Fort
-
రాయల నాటి రాజసానికి చిహ్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చట్టూరా ప్రకృతి సోయగాలు.. కనువిందు చేసే జలపాతాలు, ప్రాచీన పుణ్యక్షేత్రాలు, కళ్లు తిప్పుకోనివ్వని శిల్పాలతో నిర్మాణాలు, తిరుమల గిరులను పోలిన ఎత్తయిన పర్వత శ్రేణులు.. అడుగడుగున కనిపించే అలనాటి రాచ మందిరాలు.. ఒకటేమిటి ఎన్నో విశిష్టతలతో నిండిన ఉదయగిరి ప్రాంతం పర్యాటక శోభకోసం ఎదురుచూస్తోంది. గత ప్రభుత్వంలో సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను అటవీశాఖ ఎకో టూరిజం స్పాట్స్గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపింది .. ఈ లోపే ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి దుర్గానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కోండ నవాబులు ఏలిన ఈ ప్రాంతం ఒకప్పుడు వైభవోపేతంగా విలసిల్లింది. కాలక్రమేణా తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రస్తుతం అలనాటి రాచరిక పాలనకు గుర్తులుగా కనిపించే మొండి గోడలు, శిథిల రాజభవనాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి వందకిలోమీటర్ల దూరంలో, నీటి వసతిలేని మెట్ట ప్రాంతంగా ఉదయగిరి అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. తొలి సూర్యకిరణాల పడే గిరి.. ఉదయగిరి కోట సముద్ర మట్టానికి 755 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత గరిష్టంగా 20 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఉదయగిరి కోట 5 కి.మీ వ్యాసార్ధంతో తిరుమల కొండను పోలి ఉంది. పచ్చని పచ్చిక బయళ్లతో, వన్యప్రాణులతో ఇక్కడ ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ ఉంటుంది. ఉదయ సూర్యుని తొలికిరణాలు ఈ కొండపైనే ముందుగా పడుతుండటంతో దీన్ని ఉదయగిరిగా విజయనగరం రాజలు పేరుపెట్టారు. ఈ ఉదయగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు 18 నెలలు ఉండి పాలన సాగించారు.చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి విజయనగర రాజులు ఉదయగిరి ప్రాంతంలో దేవాలయాలు, కోనేరులు నిరి్మంచారు. శ్రీకృష్ణ దేవరాయలు నిరి్మంచిన ఆలయాలు, నవాబులు నిర్మించిన మసీదులు, రాణీ మందిరాలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, ఫిరంగి కోటలు, కోనేరులు, సొరంగ మార్గం నేటికీ ఉన్నాయి. ఉదయగిరి దుర్గం కింద పట్టణంలో తల్పగిరి రంగనాయకులస్వామి దేవాలయం, కృష్ణాలయం, కల్యాణమండపం నేటికీ చూపరులను ఆకర్షిస్తున్నాయి. నెల్లూరులో ఉన్న రంగనాయకుల స్వామి విగ్రహం ఉదయగిరి నుంచి తరలించిందే కావటం విశేషం. శ్రీకృష్ణ దేవరాయల పాలనకు గుర్తుగా ఉదయగిరి ట్యాంక్బండ్ సమీపంలో కల్యాణ మండపం, కోనేరు అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటిచెబుతాయి. ఉదయగిరి నుంచి బండకిందపల్లికి వెళ్లే ఘాట్రోడ్డులో పాదచారుల కోసం రాతిలో తవ్విన బావి నేటికీ తానాబావిగా ప్రసిద్ధి చెందింది. అనంతరం బ్రిటిష్ పాలనలో స్టేట్ దొర నిరి్మంచిన ప్రార్థనా మందిరం, తహసీల్దారు కార్యాలయ భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు ఉదయగిరికి 33 కి.మీ దూరంలో అత్యంత ప్రాచీనమైన, అతి శక్తివంతమైన ఘటిక సిద్ధేశ్వరం శైవక్షేత్రం ఉంది. అగస్త్య మహాముని తపోపీఠమైన ఈ క్షేత్రం శ్రీకృష్ణ దేవరాయలకు యుద్ధకాలంలో దుర్గంకు దారి చూపించింది. సిద్ధేశ్వరానికి అతి సమీపంలో ఉన్న బూసానాయుడు కోటను అభివృద్ధి చేయవచ్చు. సిద్ధేశ్వరం నుంచి మరో 30 కి.మీ దూరంలో ప్రకృతి సోయగాల నడుమ పయనిస్తూ ముందుకు వెళితే 7, 8 శతాబ్దాల్లో పల్లవుల కాలంలో అద్భుతమైన శిల్పాకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఒకే రాతిపై దేవాలయం, ద్వారపాలకులు, శివలింగాలు, నందీశ్వరుడు కొలువైన భైరవకోన ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా జాలువారే జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.. అక్కడి నుంచి మరో 24. కి.మీ ముందుకు వెళితే నారాయణస్వామి ఆలయం ఉంది. అక్కడి నుంచి మరో పది కి.మీ దూరంలో హనుముని కొండ ఉంది. అక్కడి నుంచి మరో 25 కి.మీ ముందుకు వెళితే వెంగమాంబ దేవాలయాన్ని సందర్శించవచ్చు. అభివృద్ధిని మరచిన పాలకులు ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. గత ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు ఆచరణలో విఫలమయ్యారు. ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆనాటి కేంద్ర మంత్రులు అనంతకుమార్, సుష్మాస్వరాజ్ను ఉదయగిరి పిలిపించి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అప్పట్లో ఉదయగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. కానీ ఎందుకో ఆ హామీలు నెరవేరలేదు.ప్రతిపాదనలు చేసి.. తిరుమల కొండలను మరిపించే పర్వతశ్రేణులు, పచ్చని ప్రకృతి రమణీయతను పుణికి పుచ్చుకున్న సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం అటవీశాఖ ద్వారా ప్రణాళిక సిద్ధం చేయించింది. చిన్నపిల్లల ఆటలకు అనువుగా పార్కులు, తాగునీటి వసతి, సేదతీరేందుకు గదులు, గార్డెన్స్, జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, ప్రకృతి అందాలు వీక్షించేందుకు వాచ్ టవర్లు, సోలార్ షెడ్స్, లైట్లు ఇలా ఒక్కో ప్రాంతంలో 45 రకాల పనులకు రూ.2.78 కోట్ల చొప్పున అంచనాలతో గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు పంపించారు. ఆసమయంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మనసుపెట్టి పనులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.వెయ్యేళ్ల చరిత్ర ఉదయగిరి దుర్గానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనలు కాగితాలకేపరిమితమవుతున్నాయి. ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్దిచేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్దిచెందుతుంది.– ఎస్కె.ఎండి.ఖాజా, చరిత్ర కారుడు, ఉదయగిరి -
అజీంగఢ్కు గడ్డు రోజులు
ఒకప్పుడు ఎంతోమంది ఇంజనీర్లు సహా ఇంకెందరో సేదదీరారు ఆ కోట నీడలో.. ఇంకెన్నో చిత్రాల్లోని సన్నివేశాలు చిత్రీకరించారు అక్కడే.. పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.. ప్రభుత్వ నిరాదరణతో శిథిలావస్థకు చేరింది. అదే నిజాం కాలం నాటి అజీంగఢ్ కోట. – దేవరకొండనిజాం నాటి కట్టడం1980వ దశకంలో అజీంగఢ్ కోటలో రెండు తెలుగు సినిమాల్లోని పలు సన్నివేశాలను చిత్రీకరించారు. 1940–43 సంవత్సరాల మధ్య కాలంలో అప్పటి నిజాం కాలంనాటి ఇంజనీర్ ఖాజా అజ్మొద్దీన్.. నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో దుందుభి వాగుపై ప్రాజెక్టును నిర్మించారు. ఈ క్రమంలో ప్రాజెక్టుకు మంజూరు చేసిన నిధులు.. నిర్మాణం పూర్తయ్యాక కూడా కొన్ని మిగిలాయి. దీంతో డిండి మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలోని బాపన్కుంట వద్ద అజీంఘడ్ అనే పేరుతో రాతి కోటను నిర్మించారు.ఆ కోటను ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక కూడా ఇంజనీర్లకు విశ్రాంతి భవనంగా ఉపయోగపడింది. నిజాం పరిపాలన అనంతరం స్థానికంగా ఉన్న నీటిపారుదల శాఖ అతిథి గృహంతో పాటు అజీంగఢ్ కోట ఇరిగేషన్ శాఖ అధీనంలోకి వెళ్లాయి. అప్పటి నుంచి ఆ శాఖ పర్యవేక్షణలోనే కోట నిర్వహణ కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాల్లో భాగంగా అజీంగఢ్ మరమ్మతులకు దాదాపు రూ.20 లక్షలు కేటాయించింది. దీంతో అధికారులు అజీంగఢ్ కోటలో మెట్ల నిర్మాణం, నూతనంగా తలుపులు, కిటికీలు, భవనానికి రంగులు తదితర మరమ్మతులు చేపట్టి.. ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. రాతితో పటిష్టంగా నిర్మించిన ఈ కోటను డిండి–దేవరకొండ వెళ్లే మార్గమధ్యలో రాకపోకలు సాగించేవారు చూసి అబ్బుర పడుతుంటారు. కానీ కోట నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పర్యాటకులకు ఆహ్లాదం పంచడం లేదు.రెండు తెలుగు సినిమాల చిత్రీకరణ ఈ కోటలో 1980వ దశకంలో రెండు తెలుగు సినిమాలకు సంబంధించి పలు సన్నివేశాలను చిత్రీకరించారు. నాగేశ్వరరావు, అన్నపూర్ణ నటించిన ‘ఆత్మగౌరవం’చిత్రంలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. చంద్రమోహన్, విజయశాంతి జంటగా నటించిన ‘అమాయక చక్రవర్తి’ సినిమాను దాదాపు 30 శాతం ఇక్కడే చిత్రీకరించారు.వైభవం కోల్పోతున్న అజీంగఢ్ఎంతో చరిత్ర కలిగిన అజీంగఢ్ కోట ప్రస్తుతం పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. అప్పటి ఇంజనీర్ల ప్రతిభతో ఎంతో సుందరంగా నిర్మించిన ఈ కోట నిర్వహణ లోపంతో పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. మొత్తం రాతితో చెక్కు చెదరకుండా నిర్మించిన కోట ప్రస్తుతం చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రభుత్వాలు, అధికారులు కోట అభివృద్ధికి చర్యలు చేపట్టి.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం అజీంగఢ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే.. డిండి మండల అభివృద్ధి మరింత సాధ్యపడుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. -
చరిత్రకు సజీవ సాక్ష్యం.. రాజకోట
యాదగిరిగుట్ట: నిజాం ప్రభువులకు లక్షలాది రూపాయల కప్పం కట్టిన సంపన్న సంస్థానం.. ఒకప్పుడు అద్భుతమైన కట్టడంగా భాసిల్లిన కోట నిర్మాణం.. అదే.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన రాజకోట. 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాతి కట్టడాల నిలయంగా.. రాచరికపు మహోన్నత వైభవానికి.. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది రాజాపేటలోని (Rajapeta) రాజావారి కోట. హైదరాబాద్కు (Hyderabad) 90 కిలోమీటర్లు.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు (Aler) నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజాం రాజ్యంలోని అన్ని సంస్థానాల కన్నా ఎక్కువ రాబడి ఈ సంస్థానం నుంచే వచ్చేదని చరిత్రకారులు చెబుతారు. అంతేకాదు.. గొప్ప కట్టడాలున్న సంస్థానంగా కూడా పేరు ఉండేది. ఇక్కడ చిన్న చిన్న షూటింగ్లు, ఫొటో షూట్లు సైతం జరుగుతుంటాయి. కోటలోని అద్భుత శిల్ప కళా సంపద అప్పటి శిల్పుల గొప్పతనాన్ని చాటుతుంది. కోట చరిత్ర రాజాపేట గ్రామానికి పడమటి భాగంలో గోపాలపురం (Gopalapuram) అనే గ్రామం ఉండేది. గ్రామం పైభాగంలో చెరువు ఉండేది. ఆ చెరువు వరద ముంపునకు గురైన గోపాలపురం గ్రామం కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం రాజ రాయన్న అనే రాజు 1775లో కోటను నిర్మించి గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. రాజ రాయన్న పాలన సాగించిన కోటనే నేడు రాజాపేటగా పిలుస్తున్నారు. రాజాపేట గ్రామం చుట్టూ కందకం తవ్వారు. కోట గోడ ప్రాకారం, ఎత్తయిన రాతి గోడలతో చుట్టూ శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. గ్రామం మధ్యలో ఉండేలా.. మూడు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేశారు. ఎగువ పడమటి వైపున్న గోపాల చెరువు నుంచి కందకంలో నీరు పారేలా ఏర్పాట్లు చేసి.. శత్రువులు చొరబడకుండా మొసళ్లను పెంచేవారు. గ్రామం లోపలి ప్రధాన ద్వారం దాటితే రాజ నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి గృహం, నీటి కొలను, గిరిగిరి మాల్, ఏనుగుల మోట, ఖైదీల కారాగారం, సైనికుల శిక్షణ స్థలం వంటివి కనిపిస్తాయి. శత్రువుల నుంచి కోటను రక్షించేందుకు చుట్టూ నిర్మించిన ఎత్తయిన బురుజులు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. వారి ప్రాణాలను రక్షించుకునేందుకు కోట నుంచి బయటికెళ్లేందుకు సొరంగ మార్గాలున్నాయి. పర్యాటకుల తాకిడి.. సినిమా షూటింగ్లు.. రాజకోటలో బురుజులు, అంతఃపురం, నీటి కొలను, సైనిక ప్రాంగణం, ఏనుగుల మోట, గిరిగిరిమాల్ తదితర అద్భుత నిర్మాణాలు.. సినిమా షూటింగ్లు, ఫొటోషూట్కు అనుకూలంగా ఉన్నాయి. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లే మార్గాల్లో ఈ కోట ఉండటంతో పర్యాటకులు సందర్శించేందుకు వీలుంది. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్తో పాటు పలువురు ప్రీ వెడ్డింగ్ (Pre Wedding) షూట్లు ఇక్కడ తీస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని గడికోట రాజకోట రాజవంశీకులు ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గతంలో నిర్ణయించారు. దీంతో పర్యాటక శాఖాధికారులు రాజకోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019 అక్టోబర్ 29న పర్యాటక శాఖాధికారులు గడిని సందర్శించారు. అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం, తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు, రాజాపేట గడికోట, కొలనుపాకలోని జైన్ మందిర్, సోమేశ్వర ఆలయాలను కలుపుతూ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. చదవండి: తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానంభావితరాలకు అందించాలి రాజకోటను తిలకించేందుకు పర్యాటకులు, సినీ నటులు తరచూ వస్తున్నారు. కోటలో ఇప్పటికే పలు సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్లు జరిగాయి. 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకోటను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, టూరిజం స్పాట్గా తీర్చిదిద్దాలి. – కొత్తకొండ భాస్కర్, రాజాపేట గ్రామస్తుడురాజకోటను పరిరక్షించాలి మా కాలంలో ఈ కోట ఎంతో అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు నిరాదరణకు గురైంది. ఎంతో చరిత్ర కలిగిన రాజాపేటలోని రాజకోటను అభివృద్ధి చేయాలి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు అతి సమీపంలోని ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. – పుల్లంగారి సిద్ధయ్య, రాజాపేట -
ఆంధ్ర ప్రదేశ్ : రాచరిక దర్పం..గుత్తి కోట రహస్యాలు ఇవిగో.. (ఫొటోలు)
-
శ్రీకృష్ణదేవరాయలకు రక్షణగా ‘గట్టు’
గద్వాల: శ్రీకృష్ణదేవరాయులు తన విజయనగర సామ్రాజ్యాన్ని ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకూ విస్తరించారు. ఆంధ్ర ప్రాంతంలో ఎత్తయిన ప్రదేశంగా ఉన్న గట్టు ప్రాంతంలో ఆయన శత్రువుల నుంచి రక్షణ కోసం కోటగోడ ప్రాకారాలు నిర్మించారు. ఈ క్రమంలోనే అక్కడ రాజ్యవిస్తరణ జరిగి గట్టు సంస్థానం వెలసినట్టు చరిత్రకారులు చెబుతారు. అందుకే శ్రీకృష్ణదేవరాయలను ఆంధ్ర, కన్నడ ప్రజలు గొప్ప చక్రవర్తిగా అభిమానిస్తారు. ఆంధ్రా భోజుడిగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడ్డారు.సోమనాద్రికి అండగా..పూడూరు కేంద్రంగా నలసోమనాద్రి గద్వాలలో తన రాజ్యస్థాపన చేసే క్రమంలో కోట నిర్మాణం చేశారు. అయితే దీనిని సహించని ఉప్పేరు నవాబు నలసోమనాద్రిపై యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలో ఉప్పేరు నవాబు రాయచూరు నవాబు సాయం కోరారు. గట్టు ఆరగిద్ద ప్రాంతంలో హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నలసోమనాద్రి విజయ దుందుభి మోగించారు. తన విజయంలో గట్టు ప్రాంతం ఎంతో కీలక పాత్ర పోషించిందని నలసోమనాద్రి చెప్పినట్టు చరిత్రకారులు చెబుతారు. ఆ యుద్ధం అనంతరం సోమనాద్రి తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకొని పాలించారు. రతనాల గట్టు.. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం(1509–1529)లో సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఎనిమిది చావిడ్లు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గట్టు సంతబజారులో రతనాలు, బంగారు నాణేలను రాశులుగా పోసి క్రయవిక్రయాలు జరిపే వారని చరిత్ర తెలిసిన పెద్దలు నేటికీ చెబుతుంటారు. గట్టులో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. సారవంతమైన భూమిలో మంచి పంటలు పండించేవారు. శ్రీ కృష్ణదేవరాయలు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ప్రోత్సహించేవారు. అందులో భాగంగానే చెరువులు, కాల్వలు తవ్వించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడ్డారు. అనేక రకాల పండ్ల తోటలు పెంచేవారు. వ్యవసాయాధార పరిశ్రమలు ప్రతి గ్రామంలోనూ ఉండేవి. బెల్లం, నీలిమందు తయారీ, వస్త్ర తయారీ వంటివి కూడా ప్రోత్సహించారు. గట్టులో పట్టుపరిశ్రమను ప్రోత్సహించారు. అప్పట్లో మగ్గాలపై వ్రస్తాలను తయారు చేసేవారు. ఇలా తయారు చేసిన వ్రస్తాలను రాయలసీమలోని రాయదుర్గానికి తరలించే వారని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాతి కాలంలో.. శ్రీకృష్ణదేవరాయల తర్వాతి కాలంలో పాలించిన రాజులు గట్టు ప్రాంతంపై నిర్లక్ష్యం చూపడంతో పూర్తి వెనుకబాటుకు గురైంది. దీంతో ఈ ప్రాంతంలో పేరుమోసిన ఓ దొంగ గట్టును ఆవాసంగా చేసుకున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దోచుకున్న సొమ్మును గట్టులో భద్రపర్చుకునే వాడని చెబుతారు. ఈ సొమ్ముకు కాపలాగా తన సోదరిని పెట్టగా.. ఆమె ఓ బాటసారిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న దొంగ తన సోదరిని పక్కనే ఉన్న గంగిమాన్దొడ్డిలో ఆమె చివరి జీవనం వరకు బందీగా చేశాడని చెబుతారు. రక్షణ ప్రాంతంగా.. కర్ణాటకకు సరిహద్దు ప్రాంతంగా ఉండే గట్టును శ్రీకృష్ణదేవరాయలు రక్షణ ప్రాంతంగా నిర్మించారు. గ్రామం చుట్టూ కోటబురుజులతో కూడిన ప్రహరీ, లోపల 8 వరకు చావిడిలను నిర్మించారు. వీటిపై అర్ధచంద్రాకార గుర్తులు ఉన్నాయి. చీకటి పడితే కోటగోడలపై కాగడాలు వెలిగించి, సైనికులు కాపలా కాసేవారని చెబుతారు. కరువుకు నిలయం..రాజుల కాలంలో సిరిసంపదలతో తులతూగిన గట్టు ప్రాంతం.. రాజులు పోయి, రాజ్యాలు అంతరించిన తర్వాత అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా పేరుగాంచింది. కరువుకు నిలయంగా మారింది. ఇక్కడి నుంచే పొట్టచేత పట్టుకొని కుటుంబాలకు కుటుంబాలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్న దైన్యస్థితి నెలకొంది.40 ఏళ్ల క్రితం..సుమారు 40 ఏళ్ల క్రితం గట్టు నేతాజీ చౌరస్తాలో గుప్తనిధుల తవ్వకాలలో పెద్దఎత్తున అలనాటి విలువైన నిధులు, బంగారు నాణేలు బయటపడ్డాయి. వీటిలో కొంతమేర అన్యాక్రాంతం కాగా.. మిగిలిన వాటిని ప్రభుత్వం స్వాదీనం చేసుకొని హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచారు. -
సప్తగిరుల దేవరాద్రి
దేవరకొండ ఖిలాకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలో ఉన్న కోటలన్నింటిలో దేవరకొండ కోట తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 13వ శతాబ్దంలో నిర్మితమైన దేవరకొండ ఖిలాకు సురగిరి అనే పేరుంది. అంటే దేవతల కొండ అని దీని అర్థం. కోట చుట్టూ ఎనిమిది చోట్ల ఆంజనేయస్వామి రూపాన్ని చెక్కి కోటను అష్ట దిగ్బంధనం చేశారని ప్రతీతి. ఎంతో ప్రాచుర్యం పొందిన దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. అయినా పాలకులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో నిరాదరణకు గురవుతోంది. – దేవరకొండకోట చుట్టూ 360 బురుజులు.. కాలక్రమేణా కోట గోడలు బీటలు వారినా.. నిర్మాణ శైలి నేటికీ అబ్బురపరుస్తోంది. పది కిలోమీటర్ల పొడవు, 500 అడుగుల ఎత్తులో ఏడు కొండల మధ్య నిర్మితమైన దేవరకొండ కోట శత్రుదుర్బేధ్యంగా ఉండేది. మట్టి, రాళ్లతో కట్టిన గోడలు నేటికీ నాటి నిర్మాణ కౌశలాన్ని చాటుతున్నాయి.7 గుట్టలను చుట్టుకొని ఉన్న శిలా ప్రాకారంలో 360 బురుజులు, రాతితో కట్టిన 9 ప్రధాన ద్వారాలు, 32 ప్రాకార ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, కోనేర్లు, కొలనులు, సైనిక నివాసాలు, ధాన్యాగారాలు, సభావేదికలు, ఆలయాలు ఇలా.. ఎన్నో.. ఎన్నెన్నో. ప్రతీ నిర్మాణం వెనుక ఓ చారిత్రక గాథ పలకరిస్తుంటుంది.రాజదర్బార్ ఉన్న కోట ద్వారాలకు రెండు వైపులా పూర్ణకుంభాలు, సింహాలు, తాబేళ్లు, చేపలు, గుర్రాలు వంటి ఆకృతులు ఇక్కడ రాతిపై చెక్కబడి ఉన్నాయి. కోట సమీపంలో నరసింహ, ఓంకారేశ్వర, రామాలయం వంటి పురాతన దేవాలయాలు దర్శనమిస్తాయి. ఇక్కడి శిల్పకళా సంపద చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. పద్మనాయకుల రాజధానిగా.. 15వ శతాబ్దంనాటి ఈ కోటకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 700 ఏళ్ల కిందట 13వ శతాబ్దంలో కాకతీయులకు సామంతులుగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్రులైన పద్మనాయకుల రాజధానిగా దేవరకొండ కీర్తి గడించింది. అనపోతనాయుడు, రెండవ మాదానాయుడి కాలంలో కోట నిర్మాణం జరిగింది.మాదానాయుడి వారసులు దేవరకొండని, అనపోతనాయుడి వారసులు రాచకొండను రాజధానిగా చేసుకొని క్రీ.శ 1236 నుంచి 1486 వరకు పాలన కొనసాగించారు. తర్వాత ఈ కోటను బహమనీ సుల్తానులు, కుతుబ్షాహీలు వశం చేసుకున్నారు. సందర్శకుల తాకిడి.. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఖిలా (Devarakonda Fort) సందర్శనకు హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, విదేశీయులు సైతం కోటను సందర్శించి ఇక్కడి శిల్పకళా సంపదను చూసి ముగ్దులవుతున్నారు. చదవండి: చెరువులకు చేరింది సగంలోపు చేప పిల్లలేఇక తొలి ఏకాదశి, మహా శివరాత్రి పర్వదినాల్లో దేవరకొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున కోటకు చేరుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ కోట సింహద్వారంపై చెక్కబడిన పూర్ణకుంభం చిహ్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ చిహ్నంగా తీసుకోవడం గమనార్హం.పర్యాటక ప్రాంతంగా మార్చితే.. ఖిలాను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రాంత ప్రజల చిరకాల కోరిక. దేవరకొండ ఖిలా గతమెంతో ఘనచరిత్ర కలిగి నాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచింది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే దేవరకొండతోపాటు చుట్టుపక్కల పట్టణాలు సైతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయి. ఈ ఖిలా విశిష్టత సైతం నలుమూలల వ్యాప్తి చెందుతుందని ఇక్కడి ప్రజల కోరిక. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖిలా ఆవరణలో పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం పార్క్ నిర్మాణ పనులు పూర్తయినట్టు అధికారులు పేర్కొంటున్నారు.దేవరకొండ ఖిలాకు చేరుకునేదిలా.. దేవరకొండ ఖిలా హైదరాబాద్కు 110 కిలోమీటర్లు, నాగార్జునసాగర్కు 45 కి.మీ, నల్లగొండ నుంచి సాగర్కు వెళ్లే దారిలో కొండమల్లేపల్లి పట్టణం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, నల్లగొండ, సాగర్ నుంచి దేవరకొండకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. -
ఉదయపూర్ యువరాజు వాహన ప్రపంచం - తప్పకుండా చూడాల్సిందే (ఫోటోలు)
-
రాజస్థాన్లో పెళ్లి పార్టీ.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ అన్సీన్ ఫోటోలు
-
అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!
ఇది అత్యంత ప్రాచీనమైన కోటల్లో ఒకటి. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఉన్న ఈ కోట పేరు శిశుపాలగడ. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్ది నాటి కోట ఇది. ఈ కోట, దాని చుట్టు ఏర్పడిన నగరానికి చెందిన శిథిలాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. అశోకుడు కళింగ యుద్ధం చేసేనాటికి ముందు దాదాపు క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది కాలంలో ఈ నగరం అద్భుతంగా వర్ధిల్లినట్లు ఇక్కడ దొరికిన ఆధారాల వల్ల తెలుస్తోంది. మౌర్యుల కాలానికి ముందు నిర్మించిన ఈ కోట ఆనాటి కాలంలోని ఏథెన్స్ నగరానికి మించి ఉండేదని చరిత్రకారులు ఎం.ఎల్.స్మిత్, ఆర్.మహంతి తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. అప్పట్లో శిశుపాలగడ జనాభా దాదాపు పాతికవేల వరకు ఉంటే, అదేకాలంలో ఏథెన్స్ జనాభా పదివేల వరకు మాత్రమే ఉండేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడి చారిత్రక ఆధారాలను పరిరక్షిస్తున్నారు. (చదవండి: రోబో చిత్రానికి రూ.9 కోట్లు) -
రాజసం... గద్వాల సంస్థానం
గద్వాల: కవులు.. కట్టడాలకు పేరుగాంచిన గద్వాల సంస్థానం వైభవం నేటికీ చెక్కుచెదరలేదు. రాజసానికి నిలువెత్తు నిదర్శనమైన గద్వాల సంస్థానం ఏర్పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరం. నిజాం సంస్థానంతోపాటు 1948లో భారత యూనియన్లో విలీనమైన గద్వాల సంస్థానంపై సవివర కథనమిది. నల సోమనాద్రి ఆధ్వర్యంలో ఆవిర్భావం నల సోమనాద్రి (పెద సోమభూపాలుడు) క్రీస్తుశకం 1663లో గద్వాల మండలం పూడూరు కేంద్రంగా గద్వాల సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. నాటినుంచి 1948 వరకు ఆయన వారసులు పాలన కొనసాగించారు. నలసోమనాద్రి 1663–1712 వరకు, తర్వాత కల్లా వెంకటన్న క్రీ.శ. 1712– 1716 వరకు, రమణయ్య క్రీ.శ. 1716– 1723 వరకు, తిమ్మక్క క్రీ.శ. 1723– 1725 వరకు, లింగమ్మ క్రీ.శ. 1725– 1740 వరకు, తిరుమలరావు క్రీ.శ. 1740– 1742 వరకు, మంగమ్మ క్రీ.శ. 1742– 1745 వరకు, చొక్కమ్మ క్రీ.శ. 1745– 1747 వరకు, రామరాయలు క్రీ.శ. 1747– 1761 వరకు, చినసోమభూపాలుడు– 2 క్రీ.శ. 1761– 1794 వరకు, రామభూపాలుడు–1 క్రీ.శ. 1794– 1807 వరకు, సీతారామభూపాలుడు–1 క్రీ.శ. 1807– 1810 వరకు, వెంకటలక్ష్మమ్మ క్రీ.శ. 1840– 1840 (4 నెలలు), సోమభూపాలుడు– 3 క్రీ.శ. 1840– 1844, వెంకటలక్ష్మమ్మ (మరల) క్రీ.శ. 1844–1845, రామభూపాలుడు–2 క్రీ.శ. 1845– 1901 వరకు, సీతారామభూపాలుడు– 2 క్రీ.శ. 1901–1924 వరకు, ఆ తర్వాత చివరి తరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ క్రీ.శ. 1924–1948 వరకు పాలన కొనసాగించారు. విద్వత్కవులకు పేరు.. గద్వాల సంస్థానం కవులకు పేరుగాంచింది. నలసోమనాద్రి, చినసోమభూపాలుడు, రామభూపాలుడు–2, సీతారామభూపాలుడు–2, మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ తదితరులు కవులకు పెద్దపీట వేసినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరి పాలనలోనే గద్వాల సంస్థానం విద్వత్కవుల ప్రాంతంగా వరి్ధల్లింది. వీరి పాలనలో సంస్థాన కవులు, సంస్థాన ప్రాంత నివాస కవులు, సంస్థానేతర ఆశ్రిత కవులకు ఆశ్రయమిచ్చి గద్వాల సంస్థాన ప్రాశస్త్యాన్ని నలుమూలలా చాటినట్లు చెబుతారు. ఈ కవులు రచించిన పద్యాలలో చాటు పద్యాలు ప్రత్యేకంగా గుర్తింపు సాధించాయి.చెక్కుచెదరని నాటి కట్టడాలు నలసోమనాద్రి కాలం పాలన మొదలుకొని చివరితరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ కాలం వరకు నిర్మించిన వివిధ కట్టడాలు, భవనాలు, బావులు నేటికీ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నాటి భవనాలు రాజుల అభిరుచికి, నాటి వైభవాన్ని గుర్తు చేస్తూ.. చెక్కు చెదరకపోవడం విశేషం.గద్వాల కోటలో డిగ్రీ కళాశాల, ఆలయం.. రాజులు పాలన సాగించిన ప్రధాన గద్వాల కోటలో ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చెన్నకేశవస్వామి ఆలయాలున్నాయి. కోట లోపలి భాగం చాలా వరకు శిథిలావస్థకు చేరి కూలిపోగా.. ముఖద్వారం, కోట చుట్టూ భాగాలు నేటికీ పర్యాటకులకు కనువిందు చేస్తాయి.చెక్కుచెదరని ఫిరంగిరాజులు యుద్ధ సమయంలో వినియోగించే ఫిరంగి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీనిని ప్రస్తుతం గద్వాల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో లింగమ్మ (1725– 1740), (1745– 1747) బావులు గత పాలన చిహ్నాలుగా ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రస్తుత పాలకులు ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఏటా జరిగే గద్వాల జాతర సందర్భంగా తెప్పోత్సవాలు ఈ బావుల్లోనే నిర్వహిస్తారు.మహారాజా మార్కెట్.. సంస్థానంలోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు మొదలుకొని.. మిగతా అన్ని రకాల వస్తువులు మహారాజా మార్కెట్లోనే లభించేవి. రైతులు పండించే పంట ఉత్పత్తులు కూడా ఇక్కడ విక్రయించేవారని చరిత్రకారులు చెబుతారు. మహారాజా మార్కెట్ చిహ్నం చాలా భాగం ధ్వంసమైనప్పటికీ.. దాని ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి.కృష్ణారెడ్డి బంగ్లా ప్రత్యేకం నలసోమనాద్రి నిర్మించిన (ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కాలేజీ) కోటలోనే రాజవంశీయులు కలిసి జీవించేవారు. అయితే 1924లో సీతారామభూపాలుడు–2 మృతి చెందడంతో.. ఆయన భార్య మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ పాలన పగ్గాలు చేపట్టారు. సీతారామభూపాలుని సోదరుడు వెంకటకృష్ణారెడ్డికి అప్పటి పాలకులతో మనస్పర్థలు ఏర్పడి.. మాట పట్టింపుతో గద్వాల కోటను దాటి కృష్ణారెడ్డి బంగ్లాను నిర్మించుకున్నారు. ఈయన రాజవంశీయుల చివరితరం పాలనలో రెవెన్యూ, భూ పరిపాలన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ భవనంలోనే చిరంజీవి హీరోగా నటించిన ‘కొండవీటిరాజా’ సినిమా షూటింగ్ చేశారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎస్ఈ కార్యాలయం, భూసేకరణ కార్యాలయం ఇక్కడే కొనసాగాయి. గద్వాల బ్లాక్ సమితి కార్యాలయం, అనంతరం ఏర్పడిన మండల రెవెన్యూ కార్యాలయం కూడా చాలాకాలం పాటు ఇక్కడే కొనసాగింది. రాజావారి బంధువులు నేటికీ ఈ భవనంలోనే జీవనం కొనసాగిస్తుండగా.. మరికొంత భాగంలో ఎంబీ హైసూ్కల్, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలున్నాయి. ఎండాకాలం, చలికాలం, వానాకాలంలో కూడా ఒకేరకమైన వాతావరణం ఉండేలా ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. -
రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా!
తెలంగాణలోని రాతి కోటల్లో వరంగల్, భువనగిరి కోటల తర్వాత చెప్పుకోదగ్గది గాంధారి ఖిల్లా. అపారమైన బొగ్గు నిక్షేపాలతో విరాజిల్లుతున్న మంచిర్యాల జిల్లాలో.. వేల సంవత్సరాల క్రితమే మానవ జీవనం ఉన్నట్లు తెలియజేసే సజీవ సాక్ష్యం ఈ గాంధారి ఖిల్లా. మంచిర్యాల పట్టణానికి పన్నెండు కి.మీ. దూరంలో మందమర్రి మండలం, బొక్కలగుట్ట అడవుల్లో ఈ కోట ఉంది. గుట్టపైన నాగశేషుడి ఆలయం, శివుడు, ఏనుగు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు, ద్వారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఉన్నాయి. శత్రువుల రాకను పసిగట్టే నగారా గుండూ కనిపిస్తుంది. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం, కాలభైరవ విగ్రహాలు ఆకర్షిస్తాయి. గుట్ట పైన ‘సవతుల బావులు’, కాలువలు ఉన్నాయి. కింద నీటి చెలమలో ఎండాకాలంలోనూ నీటి ఊట పైకి వస్తుంది.చారిత్రక వైభవం..అరుదైన గోండ్వానా రాతి గుట్టలపైన మానవ నిర్మిత నీటి గుండాలతో అద్భుతమైన చారిత్రక సంపద కనిపిస్తుంది. ఈ గుట్టలను ఎవరు తొలిచారనేదానికి స్పష్టతలేదు. పూర్వయుగపు పనిముట్లు, చిత్రలేఖనాలు చరిత్రకారులకు లభ్యమయ్యాయి. కొన్ని ఆధారాల ప్రకారం ఆరవ శతాబ్దంలో కందారపురం పేరుతో గాంధారి కోట రాజధానిగా సోమదేవరాజు రాజరికం చేశారని తెలుస్తోంది. ఆయన కొడుకు మాధవ వర్మ కాకతీయుల మూల పురుషుడనే ప్రస్తావన సిద్ధేశ్వర, ప్రతాప చరిత్రలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. రాష్ట్రకూటుల సామంతుడైన మేడరాజు ఈ గాంధారి కోటను పటిష్ఠం చేశాడు. ఆయన పేరుతో ఉన్న మేడ చెరువు నేటికీ కనిపిస్తుంది. పద్మనాయక రాజులు రాచకొండ కేంద్రంగా పాలిస్తూ, వైష్ణవమతం వ్యాప్తికోసం పెద్దిరాజు అనంతరాజు, రఘు నాయకులు కోటలో హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దీన్ని ధ్రువీకరించే 15వశతాబ్దపు తెలుగు శాసనం ఉంది. పెద్దిరాజును పాండవుల పెద్దనాన్న ధృతరాష్ట్రుడిలా, పెద్దమ్మను ధృతరాష్ట్రుడి భార్య గాంధారిలా భావించి, ఈ కోటను ‘గాంధారి కోట’గా పిలిచారని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.శ.1300లో కథాగేయంగా ‘గాంధారి కథ’ రచన చేసినట్లు చరిత్రకారులు గుర్తించారు. కాని కవి విషయంలో స్పష్టత లేదు. నిజాం కాలంలో పన్ను వసూళ్ల కోసం స్థానిక గోండు మొకాశీలను నియమించుకున్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. 1928లో తొలిసారి గాంధారి కథను ప్రచురించినట్లు ఆధారాలున్నాయి. ఇప్పటికీ గిరిజన కథా గేయాల్లో, జానపదాల్లో ఈ కథ వినిపిస్తుంది.అరుదైనది..గుట్టను తొలిచి కట్టిన కోటగా గాంధారి ఖిల్లాకు దక్షిణ భారతదేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లోహయుగం నాటి ఆనవాళ్లున్నాయి. కాకతీయ, రాష్ట్రకూటుల కాలం నాటి చారిత్రక సంపద ఉంది. ఇలాంటి అరుదైన కోటలను రక్షించుకుంటే చారిత్రక సంపదతోపాటు, పర్యాటక వనరులనూ కాపాడినట్లవుతుంది. – డా.ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ చరిత్రకారుడు.పర్యాటక కేంద్రంగా..ఎంతో చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లాను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరచాలి. దానికి అవసరమైన ఏర్పాట్ల మీద ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – మేసినేని రాజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ నాయకపోడ్ సాంస్కృతిక కళాభివృద్ధి సంఘం. మాఘమాసం జాతర..అనాదిగా గాంధారి ఖిల్లా నాయక్పోడ్ తెగకు ఆరాధ్య ప్రాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో ఇదొక ప్రధాన గిరిజన తెగ. వీరిక్కడ ప్రతి మాఘమాసం (ఫిబ్రవరి) భక్తి, శ్రద్ధలతో జాతర జరుపుతారు. ఇది మూడురోజులు సాగుతుంది. మొదటిరోజు సాయంకాలం దేవతా మూర్తులను సదర్భీమన్న నుంచి గోదావరికి తీసుకొచ్చి, స్నానం చేయిస్తారు. ఆ రాత్రి ఆటపాటలతో గడిపి, మరుసటిరోజు మధ్యాహ్నం డప్పు చప్పుళ్లతో జాతర ప్రాంతానికి తీసుకెళ్తారు. చివరిరోజు ఖిల్లా పైభాగంలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్నాలు వేసి, నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. చరిత్రలో నాటి పాలకులు గాంధారి ఖిల్లాను అష్టదిగ్బంధనం చేసిన ఆనవాళ్లున్నాయి. దాని గుర్తుగా పాలకాయలు (కొబ్బరికాయలు), కోడిగుడ్లు, మేకలు, కోళ్లు (గతంలో దున్నపోతులను) బలి ఇచ్చే సంప్రదాయం నేటికీ ఈ జాతరలో కొనసాగుతోంది. దీనికి నాయక్పోడ్లే ప్రధాన పూజారులు. ముగింపులో జీడికోట వద్ద జరిగే దర్బార్(సభ)లో గిరిజనుల కష్టసుఖాలు, గాంధారి ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ జాతరకు మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు వస్తారు. జాతర తిరుగువారం మాత్రం నాయకపోడ్లే జరుపుకుంటారు.ప్రకృతి రమణీయతకు నెలవు..మంచిర్యాల వరకు రైల్లో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ కోటను చేరుకోవచ్చు. గుట్టపైకి మాత్రం కాలినడకనే వెళ్లాలి. కోట పరిసర ప్రాంతంలో చెప్పులతో అనుమతించరు. చుట్టూ అడవి, కాలువలు, చెరువులతో రమణీయంగా ఉంటుందీ ప్రాంతం. వన్యప్రాణుల నిలయం. ట్రెక్కింగ్కి అనువైన చోటు. పర్యాటకుల సౌకర్యాల కోసం ప్రణాళికలు వేసినా, అవి ముందుకు సాగలేదు. ఎన్హెచ్ 363ని ఆనుకుని గాంధారి వనం పేరుతో అటవీ శాఖ ఓ పార్కును అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. ‘పరేషాన్’ అనే సినిమాలో టైటిల్ సాంగ్ ‘గాంధారి ఖిల్లా కత్తవా’ అంటూనే మొదలవుతుంది. – ఆకుల రాజు, సాక్షి ప్రతినిధి, మంచిర్యాలఇవి చదవండి: Health: అంతా మెదడులోనే ఉంది.. -
మిస్టీరియస్ కోట!..ఆ సమయంలో గానీ కోటలోకి అడుగుపెట్టారో అంతే..!
పింక్ సిటీ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందిన రాజస్థాన్ రాజధాని జైపూర్.. రాజప్రసాదాలకు, చారిత్రక కట్టడాలకు ఆలవాలం. అయితే ఇక్కడ హాంటెడ్ ప్లేసెస్ కూడా బాగానే హడలెత్తిస్తాయి. జైపూర్ విమానాశ్రయానికి 56 కి.మీ దూరంలో.. భాన్గఢ్కు సమీపంలో ఉన్న కోట పుకార్లతో భయపెడుతుంది. ఇక్కడుండే నెగటివ్ ఎనర్జీ గురించి.. ఆత్మల గురించి.. చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. ‘సూర్యాస్తమయానికి, సూర్యోదయానికి మధ్య సమయంలో ఈ కోటలోకి అనుమతి లేదు’ అని బోర్డులు పెట్టిదంటే.. ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట.. పలు కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. ఈ కోట అందచందాల గురించి అద్భుతమైన వర్ణనలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కథల్లో కొన్ని ఎంత ఆసక్తికరంగా ఉంటాయో.. అంతే వణికించేలా ఉంటాయి. ఇక్కడ ఈ కోటను కట్టడానికి ముందు ఆ దగ్గర్లో నివసించే ఓ సన్యాసి.. ‘కోట నీడ నా ఇంటిపై పడకూడదు’ అని ఓ షరతు పెట్టాడట. కానీ అలా జరగకపోవడంతో ఆ సన్యాసి దుష్టశక్తులను కోటలోకి ఆహ్వానిస్తూ శపించాడని చాలామంది చెబుతారు. ఒకనాటి భాన్గఢ్ యువరాణితో ప్రేమలో పడిన ఓ మాంత్రికుడి దుష్ట ఆత్మకు ఈ కోట నిలయంగా మారిందని మరికొందరు చెబుతారు. ఈ కోట సమీపంలో ఏవో క్రూరమైన హత్యలు జరిగాయని.. ఆ హత్యకు గురైన బాధితులే ఆత్మలుగా మారి ఇక్కడ సంచరిస్తున్నాయని ఇంకొందరు అభిప్రాయం. ఒక స్నేహబృందం రహస్యంగా ఈ కోటలోకి ప్రవేశించి.. ఇక తిరిగి రాలేదనే ప్రచారం బాగా వినిపిస్తోంది. రాత్రి పూట మహిళల అరుపులు, ఏడుపులు, వింత వింత శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. ఈ పుకార్లు వేటికీ ఆధారం లేకపోయినా పర్యాటకులకు మాత్రం ఈ ప్రాంగణంలో అసౌకర్య భావన కలుగుతూ ఉంటుంది. ఈ కోటలోకి వెళ్లిన చాలా మంది తమ వింత అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. కోటలోంచి తిరిగి వచ్చినవారు.. ఏదో నీడ వెంటాడుతున్నట్లు, ఎవరో లాగినట్లు అనిపించిందని చెబుతుంటారు. ఏళ్లు గడిచినా.. ఈ కోటలోని మిస్టరీ ఏంటన్నది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ∙సంహిత నిమ్మన (చదవండి: జీవిత భాగస్వామి విషయంలో ఆ తప్పిదమే ఆ సైనికుడి జీవితాన్ని..!) -
ఈ కోటలోకి వెళ్లిన వాళ్లెవరూ ఇప్పటివరకు తిరిగి రాలేదు
అదో రహస్య కోట. సూర్యస్తమయం తర్వాత ఆ కోటలోకి వెళ్లడం నిషేధం. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసినా వెళ్లినా తిరిగి వచ్చిన సందర్భాలు లేవు. ఇప్పటివరకు అలా వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రాలేదు. మిస్టీరియస్ కోటగా పేరుగాంచిన ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? ఏంటీ హిస్టరీ అన్నది తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని వారసత్వ కోటలలో ఒకటి ఈ గర్కుందర్ ఫోర్ట్. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ అంతుచిక్కని రహస్యమైన కోట చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా పేరుగాంచింది. మధ్యప్రదేశ్లోని ఝాన్సీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోటను 11వ శతాబ్దంలో నిర్మించినట్టుగా సమాచారం. చందేలా, బుందేలా, ఖంగర్ వంటి రాజవంశస్థులు ఈ ప్రాంతంలో పాలన సాగించారు. తర్వాత ఈ కోటను తుగ్లక్లు సొంతం చేసుకొని బుందేలాలకు అప్పగించారు. ఈ కోటను ఎప్పుడు, ఎవరు నిర్మించారు అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ కోటలో చాలా నిధి ఉందన్న ప్రచారం కూడా ఉంది. దీంతో కోట లోపల ఏం ఉందో తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అదేంటంటే.. సూర్యాస్తమయం తర్వాత కోటలోకి ఎవరూ ప్రవేశించకూడదని. కొంతమంది క్యూరియాసిటీతో కోట లోపల రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ కోట గురించి తెలుసుకోవాలని వెళ్లిన సుమారు 50-60మంది ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సంఘటన తర్వాత కోటలోకి వెళ్లే అన్ని తలుపులు మూసివేశారు. ఈ కోట వెనక ఆసక్తికరమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక తాంత్రికుడు యువరాణి సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడై మంత్రించిన నూనెతో వశం చేసుకోవాలని ప్రయత్నించాడు. అది పసిగట్టిన యువరాణి ఆ నూనెల ఓ రాయిపై పడేలా చేసింది. దీంతో ఆ రాయి తాంత్రికుణ్ణి హతమార్చింది. ఆ తాంత్రికుడు చనిపోతూ శపించడం వల్ల ఊరంతా నాశనమైందని చెబుతారు. మొత్తం ఐదు అంతస్తుల్లో ఉండే గర్కుందర్ కోటలో మూడు అంతస్తులు పైన, రెండు అంతస్తులు నేలకింద నిర్మించడం విశేషం. రాత్రిపూట ఇక్కడికి ఎవరైనా ప్రవేశిస్తే మరుసటి రోజుకు కనిపించకుండా పోతారని అంటారు. దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా నిలిచింది. -
అత్యంత పెద్ద కోట ఇది.. అసలు దీని చరిత్ర ఏంటి?
-
ప్రపంచంలోనే అతిపెద్ద కోట!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోట. ఈ కోట పాకిస్తాన్లోని సింద్ ప్రావిన్స్లో ఉంది. దీని పేరు రాణికోట. పదిహేడో శతాబ్దంలో సింద్ ప్రాంతాన్ని పరిపాలించిన తాల్పూర్ వంశ పాలకులు ఈ కోటను జమ్షోరో జిల్లా సన్ పట్టణంలో నిర్మించారు. ఈ కోట గోడ చుట్టుకొలత ఏకంగా 32 కిలోమీటర్లు. తాల్పూర్ వంశ పాలకులు ఈ కోటను 1812లో మరింత పటిష్ఠంగా పునర్నిర్మించారు. పునర్నిర్మాణం కోసం అప్పట్లో వారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కోట గోడ చుట్టూ బురుజులను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. వీటిలో మూడు పెద్దబురుజులను అర్ధచంద్రాకారంలో నిర్మించారు. మెలికలు మెలికలుగా కనిపించే ఈ కోట నిర్మాణం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. పంతొమ్మిదో శతాబ్దిలో బ్రిటిష్ సేనలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత దీని పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించింది. యూనెస్కో 1993లో దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. (చదవండి: క్రీస్తూ పూర్వం నాటి పురాతన కట్టడాలకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీతో ప్రాణం పోస్తే...) -
పర్యాటక మంత్రి హామీతోనైనా.. చంద్రగఢ్ దశ మారేనా?
వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పురాతన కట్టడాల్లో చంద్రగఢ్ కోట ఒకటి. చుట్టూ రాతితో నిర్మించిన కోట చూడగానే అప్పటి నిర్మాణశైలి గుర్తుకొస్తుంది. అలాంటి కోట శిథిలావస్థకు చేరడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 18వ శతాబ్దంలో మరాఠా రాజుల కాలంలో బాజీరావు పీశ్వా ఆత్మకూర్ సంస్థానానికి సంబంధించి పన్ను వసూలు చేయడానికి చంద్రసేనుడిని నియమించారు. చంద్రసేనుడు ఈ ప్రాంతంలోని ధర్మాపురం గ్రామానికి ఉత్తర దిశగా ఉన్న ఎత్తైన కొండపై ఈ కోట నిర్మించారు. చంద్రసేనుడు ఇక్కడి నుంచే వివిధ సంస్థానాధీశుల నుంచి పన్నులు వసూలు చేసి మరాఠాకు పంపేవాడు. చంద్రసేనుడు నిర్మించిన కోట కావడంతో దీనికి చంద్రగఢ్ కోటగా నామకరణం చేశారు. నేడు ఇక్కడ ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శత్రువుల కదలికలను గుర్తించేందుకు.. కోట పైభాగంలో ఉండే సైనికులు శత్రు సైనం దండెత్తడానికి వస్తే సుమారు పది కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టి ఫిరంగులతో దాడి చేసేందుకు వీలుగా కోటగోడ భాగంలో భారీ రంధ్రాలను ఏర్పాటు చేశారు. పర్యాటక మంత్రి హామీతోనైనా.. అమరచింతలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చంద్రగఢ్ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి సూచించారు. మంత్రి హామీతో చంద్రగఢ్ కోట పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటకు మరమ్మతులు చేయించి పార్క్లు ఏర్పాటుచేస్తే వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రి చొరవతో చంద్రగఢ్కు పూర్వ వైభవం రావాలని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. ‘చుట్టూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణంలో ఎత్తైన కొండపై 18వ శతాబ్దంలో నాటి సంస్థానాదీశుడైన చంద్రసేనుడు చంద్రగఢ్ కోటను నిర్మించారు. కోట మధ్యలో రామలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు తాగునీటి కోసం రాతిపొరల మధ్య ఏర్పాటుచేసిన ఎనిమిది చిన్న చిన్న కొలనులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ ఏడాది పొడవునా నీరు ఉండటం విశేషం.’ ఇదీ ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం కోటలోని రాతి గోడలు శిథిలావస్థకు చేరాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోటను సందర్శించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అప్పట్లో కేవలం కోటపైకి వెళ్లడానికి వీలుగా సీసీ రహదారి నిర్మించి వదిలేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రగఢ్ కోటను పట్టించుకునే వారే కరువయ్యారు. -
ఆ కోట ఎక్కాలని ఉంది.. ఆనంద్ మహీంద్ర ఆసక్తికర పోస్టు..
మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యాపారంలో నిత్యం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ తనను ఆలోచింపజేసిన ఏదో ఒక పోస్టు షేర్ చేస్తూనే ఉంటారు. తన ఆలోచనలను పంచుకుంటూ ఫాలోవర్స్నూ ఆలోచింపజేస్తారు. తాజాగా ఆయన మహారాష్ట్రలోని కళావంతి కోట గురించి పోస్టు చేశారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ కోటను ఎక్కాలని ఉందంటూ తన అభీష్టాన్ని పంచుకున్నారు. కలావంతీ కోట మహారాష్ట్రలో ఉన్న అతి దుర్భేద్యమైన కోట. శత్రువులు చేరలేని స్థితిలో దాన్ని నిర్మాణం జరిగింది. దాదాపు 60 డిగ్రీల ఏటవాలులో ఉండే కొండపై ఈ దుర్గాన్ని నిర్మించారు. యువకులు ఛాలెంజ్గా ఈ కోటను ఎక్కుతారు. ఇన్ని రోజుల నుంచి ఈ కోట గురించి తనకు తెలియదని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ కోటను ఎక్కాలని ఉందని నెటిజన్లతో తన అభీష్టాన్ని పంచుకున్నారు. ఓ వ్యక్తి ఈ కోట నుంచి వేగంగా దిగుతున్న వీడియోను షేర్ చేశారు. I confess I had no clue about this spot. Have to figure out whether I’m up to this challenge! The trek to the top of the Kalavantin Durg is considered one of the most daunting in the Western Ghats. A roughly 60-degree incline. pic.twitter.com/mbgJ498ECy — anand mahindra (@anandmahindra) July 22, 2023 ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అయింది. ఆనంద్ మహీంద్ర ఫాలోవర్లు తమ స్పందనలతో కామెంట్ బాక్స్ను నింపేశారు. కోట మార్గం నిటారుగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే మంచి షూ ధరించి వెళ్లండి అంటూ సలహాలు ఇస్తున్నారు. కుదిరితే ఈ కోటకు వెళ్లడానికి మీరూ ట్రై చేస్తారా మరి..? ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
మన దేశంలోనే ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ఎంతమందికి తెలుసు!
గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే పొడవాటి కుడ్యమైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి అందరికీ తెలుసు. మన దేశంలోనే ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. రాజస్థాన్లో ఉందిది. పదిహేనో శతాబ్దంలో అప్పటి మేవార్ రాజు మహారాణా కుంభ తాను నిర్మించిన కుంభాల్గఢ్ కోటకు రక్షణగా ఈ పొడవాటి గోడను నిర్మించాడు. సముద్ర మట్టానికి 1,100 మీటర్ల ఎత్తున ఆరావళి కొండ ప్రాంతంలో 662 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కుంభాల్గఢ్ కోట చుట్టూ నిర్మించిన ఈ గోడ పొడవు 36 కిలోమీటర్లు. ఈ కోటలో గోడ పొడవునా పలు హిందూ ఆలయాలు, జైన మందిరాలు ఉన్నాయి. యూనెస్కో పదేళ్ల కిందట కుంభాల్గఢ్ కోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. (చదవండి: నిజాయితీ నిల్! అబద్ధాలు చెప్పేవాళ్లే ఎక్కువట..అందులో మగాళ్లే ఫస్ట్!) -
రాజస్తాన్ కోటలో ఘనంగా స్మృతి ఇరానీ కూతురు పెళ్లి
కేంద్ర మంత్రి, మాజీ నటి స్మృతి ఇరానీ కుమార్తె షానెల్లే వివాహం రాజస్తాన్ కోటలో గురువారం ఘనంగా జరిగింది. ఈ మేరకు స్మృతి కూతురు షానెల్లేకి, అర్జున్ భల్లాకి 2021లో నిశ్చితార్థం కాగా, గురువారం రాజస్తాన్లో ఖిమ్సర్ కోటలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో షానెల్లె ఎరుపు రంగు లెహంగా ధరించగా, వరుడు అర్జున్ తెల్లటి షేర్వాణీలో మెరిసిపోయాడు. వారి వివాహ వేడుకలు ఫిబ్రవరి 7న హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలతో ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ వేడుకలో ఆమె తల్లి స్మృతి కూడా బంగారు అంచుతో కూడిన ఎరుపు రంగ చీరతో కనిపించారు. ఈ సందర్భంగా ఆ వధువరులిద్దరూ భార్యభర్తల్లా కలసి నటించిన తొలి చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. A glimpse of Union Minister Smriti Irani's daughter Shanelle and Arjun Bhalla's mehendi and sangeet ceremonies at Khimsar Fort, Rajasthan. pic.twitter.com/FRyJXDRIiS — Tina Arpan Shah 🇮🇳 @tina661014 on #kooapp (@tina661014) February 9, 2023 (చదవండి: పాపం!.. ఆ మంత్రి దురదకు తాళలేక నడిరోడ్డు మీద కుర్తా తీసి..) -
గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: ప్రజలు, పౌర సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచిన పనులకు యునెస్కో పురస్కారాలు ప్రకటించింది. ఆసియా–పసిఫిక్ విభాగానికి మన దేశం నుంచి మూడు నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో రెండు తెలంగాణకు చెందినవే కావడం విశేషం. సాంస్కృతిక వారసత్వ కట్టడాల పున రుద్ధరణ (ఏసియా–పసిఫిక్) కింద కుతుబ్షాహీ టూంబ్స్ పరిధిలోని గోల్కొండ మెట్ల బావి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’కు, కామారెడ్డి జిల్లా దోమకొండ కోట ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’కు ఎంపికయ్యాయి. దోమకొండ కోటను నాటి సంస్థానాధీశుల వారసులు పునరుద్ధరించుకుంటూ వస్తుండగా, మెట్ల బావిని ఆగాఖాన్ ట్రస్ట్ సొంత నిధుల తో పునరుద్ధరించింది. కుతుబ్షాహీల కాలంలో అద్భుత నిర్మాణ కౌశలంతో ఈ బావి రూపుదిద్దుకుంది. ఈ తరహా మెట్లబావులు కాకతీయుల కాలంలో నిర్మించిన దాఖలాలున్నాయి. గోల్కొండ కోటను కూడా తొలుత కాకతీయులే నిర్మించినందున, ఈ బావి కూడా వారి హయాంలోనే రూపుదిద్దు కుని ఉంటుందన్న వాదనా ఉంది. భారీ వర్షాలతో బావి కొంతభాగం కూలి పూడుకుపోయింది. ఆగాఖాన్ ట్రస్టు దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో మళ్లీ అందులో నీటి ఊట ఏర్పడి ఇప్పుడు పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఈ పునరుద్ధరణ పనులు అద్భుతంగా సాగిన తీరును యునెస్కో గుర్తించింది. వారెవ్వా.. ముంబై మ్యూజియం.. ఏసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి 6 దేశాలకు చెందిన 13 కట్టడాలు పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత్, చైనా, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, నేపాల్, థాయిలాండ్ మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇందులో మన దేశం నుంచి నాలుగు కట్టడాలున్నాయి. పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విభాగం ‘అవార్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్’. ఈ కేటగిరీలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఒక్కటే చోటు దక్కించుకోవటం విశేషం. దీని నిర్మాణాన్ని పునరుద్ధరించిన తీరు అత్యద్భుతమని యునెస్కో పురస్కారాల జ్యూరీ అభిప్రాయపడింది. రెండో కేటగిరీ అయిన డిస్టింక్షన్లో మెట్లబావి చోటు దక్కించుకుంది. అలాగే ముంబైలోని బైకులా స్టేషన్ మెరిట్ విభాగంలో చోటు దక్కించుకుంది. ఎంగ్ టెంగ్ ఫాంగ్ చారిటబుల్ ట్రస్టుతో సంయుక్తంగా యునెస్కో ఈ పురస్కారాలను ప్రకటిస్తోంది. 40 ఎకరాల విస్తీర్ణంలో... 40 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఎత్తైన రాతి కట్టడంతో ప్రహరీ, దాని చుట్టూ కందకం.. ఇప్పటికీ దోమకొండ కోట చెక్కు చెదరలేదు. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసంగా వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. కోటలో రాతితో మహదేవుని ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కోటలో అద్దాల మేడ ప్రత్యేకం. ప్రముఖ సినీ హీరో చిరంజీవి తనయుడు రాంచరణ్, ఉపాసనల వివాహం ఇక్కడే జరిగింది. ఆర్కిటెక్ట్ అనురాధ నాయక్ కోట పరిరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. గుర్తింపు రావడంపై దోమకొండ సంస్థానం వారసుడు అనిల్ కామినేని, అతని సతీమణి శోభన కామినేని మాట్లాడుతూ.. కోటకు వచ్చిన గుర్తింపు దోమకొండ ప్రజలకేకాక తెలంగాణ ప్రజలందరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. -
చంద్రగిరి కొండ.. అంతుచిక్కని ఎన్నో వింతలు, విశేషాలు
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అబ్బుర పరిచే బురుజులు.. శత్రుదుర్భేద్యమైన కట్టడాలు.. మహావిష్ణువు దశావతారాలతో కూడిన శిల్పకళలలు.. సకల దేవతల ప్రతిమలతో నిర్మించిన మండపాలు.. ఒకే బండ నుంచి వచ్చే ఊటలో వేర్వేరు రుచులు.. భటుల విశ్రాంతి కోసం ప్రత్యేక ఆవాసాలు.. ఆశ్చర్యపరుస్తున్న రాతికంచాలు.. అంతుచిక్కని కోనేటి అందాలు.. ఇవీ చంద్రగిరి దుర్గం కోటని అద్భుత దృశ్యాలు.. శ్రీకృష్ణదేవరాయల నాటి శిల్పకళా సౌందర్యాలు, వింతలు, విశేషాలపై ఈ ఆదివారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. చదవండి: సాగర గర్భంలో పర్యాటకం చంద్రగిరి రాయలవారికోట ముందు భాగంలో ఉన్న ఎత్తైన కొండనే చంద్రగిరి దుర్గంగా పిలుస్తుంటారు. శ్రీకష్ణదేవరాయల వారు చంద్రగిరి కోటపై శత్రుమూకలు దాడులకు తెగబడకుండా ఉండేందుకు, ముష్కరుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఈ కొండను ఎంచుకున్నారు. కోట నుంచి దుర్గం కొండకు చేరుకునేలా నాడు ఐదు కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ ప్రాంతంలో దారిని ఏర్పాటు చేశారు. ఈ కొండపైకి వెళ్లే మార్గంలో నాటి రాజసం, వారి శిల్పాకళాకృతులు నేటికీ సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. శ్రీవారిపై అచెంచలమైన భక్తితో రాయలవారు రెండవ రాజధాని అయిన చంద్రగిరిలో అనేక కట్టడాలు నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించినప్పుడు ఆయన ఇక్కడే విడిది చేసేవారు. గుర్రాల విశ్రాంతి కోసం నిర్మించిన చావిడి నిరంతరం నిఘా దుర్గం కొండపైకి చేరుకోగానే మనకు కనిపించేది శత్రువుల జాడ కోసం సైనికులు కాపాలాకాసేందుకు ఏర్పాటు చేసిన ఎత్తైన మండపం. అన్ని వేళల్లో ఇక్కడి నుంచే రాజ్యాన్ని పరిరక్షించేవారు. వర్షాకాలంలోనూ విడిది చేసేందుకు మండపం కింద భటులు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అబ్బురపరిచే కోనేరు వందల అడుగుల ఎత్తుతో ఉన్న దుర్గం కొండపైకి చేరుకోగానే.. అబ్బురపరిచే కోనేరు దర్శనమిస్తుంది. ఇది కేవలం వర్షపు నీటి ఆధారంగా ఉంటుంది. ఏడు నులక మంచాల దారాలంత లోతు ఉంటుందని చెబుతారు. అయితే ఇంత వరకు కోనేటి లోతును ఎవరూ అంచనా వేయలేదు. సైనికుల బసకు ప్రత్యేక మండపాలు రాయలవారి సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు దుర్గం కొండపై నిత్యం భటులు షిఫ్ట్ల పద్ధతిలో విధులు నిర్వహించే వారు. వీరి విడిది కోసం రాయలవారు ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు. కొండపై మట్టి, రాళ్లు లభించకపోయినప్పటికీ ఇంత పెద్ద మండపాలను ఎలా నిర్మించారో అన్న సందేహం కలగకమానదు. అదేవిధంగా గుర్రాల కోసం మండపాలను సైతం దుర్గం కొండపై నిర్మించడం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. బురుజు దాటిన తర్వాత మొదటగా కనిపించే మండపం నాటి ఉరికొయ్యే–నేటి ఉరిబండ చంద్రగిరి కోటలోకి ప్రవేశించే మార్గంలో కుడివైపున మనకు పెద్ద బండరాయి కనిపిస్తుంది. దానిపై ఉరికొయ్యిని రాయలవారు ఏర్పాటు చేశారు. తీవ్రవాదులు, ముష్కరులు, నేరస్థులను రాజ్యంలోని ప్రజలందరి ముందు ఆ బండపై ఉన్న ఉరికొయ్యిపై ఉరితీసేవారు. అయితే కొంత మంది వాటిని గంటా మండపంగా పిలుస్తుంటారు. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టి గంట మోగిస్తారు. అ శబ్దం విన్న తర్వాత బండపై గంట మోగించడం ద్వారా రాయలవారు భోజనం చేసేవారని మరో వాదన వినిపిస్తోంది. పూర్తిగా నిషేధం దుర్గం కొండపైకి వెళ్లేందుకు కేంద్ర పురావస్తుశాఖ నిషేధం విధించింది. పూరి్వకుల ఆస్తులను పరిరక్షించేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారిని కాదని అక్కడకు వెళ్లేందుకు యత్నిస్తే జైలు తప్పదు సుమీ. విశాలమైన కోనేరు ఉప్పు సట్టి–పప్పు సట్టి దుర్గం కొండకు పడమటి భాగంలో ఉప్పుసట్టి–పప్పుసట్టి ఉంది. ఇక్కడ ఒక బండలో నుంచి ఊటవస్తూ ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత నాలుగు ఇంచుల మందంతో ఒక చిన్న గోడ కనిపిస్తుంది. గోడకు ఇటువైపు ఉండేది పప్పు సట్టిగాను, అటువైపు ఉండేది ఉప్పు సట్టిగాను పిలుస్తుంటారు. పప్పుసట్టిలోని నీళ్లు తియ్యగా, ఉప్పు సట్టిలోని నీళ్లు ఉప్పగా ఉంటాయి. దుర్గం కొండపై రాతికంచాలు రాతి కంచాల్లోనే భోజనాలు దుర్గం కొండపై కాపాలాగా ఉండే సైనికులు రాతి కంచాల్లోనే భోజనాలు చేసేవారిని తెలుస్తోంది. కోనేటి నుంచి పది అడుగుల దూరంలోని బండపై అడుగున్నర వెడల్పుతో అంగుళం లోతుతో గుండ్రటి కంచాలు కనిపిస్తాయి. వీటికి రెండువైపులా కూరలను ఉంచుకునేందుకు చెక్కిన తీరు ఆశ్చర్యమేస్తోంది. భటులందరూ వీటిపైనే భోజనాలు చేసుకుని, కోనేటిలోని నీటిని తాగేవారు. దుర్గం కొండకు వెళ్లే మార్గంలో నిర్మించిన భారీ ప్రహరీగోడ అక్కగార్లు, నాగాలమ్మకు పూజలు కోనేటి నుంచి కాసింత దూరం నడుచుకుంటూ వేళ్తే మనకు అక్కగార్ల దేవతలు, నాగాలమ్మ విగ్రహాలు కనిపిస్తాయి. నాగాలమ్మ ఆలయం వద్ద ఉన్న నీటిలో కర్పూరం వెలిగితే, అది రగులుతూ లోపలకి వెళ్లడం అక్కడి అమ్మవారి శక్తికి ప్రతిరూపంగా నిలుస్తోంది. భటుల విశ్రాంతి కోసం కొండపై నిర్మించిన ప్రత్యేక మండపాలు -
మట్టి కొట్టుకుపోతున్న రాజమహళ్లు, గడీలు
సాక్షి నెట్వర్క్: దర్పానికి, రాజసానికి దర్పణంగా నిలిచిన చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యంతో శిథిలమై నిశీథిలోకి జారుకుంటున్నాయి. అబ్బుర పర్చే నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఇప్పుడు నిర్వహణాలోపానికి తలవంచి మట్టికొట్టుకుపోతున్నాయి. రెండొందల ఏళ్ల సంస్థానాధీశుల పాలనలో అనేక ప్రత్యేకతలతో నిర్మాణమైన రాజమహళ్లు, గడీలుశిథిల వైభవానికి చిరునామాలవుతున్నాయి. 1948లో సంస్థానాల పాలన అంతమైన అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల సంస్థానాధీశులు ఆ భవనాలను ప్రజోపయోగ పనుల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. వీటిల్లో గత యాభై ఏళ్లు సజావుగా కార్యకలాపాలు నిర్వహించారు. కానీ, కొంతకాలంగా వీటిలో కనీస నిర్వహణ కరువైంది. ఈ భవనాలు శిథిలమవుతున్న తీరుపై సంస్థానాధీశుల వారసు లతోపాటు చరిత్రకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాల పరిరక్షణతో పర్యాటకం పెరగటమేకాక ఈ తరానికి ఆర్కిటెక్చర్కు సంబంధించి కొత్తపాఠాలు చెప్పినట్లు అవుతుందని వారు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఈ భవనాల వైభవాన్ని ముందు తరాలకు అందించేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కళ చెదిరిన.. రంగ్ మహల్ వనపర్తిలో నూటాఏభై ఎనిమిది ఏళ్ల క్రితం సరికొత్త నిర్మాణశైలితో సంస్థానాధీశుని కోసం నిర్మితమైన ‘రంగుమహల్’ ఇప్పుడు కళ తప్పింది. హైదరాబాద్ స్టేట్లో సొంత కరెన్సీ– అరబ్బులుసహా భారీ సైనిక బల గాలతో 152 గ్రామాల్లో 605 చద రపు మైళ్లు కలిగిన అతిపెద్ద సంస్థానం వన పర్తి. ఎత్తైన గోపురాలతో విదేశీ శిల్పుల ఆధ్వర్యంలో 1849లో ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1864లో పూర్తయింది. ఇండియాలో విలీనమైన అనంతరం చివరి సంస్థానాధీశుడు రాజారామేశ్వర రావు దీన్ని ప్రభుత్వానికి అప్పగించారు. దీనిలో 1958లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ చేతుల మీదుగా రాష్ట్రంలోనే తొలి పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. అయితే భవనం నిర్వహణ లోపాలతో ఈ మధ్య పెచ్చులూడిపోతుండటంతో క్లాసులను వేరే చోటికి తరలించి ప్రస్తుతం పరిపాలన, గ్రంథాలయం కోసం వినియో గిస్తున్నారు. కళాత్మకమైన ఆర్చీలు ఇప్పటికీ చెదరలేదు. అయితే నిర్వహణ లోపాలతో గడీ మొదటి అంతస్తు మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. తక్షణ మరమ్మతుల కోసం రూ.4.20 కోట్ల అంచనా వ్యయంతో ఫైలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. వనపర్తి సంస్థాన వారసురాలు నందినీరావు హైదరాబాద్లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు నిలబెట్టుకున్న సిర్నాపల్లి 1910–13లలో నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లిలో ఇండో– యూరోపియన్ నిర్మాణశైలితో గడీ నిర్మితమైంది. సిమెంట్, స్టీల్, కాంక్రీట్ వాడకుండా ఈ గడీని నిర్మించడం విశేషం. గడీకి ముందు భాగంలో ఇరువైపులా ఎత్తైన గోపురాలు, మధ్యలో రాజసం ఉట్టిపడేలా గంభీరంగా చూస్తూ నిలుచున్న రెండు సింహాలు ఉంటాయి. ఈ గడీ నిర్మాణంలో పూర్తిగా మట్టి, ఇటుకలు, రాళ్లు, డంగుసున్నం, పొడవాటి ఇనుప స్తంభాలు ఉపయోగించారు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేందుకు వీలుగా ముఖద్వారం ఉత్తరం వైపు ఉండేలా నిర్మాణం చేపట్టారు. నిర్మాణ శైలి, వాడిన పదార్థాల మూలంగా ఈ గడిలో ఉష్ణోగ్రతలు సమతూకంగా ఉంటాయి. చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటుంది. 1921లో జానకీబాయి మరణానంతరం బందిపోట్లు, రజాకార్ల దాడుల్లో ఇతర బంగ్లాలు ధ్వంసమైనప్పటికీ గడీ మాత్రం పటిష్టంగానే ఉంది. తదనంతర కాలంలో ఇది దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ పాఠశాలగా సేవలు అందించింది. దీనిని శీలం జానకీబాయి వారసులు గ్రామస్తుల విరాళాలతో కాపాడుకుంటూ వస్తున్నారు. గ్రామస్తులు రూ.20 వేల విరాళాలు, జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి రూ.60 వేలు అందించారు. గ్రామ పంచాయతీ నుంచి మరో రూ.5 లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయించారు. ఉపాధిహామీ కింద దీనికి ఒక వాచ్మన్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ గడీని పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థుల కోసం గ్రంథాలయంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి హైదరాబాద్లో నివసిస్తున్నారు. దొంగల పాలైన.. ఇందారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గడీ దొంగల పాలైంది. దేశ, విదేశాల నుంచి తెచ్చిన విలువైన సామగ్రి, కలపను ఎత్తుకుపోయారు. నిజాంరాజుకు నమ్మినబంటు అయినా గోనె వెంకట ముత్యంరావు ఆధ్వర్యంలో ఈ గడీని 1927లో హైదరాబాద్ స్టేట్లోనే ఓ ప్రత్యేకత శైలితో నిర్మించారు. ఈ గడీ కేంద్రంగా సిరోంచ, గడ్చిరోలి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 300 గ్రామాల పాలన సాగేది. 1948లో నిజాం లొంగుబాటు తర్వాత గోనె వెంకట ముత్యంరావు కుటుంబం హైదరాబాద్కు తరలివెళ్లింది. (క్లిక్: తెలంగాణకే తలమానికం! ట్విన్ టవర్స్) టూరిజం సర్క్యూట్గా ఏర్పాటు చేయాలి ‘200 ఏళ్ల క్రితమే హైదరాబాద్ స్టేట్లో అత్యున్నత శైలిలో భవనాలు నిర్మించారు. అన్ని ప్రాంతాల్లోని సంస్థాన భవనాలపై ప్రభుత్వం తక్షణ శ్రద్ధ చూపి టూరిజం సర్క్యూట్గా ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రాచుర్యంతోపాటు అనేకమందికి ఉపాధి కేంద్రాలుగా మారుతాయి’ –అనురాధారెడ్డి, కన్వీనర్, ఇంటాక్ -
చారిత్రక సంపదకు రక్షణ కరువు... పొలంగా మారిన దంతపురి కోటగట్టు
సరుబుజ్జిలి: పురావస్తుశాఖ పరిధిలోని చారిత్రక సంపదకు రక్షణ లేకుండాపోతోంది. సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ దంతపురి కోటగట్టుపై అక్రమ తవ్వకాలు యథేచ్ఛ సాగుతున్నాయి. కోటకు రక్షణగా నలుదిశలా విస్తరించి ఉన్న గట్టును ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా యంత్రాలు పెట్టి గట్టును తవ్వకం చేసి మట్టిని తరలించుకుపోతున్నారని చెబుతున్నారు. మరికొంతమంది గట్టును తవ్వేసి పొలాలుగా మార్చి వాటిపై పంటలు పండిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘన చరిత్ర.. శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ నుంచి సుమారు 8 కిలోమీటర్లు దూరంలో రొట్టవలస, కొండవలస, పెద్దపాలెం, పాలవలస, రావివలస గ్రామాల మధ్య విస్తరించిన చారిత్రక స్థలం దంతపురి. క్రీ.పూ 261లో అశోకచక్రవర్తి జరిపిన కళింగ యుద్ధ తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. చేది వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. కళింగరాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. శ్రీలంకకు చెందిన మహావంశం అనే బౌద్ధ గ్రంధంలో జంబూద్వీపానికి సప్తనగరాల్లో దంతపురి ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. సింహబాహు అనే రాజు సింహపురం పట్టణాన్ని నిర్మించి బుద్ధుని జ్ఞానదంతంపై స్థూపాన్ని నిర్మించడం వల్ల దంతపురిగా వెలసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. చారిత్రక ఆనవాళ్లు.. రాష్ట్ర పురావస్తు శాఖవ ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రితం చేపట్టిన తవ్వకాల్లో దంతపురి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడి కోటలో 30 అడుగుల ఎత్తయిన ప్రాకారాలు, కోటకు నలుదిక్కులా ద్వారాలు ఉండేవని గుర్తించారు. అప్పట్లో మూడు స్థూపాలు, గుర్తుపట్టలేని పాతతరం విగ్రహాలు, స్నానపు గదులు, నీటిని నిల్వ చేసే జార్లు, ఫ్లవర్ వాజులు, వంటపాత్రలు, దీపాలు, భోజనపు గిన్నెలు, రాతిరుబ్బురోలు, ఎముకతో చేసిన దువ్వెనలు, టెర్రకోట వస్తువులు బయటపడ్డాయి. ఇంతటి చారిత్రక నేపథ్యమున్న ఇక్కడి బౌద్ధస్ఫూపాలు ఇతర ఆనవాళ్లకు రక్షణ కరువైనా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికే బుద్ధుడి విగ్రహం ప్లాట్ఫాం శిథిలావస్థకు చేరుకుంది. ఎటువంటి ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో ఆవరణలోనే మందుబాబులు హల్చల్ చేస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దంతపురి కోటగట్టు ప్రదేశాన్ని రీసర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. ప్రాచీన సంపదగా విరాజిల్లుతున్న దంతపురి క్షేత్రంలో ఎటువంటి తవ్వకాలు చేయరాదు. ఇటువంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరం. కోటగట్టుపై తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. – సనపల కిరణ్కుమార్, తహసీల్దార్, సరుబుజ్జిలి (చదవండి: ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి) -
తరగని కీర్తి.. తరతరాలకు స్ఫూర్తి
గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో రాచరికానికి, నవాబులు, బ్రిటీషువారి పాలనకు నిలువుటద్దం గుర్రంకొండ కోట. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా.. చరిత్రాత్మాక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. 14 వ శాతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. కడప నవాబు పరిపాలనలో ఇది పేరుగాంచింది.శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి దేవాలయాలు, ఎన్నో చెరువులు ఉన్నాయి. మైసూర్ రాజు టిప్పుసూల్తాన్ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషువారితో ఇక్కడ రాజరిక పాలనకు తెరపడింది. ఘనచరిత్ర కలిగిన ఈకోటలో ఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు, ఆకట్టుకొనే కట్టడాలు ఉన్నాయి. ఇక్కడి విశేషాలను తిలకించడానికి మన రాష్ట్రం నుంచేకాక కర్ణాటకా నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. శత్రుదుర్భేద్యం.. కోటముఖద్వారం గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోటగోడలను నిర్మించారు. కోటగోడల చుట్టూ కందకాలు తవ్వారు. వీటిల్లో నీటిని నింపేవారు. శత్రువులు కోటగోడలు ఎక్కకుండా నీటిలో మొసళ్లును వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించేవారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది. -
వరంగల్ ఫోర్ట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం
-
కనువిందు చేసే ట్రెక్కింగ్.. వణుకుపుట్టించే చరిత్ర
కనువిందు చేసే ట్రెక్కింగ్తో పాటు వణుకుపుట్టించే చరిత్ర కూడా ఆ కోట సొంతం. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన కోటగా గుర్తింపు తెచ్చుకున్న కళావంతిన్ దుర్గం గురించి మీరెప్పుడైనా విన్నారా? మహారాష్ట్ర, ముంబై సమీపంలోని పశ్చిమ కనుమలలో, మాథేరాన్, పన్వేల్ మధ్య ఉన్న ఈ కోట.. సముద్ర మట్టానికి 701 మీటర్ల (2,300 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ కోటను కళావంతిన్ అనే రాణి గౌరవార్థం నిర్మించారనేది పురాణగాథ. ఎటువంటి ఆధారం లేని ఇరుకైన రాతి మెట్లు, ఏటవాలు మార్గం.. వర్షంతో ఏర్పడిన నాచు, జారుడు స్వభావం గల రాళ్ళు.. ఇవన్నీ ఆ కోట పైకి ఎక్కేందుకున్న అడ్డంకులు. అయితే అది ఎక్కిన తర్వాత తేలియాడే మేఘాల నడుమ.. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలతో తడిసి ముద్దవ్వాల్సిందే. కోట శిఖరాగ్రంలో చిరస్మరణీయమైన క్షణాలను మూటకట్టుకోవాల్సిందే. అందుకే ఈ కోటను climb to heaven ‘స్వర్గారోహణం’గా పిలుస్తారు. స్థానికుల ప్రకారం ఈ కోట వెనుక భయానక కథలు కూడా ఉన్నాయి. అక్కడ ఏదో ప్రతికూల శక్తి ఉందనేది వారి వాదన. అక్కడకు వచ్చేవారిని అది ఆకర్షించి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందని చెబుతుంటారు. ‘ఆ కోట నుంచి అర్ధరాత్రి.. వింత శబ్దాలు, పెద్దపెద్ద అరుపులు వినిపిస్తాయి. అందుకే మేము ఆ కోటకు కొన్ని మైళ్ల దూరంలో నివసిస్తున్నాం’ అంటారు. ఏదేమైనా జీవితంలో ఒకసారైనా ఈ కోటను ఎక్కి తీరాల్సిందే అని చెప్తారు పర్వతారోహకులు. -
సిర్పూర్ ఆదివాసీ కోటను కాపాడండి!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది గోండుల కోట. సిర్పూర్ ఒకప్పుడు గోండు (కోయ) రాజుల ఏలుబడిలో వున్న ప్రాంతం. దీనినే పూర్వ కాలంలో సూర్యపురంగా పిలిచేవారు. 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని గోండు (కోయ) రాజు భీమ్ బల్లాలా పాలించాడు. ఈయన కాలంలోనే సిర్పూర్ కోట నిర్మితమైంది. ఈ రాజ్యానికి సరిహద్దుగా సిరోంచా, చంద్రపూర్, ఊట్నూర్, అహేరి, ఆసిఫాబాద్ కేంద్రాలుగా గోండు రాజ్యాలుండేవి. ముస్లిం, బ్రిటిష్ సైన్యాలు దండయాత్రలు చేసి ఈ రాజ్యాలను ఆక్రమించి కొల్ల గొట్టాయి. అయినా అలనాటి గోండు రాజ్యాల ఆనవాళ్ళు నేటికీ సజీవంగానే ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఊట్నూర్, సిర్పూర్ టౌన్లలో ఉన్న కోటలు. ఈ చారిత్రక కోటలు నేడు కబ్జాకోరల్లో చిక్కుకొని ఆనవాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. సిర్పూర్ టౌన్ కేంద్రంగా ఉన్న గోండు రాజుల కోట దాదాపుగా 10 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఉండేది. ప్రస్తుతం కోటగోడ, కోట స్థలంలో ఉన్న శిథిలావస్థకు చేరిన కొలను చూడవచ్చు. ఆ కోట భూములు రికార్డుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కానీ కోట నేడు భూ కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుంది. (చదవండి: రాజకీయాలు మారేదెన్నడు?) తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ప్రభుత్వానికి మన చరిత్ర, సంస్కృతుల పట్ల ఉన్న మక్కువకు ఇది నిదర్శనం. అటువంటి ప్రభుత్వం ఉన్న కాలంలోనూ సిర్పూర్ కోట ఆక్రమణలకు గురవ్వడం బాధాకరం. ఇప్పుడు ఆ భూమిలో గ్రామ పంచాయితీ, హస్పిటల్, రోడ్లు, ప్రైవేట్ వ్యక్తులు ఇళ్ళు ఉన్నాయి. కోటను భూకబ్జాదారుల నుంచి కాపాడి, రాష్ట్ర పురావస్తు శాఖ పరిరక్షణ కిందికి తేవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) – పోలేబోయి అశోక్ ఆదివాసీ చరిత్ర అధ్యయన వేదిక, సిర్పూర్ కాగజ్నగర్ -
అమ్మకానికి ఒంటరి మేడ.. ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే..
ఎక్కడో దూరంగా కొండకోనల్లో ఉన్న గ్రామంలో ఉంటున్నారా? అయినా కూడా ఏకాంతంగా ఉన్నట్టు అనిపించడం లేదా! అయితే ఈ సముద్రం మధ్యలోని బిల్డింగ్ మీకోసమే. పేరు స్పిట్బాంక్ ఫోర్ట్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. పోర్టులు, ఓడల రక్షణ కోసం ఇంగ్లండ్లో 1870ల్లో కట్టిన కొన్ని పోర్టుల్లో ఇదీ ఒకటి. ఇందులో 9 బెడ్రూమ్లు, బాత్రూమ్లు, ఓ సినిమా రూమ్, ఓ గేమ్ రూమ్, ఓ వైన్ సెల్లార్ ఉన్నాయి. బిల్డింగ్ పైన ఒక వేడి టబ్, మంట కాచుకునే గదులున్నాయి. అద్భుతమైన సముద్రం వ్యూ కనబడుతుంది. దీని వ్యాసం 50 మీటర్లు. లండన్ నుంచి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర దాదాపు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్లు. చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు! -
ఐదు శతాబ్దాల బురుజు.. అయినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు!
వైఎస్సార్ జిల్లా (పులివెందుల రూరల్): పులివెందుల మండల పరిధిలోని ఎర్రబల్లె పంచాయతీలోని నల్లగొండువారిపల్లె గ్రామంలో 5 శతాబ్దాల నాటి బురుజు నేటికి చెక్కు చెదరకుండా ఉంది. పూర్వం బ్రిటీష్ కాలంలో శత్రువులు దాడులు చేసినప్పుడు వారి నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు బురుజులు ఏర్పాటు చేశారని గ్రామస్తులు అంటున్నారు. అంతేకాక పంట ఉత్పత్తులను ఈ బురుజులలో గోప్యంగా దాచి ఉంచేవారు. ఇప్పటికి పలు గ్రామాలలో పాతకాలం నాటి బురుజులు దర్శనమిస్తున్నాయి. ఈ బురుజుల గురించి ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. చదవండి: శిథిలావస్థలో అపూర్వమైన కట్టడాలు -
Manjarabad Fort: మంజారాబాద్.. స్టార్ఫోర్ట్
ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. ఈ టూర్లో ఈ నక్షత్రకోటతోపాటు పశ్చిమ కనుమల ప్రకృతి విన్యాసాలన్నీ ఆస్వాదించవచ్చు. కర్ణాటక ఊటీ... నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ కోట కర్ణాటక, హసన్ జిల్లాలో ఉంది. ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ దిగుడుబావి ఒడ్డుకు చేరడం యువతకే సాధ్యం. ఏడాది మొత్తం ఇక్కడ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనానికి పశ్చిమ కనుమల పచ్చదనం కూడా కారణమే. సక్లేశ్పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం ఉత్సాహాన్నిస్తుంది. ఆకాశాన్నంటుతున్న పోక చెట్లు మీ ప్రయాణం కూడా ఆకాశం వైపేనని గుర్తు చేస్తాయి. యాలకుల చెట్లు వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంటే మిరియాల గుత్తులు ఒకింత ఘాటు వాసనతో ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో గొంతు గరగర అనిపిస్తే రెండు మిరియాలను నమిలితే పర్యటన ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ హిల్స్టేషన్ను ఊటీతో పోలుస్తారు. ఊటీ సంపన్నుల పర్యాటక క్షేత్రం అయితే ఇది పేదవారి పర్యాటక ప్రదేశమని చెబుతారు. మంచులో మెరిసిన నక్షత్రం... హసన్ జిల్లా కేంద్రానికి 45 కి.మీల దూరంలో మల్నాడు రీజియన్, సక్లేశ్పురా పట్టణానికి దగ్గరలో ఉన్న స్టార్ఫోర్ట్ అసలు పేరు మంజారాబాద్ కోట. మంజు అంటే కన్నడలో మంచు అని అర్థం. ఎప్పుడూ మంచు తెర కమ్మినట్లే ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇది మైసూరు పాలకుల వేసవి విడిదిగా ఉండేది. ఈ కోటలో పెద్ద ఆయుధాగారం ఉండేదని ఇప్పుడున్న ఆనవాళ్లు చెబుతుంటాయి. మైసూర్ కోట నుంచి ఈ కోటకు రహస్య మార్గం ఉండేదని స్థానిక కథనం. ఎనిమిది కోణాల నిర్మాణం ఇది. నిజానికి దీనిని ఎనిమిది రెక్కల పద్మం ఆకారం అనే చెప్పాలి. అయితే మూలలు కోసుగా కోణాకారంలో ఉండడంతో నక్షత్రకోటగా వాడుకలోకి వచ్చింది. -
ఘోరం: సెల్ఫీల కోసం టవర్పై కిక్కిరిసిన జనం, పిడుగుపాటుతో..
జైపూర్: చల్లబడిన వాతావరణం.. వానలో ‘సెల్ఫీ’ అత్యుత్సాహం ప్రాణాలు తీసింది. పిడుగుపాటుతో పదహారు మంది చనిపోగా.. డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఆదివారం సాయంత్రం ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారుల చెప్తున్నారు. ఆదివారం సాయంత్రం వాన కురుస్తుండగా అమెర్ప్యాలెస్(అమర్ ప్యాలెస్)ను సందర్శిస్తున్న వాళ్లలో కొందరు ఆనందంతో క్లాక్టవర్పైకి ఎక్కారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా టవర్పై పిడుగుపడింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఆ కంగారులో పక్కనున్న హిల్ ఫారెస్ట్లోకి కొందరు దూకేశారు. ఇప్పటిదాకా 16 మంది మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. #Rajasthan | "With the help of locals, we rescued around 29 people from the Amer Fort area after lightning struck them. They were taken to the hospital. Of these, 16 people have died," Anand Srivastava, Police Commissioner, Jaipur said yesterday Visuals from the spot. pic.twitter.com/4RJLOJ661E — ANI (@ANI) July 11, 2021 కాగా, మరో 29 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకశాం ఉందని భావిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
శత్రు సైన్యానికి కోట కట్టించి ఇచ్చారు!
అప్పుడప్పుడూ పొరపాటున సరిహద్దు దాటి శత్రుదేశాల్లోకి ప్రవేశించే ప్రజలు, సైనికుల గురించి మనం తరచూ వింటుంటాం. అయితే, ఓ దేశసైన్యం పొరపాటున తమ శత్రువుల భూభాగంలోకి వెళ్లి ఓ కోట కట్టి, చివరికి దాన్ని వారికే అప్పగించిన వైనం తెలుసా? అయితే, ఇది చదవండి. అప్పటికే అమెరికా స్వాతంత్య్రం పొందినప్పటికీ పొరుగునే ఉన్న కెనడా మాత్రం ఇంకా బ్రిటన్ అధీనంలోనే ఉండేది. దీంతో బ్రిటీష్ దళాల నుంచి మళ్లీ ముప్పు తప్పదని అనుమానించిన అమెరికా ప్రభుత్వం కెనడా వైపున ఉన్న తమ సరిహద్దులను పటిష్టం చేసుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఈశాన్యాన క్లింటన్ కౌంటీలోని న్యూయార్క్కు ఆనుకొని ఉన్న చాంప్లాన్ సరస్సు వద్ద ఓ సైనిక కోట నిర్మించడం ప్రారంభించింది. కోట దాదాపు పూర్తవుతుందనగా ఆ ప్రదేశం తమ భూభాగంలో లేనట్లు అమెరికా గుర్తించింది. అది కెనడాలో ఉన్నట్లు సర్వేలో తేలడంతో వెంటనే కోట కోసం తరలించిన తమ సామగ్రిని వెనక్కు తెచ్చుకుంది. ఆ తర్వాత కోటకు ఉపయోగించిన రాళ్లు, తదితర వాటిని స్థానికులు కొంతమేర పట్టుకుపోయారు. చివరికి దీనిని కెనడా స్వాధీనం చేసుకుంది. అమెరికా ప్రభుత్వం ఇలా అనుకోకుండా తమ శత్రువుల భూభాగంలోనే కోటను కట్టి, చివరికి దాన్ని వారికే ఇచ్చివేయడంతో ఈ కోటకు ‘ఫోర్ట్ బ్లండర్’ అని పేరు పడింది. ఆ తర్వాత కాలక్రమంలో దీనికి ఫోర్ట్ మౌంట్గోమరీ అని పేరు పెట్టినప్పటికీ ఇప్పటికీ తొలిపేరు వాడుకలోనే ఉంది. -
నెల్లూరు: ఉదయగిరి కోట
ఉదయగిరి దుర్గం... రాజరికం నుంచి ప్రజాస్వామ్యానికి జరిగిన పయనంలో ఈ దుర్గం దాటిన మైలురాళ్లు ఒకటి కాదు రెండు కాదు. గజపతుల పాలనకు ముందు విజయనగర పాలకుల స్వాధీనంలో ఉండేది. పల్లవులు, కాకతీయులు, చోళులు, గోల్కొండ, ఆర్కాటు నవాబులతోపాటు బ్రిటిష్ పాలననూ చూసింది. ప్రతి పాలకులూ ఈ దుర్గంలో తమ ఆనవాళ్లను ప్రతిష్ఠించారు. సూర్యుడి తొలికిరణాలు కొండ మీద ప్రసరిస్తాయి కాబట్టి ఉదయగిరి అనే పేరు వచ్చింది. సుదీర్ఘ యుద్ధం చోళ సంస్కృతికి ప్రతిబింబంగా రంగనాథ మండపం, పల్లవుల నిర్మాణ శైలికి ప్రతీకగా బాలకృష్ణ మందిరం, విజయనగర రాజుల నిర్మించిన పారువేట మండపం ఉన్నాయి. సూఫీ సన్యాసి చొరవతో నిర్మించిన చిన్న మసీదు, పెద్ద మసీదు, బ్రిటిష్ పాలకులు నిర్మించిన అద్దాల మహల్ ఇక్కడ దర్శనీయ స్థలాలు. ఇక కోట పటిష్ఠత గురించి చెప్పాలంటే... గజపతుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి శ్రీకృష్ణదేవరాయల సైన్యం పద్దెనిమిది నెలలు యుద్ధం చేసింది. సంజీవని కొండ ఇక్కడి అడవులు దట్టమైన చెట్లతో ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ అడవుల్లో సంజీవని వృక్షాలున్నాయని ప్రతీతి. మొలతాడు సామి అనే సన్యాసి సంజీవని వృక్షాలను అన్వేషిస్తూ అడవుల్లో తిరుగుతుండేవాడని, వనమ్మ అనే వైద్యురాలు ఇక్కడి అడవుల్లో దొరికే ఔషధాలతో రోగాలు నయం చేసేదని స్థానికంగా కొన్ని కథనాలు వ్యవహారంలో ఉన్నట్లు పోట్లూరు సుబ్రహ్మణ్యం ‘ఉదయగిరి దుర్గం కథలు’లో ఉంది. సామరస్య సు‘గంధం’ ఉదయగిరి కోట మత సామరస్యానికి వేదిక. ఏటా రబీ ఉల్ అవ్వల్ నెలలో జరిగే గంధం ఉత్సవాన్ని హిందువులు – ముస్లింలు కలిసి పండుగ చేసుకుంటారు. ఉదయగిరి కోట నెల్లూరు నగరానికి వంద కిలోమీటర్ల దూరాన ఉంది. నెల్లూరులో బస చేసి ఉదయం కారులో బయలుదేరితే రెండున్నర గంటల్లో కొండను చేరుకోవచ్చు. కొండ మీద ఉన్న దుర్గం పల్లి గ్రామం, వల్లభరాయ ఆలయం వరకు రోడ్డు ఉంది. అక్కడి నుంచి కోటను చేరడానికి ఉన్నది మెట్ల మార్గమే. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నరకు పర్యాటకులను అనుమతిస్తారు. -
కొండవీటి కోట.. ఔషధాల తోట
కొండవీటి కోట... ఈ కోటలో పర్యటిస్తే ‘కొండవీటి చాంతాడు’ అనే నానుడి గుర్తుకు వస్తుంది. పదిహేడు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ కోట. కోట ఆవరణలో ఉన్న వందల అడుగుల లోతైన బావుల్లోని నీటిని తోడడానికి చాంతాడు ఎంత పొడవు ఉండాలి? ఇక్కడ బావుల్లోని నీటి కోసం చాంతాడు పొడవే కాదు, కోట గురించి చెప్పుకుంటూ పోతే ఆ వివరాల జాబితా నిడివి కూడా అంత పొడవూ ఉంటుంది. కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, కుతుబ్షాహీలు, ఫ్రెంచ్ పాలకులు, ఆ తర్వాత ఈ ప్రదేశం బ్రిటిష్ పాలకుల అధీనంలోకి వెళ్లింది. ఒకప్పుడు రాజధానిగా వెలిగింది. ఇప్పుడు గ్రామంగా మిగిలింది. ప్రస్తుతం మంచి పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటోంది. ఔషధాల కొండ కొండవీడు గ్రామం గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలంలో ఉంది. అనపోతారెడ్డి 14వ శతాబ్దంలో రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకి మార్చి కోటను అభివృద్ధి చేశాడు. కోట చుట్టూ ఉన్న గోడ 20 కిలోమీటర్లు ఉంటుంది. పదిహేడు వందల ఎత్తులో ఉన్న ఈ గిరిదుర్గంలో ఏడాది పొడవునా నీటి లభ్యత కోసం మూడు చెరువులు, ఒక కోనేటిని తవ్వించారు. ఆధునిక యంత్రాలు లేని రోజుల్లో వర్షపు నీటిని వృథా పోనివ్వకుండా గొప్ప వాటర్మేనేజ్మెంట్ విధానాన్ని అనుసరించిన తీరు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కొండ దిగువ నుంచి కొండ మీదకు వెళ్లే ఆరు కిలోమీటర్ల దారితోపాటు కోట లోపల రెండున్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్లో నడక ప్రకృతితో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. స్వయంగా పెడలింగ్ చేస్తూ పడవలో విహరించవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి మంచి చిల్డ్రన్స్ పార్క్ కూడా సిద్ధం కానుంది. ఇటీవల వారాంతపు విడిదికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఈ ఏడాది జనవరి తొమ్మిదో తేదీన అధికారికంగా టూరిజానికి ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుంచి ఆదివారాల్లో రెండు వందలకు పైగా కార్లు, ఆరు వందలకు పైగా టూ వీలర్లు కోట మీదకు ప్రయాణిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం ‘నగరవనం’ కార్యక్రమంలో భాగంగా కోట పర్యాటకాభివృద్ధి వేగంగా జరుగుతోంది. రాశివనం, పంచవటి వంటి థీమ్ పార్కులు సిద్ధమవుతున్నాయి. ఈ కొండల్లో నాగముష్టి, తిప్పతీగ, పాషాణభేదితోపాటు లెక్కలేనన్ని ఔషధమొక్కలున్నాయి. ఈ కొండమీదున్న వందల ఏళ్ల నాటి వెదురు చెట్లకు వెదురు బియ్యం పండుతోంది. పిల్లలకు విజ్ఞానంతో కూడిన విహార ప్రదేశం ఇది. కొండలను కలిపే ద్వారం కోటలోపల నరసింహ ఆలయం, లక్ష్మీ నరసింహ ఆలయం, రెండు శివాలయాలు, గంగాధర రామేశ్వరాలయం, మసీదు, దర్గా, వేమన మండపం, నేతి కొట్టు, గుర్రపుశాలలు, భోజనశాల చూడాల్సిన ప్రదేశాలు. రాజ మందిరాన్ని బ్రిటీష్ పాలకులు బంగ్లాగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ బంగ్లాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుగా ఉపయోగిస్తోంది. ఇవన్నీ కాకుండా ఈ కోటకు రక్షణగా 23 బురుజులుండేవి, ఇప్పుడు అందులో కొన్ని శిథిలమై నామావశిష్టాలుగా మిగిలిపోయాయి. చుక్కల కొండ, జెట్టి, నెమళ్ల బురుజు, సజ్జా మహల్, మిరియాల చట్టు బురుజు వంటి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నీ ఒక ఎత్తయితే... రెండు కొండలను కలుపుతూ రెండు వందలకు పైగా వెడల్పు ఉన్న రెండతస్థుల తూర్పు ద్వారం ఆనాటి నిర్మాణ కౌశలానికి దర్పణం. నమూనా కోట ఈ కోటలో పర్యటించడానికి ముందు కొండవీడు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరాన ఫిరంగిపురం మండలంలోని హౌస్ గణేశ్ గ్రామంలో ‘రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శన శాల’ను చూస్తే బాగుంటుంది. ఈ మ్యూజియం అక్షరాలను శిల్పాలుగా, చిత్రాలుగా మలుచుకున్న ఒక గ్రంథాలయం. ఇందులో కొండవీటి కోట నమూనా ఉంది. ఆ నమూనాను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత కొండవీడు దారి పడితే కోటలో చూడాల్సిన వాటిలో దేనినీ మిస్ కాకుండా చూడగలుగుతాం. ఈ కోటకు వెళ్లే కొండ దిగువ నుంచి ధూమపానం, మద్యపానం నిషేధం అనే విషయాన్ని పర్యాటకులు మర్చిపోకూడదు. ఈ నిబంధన కచ్చితంగా అమలవుతోంది. -
పాపన్న కోటను పునరుద్ధరించాలి
సాక్షి, రఘునాథపల్లి(జనగామ): శతాబ్దాల చరిత్ర కలిగిన సర్ధార్ సర్వాయి పాపన్న కోటలోని కొంత భాగం నేలకొరగడం విచారకరమని సినీ హీరో పంజాల జైహింద్గౌడ్ అన్నారు. బహుజనుల రాజ్యాన్ని స్థాపించి వీరోచిత పోరాటంతో మొగలుల ఆగడాలను ఎదిరించిన వీరుడైన పాపన్న కోటను పునరుద్ధరించి భావితరాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్లో సర్వాయి పాపన్న కోటలోని ఓ వైపు రాతి గోడ కుప్పకూలిన నేపథ్యంలో మంగళవారం ఆయన గౌడ సంఘం నేతలతో కలిసి కోటను పరిశీలించారు. ఈ సందర్భంగా జైహింద్గౌడ్ మాట్లాడుతూ కోట పునర్నిర్మాణానికి సర్వాయి పాపన్న ట్రస్ట్ తరపున రూ.కోటి విరాళం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కోట పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ప్రభుత్వ అధికారులతో చర్చించి త్వరగా పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. అలాగే, గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని పాపన్న కోటలో నిర్మిస్తామని తెలిపారు. కోట రాతి గోడ కూలడంతో ఇళ్లు కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కుమార్గౌడ్తో పాటు పరీదుల శ్రీను, మర్కాల వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
కుప్పకూలిన సర్దార్ సర్వాయి పాపన్న కోట
సాక్షి, జనగామ: శక్తివంతమైన మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించిన సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన రాతి కోట కూలిపోయింది. గోల్కొండ సామ్రాజ్యంపై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన పాపన్న.. తన విజయయాత్ర సాగించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో నిర్మించిన కోట గురువారం నేల మట్టమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో కోటలోని ఒకవైపు భాగం కూలిపోయింది. 20 అడుగుల ఎత్తు ఉన్న కోట గోడ మొత్తం కింద పడగా మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భారీ శబ్ధం రాగా, గ్రామస్తులు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కోట పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఇటీవలే రెవెన్యూ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు. చదవండి: భారీ వర్షం.. క్షణాల్లో కుప్పకూలిన భవనం పర్యవేక్షణ లేక లోపించిన నాణ్యత ఖిలాషాపూర్ కోటను 17 మే 2017న చారిత్రక ప్రాంతంగా గుర్తించారు. టూరిజం స్పాట్గా ఎంపిక చేయడంతో పాటు కోట అభివృద్ధి కోసం రూ.4.50 కోట్ల నిధులను విడుదల చేశారు. నాలుగేళ్ల క్రితమే నిధులు విడుదలైనా పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొంతకాలానికి పనులు మొదలైనా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మమ అనిపించారు. పనులు నేటికి అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంతలోనే కోట కూలిపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. చదవండి: ఎడతెగని వాన.. వందేళ్ల రికార్డు బ్రేక్ పాపన్న చరిత్ర ఇదీ దక్కన్ పీఠ భూమిలోని గోల్కొండ రాజ్యం సిరి సంపదలతో వర్ధిల్లేది. సామ్రాజ్య విస్తరణలో భాగంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ ప్రాంతంపై కన్నేసి దండయాత్రకు పూనుకున్నాడు. ఈ క్రమంలోనే క్రీ.శ.1687 లో గోల్కొండను ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. మొఘల్ పాలన క్రీ.శ.1687 నుంచి క్రీ.శ.1724 వరకు కొనసాగింది. మొఘల్ పాలకులు నియమించుకున్న సుబేదార్ల ఆగడాలతో గోల్కొండ రాజ్యంలో అరాచకం నెలకొన్నది. ప్రజలపై దోపిడీ, దాడు లు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయి సమాజంలో అశాంతి నెలకొనడంతో ప్రజలు తీవ్ర అణచివేతకు గురయ్యారు. గౌడ కులం లో జన్మించిన పాపన్న.. పాలకులు సాగిస్తున్న విధానాలను వ్యతిరేకంగా పోరాడారు. బలహీన వర్గాలను ఏకం చేస్తే గోల్కొండను స్వాధీనం చేసుకోవచ్చనే ఆశయంతో సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చెదిరిపోతున్న ఆనవాళ్లు సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన రాతి కోట ఆనవాళ్లు కాలక్రమంలో చెదిరిపోతున్నాయి. మాజీ డీజీపీ పేర్వారం రాములు చొరవతో లండన్ మ్యూజియంలో ఉన్న పాపన్న ఫొటో ఆధారంగా ఖిలాషాపూర్ కోటను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా గ్రామంలో పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పేర్వారం రాములు కోట అభివృద్ధి కోసం కృషి చేశారు. కానీ ప్రస్తుతం పట్టించుకునే నాథుడు లేక కోట రూపం మారిపోతోంది. ఖిలాషాపూర్లోనే తొలి కోట ఈ క్రమంలోనే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో శత్రు దుర్బేధ్యంగా పూర్తిగా రాతితో ఈ కోటను నిర్మించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ 20 అడుగుల ఎత్తులో రాతికోటను నిర్మించారు. నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. కోట లోపల సొరంగ మార్గాలు సైతం ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు. మొఘల్ పాలకులపై తిరుగుబాటును ప్రకటించిన పాపన్న.. తొలికోటను ఖిలాషాపూర్లోనే నిర్మించినట్లుగా చరిత్రకారుల అభిప్రాయం. ఔరంగజేబు మరణం తర్వాత బలహీనపడిన మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి పలు కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఖిలాషాపూర్ కోట కేంద్రంగా వరంగల్, భువనగిరి, చివరికి గోల్కొండను సైతం వశపర్చుకున్నారు. -
కూలుతున్న శకలం.. మనసు వికలం
నిర్మల్: నిమ్మల.. పేరులోనే నిర్మలత్వాన్ని.. నిమ్మలమైన తత్వాన్ని నింపుకున్న ఈ ఊరిలోనూ ఎన్నో విశేషాలున్నాయి. ఎక్కడో భద్రాద్రి రామయ్య దగ్గరి నుంచి గోదారమ్మ వెంట వెనక్కి వచ్చిన దళవాయి నిమ్మల నాయుడు ఇక్కడి ప్రకృతికి పరవశుడయ్యాడు. స్థల విశేషతను గుర్తించి ఇక్కడే స్థిరపడ్డాడు. అలా.. ప్రస్తుత కస్బా ప్రాంతంలో 12 ఇండ్లతో మొదలైన ఊరికి తన పేరే పెట్టాడు. ఊరి చుట్టూ చెరువులను తవ్వించాడు. కోటలు కట్టించాడు. అనంతర పాలకులూ అదేరీతిలో అభివృద్ధి పరిచారు. కాకతీయులను తలపించేలా పాలన సాగించారు. ఆనాటి నిమ్మల రాజ్యమే తరాలు మారి.. నేడు నిర్మల్గా ఎదిగింది. నాడు రాజులు ఏలిన ఈ గడ్డపై నుంచి ఢిల్లీదాకా ఎదిగిన బిడ్డలూ ఉన్నారు. కాలగమనంలో దశాబ్ధాలు గిర్రున తిరిగిపోయినట్లే.. గతవైభవపు స్మృతులు ఒక్కొక్కటీ పోతున్నాయి. నాటి నిమ్మల రాజ్యపు ఆనవాళ్లు నేటి నిర్మల్లో కనుమరుగవుతున్నాయి. ఇన్నాళ్లు ఠీవీగా దర్పాన్ని చాటిన కోటలు.. వాటి గోడలు కూలిపోతున్నాయి. ఇప్పటికే చెరువులు సగం కబ్జాకోరల్లో చిక్కుకుపోగా, ఇప్పుడు చారిత్రక గుర్తులు సైతం శకలాలుగా పడిపోతూ.. నిమ్మలవాసుల మనసులను వికలం చేస్తున్నాయి. పట్టించుకునే అధికారులు.. పాలకులు లేక ఘన చరిత్ర శిథిలదశకు చేరుతోంది. కూలుతున్న శ్యాంగఢ్ ప్రధానద్వారం నిమ్మల..ఓ మినీ ఓరుగల్లు ఓరుగల్లును కాకతీయులు పకడ్బందీగా కట్టినట్లే.. నిమ్మలను పాలకులు నిర్మించారు. పట్టణం చుట్టూ సహజసిద్ధంగా ఉన్న గుట్టలు, అడవులను రక్షణ కవచాలుగా మలిచారు. వాటిని ఆధారంగా చేసుకుంటూ పట్టణం చుట్టూ గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. ఈ చెరువులను పట్టుకుని ఊరి చుట్టూ చైనాగోడను తలపించేలా ఇటుకలతో ప్రహరీగోడను కట్టించారు. గోడకు ముందు లోతైన కందకాన్ని తవ్వించారు. వాటిలో నిండుగా నీళ్లు.. అందులో మొసళ్లు ఉండేవట. చుట్టూ ఉన్న గోడ మధ్యలో అక్కడక్కడ ఎత్తైన బురుజులు నిర్మించారు. వాటిపై ఆయుధ సంపత్తి ఉంచేలా ఏర్పాటు చేశారు. ఇక ఊరిమధ్యలో గల గుట్టపై ఖిల్లా(కోట) కట్టించారు. నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మల్లో కోటలు, బురుజులు, రాజభవనాలు కళకళలాడేవి. ఇప్పుడవన్నీ శిథిలమై పోయాయి. పట్టించుకునే నాథుడు లేక పలు కోటలు, బురుజులను నేలమట్టం చేసి వాటి ఇటుకలతోనే ఇళ్లు కట్టుకున్నారు. గఢ్.. గఢ్కో చరిత్ర నిర్మల్ అంటే కోటలు, గఢ్లకు ప్రసిద్ధి. అందులో ఒక్కోగఢ్కు ఒక్కో చరిత్ర ఉంది. పట్టణానికి తూర్పున ఎత్తైనగుట్టపై నిలువెత్తుగా ఉన్న బత్తీస్గఢ్ ఆరోజుల్లో శత్రువుల గుండెలను దడదడలాడించింది. హిందీలో బత్తీస్ అంటే 32. ఈ గఢ్లో ఒకదానికొకటి ఆనుకుని 32గదులు నిర్మించారు. దీంతో దీనికి బత్తీస్గఢ్ అనే పేరొచ్చింది. శ్రీనివాసరావు కాలంలో ఫ్రెంచ్ ఇంజినీర్ల సలహాలతో మట్టికోటగా ఉన్న బత్తీస్గఢ్ను డంగుసున్నం, ఇటుక, రాయితో బలమైన కోటగా మార్చారు. ఎతైన బురుజును నిర్మించి దానిపై ఫిరంగులను అమర్చారు. ఈ గఢ్లోనే మందుగుండు, ఆయుధాలు తయారు చేసేవారికి వసతి కల్పించారు. దక్షిణ భారతదేశంలో అప్పట్లో ఆయుధ కర్మాగారంగా నిర్మల్కు పేరుంది. శ్రీనివాస్రావు తన పాలనకాలంలోనే ఎక్కువ గఢ్లను నిర్మించాడు. పట్టణానికి దక్షిణం వైపు సైన్యాన్ని ఉంచేందుకు విశాలమైన శ్యాంగఢ్ను నిర్మించారు. అప్పటి తన అశ్వసైన్యాధిపతి పేరుమీదుగా దీనికి శ్యాంగఢ్గా పేరుపెట్టినట్లు చెబుతారు. బంగల్పేట్, వెంకటాద్రిపేట్లలో కూలిపోతున్న ప్రహరీ పట్టణంలోకి ఎవరు రావాలన్నా ఈ గఢ్ను దాటుకునే రావాల్సి ఉంటుంది. దీనికి ఓ వైపు కంచెరోని చెరువు ఉంది. చెరువుకు, గఢ్కు మధ్యలో నుంచే ప్రస్తుత 44వ నం. జాతీయరహదారి వెళ్తోంది. బంగల్పేట్ శివారులో ధం–ధంగఢ్, వెంకటాద్రిపేట్లో మరోగఢ్, బత్తీస్గఢ్ పక్కనే వేంకటేశ్వర(ఏకశిలా)గఢ్, సోన్ సమీపంలో సోన్గఢ్, చిట్యాలలో చిట్టీగఢ్లను నిర్మించారు. నిర్మల్, చుట్టుపక్కల కలిపి మొత్తం 64గఢ్లను ఫ్రెంచ్ ఇంజినీర్ల సాయంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతీగఢ్పైన ఫిరంగులు, మందుగుండు సామగ్రి ఉండేవి. ఫిరంగులు పేలిస్తే వచ్చే వేడిని సైనికులు తట్టుకోవడానికి వాటిపక్కనే, వారు కూర్చునేందుకు నీటితొట్టిలను నిర్మించారు. ఈగఢ్ల మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒకదాని నుంచి మరోదానికి సొరంగమార్గం ఉండటం. మంటలు వేసి తెలిపేవారు ఈగఢ్లను ఎత్తైన గుట్టలపై నిలువెత్తుగా నిర్మించడానికీ కారణం ఉంది. వీటిపై నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు వీక్షించవచ్చు. సెల్ఫోన్లు, వైర్లెస్లు లేనటువంటి ఆరోజుల్లో సహజసిద్ధమైన సాంకేతికతను ఉపయోగించేవారు. పట్టణంపైకి దక్షిణం వైపు నుంచి శత్రువులు దాడికి వస్తుంటే మొదట సోన్గఢ్పై సైనికులు గుర్తించేవారు. వెంటనే అగ్గిరాజేసి మంటలు పెట్టేవారు. 10కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యాంగఢ్పై ఉన్న సైనికులు గమనించి వారు కూడా మంట రాజేసేవారు. ఈ మంటల పొగలు తూర్పు వైపున ఉన్న బత్తీస్గఢ్పై సైనికులు గుర్తించి వారు కూడా మంటలు పెట్టేవారు. ఈమంటలు నేరుగా పట్టణం మధ్యలో ఖిల్లాగుట్టపై ఉన్న రాజభవనానికి కనిపిస్తాయి. సైన్యాధికారులు, పాలకులు ఆ మంటలను గమనించి తమకు ఏదో ఆపద రాబోతుందని అప్రమత్తమై శత్రువులను ఎదుర్కొనేవారు. బంగల్ చెరువు వద్ద సీమోల్లంఘన ద్వారం పక్కాగా పట్టణ నిర్మాణం నిమ్మల ప్రాంతాన్ని పాలించిన నిమ్మలనాయుడు, కుంటి వెంకట్రాయుడు, శ్రీనివాసరావు, తదితరులు ఇక్కడి ప్రజలకు చక్కటి పాలన అందించారనడానికి ఊరిచుట్టూ నిర్మించిన గొలుసుకట్టు చెరువులే నిదర్శనం. ఊరి చుట్టూ ప్రహరీగోడతో పాటు పొలిమేరల్లో పట్టణంలోనికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా బురుజులు నిర్మించారు. ఈ బురుజులకు బలమైన పొడవాటి గొలుసులు ఉండేవి. రాత్రిపూట ఇరువైపులా ఉన్న గొలుసులతో మార్గాలను మూసి వేసేవారు. కొన్నేళ్ల క్రితం వరకూ పట్టణంలో చైన్గేట్ వద్ద ఈ బురుజులు, గొలుసులు ఉండేవి. వీటిæ కారణంగా దీనికి చైన్గేట్ అనే పేరొచ్చింది. బంగల్పేట్ శివారులోనూ రోడ్డుకిరువైపులా బురుజులు ఉన్నాయి. బురుజులు, గోడచుట్టూ ఉన్న కందకంలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ప్రజల అవసరాలను తీర్చేది. కాలక్రమంలో ఈ కందకాన్ని స్వర్ణప్రాజెక్టు జౌళినాలాగా మార్చారు. ప్రస్తుతం ఇది ఓ పెద్ద మురికికాలువగా మారింది. బంగల్పేట్ శివారులో బురుజులు గత వైభవమేనా.. గోల్కొండ, వరంగల్ వంటి చారిత్రక కోటలకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మల్ కోటలను నాటి పాలకులు నిర్మించినా నేటి పాలకుల పట్టింపులేనితనంతో వెలుగులోకి రాలేదు. ఇప్పటికే చాలా కోటలు, బురుజులు ఆక్రమణలకు గురయ్యాయి. చాలావరకు దెబ్బతింటున్నాయి. పర్యాటకప్రాంతంగా శ్యాంగఢ్ను అభివృద్ధి చేస్తామని ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక్కడ నిర్మించిన హరిత హోటల్ ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరింది. బత్తీస్గఢ్ చుట్టూ గుట్టలపై ఉన్న క్వారీల పేలుళ్ల ధాటికి గఢ్ గోడలు బీటలు వారాయి. రోడ్డు వెడల్పులో చైన్గేట్ను నామరూపాల్లేకుండా కూల్చేశారు. దృష్టి పెట్టేనా... నిర్మల్ జిల్లాకు చారిత్రక ప్రాంతంగా.. రాజకీయకేంద్రంగా పేరున్నా.. పర్యాటక అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. చారిత్రక కట్టడాలతో పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు పుష్కలమైన అవకాశాలున్నా పట్టించుకునే నాథుడు లేడు. వినాయకుల నిమజ్జనం కోసం బంగల్చెరువు వద్ద గల సీమోల్లంఘన ద్వారాలను కూల్చేశారు. కొత్తగా అభివృద్ధి చేయకున్నా చరిత్రకు గుర్తుగా మిగిలిన కట్టడాలను మాత్రం కాపాడాలంటూ జిల్లావాసులు మొరపెట్టుకుంటున్నారు. -
వీధికెక్కిన ‘కామినేని’ ఆస్తుల తగాదా
శతాబ్దాల చరిత్ర గల దోమకొండ కోటలోని భవనాల విషయంలో వారసుల మధ్య వివాదం ముదురుతోంది. గడీకోటలోని భవనాలు తమవంటూ మూడు కుటుంబాలకు చెందిన వారు తాళాలు వేయగా.. మరో వారసుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వేసిన తాళాలను తొలగించారంటూ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. దీనిపైనా కేసు నమోదైంది. సాక్షి, కామారెడ్డి: దోమకొండ సంస్థాన వారసుల మధ్య ఆస్తుల కొట్లాట ముదురుతోంది. దోమకొండ కోట కేంద్రంగా కామినేని వంశీయులు శతాబ్దాల పాటు పాలించారు. సంస్థానాల రద్దు అనంతరం దోమకొండ కోట ఎవరిది అన్న విషయం ఎప్పుడూ చర్చకు రాలేదు. 2013లో సినీ నటుడు రాంచరణ్ తేజ పెళ్లితో కోట వివాదం వెలుగులోకి వచ్చింది. అనిల్ కామినేని కుమార్తె ఉపాసనకు రాంచరణ్తో పెళ్లి కుదరడం, అప్పట్లో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉండడంతో కోటలో కదలికలు మొదలయ్యాయి. ఒక దశలో గడీని రాంచరణ్ సొంతం చేసుకున్నాడన్న ప్రచారం జరిగింది. పెళ్లికి ముందు కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించారు. అప్పుడు కోటలో కొన్ని భవనాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ప్రస్తుతం కోట వ్యవహారాలు అనిల్ కామినేని చూస్తున్నారు. ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఆధీనంలోకి కోట వెళ్లింది. దీంతో సామాన్య ప్రజలకు కోట సందర్శన అవకాశం లేకుండా పోయింది. గొడవ మొదలైందిలా..... కోట పూర్తిగా అనిల్ కామినేని వశమైందన్న ప్రచారం జోరుగా సాగడంతో ఇతర వారసులైన రాజేశ్వర్రావ్, సత్యనారాయణరావ్, రాజేశ్వర్భూపాల్, లావణ్య కుటుంబాలకు చెందిన వారు స్థానిక కలెక్టర్కు ఆస్తుల విషయంలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి రాములును విచారణ అధికారిగా నియమించారు. పంచాయతీ అధికారులు విచారణ జరిపినా వివాదం తేలలేదు. దీంతో ఈ నెల 9న ఆయా కుటుంబాలకు చెందిన వారు కోటలోకి ప్రవేశించి భవనాలకు తాళాలు వేశారు. ఇవి తమ ఆస్తులని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అనిల్ కామినేని మనుషులు పోలీసులను ఆశ్రయించారు. కోటలోకి అక్రమంగా చొరబడి భవనాలకు తాళాలు వేశారని ఫిర్యా దులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు తాళాలు వేసినవారిపై కేసు నమోదు చేశారు. ఇంతటితో ఆగకుండా భవనాలకు వేసిన తాళాలను తొలగించారు. విషయం తెలిసిన సత్యనారాయణరావ్, రాజేశ్వర్భూపాల్, లావణ్యలు తమ ఇళ్లకు వేసుకున్న తాళాలను అనిల్ కామినేని మనుషులు తొలగించారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాశంగా మారింది. ఫిర్యాదు నమోదు.. దోమకొండ: కోటలో తమ ఆస్తులకు సంబంధించిన భవనాలకు తాళాలు వేసి ఫ్లెక్సీలు కట్టగా.. కామినేని అనిల్కుమార్ మనుషులు వాటిని తొలగించారని కోట వారసులుగా చెప్పుకుంటున్న కామినేని సత్యనారాయణ, కామినేని రాజేశ్వర్భూపాల్, లావణ్యలు బుధవారం దోమకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఎస్సై నరేందర్ తెలిపారు. అద్దాలమేడ, అస్గర్మంజిల్, ఉమా మంజిల్ భవనాలకు ఈనెల 8వ తేదీన తాళాలు వేశామని, ఈనెల 12వ తేదీన కామినేని అనిల్ మనుషులు వాటిని తొలగించి, ఫ్లెక్సీలను తీసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. వారి ఫిర్యాదు మేరకు అనిల్ కామినేని మనుషులపై కేసు నమోదు చేశామన్నారు. -
ఒక కోట వంద ప్రశ్నలు
-
పట్టు వీడని ప్రభుత్వం
కర్నూలు ,తుగ్గలి: మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో చేపట్టిన తవ్వకాలపై అధికారులు పట్టువీడ లేదు. 21 రోజులుగా పెద్ద పెద్ద బండరాళ్ల కింద, కోట బురుజులో తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికీ కావిటీ స్కానర్లు, రెసెస్టివిటీ మీటరుతో సర్వే చేయించడంతో పాటు జీఎస్ఐ డైరెక్టర్ మోహన్ కుల్ బృందం కూడా కోటను పరిశీలించింది. కోటలో నిధిని తీసేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు స్వామీజీలు, పురోహితులతో ప్రత్యేక పూజలు, సర్వేలూ కొనసాగుతున్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, తహసీల్దార్ గోపాలరావు, వీఆర్ఓ కాశీరంగస్వామి, పోలీసుల పర్యవేక్షణలో తవ్వకాలు జరుగుతున్నాయి. కోటలో సర్వే నిర్వహించేందుకు అత్యాధునిక పరికరాలు వస్తాయని చెబుతున్నా రోజురోజుకు ఆలస్యం జరుగుతోంది. రెండు రోజుల్లో పరికరాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కోటలో ఏముందో తెలియదు కాని గుప్త నిధుల కోసం పురాతన కోటను తవ్వేస్తున్నారన్న విమర్శలు మాత్రం అధికమయ్యాయి. -
భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు
భువనగిరి టౌన్ : అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఖిలాపై కట్టడాలు, నిర్మాణాలు, శిల్పకళను వారు పరిశీలించారు. భారతీయ కళానైపుణ్యం అద్భుతంగా ఉందని, చారిత్రక కట్టడాల్లో భువనగిరి ఖిలా ఒకటిగా ఉందన్నారు. -
పర్యాటకులతో ఖిల్లా కిటకిట!
ఇబ్రహీంపట్నం : ప్రపం^è పర్యాటకుల దినోత్సవం సందర్భంగా కొండపల్లి ఖిల్లా మంగళవారం కిటకిటలాడింది. సాధారణ పర్యాటకులతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వివిధ పాఠశాలలకు చెందిన మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులు ఖిల్లాను సందర్శించారు. దీంతో ఖిల్లాపై సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు రాణిమహాల్లో ఉన్న ఎగ్జిబిషన్ను తిలకించారు. పురాతన కట్టడాలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. పురాతన సంపద వివరాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర పురావస్తు శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ పురాతన కాలం నాటి శిల్ప సంపద విశేషాలను మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులు తెలుసుకునేందుకు ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం నూతన శోభను సంతరించుకోనుందని చెప్పారు. ఈ పర్యటనలో మడోన్నా హైస్కూల్, మానసిక వికాస కేంద్రం, చేయూత పాఠశాల, విజయమేరి ఇంటిగ్రేటెడ్ బ్లైండ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ సృజన, పురావస్తు శాఖ డీఈ కోటేశ్వరరావు, ఈఈ ఉమామహేశ్వరరావు, ఏడీ దీపక్, మానసిక వికాస కేంద్రం అధ్యక్షురాలు పాలడుగు పార్వతీదేవి, సూపర్వైజర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రోప్ వే కోసం స్థల పరిశీలన
భువనగిరి టౌన్ : భువనగిరి ఖిలా అభివృద్ధిలో భాగంగా ఖిలాపైకి రోప్వే ఏర్పాటు చేసేందుకు కోల్కతాకు చెందిన కంపెనీ ప్రతినిధులు రామకృష్ణ, మనోజ్లు స్వోరం స్థలాన్ని పరిశీలించారు. రోప్ వే కోసం బైపాస్ సమీపంలో ఉన్న 2.30 ఎకరాల భూమి పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఇక్కడి నుంచి ఖిలాపైకి రోప్ వే ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రోప్ వే కోసం వ్యయంతో పాటు, పూర్తి వివరాలను అధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వారి వెంట సోమ శేఖర్రెడ్డి ఉన్నారు. -
భువనగిరి ఖిలాపై రాక్క్లైంబింగ్
భువనగిరి: సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మంగళవారం భువనగిరి ఖిలాపై రాక్కైంబింగ్ శిక్షణ ఇచ్చారు. కోచ్ శేఖర్బాబు ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అధికారి ఎం.రమేష్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పాఠశాలకు ఇద్దరి చొప్పున ఎంపిక చేసినట్లు తెలిపారు. 23వ తేదీ వరకు ఖిలాపై విద్యార్థులు బేసిక్ ఫిట్నెస్ లెవల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం మెరుగైన గ్రేడ్ సాధించిన వారిని పర్వతారోహణకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ వీర్యానాయక్ ఉన్నారు. -
ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు రాక్ క్లైంబింగ్ శిక్షణను ఆదివారం భువనగిరిలో ప్రారంభించారు. ఈ శిక్షణలో వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీనగర్ జిల్లాలకు చెందిన 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కోచ్ శేఖర్బాబు ఆధ్వర్యంలో ప్రాధమిక అవగాహన కలిపంచి రాక్ క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. -
ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు రాక్ క్లైంబింగ్ శిక్షణను ఆదివారం భువనగిరిలో ప్రారంభించారు. ఈ శిక్షణలో వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీనగర్ జిల్లాలకు చెందిన 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కోచ్ శేఖర్బాబు ఆధ్వర్యంలో ప్రాధమిక అవగాహన కలిపంచి రాక్ క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. -
భువనగిరి ఖిలాపై రాక్క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్ : సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం భువనగిరి ఖిల్లాపై రాక్క్లైౖంబింగ్ శిక్షణ ఇచ్చారు. కోచ్ బి. శేఖర్బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్జిల్లాలోని 46 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. -
కోటకు బీటలు
శిథిలావస్థల్లో కట్టడం వందల ఏళ్లనాటి కట్టడంపై నిర్లక్ష్యం పట్టించుకోని అధికారులు కట్టడాలు కాపాడాలని స్థానికుల విన్నపాలు పెద్దశంకరంపేట: వందల ఏళ్ల నాటి చరిత్రకు నిదర్శనంగా నిలిచిన అపురూప చారిత్రక కట్టడాలు బీటలు వారుతున్నాయి. తరతరాల చరిత్రకు సాక్షాలుగా మిగిలే కట్టడాలను కాపాడి రేపటి తరాలకు చూపాల్సిందిపోయి అధికారుల, పాలకుల, పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చారిత్రక కట్టడంపై మొక్కలు పెరిగి కూలడానికి సిద్ధమయ్యాయి. పెద్దశంకరంపేట గ్రామంలో ఉన్న 40 అడుగుల ఎత్తుగల కోటను 1764లో రాణి శంకరమ్మ కట్టించినట్లు ఆధారాలున్నాయి. నిజాం పరిపాలనలో అతిపెద్ద సంస్థానాలుగా ఉన్న పెద్దశంకరంపేట, పాపన్నపేటలను రాజధానిగా చేసుకొని శంకరమ్మ వారి వారసులు 12 తరాల పాటు ఈ కోటనుంచే పాలించినట్లు గత చరిత్ర తెలుపుతోంది. అప్పటి కళావైభవానికి ప్రతీకగా నిలిచే ఈ కోటను చతురస్రాకారంలో, నాలుగు బురుజులతో నిర్మించారు. దీనిలో గుర్రపు శాలలు, ఎనుగు శాలలు ఉన్నాయి. వీటితో పాటు కోటలో ఉన్న సొరంగం ఒకటి గురుపాదగుట్టకు, గ్రామ శివారుకు దారితీస్తోందని పూర్వీకులు చెబుతుంటారు. రాణి శంకరమ్మ పేరు మీదుగా పేటకు శంకరంపేట అనే పేరొచ్చింది. ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాలతో పాటు పేటకు వచ్చిన ప్రతీ కొత్త వారు ఈ కోటను సందర్శిస్తుంటారు. ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ కోటపై రావిచెట్లు, మర్రిచెట్లు మొలవడంతో ఈ కోట బీటలు వారుతోంది. దీంతో కూలేందుకు సిధ్దంగా ఉంది. ఇప్పటికి ఎంతో విలువైన సంపద కోట, సొరంగంలో నిక్షిప్తమై ఉందని స్థానికులు చెబుతుంటారు. అలాంటి ఈ కోటను పురావస్తు శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోక పోవడం పేట ప్రజలను మనోవేదనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి చారిత్రక కట్టడాలను సంరక్షించాలని వారు కోరుతున్నారు.