

ప్రపంచంలోనే అతిపెద్ద కోట

ఈ కోట పాకిస్తాన్లోని సింద్ ప్రావిన్స్లో ఉంది. దీని పేరు రాణికోట.

17 వ శతాబ్దంలో సింద్ ప్రాంతాన్ని పరిపాలించిన తాల్పూర్ వంశ పాలకులు ఈ కోటను జమ్షోరో జిల్లా సన్ టౌన్లో నిర్మించారు.

ఈ కోట గోడ చుట్టుకొలత ఏకంగా 32 కిలోమీటర్లు

తాల్పూర్ రాజవంశ పాలకులు 1812లో కోటను బలోపేతం చేసేందుకు పునర్నిర్మించారు. అప్పట్లో వారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

కోట గోడ చుట్టూ బురుజులు నిర్మించారు. వీటిలో మూడు టవర్లు చంద్రవంక ఆకారంలో నిర్మించబడ్డాయి.

19వ శతాబ్దంలో బ్రిటిష్ బలగాలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాయి.

పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత దీని పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించింది.

యూనెస్కో 1993లో దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.






