విజయవాడ : కృష్ణా పుష్కరాల విధులకు ఐఏఎస్ అధికారులతోపాటు డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లతోపాటు సిబ్బంది హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం విజయవాడలో కృష్ణ పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అక్షయ ద్వారా టీటీడీ నిర్వహిస్తున్న భోజన ఏర్పాట్లపై నేడే ట్రయల్ రన్ నిర్వహించాలని ఉన్నతాధికారులకు తెలిపారు.