ఈనెల 16న వరంగల్లోని తన మేనబావమరిది చనిపోయాడని తెలియడంతో శ్రీనివాస్ దంపతులు అక్కడకు వెళ్లారు. కృష్ణవేని కనిపించడంలేదనే విషయం తెలియడంతో వెంటనే గోదావరిఖనికి చేరారు. సోమవారం సా యంత్రం వరకూ కృష్ణవేణి ఆచూకీ కోసం గాలించారు. అయినా ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా మి స్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, ఆది వారం కనిపించకుండా పోయిన కృష్ణవేణి స్థానిక పవర్హౌస్కు వెళ్లే దారి సమీపంలోని తుమ్మపొదళ్లలో చెట్టు కొమ్మకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్టౌన్ పోలీసులు గుర్తించారు. అప్పటికే గాలిస్తున్న ఆమె కుటుంబసభ్యులు, బంధువులు విగతజీవిగా మారిన కృష్ణవేణిని చూసి కన్నీరుమున్నీరయ్యూరు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మల్లారెడ్డి, వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్ పరిశీలించారు. కృష్ణవేణి మిస్సింగ్ కేసును ఆత్మహత్య కేసుగా నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
కృష్ణవేణికి కన్నీటి పరీక్ష
జగదేవ్పూర్ (మెదక్) : కన్నతండ్రి శవం ఇంట్లో ఉండగానే ఓ విద్యార్థిని తన దుఃఖాన్ని దిగమింగి పదోతరగతి పరీక్ష రాసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం అంతాయిగూడలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని అంతాయిగూడ గ్రామానికి చెందిన తిగుల్ల నర్సయ్యది వ్యవసాయం కుటుంబం. మంగళవారం ఇంట్లో చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నర్సయ్య అదే రోజు రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. నర్సయ్య కూతురు కృష్ణవేణి చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. బుధవారం నుంచే పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం తండ్రి శవం ఇంట్లోనే ఉంది. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ కృష్ణవేణి కొండపాక మండలం కుకునూర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పరీక్ష రాసింది. మధ్యాహ్నం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది. కృష్ణవేణికి వచ్చిన కష్టాన్ని చూసి పలువురు జాలిపడ్డారు. -
ఆడపిల్ల పుట్టిందని వేధింపులు
సైదాబాద్: రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చంపాపేట పరిధిలోని బాలాజీనగర్లో బుధవారం జరిగింది. రంగారెడ్డిజిల్లా గండేడు మండలం అచ్చెనపల్లికి చెందిన బాల గోవర్దన్రెడ్డితో మహబూబ్నగర్ జిల్లా తిరుమలగిరికి చెందిన కృష్ణవేణి(22)కి మూడేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు అక్షిత(2), పుట్టి(25 రోజులు) ఉన్నారు. వీరు ఐఎస్ సదన్ డివిజన్ చంపాపేట పరిధిలోని బాలాజీనగర్లో నివాసం ఉంటున్నారు. గోవర్దన్ ఆటో నడుపుతూ జీవస్తున్నాడు. కాగా కృష్ణవేణికి రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో గత కొద్ది రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా మారని భర్త భార్యను చితకబాది తిరిగి నగరానికి తీసుకొచ్చాడు. ఇంట్లో సూటి పోటి మాటలతో వేధిస్తుండటంతో కృష్ణవేణి బుధవారం గదిలోకి వెళ్లి ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. మృతురాలి భర్తతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్త, భర్తలు కలిసి కృష్ణవేణిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ మృతురాలి సోదరుడు కృష్ణారెడ్డి సైదాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంక్షేమ హాస్టళ్లలో ‘బయోమెట్రిక్’
ఫిబ్రవరి 1 నుంచి అమలు దళిత సంక్షేమశాఖ డీడీ కృష్ణవేణి ఏఎస్డబ్ల్యూఓలు, హెచ్డబ్ల్యూఓలతో సమీక్ష నక్కలగుట్ట : జిల్లాలోని 99 దళిత సంక్షేమశాఖ హాస్టళ్ల లో ఫిబ్రవరి ఒకటి నుంచి బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు జిల్లా దళిత సంక్షేమ శాఖ ఇన్చార్జ్ డిప్యూటీ డెరైక్టర్ కొమ్మెర్ల కృష్ణవేణి తెలిపారు. హన్మకొండ కలెక్టరేట్లోని దళిత సంక్షేమశాఖ డీడీ కార్యాలయంలో బుధవారం ఏఎస్డబ్ల్యూఓలు, హెచ్డబ్ల్యూఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దళిత సంక్షేమ హాస్టళ్లలో ఆధార్ కార్డులు లేని విద్యార్థుల వివరాలు సేకరించాలని సూచించారు. వారిని ఆధార్కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేర కు విద్యార్థులు హాస్టళ్లలో చదువుకునే చోట లైటింగ్ ఏర్పా టు చేయూలని, హాస్టళ్లలోని మరుగుదొడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయించాలన్నారు. విద్యార్థులకు నెలకు రెండు చొప్పున టారుులెట్ సబ్బులను అందుబాటులో ఉంచాలన్నారు. మరుగుదొడ్ల మరమ్మతులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదించాలని జిల్లాలోని అన్ని హాస్టళ్లలో మౌలిక సదుపాయూల కల్పనకు హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని ఏఎస్డబ్ల్యూఓలకు సూచించారు. ప్రధానంగా హాస్టళ్లలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మండల సర్వసభ్య సమావేశాలకు ఏఎస్డబ్ల్యూఓలు హాజరై హాస్టళ్లలోని సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కష్టాల్లో ఉన్నారని, అన్ని విధాలుగా ఆదుకోవాలని కొమ్మెర్ల కృష్ణవేణిని హెచ్డబ్ల్యూఓల సంఘం జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్ ఇన్చార్జ్ ఏబీసీడబ్ల్యూఓ సురేందర్ కోరారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమశాఖ డీడీ కార్యాలయ సూపరింటెం డెంట్లు సత్యనారాయణ, వరలక్ష్మి, హన్మకొండ ఏఎస్డబ్ల్యూఓ రమాదేవి, హెచ్డబ్ల్యూఓల సం ఘం జిల్లా ప్రధానకార్యదర్శి రవీందర్రెడ్డి, హెచ్డబ్ల్యూఓలు భవానీ ప్రసాద్, రాంరెడ్డి, చంద్రశేఖర్, సుదర్శన్రావు పాల్గొన్నారు. -
జల సమాధి
దుస్తులు శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు మహిళలు జలసమాధి అయ్యారు. వారు ముగ్గురూ ఒకే వీధివాసులు... కూలి చేస్తేగాని పూట గడవని పరిస్థితి వారి కుటుంబాలది. వారిలో ఇద్దరికి వివాహం జరిగింది. ఇద్దరు చొప్పునచిన్న పిల్లలు ఉన్నారు. మరో యువతి ఇంటర్మీడియెట్ చదువుతోంది. చెరువుకు కలిసి వెళ్లిన వీరు....మృత్యువులోనూ అదే బాటపట్టారు. విజయనగరం క్రైం: చెరువు ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. కలిసి దుస్తులు ఉతకడానికి వెళ్లిన వారు కలిసే విగతజీవులయ్యారు. ఒకరిని రక్షించబోయి మరో ఇద్దరు మృత్యుకోరల్లో చిక్కుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన విజయనగరం మండలం గుంకలాం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షి అందించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..విజయనగరం మండ లం గుంకలాం గ్రామంలో మెయిన్ వీధిలో నివాసముంటున్న లెంక వెంకన్న కుమార్తె లెంక దేవి ఇంటర్మీడియెట్ చదువుతోంది. అదే వీధిలో కలిశెట్టి రాంబాబు, అతని భార్య కృష్ణవేణి, కునుకు గోవింద, అతని భార్య లక్ష్మి నివాసం ఉంటున్నారు. ఇటీవల హుదూద్ తుపాను రావడంతో ఇంట్లో మాసిన దుస్తులు ఎక్కువగా పేరుకుపోయాయి. దీంతో శనివారం లెంక దేవి (17), కలిశెట్టి కృష్ణవేణి (26), కునుకు లక్ష్మి (24)తో పాటు కోరాడ నారాయణమ్మ దుస్తులు ఉతికేందుకు సమీపంలోని పెద్దరం గ చెరువు వద్దకు వెళ్లారు. ఉతికిన దుస్తులను జాడిస్తున్న సమయంలో కాలుజారి కలిశెట్టి కృష్ణవేణి చెరువులో పడిపోయింది. రక్షిం చాలని ఆమె కేకలు వేయడంతో ఉతికిన చీరను చెరువులోకి విసిరి ఆమెను కాపాడబోయారు. కృష్ణవేణి తనను రక్షించుకొనే ప్రయ త్నంలో చీరను గట్టిగా లాగడంతో రెండో చివర పట్టుకున్న లెంక దేవి, కునుక లక్ష్మి కూడా చెరువులో పడిపోయారు. ముగ్గురూ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి కోరాడ నారాయణమ్మ భయంతో గ్రామంలోకి పరుగులు తీసి సమాచారం అం దించింది. వెంటనే గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని చెరువులోకి దిగి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ముగ్గు రూ మృతి చెందారు. లెంక దేవి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్ (సీఈసీ) చదువుతోంది. లెంక దేవికి తండ్రి వెంకన్న, తల్లి కుమారి, తమ్ముడు మణికంఠ ఉన్నారు. వెంకన్న కూలిపని చేసుకుని పిల్లలను పోషిస్తున్నాడు. కలిశెట్టి కృష్ణవేణికి భర్త రాంబాబు, కుమార్తెలు దీపిక (7), సాయి (3), కునుకు లక్ష్మికి భర్త గోవింద, కుమార్తెలు అనూష (5), మానస (2) ఉన్నారు. వీరి భర్తలు ఇద్దరూ కూలిపనిచేసి కుటుంబాల్ని పోషిస్తున్నారు. భర్తలకు చేదోడుగా వీరూ పనులకు వెళ్లేవారు. రూరల్ ఎస్ ఐ ఎస్.కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. దుఃఖ సాగరంలో బంధువులు మృతుల బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. సంఘటన స్థలం వద్ద వారి రోధనలు మిన్నంటాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెను చెరువు కబళించేసిందని దేవి తల్లిద ండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోజు కూలీ పని చేసి క ష్టపడి సంపాధించిన డబ్బులతో తన కుమార్తెను ఉన్నత విద్య అందించాలని ఎంతో ఆశపడితే ఇలా మృత్యువు కాటేసిందని ఏడుస్తున్నారు. చిన్న పిల్లలను ఎలా సాకాలని, వారు అమ్మకావాలని అడిగితే ఏమని సమాధానం చెప్పాలంటూ కలిశెట్టి కృష్ణవేణి భర్త రాంబాబు, కునుకు లక్ష్మి భర్త గోవిందుతో పాటు వారి కుటుంబ సభ్యులు గుండెలు బాధుకుంటూ రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. ఇద్దరికీ చిన్నపిల్లలు చెరువులో పడి మృతి చెందిన కృష్ణవేణి, కునుకు లక్ష్మికీ ఇద్దరేసి ఆడపిల్లలున్నారు. చిన్న పిల్లలను చూసైనా కనికరం చూడకుండా దేవుడు వారిని తీసుకుపోయాడని, పిల్లలేం పాపం చేశారని, తల్లులు లేని పిల్లలనుచేసి అన్యాయం చేశాడని స్థానికులు కన్నీరు పెట్టారు. బాధితులను పరామర్శించిన నాయకులు వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చారు. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ స్వాతీరాణి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు వెంకట నర్సింగరావు, జెడ్పీటీసీ తుంపల్లి రమణ గ్రామ సర్పంచ్ కర్రో రమణమ్మ, వైఎస్ఆర్ సీపీ నాయకులు బోగి రమణ, సత్యనారాయణ బాధితులను పరామర్శించారు. ప్రమాదభరితంగా చెరువు పెద చెరువు ప్రమాదభరితంగా మారింది. చెరువు వద్ద పెద్ద రాయబండ ఉంది. ఆ రాయి మీద కాలు జారితే చెరువులో పడి మృతి చెందవలసిందే. సుమారు ఎనిమిదేళ్ల కిందట ఇదే చెరువులో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. వారు స్నానం చేస్తుండగా ఈతరాక చెరువులోకి పడి మృతిచెందారు. ఇప్పుడు కూడా ముగ్గురు మహిళలు మృతి చెందడంతో ముగ్గురేసి చొప్పున చెరువు బలితీసుకుంటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదభరితంగా ఉన్న ప్రాంతంలో బట్టలు ఉతకడాన్ని గ్రామస్తులు నిషేధించడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఎత్తుకెళ్లి...గొంతు కోసి చిన్నారిని చిదిమేశాడు
అమ్మఒడిలో ఆదమరిచి నిద్దరోతున్న చిన్నారి.. శాశ్వత నిద్రలోకి జారుకుంటానని ఊహించలేకపోయింది.. పెద్దల మధ్య పొరపచ్చాలు...ఆ పాప పాలిట శాపమయ్యాయి.. కఠినాత్ముడు...కర్కశంగా వ్యవహరించాడు.. కృష్ణవేణిని కడతేర్చాడు... నార్కట్పల్లి: నార్కట్పల్లి మండలంలో సంచలనం సృష్టించిన చిన్నారి కృష్ణవేణి హత్యోదంతం వెనుక అయినవా రి కుట్రదాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం మండలంలోని బంటుగూడెంలో వెలుగుచూసిన చిన్నారి దారుణ హత్య ఉదం తం మండల వ్యాప్తంగా దావానంలా వ్యాపి ంచింది. పోలీసులు ఘటనస్థలాన్ని పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు. డాగ్స్వ్కాడ్ గుర్తించిందని.. చిన్నారి హత్య విషయం తెలుసుకున్న డీఎస్పీ రాంమోహన్రావు, సీఐ రాఘవేంద్ర వెంటనే బంటుగూడెం గ్రామానికి వచ్చారు. డాగ్స్క్వాడ్ను రప్పిం చారు.అయితే డాగ్స్క్వాడ్ అక్కడే ఉన్న రమావత్ శ్రీ ను గుర్తించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పనిచేసుకునేందుకు వచ్చి.. పోలీసులు అదుపులోకి తీసుకున్న రమావత్ శ్రీను హత్యగాబడిన కృష్ణవేణికి వరుసకు మామ అవుతాడు. పెద్దవూర మండలం మూలతండాకు చెందిన హనుమంతు మొ దటి భార్య భారతి చనిపోవడంతో తన మేడకోడలు చంద్రకళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు, రెండో భార్యకు ఇద్దరు చొప్పు న ఆడపిల్లలు జన్మించారు. కాగా, 3 నెలల నుంచి హనుమంతు తన భార్య పిల్లలో కలిసి బంటుగూడెం లో తోట వద్ద జీతానికి పనిచేస్తున్నాడు. మొదటిభార్య సోదరుడైన రమావత్ శ్రీను బావ దగ్గరికి ఇరవై రోజుల క్రితం వచ్చి కూలిపనులు చేసుకుంటున్నాడు. ఇతడితో పాటు చంద్రకళ చిన్నాన్న కుమారుడు అరుణ్ కూడా వచ్చి ఉంటున్నాడు. అయితే కృష్ణవేణి హత్య జరిగిన రోజే తండ్రి స్వగ్రామానికి వెళ్లడం, డాగ్స్క్వాడ్ శ్రీనును గుర్తించడంతో హత్య వెనుక అయినవారి హస్తం ఉందనే కోణంలోనే విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ట్లుఎస్ఐ ప్రణీత్కుమార్ తెలిపారు. -
మృత్యుంజయురాలు కృష్ణవేణి
హిరమండలం: చెన్నైలో మూడు రోజుల కిందట జరిగిన దుర్ఘటన నుంచి గొట్టాకు చెందిన ఓ మహిళ ప్రాణాలతో బైటపడింది. బహుళ అంతస్తుల భవనం శిథిలాల కింద చిక్కి రెండు రోజులు నరకం అనుభవించిన ఆమెను సోమవారం సాయంత్రం సహాయక బృందం సభ్యులు ప్రాణాలతో బైటకు తీశారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది ఆమెకు పునర్జన్మేనని గ్రామస్తులు అంటున్నారు. వివరాలు ఇవీ... చెన్నైలో జరిగిన దుర్ఘటనలో శిథిలాల కింద హిరమండలం మండలం గొట్టకు చెందిన మీసాల శ్రీను, ఆయన కుమార్తె భవాని, కొంగరాపు కృష్ణవేణి, ఆమె భర్త శ్రీను, లక్ష్మీపురానికి చెందిన పెసైక్కి జ్యోతి చిక్కుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. శిథిలాలు తొలగిస్తుండగా కృష్ణవేణి ప్రాణాలతో బయటపడింది. విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా తతిమా వారు కూడా ప్రాణాలతో బైటపడొచ్చన్న ఆశ గ్రామస్తుల్లో చిగురిస్తోంది. దుర్ఘటన జరిగిన వెంటనే ఇక్కడి నుంచి చెన్నై వెళ్లిన వారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇక్కడకు చేరవేస్తునే ఉన్నారు. వీరిలో ఒకరైన ఆర్ఐ శంకర్ను సంప్రదించగా కృష్ణవేణి ఆరోగ్యం నిలకడగా ఉందని, స్వల్ప గాయాలు తగలడంతో రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. కాగా కృష్ణవేణి తన పిల్లలు సాయి, సుశ్మితతో ఫోన్లో మాట్లాడారు. తాను క్షేమంగానున్నానని త్వరలోనే ఇంటికొచ్చేస్తానని చెప్పింది. సంఘటన జరిగిన సమయంలో భర్త తనను బయటకు నెట్టివేయడం వల్లే బతికానని, ఆయన ఆచూకీ ఇంకా తెలియరాలేదని చెప్పిందని గ్రామస్తులు తెలిపారు. అలాగే పెసైక్కి సింహాచలం ఫోన్లో మాట్లాడుతూ తన భార్య జ్యోతి ఇంకా శిథిలాల కిందే ఉందని చెప్పారు. అయితే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. చైన్నై అధికారులు భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారని, కానీ కుటుంబ సభ్యులు చిక్కుకోవడంతో తామే పస్తులుంటున్నామని చెప్పారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పాలకొండ ఆర్డీవో తేజ్భరత్, రాజాం తహశీల్దార్ జె.రామారావు, హిరమండలం ఆర్ఐ శంకర్ రావడంతో తమకు మానసిక స్థైర్యం వచ్చిందన్నారు. -
మెడిసిన్ విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ: మెడిసిన్ విద్యార్థిని మంగళవారం రాత్రి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న కృష్ణవేణి (25) రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తాడేపల్లి సమీపంలో కృష్ణానదిలో దూకింది. చూసిన స్థానిక మత్య్సకారులు వెంటనే నదిలో దూకి విద్యార్థినిని రక్షించారు. కొన ఊపిరితో ఉన్న కృష్ణవేణిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 108 వాహనంలో కృష్ణవేణిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించడం ఆలస్యం అయిన కారణంగా మృతి చెందినట్లు భావిస్తున్నారు. కృష్ణవేణి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో పెట్టినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆత్మహత్య చేసుకుంటానని కృష్ణవేణి ఇంట్లోవారిని బెదిరిస్తోందని సమాచారం. ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమై ఉంటుందేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణవేణి అమ్మ,నాన్న ఇద్దరూ డాక్టర్లే. బాబాయి డాక్టరే. ఆ కుటుంబానికి సంబంధించి మొత్తం 13 మంది డాక్టర్లు ఉన్నారు. కృష్ణవేణి తండ్రి గుంటూరులో డాక్టరు కాగా, తల్లి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. -
స్టాఫ్నర్సు ఆత్మహత్యాయత్నం
మహబూబ్నగర్ క్రైం/అడ్డకల్ న్యూస్లైన్: ఓ స్టాఫ్నర్సు తాను విధులు నిర్వహిస్తున్న పీహెచ్సీలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన శనివారం అడ్డాకుల మండలం జానంపేట పీహెచ్సీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేర కు.. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం(పీహెచ్సీ)లో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్న కృష్ణవేణికి శనివారం సాయంత్రం నుంచి విధులు నిర్వహించాల్సి ఉంది. తనకు సా యంత్రం వ్యక్తిగత పనిఉండటంతో ఉదయం విధులు నిర్వహిం చాల్సిన మరో స్టాఫ్నర్సుతో సర్దుబాటు చేసుకుని ఉదయం విధులకు వచ్చింది. దీంతో పీహెచ్సీ వైద్యాధికారిణి జరీనాభాను సదరు స్టాఫ్నర్సును పిలిచి డ్యూటీలు మార్చుకుంటే తన సమాచారం ఇవ్వాలని, మీ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే బాగుండదని తిరి గి వెళ్లాలని సూచించింది. రోస్టర్పద్ధతి ప్రకారం సాయంత్రం విధులకే రావాలని హుకుంజారీచేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో వైద్యాధికారిణి కృష్ణవేణికి మెమో జారీచేసింది. దీంతో మనస్తాపానికి గురైన స్టాఫ్నర్సు పీహెచ్సీలోనే ఓ గదిలోకి వెళ్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు సెల్ మెసేజ్ పంపించింది. ఇది గమనించిన తోటిసిబ్బంది ఆమెను వెంటనే చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే కోలుకుంటుంది. వైద్యాధికారిణి కాంట్రాక్టు సిబ్బందిని ఓ విధంగా తనను మరోవిధంగా చూస్తోం దని బాధితురాలు వినిపిస్తోంది. వైద్యాధికారిణి ఏమన్నారంటే.. ‘రోస్టర్ ప్రకారం విధులు నిర్వహించాలని చెప్పడం తప్పైపోయింది. విధులకు సక్రమంగా హాజరుకాకుండా కుటుంబసమస్యలతో ఆమె ఎప్పుడు ఆందోళనగానే ఉండేది. శ నివారం కృష్ణవేణి సాయంత్రం డ్యూటీకి రావాలి. కానీ ఆమె ఉదయం డ్యూటీకి వచ్చింది. సాయంత్రం డ్యూటీకి రావాలని సూచించడంతో గొడవకు దిగింది. ఆస్పత్రిలోని ఓ గదిలోకి వెళ్లి నిద్రమాత్రలు మింగింది. వాస్తవంగా ఆమె నిద్రమాత్రలు మింగిందా? లేదా అనుమానంగా ఉంది..’అని వైద్యాధికారిణి జరీనాభాను పేర్కొంది. గతంలో కూడా ఆమె ఇక్కడపనిచేస్తున్న ఓ వైద్యుడిని బెదిరించేందుకు నిద్రమాత్రలు మింగినట్లు తెలిసింది.