తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడు కొండలవాడి దర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అయితే తిరుమల రెండో ఘాట్ రోడ్డు 16 కిలోమీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనిపై సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది... సదరు ప్రాంతానికి చేరుకుని... కొండ చరియలను రహదారిపై నుంచి తొలగిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published Sun, Oct 11 2015 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM
Advertisement
Advertisement