Published
Mon, Oct 3 2016 10:53 PM
| Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు
భువనగిరి టౌన్ : అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఖిలాపై కట్టడాలు, నిర్మాణాలు, శిల్పకళను వారు పరిశీలించారు. భారతీయ కళానైపుణ్యం అద్భుతంగా ఉందని, చారిత్రక కట్టడాల్లో భువనగిరి ఖిలా ఒకటిగా ఉందన్నారు.