వేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడ : వేములవాడ రాజన్నను సోమవారం 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వరుస సెలవులు రావడంతో రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో ఆలయ అధికారులు గర్భగుడి దర్శనం నిలిపివేశారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు కోడె మొక్కులు చెల్లించున్నారు. ఏర్పాట్లను ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, హరికిషన్, దేవేందర్లు పరిశీలించారు. ఎస్సై సైదారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.