గోదావరి పుష్కరాలు కాదు.. గులాబీ పుష్కరాలు | Congress Ex Minister Sridhar Babu visits Pushkar ghat in Manthani | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలు కాదు.. గులాబీ పుష్కరాలు

Published Fri, Jul 10 2015 3:19 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Ex Minister Sridhar Babu visits Pushkar ghat in Manthani

కరీంనగర్ (మంథని) : కరీంనగర్ జిల్లా మంథనిలోని పుష్కరఘాట్ను శుక్రవారం కాంగ్రెస్ నేతల బృందం పరిశీలించింది. పుష్కర ఘాట్ల వద్ద చేసిన ఏర్పాట్ల పట్ల కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇవి గోదావరి పుష్కరాలు కాదని, గులాబీ పుష్కరాలని ఎద్దేవా చేశారు. గుళ్లు, గోపురాలకు గులాబి రంగు వేశారని, దేవుళ్లకు రాజకీయ రంగు పూయడం మంచిది కాదని ఆయన అన్నారు. పుష్కరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా  ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement