Manthani
-
అపురూపాల మంత్రపురి
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) ప్రాచీన పట్టణం. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఆ గ్రామంలో ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగించే వస్తువులు.. ఇలా అన్నీ భిన్నంగానే ఉంటాయి. ఉన్నతోద్యోగాలు, ఉపాధి కోసం.. మంత్రపురి (Mantrapuri) వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిపోయారు. సమాజంలో మార్పులకు ఇక్కడి ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. కానీ మంథనిలోని సీతారామ సేవా సదన్ స్వచ్ఛంద సేవా సంస్థ.. ఈ గ్రామస్తులు తరతరాలుగా వినియోగించిన విలువైన పురాతన వస్తు సామగ్రిని భవిష్యత్తరాలకు అందించేందుకు కృషి చేస్తోంది. అందుకోసం మంత్రపురిలోని పురాతన ఇళ్లు, వాటిలోని వస్తుసామగ్రి, వంటలు, వ్యవసాయ.. తదితర అవసరాలకు ఉపయోగించే పురాతన వస్తువులను సేకరించి ప్రదర్శించేందుకు మంత్రపురి దర్శన్ను ఏర్పాటు చేసింది. ఇందులో పురాతన వంటసామగ్రి, ధాన్యం నిల్వచేసే గాదెలు, కొలతలు, ప్రమాణాల పరికరాలు, వ్యవసాయ పరికరాలు, ఎండ, వేడి, చలిని తట్టుకునేలా సొనార్చి (మిద్దె), పాలతం.. తదితర సుమారు ఐదు వందల రకాల వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. ఇందు కోసం ఓ ఇంటిని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రజల సందర్శనార్థం రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శన శాలను తెరిచి ఉంచుతున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడి స్వస్థలానికి వచ్చిన ప్రవాసులు.. ఈ పురాతన వస్తువులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మంథనితోపాటు చుట్టు పక్కల ప్రాంతాల విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. పురాతన వస్తుసామగ్రి సేకరణకు దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టిందని, మరో 50 ఏళ్లు ఇవి ఉండేలా ఇంటిని నిర్మించామని సేవా సదన్ (Seva Sadan) వ్యవస్థాపకుడు గట్టు నారాయణ గురూజీ, అధ్యక్షుడు కర్నే హరిబాబు తెలిపారు.ఎన్టీపీసీ, సింగరేణిలో ప్రదర్శన మంత్రపురి దర్శన్లోని తాళపత్ర గ్రంథాలతోపాటు ఇతర పురాతన వస్తువులను ఎన్టీపీసీ, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఇలా పలుమార్లు పలు సంస్థలు.. ఇతర ప్రాంతాల వారు వచ్చి ఈ పురాతన వస్తువులను తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ తీసుకొచ్చి మంత్రపురి దర్శన్ నిర్వాహకులకు అప్పగిస్తున్నారు.చదవండి: మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలంనేటితరం కోసం.. భారతీయ ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతిలో లభించే అనేక వస్తువులు కనుమరుగవుతున్నాయి. ఈక్రమంలో నాటి కుటీర, గ్రామీణ వ్యవస్థ, వస్తువులను నేటితరానికి చూపించాలనే ఆకాంక్షతోనే గట్టు నారాయణ గురూజీ ఈ అవకాశం కల్పించారు. విద్యార్థులు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -
మంథనిలో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
-
ప్రమాదంలో సుందిళ్ల పార్వతి బ్యారేజ్
-
భారీ వర్షాలకు మునిగిన మంథని ప్రధాన రహదారి
-
పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్కు షాక్
-
జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
-
ప్రచారంలో ప్రత్యర్థి కంటే ఎక్కువ జోరు చూపిస్తున్న శ్రీధర్ బాబు
-
పుట్టకే టికెట్.. మంథనిలో ఉత్కంఠ పోరు!
మంథని నియోజకవర్గంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు మూడుసార్లు మంథని నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది స్పీకర్గా సేవలందించారు. అనంతరం దుద్దిల్ల శ్రీధర్ బాబు నాలుగు సార్లు గెలుపొంది వివిధ శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ► నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు: మధుకర్ హత్య, న్యాయవాదులైన గట్టు వామన్ రావు - నాగమణి దంపతుల హత్య. ► ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ మంథని ఎమ్మెల్యేగా ఉన్న దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్ట మధు ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్గా ఉన్నాడు. బీజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, బీజెపి పార్టీ నుంచి సునీల్ రెడ్డికి పోటీ ఎవరూ లేకపోవడం పార్టీ టికెట్ కన్ఫాం కావడంతో గెలుపు కోసం ఎవరి ప్రచారాలు వారు చేసుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది... ప్రస్తుత పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జీగా ఉన్న పుట్ట మధుపై హైకోర్టు న్యాయవాద గట్టు వామన్ రావు - నాగమణి దంపతులు హత్య అనంతరం వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో పుట్టమధు పది రోజులు కనిపించకుండపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసాయి. తన రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడానికి పుట్టమధు బహుజనవాదం, బీసీ వాదాన్ని భుజానికెత్తుకున్నారు. కాటారం సింగిల్ విండో చైర్మన్గా ఉన్న చల్ల నారాయణరెడ్డి ఇటీవల రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయా శుభకార్యాలకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్లో ఉంటూ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను చేరదీస్తూ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నాడు... రెండు రోజుల క్రితం పెద్దపెల్లి మాజీ ఎంపీ చేలిమల సుగుణ కుమారి మంథని, పెద్దపల్లిలో పర్యటించారు. చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటున్న మాజీ ఎంపీ సుగుణకుమారి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో పొలిటికల్ సర్కిల్లో ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే సుగుణ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా?.. పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఇలా వివిధ రకాల గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? దుదిల్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్ పార్టీ). చంద్రుడు పట్ల సునీల్ రెడ్డి (బిజెపి పార్టీ). పుట్ట మధుకర్ (బీఆర్ఎస్ పార్టీ) మంథని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు: మంథని నియోజవర్గంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు నీట మునుగుతుండటం. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్తో గోదావరి నదిని ఆనుకొని ఉన్న గ్రామాలైన ఖాన్ సాయిపేట, ఆరెంద, మల్లారం, ఖానాపూర్, ఉప్పట్ల, విలోచవరం, పోతారం తదితర గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా పంటలు పండలేని పరిస్థితి. గోదావరినదిని ఆనుకొని కరకట్ట నిర్మించాలని లేని పక్షంలో భూసేకరణ చేయాలని కోరుతున్న రైతులు. ఇసుక క్వారీలతో వందలాది లారీలు నిత్యం రాకపోకలతో కాటారం- మంథని ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, దీంతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అంతేకాదు తరచూ లారీల రాకపోకల కారణంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఇంటి పెద్దలను కొల్పోయి ఎన్నో కుటుంబాలు ఆసరా కోల్పోతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మంథని, మున్సిపాలిటీగా మారడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన మంథని మున్సిపాలిటీ పరిధిలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా విగ్రహాలే ఎక్కడికక్కడే పేరుకపోయిన సమస్యలు. పట్టణం లోని మాతాశిశు హాస్పిటల్ ముందున్న డంపింగ్ యార్డ్ లో కాల్చిన చెత్త వలన వచ్చే పొగతో అనారోగ్య బారినపడుతున్న ప్రజలు. రామగిరి మండలంలో ప్రధానంగా సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలు, భూ నిర్వాసితులకు ఇటు సింగరేణి పరంగా అటు ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ రాకపోవడం రెంటికి చెడ్డ రేవడిలా మారింది... మంథని నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దగా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని, మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, సహజ వనలను దోచుకుపోతున్నారనేది మాత్రం వాస్తవం... ముఖ్యంగా రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు రావడంలేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వృత్తిపరంగా రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సింగరేణి బోగ్గు కార్మికులు ఎక్కువ. నదులు: గోదావరి, ప్రాణహిత ఆలయాలు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరంలోని కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయం, మంథనిలో పురాతన ఆలయాలు. పర్యాటకం: కాలేశ్వరం ప్రాజెక్ట్, రామగిరి ఖిల్లా, కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండ -
బడిలో గుండెపోటుతో ఉపాధ్యాయురాలి మృతి
సాక్షి, కరీంనగర్: మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన్నీరు సునీత(37) పాఠశాలలో బుధవారం గుండెపోటుతో మృతి చెందింది. ఫిజికల్ సైన్స్ బోధించే సునీత పాఠశాలలోని కార్యాలయగదిలో తోటి ఉపాధ్యాయులతో కలిసి కుర్చీలో కూర్చుంది. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయింది. తోటిసిబ్బంది పరీక్షించి వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని పరీక్షించగా.. అప్పటికే పనిపోయిందని తెలిపారు. అప్పటివరకు తమతో ఉన్న ఉపాధ్యాయురాలు ఒక్కక్షణంలో చనిపోవడాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయురాలు జీర్ణించుకోలేకపోతున్నారు. సునీతది మంచిర్యాల జిల్లాకేంద్రంలోని గౌతమేశ్వరకాలనీ. ఈమె భర్త కూడా అంతర్గాం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. -
నాకెందుకు అన్యాయం చేశావ్.. కరెంట్ పోల్కు కట్టేసి చితకబాదింది!
సాక్షి, పెద్దపల్లి: తన భర్త రెండో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య.. అతడికి దేహశుద్ధి చేసింది. భర్తను ఓ కరెంట్ స్థంభానికి కట్టేసి చితకబాదింది. చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ షాకింగ్ ఘటన మంథనిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిలను శ్రీకాంత్ రెడ్డి వివాహం చేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అఖిల పేరెంట్స్ శ్రీకాంత్ రెడ్డికి కట్నంగా 20 లక్షలు ఇచ్చారు. అయితే, వీరిద్దరికీ కొడుకు జన్మించిన అనంతరం.. శ్రీకాంత్ భార్యను వదిలిపెట్టి వెళ్లాడు. అనంతరం, వరంగల్లో మరో మహిళను వివాహం చేసుకున్నట్టు తెలుసుకున్న అఖిల.. కుటుంబ సభ్యుల సాయంతో శ్రీకాంత్ రెడ్డిని హన్మకొండ నుంచి స్వర్ణపల్లికి తీసుకువచ్చారు. అనంతరం, శ్రీకాంత్ను కరెంట్ పోల్కు కట్టేసి.. భార్య అతడిని చితకబాదింది. చెప్పులతో కొట్టింది. ఈ క్రమంలో చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. -
పదో గనిలో విషవాయువులు
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా(ఏపీఏ)లోని పదో గనిలో సోమవారంరాత్రి నైట్షిఫ్టు నుంచి విషవాయువులు వెలువడుతున్నాయి. ఆ సమయంలో గని లోపల కార్మికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బొగ్గునిల్వలు పూర్తిగా వెలికితీయడంతో ఆ గనిని ఇటీవలే మూసివేశారు. సింగరేణి సంస్థ ఆర్జీ–3 పరిధిలోని ఓసీపీ–1 విస్తరణకు అనుసంధానం చేసేందుకు గని లోపల డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. అయితే అత్యవసర విధుల నిమిత్తం కొద్దిమంది కార్మికులు మాత్రమే హాజరవుతున్నారు. ఈ క్రమంలో గనిలోని 4 సీమ్, 27 డిప్, 51 లెవెల్ ప్రాంతంలో విషవాయువులు వెలువడడాన్ని వారు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. సంబంధిత గని అధికారులు ఈ విషయాన్ని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, జీఎం సేఫ్టీ (కార్పొరేట్) కె.గురవయ్య, ఏపీఏ జీఎం ఎన్.వి.కె. శ్రీనివాస్, జీఎం సేఫ్టీ(రామగుండం రీజియన్)కు వివరించారు. -
అవినీతి నిరూపిస్తే మంథని చౌరస్తాలో ఉరేసుకుంటా
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గాన్ని ఎక్కువ కాలం పాలించిన బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే తనపై కక్షగట్టి నిరాధారమైన ఆరోపణలతో రాష్ట్ర మీడియా తనపై కుట్రలు చేస్తుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. మధుకర్ హత్య మొదలు.. చికోటి ప్రవీణ్ హవాలా వ్యవహారం వరకు ఎక్కడా తప్పు చేయలేదని, రాష్ట్ర మీడియా మాత్రం తన ప్రమేయం ఉన్నట్లుగా దుష్ప్రచారం చేస్తోందని, తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే మంథని ప్రధాన చౌరస్తాలో ఉరేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంథనిలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాగరాజును ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరే పించానని కోర్టులో కేసు వేశారని, అది నిలువలే దని, తర్వాత మధూకర్ ఆత్మహత్యకు తానే కారణమంటూ హైదరాబాద్, ఢిల్లీ నుంచి ప్రతినిధులు వచ్చి రాద్దాంతం చేశారని, ఆ కేసు కోర్టులో ఉందని, దానిపై కథనాలు ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. తాను అక్రమంగా రూ.900 కోట్లు సంపాదించినట్లు మీడియా ప్రచారం చేస్తుందని అందులో వాస్తవం లేదని, చికోటి వ్యవహారంలో మీడియా నిజాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు. (క్లిక్: మునుగోడులో బరిలోకి రేవంత్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలిస్తుందా..?) -
Viral Video: పెద్దపల్లి జిల్లాలో బాహుబలి సీన్ను తలపించిన దృశ్యం
-
మంథనిలో వరద బీభత్సం: అంతెత్తు నీటిలో.. 3 నెలల బాలుడిని బుట్టలో పెట్టుకుని
సాక్షి, పెద్దపల్లి: వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కాలనీలు, ఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. బొక్కల వాగు బ్యాక్ వాటర్తో పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్, దొంతలవాడ, బోయిన్ పేట, లైన్ గడ్డలోని బర్రెకుంటలో ఉన్న ఇళ్లు నీటమునిగాయి. దీంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కుటుంబం తమ నెలల పసిపాపను వరద నీటి నుంచి రక్షించేందుకు పడ్డ కష్టం బాహుబలి సినిమాలోని దృశ్యాన్ని తలపించింది. సినిమాలో గ్రాఫిక్స్తో క్రియేటివిటీ చేస్తే ఇక్కడ మాత్రం ప్రత్యక్ష్యంగా సాక్షాత్కరించిందీ దృశ్యం. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల పసికందును కుటుంబ సభ్యులు బుట్టలో పెట్టుకొని తరలించారు. భుజాల వరకు వచ్చిన నీటిలో చిన్నారిని ఉంచిన బుట్టను తల్లిదండ్రులు తమ తలపై ఉంచుకుని అడుగులో అడుడేస్తూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. మంథని పట్టణంలో వరద పరిస్థితి తీవ్రతను ఈ దృశ్యాలు కల్లకు కడుతున్నాయి. చదవండి: కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం -
మంథని లిఫ్ట్ పనుల్లో అలసత్వం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: మంథని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు రవీంద్రనాయక్, విఠల్రెడ్డి, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సాగునీటి గురిం చిన చర్చ జరిగింది. జీవో 111కు సంబంధించి హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల పరీవాహక ప్రాంతంపై కమిటీ అక్బరుద్దీన్ వివరాలు కోరారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువుల పరిస్థితి, మిషన్ కాకతీయలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు తీసుకున్న చర్యల గురించి పీఏసీ చర్చించింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ సరిగా లేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కడెం, నాగార్జునసాగర్, సరళాసాగర్, మూసీ ప్రాజె క్టు మరమ్మతు, నిర్వహణ వివరాలను కమిటీ చైర్మన్ కోరారు. కాగా కాళేళ్వరం ప్రాజెక్టు లాగా ఇతర ప్రాజెక్టుల పనులు త్వరితగతిన ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఏఐబీపీ కింద ఎస్ఆర్ఎస్పీ రెండో దశ, దేవాదుల వరద కాలువ పనుల్లో ఆలస్యం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నిం చారు. కాగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ ఎవరిని నిర్ణయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని శ్రీధర్బాబు అన్నారు. -
మంత్రి వేముల పీఆర్వోపై కేసు
-
ఐదు గంటలు.. హైరిస్క్ ఆపరేషన్: 16 మంది సురక్షితం
మంథని: ఓ వైపు గోదావరి ఉగ్ర రూపం.. ఇంటి పెద్ద చనిపోవడంతో ఆలయ నిద్ర కోసం వచ్చిన కొందరు.. పడవలు కొట్టుకుపోకుండా ఒడ్డుకు చేర్చేందుకు వచ్చిన జాలర్లు మరికొందరు.. కాసేపటికే ఒక్కసారిగా పెరిగిన వరద.. ఎటు చూసినా నీళ్లే.. ప్రాణాలు అరచేత పట్టుకుని రాత్రంతా గడిపారు.. పొద్దున్నే వారిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. ఏమవుతుందోననే ఆందోళన పెరిగి పోయింది. ఐదు గంటలు కష్టపడ్డ అధికారులు చివరికి వారిని ఒడ్డుకు చేర్చారు. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వర ఆలయం వద్ద జరిగిన ఘటన ఇది. ప్రమాదకర పరిస్థితుల్లో.. మంథని మండలం కాకర్లపల్లికి చెందిన బొపెల్లి శంకరమ్మ భర్త ఈ నెల 12న చనిపోయాడు. పెద్దకర్మ అనంతరం ఆలయం వద్ద నిద్ర చేసేందుకని.. ఆమె తన ఇద్దరు కూతుళ్లు, మరో నలుగురితో కలిసి గురువారం రాత్రి 11 గంటలకు గౌతమేశ్వర ఆలయానికి వచ్చారు. అర్ధరాత్రి సమ యానికి వరద పెరిగిపోవడంతో అక్కడే చిక్కుకు పోయారు. ఒడ్డుకు చేర్చేందుకు వచ్చిన విలోచవరం గ్రామ జాలర్లు 9 మంది.. ఆలయం సమీపంలో నివాసం ఉండే రెండు కుటుంబాలకు చెందిన 15 మంది కూడా వరదలో ఉండిపోయారు. మంథని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. తాళ్లతో బాధితులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా సఫలం కాలేదు. సింగరేణి రెస్క్యూ టీం 9:30కు అక్కడికి చేరుకుని ట్యూబ్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించింది. కానీ ప్రవాహం వేగంగా ఉండటంతో 50 మీటర్లు ముందుకెళ్లగానే.. ట్యూబ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడి, వెనక్కి వచ్చేశారు. చివరకు బోట్ తెప్పించి కాకర్లపల్లికి చెందిన ఏడుగురిని, తర్వాత 9 మంది జాలర్లను ఒడ్డుకు చేర్చారు. ఆలయం సమీపంలో ఉండే 15 మంది బయటికి రావడానికి నిరాకరించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడటానికి వచ్చిన సింగరేణి రెస్క్యూ టీం పుస్తకాల కోసం వచ్చి.. వాంకిడి (ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫా బాద్ జిల్లా వాంకిడి మండలం కనర్గాం, భీంపూర్ గ్రామాలకు చెందిన 20 మంది పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 17 మంది పాఠ్యపుస్తకాలు తీసుకొనేందుకు గురువారం వాంకిడిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలకు వచ్చా రు. పుస్తకాలు తీసుకుని మూడు ఆటోల్లో తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే దుబ్బగూడ గ్రామశివార్లలో రెండు వాగుల్లో ప్రవాహం పెరి గింది. కష్టం మీద ఒక వాగును దాటారు. మరో వాగు వద్దకు వెళ్లేసరికే వరద ఉధృతి ఎక్కువై.. అక్కడే ఆగిపోయారు. సెల్ఫోన్ సిగ్నల్స్ అందని పరిస్థితి. రాత్రి 12 గంటల సమయంలో ఓ ఆటోడ్రైవర్కు సెల్ఫోన్ సిగ్నల్ అందడంతో.. కమానా గ్రామ ఎంపీటీసీకి ఫోన్ చేసి చెప్పాడు. చివరకు పోలీసులు రాత్రి 2 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. -
టీపీసీసీ రేసు నుంచి మరొకరు ఔట్: పోటీలోలేనట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) అధ్యక్ష పదవిపై తనకు ఎటువంటి ఆసక్తి లేదని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి డి.శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఆ పదవి రేసులో కూడా తాను లేనని పేర్కొన్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా పాయింట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. -
ఈ ఎమ్మెల్యే ఎవరో.. ఇవేంటో చెప్పగలరా?
సాక్షి, మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన సింగంపల్లి, కనుకునూర్ గ్రామాల్లో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వెళ్తున్న ఓ వాహనం మంగళవారం వాగులో దిగబడిపోయింది. ఆ సమయంలో అదే దారిలో మరో వాహనంలో వెళ్తున్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ దృశ్యాన్ని చూసి ఆగిపోయారు. తన కార్యకర్తలతో కలసి ఆయన వాగులోకి దిగి వాహనం బయటకొచ్చేలా సహకరించారు. ఈ ఫొటో చూడగానే వరి కోశాక మిగిలిన కొయ్య కాళ్ల మాదిరి కనిపిస్తున్నాయి కదూ..! కానీ, ఇవి గడ్డి మొక్కలకు సంబంధించి బెండు కర్రలు. పాడి పశువులకు పోషకాలను మెండుగా అందించే సూపర్ నేపియర్ గడ్డి పెంపకంపై రైతులు ఇటీవల ఆసక్తి చూపుతున్నారు. మొదట ఏపీకే పరిమితమైన ఈ రకం గడ్డి పెంపకం కరీంనగర్, సిద్ధిపేట జిల్లాలకు విస్తరించగా.. ప్రస్తుతం జనగామ జిల్లా చిల్పూరు మండలం కృష్ణాజీగూడెం గ్రామానికి చెందిన రైతు సాదం రమేష్ కూడా నాటాడు. ఇది విత్తనంగా కాకుండా రూ.1కి ఒకటి చొప్పున జానెడు పొడవుతో దొరికే బెండుకర్రలు నాటాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ గడ్డి.. పాడి పశువులకు వేయడం వల్ల మొక్కజొన్న చొప్పలా మెత్తగా ఉండటంతో ఇష్టంగా తింటాయని, పాల ఉత్పత్తి కూడా పెరుగుతోందని వెల్లడించారు. – చిల్పూరు (జనగామ) -
Putta Madhu: పుట్ట మధును విడిచిపెట్టిన పోలీసులు!
సాక్షి, పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మంథనిలోని తన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయనను కలిసేందుకు అభిమానులు తరలివచ్చారు. కాగా పది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను మే 8న రామగుండం పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామనరావు- నాగమణి దంపతుల హత్య కేసులో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మధుతో పాటు ఆయన భార్య శైలజను రెండు రోజుల పాటు విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ కుమారుడు ఆకాశ్ను సైతం పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల విచారణ అనంతరం సోమవారం రాత్రి మధును వదిలేసిన పోలీసులు.. నేడు బ్యాంక్స్టేట్మెంట్లతో హాజరుకావాలని ఆదేశించారు. కాగా హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్రావు తండ్రి కిషన్రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధు, ఆయన కుటుంబసభ్యుల బ్యాంక్ స్టేట్మెంట్లపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది బ్యాంక్ అకౌంట్ల స్టేట్మెంట్లు తీసుకున్నారు. చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు -
Etela, Putta Madhu: వాళ్లందరికీ షాక్..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: యుద్ధంలో ఒక్క శత్రువును టార్గెట్ చేస్తే సరిపోదు.. అతని బలానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమైన మిగతా శక్తులను కూడా దెబ్బకొట్టడమే రాజనీతి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్లోని హుజూరాబాద్, మంథని నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈటల రాజేందర్, పుట్ట మధుకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న అధికారులకు స్థానచలనం తప్పడం లేదు. హుజూరాబాద్లో ఇప్పటికే ఏసీపీ, ఆర్డీవో, ఓ తహసీల్దార్తోపాటు నలుగురు ఎంపీడీవోలను బదిలీ చేశారు. తాజాగా పోలీస్ ఇన్స్పెక్టర్లను టార్గెట్ చేశారు. నియోజకవర్గం పరిధిలోని హుజురాబాద్టౌన్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్ సర్కిల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్లు జి.సదన్కుమార్, ఎ.రమేష్, సీహెచ్.విద్యాసాగర్కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా కరీంనగర్ డీఐజీకి అటాచ్డ్ చేస్తూ నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో హుజూరాబాద్కు వి.శ్రీనివాస్ (సీసీఎస్–3), జమ్మికుంటకు కె.రామచంద్రారావు (ధర్మపురి), జమ్మికుంట రూరల్కు జె.సురేష్ (సీసీ ఎస్)ను బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. హుజురాబాద్ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధి హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాలలో ఉండడంతో అక్కడ సీఐ బదిలీ కాలేదు. ఈ నియోజకవర్గంలోని ఎస్సైల బదిలీలు కూడా సోమవారం జరిగే అవకాశం ఉందని సమాచారం. మారుతున్న రాజకీయాలు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో తెగతెంపులు చేసుకున్న రీతిలోనే టీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు, నాయకులపై గురిపెట్టారు. ఇప్పటికే వీణవంక మండలం ఇప్పాలపల్లి పీఏసీఎస్లో 2015లో చోటు చేసుకున్న రూ.18.86 లక్షల అవకతవకలకు సంబంధించి ఈటల వర్గీయుడైన అప్పటి చైర్మన్ సాదవరెడ్డికి తాజాగా నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఈటల వర్గీయులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలను ఆయన వైపు వెళ్లకుండా చూసే పనిలో పడ్డారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్కు హుజూరాబాద్ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో మంత్రి గంగుల హుజూరాబాద్లో మకాం వేసే అవకాశాలున్నాయి. ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంథని సర్కిల్లో పోలీసుల బదిలీలు ఈ క్రమంలోనే ఇక్కడి పోలీసులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వామన్రావు హత్యకు ముందు.. తరువాత జరిగిన పరిణామాల్లో మంథని సర్కిల్ పరిధిలోని పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విచారణను తిరగతోడడంలో భాగంగా మంథని సీఐ జి.మహేందర్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్కు అటాచ్డ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇటీవలే మంథని సర్కిల్కు సీఐగా బదిలీపై రావడం గమనార్హం. అంతకుముందు వామన్రావు దంపతుల హత్య జరిగినప్పుడు సీఐగా ఉన్న మహేందర్ను బదిలీ చేసి మహేందర్రెడ్డిని తీసుకొచ్చారు. తాజాగా అదే సమయంలో మంథని సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలు అందరిని బదిలీ చేస్తూ రామగుండం కమిషనర్ వి.సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. జంట హత్యలు జరిగిన రామగిరి పోలీస్స్టేషన్ ఎస్సై ఎ.మహేందర్ను బసంత్నగర్కు బదిలీ చేశారు. మహేందర్ పుట్ట మధు వర్గీయులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఆయన స్థానంలో రామగుండం ఎస్బీకి అటాచ్డ్ అయిన ఎస్సై కె.రవిప్రసాద్కు పోస్టింగ్ ఇచ్చారు. ముత్తారం మండల ఎస్సై సి.నరసింహారావును టాస్క్ఫోర్స్కు బదిలీ చేసి కాసిపేట (మంచిర్యాల జిల్లా) ఎస్సై బి. రాములును ముత్తారానికి పంపించారు. మంథని ఎస్సై ఓంకార్ను ములుగుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో జూలపల్లి ఎస్సై పి.చంద్రకుమార్కు పోస్టింగ్ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వెళ్లిన మహదేవ్పూర్, కాళేశ్వరం పరిధిలో కూడా బదిలీలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ బదిలీలన్నీ పదోన్నతులపై జరగడం గమనార్హం. మహదేవ్పూర్ సీఐ నర్సయ్య డీఎస్పీగా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో రామగుండం టాస్క్ఫోర్స్ సీఐ తిలక్ నియమితులయ్యారు. కాళేశ్వరం, మహదేవ్పూర్ ఎస్సైలు సీఐలుగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు. మంథనిలో రాజకీయ మార్పులు తప్పవా..? అలాగే మంథనిలో కూడా రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్కు చెందిన దుద్దిళ్ల శ్రీధర్బాబును టీఆర్ఎస్లోకి తీసుకునే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు సమాచారం. వామన్రావు దంపతుల హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మధుకు టీఆర్ఎస్లో అవకాశాలు తగ్గినట్టేనన్న ప్రచారం జరుగుతోంది. మంథనిలో మధు కనుసన్నల్లోనే పోస్టింగులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారుల పోస్టింగ్ల విషయంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇన్స్పెక్టర్లు మొదలుకొని నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారి ఎమ్మెల్యే ద్వారానే పోస్టింగ్ పొందే పరిస్థితి. అయితే మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ పోస్టింగ్లు, బదిలీలు అన్నీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. శ్రీధర్బాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావడంతో టీఆర్ఎస్ ఇన్చార్జిగా మధు చెప్పిన వారికే పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతోంది. దీనిపై పలుమార్లు శ్రీధర్బాబు, కాంగ్రెస్ నేతలు విమర్శించడం తప్ప అడ్డుకోలేకపోయారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధుకు సంబంధం లేకుండా నియామకాలు చోటు చేసుకోవడం గమనార్హం. మంథనిలోనూ బదిలీల పర్వం మాజీ మంత్రి ఈటల రాజేందర్ వర్గీయుడు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన మంథని నియోజకవర్గంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్రావు దంపతులకు సంబంధించి వామన్రావు తండ్రి తాజాగా ఐజీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును రీఓపెన్ చేశారు. ఇందులో భాగంగా పుట్ట మధును విచారణ కోసం రామగుండం కమిషనరేట్కు తీసుకొచ్చిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. తాజాగా ఆయన సతీమణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజను కూడా విచారణ కోసం తీసుకొచ్చారు. ఇక మంథని నియోజకవర్గం పరిధిలో తహసీల్దార్లు, ఎంపీడీవోల బదిలీలపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. పుట్ట మధుతోపాటు మున్సిపల్ చైర్పర్సన్ శైలజకు అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్న అధికారులను బదిలీ చేసి, కొత్త వారిని తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై పోలీసుల ఆరా -
Putta Madhu: వారం రోజులుగా వీడని సస్పెన్స్.. అసలేం జరిగింది?
‘పుట్ట మధు వెంట నలుగురు గన్మెన్లు ఉన్నారు. ఆయన గన్మెన్లకు చెప్పకుండా వెళ్లాడనే సమాచారం ఏం లేదు. గన్మెన్ గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ మధు కనిపించడం లేదని ఫిర్యాదు చేయలేదు. ప్రజాప్రతినిధిగా ఆయన దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. గన్మెన్లు ఆయన వెంటే ఉంటారు.’ – ‘సాక్షి’తో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ‘నా భర్త పుట్ట మధు ఐదు రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాం. మాకు అవకాశం దొరకడం లేదు. మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిస్తే ఆరోగ్యం బాగాలేదన్నారు. మీరైనా సీఎంకు తెలియజేయండి’ – మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కొడుకు, కోడలితో కలిసి మధు భార్య, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ విజ్ఞప్తి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే ‘గాయబ్’ అయిన పుట్ట మధు ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. జిల్లా పరిషత్ చైర్మన్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండగా, ఆయన ఎక్కడికి వెళ్లలేదని పోలీసులు చెపుతున్నారు. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన మంథనిలో ఏం జరుగుతోందో కూడా పోలీసులకు తెలియకుండా ఉంది. నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లతో పుట్ట మధుకు రక్షణ కల్పిస్తున్న రామగుండం పోలీసులు ఇంత జరుగుతున్నా.. మధు ఎక్కడికి వెళ్లలేదని, దేశంలోనే ఉన్నారని చెబుతూ వచ్చారు. ఆయనకు రక్షణగా గన్మెన్లు కూడా వెంటే ఉన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ స్వయంగా ‘సాక్షి’తో చెప్పారు. రామగుండం ఏఆర్ ఏసీపీ సుందర్రావు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఎన్ని పుకార్లు షికార్లు చేసినా.. పోలీసులు చెపుతున్న దానిని బట్టి పుట్ట మధు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తన బంధువుల దగ్గరో.. సన్నిహితుల వద్దో ఉంటారని భావించవచ్చు. అయితే ‘సాక్షి’లో ‘పుట్ట మధు ఎక్కడ..?’ అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనం తరువాతే ఈ అదృశ్యం విషయంలో కదలిక మొదలైంది. పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ, కుమారుడు, కోడలు నేరుగా హైదరాబాద్లోని ప్రగతి భవన్కు వెళ్లి సీఎంను కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సీఎం అందుబాటులో లేకపోవడంతో ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డిని కలిసి తన భర్త ఆచూకీ కోసం తాము పడుతున్న బాధను సీఎంకు తెలియజేయాలని కోరినట్లు సమాచారం. వీడని సస్పెన్స్ ఎపిసోడ్.. సుమారు వారం రోజుల క్రితం పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిన విషయాన్ని సాక్షాత్తూ టీఆర్ఎస్ నేతలే ధ్రువీకరిస్తున్నారు. అడ్వకేట్ వామన్రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారని సమాచారం. హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పిన మధు.. తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని మంథనిలోనే వదిలి, ఆయన భార్య శైలజ కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. మ«ధు వాహనం ప్రస్తుతం ఆయన మామ ఇంట్లో పార్కింగ్ చేసి ఉంది. మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు సమాచారం. ఆయన సెల్ ఫోన్ సిగ్నిల్ చివరగా మహారాష్ట్రలోని సెల్ టవర్ క్యాచ్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని ‘వని’ పట్టణంలో పుట్ట మధు సోదరుడు, మరో బంధువు ఇంట్లో అక్కడి జిల్లా పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి విచారణ జరిపినట్లు ఆ రాష్ట్రంలోని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. కాగా.. మహారాష్ట్ర నుంచి వస్తున్న వాహనాలను ఆసిఫాబాద్లోని వాంకిడి వద్ద పట్టుకొని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధు మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు స్పష్టమవుతోంది. అయితే.. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారనే ప్రచారం ఉంది. కానీ.. పోలీసులు దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. గన్మెన్లు ఎక్కడ..? పుట్ట మధు వెంటే గన్మెన్లు ఉన్నారని ఏఆర్ ఏసీపీతోపాటు రామగుండం పోలీస్ కమిషనర్ చెపుతుండగా.. పుట్ట మధు ఎక్కడున్నారనే విషయంలో ఇంత కథ ఎందుకు జరుగుతుందనేది ప్రశ్నగా మిగిలింది. నలుగురు గన్మెన్లు మధుతో ఉంటే ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినా.. వారం రోజులుగా గన్మెన్ల ఆచూకీ పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు కనుక్కోలేదా అని తెలియకుండా ఉంది. పుట్ట శైలజ తన భర్త ఆచూకీ చెప్పాలని ప్రభుత్వ పెద్దలను కలిసి కోరుతున్న వేళ ఇప్పటికీ గన్మెన్లు మధు వెంటే ఉన్నారని పోలీస్ కమిషనర్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు చెప్తున్నారంటే.. వారి మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో ప్రభుత్వానికే తెలియాలి. ప్రస్తుతం పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన పుట్ట మధు వ్యవహారంలో నిజాలను బహిర్గత పరచాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. మంత్రి కొప్పులతో టచ్లో.. అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో టచ్లో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చిన పుట్ట మధు టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. వామన్రావు హత్య కేసుతోపాటు ఈటల రాజేందర్ వ్యవహారంలో కూడా తన ప్రమేయం లేదని సీఎం కేసీఆర్కు చెప్పించేందుకు ఆయన ప్రయత్నించినట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన మంత్రులు ఇద్దరు ఈ విషయాన్ని “సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. కాగా గురువారం పుట్ట మధు భార్య శైలజ, ఆమె కుమారుడు, కోడలితో కలిసి హైదరాబాద్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలువగా, తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన సూచన మేరకు వెనుదిరిగినట్లు సమాచారం. అదే క్రమంలో ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్ను కలిసి తన భర్త మధు ఆచూకీ ఐదు రోజులుగా దొరకడం లేదని.. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరారు. కాగా.. ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన తరువాత ‘కేసీఆర్ వెంటే మేమూ.. మా నాయకుడు పుట్ట మధు’ అని మంథని నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం మంథనిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంథని టీఆర్ఎస్లో చీలికకు కొందరు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: Putta Madhu: ఫోన్ స్విచ్ఛాఫ్.. పుట్ట మధు ఎక్కడ..? -
రూ.50 లక్షలతో ఇంటి నుంచి వెళ్లారు.. తిరిగి రాలేదు
మంథని: భూ రిజిస్ట్రేషన్ కోసం రూ.50లక్షలతో ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరిన ఇద్దరు వ్యక్తుల అదృశ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్కు వెళ్లకుండా.. ఇంటికి రాకుండా.. మార్గంమధ్యలో ద్విచక్రవాహనం ఉండడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామగిరి మండలం లద్నాపూర్కు చెందిన ఉడుత మల్లయ్య, చిప్ప రాజేశంలు నాలుగేళ్ల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం శివారులో బిల్క్ ఉన్నీసా బేగంకు (ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీలో ఉంటున్నారు) చెందిన భూమిని కొనుగోలు చేశారు. అయితే భూమికి సంబంధించి ఇరువర్గాల మధ్య మనస్పర్థలు రావడంతో రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. అయితే రాజేశం, మల్లయ్యలు కొనుగోలు చేయాలనుకున్న భూమిని సదరు భూయజమానులు వేరేవారికి విక్రయించారు. ఈ విషయమై పలుసార్లు పంచాయితీలు జరిగాయి. ఈక్రమంలో రాజేశం, మల్లయ్యకు మరోచోట ఉన్న భూమిని ఎకరాకు రూ.10లక్షల చొప్పున సదరు భూయజమానులు విక్రయించేందుకు ఒప్పందం జరిగింది. ఈనేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలతో ద్విచక్రవాహనంపై కాటారం బయలుదేరారు. అయితే రిజిస్ట్రేషన్ వద్దకు వెళ్లకపోవడం, తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. కాగా ఆదివారం మంథని మండలం భట్టుపల్లి సమీపంలో మైసమ్మ ఆలయం దాటిన తర్వాత రోడ్డు పక్కనే ద్విచక్రవాహనం నిలిపి ఉందనే సమాచారం మేరకు పోలీస్ జాగిలాలతో గాలింపు చేపట్టారు. మంథని నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూర్ పోలీస్స్టేషన్, కాటారం వరకు ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. సమీప అటవీ ప్రాంతాల్లో సైతం గాలింపు చేపడుతున్నారు. రూ.50లక్షలతో బయలుదేరిన విషయం ఎవరెవరికి తెలుసు, ఇద్దరు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఎంత దూరం ద్విచక్రవాహనంపై వెళ్లారు, తర్వాత వారే వాహనం మార్చారా, ఇంకెవరిదైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ( చదవండి: మానవత్వం చాటిన మగువ..) -
బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు ఫోన్లో మాట్లాడేందుకు ఆమె తన మొబైల్ ఇచ్చారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు కాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణిల హత్య కేసు నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును గత నెల 19వ తేదీన మంథని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు. అక్కడ బిట్టు శ్రీనుతో మాట్లాడిన మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ.. తన ఫోన్ ద్వారా శ్రీనును వేరే వ్యక్తితో మాట్లాడించినట్లు బందోబస్తుకు వచి్చన రామగుం డం ఆర్ఎస్సై అజ్మీరా ప్రవీణ్ మంథని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు రక్షణగా వచ్చిన కానిస్టేబుళ్లు, కోర్టు పీసీ ఫోన్లో మాట్లాడకూడదని వారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ వెళ్లే దారిలో మరోసారి వచి్చన పుట్ట శైలజ ఓ మహిళతో వీడియోకాల్ మాట్లాడించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో వివరించారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన పుట్ట శైలజపై చర్య తీసుకోవాలని కోరారు. కోర్టు ఆవరణలో ఈ సంఘటన జరగడంతో మేజిస్ట్రేట్ అనుమతితో మంథని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మార్చి 26న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు విషయాన్ని మంథని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. పుట్ట శైలజ నిందితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించారని వామన్రావు తండ్రి గట్టు కిషన్రావు సైతం పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అప్పటికే కేసు నమోదైనా, పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: రాజన్న సిరిసిల్ల: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం) -
బ్యాంకుకే కన్నమేశారు..
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్రాంచ్కు దొంగలు కన్నమేశారు. రోడ్డు పక్కనే భవనం.. ఎప్పుడూ వాహనాల రద్దీ అయినా పక్కా ప్రణాళికతో బ్యాంకులోకి చొరబడిన దుండగులు గ్యాస్కట్టర్తో లాకర్ను కట్ చేసి సుమారు రూ.3కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. సినిమా ఫక్కీలో సాగిన ఈ చోరీలో ఏ ఒక్క ఆధారం వదలకుండా పోలీసులకు సవాల్ విసిరారు. దొంగలు వదిలి వెళ్లి గ్యాస్ సిలిండర్ ఒక్కటే పోలీసులకు దొరికింది. బుధవారం అర్ధరాత్రి, గురువారం వేకువజాము మధ్య సమయంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బ్యాంకు భవనం వెనుక కిటికీ కార్డ్బోర్డు పగులగొట్టి.. ఇనుప గ్రిల్స్ తొలగించి దుండగులు లోనికి చొరబడ్డారు. సుమారు 60 కిలోల బరువు ఉండే గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నారు. గ్యాస్ కట్టర్ సహాయంతో నగదు, బంగారం ఉంచిన స్ట్రాంగ్ రూం డోర్ కట్చేశారు. లాకర్ను కూడా గ్యాస్ కట్టర్తో కట్చేసి ఆరు కిలోల బంగారు ఆభరణాలు, రూ.18.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు వెనక భాగంలో కన్నం వేసిన కిటికీ అక్కడే నిచ్చెన తయారీ.. దొంగలు బ్యాంకు వెనుకవైపు ఎత్తయిన ప్రహరీ దూకేందుకు అక్కడే ఉన్న తుమ్మచెట్ల కొమ్మలు నరికి నిచ్చెన తయారు చేసుకున్నారు. దాని సహాయంతో గోడ దూకిన దొంగలు గ్యాస్ సిలిండర్, ఇతర సామగ్రి గోడ దాటించారు. పని ముగించుకున్నాక నిచ్చెన, గ్యాస్ సిలిండర్ మాత్రం అక్కడే వదిలి వెళ్లారు. అలారం,సీసీ కెమెరాలు, కంప్యూటర్ ధ్వంసం.. అలారం మోగకుండా దొంగలు వైర్లు కత్తిరించారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. గతం రికార్డులు కూడా దొరకకుండా కంప్యూటర్ను పగులగొట్టారు. సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే డీవీఆర్ ఎత్తుకెళ్లారు. స్వీపర్ సమాచారంతో.. గురువారం ఉదయం బ్యాంకు శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్ మహిళ తాళం తీసి చూడగా లోపల సామగ్రి చిందరవందరగా పడిఉంది. బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ సింగ్వా సూచన మేరకు గ్రామంలోనే ఉండే బ్యాంకు ఉద్యోగి వెళ్లి పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, లాకర్ కట్చేసి ఉండడంతో చోరీ జరిగిందని నిర్ధారణకొచ్చారు. మంథని పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్, ఫింగర్ప్రింట్ బృందాలను రప్పించారు. ఇంత భారీ చోరీ జరిగినా దొంగలు ఒక్క ఆధారం కూడా అక్కడ వదిలి వెళ్లకపోవడంతో ప్రొఫెషనల్ దొంగలు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కిటికీతోపాటు లాకర్ రూం, లాకర్, ఇతర వస్తువులపై వేలిముద్రలు లభించకపోవడం గమనార్హం. చెరువు కట్ట వరకు వెళ్లిన డాగ్ స్క్వాడ్.. డాగ్ స్క్వాడ్ దొంగల వాసనను పసిగట్టలేకపోయాయి. బ్యాంకులో, బయట ఆవరణలో తిరిగిన డాగ్స్, వెనుక సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు కట్ట వరకు వెళ్లి ఆగిపోయాయి. దీని ఆధారంగా దొంగలు వారి వాహనాన్ని చెరువు కట్ట వద్ద వదిలి బ్యాంకు వరకు నడుచుకుంటూ వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన దొంగతనాల్లో ఇదే అతిపెద్దదని సీపీ సత్యనారాయణ ప్రకటించారు. ఐదు రోజుల క్రితమే పికెట్ ఎత్తివేత.. గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దంపతులను ఫిబ్రవరి 17న కల్వచర్ల వద్ద గ్రామానికి చెందిన కుంట శ్రీను, చిరంజీవి దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామంలో సుమారు నెల రోజులుగా పోలీస్ పికెట్ కొనసాగుతుంది. ఈ కేసులో ఏడో నిందితుడు గ్రామానికి చెందిన వెల్ది వసంతరావును వారం క్రితమే అరెస్ట్ చేశారు. కేసు విచారణ కొలిక్కి రావడం, గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఐదు రోజుల క్రితం పికెట్ ఎత్తివేశారు. ఈ విషయాన్ని కూడా దొంగలు గమనించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు చాలెంజ్.. బ్యాంకు చోరీ ఘటనను పోలీసులు చాలెంజ్గా తీసుకున్నారు. సీపీ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి క్లూ దొరక్కపోయినా.. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దొంగలు 5 నుంచి 10 మంది వరకు ఉంటారని, వీరిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దొంగలు ముందస్తుగా రెక్కీ నిర్వహించే చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కానరాని కనీస భద్రత చర్యలు.. ఎస్బీఐ గుంజపడుగు బ్రాంచ్లో గ్రామంతోపాటు సమీప గ్రామాల రైతులు ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. వ్యవసాయ రుణాలతోపాటు బంగారం తాకట్టుపెట్టి రుణం పొందుతారు. చోరీకి గురైన బంగారంలో ఎక్కువ మొత్తం రైతులకు సబంధించిందే అని సమాచారం. కాగా, కొందరు రైతులు బుధవారం రుణాలు చెల్లించి బంగారం తీసుకున్నట్లు తెలిసింది. రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకులో ఉన్నా.. బ్యాంకు వద్ద కనీస భద్రత చర్యలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు కిటికీ వద్ద శాశ్వత గోడ కట్టించాల్సిన అధికారులు కార్డ్బోర్డ్ కొట్టి వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు అద్దాలు పగులగొట్టి చోరీకి యత్నించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయినా భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వరంగల్ జైలుకు వామన్రావు నిందితులు
సాక్షి, కరీంనగర్ : హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కరీంనగర్ జైలులో ఎక్కువ మంది ఉండడంతో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులగా ఉన్న వారి సేఫ్టీ కోసం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. న్యాయవాదుల హత్య కేసులో 18న అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్, శివంతుల చిరంజీవి, అక్కపాక కుమారులను 19న మంథని కోర్టులో హాజరుపరిచారు. వీరికి 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విదించడంతో నాలుగు రోజులుగా కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. కరీంనగర్ జైలులో ఎక్కువ మంది ఖైదీలు ఉండడంతో పాటు లాకప్లన్నీ నిండిపోవడంతో కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ముగ్గురు నిందితులను వరంగల్ సెంట్రల్ జైల్కు తరలించినట్లు సూపరిండెంట్ సమ్మయ్య తెలిపారు. మరోవైపు హత్య కేసు నిందితులను వారంరోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో పోలీస్ కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉంది. హత్య కేసులో మరో నిందితుడు బిట్టు శ్రీనును మంథని కోర్టులో హాజరు పరచనున్నారు. ఇప్పటికే గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అతన్ని మంథని కోర్టుకు తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
పది నెలల క్రితమే ప్లాన్: చంపకపోతే
సాక్షి, పెద్దపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్న, ఎవరినైనా, ఎంతటివారినైనా వదలిపెట్టేదిలేదని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. హత్య కుట్రలో నిందితులకు కారు, రెండు కత్తులను అందజేసిన బిట్టు శ్రీను అరెస్ట్ చేశామన్నారు. వామన్రావును హత్య చేయాలని పది నెలల క్రితమే ప్లాన్ చేశారని, చాలా సార్లు స్కెచ్ విఫలమైందని తెలిపారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రధాన నిందితుల వాంగ్మూలం, నిందితుడు బిట్టు శ్రీను అలియాస్ తులసిగరి శ్రీను ఇచ్చిన వాంగ్మూలంను విశ్లేషించగా పలు విషయాలు తెలిసినవని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాలు (బిట్టు వాంగ్మూలం) బిట్టు శ్రీను 2016 సంవత్సరం నుండి మంథనిలో నడుస్తున్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా కొనసాగుతున్నాడు. మంథని ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ ట్రస్టుపై మృతుడు గట్టు వామన్ రావు ట్రస్ట్పై పలు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో చులకన చేస్తూ పలు వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించేవాడు. బిట్టు శ్రీనుపై అవమానకరంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడని ప్రచారం చేసేవాడు. ట్రస్టు మరియు ట్రస్ట్ యొక్క ఆదాయాల పై హైదరాబాద్, ఇతర చోట్ల గట్టు వామన్ రావు తన అనుచరులతో ఫిర్యాదులు చేపించేవాడు. 2015 నుండి 2019 ఏప్రిల్ వరకు మంథని గ్రామపంచాయతీలో బిట్టు శీను చెత్త రవాణా కొరకు ఒక ట్రాక్టర్ పెట్టగా బిట్టు శ్రీనుకు నెలకు 30 వేల రూపాయలు ఆదాయం వచ్చేది. దానిపై 2019 మార్చి లో గ్రామ పంచాయతీలోని అధికారికి బిట్టు శ్రీను యొక్క ట్రాక్టర్ పై ఫిర్యాదు చేసి దానిని తీసి వేయాలి అని పంచాయతీ అధికారిపై గట్టు వామన్ రావు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దానితో ఆ అధికారి ట్రాక్టర్ని గ్రామపంచాయతీ నుండి తొలగించాడు. దానిపై వచ్చే నెల వారి 30 వేల ఆదాయం బిట్టు శ్రీను కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని గట్టు వామనరావు బిట్టు శ్రీనుపై సాధించిన విజయంగా మంథని ప్రాంతంలో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. బిట్టు శ్రీను- కుంట శ్రీను కి గల సంబంధం మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీను, బిట్టు శ్రీనుకు గత ఆరు సంవత్సరాలుగా పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారారు. రెగ్యులర్గా కలిసి ఉండేవారు. వీరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు మందు తాగే సమయంలో పంచుకునేవారు. వీళ్ళతో అప్పుడప్పుడు చిరంజీవి కూడా కలిసేవాడు. ఈ క్రమంలో కుంట శ్రీనివాస్ గుంజపడుగు గ్రామస్తుడైన గట్టు వామన్ రావు పీవీ నాగమణి దంపతులు హైకోర్టు న్యాయవాదులుగా చలామణి అవుతూ కొన్ని సంవత్సరాలుగా కుంట శ్రీనివాస్ను టార్గెట్ చేసుకొని ఒక ఫోన్ కాల్ విషయంలో హైదరాబాదులో కుంట శ్రీనివాస్ పై కేసు పెట్టించారు . కుంట శ్రీను వాళ్ళ కులదైవం పెద్దమ్మ తల్లి గుడి కట్టుటకు కుంట శ్రీనును చైర్మన్గా పెట్టి గుడి కడుతున్న క్రమంలో దానిని అక్రమ నిర్మాణం అని ఫిర్యాదు చేసి నోటీసులు ఇప్పించి వామన్ రావు దంపతులు గుడి నిర్మాణం ఆపించడం జరిగింది. కుంట శీను ఇంటి నిర్మాణం చేస్తుండగా నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోలేదని అక్రమ నిర్మాణం చేస్తున్నాడని నిర్మాణం ఆపుదల చేస్తూ గ్రామపంచాయతీ నుండి నోటీసు ఇచ్చి నోటీసును ఫ్లెక్సీ తయారు చేపించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో గట్టు వామన్ రావు ప్రచారం చేయడం జరిగింది. గుంజపడుగు లో రామ స్వామి గోపాల స్వామి ఆలయానికి సంబంధించిన కమిటీ చైర్మెన్ గా చాలా సంవత్సరాల నుండి వామన్ రావు తమ్ముడు చైర్మన్ గా ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడని, ఈ మధ్యకాలంలో గుంజపడుగు గ్రామస్తులు అందరూ కలిసి పాత కమిటీ రద్దుపరచి కొత్త కమిటీ చైర్మన్ గా వెల్ది వసంతరావు నీ ఎన్నుకోవడం జరిగింది ఇట్టి విషయంలో కూడా గట్టు వామన్ రావు, నాగమణి, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తూ హైకోర్టులో ఫిర్యాదు చేయుటకు ప్రయత్నిస్తున్న క్రమంలో గొడవ జరిగిందని ఆ విధంగా కుంట శ్రీను గ్రామంలో తన అధిపత్యానికి వామన్ రావు నాగమణి లు అడ్డువస్తున్నారని దానికి బిట్టు శీను కూడా కుంట శ్రీను తో తనకి కూడా ఆదాయ మార్గాలు రాకుండా చేసి ప్రజలలో అవమాన పరిచాడు వ్యక్తిగతంగా తీవ్ర నష్టం చేసాడని గట్టు వామన్ రావు ని చంపే విషయాలలో ఏలాంటి సహాయం కావాలన్నా చేస్తానని కుంట శ్రీనుతో చెప్పాడు. అందాద నాలుగు నెలల క్రితం వామన్ రావు గురించి చర్చించే సమయంలో కుంట శ్రీను రెండు కత్తులు తయారు చేయించి పెట్టు అన్నా అని బిట్టు శ్రీనుకి చెప్పగా బిట్టు శ్రీను రెండు ట్రాక్టర్ పట్టీలు తీసుకొని మంథనిలో కత్తులు తయారు చేపించి చిరంజీవి ఇంట్లో పెట్టారు. బిట్టు శీను అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం వామన్ రావుని చంపకపోతే మనకు భవిష్యత్తులో ఎప్పుడూ ఇబ్బంది ఉంటుందని చాలా సందర్భాల్లో గత 10 నెలల నుండి కుంట శీను, బిట్టు శ్రీనుకు చెప్పడం జరిగింది. అందదా నాలుగు నెలల క్రితం వామన్ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు రాగా చిరంజీవి వారిని చూసి బిట్టు శీనుకు చెప్పగా వెంటనే ఇట్టి విషయం కుంట శ్రీనుకి బిట్టు శ్రీను తెలియజేశాడు. కుంట శ్రీను మంథనికి వచ్చేలోపే వామన్ రావు మూడు కార్లలో గుంజపడుగు వచ్చాడు. అప్పుడు కుంట శ్రీను వామన్ రావు గురించి గుంజపడుగు బస్ స్టాప్లో వెయిట్ చేశాడు. వామన్ రావు వాళ్ళ ఇంటికి వారితో పాటు వచ్చిన ఒక వ్యక్తికి సన్మానం చేస్తుండగా కుంట శ్రీను వామన్ రావు ఇంటికి ఎదురుగా ఉన్నా పాత స్కూల్ బిల్డింగ్ నుంచి చూసి ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు వీలు కాదని చెప్పగా వామన్ రావుని హత్యా ప్లాన్ విరమించుకున్నారు. వామన్ రావు హత్య పథకంలో ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న క్రమంలో తేదీ 17.2.2021 రోజు మధ్యాహ్నం సమయంలో మంథని కోర్టుకి గట్టు వామన్ రావు దంపతులు వచ్చారు అని తెలిసి కుంట శీను బిట్టు శ్రీనుకి ఫోన్ ద్వారా తెలపగా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకో అని చెప్పగా అప్పుడు కోర్టు దగ్గర లో ఉన్న కుంట లచ్చయ్య కి ఫోన్ చేసి వామన్ రావు ఉన్నది నిజమని నిర్ధారణ చేసుకుని మరల చెప్పడం జరిగింది. వెంటనే బిట్టు శ్రీను శివనందుల చిరంజీవికి ఫోన్ చేసి నీ దగ్గర ఉన్న కత్తులు తీసుకొని అర్జెంట్గా మంథని బస్ స్టాప్ దగ్గరికి రమ్మని చెప్పినాడు. చిరంజీవి టూ వీలర్ పై కత్తులు తీసుకొని రాగా అంతలో బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇవ్వగా కత్తులు కార్ లో పెట్టుకుని కుంట శ్రీను వద్దకు వెళ్లి పోయాడు. కల్వచర్ల సమీపంలో వామన్ రావు, తన భార్య నాగమణి ఇద్దరిని చంపాము అని కుంట శ్రీను బిట్టు శ్రీను కి ఫోన్లో తెలపగా బిట్టుశ్రీను మంచిది, మీరు మహారాష్ట్రకు వెళ్లిపొండని చెప్పి బిట్టు శ్రీను ఇంటి వద్ద ఏం తెలియనట్టు ఉన్నాడు. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుగుతూ ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి న అవసరం ఉంది. ఇంకా కొంతమంది సాక్ష్యులను కూడా విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉంది. నిందితులను అందరిని పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ జరిపి వారు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సి ఉంది. దీనికిగాను హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు మరియు సైబర్ క్రైమ్ పరిశోధకులను విచారణ సహాయకులుగా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ గారు ప్రధాన విచారణ అధికారిగా సమగ్ర విచారణ చేస్తున్నారు. సాక్ష్యాలు గానీ,హత్యకు సంబంధించిన వీడియో లు సమాచారం,ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నవారు ముందుకు వచ్చి సమాచారం అందిస్తే, ఇచ్చిన ప్రతి అంశాన్ని దర్యాప్తులో నిర్ధారించుకొని పరిశోధనలో ముందుకు పోవడం జరుగుతుంది అంటూ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. -
కీలకంగా మారిన బిట్టు.. మధుపై అనుమానం!
సాక్షి, పెద్దపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకేసు విచారణ కీలక దశకు చేరింది. హత్యకు గల కారణాలు, హంతకులు ఎవరు అనేది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు, మరోసారి వారిని విచారించేందుకు కస్టడీ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. పోలీసుల కస్టడీలో ఉన్న బిట్టు శ్రీనును ఏ క్షణానైనా కోర్టులో హజరుపరుచనున్నారు. బిట్టు శ్రీను ఇచ్చిన కీలక సమాచారంను రుజువు చేసుకునేందుకు రిమాండ్లో ఉన్న ముగ్గురిని వారం రోజులు కస్టడికి ఇవ్వాలని రామగిరి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జడ్జి లేకపోవడం పిటిషన్ పెండింగ్లో ఉంది. మరోవైపు నిందితులకు బెయిల్ కోసం బందువులు ప్రయత్నిస్తుండగా నిందితుల పక్షాన ఎవరు వకాలత్ చేయవద్దని, మార్చి ఒకటో తేదీ వరకు విధులు బహిష్కరించాలని మంథని కోర్టు న్యాయవాదులు తీర్మానించారు. హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య చిక్కుముడి త్వరలో వీడనుంది. హత్య కేసును హైకోర్టు సుమోటగా స్వీకరించడంతో పాటు న్యాయవాదులు నిరసన ఆందోళనలు వ్యక్తం చేస్తుండడంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇద్దరు ఐజీలు, ఓ డిఐజి, సిపి పర్యవేక్షణలో దర్యాప్తు బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఇప్పటికే కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. న్యాయవాదుల హత్యకు కారు, కత్తుల సమకూర్చిన బిట్టు శ్రీను వాగ్మూలం పైనే కేసు అంతా ఆధారపడి ఉండడంతో నాలుగు రోజులుగా పోలీసులు అతన్ని కస్టడిలో ఉంచుకుని రహస్యంగా విచారించారు. వీడియో ఎవిడెన్స్ లతో బిట్టు శ్రీను నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. ఆయన ఇచ్చిన సమాచారం ఏమేరకు సరైనదో తెలుసుకునేందుకు ఇప్పటికే అరెస్ట్రై జైలులో ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్లను వారం రోజుల పాటు కస్టడీ కోరుతు పోలీసులు కోర్టును ఆశ్రయించారు. నల్లకోటును అడ్డుపెట్టుకుని.. గుంజపడుగు గ్రామస్థులతో పాటు వామన్ రావు బాదితులు ఒక్కొక్కరు బయటికి వస్తు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వామన్ రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న న్యాయవాదులను, రాజకీయ పార్టీల నాయకులను నిలదీస్తున్నారు. దంపతుల హత్యను ఓ వైపు ఖండిస్తూనే మరోవైపు వారికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ప్రజలందరు భావిస్తున్నట్లు వామన్ రావు మంచోడుకాదన్నారు. నల్లకోటును అడ్డుపెట్టుకుని గ్రామాభివృద్దిని అడ్డుకున్నారని ఆరోపించారు. క్రిమినల్ మైండ్తో బ్లాక్ మెయిల్కు పాల్పడుతూ అనేక మందిని ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. గ్రామంలో బడి, గుడి, గ్రామపంచాయితీ భవన నిర్మాణాలను అడ్డుకోవడంతోపాటు 90 మందికి పించన్లు రాకుండా చేశాడని, ఏ ఉద్యోగి సరిగా పని చేయకుండా ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని హైకోర్టులో పిల్ వేసి అనేక మందికి అన్యాయం చేశాడని అలాంటి వ్యక్తికి మద్దతుగా వస్తున్నవారు వాస్తవాలను తెలుసుకుని అన్యాయానికి గురైన వారందరికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. పుట్టమధు పాత్రపై అనుమానం..! మరోవైపు వామన్ రావు హత్య రాజకీయ రంగు పులుముకోవడంతో అయన కుటుంబాన్ని పరామర్శల వెల్లువ కొనసాగుతుంది. హత్యకు పాల్పడింది టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కావడంతో న్యాయవాదులతోపాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు వామన్ రావు కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇద్దరిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. హత్య వెనుక ఎవరున్నారో బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హత్యకు కారు, కత్తుల సమకూర్చిన బిట్టు శ్రీను జడ్పీ చైర్మెన్ పుట్ట మధు మేనల్లుడు కావడంతో హత్యకు రాజకీయంగా ప్రాధాన్యత పెరిగింది. మధు ఆత్మలా వ్యవహరించే బిట్టు శ్రీను గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్తో హత్య చేయించాడా, లేక మేనమామ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. అందులో బాగంగానే బిట్టు శ్రీనును నాలుగురోజులపాటు విచారించి అతను ఇచ్చిన సమాచారంతో రిమాండ్ లో ఉన్న నిందితులను కస్టడిలోకి తీసుకుని విచారించనున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా రెండుమూడు రోజుల్లో హత్యకు గల కారణాలు, దానివెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. -
న్యాయవాదుల హత్యలో వారిదే పాత్ర: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మంథనిలో జరిగిన న్యాయవాదుల హత్యోదంతంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పెద్దల ఆదేశాల మేరకే హత్యలు జరిగాయని ఆరోపణలు చేశారు. వారిపై కుట్ర కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంథని న్యాయవాదుల హత్యలో స్థానిక టీఆర్ఎస్ నేతలు కేవలం పాత్రధారులేనని, హత్యకు ఉసిగిల్పింది మాత్రం కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్లను తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్న హాలియా సమావేశంలో కేసీఆర్, తమను ఎవరైనా ప్రశ్నిస్తే నషంలాగా నలిపివేస్తామని చెప్పినట్లు రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బాల్క సుమన్ ఏకంగా హత్య చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తొక్కేస్తమని పెద్దలే చెపుతున్నారని ఉదాహరించారు. ఈ హత్యలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ బాధ్యులని చెప్పారు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సుమోటోగా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అయ్యో పాపం.. కొడుకులు కాదన్నారు
ముత్తారం(మంథని): ఒకప్పుడు ఆయన పదెకరాల భూమి ఉన్న మోతుబరి రైతు. పది మందికి అన్నం పెట్టాడు. ఐదుగురు సంతానాన్ని ఒంటి చేత్తో పోషించి ఓ ఇంటి వారిని చేశాడు. ఉన్న ఆస్తిని కొడుకులకు పంచి ఇచ్చాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఆస్తిపాస్తులు లేకపోవడంతో అందరికీ కాని వాడయ్యాడు. దీంతో న్యాయం చేయండంటూ ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెందిన అల్లాడి ముకుందరావు(85)కు ఐదుగురు సంతానం. ఐదెకరాల వ్యవసాయ భూమి విక్రయించి ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశాడు. ఈ ఇద్దరిలో ఓ కూతురు ఇదివరకే అనారోగ్యంతో చనిపోయింది. ఇక పెద్ద కుమారుడు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్గా, రెండో కుమారుడు గోదావరిఖనిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, మూడో కుమారుడు హైదరాబాద్లో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కూతుళ్ల పెళ్లిళ్లు చేయగా మిగిలిన ఐదెకరాల భూమిని కొడుకులకు పంచి ఇచ్చాడు. కాగా కొద్ది రోజుల క్రితం ముకుందరావు భార్య మృతిచెందగా.. పెద్ద కుమారుడి వద్ద ఉంటున్నాడు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో పెద్ద కుమారుడు తన కుటుంబాన్ని పోషించుకోవడమే భారంగా ఉందని.. మిగతా వారి వద్దకు వెళ్లాలని తండ్రిని వదిలేశాడు. అయితే ఆయనను మిగతా వారూ పట్టించుకోలేదు. నాలుగు రోజులుగా ఆకలితో అలమటించి గురువారం ముకుందరావు పోలీస్స్టేషన్ మెట్లెక్కాడు. మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు.. అందరూ ఉన్నా.. అన్నం పెట్టే వారు కరువయ్యారని ముకుందరావు పోలీసులను ఆశ్రయించడంతో వృద్ధుడి ఆకలిని గ్రహించి కానిస్టేబుల్ రాజేందర్, హోంగార్డు వెంకటేశ్వర్లు భోజనం తెప్పించి దగ్గరుండి అతనికి తినిపించారు. అన్నం పెట్టిన పోలీసులకు ఆ వృద్ధుడు రెండు చేతులు జోడించి దండం పెట్టడం అక్కడున్నవారిని కదిలించింది. ఆయన కొడుకులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. -
భూమి లభించనందునే పంపిణీ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: సాగుకు యోగ్యమైన భూమి లభించనందునే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూపంపిణీ పక్రి య నెమ్మదిగా సాగుతోందని రాష్ట్ర మం త్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇప్పటి వర కు ఈ పథకం కింద రాష్ట్రంలో 15వేల ఎకరాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. శనివారం శాసనసభ ఆవరణలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లా డారు.దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. మంథని ఘటనపై కాంగ్రెస్ది రాద్ధాంతం.. మంథనిలో కొందరు వ్యక్తుల నడుమ చోటు చేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ పార్టీ రెండు నెలలుగా ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. నలభై ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితులకోసం చేసిందేమీ లేదన్నారు. చలో మల్లారం పేరిట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు పిలుపునివ్వడాన్ని కొప్పుల ప్రశ్నిస్తూ, ఒక గ్రామంలో జరిగిన ఘటనను టీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయాలో అర్థం కాక తమ పార్టీపై అనవసర రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. రంగయ్య అనే వ్యక్తి మరణానికి సంబంధించి మంథనిలో ఇద్దరు వ్యక్తుల నడుమ జరిగిన గొడవను కాంగ్రెస్ పార్టీ భూతద్దంలో పెట్టి చూపుతోందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి వారి మాటలు విని కాంగ్రెస్ నేతలు దళితుల కోసం పోరాటం అంటూ హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ..
-
కాంగ్రెస్, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ..
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోని మంథని పోలీసుస్టేషన్ వద్ద ఘర్షణ వాతావరణంతో కూడిన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఆదివారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈనెల 6న మల్హర్రావు మండలం మల్లారంలో దళితుడు రేవెల్లి రాజబాబు దంపతుల మధ్య వివాదం ఉండగా అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యులు టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు జోక్యం చేసుకున్నారు. రాజబాబు, శ్రీనివాసరావు మద్య ఘర్షణ జరగడంతో శ్రీనివాసరావు బావమర్దులు శేఖర్, సంపత్ అక్కడికి చేరుకొని రాజబాబుపై దాడి చేశారు. దీంతో రాజబాబు ప్రాణాలు కోల్పోయారు. అయితే టీఆర్ఎస్ నాయకులు దళితులపై దాడి చేసి కొట్టి చంపారని ఆరోపిస్తు నిజనిర్ధారణకు చలో మల్లారంకు పిలుపునిచ్చారు. దానికి ప్రతికారంగా టీఆర్ఎస్ ఎస్సీ సెల్ సైతం రాజబాబు మృతికి టీఆర్ఎస్కు సంబంధం లేదని తేల్చిచెప్పేందుకు ‘చలో మల్లారం’కు పిలుపునిచ్చారు. పోటాపోటిగా ‘చలో మల్లారం’కు పిలుపునివ్వడంతో పోలీసులు మల్లారంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసి భారీగా మోహరించారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంథని నుంచి కాన్వాయ్తో బయలుదేరగా పోలీసులు అడ్డుకుని మంథని స్టేషన్కు తరలించారు. అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ‘చలో మల్లారం’కు బయలుదేరగా వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని మంథని పోలీసు స్టేషన్కు తరలించారు. స్టేషన్లో టీఆర్ఎస్ కార్యకర్తలు శ్రీధర్బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, జడ్పీ చైర్మన్ పుట్టమధు నేతృత్వంలోని టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ‘చలో మల్లారం’ కార్యక్రమానికి వెళ్లకుండా హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్కని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ దాడులపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. -
మరణంలోనూ వీడని స్నేహం
సాక్షి, మంథని : ముగ్గురివీ పేద కుటుంబాలే.. ముగ్గురూ పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు. పక్కపక్క గ్రామాల్లో ఉన్నప్పటికీ కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచేవారు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేయగా, ఒకరు ఎంబీఏ చదివాడు. జీవితంలో స్థిరపడిన తర్వాతే ముగ్గురూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఉపాధి వేటలో పడ్డారు. అయితే లాక్డౌన్తో వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ తమ కోసం కష్టపడిన తల్లిదండ్రులకు ఆర్థికంగా కొంత అండగా ఉండాలనుకున్నారు. నెల క్రితం ముగ్గురూ ఓ ఇసుక క్వారీలో పనికి కుదిరారు. అక్కడే ఉంటూ విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వర్షాలు ప్రారంభం కావడంతో ఇసుక క్వారీల్లో పని ఆగిపోయింది. నెల రోజుల తర్వాత ద్విచక్రవాహనంపై ఆనందంగా ఇంటికి బయల్దేరిన స్నేహితులను మృత్యువు లారీ రూపంలో కబళించింది. ప్రాణాలను తీయగలిగింది కానీ.. స్నేహాన్ని మాత్రం విడదీయలేకపోయింది. మంథని సమీపంలో జరిగిన ఈ ఘటన జూలపల్లి మండలానికి చెందిన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిలో మంథని మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్పల్లి శివారులో సోమవారం లారీ ఢీకొని ముగ్గురూ మృతిచెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జూలపల్లి మండలం అబ్బాపూర్ చెందిన రజనీకాంత్(26), మిట్ట మధుకర్(26), , బాలరాజుపల్లికి అడప సురేశ్(24)లు ముగ్గురు విద్యావంతులు. లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా నెల కిత్రం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ ఇసుక క్వారీలో సూపర్వైజర్లుగా పనికి కుదిరారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్వారీలో పని ఆగిపోగా సోమవారం ద్విచక్రవాహనంపై ముగ్గురు ఇళ్లకు బయలుదేరారు. మంథని మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్పల్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొ నడంతో రజనీకాంత్, మధుకర్ అక్కడికక్కడే మృతిచెందారు. సురేశ్ను మంథని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో రజనీకాంత్, మధుకర్ మృతదేహా లు చిందరవందరగా ఎగిరిపడ్డాయి. శరీర భాగాలు బయటపడ్డాయి. రోడ్డంతా రక్తసిక్తమైంది. లారీ వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా భారీ శబ్దం రావడంతో సమీపంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న వారు ప్రమాద సమాచారాన్ని పోలీసులు చేరవేశారు. లారీ రోడ్డు దిగి పత్తి చేసులోకి దూసుకెళ్లింది. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. మంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్ యాదవ్, రామగిరి ఎస్సై మహేందర్ మృతదేహాలను అంబులెన్స్లో ఎక్కించి పోస్టుమార్టంకు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మూడు కుటుంబాల్లో విషాదం మంథని సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు నిరుపేద కుటుంబాలకు చెందినవారే. వీరిలో ఇద్దరిది అబ్బాపూర్ కాగా మరొకరిది బాల్రాజ్పల్లి. ముగ్గురు యువకుల మృతితో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబ నేపథ్యం.. మృతుల్లో అబ్బాపూర్కు చెందిన చొప్పరి రజినీకాంత్(26) డిగ్రీ పూర్తి చేశాడు. తల్లి రాజేశ్వరి కూలీపని, తండ్రి కొమురయ్య హమాలీ పని చేస్తూ కుమారుడిని చదివించారు. అదే గ్రామానికి చెందిన మిట్ట మధుకర్(26)ఎంబీఏ చదివాడు. తల్లి ఆరవ్వ కూలీ పనిచేస్తుతండగా తండ్రి మల్లయ్య హమాలీ పని చేస్తూ ఒక్కగానొక్క కొడుకును ఉన్నత చదువులు చదివించారు. అడప సురేశ్(24)డిగ్రీ చదివాడు. తల్లి లక్ష్మి, తండ్రి లచ్చయ్య కూలిపని చేస్తూ కుమారున్ని చదివించారు. కుటుంబా నికి భారం కాకూడదని ఎంతో కొంత ఆసరాగా ఉండాలని ముగ్గురు యువకులు ఇసుక క్వారీలో పనికి కుది రారు. పనులు సాగక ఇంటికి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. చేతికి అందివచ్చిన కొడుకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. -
రంగయ్య మృతిపై రాజకీయం..
సాక్షి, పెద్దపల్లి : కస్టడీలో ఉన్న నిందితుడు మంథని ఠాణాలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం రాజకీయరంగు పులుముకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మంథని పోలీసు స్టేషన్లో ఉరేసుకున్న రంగయ్య వ్యవహారం మంథనిలో రాజకీయ దుమారం లేపుతోంది. ఇప్పటికే ఈ సంఘటనపై హైదరాబాద్ సీపీని విచారాణాధికారిగా హైకోర్టు నియమించింది. మరో వైపు రంగయ్య కుటుంబసభ్యులకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల పరామర్శల పరంపర కొనసాగుతోంది. కస్టడీలో ఆత్మహత్య.. విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడుతున్నారనే అభియోగంపై గత నెల 24న రంగయ్యతోపాటు మరో ముగ్గురిని మంథని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంథని మండలం లక్కేపూర్ శివారులో విద్యుత్ తీగలు అమర్చిన సమయంలో ఎస్సై ఓంకార్ ఈ నలుగురిని పట్టుకున్నారు. రామగిరి మండలం బుధవారంపేట పంచాయతీ పరిధిలోని రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్య(52) కేసులో ఏ3గా ఉన్నాడు. కాగా, కస్టడీలో ఉండగానే 26వ తేదీన తెల్లవారుజామున ఠాణా ఆవరణలోని బాత్రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: పోలీస్స్టేషన్లో నిందితుడి ఆత్మహత్య విచారణకు హైకోర్టు ఆదేశం పోలీసు స్టేషన్లో రంగయ్య ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కస్టడీలో ఉన్న రంగయ్య ఆత్మహత్యపై అనుమానాలున్నట్లు మంథనికి చెందిన న్యాయవాది నాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ను విచారణాధికారిగా నియమించింది. మంథని ఎస్సై నుంచి ప్రభుత్వ సీఎస్ వరకు నోటీసులు జారీ చేసింది. కాగా ఇప్పటి వరకు మంథనికి విచారణాధికారి రాకపోవడంతో.. కోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరామర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు రాజకీయ దుమారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే వర్గపోరుకు మంథని నియోజకవర్గం పెట్టింది పేరు. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఆధిపత్య పోరుకు రెండు గ్రూపులు రంగంలోకి దిగుతున్నాయి. రంగయ్య మృతి ఘటన కూడా సహజంగానే రాజకీయాలకు వేదికగా మారింది. రంగయ్య మృతిపై న్యాయ విచారణ జరిపించాలని, ప్రభుత్వం స్పందించాలని స్థానిక ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్వయంగా రామయ్యపల్లికి వచ్చి రంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చదవండి: మళ్లీ గ్యాంగ్‘వార్’ కాగా, ఈ సంఘటనను అనవసరంగా రాజకీయం చేస్తున్నారని జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు కాంగ్రెస్ నేతల తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలోనే రంగయ్య కుమారుడు అనిల్ స్పందించాడు. తన తండ్రిని పోలీసులు వేధించలేదని, మృతిని రాజకీయానికి వాడుకోవద్దని కోరారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల నడుమ మాటల యుద్ధం తీవ్రమైంది. భట్టివిక్రమార్క పరామర్శించి వెళ్లిన మరుసటి రోజు గురువారం పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత సైతం రంగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కావాలనే రాజకీయం చేస్తున్నారని భట్టివిక్రమార్కపై విమర్శలు గుప్పించారు. ఖాకీల రాజీ! పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న రంగయ్య వివాదం సద్దుమణిగేలా కొంతమంది పోలీసులు కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన రాజకీయరంగు పులుముకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే పరిస్థితి కనిపించడంతో ముందు జాగ్రత్తపడినట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రాజీ కుదిర్చి, వాస్తవాలను వెలుగు చూడకుండా చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా రంగయ్య మృతి ఉదంతంపై హైకోర్టు విచారణకు ఆదేశించడం...హైదరాబాద్ సీపీ విచారణాధికారిగా నియమించడం.. సీఎల్పీ నేత న్యాయవిచారణకు డిమాండ్ చేస్తుండడంతో ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారింది. -
మంథని జైలు మరణంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: మంథని పోలీస్స్టేషన్లో ఆవరణలో మంగళవారం చోటుచేసుకున్న నిందితుడి అనుమానాస్పద మృతిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. శీలం రంగయ్య అనే వ్యక్తిని లాకప్ డెత్ చేశారంటూ న్యాయవాది నాగమణి రాసిన లేఖ ను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు మంథని జైలు మరణం ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎంక్వయిరీ కమిషన్ అధికారిగా హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ను నియమించింది. జూన్ 2 వరకు నిందితుడి అనుమానాస్పద మృతిపై సమగ్ర నివేదిక అందించాలని ఎంక్వయిరీ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేసింది. (చదవండి: పోలీస్స్టేషన్లో నిందితుడి ఆత్మహత్య) మృతిపై అనుమానాలు లేవు.. మరోవైపు శీలం రంగయ్య మృతిపై అతని కుటుంబ సభ్యుల వాదన భిన్నంగా ఉంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్య పల్లె గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించి.. ‘మా నాన్న మృతిపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. శరీరంపై కూడా ఎలాంటి గాయాలు లేవు. పోలీసులు కొట్టలేదు. నేను మా బాబాయ్ కలిసి చూసాం’ అని రంగయ్య కుమారుడు అనిల్ పేర్కొన్నాడు. తమ తండ్రి చావును రాజకీయం చేయొద్దని వేడుకున్నాడు. ‘మా అనుమతి లేకుండా బయటివారు.. స్వలాభం కోసం కేసు వేసి మమ్మల్ని బయటకీడుస్తున్నారు’అని రంగయ్య కుటుంబ సభ్యులు వాపోయారు. వీలైతే ఆర్ధిక సహాయం చేయండని, ప్రభుత్వం నుంచి కూడా సాయాన్ని ఆశిస్తున్నామన్నారు. కాగా, శీలం రంగయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శించారు. (చదవండి: బోరు బావిలో పడిపోయిన మూడేళ్ల బాలుడు!) -
పోలీస్స్టేషన్లో నిందితుడి ఆత్మహత్య
సాక్షి, మంథని: వన్యప్రాణుల వేట కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల్లో ఒకరు ఠాణా ఆవరణలోని బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామగుండం కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించింది. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం లక్కేపూర్ శివారులో ఈ నెల 24న వన్యప్రాణుల వేట కోసం మైదుపల్లికి చెందిన ఉప్పు కుమార్, మక్కాల మల్లేష్, సిద్దపల్లికి చెందిన తాటి సంపత్, రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్యలు విద్యుత్ తీగలు అమర్చుతుండగా మంథని ఎస్సై ఓంకార్యాదవ్ పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. (ఇండిగో ప్రయాణికుడికి కరోనా..) ఈ క్రమంలో ఠాణాలోని నిందితుల్లో ఏ–3గా ఉన్న రంగయ్య(52) మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీస్స్టేషన్ ఆవరణలోని బాత్రూంలో ఇనుప పైపునకు తలపాగాతో ఉరేసుకున్నాడు. అతను ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి నిందితులు బాత్రూం వద్దకు వెళ్లగా లోపల గడి పెట్టి ఉంది. వెంటనే తలుపు పగులగొట్టి చూడగా ఉరేసుకొని కనిపించాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రెండు వన్యప్రాణుల వేట కేసులు ఉన్నట్లు సీపీ తెలిపారు. ఇటీవలే ఈ గ్యాంగ్ ఓ అడవి పందిని వేటాడి చ ంపినట్లు తెలిసిందన్నారు. ఫిజికల్ టార్చర్ ఏం లేదని, ఒకవేళ పోలీసుల నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతదేహానికి తహసీల్దార్ అనుపమరావు పంచనామా నిర్వహించారు. (మెట్రో ప్రయాణం: మరో 30 సెకన్లు పెంపు) మానవ హక్కుల కమిషన్ నిబంధనలకు లోబడి విచారణ జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనలకు లోబడి కేసు విచారణ చేపడుతామని సీపీ సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ నరేందర్ను కేసు విచారణ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. వన్యప్రాణుల వేటలో ఏటా 10 నుంచి 15 మంది చనిపోతున్నారన్నారు. గతేడాది సుమారు 450 మంది వేటగాళ్లను బైండోవర్ చేసినట్లు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి, జైపూర్, సుందిళ్ల ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నాయని వెల్లడించారు. వాటికి ప్రాణహాని ఉందనే వన్యప్రాణులను వేటాడే వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ నుంచి కూడా సమాచారం వచ్చిందన్నారు. రంగయ్య కుటుంబసభ్యులతో పాటు మిగతా నిందితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తామని సీపీ పేర్కొన్నారు. వైద్య బృందం సమక్షంలో వీడియో చిత్రీకరణ చేస్తామని తెలిపారు. భారీగా మోహరించిన పోలీసులు పోలీస్ కస్టడీలో ఉన్న రంగయ్య ఉరేసుకోవడంతో అతని కుటుంబసబ్యులు, ఇతర కుల సంఘాలు, రాజకీయ నాయకులు వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్తో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఏసీపీలు, సీఐలు, ఇతర విభాగాల పోలీసులు మంథని ఠాణాకు చేరుకున్నారు. ఇతరులను పోలీస్స్టేషన్లోకి అనుమతించలేదు. మృతుడి బంధువులతో సంప్రదింపులు జరిపి, నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. (హైదరాబాద్లోనే ‘ఫావిపిరవిర్’ ) రామయ్యపల్లిలో విషాదం రామగిరి(మంథని): మంథని పోలీస్స్టేషన్లో రంగయ్య ఆత్మహత్మతో బుధవారంపేట పంచాయతీ పరిధిలోని రామయ్యపల్లిలో విషాదం నెలకొంది. మంగళవారం మృతుడి ఇంటి వద్ద కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసు కేసు భయంతోనే రంగయ్య ఉరేసుకొని ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య రాజమ్మ, కుమారుడు అనిల్, కూతుళ్లు రజిత(వివాహం అయ్యింది), మౌనిక ఉన్నారు. సోమవారమే భోజనం తీసుకెళ్లాను నాలుగు రోజుల కిందట నా భర్తను కలిశాను. సోమవారం కూడా భోజనం తీసుకెళ్లాను. ఆయన నాకేం చెప్పలేదు. ఇంతలో ఇలా సచ్చిపోయాడు. – రాజమ్మ, రంగయ్య భార్య -
పీటల మీద ఆగిన పెళ్లి
సాక్షి, రామగిరి (మంథని): ప్రేమ పేరుతో మోసం చేశాడని వరుడిపై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పీటల మీద పెళ్లి ఆగింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో శనివారం జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. సెంటినరీకాలనీకి చెందిన నాగెల్లి సాంబయ్య, స్వరూపరాణి దంపతుల ప్రథమ కుమారుడు వరుణ్కుమార్కు నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ మేరకు సెంటినరీకాలనీలో శనివారం ఉదయం 9.58 గంటలకు వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే వరుణ్కుమార్ తాను మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ప్రేమ పేరుతో తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని హైదరాబాద్కు చెందిన ఓ యువతి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో వరుణ్ను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారని తెలియడంతో వధూవరులకు సంబంధించిన బంధువులు వెళ్లిపోయారు. -
చాక్లెట్లో పురుగులు
మంథని: ఈమధ్య పిజ్జాలు, బర్గర్లలో పురుగుల వస్తుండటం సర్వసాధారణమైపోయింది. ఇక ఐస్క్రీములో చచ్చిన ఎలుక రావడం కూడా మీకు గుర్తుంటే ఉంటుంది. తాజాగా చాక్లెట్లో పురుగుల వచ్చిన ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్పల్లి కిరాణం దుకాణంలో మంగళవారం ఇద్దరు చిన్నారులు చాక్లెట్ కొనుగోలు చేసి తినేందుకు ప్రయత్నించగా అందులోంచి పురుగులు బయటకు రావడంతో భయంతో కింద పడవేశారు. అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు బోయిని నారాయణ కోరారు. -
ఆర్టీసీలో సంక్షేమ బోర్డులు
గోదావరిఖనిటౌన్ (రామగుండం): ఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ సూచనల మేరకు బస్ డిపోలలో సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేశారు. సంక్షేమ బోర్డులో ఎంపిక చేసిన సభ్యులతో ప్రతీ వారం సమావేశం నిర్వహించి డిపో విధులు నిర్వహిస్తు ఉద్యోగులతో వారి సమస్యలపై సమావేశమవుతారు. సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవడం ఈ బోర్డల లక్ష్యం. డిపోకు ఐదుగురు సభ్యలను నియమిస్తారు. డిపో మేనజర్ ఈ కమిటీకి ముఖ్య అధికారిగా వ్యవహరిస్తారు. ఇద్దరు కార్మికులు, డిపో గ్యారేజీ ఇన్చార్జి, డిపో ట్రాఫిక్ ఇన్చార్జి ఇలా మోత్తం ఐదుగురు సభ్యులు ప్రతీవారం సమావేశమై డిపో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తారు. సమావేశం ఇలా..... ప్రస్తుతం ఆర్టీసీ డిపో నియమించిన సంక్షేమ కమిటీ అన్ని విషయాలలో కీలకంగా పని చేస్తుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించిన విషయాలకు ప్రధాన్యత ఉంటుంది. ఆర్టీసీ పని చేస్తున్న ఉద్యోగుల విధుల కేటాయింపు, జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సెలవులు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు. ఏమైన సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే సంస్థ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ఉద్యోగులకు మరింత మేలు జరిగే విధంగా ఎలాంటి అంశాలనైన ఈ సమావేశంలో పొందుపర్చవచ్చు. వారానికోరోజు, నెలలో నాలుగు రోజు లు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. నెలకు ఒక్కసారి జిల్లా ఆర్ఎం కార్యాలయంలో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేస్తారు. రెండు నెలలకోసారి జోనల్ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్ స్థాయిలో మూడు నెలలకు ఒక్కసారి సమస్యలు పరిష్కరిస్తారు. జిల్లాలో ఇలా... జిల్లాలో గోదావరిఖని, మంథని బస్ డిపోలు ఉన్నాయి. గోదావరిఖని బస్ డిపోలో 129 బస్సు ఉండగా, 640 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మంథని డిపోలో 92 బస్సులు ఉండగా 310 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గోదావరిఖని సంక్షేమ బోర్డు సభ్యులు.. 1. ఎ.కొంరయ్య 2. బి.నారాయణ 3. వి.ఇందిరాదేవి 4. మాధవి 5. డీకే.స్వామి మంథని సంక్షేమ బోర్డు సభ్యులు.. 1. డీఆర్.రావు 2. విజయ్కుమార్ 3. బేగం 4.పార్వతమ్మ 5. సడవలయ్య డిపోలలో ఫిర్యాదు బాక్సులు.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం బస్ డిపోలో సూచనల కోసం ఫిర్యాదు బాక్స్లు ఏర్పాటు చేశారు. ప్రతీ ఉద్యోగి ఈ ఫిర్యాదు బాక్స్ను వినియోగించుకోవచ్చు. ప్రతీ కార్మికుని సెవులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్టీసీ సంస్థ కోసం సూచించే ప్రతి అంశాన్నీ ఈ ఫిర్యాదు బాక్స్లో వేయవచ్చు. వారంలో జరిగే సమావేశంలో ఈ బాక్స్ను తెరిచి ప్రతీ కార్మికుడి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం ఈ బాక్స్ లక్ష్యం. క్షేత్రస్థాయి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లాస్థాయిలో జరిగే సమావేశంలో ప్రతిబింబింపజేస్తారు. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు సంక్షేమ బోర్డులో భాగంగా డిపోలలో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ల కోసం, మహిళ అధికారుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు, సౌకర్యలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రత్యేక అవసరాల కోసం ప్రత్యేక సౌకర్యాలను, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కోసం ఆర్టీసీలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. దీని కోసం బస్ డిపోలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేశాం. ప్రతీ ఉద్యోగి వారివారి సమస్యలను, సంస్థ అభివృద్ధి కోసం ఇచ్చే సూచనలు స్వీకరించి ప్రతీవారం పరిష్కరిస్తాం. దీంతో డిపోలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. – వెంకటేశ్వర్లు, గోదావరిఖని డిపో మేనేజర్ -
చిన్నారిపై లైంగిక దాడి
సాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ఓ బాలిక (10)పై అదే గ్రామానికి చెందిన నస్పూరి శ్రీనివాస్(19) లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం గ్రామంలో పోచమ్మ జాతర జరుగుతుండటంతో ఊరి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులు కూడా జాతరకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన పక్కింట్లో ఉండే శ్రీనివాస్, ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి పక్కనే ఖాళీగా ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. దీంతో భయపడిన బాలిక ఇంటికి పరుగెత్తింది. విషయం తల్లికి చెప్పింది. దీనిపై శ్రీనివాస్ను ప్రశ్నించగా.. అతను అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు సమాచా రం అందగా.. వారు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఓంకార్యాదవ్ తెలిపారు. -
ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
సాక్షి, మంథని: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతోనే సమ్మెలోకి వెళ్లారని, వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్బాబు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సమస్యల సాధన కోసం మూడు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మంథనిలో శ్రీధర్బాబు, పెద్దపల్లిలో విజయరమణారావు సోమవారం సంఘీభావం తెలిపారు. కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.60 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చిన్నచిన్న తప్పిదాలు ఉండేవని, రాష్ట్రం వస్తే అలాంటి సమస్యలను పరిష్కారమవుతాని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కేసీఆర్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని పేర్కొన్నారు. సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని తెలిసినా గత నెల కార్మిక సంఘాలు నోటీస్ ఇస్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా ముగ్గురు అధికారులతో కమిటీ వేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాసామ్య బద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మంది కార్మికులను తీసేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సకల జనుల సమ్మె సమయంలో 27 రోజులు సమ్మె చేసినా ఒక్క కార్మికుడిని కూడా సస్పెండ్ చేయలేదన్నారు. కార్మికులను ఒక్క రోజులో విధుల నుంచి తీసేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. కార్మికులకు అన్యాయం జరిగితే రాష్ట్రంలో ప్రళయమే వస్తుంది హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల వేతనం కేవలం రూ.13 వేల నుంచి రూ.30 వేలు దాటడం లేదని, సీఎం మాత్రం రూ.50 వేలు తీసుకుంటున్నారనడం సరికాదని పేర్కొన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ ధర రూ.70.25 ఉండగా మన రాష్ట్రంలో రూ.73.00 ఉందన్నారు. డీజిల్పై జీఎస్టీ, వ్యాట్ 27 శాతం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 21 శాతం ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 42 రోజులు సకలజనుల సమ్మెలో పాల్గొని జీతాన్ని కోల్పోయిన కార్మికులు ఇప్పుడు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశ్నిస్తే రాజరిక వ్యవస్థను కేసీఆర్ గుర్తు చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రజలంతా సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలన్నారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని గుర్తుచేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశిభూషణ్కాచే, జిల్లా కార్యదర్శి సెగ్గెం రాజేశ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు మంథని సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి, మాజీ జెడ్పీసీసీ చొప్పరి సదానందం, ఆరెల్లి కిరణ్, జంజర్ల శేఖర్, ఆర్టీసీ సంఘం నాయకులు ఐలయ్య, కేకే.రెడ్డి, రాజయ్య, నూగిళ్ల మల్లయ్య, వేముల రామ్మూర్తి, జగదీష్, సురేశ్గౌడ్, బొడ్డుపల్లి శ్రీను, రాజమల్లు, రాజు, ఎంఏ.ఖయ్యూం, ఎస్కే.అహ్మద్, నర్సింగం, కొమురయ్య, ఎంఏ. అలీం, బాబా తదితరులు పాల్గొన్నారు. -
మందలించిన మామను హత్య చేసిన అల్లుడు
సాక్షి, మంథని: కాపురంలో కలహాలు లేకుండా కూతుర్ని బాగా చూసుకోవాలని మందలించిన మామను.. అల్లుడు హత్యచేసిన సంఘటన మంగళవారం రాత్రి మంథని మండలం బిట్టుపల్లి గ్రా మంలో జరిగింది. మంథని సీఐ మహేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొబ్బిల లక్ష్మయ్య(55)కు భార్య, కూతురు, ఇద్దరు కూమారులు. 2006లో కూతురు సుమలతను పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలకు చెందిన బాసనేని శ్రీనివాస్కు ఇచ్చి వివాహం జరిపించారు. పెండ్లి జరిగిన కొన్ని రోజులకే శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. ఈక్రమంలో పదినెలల క్రితం భార్యాపిల్లలతో వచ్చి అత్తగారి గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకొని నివా సముంటున్నాడు. తాగుడుకు బానిసైన శ్రీనివాస్ ఈమధ్యకాలంలో సుమలతను కొట్టడంతో ఆమె తండ్రి, తల్లి, సోదరులు వెళ్లి అడిగే క్రమంలో ఇరువురి మధ్య ఘర్ణణ జరిగింది. బావమరిది మహేశ్ మూలంగా తన తలకు గాయమైందని శ్రీనివాస్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ గొడవ జరిగినప్పటి నుంచి అత్తింటివారిని చంపుతానని శ్రీనివాస్ బెదిరించేవాడు. మంగళవారం రాత్రి పనికి వెళ్లి వచ్చిన శ్రీనివాస్ అత్తింట్లో ఉన్న భార్యాపిల్లలను తను అద్దెకు ఉండే గది రావాలని కబురు పంపడంతో మామ లక్ష్మయ్య వారిని దింపి వెళ్తున్నాడు. ఈక్రమంలో పాత కక్షను మనసులో పెట్టుకున్న శ్రీనివాస్ ఒంటరిగా ఉన్న మామపై గుర్తుతెలియని ఆయుధంతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు పారిపోయాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఒకే వేదికపై శ్రీధర్బాబు.. పుట్ట మధు
సాక్షి, మంథని : వారిద్దరూ రాజకీయ శత్రువులు. ఎక్కడ ఎదురుపడినా ఎడమొహం.. పెడమెహమే ఉంటుంది. అయితే బుధవారం మంథనిలో సింగరేణి సంస్థ ఆర్జీ– 3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్తో పాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు, జెడ్పీ చైర్పర్సన్ పుట్టమధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక బొక్కలవాగు కరకట్టలపై మొక్కలు నాటారు. అనంతరం హరితహారంపై సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుట్టమధు, శ్రీధర్బాబు ఒకే వేదికపై కూర్చున్నారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన ఇరు పార్టీల కార్యకర్తలు ఇద్దరు నేతలకు మద్దతుగా పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సింగరేణి అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రొటోకాల్ లేదని, సింగరేణి అధికారులపై ఒత్తిడిచేశారని జిల్లా పరిషత్ చైర్మన్ కౌంటర్ ఇచ్చారు. అనంతరం జిల్లాపరిషత్ పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. మొత్తంమీద కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో కార్యకర్తలు.. పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
మంథని నుంచి ఇసుక,నీరు తీసుకెళ్తున్నారు
-
జీడీకే–10 గని మూసివేత
సాక్షి, రామగిరి(మంథని): సింగరేణి సంస్థలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన జీడీకే–10 గనిని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్లోనే 10వ గనిని మూసివేయా లని యాజమాన్యం భావించినప్పటికి అనేక కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయి.. ఈ ఏడాది మార్చి వరకు యాజమాన్యం గడువు పెంచింది. గనిలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ముఖ్యంగా కోల్కట్టర్స్, సపోర్ట్మెన్లు కావల్సి ఉంటుంది. అయితే సంస్థలో కొత్తగా కార్మికుల నియామకాలు లేకపోవడంతో పాటు ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడం గని మూసివేతకు కారణంగా తెలుస్తోంది. 520 మంది కార్మికుల బదిలీ.. 1976లో స్థాపించిన జీడీకే–10ఇంక్లైన్(గని) తనకు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తూ.. ఎంతో మందికి ఉపాధి అందించి.. బంగారు గనిగా పేరొందింది. యావత్ సింగరేణిలో మొట్టమొదటి బీజీ(బ్లాసింగ్ గ్యాలరీ)ప్యానల్ ఏర్పాటు చేసిన 10వ గనిలో బొగ్గు ఉత్పత్తి కోసం ఖర్చులు అధికం కావడంతో గనిని మూసివేయాలనే యాజమా న్యం నిర్ణయించింది. ఇప్పటికే గనిలో పని చేస్తున్న సుమారు సుమారు 520 మంది కార్మికులను బది లీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వారికి ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ మేరకు వీరిలో 157 మంది కార్మికులు ఆర్జీ3 పరిధిలోని ఓసీపీ1, ఓసీపీ 2 గనులకు బది లీ కోసం దరఖాస్తులు చేసుకున్నా రు. మిగిలిన వారు వివిధ ఏరియాలకు బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. గనిలో ప్రస్తుతం ఉన్న 180 మంది కార్మికులు ఉన్నారు. గని లోపల డ్యామ్ నిర్మాణం, యంత్రాల తరలింపునకు అవసరం మేరకు కార్మి కులను ఇక్కడే ఉంచుకుని మిగిలిన కార్మికులను వివిధ గనులకు యాజమాన్యం బదిలీ చేస్తోంది. భూగర్భంలోని నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడం కోసం 1989లో యావత్ సింగరేణిలోనే మొట్టమొదటి సారిగా ఈ గనిలో బీజీ ప్యానల్ ఏర్పాటు చేశారు. అనేక ఒడిదొడుకులను ఎదు ర్కొని నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని గని సాధించింది. ఈ క్రమంలో గనిలో వర్క్స్పాట్(పని స్థలం)దూరం పెరింగింది. దాదాపు 250 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును ఉత్పత్తి చేసేందుకు మ్యాన్ వైడింగ్ షాప్టును ఏర్పా టు చేశారు. అయితే పనిస్థలం దూరంగా ఉండటంతో ఆశించినస్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. దీంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ గనిని ఆర్జీ3 పరిధి లోని ఓపీసీ1కు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది. పెరగనున్న ఓసీపీ–1 జీవితకాలం.. జీడీకే–10 గనిని మూసివేసి ఆర్జీ –3 పరిధిలోని ఓసీపీ–1కు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ఓసీపీ–1 జీవితకాలం దాదాపు 16 సంవత్స రాలు పెరగనుంది. ఓసీపీ–1కు అప్పగించనున్న 10వ గని ప్రాంతంలో 2019 డిసెంబర్ నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రా రంభం అవుతుంది. అదే విధంగా సింగరేణి సంస్థ లో మొట్టమొదటి సారి లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన జీడీకే 10ఏ గనిని 2015లో యాజమాన్యం మూసివేసింది. జీడీకే 10ఏ గనిని 1985 లో ప్రారంభించారు. భూగర్భంలో నాలుగు పొర ల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లో పై రెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం కోసం 1994లో 10ఏ గనిలో లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. జీడికే 10, జీడీకే 10ఏ గనుల ఆవరణలో సుమారు 336 మిలియన్ టన్నుల బొగ్గు ఉండగా.. 34 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. మిగిలిని 302 మిలియన్ టన్నుల బొగ్గును యాజమాన్యం ఓసీపీ–1 ద్వారా వెలికితీయనుంది. బొగ్గు ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి జీడీకే 10వ గనిని జీవితకాలం ముగిసింది. గనిలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే కోల్కర్టర్స్, సపోర్టుమెన్ కార్మికులు అవసరం కాగా.. కొత్తగా నియాకాలు లేవు. దీనికి తోడు పని స్థలం దూరం కావడంతో బొగ్గు ఉత్పత్తికి ఖర్చులు అ«ధికం కావడం వల్ల గనిని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఓసీపీ–1 విస్తరణ వల్ల ఏఎల్పీకి ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా రెండు డ్యామ్లను నిర్మించి, గనిలోపల ఉన్న యంత్రాలను పైకి తరలించిన తరువాతే.. గనిని పూర్తిస్థాయిలో మూసివేయడం జరుగుతుంది. –బి.వీరారెడ్డి, ఏఏపీ జీఎం -
తెలంగాణలో టీఆర్ఎస్.. ఆంధ్రాలో జగన్ కింగ్
సాక్షి, మంథని: దేశంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి బాగా లేదని, తెలంగాణలో టీఆర్ఎస్.. ఆంధ్రాలో జగన్ కింగ్ అని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంథనిలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉందని, కాలం కలిసి వస్తే ఢిల్లీ గద్దెపై కేసీఆర్ను ప్రధానిగా చూస్తామన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని అన్నారు. మాజీ ఎంపీ వివేక్ పార్టీకి ద్రోహం చేశారని, ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. పెద్దపల్లి పాçర్లమెంట్ అభ్యర్థి బొర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితున్నయ్యానన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
ఓటు రక్షణకు సీ విజిల్ యాప్
సాక్షి, రామగిరి: ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ విజిల్ యాప్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి తహసీల్దార్ రామ్మోహన్ అన్నారు. సెంటినరీకాలనీలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం సీ విజిల్ యాప్పై అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఎన్నికలు సజావుగా నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరూ సీ విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడంతో గ్రామాల్లో ఓటర్లను వివిధ పార్టీల నాయకులు ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకోవచ్చునని వివరించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సీ విజిల్ యాప్ ఎంతగానో దోహదపడుతోందని సూచించారు. సీ విజిల్ యాప్ ద్వారా గ్రామాల్లో ఎన్నికల నియామావళిని ఉల్లంఘినట్లయితే అందుకు సంబంధించిన ఫొటో లేదా వీడియోను అప్లోడ్ చేయడంతో సంబంధిత ఎన్నికల అధికారులకు చేరడంతో నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈయాప్ గురించి విద్యార్థులు ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అబ్బు కేశవరెడ్డి, ఆర్ఐ అజయ్ పాల్గొన్నారు. -
అప్పు తీసుకుని మోసం.. మనస్తాపంతో..
ముత్తారం(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపేట గ్రామానికి చిలుక దేవేందర్ (25) క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. దేవేవందర్ తండ్రి తన చిన్నతనంలో చనిపోయాడు. ఆటో నడుపుకుండూ తల్లి కొమురమ్మ, చెల్లిని పోషిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం రామగిరి మండలం బేగంపేటకు చెందిన బంధువులకు రూ.1.30 లక్షలు బాకీగా ఇచ్చాడు. గతేడాది చెల్లి పెళ్లి చేశాడు. దానికి కొంత అప్పు అయ్యింది. ఆ అప్పు తీర్చేందుకు తాను అప్పు ఇచ్చిన వ్యక్తి వద్దకు వెళ్లి డబ్బులు ఇమ్మని అడిగాడు. దానికి అతను నిరాకరించడంతో మనస్తాపం చెందిన దేవేందర్ పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి చనిపోయాడు. -
‘దేశంలో కాంగ్రెస్, బీజేపీల అరాచకం నడుస్తోంది’
మంథని: భారత దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల అరాచకం నడుస్తోందని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను గద్దె దింపాలని, ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకురావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోబోతుందని జోస్యం చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో వంద సీట్లు టీఆర్ఎస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఐదారు మాసాల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే రెండు రోజులు మంథనిలో ఉండి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పారు. టీఆర్ఎస్కు కులం మతం జాతి లేదని, అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుందని వ్యాక్యానించారు. 50 ఏళ్ల క్రితం కరెంటు పరిస్థితి ఎలా ఉండేది..ఇప్పుడు ఎలా ఉందో చూడాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. -
పుట్ట మధును మరోసారి ఆశీర్వదించండి
మంథని: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు జెడ్పీటీసీ సభ్యడు గోనె శ్రీనివాస్రావు ఆద్వర్యంలో మండలంలోని తాడిచర్ల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పుట్ట మధు నియోజకవర్గ పరధిలోని ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధును భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. మండలంలోని పెదతూండ్ల ఎస్సీ కాలనీకి చెందిన యూత్, మహిళ సభ్యులు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్ట మధు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాజోద్ధిన్, యూత్ అధ్యక్షుడు బాలాజీ, నాయకులు శీలం లక్ష్మయ్య, మెతుకు సమ్మయ్య, అనిపెద్ది రాంబాబు, తిరుపతిరావు, బొంతల రాజు, మల్లేష్, రఘుపతి, ఇనుముల సతీష్, సారయ్య, రాజు, సదానందం, సురేష్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు. కాటారం: మండలంలోని జాదారావుపేటలో ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత నాలుగున్నరెళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టో గూర్చి గ్రామస్థులకు వివరించారు. గతంలో ఈ ప్రాంతాన్ని ఏకదాటిగా పాలించిన కాంగ్రెస్ నాయకులు ప్రజల కష్టాలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన బిడ్డగా పుట్ట మధు ఎమ్మెల్యేగా 2014లో గెలిచాక స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మొసలి కన్నీరు, మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంతోషం శ్రీనివాస్రెడ్డి, యూత్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ తుల్సెగారి శంకరయ్య, నాయకులు నరివెద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి.. మహదేవపూర్:మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుబ్బగూడెం, టస్సర్కాలనీ, ఇస్లాంపుర కాలనీల్లో ఆదివారం ఇంటింటా ప్రచారం చేస్తూ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి పుట్ట మధును భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్దించారు. ఈ పచ్రార కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి బాపు, కాటారం ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు అలీంఖాన్, సమ్మిరెడ్డి, డివిజన్ సమస్వయ కమిటీ సభ్యులు బాలా జీరావు, పెండ్యాల మనోహర్, కార్యకర్తలు శ్రీహ రి, ప్రకాశ్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. గెలుపు ఖాయం.. మహదేవపూర్: మంథనిలో పుట్ట మధు గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులు బెల్లంకొండ నర్సింగరావు అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన మండల కేంద్రంలోని పూర్వపు స్నేహితులు, సన్నిహితులతో కలసి ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుట్ట మధు పట్ల ప్రజాధరణ పెరిగిందని, మండలంలో 60శాతం ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారన్నారు. కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బహూమానంగా ఇవ్వాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీపతి బాపు, నాయకులు దాబాడే బాలాజీరావు, శ్రీనివాసరావు, మోహన్రెడ్డి, ప్రకాశ్, ప్రభాకర్, సంజీవరెడ్డి, ప్రవీణ్, రమణయ్య, పద్మ, రవీందర్, సమ్మయ్యలు ఉన్నారు. -
మహనేతల మంత్రపురి
మంథని.. మంత్రపురిగా పిలుచుకున్న తూర్పు ప్రాంతం. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. గోదావరి పరవళ్లు.. త్రివేణి సంగమ అందాలు... ముక్తీశ్వరుడి దీవెనలు మంథని వాసుల సొంతం.మహామహులు ఏలిన నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు ఆదరించిన నేతలు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. అంతటి పేరున్న మంథని కల్లోల ప్రాంతంగా కూడా ఉంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న తూర్పుప్రాంతం ఎన్నికల సమయంలో సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించారు. తెలంగాణలోనే విస్తీర్ణంలో అతిపెద్ద నియోజకవర్గంగా మంథనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1952 నుంచి 2014 వరకు ఈ ప్రాంతాన్ని కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలే పాలించారు. ఒకరికి నాలుగుసార్లు పట్టం కట్టగా.. ఇద్దరు హ్యాట్రిక్ సాధించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఏళ్లకాలం పాటు మంథనిని పరిపాలించడం కొసమెరుపు. – మంథని మంథని భౌగోళిక చరిత్ర... మంథని 1952లో ఏర్పడింది. మొదటి నుంచి జనరల్ నియోజకవర్గంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడు మండలాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. విస్తీర్ణంలో తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గంగా 180కిలోమీటర్ల మేర ఉంది. జిల్లాల పునర్విభజన తరువాత నియోజకవర్గాన్ని రెండుగా చీల్చారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో మంథని, కమాన్పూర్, ముత్తారం, రామగిరి(కొత్త మండలం),పాలకుర్తి(2గ్రామాలు) ఉండగా... జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల(కొత్త మండలం)ను కలిపారు.ఈ ఎన్నికల్లో రెండు జిల్లాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2లక్షల మంది ఓటర్లు... మంథని నియోజకవర్గంలో 2,1,870 మంది ఓటర్లు ఉన్నారు. 1,00,989 పురుషులు ఉన్నారు. 1,00,860 మంది మహిళలు ఉన్నారు. 21 మంది ఇతర ఓటర్లు నియోజకవర్గంలో ఈ సారి ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండగా... తరువాత పద్మశాలీలు ఉన్నారు. కాపు ఓట్లు ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయినా ఇక్కడ బీసీ ఓటర్ల ఆధిపత్యమే కనిపిస్తుంది. నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరగగా... 12 పర్యాయాల్లో బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014 మొదటిసారిగా బీసీ సామాజికవర్గం నుంచి పుట్ట మధు శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు కంచుకోట... 1952లో మంథని నియోజకవర్గం ఏర్పడింది. పదమూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ పదిసార్లు సత్తాచాటింది. 1952లో సోషలిస్టు పార్టీ అభ్యర్థి గులికోట శ్రీరాములు, 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చందుపట్ల రాంరెడ్డిలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని ఓడించి రికార్డు సాధించారు. మిగతా పది పర్యాయాల్లో మంథని ‘హస్త’గతం అయ్యింది. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ మంథని ఓటర్లు కాంగ్రెస్కే పట్టం కట్టారు. 1999 నుంచి 2009 వరకు మూడు పర్యాయాలు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు ఓడించి కాంగ్రెస్ జోరుకు బ్రేకులు వేశారు. శ్రీపాద ‘హ్యాట్రిక్’... పీవీ. తరువాత 1978లో సి. నారాయణరెడ్డి కాంగ్రెస్(ఐ) నుంచి గెలుపొందారు. తరువాత కాటారం మండలం దన్వాడకు చెందిన దుద్దిళ్ల శ్రీపాదరావు కాంగ్రెస్ కంచుకోటను పదిలం చేశారు. ఎన్టీఆర్ ప్రభజనంలోనూ మంథని ప్రజలు శ్రీపాదరావుకే పట్టం కట్టారు. 1983 నుంచి 1994 వరకు ఎమ్మెల్యేగా పాలించి హ్యాట్రిక్ నమోదు చేశారు. 1991 నుంచి నాలుగేళ్లు శాసనసభాపతిగా పని చేశారు. 1999 ఏప్రిల్13న మహదేవ్పూర్ మండలం అన్నారం అటవీప్రాతం వద్ద శ్రీపాదరావును మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. పీవీ... మంథని టు ఢిల్లీ... అపర చాణక్యుడు, ఆర్థిక సంస్కరణల సృష్టికర్తగా పేరుగాంచిన పీవీ. సర్సింహారావు స్వస్థలం ఉమ్మడి జిల్లాలోని భీమదేవపల్లి మండలం మండలం వంగర అయితే రాజకీయంగా ఓనమాలు దిద్దింది మాత్రం మంథనిలోనే అని చెప్పవచ్చు. 1957 నుంచి 1972వరకు నాలుగు పర్యాయాలు మంథని ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆయన రాష్ట్రమంత్రి వర్గంలో కీలక పదవుల్లో పని చేయడమే కాకుండా 1971లో పీవీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తరువాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నికై దేశ ప్రధానిగా సేవలందించారు. వారసుడొచ్చాడు... 1994లో చంద్రుపట్ల రాంరెడ్డి టీడీపీ నుంచి గెలుపొందారు. 1999లో శ్రీపాదరావు హత్య తరువాత అతడి వారసుడిగా శ్రీధర్బాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించి ఎదురు లేని నేతగా ఎదిగారు. దివంగత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కేబినెట్లో ప్రభుత్వ విప్, ఉన్నతవిద్య, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు గెలుపొంది కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వేశారు. ద్విముఖ పోరు.. ఈ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో ద్విముఖపోరు ఉండనుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి పుట్టమధు, కాంగ్రెస్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబు బరిలో దిగనున్నారు. ఇద్దరి మధ్య హేమాహేమి పోరు జరగనుంది. ఇప్పటికే ఒకరికి మించి ఒకరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇమిడి ఉన్న మంథని నియోజకవర్గం ఎన్నికల విధులన్నీ పెద్దపల్లి జిల్లా అధికారులే నిర్వహించడం విశేషం. కేవలం భూపాలపల్లి నుంచి పోలీసు బలగాలను వినియోగించుకోనున్నట్లు సమాచారం. ద్విముఖ పోరు.. ఈ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో ద్విముఖపోరు ఉండనుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి పుట్టమధు, కాంగ్రెస్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబు బరిలో దిగనున్నారు. ఇద్దరి మధ్య హేమాహేమి పోరు జరగనుంది. ఇప్పటికే ఒకరికి మించి ఒకరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇమిడి ఉన్న మంథని నియోజకవర్గం ఎన్నికల విధులన్నీ పెద్దపల్లి జిల్లా అధికారులే నిర్వహించడం విశేషం. కేవలం భూపాలపల్లి నుంచి పోలీసు బలగాలను వినియోగించుకోనున్నట్లు సమాచారం. కల్లోల ప్రాంతంగా... మంథని నియోజకవర్గం ఎక్కువశాతం అటవీవిస్తీర్ణం కలిగి ఉంటుంది. మొదటి నుంచి నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా పేరుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉధృతంగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఎన్నికలంటే.. అధికారులు.. పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండేవారు. జీ నక్సల్స్ పహారా మధ్య ఎన్నికల నిర్వహణ జరిగింది. కేంద్ర పారామిలటరీ, సీఆర్పీఎఫ్ దళాలు రంగంలో దిగేవి. ఈవీఎంలు, బ్యాలెట్బాక్సులను హెలిక్యాప్టర్లో చేరవేసేవారు. ఎన్నికల విధులకు వెళ్లిన అధికారులు తిరిగి వచ్చే వరకు అందరిలోనూ ఉత్కంఠ ఉండేది. ఎన్నికలను బహిష్కరించాలనే నక్సల్స్ ఎన్నికల సిబ్బంది సైతం అడ్డుకున్న సందర్బాలు అనేకం. అయితే ప్రస్తుత పరిస్థితులు మారాయి. మావోయిస్టు ప్రాబల్యం తగ్గిపోయింది. కానీ పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్గఢ్లో అన్నల ప్రభావం ఉండడంతో స్థానికంగా పోలీసులు చర్యలకు పూనుకుంటున్నారు. ఈ సారి నియోజకవర్గంలోని 64మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దింపేందుకు ఏర్పాటు చేశారు. రోడ్డు వచ్చింది.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో రోడ్డు సౌకర్యం మొరుగుపడింది. తాడిచర్ల మానేరు నుంచి పెదతూండ్ల కిషన్రావుపల్లి వరకు డబుల్ రోడ్డు, చినతూండ్ల నుంచి శాత్రాజ్పల్లి వరకు లింక్ రోడ్డులను, బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టి గ్రామస్తులకు దూర భారాన్ని తగ్గించింది. ప్రజల చిరకాలవాంచ అయిన ఖమ్మరవపల్లి బిడ్జి మంజూరు చేసి పనులు ప్రారంభించింది. తాడిచర్ల నాగులమ్మ వరకు డబుల్ రోడ్డు నిర్మించారు. – రామిడి సురేశ్, తాడిచర్ల అభివృద్ధి జరిగింది.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆసరా పించన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు అందిస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా పోయింది. మహదేవ్పూర్– పలిమెల మండలాలకు బీటీరోడ్డు వేయడంతో పాటు వాగులపైన వంతెనలు నిర్మిస్తున్నారు. దీంతో ప్రతిపల్లెకు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. – చాగర్ల రవీందర్, మహదేవపూర్ పథకాలు అమలు కాలేదు.. పథకాల అమలులో అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మారుమూల పల్లెల్లో పూర్తిస్థాయిలోచేరలేదు. దీంతో సమాన్యుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. తెలంగాణ సర్కారు అందించిన వివిధ రకాల పథకాలు సామాన్యుడికి చేరకపోవడంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది. – రాజునాయక్, ప్రేమ్నగర్, మంథని -
పుట్ట మధుపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : మంథని టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బాధితుడు రామన్నరెడ్డి సోమవారం తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి తన గోడును వినిపించారు. పుట్ట మధు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, తనకు రక్షణ కల్పించాలని డీజీపీని అభ్యర్థించారు. 2013లో టీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ ముందు ఆత్మహత్య చేసుకున్న గుండా నాగరాజు కేసులో సాక్ష్యం చెప్పొద్దంటూ పుట్ట మధు తనను బెదిరిస్తున్నారని రామన్నరెడ్డి డీజీపీకి తెలియజేశారు. 2014 ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే టిక్కెట్ పుట్ట మదుకు ఇవ్వాలంటూ గుండా నాగరాజు అనే కార్యకర్త టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, నాగరాజు ఆత్మహత్య చేసుకోవడానికి రూ. 50వేలు ఇచ్చి ప్రేరేపించింది పుట్ట మధునేనని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను బాధితుడు డీజీపీకి సమర్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కాల్డేటాతో సహా, చనిపోయిన నాగరాజు ఇచ్చిన వాంగ్మూల ప్రతులను డీజీపీకి రామన్న అందజేశారు. నాగరాజు ఆత్మహత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా పోలీసులు పుట్ట మధును నిందితుడిగా చేర్చకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కాపాడుతున్నారని బాధితుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. -
ఒకే స్థలం రెండు సంస్థలకు!
సాక్షి, మంథని : ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓ పట్టాదారు వద్ద కొనుగోలు చేసిన భూమిని సదరు పట్టాదారు మరలా ఓ ప్రైవేటు సంస్థకు రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. మంథని డివిజన్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ శ్రీ దేవసేన మండలపరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా ఇన్చార్జి డీఆర్వో పద్మయ్య, డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మంథని మండలం నాగారం శివారులోని సర్వే నంబర్లు 95, 97లోని 17 ఎకరాల భూమిని 1997లో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసింది. దానిని 17 మంది ఎస్సీలకు పంపిణీ చేసిందని గ్రామానికి చెందిన రైతు బెల్లంకొండ రవీందర్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి కాస్తులో ఉన్న ఎస్సీలు తమ పేర్లను పహణీలో చేర్చాలని, పట్టా పాస్పుస్తకాలు ఇవ్వాలని అధికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే అదునుగా పట్టాదారు అదే భూమిని ఓ ప్రైవేటు సంస్థకు ఎకరాకు రూ.9 లక్షల చొప్పున 11 ఎకరాలను 2015–16లో అమ్మినట్లు తెలిపారు. సమస్యపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ సుధాకర్ను వివరణ కోరారు. రెండోసారి అక్రమ పట్టా నిజమేనని చెప్పడంతో వెంటనే సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో చూపని కారణమా లేక మరేదో చూడాలని, రిజిస్ట్రేషన్ అథారిటీ, రెవెన్యూ అథారిటీ వేరని, ప్రభుత్వం కొత్తగా రెవెన్యూకే రిజిస్ట్రేషన్ అథారిటీ అప్పగించినందున ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకపోవచ్చని తెలిపారు. నాగారంలో జరిగిన సమస్యను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా రెండోసారి పట్టా చేసి వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు వేయాలని ఆదేశించారు. అ భూమిలో ఇప్పటికే పట్టాలు ఇచ్చి ఉంటే వారిలో అర్హులను గుర్తించి పాస్పుస్తకాలు జారీ చేయాలని సూచించారు. నెలాఖరులోగా అందరికీ పాస్పుస్తకాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా రైతులందరికీ పట్టాపాస్పుస్తకాలు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపాçరు. రైతులకు పాస్పుస్తకాల పంపిణీ పక్రియ నిరంతరం జరుగుతుందని, ఎవరూ హైరానా పడాల్సిన అవరం లేదన్నారు. జిల్లాలో 1.26 లక్షల మంది రైతులను గుర్తించామని, 1.13 లక్షల పాస్పుస్తకాలు ప్రింట్ చేయించామన్నారు. ఇప్పటి వరకు 1.09 లక్షల మంందికి పంపిణీ చేశామని వివరించారు. వివిధ కారణాలతో 12 వేల పాస్ పుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు. పంపి ణీ చేసిన పాస్పుస్తకాల్లో దొర్లిన తప్పుల సవరణ, కొత్త పాస్పుస్తకాల పంపిణీ పక్రియ ను నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. ఇలాంటివి జిల్లాలో 3 వేలు ఉన్నాయని తెలి పారు. గతంలో ఉన్న వెబ్లాండ్తో అనేక సమస్యలు వచ్చాయని ధరణీ వెబ్సైట్ పకడ్బందీగా ఉందన్నారు. కొత్తగా చేర్చిన సమాచారం ఆన్లైన్లో నమో దు చేసి సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ ద్వారా రైతులకు అందిస్తాన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పార్ట్–ఏ, బీ నమోదు చేశామని పార్ట్–ఏ కింద 94 శాతం పూర్తి చేసామని బీలో కేవలం 6 శాతమే అన్నారు. వివాదాలు, ఫిర్యాదుల ఉన్నవాటిని బీలో చేర్చామని, పరిశీలన, విచారణ అనంతరం అర్హులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. నాగారంలో గ్రామం రెవెన్యూ, గ్రామపంచాయతీలో లేకుండా పోవడంతో ఇబ్బందులు ఎదురొంటున్నామని ప్రకాశ్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రామగుండం కార్పొరేషన్కు 25 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉండడంతో నిబంధన అడ్డుగా ఉందని తెలిపారు. రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో కాస్తులో ఉన్న భూమి అటవీశాఖవారు తమదని అంటున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సాదాబైనామాలు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయ ని డిసెంబర్ 31 వరకు మాత్రమే దరఖాస్తులు తీసుకున్నారని.. తర్వాత తీసుకోవాలని పలువురు కోరారు. అలాగే పీఓటీ కింద వేల సమస్యలు గుర్తించా మని, వీటన్నింటిపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీంచి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో తిరుగుతుంటే రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని అందుకే ప్రత్యక సమావేశం ఏర్పాటు చేయించా మన్నారు. అధికారులు మానవీయ కోణాన్ని చూడాలని, వారి పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మంథన, ముత్తారం ఎంపీపీలు ఏగోళపు కమల, అత్తె చంద్రమౌళి, కమాన్పూర్ జెడ్పీటీసీ, మంథని సర్పంచ్ పుట్ట శైలజ, ఆయా మండలాల తహసీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు. -
వివాదంలో టీఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే
-
సీఎం కేసీఆర్ కల నెరవేర బోతోంది
కాళేశ్వరం(మంథని) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ కల సాకారం అవుతుం దని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. శుక్రవారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారంలో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీ పనులను మంత్రి హరీష్రావుతో కలసి పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. నిరుపేద రైతుల పంటపొలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నిరుపేదలకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. బీడు భూములన్ని సస్యశామలంగా మారుతాయని ఆశాభావ ం వ్యక్తం చేశారు.ఆయన వెంట కాళేశ్వరం బ్యారేజీ చీప్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, అఫ్కాన్ కంపెనీ డైరెక్టర్ మల్లికార్జున్రావు, ఈఈ మల్లికార్జున్ప్రసాద్, డీఈఈ యాదగిరి, అప్కాన్ హెచ్ఆర్ మేనేజర్ గోవర్ధన బార్గవలు ఉన్నారు. -
గోదారి.. ఎడారి!
మంథని: గోదావరి ఎడారిని తలపిస్తోంది. నదిలో నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. సాధారణంగా ఏప్రిల్..మే మాసంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటే గోదావరిలో నీటిధార ఆగిపోతుంది. కానీ.. ఈసారి రెండు మాసాలు ముందుగానే గోదావరి ఎండిపోయింది. వేసవిలో తాగునీటి ముప్పు ఇప్పుడే తెలియజేస్తుంది. నదీపరీవాహక ప్రాంతాల్లో సాగుచేసిన పంటల పరిస్థితి కూడా ప్రశ్నార్థకరంగా మారింది. జిల్లాలో సుమారు వంద కిలో మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తోంది. ఎక్కడా చుక్కనీరు కనిపించడంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఈ పరిస్థితి భవిష్యత్తు అవసరాల కోసం గోదావరినదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈసారి గోదావరినదిలో నీరు లేకుండా పోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ మొదలుకొని సుందిళ్ల పం పుహౌస్ వరకు గోదావరిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో నదీ ప్రవాహాన్ని మళ్లించడమే కాకుండా నిర్మాణానికి నీటిని వినియోగిస్తుండడంతో నదీస్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒక్క మేడిగడ్డ వద్ద మాత్రం ప్రాణహిత నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా బ్యారేజీలు, పంపుహౌస్ల వద్ద ఎక్కడా నీరు లేదు. తాగునీటికి పొంచి ఉన్న ముప్పు గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోవడంతో ఈ సారి త్రాగునీటి సమస్య ముందే ఎదురౌతుంది. మంథని మేజర్ గ్రామపంచాయతీ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అదనంగా బోర్లు వేసి సౌకర్యం కల్పించారు. కాని గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడే అనేక గ్రామాల్లో బోర్లలో నీటి మట్టం తగ్గి ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. చెలిమె నీటితో పుణ్యస్నానాలు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆచరంగా వస్తుంది. శుభకార్యమైనా..ఆశుభకార్యమైన నదిలో స్నానం చేసి శుద్ధి చేసుకుంటారు. ఐతే నదిలో నీటి ధార లేకపోవడంతో చెలిమలను తోడుకొని పుణ్యస్నానాలు చేస్తున్నారు. గోదావరి నీటిని తీసుకెళ్లి ఇంట్లో శుద్ధిచేసుకుంటున్నారు. ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియల తంతుకూడా గోదావరి నదీతీరంలోనే ఎక్కువమంది చేస్తారు. నదీతీరంలో ఏర్పాటు చేసిన బోరు కింద స్నానాలు చేస్తున్నారు. చనిపోయిన వారి బొక్కలు కలుపడం సంప్రదాయం. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో కాళేశ్వరంనకు వెళ్తున్నారు. మహాశివరాత్రి భక్తులకు అసౌకర్యమేనా? ఈ నెల 13న మహాశివరాత్రి పర్వదినం ఉంది. పండుగ రోజున పుణ్యస్నానాలు చేసి ఉపవాసంతో జాగరణ చేస్తారు అనేక మంది భక్తులు. మంచిర్యాల జిల్లా వేలా లలో 13 నుంచి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. మల్లన్నకు భక్తులు బోనాలు సమర్పిస్తారు. జిల్లా పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలోని ప్రజలు వేలాల మల్లన్నను దర్శించుకొని బోనాలు, పట్నాలు సమర్పిస్తారు. నదీలో పుణ్యస్నానం చేసి స్వామి వారిని దర్శించుకోవడం ఆచారం. మహా శివరాత్రి మరో వారం రోజులు మాత్రమే ఉంది. పుణ్యస్నానాలకు నీటి వదిలితే తప్ప ఆ అవకాశం భక్తులకు ఉండదు. అధికారులు.. ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
దుప్పులను వేటాడినోళ్లను వదలం: ఈటల
సాక్షి, కరీంనగర్: మహదేవ్పూర్ అడవుల్లో జరిగిన దుప్పుల వేట కేసులో నిందితులను వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించేది లేదని, అధికారి పార్టీ వారైనా శిక్షార్హులేనన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తమ పార్టీ వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంథనిలో దళిత యువకుడు మధుకర్ సంఘటనపైనా సమగ్ర విచారణకు ఆదేశించామని, వాస్తవాలు త్వరలోనే వెల్లడవుతాయని అన్నారు. ప్రేమించుకున్న ఇద్దరినీ పెద్దలు కాదనడంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో మధుకర్ మృతి చెందినట్లు అతని మేనమామ పాల్ చెబుతున్నారని, ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కులాలు 70 ఏళ్ల కిందటే పోయాయని, దళిత యువకుడిని ప్రేమ, పెళ్లికి దూరం చేయడాన్ని ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. మహదేవ్పూర్, మంథని సంఘటనలపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా రబీ ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సారి అంచనాకు మించి ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావించి రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ ధాన్యం తడవకుండా, నిల్వ చేసేందుకు సరిపడా గన్నీసంచులు, టార్పాలిన్లు, గోదాములను సిద్దం చేశామని మంత్రి చెప్పారు. కాళేశ్వరం, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు తదితర పుణ్యక్షేత్రాలను భక్తుల దర్శనీయ కేంద్రాలుగా, పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని ఈటల రాజేందర్ అన్నారు. -
మంథని యువకుడి మృతిపై న్యాయవిచారణ
ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథనిలో మాదిగ యువకుడు మధుకర్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం డిమాండ్ చేశారు. మార్చి 14వ తేదీన మధుకర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధుకర్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురయ్యాడని తమకు అందిన సమాచారం ప్రకారం అర్ధమవుతున్నదని పేర్కొన్నారు. మార్చి 13న ఇంటి నుండి బయలుదేరిన మధుకర్ మరునాడు శవమయ్యాడని, ఇతర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినందుకు మధుకర్పై దాడి చేసి చంపినట్టు కనబడుతున్నదని పేర్కొన్నారు. కళ్లు పీకేసి, పక్కటెముకలు విరగ్గొట్టి, మర్మాంగాలు కోసి మధుకర్ ను అతిదారుణంగా హత్య చేసినట్టుగా స్పష్టమవుతోందని కోదండ రాం పేర్కొన్నారు. పలుకు బడిగల నాయకుల జోక్యంతో దీన్ని పోలీసు అధికారులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, పైన చెప్పిన విధంగా తనను తాను హింసించుకోవడం సాధ్యం కాదని అన్నారు. బాధితులకు న్యాయం జరుగాలంటే శవాన్ని వెలికితీసి రీ–పోస్ట్ మార్టం చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. -
భక్తులపై పోలీసుల ప్రతాపం
మంథని : గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న భక్తులపై పోలీసులు ప్రతాపం చూపించారు. కమాన్పూర్ మండలం సెంటనరీకాలనీ ముల్కలపల్లికి చెందిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మంథని వద్ద గల గోదావరిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. అనంతరం నదిలో స్నానాలు చేస్తున్నారు. వారిని బయటకు రావాలని ఎస్సై ఉపేందర్ సూచించారు. వారు వినిపించుకోలేదు. ఎస్సై వారి వద్దకు వెళ్లగా.. ఓ భక్తుడు ఎస్సైని పక్కకు నెట్టేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై వారిపై లాఠీ ఝుళిపించారు. గన్మన్ కూడా లాఠీతో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ సంఘటనలో మల్లేశ్ అనే భక్తుడి చేయికి గాయమైంది. దీంతో వివాదం చెలరేగింది. ఎస్సై చెప్పిన వెంటనే బయటకువచ్చామని, గన్మన్ తమపై ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. ఎస్సై ఉపేందర్ అక్కడి వచ్చి భక్తులకు నచ్చజెప్పారు. -
బలపడనున్న మంథని బంధం
జయశంకర్ జిల్లాలో కలపడంతో అక్కడి ప్రజల్లో హర్షం భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లా ల పునర్విభజనలో మంథని నియోజకవర్గాన్ని భూపాలపల్లి జిల్లాలో కలుపడంతో అక్కడి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారు ఇన్నాళ్లు విద్యా, వ్యాపారం తదితర అవసరాల నిమిత్తం భూపాలపల్లికి వచ్చేవారు. ఇప్పుడు నూతనంగా ఏర్పడే భూపాలపల్లి జిల్లాలో మంథని నియోజకవర్గం కలుస్తుండటంతో వారి బంధం మరింత బలపడినట్లయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లిని ఆచార్య జయశంకర్ జిల్లాగా ఏర్పాటు చేయనుంది. నియోజకవర్గం లోని భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, ములుగు నియోజకవర్గంలోని ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, మంథని నియోజకవర్గంలోని కాటారం, మల్హర్రావు, మహముత్తారం, మహాదేవ్పూర్ మండలాలతో జిల్లాను ఏర్పాటు కానుంది. 30 ఏళ్లుగా భూపాలపల్లితో సత్సంబంధాలు భూపాలపల్లి పట్టణంతో కాటారం, మల్హర్రా వు, మహాముత్తారం, మహాదేవ్పూర్ మండలాల ప్రజలకు 30 ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి. విద్యార్థులు జూనియర్, డిగ్రీ, పీజీ చదువుల కోసం ఇక్కడికే వస్తుంటారు. పట్టణంలోని ప్రైవేటు కళాశాలల్లో ఆయా మండలాలకు చెందిన విద్యార్థులు 40 శాతానికి పైగా ఉంటారు. అలాగే అక్కడ మెరుగైన వైద్య సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. పరిస్థితి విషమిస్తే మాత్రం వరంగల్కు వెళ్తారు. రైతులు ఎరువు లు, క్రిమి సంహారక మందులు, పనిముట్ల కొ నుగోళ్లు, కూరగాయల క్రయ, విక్రయ నిమిత్తం వస్తుంటారు. కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహాదేవ్పూర్ మండలాల ప్రజలు జిల్లా కేంద్రమైన కరీంనగర్కు వెళ్లాలం టే సుమారు వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించాల్సి ఉండేది. చిన్న పనికి సైతం ఒకటి, రెండు రోజులు వెచ్చించాల్సి వచ్చేది. కాగా ఆయా మండలాలు జయశంకర్ జిల్లాలో కలుస్తుండటంతో దూర భారం తగ్గింది. -
తూర్పున హై అలర్ట్
నేటి నుంచి మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు టార్గెట్లను అప్రమతం చేసిన పోలీసులు మంథని/మహాముత్తారం : ఉద్యమబాటలో అసువులు బాసిన అమరులను స్మరించుకునేందుకు మావోయిస్టులు ఏటా నిర్వహించే సంస్మరణ వారోత్సవాలు గురువారం నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. వారోత్సవాలను భగ్నం చేసేందుకు అటవీ గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. పశ్చిమ మావోయిస్టు సిద్దాంతకర్త చార్మజూందార్ 1977లో మృతిచెందాడు. అప్పటి నుంచి మావోయిస్టులు సంస్మరణ వారోత్సవాలను ఏటా తమకు పట్టున్న ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి పెట్టిన కోటాగా ఉన్న మహదేవాపూర్, మహాముత్తారం ప్రాంతాన్ని నక్సల్స్ గెరిల్లా జోన్గా ప్రకటించుకుని సమాంతర పాలన నడిపారు. కాలక్రమంలో పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అగ్రనాయకులు హతమయ్యారు. కొన్నేళ్లు ఈ ప్రాంతాన్ని వీడిన మావోయిస్టులు దండకారణ్యంలో తిష్టివేసి అప్పుడప్పుడు తూర్పున తమ ఉనికిని చాటుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్కౌంటర్లు ఆగుతాయని మావోయిస్టులు భావించారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన శృతి, విద్యాసాగర్ను తెలంగాణ పోలీసులు కాల్చి చంపడంతో మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు అందును కోసం చూస్తున్నారు. తాజాగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించి తూర్పున మళ్లీ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో తిప్పి కొట్టడానికి పోలీసులు గోదావారి పరీవాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మావోల టార్గెట్లను, మాజీ నక్సలైట్లను అప్రమత్తం చేసినట్లు మహాముత్తారం ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపారు. అయితే కొన్నేళ్లుగా ఉనికి కోల్పోయిన మావోయిస్టు పార్టీ జిల్లాలో ఎక్కడా సంస్మరణ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఏదేమైనా వారం రోజులు అటవీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
మంథని (కరీంనగర్ జిల్లా) : మంథని మండలంలోని గోదావరి నది ఒడ్డున ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం వీరికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరూ ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన తిరుపతి(22), నిర్మల(19)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంథనిలో భారీ వర్షం
మంథని (కరీంనగర్) : ఓ వైపు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు అకాల వర్షాలు రైతులకు కన్నీటిని మిగులుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మంథని డివిజన్లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కౌలురైతు ఆత్మహత్య
మంథని మండలం స్వర్ణపల్లిలో బుధవారం ఉప్పుల అశోక్ అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడం, చేసిన అప్పులు తీర్చే మార్గం కనపడక పోవటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ
కరీంనగర్ (మంథని) : గీత కార్మిక సంఘం అధ్యక్షుడి నుంచి లంచం తీసుకుంటూ మంథని ఎక్సైజ్ సీఐ శామ్యూల్ జాక్సన్ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గుర్తింపు కార్డుల జారీ కోసం సీఐ శామ్యూల్ రూ.10 వేలు లంచం అడగటంతో గీత కార్మిక సంఘం వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంథని ఎక్సైజ్ ఆఫీసులో సీఐ బాధితుల నుంచి లంచం తీసుకుంటుడగా రెడ్హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని సీఐపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోదారమ్మకు చీర సారె
కరీంనగర్ : గోదావరి మహా పుష్కరాలు ముగిసిన సందర్భంగా.. కరీంనగర్ జిల్లా మంథనిలో మంగళవారం భక్తులు గోదావరికి చీర సారె బహుకరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. మొక్కులు చెల్లించుకోవడానికి జిల్లాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి తుల ఉమతోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి విచ్చేశారు. ఈ కార్యక్రమం మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వైభవంగా నిర్వహించారు. -
గోదావరి మాతకు భారీ చీర సమర్పణ
మంథని : కరీంనగర్ జిల్లా వాసులు గోదావరి మాతకు భారీ చీర సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. 1475 మీటర్ల పొడవైన చీరను ఆదివారం మంథని సమీపంలో గోదావరినదిపై అటువైపు ఒడ్డు నుంచి ఇటువైపు ఒడ్డు వరకు పరిచి పట్టుకున్నారు. మంథనికి చెందిన కొత్తపల్లి హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్రెడ్డి సతీమణి జమునారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మంథని సర్పంచ్ పుట్ట శైలజతోపాటు సుమారు 100 మంది పాల్గొన్నారు. ఇక్కడ గోదావరి నది వెడల్పు సుమారు ఒకటిన్నర కిలోమీటరు ఉంటుంది. -
గోదావరి పుష్కరాలు కాదు.. గులాబీ పుష్కరాలు
కరీంనగర్ (మంథని) : కరీంనగర్ జిల్లా మంథనిలోని పుష్కరఘాట్ను శుక్రవారం కాంగ్రెస్ నేతల బృందం పరిశీలించింది. పుష్కర ఘాట్ల వద్ద చేసిన ఏర్పాట్ల పట్ల కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇవి గోదావరి పుష్కరాలు కాదని, గులాబీ పుష్కరాలని ఎద్దేవా చేశారు. గుళ్లు, గోపురాలకు గులాబి రంగు వేశారని, దేవుళ్లకు రాజకీయ రంగు పూయడం మంచిది కాదని ఆయన అన్నారు. పుష్కరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కరీంనగర్ (మంథని) : కరీంనగర్ జిల్లా మంథనిలో వైఎస్సార్సీపీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సెగ్గం రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ శిబిరంలో దాదాపు 500 మంది పేదలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే పలువురు రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. -
భార్యను హత్యచేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు..
మంథని (కరీంనగర్): పెళ్లై ఏడాది కూడా కాకుండానే ఓ వివాహిత వరకట్న దాహానికి బలైంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మంథని మండల కేంద్రంలోని బ్రిడ్జిరోడ్లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. జిల్లాలోని కమాన్పూర్ మండలం రొంపికుంటకు చెందిన శిరీష(22)కు మండల కేంద్రానికి చెందిన చంద్రమౌలి(25)తో ఏడాది కిందట వివాహమైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో చంద్రమౌలి కోపోద్రిక్తుడై శిరీష గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి నేరాన్ని అంగీకరించి స్టేషన్లో లొంగిపోయాడు. ఇదిలా ఉండగా.. మరోవైపు శిరీష తల్లిదండ్రులు మాత్రం పెళ్లైనప్పటి నుంచే అదనపు కట్నం కోసం వేదిస్తుండేవాడని, కట్నం కోసమే అల్లుడు చంద్రమౌలి తమ కూతురిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. -
మంథనిలో వైఎస్సార్సీపీలోకి వలసలు
మంథని (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా మంథనిలో టీఆర్ఎస్కు చెందిన 60 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సెగ్గెం రాజేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మహదేవ్పూర్, కాటారం గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే పుట్టా మధు
-
మంథనిని జిల్లా చేయాలి
మాజీ మంత్రి శ్రీధర్బాబు మంథని : చరిత్రాత్మకంగా, భౌగోళికంగా అనువైన ప్రదేశంగా ఉన్న మంథనిని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి శ్రీధర్బాబు కోరారు. ఇటీవల మృతిచెందిన అర్చకుడు జగన్నాథచార్యులు కుటుంబసభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు ముఖ్య ప్రాంతాలకు కూడలిగా ఉన్న మంథనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు అమోదయోగ్యంగా ఉంటుందన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిం దని, టీఆర్ఎస్ పరిపాలనా వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్నారు. మంథనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకుంటే కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని కోరారు. ఆయన వెంట ఎమ్మెల్సీ సంతోష్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి శశిభూషన్కాచే, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీంఖాన్ ఎంపీటీసీ సభ్యులు లొడారి రాములు, కుంట శ్రీనివాస్, నాయకులు వొడ్నాల శ్రీనివాస్, సేమంతుల ఓదెలు, సింగారపు కిష్టయ్య, నూకల బానయ్య, పోలు శివ, అంబీరు బాపు తదితరులు ఉన్నారు. -
'ఎన్టీఆర్ పేరు పెడితే చూస్తూ ఊరుకోం'
మంథని: తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ ప్రతిపాదించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అధికారం ఉందని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్ష పార్టీగా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కరీంనగర్ జిల్లా మంథనిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్గాంధీ పేరిట నామకరణం చేశారన్నారు. కాగా, తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండానే పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలిపేందుకు బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు. -
గులాబీ ముళ్లు
టీఆర్ఎస్లో టిక్కెట్ల లొల్లి మొదలైంది. 13 అసెంబ్లీ స్థానాలకు 12 చోట్ల అభ్యర్థిత్వాలను కేసీఆర్ ప్రకటించిన వెంటనే పార్టీలో అసమ్మతి రాజుకుంది. తాము ఆశించిన సీట్లను మరొకరికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని అసమ్మతి నేతలు, అభ్యర్థులతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలో ఉండటానికి కొంతమంది ప్రయత్నిస్తుండగా, మరికొందరు పార్టీలోనే ఉంటూ అభ్యర్థిని ఓడించడానికి తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. కరీంనగర్ సిటీ, న్యూస్లైన్: జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని, మానకొండూరు, కోరుట్ల నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై నేతల్లో అసంతృప్తి పెరిగిపోయింది. రామగుండంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు అవకాశం ఇవ్వగా, నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కోరుకంటి చందర్ రెబెల్గా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల జాబితా విడుదల కాగానే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల మేరకు రెబెల్గా పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. 2009లో చందర్ టీఆర్ఎస్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీచేయగా, సోమారపు సత్యనారాయణ రెబెల్గా బరిలోకి దిగారు. ఎన్నికల అనంతరమే 2014లో పార్టీ టికెట్ కోరుకంటి చందర్కు ఇస్తామని అప్పట్లో పార్టీ ప్రకటించింది కూడా. చివరకు చందర్కు పార్టీ మొండిచేయి చూపి, సత్యనారాయణకు టికెట్ ఇవ్వడంతో 2009 నాటి పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్దపల్లిలో పరిస్థితి మరోరకంగా ఉంది. అక్కడినుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి టికెట్ను ఆశించారు. పార్టీ హైకమాండ్ మాత్రం దాసరి మనోహర్రెడ్డి వైపే మొగ్గుచూపింది. దీంతో ఈద కూడా అసమ్మతితో రగిలిపోతున్నారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోకపోతే ఆయన దాసరికి మద్దతు పలకడం అనుమానమే. మానకొండూరులో టికెట్ తనకే ఖాయమనుకొని ధీమాగా ఉన్న నియోజకవర్గ ఇన్చార్జి ఓరుగంటి ఆనంద్ అనూహ్యంగా తెరపైకి రసమయి బాలకిషన్ రావడంతో ఖంగుతిన్నారు. రసమయి బాలకిషన్కు టికెట్ ఇవ్వడంతో ఆనంద్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన పుట్ట మధుకు మంథని టిక్కెట్ కేటాయించడంతో అప్పటివరకు టిక్కెట్ ఆశించిన చందుపట్ల సునీల్రెడ్డి రెబెల్గా పోటీలో ఉంటానంటున్నారు. ఈ నెల 4నే ఆయన నామినేషన్ సైతం సమర్పించారు. కోరుట్లలో ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ టికెట్ ఆశించారు. అయితే జిల్లా పరిషత్ చైర్పర్సన్ సీటు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆమెను కథలాపూర్ నుంచి పార్టీ బరిలోకి దింపింది. కానీ స్థానికంగా టీఆర్ఎస్ ముఖ్యనేతలు సహకరించడం లేదనే అసంతృప్తి ఇతర నేతల్లో నెలకొంది. ఇది ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశం ఉన్నట్లు పరిశీలకుల అంచనా. ఇక చొప్పదండి టికెట్ ప్రకటించగానే అసమ్మతి వెల్లువెత్తే అవకాశం ఉందని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అభ్యర్థుల జాబితా వెల్లడితో టీఆర్ఎస్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న అసమ్మతిరాగం, అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుందా అనే కోణంలో పార్టీ అగ్రనాయకులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ముందుజాగ్రత్తగా అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు కేసీఆర్ కుటుంబసభ్యులు, పార్టీ సీనియర్లు రంగంలోకి దిగినట్లు తెలిసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, ఏదో ఒకరకంగా టికెట్ రాని లోటును భర్తీ చేస్తామని అసమ్మతి నేతలకు తాయిలాల గాలం వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసమ్మతిని ఆదిలోనే అధిష్టానం తుంచి వేస్తుందా లేక అభ్యర్థులను పుట్టిముంచే స్థాయికి చేరుకుంటుందా అనే మీమాంసలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. -
‘తడిగుడ్డతో గొంతు కోసిన కేసీఆర్’
మంథని: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తండ్రిలా భావిస్తే తడిగుడ్డతో తన గొంతు కోశారని పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందుపట్ల సునీల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల నుంచి ఉద్యమంలో తమను అన్ని విధాలుగా వినియోగించుకుని ఇప్పుడు తీరని అన్యాయం చేశారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తమను పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేయడం దుర్మార్గమన్నారు. మాటంటే మాటేనని, అవసరమైతే నాలుక కోసుకుంటానే కానీ మాట తప్పనని చెప్పిన కేసీఆర్.. సర్వేలను నమ్మి తమకు అన్యాయం చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. వారం రోజుల క్రితం పెద్దపల్లి ఎంపీ వివేక్ కాటారంలో జరిగిన సభలో కేసీఆర్ సూచనల మేరకు మంథని అభ్యర్థిగా తనను ప్రకటించారన్నారు. తర్వాత తమకు కనీసం మాటైనా చెప్పకుండా మరొకరిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అవమానించడం కాదా అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి జెడ్పీటీసీగా పోటీలో ఉండమని సూచించడం తగునా అని నిలదీశారు. రెండురోజుల్లో పార్టీకి రాజీనామా చేసి భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. -
గులాబీ గూటికి పుట్ట మధు
మంథని, న్యూస్లైన్ : మంథని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుట్ట మధు టీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్లో సోమవారం గులాబీ కండువా కప్పుకున్నారు. మధుతోపాటు ఆయన సతీమణి మంథని సర్పం చ్ శైలజ, ఆయన అనుచరులకు కేసీఆర్, కేకేలు కండువా కప్పి సా దరంగా ఆహ్వానించారు. ఆరు నెలలుగా స్తబ్ధుగా ఉన్న పుట్ట మధు బీజేపీలో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరిగిం ది. అనూహ్యంగా ఐదు రోజుల క్రితం మధు కేసీఆర్తో మంతనాలు జరుపగా, ఆనాడే ఆయన టీఆర్ఎస్లో చేరడం ఖరారైంది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీధర్బాబుపై ప్రజారాజ్యం తరఫున మధు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టీఆర్ఎస్ తరపున మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం మంథనికి వస్తున్న ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.