అసలు మంత్రులకు అవగాహన ఉందా? | Congress leader Bhatti question on the Land Acquisition Act of 2013 | Sakshi
Sakshi News home page

అసలు మంత్రులకు అవగాహన ఉందా?

Published Fri, Jul 1 2016 3:34 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

అసలు మంత్రులకు అవగాహన ఉందా? - Sakshi

అసలు మంత్రులకు అవగాహన ఉందా?

2013 భూ సేకరణ చట్టంపై కాంగ్రెస్ నేత భట్టి ప్రశ్న

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భూ సేకరణ చట్టం 2013పై రాష్ట్ర మంత్రులలో అనేక మందికి కనీస అవగాహన కూడా లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చట్టానికి కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

భూసేకరణ చట్టానికి- భూకొనుగోలుకు రూపొందించిన ఉత్తర్వుకు మధ్య వ్యత్యాసం ఏమిటో ముందు మంత్రులు తెలుసుకోవాలన్నారు. గురువారం ఇక్కడ మాజీ మంత్రులు డీకే అరుణ, చిత్తరంజన్‌దాస్, ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement