Bhongir
-
600 ఏళ్ల మెట్లబావికి మహర్దశ
ఆదరణ కోల్పోతున్న వారసత్వ సంపదకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెట్ల బావులు, కోటలు ఇతర చారిత్రక ప్రదేశాలను పునరుద్ధరిస్తోంది. ఇదే క్రమంలో భువనగిరి జిల్లా రాయగిరి పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న 600 ఏళ్ల నాటి మెట్ల బావిని పునరుద్ధరించే సమమయం అసన్నమైందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ జిల్లాలో వైరల్గా మారడంతో రాయగిరి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ సమేలా సత్పతి రాయగిరిలోని మెట్ల బావిని సందర్శించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. స్థానికులతో పాటు యాదాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తులు పురాతన మెట్ల బావిని సందర్శించేలా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ మెట్లబావి పునరుద్ధరణపై ఆశలు రేకిత్తిస్తోంది. -
పార్టీ మారడం లేదు.. వారి నాయకత్వంలోనే ఉంటా
సాక్షి, యాదాద్రి: టీఆర్ఎస్ పార్టీని వీడేదిలేదని, అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే కడ వరకూ పనిచేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం ఆయన భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కొందరు తన ఎదుగుదలను చూసి ఓర్వలేక పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. కేసీఆర్, కేటీఆర్ల నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని శేఖర్రెడ్డి తెలిపారు. (క్లిక్: మునుగోడులో బెట్టింగ్ల జోరు.. ఆయనపైనే అత్యధికంగా..!) 19న బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య? సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ డా. బూర నర్సయ్యగౌడ్ ఈ నెల 19న బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ చేరికకు సంబంధించిన అంశాలు, నిర్వహించాల్సిన కార్యక్రమంపై చర్చించేందుకు బూర నర్సయ్యతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం భేటీ కానున్నారు. బూర నర్సయ్య నివాసానికి సంజయ్, ఇతర ముఖ్య నేతలు వెళ్లనున్నారు. మునుగోడు పరిధిలో లేదా భువనగిరిలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి పార్టీ జాతీయ నేతలు హాజరుకానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఢిల్లీలో నర్సయ్యగౌడ్ కలుసుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, రాజకీయంగా ఎలాంటి అవకాశాలు వచ్చినా పార్టీ మారేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత నర్సయ్య మాట్లాడారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై కార్యకర్తలు, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ప్రజలతో సమావేశం అయ్యాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. -
అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
-
నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనను రాజకీయాల్లోకి లాగవద్దని, రాజకీయపరమైన విషయాలపై ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజాసమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత తన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించలేకపోయానని, ఇక నుంచి భువనగిరి, నల్లగొండ పార్లమెంటు స్థానాల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానని, సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులు, గంధమళ్ల, బస్వాపురం రిజర్వాయర్లను ప్రజలకు అందుబాటులో తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతానన్నారు. -
భువనగిరి వద్ద ఏజీఐ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటెయినర్ గ్లాస్ బాటిళ్ల తయారీ సంస్థ ఏజీఐ గ్లాస్ప్యాక్ హైదరాబాద్ సమీపంలోని భువనగిరి వద్ద కొత్త ప్లాంటును నెలకొల్పుతోంది. ఇందుకోసం కంపెనీ మాతృ సంస్థ అయిన హెచ్ఎస్ఐఎల్ రూ.220 కోట్లు పెట్టుబడి చేస్తోంది. 15 ఎకరాల్లో స్థాపిస్తున్న ఈ నూతన కేంద్రం 2022 సెప్టెంబర్ చివరికి కార్యరూపం దాల్చనుందని హెచ్ఎస్ఐఎల్ వైస్ చైర్మన్ సందీప్ సొమానీ తెలిపారు. రోజుకు 150 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. ఔషధాలు, సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలు, ఖరీదైన మద్యం ప్యాకింగ్ కోసం హై ఎండ్ స్పెషాలిటీ గ్లాస్ బాటిళ్లను ఇక్కడ తయారు చేస్తారు. ఫర్నేస్తోపాటు అయిదు తయారీ లైన్లు ఏర్పాటు కానున్నాయి. యూఎస్ఏ, ఆ స్ట్రేలియా, యూరప్ దేశాలకు సైతం ఎగుమతి చేయ నున్నారు. 1972లో ప్రారంభమైన ఏజీఐ గ్లాస్ప్యాక్.. ముడి సరుకు లభ్యత దృష్ట్యా హైదరాబాద్లోని సనత్నగర్తోపాటు భవనగిరిలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యం రోజుకు 1,600 టన్నులు. కంపెనీ వార్షికాదాయం రూ.1,300 కోట్లు. సుమారు 3,000 మంది ఉద్యోగులున్నారు. 5 నుంచి 4,000 మిల్లీలీటర్ల సామర్థ్యం గల బాటిళ్లను ఉత్పత్తి చేస్తోంది. -
కేంద్రమంత్రి హామీ ఇచ్చారు: కోమటిరెడ్డి
న్యూఢిల్లీ : శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, జనగామ, ఆలేరు రైల్వేస్టేషన్లలో ఆపాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందించారు. అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడుతూ...‘ ప్రతిరోజు దాదాపు ముప్పై వేలకు మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు, రోజూవారీ కూలీలు అనునిత్యం భువనగిరి, జనగామ, ఆలేరు నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తుంటారు. అదే విధంగా రాష్ట్ర నలుమూల నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం యాదగిరిగుట్టకు రోజూ యాభై వేల మంది పైచిలుకు భక్తులు వస్తూంటారు. ఈ క్రమంలో సరైన రైల్వే సౌకర్యాలు అనేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. కాగా తన విఙ్ఞాపనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సర్వేలు చేయించి.. సమస్యలకు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆయనకు కృతఙ్ఞతలు తెలియజేశారు. -
గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తా..
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి గోదావరి జలాలు తీసుకొచ్చి ఆలేరు నియోజకవర్గాన్ని ససశ్యామలం చేస్తానని టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంతో పాటు వంగపల్లిలో రోడ్ షోతో పాటు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న ఐదేళ్ల కాలంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. బీబీనగర్లో నిమ్స్ను రూ.1,028కోట్లతో ఏయిమ్స్గా మార్చానని, కేంద్రీయ విద్యాలయానికి రూ.18కోట్లు, దండుమల్కాపుర్లో రూ.1,000 కోట్లతో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, సిద్దిపేట, ఇబ్రహీం పట్నంలలో రూ.500కోట్లతో మెడికల్ కాలేజీలు, చిట్యాలలో డ్రైపోర్టుకు రూ.1,000కోట్లు, పెంబర్తి, మోత్కూరు, పోచంపల్లిలో కులవృత్తులు, తాటి పరిశోధన కేంద్రాలలను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించానని వెల్లడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉండి తమ ప్రాంతాలను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభంజనం వీస్తుందని, 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజ లంతా ముందుకొస్తున్నారని.. దేశానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి మిట్ట వెంకటయ్యగౌడ్, పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, యువజన విభాగం కన్వీనర్ గడ్డమీది రవీందర్గౌడ్, ఎంపీటీసీ సీస కృష్ణగౌడ్, మధర్డైరీ డైరెక్టర్ కల్లెపల్లి శ్రీశైలం, వంగపల్లి ఉపసర్పంచ్ రేపాక స్వామి, మాజీ సర్పంచ్ చంద్రగాని నిరోష జహంగీర్, బూడిద స్వామి, కైరంకొండ శ్రీదేవి, నాయకులు అంకం నర్సింహ, నువ్వుల రమేష్, కాంటేకార్ పవన్కుమార్, చిత్తర్ల బాలయ్య, గోపగాని ప్రసాద్, సయ్యద్ సలీం, మిట్ట అనిల్గౌడ్, మిట అరుణ్గౌడ్, కోల వెంకటేష్గౌడ్, సయ్యద్ బాబా, గునగంటి బాబురావుగౌడ్ తదితరులున్నారు. -
‘ఆయన పార్టీ మారడం బాధకు గురిచేసింది’
సాక్షి, భునవనగిరి: కేంద్రంలోని బీజేపీకి అండగా నిలుస్తోన్న టీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కోట్ల రుపాయలు ఖర్చుపెట్టి సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.700 కోట్లు విలువ చేసే బ్రాహ్మణ వెళ్లాంల ప్రాజెక్టుని తెచ్చినట్లు గుర్తుచేశారు. కానీ ఐదేళ్లు గడిచిన కేసీఆర్ మాత్రం పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. నల్గొండను దత్తత తీసుకుంటా అని గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించారని, నాలుగు నెలలు గడిచినా దాని ఊసే లేదని విమర్శించారు. చదవండి: నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఎవరి బలమెంత..? గత అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్లో తాము పోరాడి గెలచామని, అనంతరం చిరమర్తి లింగయ్య పార్టీ మారడం తనను ఎంతో బాధకు గురిచేసిందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారని చెప్తున్నారని, 15 రోజుల్లోనే ఆరుకోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. నకిరేకల్ కోసం అన్నదమ్ములిద్దరం ప్రాణాలైన ఇస్తాం కానీ.. ఇక్కడి ప్రజలను మాత్రం వదిలివెళ్లమని స్పష్టం చేశారు. స్వలాభం కోసం పార్టీ మారిన వారికి ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 22న భువనగిరి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నా తమను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని సీఎం కేసీఆర్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పార్టీలోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎమెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి విమర్శించారు. తమ సొంతమనిషి అయిన చిరుమర్తి లింగయ్యను తీసుకెళ్లి.. తమ కుటుంబంలో చిచ్చులు పెట్టిన కేసీఆర్కు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పదవులకు ఆశపడ్డి కొంతమంది నాయకులు పార్టీని విడిచి పోవచ్చని, కేసీఆర్ను ఓడించడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారని అన్నారు. -
సీసీఎంబీ ప్రాజెక్టుపై నీలి నీడలు
సాక్షి, యాదాద్రి: అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏడాదిన్నర క్రితం ఈ ప్రాజెక్టులో కదలిక మొదలైనా పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఈ పరిశోధనా కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో జరుగుతున్న జాప్యం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సంబంధిత కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు సీసీఎంబీ కేంద్రాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో బీబీనగర్ పక్కనే గల రంగాపురంలోని 180 ఎకరాల్లో సీసీఎంబీని ఏర్పాటు చేయడానికి 11వ ప్రణాళిక కాలంలో కేంద్రం అనుమతినిచ్చింది. రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నారు. ఈ నిధులకు జాతీయ ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం ఆమోదం కూడా లభించింది. అయితే స్థలం విషయంలో ఏర్పడిన వివాదంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద మరో స్థలాన్ని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా, కలెక్టర్ అనితారామచంద్రన్, ఆర్డీఓ ఎంవీ భూపాల్రెడ్డి తదితరులు పరిశీలించారు. ప్రాజెక్టు స్వరూపం... 180 ఎకరాల స్థలం, రూ.1,200 కోట్ల వ్యయం.. మానవ మూలకణాలతోపాటు పలు అంశాలపై నిరంతర పరిశోధనలు చేసే అవకాశం.. వందలాది మందికి ఉపాధి కల్పన.. ఇదీ సీసీఎంబీ పరిశోధన కేంద్రం స్వరూపం. అయితే స్థలాన్ని ఎంపిక చేయడంలో జరిగిన జాప్యం వల్ల మొత్తం నిధుల్లో రూ. 300 కోట్లను పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి మళ్లించారు. సీసీఎంబీలో ఏం చేస్తారంటే.. మానవుల మూల కణాలపై పరిశోధనలు చేస్తారు. మనుషుల్లో వచ్చే రుగ్మతలు, ప్రధానంగా కేన్సర్ వ్యాధి గురించి ముందే తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిశోధనల కోసమే సీసీఎంబీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. తార్నాకలోని ప్రాజెక్టు కేంద్ర కార్యాలయానికి చేరువలో ఉండటం, జాతీయ రహదారి 163తో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండటంతో ఇక్కడ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
35 ఏళ్ల తర్వాత గెలవబోతున్నాం : జైరాం రమేష్
సాక్షి, యాదాద్రి భువనగిరి : నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దివాలా తెలంగాణగా మార్చారని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ మండిపడ్డారు. కేవలం ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కేసీఆర్ కుటుంబం కోసం కాదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భువనగిరిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలంగాణ ఏర్పడలేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. విభజన హామీలను అమలు చేయడంలో, చేయించుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మొట్టమొదటిసారిగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ మహిళను హోం మంత్రి చేశామని గుర్తు చేశారు. తెలంగాణలో ఇకపై టీఆర్ఎస్ పాత అంబాసిడర్ కారుకు చోటు లేదని ఎద్దేవా చేశారు. సంజీవని దొరికింది కాబట్టి.. 35 ఏళ్ల తర్వాత భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు. -
రైల్వే ప్రయాణికులను కర్రతో కొట్టి..
నల్లగొండ క్రైం : జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నారు.. సెల్ఫోన్లు చోరీలు చేయడం మొదలు పెట్టారు. అందుకు రైల్వేస్టేషన్ను ఎంపిక చేసుకున్నారు. ఎవరైన ప్రయాణికులు నడుస్తున్న రైలు ఎక్కుతూ సెల్ఫోన్ మాట్లాడుతుంటే వారి చేతిని కర్రతో కొట్టి.. ఫోన్ కిందపడగానే లాక్కెళ్తున్నారు. ఇలా రెండేళ్లుగా చోరీ చేస్తున్నారు. శుక్రవారం భువనగిరి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతూ చోరీ చేస్తున్న ఇద్దరి యువకులతో పాటు వాటిని కొనుగోలు చేస్తున్న మరో నలుగురిని నల్లగొండ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,80,000 విలువైన 24 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఎస్పీ అశోక్కుమార్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ అచ్యుత్తో కలిసి నల్లగొండ రైల్వేస్టేషన్లో వివరాలు వెల్లడించారు. భువనగిరి పట్టణంలోని తాతానగర్కు చెందిన విద్యార్థి ముదరకోల శ్రీధర్, ఆటోడ్రైవర్గా పనిచేస్తున్న కామసాని శేఖర్లు రైలు ప్రయాణికుల నుంచి చాకచక్యంగా సెల్ఫోన్లు కొట్టేస్తూ తాతానగర్కు చెందిన భానుప్రకాశ్, తిమ్మపూర్కు చెం ది న దాసరపు గణేశ్, జహంగీర్, దాసరి రవీందర్ల కు విక్రయిస్తున్నారు. ప్రయా ణికుల ఫిర్యాదు మే రకు రైల్వే పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. చోరీ చేసేది ఇలా.. రైలు నిదానంగా వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సెల్ఫోన్ మాట్లాడడం, వాట్సప్, ఫేస్బుక్ చూస్తున్నప్పుడు శ్రీధర్, శేఖర్లు కర్రతో చేతిపై కొడతారు. ఫోన్ కిందపడగానే తీసుకుపోయి ఇతరులకు విక్రయిస్తుంటారు. -
భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఆమోదం తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా 50 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సోమవారం అంగీకరిం చింది. ఈ విద్యాసంవత్సరం (2017–18) నుంచే భువనగిరిలోని ఏఎల్ఎన్రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కేంద్రీయ విద్యాలయం కార్యకలాపాలు కొనసాగుతాయని, ఒక్కో తరగతికి ఒక్కో సెక్షన్ చొప్పున ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. ఇప్పటికి కేంద్రం స్పందించి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
నిబంధనలు కచ్చితంగా పాటించాలి
భువనగిరి అర్బన్ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ఎన్.దివ్యచరణ్రావు అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్ ఆదేశాల మేరకు యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిలో ఇప్పటివరకు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ లేన్నందున్న స్టేషన్ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఒక ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లను, భువనగిరిలో ప్రస్తుతం ఉన్న ఒకట్రాఫిక్ ఎస్ఐ, 5 కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు. ముందుగా ఒక వారం రోజులపాటు ప్రజలకు ట్రాఫిక్పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. భవిష్యత్ ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రధానంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎదురుగా వచ్చే వారికి ఇబ్బంది కలిగించ వద్దని సూచించారు. రికార్డుల ప్రకారం వారానికి రెండుసార్లు డీడీని కండెక్ట్ చేయడంతోపాటు త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, పార్కింగ్ సమస్య, డేంజరస్ డ్రైవింగ్ నివారించడం జరుగుతుందన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. భువనగిరితో పాటు చౌటుప్పల్లో కూడా ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చే సినట్లు ఆయన తెలిపారు. అనంతరం యాదాద్రి జిల్లా డీసీపీ పి.యాదగిరి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా భువనగిరిలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ జీవీ. శ్యాంసుందర్రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ ఎం.శంకర్గౌడ్, ఉప్పల్ ట్రాఫిక్ సీఐ ఇ.జంగయ్య, ట్రాఫిక్ ఎస్ఐలు లాచ్చిరాం, హన్మంత్లాల్, సిబ్బంది ఉన్నారు. -
ముగిసిన జాతీయ స్థాయి క్రీడా పోటీలు
భువనగిరి టౌన్: ఈ నెల 3వ తేదీ నుంచి భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన అండర్–19 జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్, షూటింగ్ బాల్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో 18 రాష్ట్రాలకు చెందిన 44 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఓటమితో నిరాశ చెందకుండా మరింత మెరుగ్గా రాణిస్తే గెలుపు సొంతం అవుతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకొని దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య మాట్లాడుతూ భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం గర్వకారణమన్నారు. భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతాయన్నారు. అనంతరం విజేతలకు కప్, మెడల్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ ఎన్. ప్రకాశ్బాబు, టీఎన్జీఓ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మందడి ఉపేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జడల అమరేందర్, భువనగిరి ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్, పీఈటీ జిల్లా కార్యదర్శి టి. విజయసాగర్, ఎస్జీఎఫ్ జిల్లా అర్గనైజింగ్ కార్యదర్శి జి. దయాకర్రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. సోమనర్సయ్య, డివిజన్ అధ్యక్షుడు కె.గోపాల్ పాల్గొన్నారు. విజేతలు వీరే – జాతీయ స్థాయి బాల్బాడ్మింటన్ బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ మెుదటి స్థానంలో నిలువగా, కర్నాటక ద్వితీయ, తమిళనాడు తృతీయ స్థానాల్లో నిలిచాయి. – బాల్బాడ్మింటన్ బాలికల విభాగంలో తమిళనాడు ప్రథమ స్థానం సాధించగా, కేరళ ద్వితీయ, కర్నాటక తృతీయ బహుమతులు సాధించాయి. – షూటింగ్ బాల్ బాలుర విభాగంలో మహారాష్ట్ర మెుదటి, పంజాబ్ ద్వితీయ, ఢిల్లీ తృతీయ బహుమతులు సాధించాయి. – షూటింగ్ బాల్ బాలికల విభాగంలో మహారాష్ట్ర మెుదటి, ఢిల్లీ ద్వితీయ, తెలంగాణ తృతీయ బహుమతులు సాధించాయి. -
కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరుగుతున్న అండర్ –19 జాతీయ స్థాయి క్రీడలు గురువారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, బాల్బ్యాడ్మింటన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్లు క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాకౌట్, సెమీఫైనల్ మ్యాచ్లు జరిగాయి. కాగా బాలుర విభాగం సెమీ ఫైనల్లో తమిళనాడుతో 35–33, 27–35, 35–20 పాయింట్లతో విజయం సాధించిన ఏపీ, కేరళపై 35–20, 35–31తో విజయం సాధించిన కర్నాటక జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. అలాగే బాలికల విభాగంలో ఏపీపై 35–17, 35–20 పాయింట్లతో విజయం సాధించిన తమిళనాడు, కర్నాటకపై 31–35, 35–25, 28–35 పాయింట్ల తేడాతో విజయం సాధించిన కేరళ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. కాగా ఫైనల్ పోటీలను శుక్రవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
కార్యాలయాలను పరిశీలించిన రాచకొండ కమిషనర్
భువనగిరి అర్బన్ : యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏర్పాటు చేయనున్న పలు జిల్లా కార్యాలయాలను గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్ పరిశీలించారు. ఇందులో భాగంగా భువనగిరి మండలంలోని పగిడిపల్లి గ్రామంలో ఉన్న యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాన్ని చూశారు. అనంతరం అక్కడి నుంచి హన్మాపురం గ్రామ శివారులో ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయం, భువనగిరిలో ఏర్పాటు అవుతున్న ఎస్పీ క్యాంపు, రాయగిరి గ్రామంలో ఉన్న పోలీస్ ఔట్ పోస్టు కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండగ రోజున కార్యాలయాలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. భువనగిరి, చౌటుప్పల్లో ఏసీపీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలపై ఎస్పీ, డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి, డీఎస్పీ ఎస్.మోహన్రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ ఎం. శంకర్గౌడ్, రూరల్ సీఐ అర్జునయ్య, యాదగిరిగుట్ట సీఐ రఘువీర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
భువనగిరిలో డీఐఈఓ కార్యాలయం
భువనగిరి అర్బన్ : యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం(డీఐఈఓ) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఓ ఎన్.ప్రకాష్బాబు అన్నారు. బుధవారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న వృత్తి విద్యా సముదాయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృత్తి విద్యా సముదాయ భవనంలో అక్టోబర్ 11 నుంచి డీఐఈఓ విధులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యాలయానికి కావాల్సిన రికార్డులు, ఫర్నిచర్, కార్యాలయం పేరుతో ఉన్న బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సిబ్బంది నియామకం కూడా త్వరంలోనే జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ విభాగంలో ఉన్న ఆర్ఐఓ, డీవీఈఓ పోస్టులు రద్దవుతాయని, ఈ పోస్టుల్లో డీఐఈఓ ఏర్పడుతుందని చెప్పారు. నూతన యాదాద్రి జిల్లాలో 69 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో 11 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 4 టీఎస్డబ్ల్యూఆర్సీ, 1 టీఎస్ఆర్జేసీ, 6 మోడల్ స్కూల్స్, 48 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు. ఆయన వెంట పలువురు అధ్యాపకులు ఉన్నారు. -
కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్: భువనగిరి పట్టణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–19 జాతీయ స్థాయి క్రీడా పోటీలను మంగళవారం ఆర్డీఓ ఎంవీ. భూపాల్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్సీఓ మాక్బుల్ అహ్మద్, జిల్లా క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి గువ్వ దయాకర్రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. సోమనర్సయ్యలు ఉన్నారు. రెండవ రోజు బాల్బాడ్మింటన్ బాలుర విభాగంలో 13 జట్లు, బాలికల విభాగంలో 12 జట్లు పోటీ పడ్డాయి. అదే విధంగా షూటింగ్ బాల్ బాలుర విభాగంలో 6 జట్లు తలపడ్డాయి. షూటింగ్ బాల్ ఫైనల్ విజేతలు వీరే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ ఫైనల్ బాలికల విభాగంలో మహారాష్ట్ర ప్రథమ స్థానం సాధించగా, ఢిల్లీ రెండోస్థానం, తెలంగాణ తృతీయ స్థానాలు సాధించాయి. అదే విధంగా బాలుర విభాగంలో మహారాష్ట్ర మెుదటి స్థానం, పంజాబ్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాల్బ్యాడ్మింటన్ విజేతలు బాలుర విభాగంలో... ఒడిశా, సీబీఎస్ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 35–19, 35–19తో ఒడిశా జట్టు విజయం సాధించింది. అదే విధంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 35–23, 35–22తో కర్నాటక, గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 35–14, 35–21 తేడాతో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 35–15, 35–19 తేడాతో గుజరాత్, మధ్యప్రదేశ్తో 35–22, 32–35, 35–21 తేడాతో విద్యాభారతి, సీబీఎస్ఈతో 35–12, 35–12 తో తమిళనాడు, పాండిచ్ఛేరితో 35–30, 35–33తో తెలంగాణ జట్లు విజయం సాధించాయి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 35–19, 35–19తో ఏపీ, ఉత్తరప్రదేశ్తో 35–12, 35–19తో ఛత్తీస్గఢ్, పాండిచ్ఛేరితో 35–25, 35–23తో కేరళ, ఒడిశాతో జరిగిన మ్యాచ్లో 35–25, 35–31 తేడాతో ఛండీగఢ్లు విజయం సాధించాయి. బాలికల విభాగంలో.... తెలంగాణ, పంజాబ్ జట్లు మధ్యన జరిగిన మ్యాచ్లో 35–21,35–25తో తెలంగాణ జట్టు విజయం సాధించింది. అదే విధంగా ఒడిశాతో 35–24, 35–25తో మహారాష్ట్ర, గుజరాత్తో 35–20, 35–28తో ఛత్తీస్గఢ్, సీబీఎస్ఈతో 35–8, 35–14తో కర్నాటక, ఢిల్లీతో 35–18, 35–25తో కేరళ జట్లు విజయం సాధించాయి. అలాగే మధ్యప్రదేశ్తో 35–20, 35–22తో ఏపీ, ఛత్తీస్గఢ్తో 35–19, 35–18తో కేరళ, పంజాబ్తో 35–15స 35–13తో కర్నాటక, ఉత్తరప్రదేశ్తో 35–16, 35–12తో ఒడిశా, విద్యాభారతితో 35–14, 35–11తో చంఢీగడ్, గుజరాత్తో 35–33, 21–35, 35–23తో ఢిల్లీ జట్లు విజయం సాధించాయి. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
భువనగిరి అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్యసిబ్బంది స్పందించి గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించాలని డీఎంహెచ్ఓ కె.భానుప్రసాద్నాయక్ అన్నారు. భువనగిరిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయ భవనం ఏర్పాటు కోసం మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రి సమీపంలో ఉన్న భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లేరియా వ్యాధి సోకకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే డెంగీ లక్షణాలు గుర్చి గ్రామీణ ప్రజలు తెలుసుకోవాలని, మనుషులు నల్లగా మారడం, తరుచు జ్వరాలు రావడం వంటి లక్షణాలు ఉంటే చికిత్స చేయించుకోవాలని కోరారు. ఈ నెల 10వ తేదీ వరకు భువనగిరిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కొత్తగా డీఎంహెచ్ఓ–1, ఏడీఎంహెచ్ఓ–1, డీఐఓ–1. డీటీసీఓ–1, డీఎల్ఓ–1, మల్లేరియా డీఎంఓ–2, ఎస్ఓ–1, ఐడీఎస్పీ మేడికల్ అధికారి–1, సూపరింటెండెంట్–1, సీనియర్ అసిస్టెంటు–3, జూనియర్–5, డ్రైవర్లు–5, అంటెండర్లు–5 పోస్టులలో అధికారులు, సిబ్బంది రానున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎండీ.అన్వర్హుస్సేన్, శ్రీనివాస్, సుబ్రమణ్యం, శ్రీకాంత్ ఉన్నారు. -
భువనయాదాద్రి జిల్లాగా పేరు మార్చాలి
భువనగిరి టౌన్ : యాదాద్రి జిల్లా పేరును భువనయాదాద్రిగా ఖరారు చేయాలని మాజీమంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ప్రభుత్వ కోరారు. మంగళవారం పట్టణంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లాడారు. భువనగిరి పెద్ద చరిత్ర గల ప్రాంతమని తెలంగాణ మలిదశ పోరాటంలో ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. ఇటీవల వర్షంతో పటనష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. భువనగిరి ఖిలాను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. ఈ సమావేశంలో టీడీడీపీ ఉపాధ్యక్షుడు కుందారపు కృష్ణచారి, వైస్ ఎంపీపీ మోడపు శ్రీనివాస్గౌడ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్బాల్చౌదరి, కౌన్సిల్ తాడూరి బిక్షపతి, నాయిని జయరాములు, భువనగిరి శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు
భువనగిరి టౌన్ : అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఖిలాపై కట్టడాలు, నిర్మాణాలు, శిల్పకళను వారు పరిశీలించారు. భారతీయ కళానైపుణ్యం అద్భుతంగా ఉందని, చారిత్రక కట్టడాల్లో భువనగిరి ఖిలా ఒకటిగా ఉందన్నారు. -
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
భువనగిరి టౌన్ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అండర్ – 19 ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్లో క్రీడాకారులు అతితక్కువగా ఉన్నారన్నారు. ఒలంపిక్స్లో పతకాలు సాధించిన సాక్షి మాలిక్, పీవీ సింధులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు నిర్వహిస్తున్న పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు టోర్నమెంట్కు సంబంధించిన ఎస్జీఎఫ్ జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా 18 రాష్ట్రాల నుంచి వచ్చిన 44 జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. అనంతరం షూటింగ్బాల్ బాలికల విభాగంలో తెలంగాణ, తమిళనాడు జట్ల మధ్య పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఇంటర్బోర్డు కమిషనర్ ఏ.అశోక్, ఎస్జీఎఫ్ నల్లగొండ జిల్లా కన్వీనర్ ఎం.ప్రకాష్బాబు, నేషనల్ టోర్నమెంట్ పర్యవేక్షకులు దినేష్సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, ఆర్డీఓ ఎం. వెంకట్భూపాల్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, తహసీల్దార్ కె.వెంకట్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మందడి ఉపేందర్రెడ్డి, డిప్యూటీ ఈఓ పి.మదన్మోహన్, ఇన్స్పెక్టర్ ఎం.శంకర్గౌడ్, జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్, నాయకులు గోలి ప్రణీత, జడల అమరేందర్గౌడ్, నాగారం అంజయ్య, మారగోని రాముగౌడ్, కొలుపుల అమరేందర్, జి.దయాకర్రెడ్డి, సోమనర్సయ్య పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు జాతీయస్థాయి క్రీడాపోటీల సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మిర్యాలగూడలోని ప్రకాష్ పబ్లిక్ స్కూల్కు చెందిన విద్యార్థులు, భువనగిరి పట్టణంలోని విజ్ఞాన్, శ్రీవాణి పాఠశాల విద్యార్ధులు లె లంగాణ చరిత్రకు సంబంధించిన పాటలతో డ్యాన్సులు చేశారు. -
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు
భువనగిరి టౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానాన్ని ఆదివారం ఆర్డీఓ పరిశీలించి మాట్లాడారు. క్రీడల నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులకు కల్పించనున్న వసతి, భోజనం ఏర్పాట్ల గురించి అధికారులు అడిగితెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, లైటింగ్ సిస్టం ఏర్పాట్లపై మున్సిపాలిటీ అధికారుల ద్వారా ఆరా తీశారు. అనంతరం క్రీడల్లో పాల్గొనే 18 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పరియం చేసుకుని ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, తహసీల్దార్ కె.వెంకట్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మందడి ఉపేందర్రెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి గువ్వా దయాకర్రెడ్డి, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమ నర్సింహారెడ్డి, మున్సిపల్ డీఈ ఇ.ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్– 19 విభాగంలో జరిగే బాల్ బ్యాడ్మింటన్, షూటింగ్బాల్ క్రీడల కోసం మైదానాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ క్రీడలకు దేశంలోని 18 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రానున్నారు. బాల్ బాడ్మింటన్ బాలురు, బాలికలు, షూటింగ్ బాల్ బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులతో పాటు, కోచ్లు, రీఫరీలతో కలిపి మెుత్తం 700 మంది ఈ పోటీలకు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడలకు వచ్చే వారికి కోశం స్థానిక శ్రీచైతన్య, శ్రీ ప్రతిభా, యునిటీ జూనియర్ కళాశాలలో బాలురు, ఎస్ఎస్ఆర్, శ్రీవైష్ణవి, టైమ్స్ జూనియర్ కళాశాలలో బాలికలకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులకు కళాశాల పక్కనే ఉన్న శ్రీవాణి విద్యాలయంలో భోజన వసతి కల్పించనున్నారు. క్రీడల సందర్భంగా రోజువారీ సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే సమీక్షా సమావేశాలు సైతం నిర్వహించారు. -
ప్రణాళికలో మార్పులపై నివేదిక ఇవ్వాలి
భువనగిరి : హెచ్ఎండీఏ ప్రణాళికలో మార్పులు, చేర్పులు కావాలనుకుంటే చెప్పాలని హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ విద్యాధర్ కోరారు. మంగళవారం భువనగిరిలోని ఆర్డీఓ కార్యాలయంలో హెచ్ఎండీఏ పరిధిలోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్ మండలాల తహసీల్దార్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. హెచ్ఎండీఏలో రూపొందించిన ప్రణాళికకు కొత్తగా ఏమైనా మార్పులు, చేర్పులు సూచించాలనుకుంటే చెప్పాలన్నారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, ఆర్డీఓ ఎం.వి భూపాల్రెడ్డి, తహసీల్దార్ కె.వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
పేరిణి నాట్యం ప్రదర్శన
భువనగిరి టౌన్ : పట్టణంలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పేరిణి నాట్య ప్రదర్శన నిర్వహించారు. ముందు తరాలకు పేరిణి నృత్యాన్ని తెలియజేసేందుకు కళాకారుడు రాజ్కుమార్నాయక్ జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సంర్భంగా అయన మాట్లాడుతూ పేరిణి నాట్యం గురించి 4, 8, 9వ తరగతి పాఠ్యాంశాలలో రాష్ట్ర ప్రభుత్వ చేర్చిందన్నారు. ఈ నాట్యం గుర్చిం విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంలో 101 రోజులు పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తున్నానని తెలిపారు. -
రోప్ వే కోసం స్థల పరిశీలన
భువనగిరి టౌన్ : భువనగిరి ఖిలా అభివృద్ధిలో భాగంగా ఖిలాపైకి రోప్వే ఏర్పాటు చేసేందుకు కోల్కతాకు చెందిన కంపెనీ ప్రతినిధులు రామకృష్ణ, మనోజ్లు స్వోరం స్థలాన్ని పరిశీలించారు. రోప్ వే కోసం బైపాస్ సమీపంలో ఉన్న 2.30 ఎకరాల భూమి పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఇక్కడి నుంచి ఖిలాపైకి రోప్ వే ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రోప్ వే కోసం వ్యయంతో పాటు, పూర్తి వివరాలను అధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వారి వెంట సోమ శేఖర్రెడ్డి ఉన్నారు. -
కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య
భువనగిరి అర్బన్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని తుక్కపురం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కాపురం గ్రామానికి చెందిన ఈర్ల ధర్మయ్య, పెంటమ్మల మొదటి కుమార్తె విజయ(27) భువనగిరిలో బీఈడీ వరకు చదువుకుంది. అనంతరం ఇంటి వద్ద ఉంటోంది. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్య కారణాలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెంది శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తల్లి పెంటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఏఎస్ఐ రాజేశ్వర్ తెలిపారు. -
సాగునీటి కోసం ఉద్యమిద్దాం
యాదగిరిగుట్ట : భువనగిరి, ఆలేరు ప్రాంతానికి సాగు, తాగు నీటి కోసం ఉద్యమానికి సిద్ధమవుతామని మాజీమంత్రి, టీడీపీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగు నీటి కోసం మిషన్ భగీరథ ప్రవేశపెట్టే బదులు ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో గంధమల్ల, బస్వాపూర్లో రిజర్వాయర్లు వేగంగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పాటు తపాస్పల్లి ద్వారా రాజాపేట, ఆలేరు మండలాలకు నీరిందించాలన్నారు. జిల్లా సాధించిన మాదిరిగా, గోదావరి జలాలు సాధించి తీరుతామన్నారు. అనంతరం తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు రాజకీయ, భూ వ్యాపార బ్రోకర్లుగా అవతారమెత్తి ప్రజలను జలగల్లా పీల్చుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలపైనే పోలీసులతో లాఠీచార్జ్ చేయించిన ఘనత గొంగిడి సునీతకే దక్కిందన్నారు. టీ డీపీ మండల అధ్యక్షుడు దడిగె ఇస్తారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పల్లెపాటి బాలయ్య, రాజాపేట మండల అధ్యక్షుడు గుంటి మధుసూదన్రెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్, ఆకుల రాజేష్, ఆరె శ్రీను, గొట్టిపర్తి శ్రీనివాస్గౌడ్, కందుల మల్లేష్, పులుగం భిక్షపతి, రేగు బాలనర్సయ్య, చల్లూరి స్వామి, మచ్చ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
భువనగిరి టౌన్ : అక్టోబర్ 4, 5వ తేదీల్లో మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో, సాఫ్ట్బాల్, బేస్బాల్ పోటీల కోసం నల్లగొండ జిల్లా జట్లను బుధవారం భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అండర్ 19 యూజీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గవ్వ దయాకర్రెడ్డి మాట్లాడుతూ 150 మంది విద్యార్థులు హాజరు కాగా పోటీలు నిర్వహించినట్లు ప్రతిభకనబర్చిన వారిని ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో పీడీ సోమనర్సయ్య, నాగిరెడ్డి, సాంబశివుడు, పీఈటీలు పాల్గొన్నారు. ఖోఖో బాలుర జట్టు : పి.మధు, టి.సాయికుమార్, జె.ప్రశాత్, డి.నర్సింహ, డి.వెంకటేశ్వర్లు, వి.శ్రీకాంత్, ఇ.సురేష్, కె.ప్రవీణ్, పి.శ్రీకాంత్, ఎం.సంతోష్, సిహెచ్ గణేష్, ఎల్.శ్యామ్, డి.మల్లేష్, కే.దినేష్. ఖోఖో బాలికల జట్టు : వి.హేమలత, ఆర్.నవనీత, మమత, సుకన్య, కవిత, భువనేశ్వరి, దివ్యా, మనీషా, శ్యామల, పావని, సౌజన్య, రేణుక, సుషన, కౌసల్య, స్వర్ణలత ఎంపికయ్యారు. సాఫ్ట్బాల్ బాలుర : కె.శివ, కె.మహేష్, కె.నరేష్, ఏ.రాజేష్కుమార్, జి.భానుప్రసాద్, ఎస్కే.అక్బర్, జి.వెంకటేష్, పి.జలేంధర్, బి.దినేష్, సోమూ, నవీన్, బి.సిద్ధులు, డి.రాజ్, టి.నరేష్, కె.ప్రదీప్. సాఫ్ట్బాల్ బాలికలు : రేవతి, ప్రవళిక, ప్రశాతి, సాయివర్షణి, రేణుక, స్వాతి, శ్రావతి, శశివర్షణి, వెన్నల, ఆర్షియాజబీన్, శిరీషా, భర్గవి, అనిత, మనీషా, భార్గవి, సిద్ధూ. బేస్బాల్ బాలుర : ఎ.శ్రీకాంత్, కె.రమేష్, బి.రామ్, పి.ఈశ్వర్, ఎన్.నవీన్, వి.నిఖిత్కుమార్, జి.రాఖేష్, బి.సంతోష్, టి.మహేష్, జి. సురేష్, జి.హరిప్రసాద్, పి.జీవన్, అనంతాచారి, నవీన్ ఎంపికయ్యారు. -
రుణాలు సకాలంలో అందజేయాలి
భువనగిరి అర్బన్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తోన్న రుణాలను బ్యాంకుల అధికారులు సకాలంలో వారికి అందజేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ డి.సూర్యనాయక్ అన్నారు. మంగళవారం భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ బ్యాంక్ల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే ప్రధానంగా రైతులకు పంట రుణాలు అందజేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలుకు బ్యాంక్ అ«ధికారులు చోరవతీసుకోవాలన్నారు. చిన్నచిన్న వ్యాపారులకు ముద్ర రుణాలు అందజేసి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ గోపాలకిషన్రావు, పీఏసీఎస్ చైర్మన్ బల్గూరి మధుసూదన్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఫీల్డ్ అధికారి నరేందర్, బీసీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ గోపాలకృష్ణ యాదవ్, ఎస్బీహెచ్ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ, డీపీఎం రామకృష్ణ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ మూర్తి, వివిధ బ్యాంక్ల మేనేజర్లు, ఈఓపీఆర్డీలు, సీసీలు, ఏపీఎంలు, ఎస్హెచ్జీలు పాల్గొన్నారు. -
‘సాక్షి’ మ్యాథ్బీ రిజిస్ట్రేషన్కు విశేష స్పందన
వడాయిగూడెం (భువనగిరి అర్బన్) : విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలను వెలికి తీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సాక్షి నిర్వహిస్తున్న మ్యాథ్బీ–2016కు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ పరీక్షకు శనివారం మండలంలోని వడాయిగూడెంలో గల ప్రెసిడెన్సీ హైస్కూల్కు చెందిన 50 విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్దిరాములు మ్యాథ్బీ పుస్తకాలు మంచి మార్కులు సాధించడానికి కూడా ఉపయోగపడుతాయని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా సాక్షి నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. శ్రీనివాస్, వి. విజయలక్ష్మి, పి. సుహాసిని, లీలాకుమారి పాల్గొన్నారు. -
భువనగిరిని సందర్శించిన విజయనగరం కౌన్సిలర్లు
భువనగిరి టౌన్: భువనగిరి మున్సిపాలిటీలో వ్యర్థాల నిర్వహణ బాగుందని ఏపీలోని విజయనగరం మున్సిపాలిటీ కౌన్సిలర్లు అన్నారు. విజయనగరం మున్సిపల్ వైస్ చైర్మన్ మురళీమోహన్ ఆధ్వర్యంలో 40 మంది సభ్యులు శుక్రవారం భువనగిరి మున్సిపాలిటీలోని కంపోస్ట్యార్డ్, చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణకు అమలుచేస్తున్న ప్రణాళిక, రీసైక్లింగ్, వర్మీ కంపోస్టు తయారీ విధానాన్ని భువనగిరి చైర్పర్సన్ సుర్విలావణ్య, కమిషనర్, జి.వేణుగోపాల్రెడ్డి విజయనగరం కౌన్సిలర్లకు వివరించారు. పార్కును తలపించే రీతిలో వర్మీ కంపోస్టు యూనిట్ను నిర్వహిస్తున్న భువనగిరి మున్సిపల్ యంత్రాంగాన్ని అభినందించారు. ఈ విధానాన్ని విజయనగరం మున్సిపాలిటీలో సైతం అవలంబించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్సీయూఈఎస్ అధికారి వెస్లీ, మున్సిపల్ కౌన్సిలర్లు ఎండీ లయీఖ్అహ్మద్, ఫాతేమహ్మద్, అనిల్, భిక్షపతి, మున్సిపల్ డీఈ ఇ. ప్రసాద్రావు, టౌన్ ప్రాజెక్ట్ అధికారి ప్రభాకర్, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ దోసపాటి శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ సతీశ్, ఏఈ మహాలక్ష్మిలు పాల్గొన్నారు. -
తినుబండారాల దుకాణాలపై దాడులు
భువనగిరి భువనగిరి బస్టాండ్లోని దుకాణాలల్లో అనధికారికంగా అమ్ముతున్నతినుబండారాలను అర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎం కిషన్రావు అధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. బస్టాండ్ ఆవరణలో ఉన్న 8 దుకాణాల్లో అగ్రిమెంట్లో ఉన్న తినుబండారాలను కాకుండా ఇతర వస్తువులు అమ్ముతున్న విషయాన్ని గుర్తించారు. ఆయా దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. మరో సారి ఇలా అక్రమంగా అమ్మితే నిబంధనల ప్రకారం లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కాగా బస్టాండ్లో హాకర్లను అమ్మకుండా చూడాలని స్టేషన్ మేనేజర్కు డీఎం చార్జిషీట్ ఇచ్చారు. కాగా తామే కాదు బస్టాండ్ వ్యాపార సముదాయాలన్నింటిలో అగ్రిమెంట్లో ఉన్న విధంగా కాకుండా ఇతర వ్యాపారాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక వ్యాపారం పేరుతో టెండర్ సంపాదించి వేరే వ్యాపారం చేస్తున్న వారందరిపైన చర్యలు తీసుకోవావాలని కోరుతున్నారు. -
ఆర్డీఓకు నయీమ్ బాధితురాలి ఫిర్యాదు
భువనగిరి న యీమ్ అనుచరులు తన భూమిని ఆక్రమించుకున్నారని మండలంలోని హన్మాపురం గ్రామానికి చెందిన సాధినేని మంజు సోమవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాలు ఆమె మాటల్లోనే.. మంజు ఆమె భర్త సాధునేని హరినాథ్కు హన్మాపురంలో 2.21 ఎకరాల భూమి ఉంది. ఆమె భర్త సాధినేని హరినాథ్ 26–06–2015న అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన బతికి ఉన్న సమయంలో (2.21) ఎకరాల భూమిని ప్రేమ్కుమార్ అనే వ్యాపారి కొనుగోలు చేశారు. అ వ్యాపారి పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా వాయిదాల వారీగా కొన్ని ఇచ్చాడు. పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు. ఇంకా రావాల్సిన డబ్బు గురించి ప్రేమ్కుమార్ను అడిగితే ఇంకా అతను రూ. 10,50,000 లక్షలు బకాయి ఉన్నట్లు చెప్పాడు.. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడిగితే ఒక వారం తరువాత ఇస్తానని చెప్పాడు. మళ్లీ ఒత్తిడి చేస్తే ఢిల్లీ Ðð ళ్లి గిరిష్జాజు అనే వ్యక్తి నుంచి తీసుకవస్తానని వివరించాడు. ఈ సమయంలో మా బావ రఘు అనే వ్యక్తి మాకు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పాడు. దీంతో వ్యాపారి మీకు డబ్బులు కావాలంటే మీ బావను కూడా తీసుకుని రావాలని వ్యాపారి చెప్పాడు. ఈ క్రమంలో రఘు కోర్టులో పిటిషన్ వేశాడు. నేను నీకు డబ్బులు ఇవ్వను కోర్టులోనే చెల్లిస్తాను అని వ్యాపారి చెప్పాడు. కానీ ఇంత వరకు ఇవ్వలేదు. అనంతరం వాయిదాలు వేస్తూనే ఓ రోజు భువనగిరిలో డబ్బు చెల్లిస్తానని చెప్పిన ప్రేమ్కుమార్ తన వద్ద పనిచేసే కంచుకుంట్ల లక్ష్మయ్యను పంపించాడు. ఆయన నేరుగా తనను నÄæూమ్ అనుచరుడు షకీల్ వద్దకు తీసుకెళ్లాడు. షకీల్ చంపుతానని బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపింది. దీంతో ప్రాణభయంతో పుట్టింటికి వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నానని తెలిపింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నÄæూమ్ బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వ ప్రకటన చూసి న్యాయం చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వివరించింది. -
ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు రాక్ క్లైంబింగ్ శిక్షణను ఆదివారం భువనగిరిలో ప్రారంభించారు. ఈ శిక్షణలో వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీనగర్ జిల్లాలకు చెందిన 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కోచ్ శేఖర్బాబు ఆధ్వర్యంలో ప్రాధమిక అవగాహన కలిపంచి రాక్ క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. -
ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు రాక్ క్లైంబింగ్ శిక్షణను ఆదివారం భువనగిరిలో ప్రారంభించారు. ఈ శిక్షణలో వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీనగర్ జిల్లాలకు చెందిన 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కోచ్ శేఖర్బాబు ఆధ్వర్యంలో ప్రాధమిక అవగాహన కలిపంచి రాక్ క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. -
భువనగిరి ఖిలాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: భువనగిరి ఖిల్లాపై ఆదివారం పలువురు యువతీ, యువకులకు రాక్క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో పలు కంపెనీలకు చెందిన 50 మందికి కోచ్ శేఖర్బాబు రాక్ క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు వారు తాళ్ల సాయంతో కోటపైకి ఎక్కి కొద్ది సేపు సేదతీరారు. -
మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
భువనగిరి : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించుకోవాలని స్థానిక యువటీం సభ్యులు కోరారు. ఈ మేరకు శనివారం పలు పాఠశాలల్లో విద్యార్థులకు మట్టిగణపతులను అందజేశారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి స్థానిక బస్టాండ్ వద్ద ఉచితంగా మట్టి విగ్రహాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువటీం సభ్యులు తంగెళ్ళపల్లి మోహన్, రంగ రంజీత్, సన్నీ, మాదాసు రిత్విక్, ఏనుగు వినీత్, పోత్నక్ సన్నీ, పెండెం లక్ష్మణ్, తదితరులు ఉన్నారు. పట్టణంలోని దేదేప్య హైస్కూల్లో విద్యార్థులకు మట్టి ప్రతిమలను ఆ పాఠశాల కరస్పాండెంట్ శేషగిరిరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రంగారావు, శంకర్, వీరనాగేందర్, వనజ, బాలమణి, అర్చన, తదితరులు పాల్గొన్నారు. వాసవీక్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో ఈ నెల 4న మట్టి గణపతి విగ్రహాలను అందజేస్తామని ఆ సంఘం అధ్యక్షులు బొలిశెట్టి లక్ష్మినర్సయ్య తెలిపారు. పట్టణంలోని ప్రెసిడెన్సీలో పాఠశాలలో కూరగాయలు, రంగురంగుల కాగితాలు, వివిధ రకాల పువ్వులతో గణేష్ విగ్రహాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెట్ డి.బాలాజీ, ప్రిన్సిపాల్ రూపారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరి ఖిలాపై రాక్క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్ : సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం భువనగిరి ఖిల్లాపై రాక్క్లైౖంబింగ్ శిక్షణ ఇచ్చారు. కోచ్ బి. శేఖర్బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్జిల్లాలోని 46 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. -
భువనగిరి ఖిలాపై రాక్క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: ఐదు రోజుల శిక్షణలో భాగంగా శనివారం పలువురు విద్యార్థులు భువనగిరి ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ నిర్వహించారు. వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 42 మంది విద్యార్థులకు భువనగిరి ఖిలా వద్ద కోచ్ బి.శేఖర్బాబు ఆధ్వర్యంలో రాక్ క్లైంబింగ్పై అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చారు. -
రూ. 2 కోట్లు ఇవ్వు.. లేదా బంగ్లా రాసివ్వు
* కాదంటే నీ ఇద్దరు పిల్లల్నీ ఖతం చేస్తామని నయీమ్ హెచ్చరించాడు * నయీమ్ అనుచరులు గంటగంటకూ నరకం చూపించారు * భువనగిరికి చెందిన బాధితుడు నరహరి ఆవేదన భువనగిరి: ‘‘రెండు కోట్లు ఇస్తావా? లేదా రూ. 50 లక్షలు ఇస్తాను నీ పేరున ఉన్న బంగ్లాను నా పేర రిజిస్టర్ చేస్తావా..? లేదంటే నీ ఇద్దరు పిల్లలను, కుటుంబాన్ని చంపేస్తాను అని నయీమ్ బెదిరించాడు’’ అని గ్యాంగ్స్టర్ నయీమ్ బాధితుడు, నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ సానిటరీ షాపు యజమాని సుంచు నరహరి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం నరహరి మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘2015 జూలై 10న నయీమ్ అనుచరులు పాశం శ్రీను, సందెల సుధాకర్.. భాయ్ పిలుస్తున్నాడని చెప్పి నన్ను భువనగిరి నుంచి ఎల్బీ నగర్ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే మరో నల్లటి ఖరీదైన వాహనం సిద్ధంగా ఉంది. నా కళ్లకు గంతలు కట్టి పాశం శ్రీను, మరో ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఆ వాహనంలో బయలుదేరాం. మేము 45 నిమిషాలు ప్రయాణించిన తర్వాత ఓ విశాలమైన భవనంలోకి వెళ్లాం. అక్కడ ఆరుగురు యువతులు ఆయుధాలతో వచ్చి నన్ను చెక్ చేశారు. అనంతరం నయీమ్ వస్తూనే రెండు వేళ్లు చూపించి డబ్బు ఇవ్వమన్నాడు. ‘అంటే రెండు లక్షలా అన్నా అని అడిగితే లక్షలు అనుకున్నావా.. రెండంటే రెండు కోట్లురా నీవు ఇచ్చే రెండు లక్షలతో నా రెండు వేల మంది పిల్లలకు చెడ్డీలు, బనియన్లు కూడా రావు’ అన్నాడు. రెండు కోట్లు ఇస్తావా లేదా 50 లక్షలు ఇస్తాను నీ పేరున గాంధీ పార్కు ఎదురుగా మెయిన్రోడ్డుపై ఉన్న బంగ్లాను నాపేర రిజిస్టర్ చేస్తావా.. లేదంటే కింది పోర్షన్ ఉంచుకుని పైపోర్షన్ నాకిస్తావా? లేదా గద్దర్ను, వరవరరావును చంపు, లేదా నక్సలైట్లను చంపడానికి మూడు ఆయుధాలు ఇప్పించు అన్నాడు. ఏదీ కాదంటే నీ ఇద్దరు పిల్లలను, కుటుంబాన్ని చంపేస్తాను అని హెచ్చరించాడు. నేను కాళ్లావేళ్లాపడి అంత ఇచ్చుకోలేనని, నా ఆస్తి అంతా అమ్మినా అంత విలువ చేయదని వేడుకున్నాను. చివరగా రూ.30 లక్షలు ఇవ్వమని కాగితంపై రాసి చూపించాడు. నేను అంత ఇవ్వలేనని బతిమిలాడుకోగా.. చివరకు 30 అంకెను 25గా రెడ్ ఇంక్తో మార్చి ఇది ఫైనల్ తీసుకుంటావా? లేదా? నీ ఇష్టం అన్నాడు. ఈ రోజు నువ్వు నా మనిషివి నిన్ను ఎవరూ ఏమీ అనరు. ఏదైనా సమస్య వస్తే నా సెల్ నంబర్ తీస్కో. లేదంటే పాశం శ్రీనుకు ఫోన్ చెయ్యి అని చెప్పాడు. దీంతో చీటి తీసుకుని వచ్చాను. ఆ రోజు నుంచి పాశం శ్రీను, పులిరాజు మరికొందరు డబ్బులు రెడీ చేశావా లేదా అని గంట గంటకు నా వెంట పడ్డారు. రోజూ ఫోన్ చేయడం, ఇంటికి, దుకాణం వద్దకు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి ఏమైంది.. డబ్బులు జమ చేశావా లేదా లేకుంటే నీ కుటుంబాన్ని చంపేస్తాం అని వేధించాడు. అప్పు చేసి గడువు రోజు మధ్యాహ్నానికి రూ.5 లక్షలు జమ చేసి వాయిదా కోరదామనుకున్నా. కానీ పులిరాజు నా దగ్గరకువచ్చి రాత్రి ఎనిమిది గంటల వరకు మొత్తం డబ్బు సమకూర్చకపోతే భాయ్ ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది. నీ కుటుంబం మొత్తం చనిపోతుంది అని హెచ్చరించాడు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో కొందరి కాళ్లు పట్టుకుని 15 మంది వద్ద అప్పులు చేశాను. ఆ సమయంలో నయీమ్ మనుషులు వచ్చి డబ్బులు లెక్క పెట్టుకుని తీసుకుపోయారు’’ అని నరహరి బోరున విలపించాడు. ఈ విషయంలో ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. -
భువనగిరిలో సిట్ విచారణ
-నయీమ్ అనుచరులు సన్నిహితులపై నజర్ -అదుపులోకి తీసుకుని విచారణ భువనగిరి గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. నయీమ్ అతని ముఠా సభ్యులు సాగించిన అరాచకాలపై బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై సిట్ స్పందిస్తోంది. ఇందులో భాగంగా సిట్ అధికారుల బృందం గురువారం భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో పలువురిని విచారించారు. భువనగిరిలో నయీమ్కు ముఖ్య అనుచరుడు పాశం శ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న సుమారు 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు. వీరిలో పలువురు పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే వాళ్లు, భూముల కొనుగోళ్లలో బినామీలు, దందాలో మధ్య వర్తులు, అతనికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు, వారికి సంబంధించిన నివాస గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. భువనగిరి గంజ్లోని ఓ ప్రముఖ యువ వ్యాపారి, వాహనాల కాంట్రాక్టర్ను సిట్ అధికారులు విచారించారు. కాగా కొందరిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ కోసం తీసుకువచ్చిన వారిని కొందరిని విడిచిపెట్టగా మరికొందరిని తమ అదుపులోనే ఉంచుకున్నారు. రిజిస్ట్రేషన్ అధికారిపై పెంచిన నిఘా భూములు, భవనాలను నయీమ్ గ్యాంగ్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసుల్లో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారిపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నయీమ్కు సంబంధించిన పలు రిజిస్ట్రేషన్లు ఈ అధికారి ద్వారా ఎక్కువగా జరిగినట్లు సిట్ పరిశీలనలో వెల్లడైంది. భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న ఇతను ప్రస్తుతం అధికారి హోదాలో ఈ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. వివాదాలెన్ని ఉన్నా నిబంధనలను నిలువునా తుంగలో తొక్కి నయీమ్, అతని అనుచరులకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని సిట్ గుర్తించింది. -
వివాహలకు బియ్యం పంపిణీ
చందుపట్ల(భువనగిరి అర్బన్) : పలు గ్రామాల్లోని పేద రైతుల కుమార్తెల వివాహాలకు చందుపట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. మండలంలోని చీమలకొండూరు గ్రామానికి చెందిన మొలుగు రాములు కుమార్తె, ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ వహిద్అలీ కుమార్తె, వీరవెల్లి గ్రామానికి చెందిన ఆముదాల నరేందర్రెడ్డి కుమార్తె, చందుపట్ల గ్రామానికి చెందిన దరకంటి చంద్రయ్య కుమార్తెల వివాహలకు ఒక్కొక్క రైతు కుటుంబానికి 100 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు బల్గూరి మధుసూదన్రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్. భిక్షపతి, సీఈఓ దంతూరి నర్సింహ, డైరెక్టర్లు నీల పార్వతమ్మ, బిజ్జాల వెంకటే శ్వర్లు, అంగడి బుచ్చయ్య, నల్ల ఎల్లయ్య, లక్ష్మారెడ్డి, చిన్నం రాములు, పాపిరెడ్డి, సిబ్బంది నర్సింహ, రాములు ఉన్నారు. -
అరాచక శక్తులను అణిచివేస్తాం
భువనగిరి ఎన్ని అరాచకశక్తులు వచ్చినా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యాదాద్రి నూతన జిల్లా ముసాయిదా ప్రకటన సందర్భంగా భువనగిరిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా బాబు జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడారు. ప్రజల శాంతి భద్రతలకు ప్రభుత్వం అధికప్రాధాన్యతను ఇస్తుందన్నారు. భువనగిరి ప్రజలు ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా జీవించవచ్చునన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలు తీర్చడానికి తెలంగాణా రాçష్ట్రం సా«ధించారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లా ఏర్పాటు చేస్తున్నారన్నారు. నెల రోజుల్లో మిషన్ భగీరథ పథకం ప్రారంభిస్తామన్నారు. మల్లన్న సాగర్తోపాటు గోదావరి నదిపై పలు ఒప్పందాలు కుదర్చుకుని వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడానికి కార్యకర్తలు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ జడల అమరేందర్గౌడ్, టీఆర్ఎస్ పట్టణ, మండల శాఖల అధ్యక్షులు కొల్పుల అమరేందర్, మారగోని రాముగౌడ్, చందుపట్ల వెంకటేశ్వర్రావు, చైర్మన్ ఏడ్ల సత్తిరెడ్డి, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు ఉన్నారు. -
పెళ్లి డీసీఎం బోల్తా, 18 మందికి గాయాలు
భువనగిరి అర్బన్: పట్టణ శివారులో ఉన్న బైపాస్ రోడ్డులో పెద్దకందుకూరు నుంచి నాగోల్కు వెళ్తున్న పెళ్లి డీసీఎం ప్రమాదవశాత్తు బోల్తా పడిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు చెందిన జనకల నర్సయ్య, నర్సమ్మల కుమార్తెకు నాగోల్లోని సరూర్నగర్కు చెందిన తమ బందువుల అబ్బాయితో వివాహం ఆదివారం గ్రామంలోనే జరిగింది. సోమవారం రాత్రి సరూర్నగర్లో విందు ఉండటంతో అమ్మాయి తరుపు బంధువులు యాదగిరిగుట్టకు చెందిన సుడుగు Mýృష్ణారెడ్డి డీసీఎంలో Ðð ళ్తున్నారు. ఈ క్రమంలో భువనగిరి పట్టణ శివారులో బైపాస్ రోడ్డులో ఉన్న వివేరా హోటల్ దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న డీసీఎంను ఒక గుర్తు తెలియని కారు వచ్చి ఢికోట్టి వెళ్లి పోయింది. దీంతో డీసీఎం డ్రైవర్ స్టిరింగ్ను పక్కకు టార్నింగ్ చేసే ప్రయత్నం చేయగా స్టిరింగ్ రాడ్ విరిగంతోపాటు బ్రేక్ పైపులు పగిలి పోయాయి. దీంతో డీసీఎం రోడ్డు కిందకు దుసుకుపోయి బోల్తా పడింది. డీసీఎంలో ఉన్న 40 నుంచి 50 మంది వరకు ఉన్నారు. ఇందులో 18 మంది గాయపడ్డారు. పెళ్లి కుమార్తె తల్లి నర్సయ్య, బంధువులు సునిల్, మధు, మహేష్, సాయికుమార్, చందు, రాకేష్, రమేష్, స్వామి, కిష్టయ్య, నర్సయ్య, హరిMýృష్ణ, యాదగిరి, ఎల్లమ్మతో పాలు మారో ముగ్గురికి తలకు, కాలుకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది, హైవే అంబులెన్స్ ద్వారా బాధితులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
భువనగిరి అర్బన్ : పాముకాటుకు గురై చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అనాజిపురం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు ముంత మైసయ్య(45) తనకు ఉన్న గొర్రెలు, మేకలను మేపుతు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన ఆయన రోజులాగే గొర్రెల కొట్టం వద్దకు వెళ్లగా అక్కడ పాము కాటువేసింది. ఇది గమనించిన ఆయన వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు చికిత్స అందించేందుకు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు చెప్పారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. సీపీఎం జీఎంపీఎస్ నాయకులు మృతదేహంపై పూలమాలలు వేసి నివాళర్పించారు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థికసాయం అందజేయాలని ఎంపీటీసీ దాసరి పాండు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయ్యాల నర్సింహ, ఎదునూరి మల్లేషం, ఎల్లంల వెంకటేష్, కడారి కృష్ణ తదితరులు ఉన్నారు. -
యాదాద్రి జిల్లా ఏర్పాటు సంతోషకరం
భువనగిరి భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వం ప్రకటించిన నూతన జిల్లాల ముసాయిదాలో యాదాద్రి పేరును ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భువనగిరి రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి జిల్లా కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. యాదాద్రి జిల్లా ప్రకటించిన ందుకు కే సీఆర్కు భువనగిరి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతునట్లు తెలిపారు. భువనగిరి హెడ్క్వాటర్తో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరిపాలన సులభం అవుతుందన్నారు. అలాగే ఇటీవల రియో ఒలింపిక్స్లో తెలంగాణ బిడ్డ సింధు పతకం గెలుచుకోవడం శుభసూచకమని చెప్పారు. భువనగిరిలో ఉన్న ఇండోర్ స్టేడియంలో రూ. 10 లక్షలతో షటిల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు, త్వరలో ఉడెన్ కోర్టును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పాటును పురస్కరించుకొని భువనగిరిలో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. పార్టీలకతీతంగా సంబరాలు చేసుకోవాలన్నారు. ఉదయం 11 గంటలకు సాయిబాబా ఆలయం నుంచి బాబుజగ్జీవన్రాం చౌరస్తా వరకు పెద్దఎత్తున విజయోత్సవ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ జడల అమరేందర్గౌడ్, టీజీఏ రాష్ట్ర నాయకులు రావి సురేందర్రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు కొల్పుల అమరేందర్, మండలశాఖ అధ్యక్షుడు మారగోని రాముగౌడ్, బల్గూరి మధుసూదన్రెడ్డి, ఎం. శ్రీనివాస్, నాయకులు ఎన్. రమేష్, గోద శ్రీనివాస్, అబ్బగాని వెంకట్గౌడ్, ఆకుల మల్లేష్, నక్కల చిరంజీవి, పప్పు, కంచర్ల నర్సింగరావు, పుట్ట వీరేష్యాదవ్, సత్యనారాయణ, రమేష్, మురళి, మహేష్, నరేష్, ధనుంజయగౌడ్ తదితరులు ఉన్నారు. -
కేసారంలో నీటి కష్టాలు
కేసారం(భువనగిరి అర్బన్) : వర్షాకాలంలోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. మండలంలోని కేసారంలో స్కీంబోర్లలో నీరు అడగంటడం, కృష్ణాజలాల సరఫరా నిలిచిపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. గుక్కెడు నీటికోసం వ్యవసాయ బావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో 215 ఇళ్లు ఉన్నాయి. 850 మంది జనాభా ఉన్నారు. మొత్తం మూడు స్కీం బోర్లు ఉన్నాయి. రెండింటిలో నీరు అడుగంటిపోయాయి. ఒకబోరులో నీరు సన్నగా వస్తున్నాయి. ఆనీటిని కూడా గ్రామంలోని వాటర్ప్లాంట్కు సరఫరా చేస్తున్నారు. ఈ నీరు తాగేందుకు మాత్రమే వస్తున్నాయి. వాడుకునేందుకు వాటర్ట్యాంకర్ సరఫరా చేస్తున్నారు. అవికూడా సరిపోకపోవడం వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది అంతదూరం వెళ్లలేక వాటర్ప్లాంట్ వేస్టేసీ నీటిని వినియోగించుకుంటున్నారు. గతంలో కృష్ణాజలాలు కూడా సరఫరా అయ్యేవి. ప్రస్తుతం భగీరథ పనులు కొనసాగుతుండడంతో పైపులైన్లు తరచు లీకేజీ నీటి సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం వీరికి ట్యాంకర్లు, వ్యవసాయ బోర్లే దిక్కయ్యాయి. రైతులు అద్దెబోర్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలి – పల్లపు సమ్మక్క, కేసారం గ్రామంలో ప్రస్తుతం నీటి సమస్య ఉండడంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి నీటిని తీసుకువస్తున్నాం. బోరు బావుల నుంచి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు మంచినీటి కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలి. గ్రామంలో బోర్లు వేసి నీటి కొరతను తీర్చాలి. వేస్టేజ్ వాటర్ను ఉపయోగిస్తున్నాం – ఓర్సు లక్ష్మి, కేసారం.... వాటర్ ఫ్లాంట్ ద్వారా బయటకు వచ్చే వేస్టేజ్ వాటర్ను ఉపయోగిస్తున్నాం. దూరం వెళ్లలేక ఈ నీటిని ఉపయోగించడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాం. ఇప్పటికైన అధికారులు స్పందించి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న– వవాల్దాస్ సత్యనారాయణ, సర్పంచ్, కేసారం గ్రామంలో నీటి సమస్య ఉన్నందున్న వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తున్నాం. నీటి సమస్యను పరిష్కరించేందుకు రైతుల నుంచి అద్దె బోర్ల ఇవ్వాలని కోరినా ఎవరు ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యే, ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఎమ్మెల్యే ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో 3 బోర్లు వేసిన నీరు రాలేదు. నీటి సమస్యను పరిష్కారం కోసం కృషి చేస్తున్నా. -
కేసారంలో నీటి కష్టాలు
కేసారం(భువనగిరి అర్బన్) : వర్షాకాలంలోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. మండలంలోని కేసారంలో స్కీంబోర్లలో నీరు అడగంటడం, కృష్ణాజలాల సరఫరా నిలిచిపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. గుక్కెడు నీటికోసం వ్యవసాయ బావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో 215 ఇళ్లు ఉన్నాయి. 850 మంది జనాభా ఉన్నారు. మొత్తం మూడు స్కీం బోర్లు ఉన్నాయి. రెండింటిలో నీరు అడుగంటిపోయాయి. ఒకబోరులో నీరు సన్నగా వస్తున్నాయి. ఆనీటిని కూడా గ్రామంలోని వాటర్ప్లాంట్కు సరఫరా చేస్తున్నారు. ఈ నీరు తాగేందుకు మాత్రమే వస్తున్నాయి. వాడుకునేందుకు వాటర్ట్యాంకర్ సరఫరా చేస్తున్నారు. అవికూడా సరిపోకపోవడం వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది అంతదూరం వెళ్లలేక వాటర్ప్లాంట్ వేస్టేసీ నీటిని వినియోగించుకుంటున్నారు. గతంలో కృష్ణాజలాలు కూడా సరఫరా అయ్యేవి. ప్రస్తుతం భగీరథ పనులు కొనసాగుతుండడంతో పైపులైన్లు తరచు లీకేజీ నీటి సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం వీరికి ట్యాంకర్లు, వ్యవసాయ బోర్లే దిక్కయ్యాయి. రైతులు అద్దెబోర్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలి – పల్లపు సమ్మక్క, కేసారం గ్రామంలో ప్రస్తుతం నీటి సమస్య ఉండడంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి నీటిని తీసుకువస్తున్నాం. బోరు బావుల నుంచి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు మంచినీటి కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలి. గ్రామంలో బోర్లు వేసి నీటి కొరతను తీర్చాలి. వేస్టేజ్ వాటర్ను ఉపయోగిస్తున్నాం – ఓర్సు లక్ష్మి, కేసారం.... వాటర్ ఫ్లాంట్ ద్వారా బయటకు వచ్చే వేస్టేజ్ వాటర్ను ఉపయోగిస్తున్నాం. దూరం వెళ్లలేక ఈ నీటిని ఉపయోగించడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాం. ఇప్పటికైన అధికారులు స్పందించి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న– వవాల్దాస్ సత్యనారాయణ, సర్పంచ్, కేసారం గ్రామంలో నీటి సమస్య ఉన్నందున్న వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తున్నాం. నీటి సమస్యను పరిష్కరించేందుకు రైతుల నుంచి అద్దె బోర్ల ఇవ్వాలని కోరినా ఎవరు ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యే, ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఎమ్మెల్యే ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో 3 బోర్లు వేసిన నీరు రాలేదు. నీటి సమస్యను పరిష్కారం కోసం కృషి చేస్తున్నా. -
బాల్బ్యాడ్మింటన్ జిల్లాజట్ల ఎంపిక
భువనగిరి టౌన్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అండర్–19 క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.దయాకర్రెడ్డి సమక్షంలో బాల్బ్యాడ్మింటన్ జిల్లా బాలికలు, బాలుర జట్లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శాగంటి శ్రీనివాస్, పీడీలు జి.సోమనర్సయ్య, సాంబశివరావు, అప్పారావు, టి.మల్లయ్య, శ్రీనివాసులు, వీరయ్య, తదితరులు ఉన్నారు. బాలుర జట్టుకు ఎంపికైన విద్యార్థులు ఎం.శ్రీను, వంశీకృష్ణ (నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల), బి.నవీన్(భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల), బి.సందీప్( చౌటుప్పుల్ మేధా కశాశాల), జి.నరేష్, పి.శంకర్(టీఎస్డబ్ల్యూఆర్జేసీ రాజాపేట). బాలికల జట్టుకు.. : బి.కావేరి(నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల), బి.లావణ్య, కె.మమత, కె.లతశ్రీ (టీఎస్డబ్ల్యూఆర్జేసీ తుంగత్తురి) ఎంపికయ్యారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
భువనగిరి అర్బన్ : తాళం వేసి ఉన్న ఇంట్లో బంగారు నగలు, నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మండలంలోని వీరవెల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీరవెల్లి గ్రామ పరిధిలోని పొలిశెట్టి జోజప్ప వ్యవసాయం చేసుకుంటూ, తనకున్న ట్యాక్సీ కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇంట్లో తనతో పాటు భార్య మరియమ్మ ఉంటారు. రోజులాగే భార్యభర్తలు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి ఇంటి ముందు నిద్రించారు. ఇది గమనించి గుర్తు తెలియని వ్యక్తులు తాళం తీసి ఇంట్లోకి వెళ్లారు. బీరువా తలుపులు తీసి అందులో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలు, 14 తులాల వెండీ, రూ.20 వేల నగదును అపహరించుకుపోయారు. తెల్లవారుజామున లేచి చూడగానే తలుపులు తీసి, లైట్లు వేసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువ తెరచి ఉంది. అందులో ఉన్న నగలు, నగదు కనబడక పోవడంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులు, గ్రామస్తులకు సమచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇంటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి డాగ్స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఇంటి పరిసరాలను, చుట్టు పక్కల ఇళ్లను పరిశీలించారు. జోజప్ప ఫిర్యాదుతో కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సాజిదుల్లా తెలిపారు. -
ఖిలాపై పర్యాటకుల సందడి
భువనగిరి టౌన్ : భువనగిరి ఖిలాకు రోజురోజుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. సెలవు దినం వస్తే ఖిలా మొత్తం పర్యాటకులతో సందడిగా మారుతుంది. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని పలు కళాశాలలు, పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు ఖిలాను సందర్శన కోసం క్యూ కట్టారు. ఖిలాపై ఉన్న పురాతన కట్టడాలను చూసి ఉత్సాహంగా గడిపారు. ఈ ఒక్క రోజు సుమారు.1500 మందికి పైగా పర్యాటకులు సందర్శించినట్లు నిర్వాహకులు శేఖర్రెడ్డి తెలిపారు. -
పైసలంటే లక్షలు... రూపాయలంటే కోట్లు!
* డబ్బును లెక్కపెట్టడంలో నయీమ్ అలవాటిదీ * నక్సలైట్లను చంపడం తనకు వ్యసనం * ఎన్నారై శ్రీధర్ పేరిట వాట్సప్లో హల్చల్ చేస్తున్న మెసేజ్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ లెక్కల్లో పైసలంటే లక్షలు.. రూపాయలంటే కోట్లు. వందలాది మందిని అనేక రూపాల్లో బెదిరించి కోట్ల రూపాయల వసూలు చేసిన నయీమ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ బాధితుడు కొంచెం ధైర్యం చేసి నయీమ్ ఆగడాలను సమాజానికి చెప్పే ప్రయత్నం చేశాడు. భువనగిరికి చెందిన ఎన్నారై శ్రీధర్ డోగిపర్తి పేరిట వాట్సప్లో హల్చల్ చేస్తున్న ఈ ప్రింట్ మెసేజ్.. నయీమ్ స్వరూపాన్ని కళ్లకు కడుతోంది. నయీమ్ను మట్టుబెట్టిన పోలీసులు, సీఎం కేసీఆర్కు అభినందనలు తెలుపుతునట్టు ఆ మెస్సేజ్లో పేర్కొన్నారు. అందులో ఉన్న అంశాల ఆధారంగా నయీమ్ డీల్ తీరు.. ‘‘భువనగిరిలోని నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీను నాకు (శ్రీధర్ డోగిపర్తి) ఫోన్ చేసి నయీమ్ కలవాలన్నాడని చెప్పాడు. ఎందుకు రావాలంటే.. ‘భాయ్ ఆర్డర్’ అని హెచ్చరించాడు. ఈ ఏడాది జనవరి 29న ఉదయం భువనగిరిలోని సాయిబాబా ఆలయం వద్ద వాహనంలో ఎక్కించుకున్నారు. అందులో పాశం శ్రీను, డ్రైవర్ కత్తుల జంగయ్య, భువనగిరి జెడ్పీటీసీలు ఉన్నారు. నా సెల్ఫోన్ తీసేసుకున్నారు, ఆయుధాలేమైనా ఉన్నాయని తనిఖీ చేశారు. సాయిబాబా గుడి, అయ్యప్ప, ఎల్లమ్మ దేవాలయాల వద్ద పూజలు చే శాక తుక్కుగూడకు తీసుకెళ్లారు. అక్కడ మరో వాహనం (బ్లాక్ ఎక్స్యూవీ500, నంబర్ టీఎస్08ఈబీ0645) ఎక్కించి.. నా కళ్లు మూసేశారు. అరగంట ఒక పెద్ద గెస్ట్హౌస్లోకి తీసుకెళ్లి.. కళ్లు తెరవమన్నారు. ఏకే 47లు ధరించిన ఇద్దరు గన్మన్లు మరోసారి చెక్ చేసి న యీమ్ ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. నయీమ్: అన్నా.. నన్ను గుర్తు పట్టావా? నేను: గుర్తుపట్టాను.. 28 ఏళ్ల కింద మా నాన్న దగ్గరకు వచ్చారు కదా... నయీమ్: ఎలా ఉన్నాడు మీ నాన్న నేను: చనిపోయి ఐదేళ్లయింది నయీమ్: మీనాన్న చాలా ధైర్యవంతుడు. అప్పట్లో నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడలేదు. (కొంత సాధారణ సంభాషణ) నయీమ్: నేను నక్సలైట్ల మీద పోరాటం చేస్తున్నా.. వాళ్లను చంపడం నాకు వ్యసనం. దానికోసం యుద్ధం చేసే వాళ్లుగానీ, డబ్బులిచ్చే వాళ్లుగానీ కావాలి. నువ్వు ఒకరిని చంపమంటే చంపలేవు కదా.. అందుకే డబ్బు రూపంలో సాయం చేయాలి. రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి. నేను: ఏమన్నా రెండు కోట్లు అంటూ జోక్ చేస్తున్నావా? నయీమ్: నీకు జోకర్లా క న్పిస్తున్నానా..? నీకు సీరియస్ తెలియడం లేదు. (ఐపీఎస్ అధికారి వ్యాస్, సాంబశివుడు, కోనపురి రాములు, పటోళ్ల గోవర్ధన్రెడ్డి, అచ్చంపేట లో రిపోర్టర్, భువ నగిరికి చెందిన సోమ రాధాకృష్ణను చంపిన విషయాలు వివరించా డు) నేను: అంత డబ్బు ఇచ్చుకోలేను నయీమ్: డబ్బు ఇవ్వకు వెళ్లిపో.. మీవాళ్లు ఎక్కడుంటారో నాకు తెలుసు. మీ బావ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. మామూలు యాక్సిడెంటని మీరనుకుంటారు. కానీ అది నేనే చేయించానని ఫోన్ చేస్తా.. నాకు కోడిని కోసినా, మేకను కోసినా, మనిషిని కోసినా ఒకటే.. చెప్పింది చెయ్యి. లేకుంటే అమెరికా నుంచి రెండు గన్స్ తీసుకురా.. నీ దగ్గర ఎంత ఉందో నాకు తెలుసు. చచ్చేటప్పుడు ఏం తీసుకుపోతావు? ఏదీ నీతో రాదు. నువ్వు పోతే రెండు రోజులు ఏడ్చి.. మర్చిపోతారు. నేను: పది లక్షలు ఇస్తానన్నా.. నయీమ్: పది పైసలు (పదిలక్షలు) ఇస్తావా.. దాని కోసం ఇంత స్కెచ్ వేయాలా? నువ్వు కావాలంటే రెండు కోట్లు ఇవ్వొచ్చు. కానీ 50 లక్షలు ఇవ్వు. అదే ఫైనల్. నేను: నువ్వు కావాలంటే డబ్బు లాగడం పెద్ద పనికాదు. ఉన్న ఊరు కన్నతల్లిలాంటిది అంటారు.. భువనగిరి మిడిల్ క్లాస్ వాళ్లను ఎందుకు ఇబ్బందిపెడతారు? నయీమ్: నాకు మీతో స్నేహం చేయాలని ఉంది. ఉట్టిగానే చేయమంటే చేస్తావా? నీకు నష్టం చేస్తే.. భయ్యాతో నష్టం జరిగింది, కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి స్నేహం చేద్దామనుకుంటారు. (ఇదంతా జరిగాక తిరిగి తీసుకొచ్చి, సెల్ఫోన్ ఇచ్చి వదిలేశారని.. ఫిబ్రవరి 20, 2016 రోజున తమ అమ్మతో కలసి వెళ్లి పాశం శ్రీను ఇంటికి వెళ్లి రూ.50 లక్షలు ఇచ్చానని వాట్సప్ మెసేజ్లో ఉంది) -
యువకులు క్రీడల్లో రాణించాలి
చందుపట్ల(భువనగిరి అర్బన్) : గ్రామీణ యువకులు క్రీడా రంగంలో ముందుండి మండలానికి మంచి పేరు తీసుకరావాలని సర్పంచ్ చిన్నం శ్రీనివాస్ అన్నారు. భువనగిరి రూరల్ పోలీస్, కూనూరు గ్రామ సోల్జర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చందుపట్ల గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి క్రీడాపోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందులో భాగంగా ఈ పోటీలకు మండలంతో పాటు ఇతర మండలాల నుంచి మొత్తం 20 టీంలు వచ్చినట్లు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమం అనంతరం బహుమతులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు బల్గూరి మధుసూదన్రెడ్డి, అధ్యక్షుడు పాశం శివానంద్, సభ్యులు గుర్రం ప్రమోద్, చిన్నం తిరుమల్, మధుసూదన్ తదితరులు ఉన్నారు. -
భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి
భువనగిరి అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాల్లో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వేముల మహేందర్ అన్నారు. శనివారం పట్టణంలోని సుందరయ్య భవన్లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు 123 జీఓను కొట్టివేసిన తిరిగి మళ్లీ ఆ జీఓపై కోర్టుకు అప్పీలు చేస్తూ రైతులకు, నిర్వాసితులకు నష్టం కలిగించే విధానాలు ప్రభుత్వం అవలంబిస్తున్నట్లు చెప్పారు. అలాగే గత 4 నెలలుగా ఉపాధి కూలీలకు పని చేసిన వేతనాలు రావటం లేదని ఇప్పటికైన వెంటనే చెల్లించాలన్నారు. 2వ ఏఎన్ఎంలు గత 25 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు పల్లేర్ల అంజయ్య, డివిజన్ నాయకులు దయ్యాల నర్సింహ, మండలశాఖ అధ్యక్షుడు ఎస్. ఎల్లయ్య, నాయకులు రవి, ప్రభాకర్, కిషన్, భిక్షపతి పాల్గొన్నారు. -
మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం
చందుపట్ల(భువనగిరి అర్బన్) : మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన రైతు దరకంటి నర్సయ్య(67) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. సంఘంలో సభ్యత్వం ఉండడంతో మృతుడి కుటుంబానికి చందుపట్ల పీఏసీఎస్ బ్యాంకు సంఘ సభ్యుల డివిడెండ్ నిధి నుంచి రూ. 30 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బల్గూరి మధుసూదన్రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్. భిక్షపతి, సీఈఓ దంతూరి నర్సింహ, డైరెక్టర్లు నీల పార్వతమ్మ, సిబ్బంది నర్సింహ, రాములు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
భువనగిరి అర్బన్ : గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన శుక్రవారం భువనగిరి మండలంలోని అనాజిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 55ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మండలంలోని అనాజిపురం గ్రామ శివారులోని బస్షెల్టర్ వద్ద అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులు గమనించి వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనస్థలానికి వెళ్లి పరిశీలించారు. మృ తదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఏఎస్ఐ ఎం.బాసు తెలిపారు. మృతుడి కుడి చేతిపై శ్రీ అని రాసి ఉంది. ఒంటిపై సిమెంట్ కలర్ అంగీ, లూంటీ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు రూరల్ పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఏఎస్ఐ కోరారు. -
నయీమ్.. నాట్ ఏ జోక్
* సెటిల్మెంట్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో దిట్ట * డబ్బులు వసూలు చేయాల్సిన వ్యక్తుల పూర్తి సమాచారం సేకరణ * చంపడం కిరాతకంగానే.. కానీ సెటిల్మెంట్లు మాత్రం చాలా సాఫ్ట్గా.. * ‘అన్నా’ అని సంబోధిస్తూనే తనకు కావాల్సింది రాబట్టుకునే నైజం * వినకపోతే చితకబాదడం.. అవసరమనుకుంటే లేపేయడమే.. సాక్షి హైదరాబాద్: నయీమ్.. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఈ పేరు చాలా కాలంగా అండర్ వరల్డ్ మాఫియాలో సుపరిచితమైందే. విప్లవ పార్టీ నేపథ్యం నుంచి వచ్చిన అతడు గ్యాంగ్స్టర్గా మారి పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఈ మాఫియా డాన్ నైజమే చాలా ప్రత్యేకమైనదని, ఎప్పుడు ఎలా వ్యవహరించాలో, ఏ కేసును ఎలా డీల్ చేయాలో అతడికి వెన్నతో పెట్టిన విద్య అని గతంలో జరిగిన పరిణామాలు తెలియజేస్తున్నాయి. తన ప్రత్యర్థులను హతమార్చడంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. కానీ, సెటిల్మెంట్ల విషయంలో మాత్రం నయీమ్ చాలా సాఫ్ట్గా డీల్ చేస్తాడు. డబ్బులు వసూలు చేయాలన్నా, వివాదాలు సెటిల్ చేయాలన్నా ఆయన అనుచరుల నుంచీ అందరూ పకడ్బందీగానే వ్యవహరిస్తారు. నయీమ్ను కలవాలని ఎవరూ అనుకోరు కానీ.. కలిసే పరిస్థితి వస్తే మాత్రం ఆయన చెప్పినట్టు చేయాల్సిందే. అందుకు తగిన సరంజామాను సిద్ధం చేసుకుని అలా చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తాడు. కళ్లు తెరిచి చూసే లోపు ఆయుధాలతో ఉన్న సుశిక్షితులైన అంగరక్షకుల నడుమ నవ్వుతూ పలకరిస్తాడు. చెప్పినట్టు వింటే సరి.. లేదంటే మాత్రం దండన తప్పనట్టే. చితకబాదడం.. అవసరమైతే లేపేయడం. మీకు షుగర్ ఉంది కదా.. ట్యాబ్లెట్లు తెచ్చుకున్నారా? నయీమ్ ముఠా చేసిన హత్యలు పైకి కనిపిస్తాయి కాబట్టి ఎంత కిరాతకంగా హత్య చేశాడో అర్థమవుతుంది. కానీ, నయీమ్ అంతర్గతంగా చేసే సెటిల్మెంట్ల గురించి ఆయన బాధితులు, అనుచరులకు మాత్రమే తెలుస్తుంది. ఫలానా వ్యక్తి నుంచి పైసలు వసూలు చేయాలనుకున్నా.. ఏదైనా వివాదం సెటిల్ చేయాలనుకున్నా దాదాపు అనుచరులే కార్యక్రమం పూర్తి చేస్తారు. భాయ్ చెప్పాడు.. అంటూ వెళ్లి భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకుంటారు. కానీ, కీలకమైన వ్యవహారాలను మాత్రం నయీమే స్వయంగా పర్యవేక్షిస్తాడు. ఆ సెటిల్మెంట్లు చేసేందుకు గాను అవసరమైన వ్యక్తులను నయీమ్ ముఠా సభ్యులు ‘భాయ్’ దగ్గరకు తీసుకెళ్తారు. వెళ్లేటప్పుడు కూడా అర్థం కాకుండా తీసుకెళ్తారు. గతంలో నయీమ్ను కలిసి వివాదాలు సెటిల్ చేసుకున్న, డబ్బులు ఇచ్చిన కొందరు ఇచ్చిన సమాచారం ప్రకారం.. నయీమ్ అసభ్యంగా మాట్లాడడు. బెదిరించడు. అన్నా అని సంబోధించి దగ్గరకు తీసుకుంటాడు. అన్నా.. నిన్ను ఫలానా పని కోసం పిలిపించాను. అంతవరకు చేయి.. నీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని భరోసా ఇస్తాడు. ఆ తర్వాత కూడా సెటిల్ కాకపోతే సదరు వ్యక్తులకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి.? అవి ఎంత విలువ ఉంటాయి? ఈ మధ్య కాలంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఆ వ్యక్తి జరిపిన లావాదేవీలేంటి? అనే వివరాలను డాక్యుమెంట్లతో సహా ఉంచుతాడు. కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? అనే విషయాలను కూడా చెప్పి వారి యోగక్షేమాల గురించి ఆరా తీస్తాడు. ఎందుకన్నా.. రోజులు బాగాలేవు.. ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో నీ కొడు కో.. కూతురో ఉంటే పరిస్థితేంటి? అని సినీఫక్కీలో హెచ్చరిస్తాడు. సెటిల్మెంట్ల విషయంలో నయీమ్ ఎంత పకడ్బం దీగా ఉంటాడంటే.. సెటిల్మెంట్ చే యాల్సిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా తెలుసుకుంటాడు. ఎంతగా అంటే.. ‘అన్నా నీకు షుగర్ ఉంది కదా.. నువ్వు ఫలానా టాబ్లెట్ వేసుకుంటావు.. ఆ టాబ్లెట్ తెచ్చుకున్నావా.. లేదంటే నా దగ్గర ఉంది ఇస్తాను ’ అని కూడా చెప్తాడంటే నయీమ్ ఎంత పకడ్బందీగా ఉంటాడో ఇట్టే అర్థమవుతుంది. అయితే, మాట వినకపోతే మాత్రం విశ్వరూపం చూపిస్తాడని బాధితులు వాపోతున్నారు. మాఫియా సామ్రాజ్య విస్తరణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మారిన పరిస్థితుల్లో నయీమ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే వెళ్లాడ ని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన కేరళ స్థావరంగా కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. విదేశాల్లోని కొందరు నేరస్తులతో కూడా సంబంధా లు పెట్టుకున్నాడని, త్వరలోనే దుబాయ్కి వెళ్లాలనుకున్నాడని కూడా పోలీ సులు చెబుతున్నారు. ఆయన కోసం గుజరాత్ పోలీసులు వెతుకుతున్నారని, సోహ్రాబుద్దీన్తో ఆయనకున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారని కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరించాడని కూడా సమాచారం. -
కిలిమంజారో పర్వతారోహణకు 20మంది బృందం
భువనగిరి టౌన్: నల్లగొండ జిల్లా భువనగిరి ఖిల్లా పై సాధన చేసిన 20 మంది ఔత్సాహికులు దక్షిణాఫ్రికాలోని టాంజానియాలో గల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిండానికి సోమవారం బయలు దేరారు. రాక్క్లైంబింగ్ కోచ్ శేఖర్బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానశ్రామం నుంచి వెళ్లారు. -
నయీం ఎన్కౌంటర్
విచిత్ర స్వభావం.. క్రూర మనస్తత్వం.. విద్యార్థి దశలోనే హింసావాదం వైపు అడుగులు.. పిపుల్స్వార్ అగ్రనాయకత్వంతో పరిచయాలు.. అంతలోనే అంతర్గత విభేదాలు.. బయటికొచ్చి ఖాకీలకు ఆయుధమై ‘వార్’తోనే వార్.. అజ్ఞాతంలో ఉంటూనే నేర సామ్రాజ్య విస్తరణ.. వ్యుహాత్మకంగా ఎన్నో నేరాలు.. మరెన్నో ఘోరాలు.. చివరకు పోలీసుల చేతిలోనే హతం. ఇదీ.. నÄæూం అలియాస్ భువనగిరి నÄæూం నేరప్రస్థానం. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ నÄæూం మృతిచెందాడు. కూల్గా ఉంటూనే క్రూయల్గా వ్యవహరించే అతడి పీడ విరగడైందని జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భువనగిరి నÄæూం భాయ్.. అండర్వరల్డ్ ముఠాలకు ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఏవైనా సెటిల్మెంట్లలో నయీం ఎంటరయ్యారా.. ఇక అంతే..ఇతడికి వ్యతిరేకంగా మాట వినకుండా ఎవరైనా వెళ్లే వారు.. దారుణ హత్యకు గురికావాల్సిందే.. జిల్లాలోనే కాదు.. పలు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న గ్యాంగ్స్టర్ ఆచూకీని పోలీసులు కనిపెట్టి మట్టుబెట్టారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో సోమవారం పోలీసుల ఎన్కౌంటర్లో నÄæూం హతమయ్యాడు. భువనగిరి పట్టణం బీచ్మెుహల్లా దర్గా సమీపంలో నివాసముండే ఎండీ నిజాముద్దీన్,అయేషాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇందులో నయీం పెద్ద కుమారుడు. తమ్ముడు సలీం, అక్క సలీమాబేగం. నయీం పట్టణంలోని బీచ్మహలా ఉన్నతపాఠశాలలో చదువుతూ ఎన్ఎస్యూఐ విద్యార్థిసంఘంలో చురుకుగా పాల్గొనేవాడు. విద్యార్థి దశలోనే రాడికల్ భావాలతో పీపుల్స్వార్లో చేరిన నయీం 1989లో తొలిసారిగిగా యాదగిరిగుట్టలో పోలీస్లపై బాంబు దాడి చేసి అరెస్ట్ అయ్యాడు. దీంతో పోలీస్లు అతడిని జైలుకు పంపించారు. అక్కడి నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత ఐపీఎస్ అ«ధికారి వ్యాస్ను హత్య చేశాడు. అయితే పార్టీలో వచ్చిన విభేదాలతో లొంగిపోయిన నయీం జైలు జీవితం గడుపుతూనే పోలీసులకు కోవర్టుగా మారాడు. అప్పటి నుంచి పోలీసుల కనుసన్నల్లో ఉంటూనే మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్న ముఖ్యనేతలను, వారికి మద్దతు ఇస్తున్న పౌర హక్కుల నేతలను టార్గెట్ చేశాడు. దీంతో పలువురు పీపుల్స్వార్ ముఖ్యనేతల ఎన్కౌంటర్కు సమాచారం ఇచ్చాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పీపుల్స్వార్ నయీంను టార్గెట్ చేసి అంతమెందించడానికి టీంలను రూపొందించింది. అయితే వారికి చిక్కకుండా వారి అనుచరులను తనవైపుకు తిప్పుకుంటూ వారి ద్వారా సమాచారం రాబట్టి ముఖ్యనేతలను అంతమెందించే కుట్రలో భాగస్వామి అయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి పోలీస్ ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడడంతో నయీం నేర సామ్రాజ్యం ఏర్పాటు అయింది. పలు హత్య కేసుల్లో నయీం ముఠా సభ్యులు అరెస్ట్ కావడం, సాక్షులు లేక కేసులు వీగిపోవడం జరిగింది. సాంబశివుడి హత్య కేసులో నిందితులంతా పై విధంగానే నిర్దోషులుగా బయటపడ్డారు. పోలీసులల అండదండలతో నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. మాజీలతో దండుకట్టి మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిన నయీం తెలంగాణ వ్యాప్తంగా తన నేర సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు. ఇందులో ప్రధానంగా మాజీ నక్సలైట్లను, పార్టీతో విభేదాలు వచ్చి లొంగిపోయిన వారిని, మరికొందరు యువకులను చేరదీసి తాను టార్గెట్ చేసిన వారిని అంతమొందించాడు. దీంతో పాటు భువనగిరి నుంచి రంగారెడ్డి, వరంగల్, మెదక్, హైదరాబాద్,మహబూబ్నగర్, నిజామాబాద్ ఇలా తన అనుచరులు ఉన్న చోట్లా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే ఇంత జరుగుతున్నా దేనికి సరైన సాక్ష్యాలు లేవని కేసులు కొట్టివేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్ఎస్టేట్ వ్యాపారం లావాదేవీలు, వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లు, కిడ్నాప్లు, రాజకీయ బెదిరింపులు విపరీతమైయ్యాయి. ఇంత జరుగుతున్నా కొందరు అధికారుల తీరుతో పోలీసులు అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యేలను బెదిరించడమే కారణమా? ఒక విధంగా సమాంతర వ్యవస్థను నడుపుతున్న నయీం అధికార పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు రాజకీయ బెదిరింపులతో భువనగిరితో పాటు నల్లగొండ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ముందు పలువురిని అధికార పార్టీలో చేర్చే విధంగా వ్యవహరించాడన్న ఆరోపణలూ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు శాసన మండలిలో నయీంపై ఫిర్యాదు చేశారు. దీంతో పాటు అధికార పార్టీకి చెందిన భువనగిరి,నకిరేకల్, దుబ్బాకా ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేశారు. అలాగే భువనగిరికి చెందిన ఓ వ్యాపారిని బెదిరించిన నయాం రూ.కోట్లలో డబ్బులు డిమాండ్ చేశారని సమాచారం. దీంతో అతను తన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి ద్వారా సీఎంకు ఫిర్యాదు చేయడంతో న యీంపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఎవరికి అనుమానం రాకుండా ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరుగడం పోలీసుల చేతిలో హతమైనట్లు తెలుస్తోంది. -
భువనగిరిలో ముమ్మర తనిఖీలు
భువనగిరి మాజీ నక్సలైట్, గ్యాంగ్స్టర్ ఎండీ నయీం ఎన్కౌంటర్తో భువనగిరి డివిజన్ను పోలీసులు జల్లెడ పట్టారు. డివిజన్లోని పలు పోలీస్స్టేషన్ల నుంచి సీఐలు, ఎస్ఐలు అదనపు బలగాలను రప్పించారు. ఉదయం నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, వలిగొండ, భువనగిరి మండలం బొల్లేపల్లిలో నయీం అనుచరులుగా అనుమానిస్తున్న వారి ఇళ్లపై దాడులు చేశారు. భువనగిరి పట్టణంలోని నయీం ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అలాగే పీడీ యాక్టులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న నయీం అనుచరుడు పాశం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి తనిఖీ చేసి అతడి సోదరుడు కౌన్సిలర్ పాÔ¶ ం అమర్నాథ్ను అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలర్ ఎండీ నాసర్ ఇంటిని తనిఖీ చేశారు. బొల్లేపల్లిలో ఉన్న జెడ్పీటీసీ ఇంటికి వెళ్లిన పోలీసులు వారింటిని తనిఖీ చేశారు. మండలపరిషత్ అ«ధ్యక్షుడు తోటకూర వెంకటేష్ యాదవ్ను ఆయన స్వగ్రామం పగిడిపల్లిలోని అయన ఇంటిలో అదుపులోకి తీసుకున్నారు. వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, కోనపురి శంకర్ ఇళ్లపై పోలీస్లు దాడి చేశారు. యాదగిరిగుట్టలో నాలుగు ఇళ్లపైయ దాడులు చేసి నయీం అనుచరులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నయీం అనుచరులపై నిఘా: నయీం అనుచరులపై పోలీస్ల నిఘా పెంచారు. తమకు సమాచారం ఉన్న మేరకు అనుచరుల ఇళ్లపై దాడులు చేసి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నయీం అనుచరులతో ఇబ్బందులు పడ్డ వారినుంచి పోలీస్లు సమాచారం సేకరిస్తున్నారు. భూదందాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు చేసినవారి పేర్లను సేకరిస్తున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
భువనగిరి అర్బన్ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని భువనగిరి, మిర్యాలగూడ మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు.. భువనగిరి పట్టణం మీనానగర్కు చెందిన వవాల్దాస్ శ్రీనివాస్(36) బీబీనగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే బుధవారం కూడా కంపెనీలో పని ముగించుకుని భువనగిరికి రావడానికి బీబీనగర్లో ఓ ఆటోను ఎక్కాడు. ఈ క్రమంలో ఆటో భువనగిరి శివారులో ఉన్న మారుతి కారు షోరూం వద్దకు రాగానే డ్రైవర్ అజాగ్రత్తాగా నడపడం వల్ల శ్రీనివాస్ ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11.20 నిమిషాలకు మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి బంధువు మండల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ మంజునా«ద్రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. మిర్యాలగూడ రూరల్: దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన దైద హుస్సేన్(35) పని నిమిత్తం మిర్యాలగూడ శివారు కొత్తగూడెం వద్దకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఆక్రమంలో అద్దంకి–నార్కెట్ల్లి రహదారిపై కొత్తగూడెం శివారు నూకలవారిగూడెం సమీపంలో రోడ్డు దాటు తుండగా గుర్తుతెలియని వాహనం ఢీనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సమాచారం మేరకు ఎస్ఐ సర్ధార్నాయక్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలింఆచరు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుచున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
గోమాత, మఠ మందిరాలను కాపాడుకోవాలి
భువనగిరి : హిందూ సమాజంలో అత్యధికంగా పూజింపబడే మాతా, గోమాత, మఠమందిరాలను కాపాడుకోవాలని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సంఘటన కార్యదర్శి గోపాల్జీ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎస్ఆర్కే ఫంక్షన్ హాల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన భువనగిరి జిల్లా విసృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ ధర్మం తన పూర్వవైభవం, విశ్వగురు స్థానాన్ని తిరిగి సాధించే రోజు రాబోతుందన్నారు. ఇందుకోసం హిందువులంతా, వీహెచ్పీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మత మార్పిడులను అడ్డుకోవాలని తెలిపారు. అలాగే క్షేత్రగోరక్షా ప్రముఖ్ టి. యాదగిరిరావు మాట్లాడుతూ ముక్కోటి దేవతలకు నిలయమైన గోవులను రక్షించుకోవడం మన ధర్మమని, గోవుకు ఉన్న విశిష్టతలు శాస్త్ర రీత్యా నిరూపించబడిందన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ రాష్ట్ర సహ కార్యదర్శి పుల్లా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గంగం యాదగిరిరెడ్డి, ఉపాధ్యక్షుడు మాటురి మల్లేశ్వరం, కార్యదర్శి తోట భాను ప్రసాద్, కామేటిగారి కృష్ణ, పసుపునూరి మనోహర్, బండి సురేష్, ఎనబోయిన రాజేందర్, కూర నాగేందర్, నరేష్ తదితరులు ఉన్నారు. -
భువనగిరి ఖిలాపై పర్యాటకులు సందడి
భువనగిరి టౌన్: భువనగిరి ఖిలా ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షకు జిల్లాలోని పలు మండల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష అనంతరం మధ్యాహ్నం కోటను సందర్శించారు. సుమారు 14 వందల మంది కోటను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యాటకులు ఖిలాపైన ఉన్న చారిత్రక కట్టడాల గురించి తెలుసుకోవడం పాటు, సెల్ఫీలు తీసుకున్నారు. -
రెవెన్యూ టికెట్ల కొరత
భువనగిరి ఆర్థిక లావాదేవీలకు అత్యంత అవసరమైన రెవెన్యూ స్టాంపుల కొరత అక్రమ వ్యాపారుల పంట పండిస్తోంది. ఒక్క రూపాయికి పోస్టాఫీస్లో దొరికే రెవెన్యూ టికెట్ ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఐదు రూపాయలు పలుకుతోంది. పోస్టల్ శాఖ, రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖల మధ్యన కమీషన్ విషయంలో కుదరని ఏకాభిప్రాయంతో పోస్టాఫీస్లకు మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల సరఫరా నిలిచిపోయింది. భువనగిరి సబ్ డివిజన్ పోస్టాఫీస్ పరిధిలో 12 సబ్పోస్టాఫీస్లుండగా వాటి పరి«ధిలో 170 వరకు గ్రామీణ తపాల కార్యాలయాలు ఉన్నాయి. వీటన్నింటితో పాటు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కుదరని ఒప్పందంతో.. రాష్ట్ర రిజిష్ట్రేషన్ల శాఖ, పోస్టల్ శాఖల మధ్యన కమీషన్ల విషయంలో ఒప్పందం కుదర కపోవడంతో రెవెన్యూ స్టాంప్ల సరఫరా నిలిచిపోయింది. గత సంవత్సరం కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది.దీంతో స్టాంపులన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచే అమ్మకాలు సాగుతున్నాయి. దీన్ని సాకుగా తీసుకుని భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరి«ధిలో కొందరి అక్రమార్కుల పంట పండుతోంది. ఒక్కో టికెట్ రూ.5కు విక్రయం రెవెన్యూ టికెట్లు పోస్టాఫీస్లలో లభించకపోవడంతో వాటికి అక్రమార్కులు డిమాండ్ పెంచేశారు. సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చెందిన సంబంధిత ఉద్యోగులు తమ ఏజెంట్లకు టికెట్లను విక్రయిస్తున్నారు. దీంతో వారు విచ్చల విడిగా టికెట్లను రూ.ఐదు వరకు అమ్ముతున్నారు. ఎప్పుడూ పోస్టాఫీస్ల నుంచి రూపాయికి కొనుగోలు చేసి తెచ్చుకునే టికెట్లు అధిక ధరలకు కొనుగోలు చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు రుణాలు, ఫైనాన్స్ వ్యాపారులు,ఎల్ఐసీ, చిట్ఫండ్స్, ప్రామిసరీ నోట్లు ఇలా పలు రకాల ఆర్థిక లావాదదేవీల కోసం రెవెన్యూ స్టాంపులు అవసరం ఉంటుంది.ప్రతి రోజు వేలాది స్టాంపుల వినియోగం జరుగుతుంది. మూడు నెలలుగా నిలిచిన సరఫరా – రవీంద్రమోహన్, హెడ్ పోస్ట్మాస్టర్ భువనగిరి పోస్టాఫీస్లకు మూడు నెలలుగా స్టాంప్ల సరఫరా నిలిచిపోయింది. మావద్ద ఉన్న స్టాకు నెల క్రితం అయిపోయింది. రోజు స్టాంపుల కోసం జనం వచ్చిపోతున్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా లేకపోవడం వల్ల మేము అమ్మలేకపోతున్నాం. అధిక ధరకు కొనుగోలు చేస్తున్నాం – రాజు,భువనగిరి రెవెన్యూ స్టాంప్లు పోస్టాఫీస్లో దొరకడం లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లమంటున్నారు. అన్ని సార్లు రిజిస్ట్రేషన్ కార్యాలయం తెరిచి ఉండదుకదా. దుకాణాల్లో అ«ధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టాంప్లను పోస్టాఫీస్ల ద్వారా విక్రయించాలి. -
అధికారులకు నెమలి అప్పగింత
భువనగిరి అర్బన్ జాతీయ పక్షి నెమాళ్లను కొంత మంది వ్యక్తులు వేటాడుతూ వాటికి మత్తు,విషపదార్థలు ఇచ్చి మట్టు బెడుతున్నారు. శనివారం పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలోని కాస్మాని కుంట వద్ద కదల లేని నెమలిని చూసిన చిన్నారులు కొలుపుల సహాన, సోహన్లు భువనగిరి అటవీశాఖ బిట్ అధికారి సోమ నర్సయ్యకు కార్యాలయంలో అప్పగించారు. దీంతో అధికారులు నెమలికి వైద్యం అందించి ఫారెస్ట్లో వదిలి పెట్టారు. -
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
భువనగిరి : విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని ఏఆర్ ఫంక్షన్హాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మైనార్టీ డెవలప్మెంట్ కమిటీ ఆ«ధ్వర్యంలో నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. దాతలు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, కౌన్సిలర్ ఫాతేమహ్మద్, కమిటీ అధ్యక్షుడు ఎం.ఎ.హఫీజ్వసీమ్, కార్యదర్శి సయ్యద్ జావెద్ఖాద్రీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షడు అమరేందర్,మహ్మద్ మొయినోద్దీన్, సయ్యద్ ఇఫ్తాఖార్ ఫహీమ్, డాక్టర్ ఎస్ఎస్ అలీ, మహ్మద్ సర్వర్, రఫియొద్దీన్, ఎం.ఎం.అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి
భువనగిరి : కాంట్రాక్టు రెండో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి సమరశీలంగా ఉద్యమించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట రెండో ఏఎన్ఎంలు నిర్వహిస్తున్న సమ్మె గురువారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి సమ్మెకు సంఘీబావం తెలిపి మాట్లాడారు. ఎన్నికల ముందు వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మర్చిపోయారని విమర్శించారు. 11 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని, దీన్ని ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, తుర్కపల్లి సురేందర్, దాసరి పాండు, జంగయ్య, శ్రీనివాస్, ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు కైరంకొండ సరస్వతి, ఫర్వీన్, అనిత, నీలిమ, ధనలక్ష్మి, జయశ్రీ, సునంద, సునీత, మమత, విజయరాణి, సువర్ణ, కవిత ఉన్నారు. -
‘బస్వాపురం’ సామర్థ్యాన్ని తగ్గించాలి : జూలకంటి
భువనగిరి : బస్వాపురం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 11.38 టీఎంసీలను తగ్గించి, గ్రామాలు మునిగిపోకుండా నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని కోరుతూ రైతులు, నాయకులు చేపట్టిన రిలే నిరాహర దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించతలపెట్టిన బస్వాపురం రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న రైతులకు, భూమికి భూమి ఇవ్వాలని, ఇళ్లు కోల్పోతున్న వారికి ఇళ్లు ఇవ్వాలన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా 123 జీఓను భూసేకరణకు ఉపయోగించడం వల్ల రైతులు రోడ్డున పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, వేముల మహేందర్, మాటూరు బాలరాజు, దాసరి పాండు, కన్వీనర్ దయ్యాల నర్సింహ, రాజయ్య, సురేందర్, అంజయ్య, రాజరాం, వెంకటేశ్, రమేష్, రామ్జీ, లక్పతి, సత్యనారాయణ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
రైతులకు నష్టం కలిగించొద్దు
భువనగిరి : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టాన్ని అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి కోరారు. మంగళవారం భువనగిరిలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మించే నీటి ప్రాజెక్ట్లకు తాము వ్యతిరేకం కాదని, 2013 చట్టాన్ని అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. జిల్లాలో డిండి, సింగరాజుపల్లి వంటి రిజ ర్వాయర్లలకు చెందిన రైతులకు తక్కువ పరిహారం ఇచ్చారని, ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. గ్రామం పోతే గ్రామస్తులకు భూమికి భూమి, ఇళ్లకు ఇళ్లు కల్పించాలన్నారు. 123 జీఓలో ఈ అంశాలన్ని లేవన్నారు. మల్లన్నసాగర్లో పోలీసులు లాఠీచార్జిు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యానాల దామోదర్రెడ్డి, మండల కార్యదర్శి ఏశాల అశోక్, నాయకులు ఎండి.ఇమ్రాన్, గడ్డం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
మూడు నెలల్లో రూ.980కోట్లు
భువనగిరి/యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు రెవెన్యూ పెరిగిందని, మూడు నెలల కాలంలో రూ. 980 కోట్లు వచ్చినట్లు డిప్యూటీ సీఎం మహమూద్అలీ వెల్లడించారు. సోమవారం నల్లగొండ జిల్లాలో ఆయన మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి పర్యటించారు. భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరులో సబ్రిజిస్ట్రార్కార్యాలయాల పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది రూ.3,100కోట్ల రెవెన్యూ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రజలకు సేవలందిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంతభవనాలు ఉండాలని సీఎం సూచించి ప్రత్యేకంగా నిధులు కేటాయించారన్నారు. తెలంగాణలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే కేవలం మూడింటికే సొంత భవనాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 91 కార్యాలయాలకు సొంతభవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల అక్రమాలు నిరోధించడానికి మేఐ హెల్ప్యూ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా బోగస్ రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటున్నామన్నారు. కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, రిజిస్ట్రార్ అండ్ స్టాంప్ ఐజీ, కమిషనర్ అహ్మద్ నదీమ్, ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కోటగడ్డను సందర్శించిన పురావస్తుశాఖ అధికారులు
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి సీతాన గర్ కోటగడ్డ తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలను, ఆలయ స్తంభాలను పురావస్తుశాఖ సహాయ సంచాలకులు పి.నాగరాజు, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకులు ఎస్.హరగోపాల్ సోమవారం సందర్శించారు. మట్టిగడ్డ తవ్వకాల్లో బయటపడ్డ కాలభైరవుడి(నాగబైరవుని) విగ్రహంతో పాటు రాతి స్తంభాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఈ స్థలంలో తవ్వకాలు జరిపితే మరిన్నిదేవాలయాలు, చారిత్రక సంపద బయటపడే అవకాశం ఉందన్నారు. ఈ స్థలాన్ని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. భువనగిరి ఖిలాకు అనుబంధంగా ఉన్న కోటగడ్డలో భువనేశ్వరీమాతకు సంబంధించిన ఆలయం బయటపడే అవకాశం ఉందని ఎస్.హరగోపాల్ చెప్పారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, డీఈ ప్రసాదరావు, కోటపరిరక్షణ కమిటీ సభ్యులు సద్ది వెంకట్రెడ్డి, బండారుజయశ్రీ ఉన్నారు. -
కొనసాగుతున్న మట్టి తవ్వకాలు
భువనగిరి : పట్టణ శివారులోని సీతానగర్లో గల ఖిలా కోటగడ్డకు సంబంధించిన మట్టిలో వారం రోజులుగా జరుగుతుండగా ఆదివారం పురాతన కాలం నాటి దేవతా మూర్తుల విగ్రహాలు, రాతి స్తంభాలు బయటపడ్డాయి. ఇందులో నాగభైరవుడి విగ్రహం కూడాఉంది. జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా ఈ ఘటన వెలుగుచూసింది. పక్కనే ఉన్న వెంచర్లో మట్టి నింపడానికి ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఈ సమయంలో బయటపడ్డ పురాతన చరిత్రకు సంబంధించిన రాతి స్తంభాలను వెంచర్లకు తరలించారు. విషయం బయటకు పొక్కడంతో ట్రాక్టర్ ద్వారా మళ్లీ యథా స్థానంలోకి తెచ్చారు. తవ్వకాల్లో చిన్నచిన్న దేవాలయాలు ధ్వంసమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నాగ భైరవుడి విగ్రహానికి పూజలు పాముల ఆ¿¶ రణాలతో అలంకరించబడి ఉన్న నాగభైరవుడి విగ్రహానికి చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ సుర్విలావణ్య, కౌన్సిలర్లు, రఘునాథ్, బోగవెంకటేష్, కాంగ్రెస్ నాయకులు దర్గాయి హరిప్రసాద్ తదితరులు పూజలు చేశారు. గుప్త నిధులు దొరికాయని ప్రచారం కోటగడ్డ తవ్వకాల్లో గుప్త నిధులు లభించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దేవాలయానికి సంబంధించిన రాతి స్తంభాలు, దేవతామూర్తుల విగ్రహాలు బయటపడినందున గుప్త నిధులు కూడా దొరికి ఉంటాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు జరిపిన చోట పోలీసు నిఘా ఉంచాలని కోరుతున్నారు. ఆలయాన్ని పునర్నించాలి –తోట భానుప్రసాద్, వీహెచ్పీ జిల్లా కార్యదర్శి కోటగడ్డ మట్టి తవ్వకాల్లో ధ్వంసమైన ఆలయాన్ని పునర్నించాలి. ఆలయం ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి. మూడు రోజులుగా జరుగుతున్న మట్టి తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని విగ్రహాలు తరలిపోయాయి. ఈ ఉదంతంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి. -
ఇరవైరోజుల్లో చెరువుకు నీరు రప్పిస్తాం
అనాజిపురం (భువనగిరి అర్బన్) : ఇరవై రోజుల్లో బునాదిగాని కాల్వ ద్వారా పహిల్వాన్పురం చెరువుకు నీటిని రప్పిస్తామని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అనాజిపురం గ్రామం చెరువులోకి బునాదిగాని కాల్వ ద్వారా వచ్చిన నీటిని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాయపురం అశోక్, వలిగొండ జెడ్పీటీసీ శ్రీనివాస్గౌడ్, నాయకులు ఎరుకల సుధాకర్, వంగాల వెంకన్న. పాండు, జైపాల్రెడ్డి, మల్లేశం, మల్లికార్జున్, మచ్చ వెంకటేష్ పాల్గొన్నారు. -
బెల్లం నిల్వల స్వాధీనం
భువనగిరి: నాటుసారా తయారీకి అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్న బెల్లం నిల్వలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి రూరల్ సీఐ తిరుపతి నేతృత్వంలో ఎస్ఐలు సురేష్ బాబు, భిక్షపతి తదితర సిబ్బంది బెల్లం దుకాణాలపై మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గంజ్ మార్కెట్లోని సాయిగణేష్ ట్రేడర్స్ దుకాణంలో అక్రమంగా నిల్వవుంచిన 54 బస్తాల బెల్లం పౌడర్, 76 బెల్లం ముద్దలు, రెండు బస్తాల పటికను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతి తెలిపారు. -
ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
భువనగిరి: విధి నిర్వహణలో అలసత్వం.. అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగంతో భువనగిరి మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఈఓపీఆర్డీ వెంకటనర్సయ్య, కూనూరు పంచాయతీ కార్యదర్శి ఎం.ఇంద్రసేనారెడ్డి, చందుపట్ల పంచాయతీ కార్యదర్శి ఎం.నాగరాజులపై సస్పెన్షన్ వేటు వేస్తూ డీపీఓ ప్రభాకర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండీపరిధిలోని కూనూరు, చందుపట్ల గ్రామాల మధ్యన నిబంధనలకు విరుద్ధంగా 54 ఎకరాల వెంచర్ను రియల్ఎస్టేట్ వ్యాపారులు చేశారు. అయితే నిబంధ నలకు విరుద్ధంగా ఉన్న వెంచర్ల హద్దురాళ్లు తొలగించాలని ఇచ్చిన అదేశాలను పంచాయతీ కార్యదర్శులు అమలుచేయలేదు. రియల్ఎస్టేట్ వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినందునే వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారని అరోపణలు వచ్చాయి. దీంతో డీపీఓ ప్రభాకర్రెడ్డి ఈ నెల23 న చందుపట్ల గ్రామానికి వచ్చి స్వయంగా వెంచర్లపై విచారణ జరిపారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తేల డంతో, ఈఓ పీఆర్డీ, ఇద్దరు కార్యదర్శులపై సస్పెన్షన్ వేటువేశారు. అక్రమాలకు నిలయంగా.. భువనగిరి ఎంపీడీఓ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారిందని మరో మారు రుజువైంది. ముఖ్యమంత్రి స్వయంగా అక్రమ లేఅవుట్లపై కొరడ ఝలిపించాలని కోరుతుంటే క్షేత్రస్థాయిలో ఉద్యోగులు మాత్రం చేతివాటం చూపుతూనే ఉన్నారు. మండలంలో దీర్ఘ కాలికంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. 2002 నుంచి పంచాయతీ కార్యదర్శులుగా ఇక్కడే ఉంటున్న వారు అధికారులను మెప్పించి తమకు అనుకూలమైన గ్రామాలకు ఇన్చార్జ్లుగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. సస్షెన్షన్కు గురైన నాగరాజు వడపర్తిలో పర్మనెంట్ పోస్ట్ ఉండగా అదనంగా చందుపట్ల, ముస్త్యాలపల్లితో పాటు ఇటీవల రాయగిరి గ్రామ పంచాయతీని బలవంతంగా తీసుకున్నారు. రాయగిరిలో పనిచేస్తున్న కార్యదర్శిని అక్కడి విధుల్లోంచి తప్పించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంద్రసేనారెడ్డి కూడా కూనురు, అనాజిపురం, బండసోమారం గ్రామాలకు కార్యదర్శిగా విధులను నిర్వహిస్తున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న గ్రామాల్లో అక్రమ ఆదాయం దండిగా వస్తుందనే కారణంతో ఈ కార్యదర్శుల విధుల్లో కొనసాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా విధులను నిర్లక్ష్యం చేయడంతో పాటు స్థానిక గ్రామపంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న మరో ఇద్దరిపై కూడా సస్పెన్షన్ వేటు పడనున్నట్టు సమాచారం. -
‘ఏకగ్రీవ’ నజరానా ఏదీ..?
భువనగిరి : గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన స్థానాలకు ఇస్తామన్న నజరానా నేటి కీ అందలేదు. ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో పాలకవర్గాలు ఉన్నాయి. సంవత్సరన్నర కాలంగా నగదు బహుమతి కోసం ఎదురుచూస్తున్న సర్పంచ్లకు నిరాశే మిగులుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపట్టే విధంగా ఉందని ఏక గ్రీవ పంచాయతీల సర్పంచ్లు, ప్రజలు వాపోతున్నారు. గ్రామ పంచాయితీలకు రూ. 5 నుంచి రూ.7లక్షల వరకు ఒక్కో పంచాయతీకి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా గల 1169 గ్రామపంచాయతీల్లో 103 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2013 జూలైలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహక బహుమతిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7.21కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఆ నిధుల జాడేలేకపోవడంతో సర్పంచ్లు పాలకవర్గ సభ్యులువాటి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏకగ్రీవ నిధులు వస్తే తమ గ్రామాల్లో మరిన్ని అభివృద్ధిపనులు చేసుకోవచ్చని సర్పంచ్లు భావించారు. ఏడు లక్షల రూపాయలు వస్తే తమ పంచాయతీల్లో మంచినీరు, మురికికాలువల నిర్మాణంతోపాటు వీధిలైట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. నిధుల కోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఎవరి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన నగదు బహుమతిని ప్రోత్సహించాలని సర్పంచ్లు కోరుతున్నారు. డివిజన్ సర్పంచ్లు ఏకగ్రీవం భువనగిరి 337 32 నల్లగొండ 203 05 సూర్యాపేట 253 16 మిర్యాలగూడ 225 09 దేవరకొండ 151 11 మొత్తం 1169 103 -
భువనగిరిలో బాణసంచా పేలుడు, ఇద్దరు సజీవ దహనం!
భువనగిరి: ఓ ఇంట్లో నిలువ చేసిన బాణసంచా పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఆర్బీనగర్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమైనట్టు సమాచారం. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీపావళి పండగ కోసం ఓ వ్యాపారి పెద్ద ఎత్తున తన నివాసంలో నిల్వ చేసిన బాణసంచా ప్రమాదవశత్తూ పేలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
అభివృద్ధి చేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటాం
భూదాన్పోచంపల్లి : భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చిత్తశుద్ధి నిరూపించుకుం టామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పద్మశాలి వేదిక వద్ద ఏర్పాటు చేసిన అభినందన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలి పారు. నవ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం అదృష్టమని, ఆయన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయించామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అబద్దాలు చెప్పారని, వాస్తవానికి రూ.4కోట్లు కూడా లే వని అన్నారు. నిమ్స్, నియోజకవర్గంలోని బునాదిగాని, పిలాయిపల్లి కాలువలను వెంటనే పూర్తిచేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ చేనేత రుణమాఫీతోపాటు, బ్యాంకుల ద్వారా కొత్తరుణాలు ఇప్పించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. బీబీనగర్ నిమ్స్ను ఆది వారం ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య సందర్శించనున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరిన టీడీపీ సర్పంచ్లు... దంతూర్, ఇంద్రియాల, గౌస్కొండ, జూలూరు, దోతిగూడెం గ్రామాల టీడీపీ సర్పంచ్లు బత్తుల శ్రీశైలం, బండి కృష్ణ, రమావత్ లక్ష్మయ్య, గోదాసు విజయలక్ష్మిపాండు, బాలెం మల్లేష్లతోపాటు ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే పోచంపల్లి2, జూలూరు స్వతంత్ర ఎంపీటీసీలు కర్నాటి రవీందర్, బండారు లలిత కూడా టీఆర్ఎస్లో చేరారు. పార్టీ కార్యాలయం ప్రారంభం..... మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే శేఖర్రెడ్డితో కలిసి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రారంభించారు. అనంతరం మార్కేండేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేనేత సహకార సంఘం ఆవరణలో ఉన్న దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయిచంద్ కళాబృందంచే నిర్వహించిన తెలంగాణ ధూం.. ధాం అలరించింది. కళాకారులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే సైతం డ్యాన్స్ చేసి ఆక ర్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కోట మల్లారెడ్డి, కందాడి భూపాల్రెడ్డి, రావుల శేఖర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, చంద్రం, భిక్షపతి, రామాంజనేయులు, కందాడి రఘుమారెడ్డి, పొనమోని శ్రీశైలం, ఐలయ్య, సిలువేరు బాలు, ఆర్ల వెంకటేశం, ఎంపీటీసీలు పాల్గొన్నారు.