‘బీఏఎస్‌’ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ | councelling of bas students | Sakshi
Sakshi News home page

‘బీఏఎస్‌’ విద్యార్థులకు కౌన్సెలింగ్‌

Published Wed, Aug 30 2017 11:18 PM | Last Updated on Tue, Sep 12 2017 1:23 AM

councelling of bas students

అనంతపురం ఎడ్యుకేషన్‌: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ (బీఏఎస్‌) పథకం కింద 2017–18 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలల్లో చేరేందుకు అర్హత సాధించిన విద్యార్థులకు సెప్టెంబర్‌ 1, 4, 6 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందని గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి కొండలరావు  తెలిపారు. 481 సీట్ల భర్తీకి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. 3వ తరగతి సుగాలీ విద్యార్థులకు 1న, ఎరికల విద్యార్థులకు 4న అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. 5వ తరగతి సుగాలీ, ఎరికల విద్యార్థులకు 5న, అలాగే 8వ తరగతి సుగాలీ, ఎరికల విద్యార్థులకు 6న కౌన్సెలింగ్‌ ఉంటుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 08554–220543కు ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement