Published
Mon, Aug 15 2016 11:22 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
ఖిలాపై పర్యాటకుల సందడి
భువనగిరి టౌన్ : భువనగిరి ఖిలాకు రోజురోజుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. సెలవు దినం వస్తే ఖిలా మొత్తం పర్యాటకులతో సందడిగా మారుతుంది. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని పలు కళాశాలలు, పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు ఖిలాను సందర్శన కోసం క్యూ కట్టారు. ఖిలాపై ఉన్న పురాతన కట్టడాలను చూసి ఉత్సాహంగా గడిపారు. ఈ ఒక్క రోజు సుమారు.1500 మందికి పైగా పర్యాటకులు సందర్శించినట్లు నిర్వాహకులు శేఖర్రెడ్డి తెలిపారు.