Foreigner
-
రుచుల రివ్యూ.. సిటీకి క్యూ
విభిన్నమైన ఆహార పదార్థాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్... ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను చారిత్రక విశేషాల ద్వారా మాత్రమే కాకుండా చవులూరించే ఘుమఘమల ద్వారా కూడా ఆకర్షిస్తోంది. అలా వచ్చి వెళ్లేవారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న అనుభవాలు పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. సిటీ రుచులకు సంబంధించి ఉన్న అభిప్రాయాలపై చర్చోపచర్చలకు దారి తీస్తున్నాయి. నగరానికి ఉన్న గొప్ప వంటల వారసత్వం పుణ్యమాని.. మొఘలాయ్, తెలుగు హైదరాబాదీ రుచులను మిళితం చేసిన సిటీ ఫుడ్ వెరైటీ రుచులను ఇష్టపడే ఎవరికైనా ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. బిర్యానీల నుంచి ఇరానీ చాయ్ వరకు, బిస్కెట్ల నుంచి డబుల్ కా మీఠా వరకూ.. ఆహార ప్రియులకు హైదరాబాద్ స్వర్గధామం. ఈ నేపథ్యంలో నగరాన్ని సందర్శించే చాలా మంది విదేశీ సందర్శకులు సిటీ ఫుడ్ని ఎంజాయ్ చేయడం సోషల్ మీడియాలో స్పందనను పంచుకోవడం కూడా పరిపాటిగా మారింది. స్కాట్లాండ్ సే ఆయే మేరా దోస్త్.. సాధారణంగా నగరాన్ని సందర్శించే విదేశీయులు మన రుచుల్ని పొగుడుతూనో, లేదా అరుదుగా బాగోలేదు అనో ఒక్క ముక్కలో తేల్చేస్తారు. అయితే తాజాగా ఒక (స్కాట్లాండ్) స్కాటిష్ ట్రావెలర్ మాత్రం భిన్నంగా స్పందించి సోషల్ మీడియాలో తన పోస్ట్ల ద్వారా సిటీ ఫుడీస్ని ఆకర్షించాడు. స్కాటిష్ అయిన హ్యూ అబ్రాడ్ అనే విదేశీయుడు నగరాన్ని సందర్శించాడు. నగర ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ప్రసిద్ధ వంటకాలు రుచి చూశాడు. అనంతరం వీటిని అందిస్తున్న హోటల్స్ రెస్టారెంట్స్పై తనదైన రీతిలో వీడియో పోస్టులు చేశాడు. అయితే ఇవి ఏదో యథాలాపంగా చేసినట్టు కాకుండా ఈ పోస్టులు చాలా వరకూ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రేటింగ్స్ సైతం.. హ్యూ అబ్రాడ్ తన వీడియోలలో హోటల్ షాదాబ్లో అందించే ప్రసిద్ధ హైదరాబాదీ బిర్యానీని తాను రుచి చూసినట్లు తెలిపాడు. ఆ రుచి అమోఘం అంటూ మెచ్చుకుని షాదాబ్ బిర్యానీకి 10/10 రేటింగ్ ఇచ్చాడు. అదే సమయంలో అనేక మంది ఇష్టంగా తినే నిమ్రా కేఫ్లోనిఉస్మానియా బిస్కెట్ రుచిని మాత్రం తీసిపారేశాడు. అదొక ‘డ్రై’గా అతను పోస్ట్లో పేర్కొన్నాడు. అలాగే షహ్రాన్ హోటల్ కబాబ్ల కోసం మొజాంజాహీ మార్కెట్ను సందర్శించాడు. అక్కడి బోటీ, కబాబ్ రుచికరమైందిగా అంటూనే.. అందులో ఒక కబాబ్ ముక్కలో వైర్ను కనుగొనడంతో తానిచ్చే రేటింగ్ నుంచి ఒక పాయింట్ తగ్గించాడు. అదేవిధంగా మొజాంజాహీ మార్కెట్లోని ఒక దుకాణంలో పిస్తా ఐస్క్రీమ్ను కూడా టేస్ట్ చేసి ‘నేను ఇప్పటి వరకు రుచి చూసిన వాటిలో అత్యంత నకిలీ పిస్తా’ ఇది అంటూ విమర్శించాడు. రుచి అతి కృత్రిమంగా ఉందని దానికి 3/10 రేటింగ్ ఇచ్చాడు. ఇంకా ఇరానీ చాయ్, బిస్కెట్లు, బుర్హాన్పూర్ ఖోవా జిలేబి, మిలన్ జ్యూస్ సెంటర్లోని షెహదూద్ మలై ఇంకా ఇతర స్ట్రీట్ ఫుడ్స్పై కూడా ఇలాగే రివ్యూలను, రేటింగ్స్ను రివ్యూ అందించాడు. లైక్స్.. కామెంట్స్.. స్కాట్లాండ్వాసి హ్యూ అబ్రాడ్ పోస్టులకు నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది. అనేక మంది ఈ వీడియోలను లైక్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియోల శ్రేణి హైదరాబాదీల మధ్య పరస్పరం చర్చకు సైతం దారి తీసింది. చాలామంది స్థానికులు ఆ పోస్టుల్లో నిజాయితీ ఉందని ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం అతను నగరంలోని మరింత ఉత్తమమైన, మరింత ప్రమాణాలు పాటించే ఆహార కేంద్రాలను సందర్శించలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు సిటీ వంటకాల నిజమైన సారాన్ని అందించే మరికొన్ని వంటలు, వాటి చిరునామాలను సూచించారు. అంతేకాదు స్థానిక భాషలో విక్రేతలతో ఎలా సంభాíÙంచాలనే దానిపై చిట్కాలను కూడా అతడికి అందించారు. ఏదేమైనా మన రుచులపై విదేశీయుల అభిప్రాయాలకు దక్కుతున్న స్పందనకు స్కాటిష్ టూరిస్ట్ పోస్టులు అద్దం పట్టాయని చెప్పొచ్చు. -
ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే
ఖాట్మాండు: అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని పర్వతారోహకులు కలలుగంటుంటారు. అలాంటి వారికి నేపాల్ ప్రభుత్వం ఒక చేదువార్త వినిపించింది. ఇకపై ఎవరెస్ట్ శిఖర అధిరోహణ అత్యంత ఖరీదైనదిగా మారబోతోంది.ఎవరెస్ట్ను అధిరోహించడానికి విదేశీయులు ఇకపై దాదాపు 21 లక్షల రూపాయలు, అంటే ఐదు లక్షల నేపాలీ రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో విదేశీయులు ఇందుకోసం రూ. 15,17,780 రుసుము చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు దానిని రూ. 20,69,676కి పెంచారు.నేపాల్ ప్రభుత్వం పర్వతారోహణ మాన్యువల్ను ఆరోసారి సవరించింది. ఇటీవల జరిగిన నేపాలీ క్యాబినెట్ సమావేశంలో పర్వతారోహణ నియమాలను సవరిస్తూ, అధిరోహణ రుసుమును పెంచింది. ఈ కొత్త నియమం 2025, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ్ రెగ్మి మీడియాకు తెలిపారు. ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల కారణంగా చెత్త పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త సవరణల ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులకు బీమా, ఇతర నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం పర్వతారోహణ గైడ్లు, ఎత్తయిన ప్రదేశాలలో పనిచేసే కార్మికులు, సామాను క్యారియర్లకు రోజువారీ భత్యం, బీమా రేట్లు పెంచారు. నూతన రికార్డులు సృష్టించే లక్ష్యంతో ఎవరెస్ట్ ఎక్కే అధిరోహకులు తమ పూర్తి వివరాలను సంబంధిత ప్రభుత్వశాఖకు సమర్పించాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ తొలి వారం రివ్యూ.. అమెరికాలో ఏం మారింది? -
భారతీయ సంస్కృతిపై విదేశీయుల ఆసక్తి
సాక్షి, పుట్టపర్తి (శ్రీసత్యసాయి జిల్లా): దేశ, విదేశాల నుంచి వచ్చిన మహిళలు భారతీయ సంస్కృతిపై ఇష్టం పెంచుకున్నారు. చీర, పంచెకట్టులో దర్శనిమిచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడి విధానాలను పరిచయం చేయడమే కాకుండా.. స్థానిక అలవాట్లను వంటబట్టించుకున్నారు. సత్యసాయిబాబా నడయాడిన పుట్టపర్తికి పలు దేశాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. తెలుగోడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి సత్యసాయి తీసుకెళ్లారని చెబుతున్నారు. అంతేకాకుండా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు మరువలేనివని కొనియాడుతున్నారు. ఓసారి పుట్టపర్తికి వస్తే.. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్ని సమస్యలతో వచ్చినా.. మందిరంలో అడుగు పెట్టాక ప్రశాంతత వస్తుందని పేర్కొంటున్నారు. శనివారం శ్రీసత్యసాయి 99వ జయంతి సందర్భంగా విదేశీయులతో ‘సాక్షి’ మాటామంతీ.. ప్రశాంతతకు మారుపేరు పుట్టపర్తికి చాలా ఏళ్ల నుంచి వస్తున్నా. వచ్చిన ప్రతిసారీ నెల రోజులు ఉంటా. ఫుడ్ బాగా నచ్చింది. తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. చీరకట్టు చాలా నచ్చింది. సత్యసాయి కోట్ల మంది గుండెల్లో కొలువై ఉన్నారు. – మెరియిల్లె, ఫ్రాన్స్మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది పుట్టపర్తి గురించి చాలా ఏళ్లుగా వింటున్నా. తొలిసారి 15 రోజుల క్రితం వచ్చా. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. ఒక వ్యక్తి ఇంతమందికి ఓ శక్తిలా మారి.. ఒక ఊరిని తయారు చేశారంటే మామూలు విషయం కాదు. – ఒట్టావి, ఫ్రాన్స్ సంప్రదాయాలు బాగున్నాయి తెలుగు సంప్రదాయం నచ్చిoది. చీరకట్టుకోవడం, తెలుగు వంటకాలు నేర్చుకున్నా. సెంట్రల్ ట్రస్టు సేవలు చాలా బాగున్నాయి. విద్య, వైద్యంపై భగవాన్ శ్రీసత్యసాయి సేవలను చరిత్ర మరువదు. – డానేలా, ఇటలీసాయిబాబా వ్యక్తి కాదు.. శక్తి 1980 నుంచి పుట్టపర్తికి వస్తున్నా. సాయిబాబా ఓ వ్యక్తి కాదు.. ఆయన ఓ శక్తి. ఇక్కడ చాలామంది పరిచయమయ్యారు. సొంత బంధువుల్లా ఆదరిస్తారు. తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకున్నా. – లిండా, లండన్ సాయిబాబానే బతికించారు ఇక్కడకు చాలాసార్లు వచ్చాను. నేను మూడుసార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యా. బాబానే బతికించాడని నమ్ముతున్నా. ఏటా బాబా జయంతి వేడుకలు మిస్ కాకుండా వస్తా. దోశ అంటే చాలా ఇష్టం. – ఫెర్నాండో, ఇటలీ అతిథులకు లోటు రానివ్వం భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులకు ఎలాంటి లోటు రానివ్వం. ఏ దేశం నుంచి అతిథులు వచ్చినా సాదరంగా స్వాగతిస్తాం. వారికి కావాల్సిన వసతి ఏర్పాటు చేస్తున్నాం. బాబా ఆశయాల సాధన మేరకు శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు ఉన్నాయి. చిన్న గ్రామాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి భగవాన్ శ్రీసత్యసాయిబాబా. – ఆర్జే రత్నాకర్రాజు, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ -
దేశంలో విస్తరిస్తున్న మెడికల్ టూరిజం
తక్కువ ఖర్చు.. అత్యాధునిక సౌకర్యాలు.., చికిత్స పద్ధతులు, సుశిక్షితులైన వైద్యులు, నాణ్యమైన వైద్యానికి భారత దేశం కేరాఫ్ అడ్రస్. అత్యంత క్లిష్టమైన చికిత్సలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అందుకే దేశంలో వైద్య పర్యాటకం (మెడికల్ టూరిజం) ఏటేటా పెరుగుతోంది. ఏటా లక్షలాది మంది విదేశీయులు భారత దేశానికి వచ్చి వైద్యం పొంది వెళ్తున్నారు. గత పదేళ్లలో ఏటా వచ్చే మెడికల్ టూరిస్టుల సంఖ్య దాదాపు ఐదింతలు పెరిగింది. ఇదిలాగే కొనసాగి, 2034 నాటికి 50,671 బిలియన్ డాలర్లకు భారత దేశ మెడికల్ టూరిజం పరిశ్రమ విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి. – సాక్షి, అమరావతిదేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయుష్ వీసాను ప్రవేశపెట్టింది. వివిధ జబ్బులతో బాధపడే విదేశీయులు చికిత్స కోసం భారత్కు రావడానికి సరళమైన నిబంధనలతో దీనిని రూపొందించింది. ఈ వీసాతో భారత వైద్య పర్యాటకం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా దేశ ఆరోగ్య సంరక్షణ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 70 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని గతంలో మోదీ ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. గతేడాది 8.7 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. ఈ ఏడాది (2024)లో 10.4 బిలియన్ డాలర్ల మేర మెడికల్ టూరిజంలో పెరుగుదల ఉంటుందని ఫార్చ్యూన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 17.2 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 2034 నాటికి 50,671 బిలియన్ డాలర్లకు పరిశ్రమ విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి.వివిధ రకాల వ్యాధులకు చికిత్స కోసం 2014లో 1.39 లక్షల మంది విదేశీయులు భారత్కు రాగా, ఆ సంఖ్య గత ఏడాది (2023) 6.35 లక్షలకు పెరిగింది. అదే విధంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం 2017–19 మధ్య రెండేళ్లలో మెడికల్ టూరిజంలో వృద్ధి 34.5 శాతంగా నమోదైంది. కరోనా కారణంగా 2020లో కొంత తగ్గినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ మెడికల్ టూరిజం గణనీయంగా పుంజుకుంది. గుండె సంబంధిత సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, క్యాన్సర్ వైద్యం, ఇతర చికిత్సలకు విదేశీయులు తెలంగాణాలోని హైదరాబాద్, ఏపీలోని గుంటూరు, విజయవాడల్లోని ఆస్పత్రులకు కూడా వస్తున్నారు. -
విదేశీయుల విడిది 'భారత్'
సాక్షి, అమరావతి: స్వదేశంలో ఉన్న వారు విదేశాలకు వెళ్లి సేద తీరాలనుకుంటుంటే... విదేశీయులు మాత్రం భారత్వైపే చూస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో 47.78 లక్షలమంది విదేశీయులు భారత్ను సందర్శించారు. దీంతో విదేశీయులకు భారత్ విశ్రాంతి, వినోద కేంద్రంగా మారుతోంది. అమెరికా నుంచి 17.56శాతం, యూకే నుంచి 9.82శాతం, కెనడా 4.5శాతం, ఆ్రస్టేలియా 4.32శాతం మంది వచ్చారు. ఫారిన్ టూరిస్టు ఎరైవల్ (ఎఫ్టీఏ) ఒక్క జూన్లోనే 7.06లక్షలు ఉండటం విశేషం.ఇది 2023లో 6.48లక్షలు, 2019లో 7.26లక్షలుగా నమోదైంది. అయితే ఇది 2023 జూన్ ఎఫ్టీఏలతో పోలిస్తే 9శాతం వృద్ధిని సాధించగా 2019తో పోలిస్తే 2శాతం క్షీణించింది. భారత్కు వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ (46శాతం) మంది సరదాగా కుటుంబాలతో సహా గడిపి వెళ్లారు. ఇక 18శాతం మంది వ్యాపార, వైద్య సేవల కోసం భారత్ను సందర్శిస్తున్నారు. వెల్నెస్ రిట్రీట్లు, అడ్వెంచర్ ట్రిప్లకు క్రేజ్ పెరుగుతోంది. ఢిల్లీ నుంచే దేశంలోకి విదేశీ పర్యాటకుల టాప్ ప్రవేశ స్థానంగా 31.45శాతంతో ఢిల్లీ నిలుస్తోంది. ఆ తర్వాత ఆర్థిక రాజధాని ముంబై (14.83శాతం), హరిదాస్పూర్ (9.39శాతం), చెన్నై (8.35శాతం), బెంగళూరు (6.45శాతం) ఉన్నాయి. అనిశ్చితిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా 21.55శాతం మంది భారత్కు వచ్చారు. అయితే వీరందరూ పర్యాటకులని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. దశాబ్ద కాలంగా హరిదాస్పూర్ నుంచే వీరందరూ భారత్లోకి వస్తున్నారు. ఈ క్రమంలో ఫారెక్స్ ఆదాయం గతేడాదితో పోలిస్తే 17.62శాతం ఎక్కువగా ఉంది. అదే 2023లో ఆసియా పసిఫిక్ దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా 90లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్లోకి వచ్చారు. భారతీయ ఇన్»ౌండ్ పర్యాటక మార్కెట్కు ఆ్రస్టేలియా, మలేసియా, సింగపూర్, జపాన్, థాయ్లాండ్, దక్షిణ కొరియా ప్రధానంగా నిలుస్తున్నాయి. 2023లో ఈ ఆరు దేశాల నుంచే ఏకంగా 10.22లక్షల మందిపైగా విదేశీయులు వచ్చారు. 1.50 కోట్ల మంది విదేశాలకు కోవిడ్ మహమ్మారి విజృంభించిన తర్వాత విదేశాల్లో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యలో 1.50 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పర్యటించారు. గతేడాది ఇదే సమయానికి 1.32లక్షల మంది విదేశాలకు వెళ్లారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఎక్కువ మంది విదేశీ యాత్రలు చేస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లో యూకే, సౌదీ, యూఎస్, థాయ్లాండ్, సింగపూర్ భారతీయుల అగ్రగామి ఎంపికలుగా నిలిచాయి. -
Video: పద్మనాభస్వామి ఆలయంలోకి విదేశీ మహిళకు ప్రవేశం నిరాకరణ
తిరువనంతపురం: పవిత్రమైన దేవాలయంలోకి విదేశీ మహిళను వెళ్లకుండా అడ్డుకున్న ఘటన కేరళలోని పద్మానాభస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. కేవలం భారతీయులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉందంటూ ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. అయితే తన భర్త భారతీయుడేనని, వారికి నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పినా ఆలయ అధికారులు పట్టించుకోలేదు.. ఈ మేరకు సదరు విదేశీ మహిళకు ఎదురైన అనుభవాన్ని హర్ప్రీత్ అనే మహిళ సోషల్ మీడియాలో పంచుకున్నారు.విదేశాలకు చెందిన మహిళ చక్కగా చీర కట్టుకొని తనకు కాబోయే భర్తతో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సిబ్బంది.. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తన జాతీయత, మతం కారణంగా ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించినట్లు ఆమె వాపోయింది. భారతీయులకు మాత్రమే ఆలయ అనుమతి ఉంటుందని అధికారులు చెప్పినట్లు వీడియోలో పేర్కొంది. తనతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇండియన్ అయిన ఆమె ప్రియుడు చెప్పినా.. ఆలయ సిబ్బంది ఆ విదేశీ మహిళకు గుడిలోకి అనుమతి ఇవ్వలేదు.తాను హిందువునే అని ఆ మహిళ వీడియోలో చెప్పుకున్నప్పటికీ అధికారులు సర్టిఫికేట్ చూపించాలంటూ కోరారని తెలిపింది. ప్రతిసారి సర్ఠిఫికేట్ తీసుకెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని, భగవద్గీతను చదవుతానని, అయినా సెక్యూర్టీ గార్డులు తనను ఓ నేరస్థురాలిగా చూస్తున్నారని ఆమె తన వీడియోలో ఆరోపించింది. ఆలయ అధికారులు వర్ణవివక్షను ప్రదర్శించినట్లు ఆరోపించింది. కేవలం ఆలయంలో ప్రవేశించేందుకు మాత్రమే చీరను కొన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.Why should anyone be barred from a place worship they want to visit? https://t.co/Y6LrCCJUwV— Karti P Chidambaram (@KartiPC) July 16, 2024 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.తాజాగా ఈ వీడియోపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ప్రార్ధన స్థలానికి వెళ్లి పూజలు చేయాలనుకున్న వ్యక్తులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు అనేకమంది ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆలయాల్లోకి విదేశీయులను అనుమతించాలని కోరగా.. మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని చెబుతున్నారు. "మతం, జాతీయతతో సంబంధం లేకుండా ఎవరినైనా హిందూ దేవాలయాలలోకి అనుమతించాలి. కేవలం వారి దుస్తులు, శాఖాహారం తినడం, చెప్పులు తీయడం వంటి ఆలయ సంస్కృతిని గౌరవించాలనే షరతులు మాత్రమే ఉండాలి. అని సూచిస్తున్నారు. ఇక దేవాలయాలు అందరూ సందర్శించడానికి టూరిస్టు ప్రదేశాలు కాదని, మీ ఇంట్లోకి ఎవరినైనా అనుమతిస్తారా? ఇవ్వరు కదా!. వారు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇస్తే ఆలయంలోకి అనుమతించాలి’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. -
సీన్ హై జపానీ..సినిమా హై హిందుస్థానీ
భారతీయ సినిమా పాటలకు విదేశీయులు డ్యాన్స్ చేయడం కొత్త కాదు. అయితే జపాన్లో మాత్రం బాలీవుడ్ హిట్ సినిమాల ఐకానిక్ సీన్లను రీక్రియేట్ చేసే కొత్త ట్రెండ్ మొదలైంది. బాలీవుడ్ మూవీ ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (కె3జి)లో అంజలిగా కాజోల్, రాహుల్గా షారుఖ్ ఖాన్ నటించారు. రాహుల్, అంజలి వేషధారణలో జపనీస్ ఇన్ఫ్లూయెన్సర్లు మాయో, కకే టకులు ‘కె3జి’లోని ‘బడే మజాకీ హో’ కామెడీ సీన్ను రీక్రియేట్ చేశారు. ‘లెర్నింగ్ హిందీ ఇన్ 2024 ఈజ్ లైక్ బడే మజాకీ హో’ కాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. హిందీలో ్రపావీణ్యం సంపాదించిన మాయో, కకే టకుల లిప్ సింక్ బాగా కుదిరింది. ‘క్రాస్–కల్చరల్ అడ్మిరేషన్ అనేది భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక గొడుగు కిందికి తీసుకువస్తుంది. పర్యాటక ఆసక్తి పెంచుతుంది’... లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వచ్చాయి. -
ఈ అన్న ఇంగ్లీష్ చూసి నోరెళ్లబెట్టిన ఫారెనర్స్
-
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇంఫాల్: మణిపూర్లో ముష్కరులు జరిపిన దాడిలో గాయపడిన భద్రతా బలగాలను సీఎం బీరేన్ సింగ్ పరామర్శించారు. దాడిలో మయన్మార్కు చెందిన కిరాయి సైనికులు పాల్గొన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. దుండగులు ఆధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు వెల్లడించారు. ముష్కరులను పట్టుకునేందుకు కూంబింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మణిపూర్లో వరుసగా రెండోరోజు ఉగ్రమూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మంగళవారం ఆకస్మికదాడి జరిపారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. అంతకుముందు తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో దుండగులు సోమవారం కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తౌబల్తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మణిపూర్లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం -
ఈ 'వెడ్డూరం' చూశారా? పెళ్లిని సొమ్ము చేసుకునే ట్రెండ్! ఏకంగా..
కొంతమంది ఎంతోఘనంగా జరుపుకునే తమ పెళ్లి వేడుకల వీడియోలను అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడం ఇప్పటి ట్రెండ్గా మారింది. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు తమ పెళ్లి వీడియోలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిలానే సెలబ్రెటీ హోదాలేని వారు సైతం విదేశీయులకు పెళ్లి టికెట్లు అమ్మి వెడ్డింగ్ పర్యాటకానికి తలుపులు తెరుస్తున్నారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే చాలా మంది విదేశీయులు ఇక్కడి సంస్కృతిని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. విదేశాలతో పోలిస్తే ఇండియాలో ఎంతో శాస్త్రోక్తంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ పెళ్లిళ్లను చూసేందుకు విదేశీయులు చాలా ఉత్సాహం చూపుతారు. పెళ్లి సంప్రదాయాలు, రకరకాల రుచికరమైన వంటకాలను టేస్ట్ చేసేందుకు తహ తహలాడుతుంటారు. అందుకే ఏ మాత్రం అవకాశం చిక్కినా వెంటనే వచ్చి ఇండియాలో వాలిపోతుంటారు. ఇందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ఈ అభిరుచినే మన భారతీయ జంటలు, వెడ్డింగ్ ప్లానర్స్ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్సైట్లూ నడుపుతున్నారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ను టికెట్గా చూపిస్తూ నిశ్చితార్థం నుంచి, మెహందీ, సంగీత్, హల్దీ ఇలా ఒక్కో వేడుకకి ఒక్కో రేటుని చెబుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. జాయిన్ మై వెడ్డింగ్... పెళ్లి చేసుకునే జంట సొంతంగా జాయిన్ మై వెడ్డింగ్ పేరుతో అకౌంట్ను క్రియేట్ చేస్తారు. ఈ వెబ్సైట్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరి ఫోటోలు, పెళ్లి తేదీ, ఎన్నిరోజులు వేడుకలు జరుగుతాయి.. ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు... వంటి వివరాలను అప్లోడ్ చేస్తారు. పెళ్లిలో పెట్టే భోజనం వెజ్, నాన్వెజ్, మందు, చిందు ఉంటే అదీ చెబుతారు. ఇవేగాక డ్రెస్ కోడ్, అక్కడ మాట్లాడే భాష, వేడుక జరిగే ప్రదేశం అడ్రెస్తోపాటు ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ను ఇస్తారు. విదేశీ పర్యటనలో ఉన్న వారికి ఈ పెళ్లి తేదీలు జత కుదిరితే టికెట్స్ బుక్ చేసుకుని వచ్చేసి మరీ పెళ్లి బ్యాండ్ బాజా, బారాత్లను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కరోజుకి పన్నెండు వేలపైనే... ఎంతో ఆడంబరంగా జరిగే మన వివాహ వేడుకలను చూడడానికి పర్యాటకులు రోజు కోసం 150 డాలర్ల టికెట్ను సంతోషంగా కొనేస్తున్నారు. మన రూపాయలలో పన్నెండు వేలకు పైనే. ఇక పెళ్లి పూర్తి తతంగం మొత్తం అంటే రెండు రోజులు చూడాలంటే 250 డాలర్లు చెల్లించాలి (రూ.20 వేలకుపైన). ఒకటీ, రెండూ కాదు ఐదు రోజుల పెళ్లి చూడాలంటే ప్రత్యేక వెడ్డింగ్ ప్యాకేజీ టికెట్ కొనాల్సిందే. ఇలా పదిమంది విదేశీ అతిథులు పెళ్లికి వచ్చారంటే పెళ్లిలో కొన్ని ఖర్చులకు సరిపడా డబ్బు సమకూడినట్లే! అందుకే ఎక్కువ మంది వెడ్డింగ్ టూరిజంపైన ఆసక్తి కనబరుస్తున్నారు. తొలిసారి... హంగేరియన్– ఆస్ట్రేలియన్ సంతతికి చెందిన ఒర్సి పర్కాణి తొలిసారి 2016లో ‘జాయిన్ మై వెడ్డింగ్’ పేరిట వెబ్సైట్ను క్రియేట్ చేసింది. అప్పుడు ఇది ఒక చిన్న స్టార్టప్. కానీ ఇప్పుడు ఇది ట్రెండ్గా మారింది. ఈ ఏడాది ఆగస్టు 19న పర్యాటక మంత్రిత్వ శాఖ వెడ్డింగ్ టూరిజంను ప్రారంభించింది. వెడ్డింగ్ టూరిజం ద్వారా భారతీయులేగాక, విదేశీయులు సైతం ఇక్కడికి వచ్చి ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్టుగా పెళ్లి వేడుకలు జరుపుకోవచ్చని చెబుతూ వెడ్డింగ్ టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. బీచ్ వెడ్డింగ్, నేచర్ వెడ్డింగ్, రాయల్ వెడ్డింగ్, హిమాలయన్ వెడ్డింగ్ థీమ్ల పేరిట ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ట్రెండ్కు మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం బూస్టర్గా పనిచేసి ఇండియాలో వెడ్డింగ్ వ్యాపారం వృద్ధిలోకి రాబోతుంది. ఇంకెందుకాలస్యం... మీ ఇంట్లో జరిగే పెళ్లివేడుకలకు వెడ్డింగ్ టూరిజంను జోడించి మరింత కలర్పుల్గా జరుపుకోండి. సెర్మనీ గైడ్... విదేశీయులను పెళ్లికి పిలవడమేగాక, వారికి అతిథి మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోవడం ఈ వెడ్డింగ్ టూరిజం ప్రత్యేకత. వేడుక లో జరిగే ప్రతి విషయం, పర్యాటకులకు వచ్చే సందేహాలు నివృత్తి చేసేందుకు సెర్మనీ గైడ్ను ఏర్పాటు చేస్తున్నారు.‘‘ప్రస్తుతం రాజస్థాన్, ఢిల్లీ, ముంబైలలో ఈ వెడ్డింగ్ టూరిజం పెరుగుతోంది. రాజస్థాన్లోని చిన్నటౌన్లలో జరిగే వేడుకలకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. జో«ద్పూర్, జైపూర్, జైసల్మేర్, ఉదయ్పూర్లలో జరిగే రాయల్ ఇండియన్ వెడ్డింగ్స్కు డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది’’ అని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. (చదవండి: ఉద్దానంలోని మరణాలకు గల కారణాన్ని కనిపెట్టిన పరిశోధకులు! చాలా మరణాలు..) -
పట్టుమని పది కిలోమీటర్ల విస్తీర్ణం కూడా లేకున్నా ప్రపంచ ఖ్యాతి
సాక్షి, పుట్టపర్తి: సత్య, ధర్మ ,శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు మానవతా విలువలను పాటించినవారే నిజమైన మానవులనీ, అవే మానవ జాతికి ముక్తి కలిగించేవనీ ప్రవచించిన భగవాన్ సత్యసాయిబాబా నడియాడిన పుట్టపర్తి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. పట్టుమని చుట్టూ పది కిలోమీటర్ల విస్తీర్ణం కూడా లేని కుగ్రామం విశ్వ చైతన్య శక్తిగా ఎదిగింది. జిల్లాలోనే అతి చిన్న మున్సిపాలిటీగా ఉన్న పుట్టపర్తి.. నేడు శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా అందరినీ దృష్టిని ఆకట్టుకుంటోంది. దీంతో పర్యాటకులు, సత్యసాయి భక్తులతో పాటు జిల్లా కేంద్రంలోని వివిధ కార్యాలయాలకు పనులపై వచ్చే వారి సంఖ్య పెరిగింది. అటు కొత్తచెరువు... ఇటు బుక్కపట్నం పుట్టపర్తికి ఓ వైపు బుక్కపట్నం చెరువు.. మరో వైపు కొత్తచెరువు ఉంటాయి. కేవలం పది కిలోమీటర్ల వ్యవధిలోనే మూడు మండల కేంద్రాలు ఉండడం మరో విశేషం.భగవాన్ సత్యసాయిబాబా నడియాడిన ప్రాంతం కావడంతో పుట్టపర్తిలో నివసించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. దీంతో ఆధునాతన ఎతైన భవంతులు వెలిసాయి. మాంసాహారం నిషేధం.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, విదేశీయులు నెలల తరబడి పుట్టపర్తిలోనే మకాం ఉంటారు. ఫలితంగా పుట్టపర్తి భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. దేశవిదేశీయులు మెచ్చే వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. అత్యధికంగా తమిళనాడు, కేరళ శైలి వంటకాలు లభ్యమవుతాయి. ఇక క్రిస్పీగా ఉంటూ కాస్త కారంతో ఉండే ఫాస్ట్ఫుడ్ అంటే విదేశీయులు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. అయితే కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ పుట్టపర్తిలో మాంసాహారం పూర్తిగా నిషేధం. కనీసం కోడి గుడ్డు కూడా ఇక్కడ లభ్యం కాదు. అలాగే సినిమా థియేటర్లూ ఉండవు. జిల్లా కేంద్రమే అయినా బార్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయాలకు అనుమతుల్లేవు. అత్యంత పవిత్ర ప్రాంతంగా నేటికీ భావిస్తూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. చాలా హోటళ్లలో బర్గర్, పిజ్జాలతో పాటు పలు రకాల శాకాహార వంటలు అందుబాటులో ఉంటాయి. ఓ వైపు నుంచి చూడాల్సిందే.. కొత్తచెరువు, బుక్కపట్నం మండల కేంద్రాలకు పుట్టపర్తికి మధ్యలో బుక్కపట్నం చెరువు ఉంటుంది. ఈ చెరువు చుట్టూ ఓ వైపు పుట్టపర్తి, మరోవైపు కొత్తచెరువు, ఇంకోవైపు పుట్టపర్తి ఉంటాయి. మూడు మండల కేంద్రాలు పది కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. అయితే ఎటు వైపు నుంచి చూసినా పుట్టపర్తి కనిపించదు. చుట్టూ కొండలే కనిపిస్తాయి. కేవలం ‘బుక్కపట్నం – నల్లమాడ’ మార్గంలో నుంచి మాత్రమే పుట్టపర్తిని దూరం నుంచి చూసే అవకాశం ఉంది. పుట్టపర్తి ముఖచిత్రం చూడాలంటే ఏరియల్ వ్యూ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పుట్టపర్తికి ఓ వైపు చిత్రావతి నది, మరో వైపు విమానాశ్రయం, ఇంకోవైపు చెరువు సరిహద్దులుగా ఉంటాయి. -
India with Jessica: ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి
మన దేశంలో పుట్టిన చాలామందికి హిందీ మాట్లాడటం రాదు. కొంతమందికి అర్థమైనప్పటికీ మాట్లాడలేరు. అమెరికా నుంచి వచ్చిన జెస్సికా మాత్రం హిందీలో అనర్గళంగా మాట్లాడేస్తుంది. ఇలా పలకాలి అని హిందీ పాఠాలు కూడా చెబుతోంది. మనదేశానికి వచ్చే విదేశీయులకు హిందీతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ నెటిజనుల మన్ననలను అందుకుంటోంది ఈ ‘బిహారీ బహూ’. పదిహేడేళ్లుగా ఇండియాతో చక్కని బంధాన్ని కొనసాగిస్తోన్న జెస్సికా గురించి ఆమె మాటల్లోనే... ‘‘నేను చికాగోలో పుట్టాను. అమ్మానాన్న ఇరు కుటుంబాలకు చెందిన తాత, బామ్మలతో కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం మాది. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో కలిసి స్కూలుకు వెళ్లి చదువుకునేదాన్ని. ఆదివారం వచ్చిందంటే... కుటుంబమంతా కలిసి గడుపుతాం. నాన్న అంతర్జాతీయ వ్యాపారి కావడంతో తరచూ చైనా, కొరియాలు వెళ్తుండేవారు. ఆయన్ని చూసి నేను కూడా అలా తిరగాలని అనుకునేదాన్ని. కాలేజీ చదువుకోసం 18 ఏళ్ల వయసులో చికాగో నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాను. నాలుగేళ్లపాటు హాస్టల్లో ఉన్నాను. ‘చైనా, ఇండియాలలో ఆర్థికమాంద్యం వస్తుంది’ అని కాలేజీలో ఎక్కువమంది విద్యార్థులు మాట్లాడుకునేవారు. అది విన్న నాకు ఇండియా వెళ్లి అక్కడి పరిస్థితులు చూడాలనిపించేది. ఏడాదిలో తిరిగి వచ్చేస్తాను అనుకున్నా.. కాలేజీ చదువు పూర్తయిన తరువాత తెలిసిన వాళ్ల ఐటీ కంపెనీ హరిద్వార్లో ఉంటే.. అక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి ఇండియా వచ్చాను. ఇంటర్న్షిప్తోపాటు భారతీయులు, వారి భాషల గురించి తెలుసుకోవచ్చని అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఇరుగు పొరుగు నుంచి కూరగాయలు విక్రయించేవాళ్ల వరకు అందరితో పరిచయం ఏర్పడింది. అందరూ చక్కగా కలిసి పోయేవారు. ఏడాదిలో ఇంటర్న్షిప్ పూర్తయిన తరువాత అదే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అలా ఏడాదిలో తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది స్నేహితుల ద్వారా అభిషేక్ పరిచయం అయ్యాడు. నేను ఇక్కడ ఉంటే.. అభిషేక్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇద్దరం మంచి స్నేహితులుగా మారాం. నేను మా ఇంటికి వెళ్లినప్పుడల్లా అభిషేక్ను కలిసేదాన్ని. అలా మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చి బిహార్ కోడలిని అయ్యాను. అత్తమామల అనురాగం చూసి... హరిద్వార్లో ఉండే రోజుల్లో ఇక్కడి అత్తమామలు కుటుంబ పెద్దలుగా కోడళ్లు, మనవళ్లను చూసే విధానం నాకు బాగా నచ్చింది. అభిషేక్ను పెళ్లిచేసుకోవడానికి అది కూడా ఒక కారణం. మేము పెళ్లి చేసుకుంటామని మా నాన్నని అడిగాం. ‘చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి పెళ్లిచేసుకో’ అని నాన్న చెప్పారు. అభిషేక్ కుటుంబ సభ్యుల్లో సగం మంది అమెరికాలో నివసిస్తుండడంతో వారి గురించి బాగా అర్థం చేసుకోవడం కూడా నాన్న ఒప్పుకోవడానికి ఒక కారణం. అభిషేక్ తల్లిదండ్రులు విదేశీ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోవడానికి మొదట్లో భయపడ్డారు. ఎలాంటి అమ్మాయో అని సందేహించినప్పటికీ మా కుటుంబం గురించి తెలుసుకుని పెళ్లికి సమ్మతించడంతో 2010లో మా వివాహం జరిగింది. జీవితాంతం ఆధారపడాల్సిందే... పెళ్లి అయిన తరువాత అమెరికాలో కొన్నిరోజులు, ఇండియాలో కొన్ని రోజులు ఉండేవాళ్లం. ఆరేళ్ల తరువాత బిహార్కి వచ్చి స్థిరపడ్డాం. మాకు ఇద్దరు పిల్లలు బాబు, పాప. ప్రపంచంలో కూతురికంటే కొడుకులనే మరింత ప్రేమగా చూసుకుంటారు. ఇండియాలో ఇది కాసింత ఎక్కువే. అమ్మాయిలకు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేలా అన్నీ నేర్పిస్తారు. అబ్బాయిలకు మాత్రం ఏమీ నేర్పించరు. కొంతమంది తల్లులు అయితే ‘మా అబ్బాయికి కప్పు టీ పెట్టడం కూడా రాదు’ అని గర్వంగా చెబుతుంటారు. ఇలా అయితే వాళ్లు స్వయంసమృద్ధిని సాధించలేరు. జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిందే. అందుకే నేను నా పిల్లలకు లింగభేదం లేకుండా అన్నీ నేర్పిస్తున్నాను. నేర్చుకుని నేర్పిస్తున్నా... హరిద్వార్లో ఉన్నప్పుడే హిందీ నేర్చుకున్నాను. కోర్సు కూడా చేశాను. బిహార్కి వచ్చిన తరువాత నా హిందీ బాగా మెరుగుపడింది. బిహారీలు మాట్లాడే హిందీ సరిగాలేదని, వారి మాటలు విని నవ్వుతుంటారు చాలామంది. కానీ ఇక్కడ మాట్లాడే హిందీలో సంస్కృతం, భోజ్పూరి, మైథిలి, ఆంగిక వంటి భాషలు కూడా కలుస్తాయి. అందుకే బిహారీలు మాట్లాడే హిందీ కొంచెం విభిన్నంగా ఉంటుంది. బిహారీలు మాట్లాడే హిందీపై చాలామందికి ఉండే చిన్నచూపు, వివక్ష పోవాలని నా వీడియోల్లో.. బిహారీ స్టైల్ హిందీనే మాట్లాడుతున్నాను. ఇండియా విత్ జెస్సికా ఇక్కడ ఉండే భారతీయులకు, విదేశాల్లో ఉండే ఇండియన్స్కు హిందీ నేర్పిస్తున్నాను. అమెరికా, కెనడాలలో స్థిరపడిన ఎంతోమంది భారతీయుల పిల్లలకు హిందీలో మాట్లాడడం తెలీదు. ఇది వాళ్లకు పెద్ద సమస్య. అందుకే నేను హిందీ నేర్పిస్తున్నాను. నాలుగున్నరేళ్ల క్రితం ‘ఇండియా విత్ జెస్సికా’ పేరిట యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాను. వీటిద్వారా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తున్నాను. కొన్నిసార్లు వివిధ రకాల అంశాలపై మాట్లాడడానికి అతిథిగా కూడా వెళ్తున్నాను. అమెరికా అమ్మాయి ఇండియా గురించి మాట్లాడడం, అందులో హిందీలో అనర్గళంగా మాట్లాడుతుంది అని తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యంగా నా క్లాసులు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసం లిప్సింక్ వీడియోలు పోస్టు చేస్తుంటారు. నేను అవేమీ చేయడం లేదు. కేవలం తెలియని సమాచారం ఇవ్వడమే నా లక్ష్యం. అందుకే ఫాలోవర్స్ గురించి కూడా పట్టించుకోను. కొంతమంది మెసేజులకు జవాబులు చెప్పడం లేదని తిడుతుంటారు. నన్ను సెలెబ్రిటీలా చూస్తున్నారు. కానీ నేను సెలబ్రిటీని కాదు. ఇద్దరు పిల్లలకు తల్లిని, వాళ్లకు నేర్పించాలి. వంట చేయాలి, ఇంటిని చూసుకోవాలి. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. నేను అందరిలానే సామాన్యమైన వ్యక్తిని’’ అని ఎంతో నిరాడంబరంగా చెబుతోంది జెస్సికా. -
కిచెన్ క్వీన్ శశికళ.. ఈమె వంటలకు విదేశీయులు కూడా ఫిదా
ఉదయ్పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు. పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది. రాజస్థాన్కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది. ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్పూర్ వస్తుంటారు. -
Hyderabad: హిందీ నేర్చుకుంటూ.. ఆదాయం అందుకుంటూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలోని రిసెప్షన్లో ఉన్న వ్యక్తుల్ని ‘‘కిత్నా రూపియా టెస్ట్ కే లియే? (పరీక్షలకు ఎంత ఖర్చవుతుంది?)’’అని ఆఫ్రికాకు చెందిన కవాంగు(25) అడుగుతోంది. కెన్యా నుంచి న్యూరో సర్జన్ను సంప్రదించడానికి నగరానికి వచ్చిన ముగ్గురు రోగులు తనకు కస్టమర్లుగా ఉన్నారు. వారికి అవసరమైన సంప్రదింపులు, పరీక్షల ఏర్పాట్ల నుంచి రెస్టారెంట్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం దాకా అన్నీ కవాంగు బాధ్యతలే. విదేశీయులకు అత్యున్నత వైద్యసేవల్ని మాత్రమే కాదు ఆదాయమార్గాలను కూడా నగర వైద్యం అందిస్తున్న తీరుకు కువాంగు ఒక ఉదాహరణ. తన కుటుంబంతో నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి అలాంటి ఫెసిలిటేటర్ సహాయంతో సంక్లిష్టమైన కాలేయ సమస్యకు కవాంగు చికిత్స పొందింది. ఆ తర్వాత తానే ఫెసిలిటేటర్గా మారితే రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చని అర్థమయ్యాక కవాంగు మూడేళ్లుగా అదే పనిచేస్తూ నగరంలోనే ఉంటున్నారు. ఆ వృత్తి కోసం కొంచెం హిందీ కూడా నేర్చుకుందామె. ‘హిందీ భాష నేర్చుకోవడం కోసం కోర్సులో చేరడంతోపాటు బాలీవుడ్ సినిమాలు చూడటం ప్రారంభించాను‘అని ఆమె చెప్పారు. టోలీచౌకి కేంద్రంగా... ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తున్నవారికి కేంద్రంగా నగరంలోని టోలీచౌకి మారిందని ఓ ఆసుపత్రికి చెందిన మార్కెటింగ్ విభాగ ప్రతినిధి తెలిపారు. ఈ ఏరియాలోని ప్రీమియర్ అపార్ట్మెంట్లో అద్దెకుండేవారిలో అత్యధికులు ఈ తరహా సేవల్లో నిమగ్నమవుతున్నారన్నారు. చాలామంది ఇక్కడ ట్రావెల్ లేదా స్టడీ వీసాపై మాత్రమే ఉన్నారు. కాబట్టి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ యాక్ట్కి సంబంధించిన సమస్యల గురించి భయపడివారు తమపేరు తదితర వ్యక్తిగత వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు, ‘‘మాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు నైరోబీలోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు మాకు సహాయం చేస్తారు’’అని నైరోబీకి చెందిన మార్గరెట్ కారీ చెప్పారు. కొన్ని ఆసుపత్రులు దేశీయ రోగులతో పోలిస్తే అంతర్జాతీయ రోగులకు ట్రీట్మెంట్ రేట్లు అమాంతం 50 శాతం మేర పెంచేసి వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఫెసిలిటేటర్లకు బిల్లును బట్టి 15 నుంచి 20 శాతం కూడా ఇస్తున్నారని సమాచారం. ‘సోమాలియాలో ఆరోగ్య సంరక్షణకు సరైన మౌలిక సదుపాయాలు లేవు. దాంతో చికిత్స కోసం థాయ్లాండ్, మలేషియా, చైనాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు చాలామంది భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్కు వస్తున్నారు, అందువల్ల నేనిక్కడ ఉంటూ బంధువులు, స్నేహితులకు సహాయం చేయడం ప్రారంభించాను. అలా చాలామంది నాతో కనెక్ట్ అయ్యారు’అని 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన సోమాలియా జాతీయుడైన జువేద్ అన్నారు. ఏజెన్సీలూ ఉన్నాయి... మెడికల్ టూరిజమ్ సేవలు అందించే కొన్ని అంతర్జాతీయ కంపెనీలు చట్టప్రకారం కొందరిని ఫెసిలిటేటర్లుగా నియమించుకుని రోగులకు సహాయకులుగా వినియోగిస్తాయి. ఇలాంటి సంస్థలు ఢిల్లీ, ముంబై, బెంగుళూర్లలో ఎక్కువ. వాటి సేవలు హైదరాబాద్కు ఇంకా విస్తృతంగా వ్యాపించలేదు. దాంతో ఇక్కడ వ్యక్తిగతంగా సేవలు అందించే ఫెసిలిటేటర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటున్న విదేశీ విద్యార్థులు నగరంలోని హైదరాబాద్, ఉస్మానియా వంటి యూనివర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్టైమ్గా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. పదేళ్లు, పన్నెండేళ్ల పాటు నర్సింగ్ స్టాఫ్, ఫిజియోథెరపీ స్టాఫ్గా సేవలు అందించినవాళ్లు కూడా జోర్డాన్, ఇరాక్, సిరియా తదితర మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చి అక్కడి పరిచయాలను, అరబిక్ భాష మీద పట్టు లాంటి సానుకూల అంశాలతో ఫెసిలిటేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ఉభయ కుశలోపరి విధానం మా ఆసుపత్రికి నైజీరియా, కెన్యా, సుడాన్, సోమాలియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరి కోసం మేం అధికారికంగా ఉన్న సంస్థల నుంచి ఫెసిలిటేటర్ల సేవలు అందుకుంటాం. అరుదుగా మాత్రం తెలిసిన, పరిచయస్తులను ఉపయోగించుకుంటాం. రోగులకు ఎదురయ్యే భాషా పరమైన ఇతర అవరోధాలకు పరిష్కారంగానూ, మరోవైపు ఇక్కడ విద్యార్జన తదితర పనులపై వచ్చేవారికి ఆదాయమార్గంగానూ ఈ విధానం ఉపకరిస్తోంది. –డా.కిషోర్రెడ్డి, అమోర్ ఆసుపత్రి -
భగవద్గీత గురించి విదేశీ యువతి ఎంత బాగా చెప్తుందో..
-
రుషికొండలో బ్లూ ఫ్లాగ్ రెపరెపలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అందాల తీరానికి అంతర్జాతీయ హంగులద్దుతున్నారు. స్వచ్ఛత, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యావరణ హితంగా.. పర్యాటక స్వర్గధామంగా ఉన్న బీచ్లకు విదేశీ గుర్తింపు లభిస్తోంది. డెన్మార్క్కు చెందిన అధ్యయన సంస్థ అందించే ఈ ధ్రువపత్రం వస్తే చాలు.. ఆ బీచ్లకు విదేశీయులు క్యూ కడతారు. అంతర్జాతీయ సాగరతీరంగా గుర్తింపు పొందుతూ.. సురక్షితమైన బీచ్ల జాబితాలో భారత్కు చెందిన 12 ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడుతున్నాయి. వరుసగా మూడో ఏడాది రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎలా వస్తుందంటే.. బ్లూ ఫ్లాగ్ బీచ్లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టీఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక దేశాన్ని సందర్శించేందుకు వెళ్లే విదేశీ పర్యాటకులు ఆ దేశంలో బీచ్ల గురించి శోధించినప్పుడు ముందుగా బ్లూ ఫ్లాగ్ గురించే సెర్చ్ చేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్లు ఉంటే.. ఆ ప్రాంతాన్ని కచ్చితంగా విదేశీ పర్యాటకులు పర్యటిస్తారు. బ్లూ ఫ్లాగ్ ధ్రువ పత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు, జల కాలుష్యం ఉండకూడదు. పర్యావరణ హితంగా ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పరిశ్రమల వ్యర్థాలు కలవకూడదు. సముద్రంలో స్నానం చేసేటపుడు ఆరోగ్యపరమైన భద్రత ఉండాలి. నీటిలో బ్యాక్టీరియా ఉండకూడదు. 150 మీటర్ల వరకు తీరం నుంచి లోపలకు ఇసుక తిన్నెలుండాలి. సముద్రంలో బోటింగ్ సదుపాయం ఉండాలి. ఈ ప్రాజెక్టుకు ఎంపికైన బీచ్లలో ఆయా అంశాల్లో పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టీఫికెట్ ఇస్తారు. బీచ్లో బ్లూ ఫ్లాగ్ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఎవరు ఇస్తారు? 1985లో డెన్మార్క్లో ప్రారంభించిన ’ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’(ఎఫ్ఈఈ) ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్లను అందిస్తోంది. ప్రపంచంలో తొలిసారి ఈ సర్టీఫికెట్ పొందిన దేశం స్పెయిన్. బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్ అందిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ స్పెయిన్ దేశానికి చెందిన సాగరతీరాలు ఎక్కువ సంఖ్యలో బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్స్ను సొంతం చేసుకున్నాయి. స్పెయిన్లో ఇప్పటి వరకు మొత్తం 566 బీచ్లు ఈ సర్టీఫికెట్ పొందగా, గ్రీస్ 515, ఫ్రా న్స్ 395 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ పొందాయి. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్లకు ఈ సర్టీఫికెట్ లభించింది. బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరణ కొమ్మాది(భీమిలి): రానున్న కాలంలో మరిన్ని బీచ్ లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. రుషికొండ బీచ్లో శనివారం బ్లూ ఫ్లాగ్ను జేసీ కె.ఎస్.విశ్వనాథన్, బ్లూ ఫ్లాగ్ ఇండియా ఆపరేటర్ డాక్టర్ కురూప్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్, సమాచారశాఖ జేడీ వి.మణిరామ్ పాల్గొన్నారు. మన దేశంలో 2018లో తొలిసారిగా.. భారతదేశంలోనే కాదు.. ఆసియా ఖండంలో ఈ సర్టీఫికెట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని ’చంద్రబాగ్’ బీచ్. ఇది 2018లో ఈ సర్టిఫికెట్ పొందింది. ఆ తర్వాత ఇండియాలో మరో 12 తీర ప్రాంతాలను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ పొందే స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని పర్యావరణశాఖ ఆధ్వర్యంలో పని చేసే సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్ మెంట్కు అప్పగించింది. తొలి సారిగా భారత్కు చెందిన 13 బీచ్లు ఇందుకు అర్హత సాధించగా.. ఇప్పటి వరకూ 12 బీచ్లలో బ్లూ ఫ్లాగ్ ఎగురుతోంది. ఇవీ బ్లూ ఫ్లాగ్ బీచ్లు.. మొత్తంగా 12 బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉండగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క తీరంలో నీలి జెండా రెపరెపలాడుతోంది. 2020 అక్టోబర్ 10న రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ దక్కింది. అప్పటి నుంచి వరుసగా మూడేళ్లు ఎఫ్ఈఈ రుషికొండకు బ్లూ ఫ్లాగ్ను రెన్యువల్ చేస్తోంది. ఇంకా మనదేశంలో చంద్రబాగ్, రుషికొండతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. పుదుచ్ఛేరిలోని ఈడెన్ బీచ్, గుజరాత్లోని శివరాజ్ పూర్, డయ్యూలోని ఘోఘ్లా, కర్ణాటకలోని కసర్కోడ్, పడుబిద్రి బీచ్లు, కేరళలోని కప్పడ్, ఒడిశా నుంచి పూరి గోల్డెన్ బీచ్, అండమాన్ నికోబార్ దీవుల నుంచి రాధానగర్ బీచ్, లక్షద్వీప్ నుంచి మినికోయ్ తుండి, కద్మత్ బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టీఫికేషన్ దక్కించుకున్నాయి. -
Love Marriage: మాచారెడ్డి అబ్బాయి వెడ్స్ అమెరికా అమ్మాయి
మాచారెడ్డి: అమెరికా అమ్మాయి మాచారెడ్డి అబ్బాయి వివాహానికి కామారెడ్డి పట్టణం వేదికైంది. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన సిద్దంశెట్టి గంగ, రమేశ్ల పెద్ద కుమారుడు సాయి సంకేత్ చదువుకోవడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ సహాధ్యాయి అయిన కన్సిలో ఎలిజబెత్, ఫ్రాన్సిస్కో ఎర్నిస్టోల కూతురు రిషికతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురూ తమ తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో శనివారం రాత్రి కామారెడ్డిలోని సత్య గార్డెన్లో వివాహ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. (చదవండి: TSPSC: పేపర్ లీక్లో కొత్త కోణం.. ఉద్యోగికి హానీట్రాప్!) -
రైల్వే కానిస్టేబుల్ పాడుపని.. సిట్జర్లాండ్ మహిళలతో అసభ్యంగా..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో ఓ రైల్వే కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. తేజస్ ఎక్స్ప్రెస్లో స్విట్జర్లాండ్కు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెపై భౌతికంగా దాడి చేయబోయాడు. ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉన్నా పట్టించుకోకుండా కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అతిథి అని కూడా చూడకుండా విదేశీ మహిళను వేధించిన ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పేరు జితేంద్ర సింగ్. గత ఏడాదిన్నరగా యూపీ ఫిరోజాబాద్లోని ఆర్పీఎఫ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
పుట్టపర్తి: వస్తే.. వెళ్లలేమప్పా!.. విదేశీ అతిథుల మన్ననలు..
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతుల కలబోతగా ప్రతిబింబిస్తోంది. విదేశీ అతిథులు తమ సంప్రదాయాలను వదిలి.. తెలుగు డ్రెస్ కోడ్ను ఇష్టపడుతుంటారు. మన వంటకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ జీవనశైలిని పాటిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనలో సంప్రదాయాలను అనుసరిస్తారు. సుమారు 150 దేశాల నుంచి యాత్రికులు పుట్టపర్తి వస్తుంటారు. విదేశీ సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు మన సంప్రదాయాలను అనుసరిస్తారు. భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇదో గర్వకారణమని పుట్టపర్తివాసులు చెబుతున్నారు. సాయిబాబా చలువ వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. విదేశీయులు మెచ్చే విధంగా పుట్టపర్తిలో వసతి అందుబాటులో ఉంది. హోటళ్లు, వస్త్ర దుకాణాలు, సంగీత పరికరాల అంగళ్లు ఉన్నాయి. విదేశీయులు మెచ్చే విధంగా హోటళ్లలో అలంకరణ కనిపిస్తుంది. సుమారు 10 లాడ్జిలు, 30 హోటళ్లు విదేశీయులకు నచ్చేశైలిలో అందుబాటులో ఉన్నాయి. భారత దేశానికి వచ్చినా.. ఇక్కడి దర్శనీయ స్థలాలను చూసినా వదిలి వెళ్లలేమని విదేశీ అతిథులు అంటున్నారు. ఇక్కడ పాటించే ఆచార వ్యవహారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెబుతున్నారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
RBI: విదేశీయులూ యూపీఐ చెల్లింపులు చేయొచ్చు!
విదేశీ టూరిస్టులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మంచి వెసులుబాటు కల్పించనుంది. వారు భారత్లో ఉన్నప్పుడు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసుకునేలా అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. దీంతో భారత్కు వచ్చిన విదేశీయులు తమ బ్యాంకు ఖాతాలను ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి చెల్లింపు యాప్లకు అనుసంధానించుకుని చెల్లింపులు జరపవచ్చు. మొదటగా జీ20 దేశాల అతిథులకు.. మొదటగా జీ20 దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు ఎంపిక చేసిన ఎయిర్ పోర్టుల్లో ఈ అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన ప్రకటన సందర్భంగా వెల్లడించారు. యూపీఐ అనేది దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న చెల్లింపు వ్యవస్థ అని, ఇటీవల ఎన్ఆర్ఐలకు కూడా దీని సేవలను విస్తరించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే విదేశీయులకు యూపీఐ చెల్లింపుల అవకాశం ఉంటుందని, క్రమంగా దీన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: RBI repo rate hike షాకింగ్ న్యూస్: ఇక ఈఎంఐల బాదుడే బాదుడు!) -
వినసొంపుగా వయోలిన్ వాయిస్తూ.. అందరిని ఆకర్షిస్తూ..
సాక్షి, బెంగళూరు: జీవనోపాధి కోసం కళలను రోడ్డుపై ప్రదర్శించడం విదేశాలలో సాధారణంగా చూస్తూ ఉంటాము. అటువంటి దృశ్యమే ఓ ధార్మిక క్షేత్రంలో కనిపించింది. పొట్టకూటి కోసమే లేక తన కళను చూపించాలనో తపనో తెలియదు కాని ఓ విదేశీ మహిళ దేశం కాని దేశం వచ్చి వయోలిన్ వాయిస్తూ డబ్బు సంపాదన చేస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలో ప్రముఖ ధార్మిక క్షేత్రమైన కుమటా తాలూకా గోకర్ణకు వచ్చే విదేశీయులు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. రెండు రోజులుగా ఓ విదేశీ యువతి వయోలిన్ను వినసొంపుగా వాయిస్తూ రోడ్డు పక్కన నిలబడి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ప్రజలు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఆమె ఆర్థిక సమస్యల వల్ల ఇలా యాచిస్తోందో, లేక కళారాధన చేస్తోందో తెలియడం లేదని స్థానికులు చెప్పారు. చదవండి: పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనక తప్పదు! ముందుంది పెను ముప్పు? -
మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి!
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా దేశ రాజధానిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు అదుపులోకి తీసుకుంది యాంటీ డ్రగ్స్ ఫోర్స్. దీంతో దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమవారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసి సుమారు 100 మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టు ముట్టారు. నైజీరియన్లను వారి నుంచి విడిపించేందుకు పోలీసులకు చుక్కులు చూపించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశం పంపించేందుకు నెబ్సరాయ్లోని రాజుపార్క్కు శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్కొటిక్స్ సెల్ బృందం వెళ్లింది. వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే పోలీసులను 100 మంది ఆఫ్రికన్లు చుట్టుముట్టారు. వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ముగ్గురిలో ఇద్దరు పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. 22 ఏళ్ల పిలిప్ అనే వ్యక్తి దొరికిపోయాడు. పోలీసులపై మూకదాడి సమాచారం అందుకున్న నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్ బృందం, నార్కొటిక్స్ స్క్వాడ్ సాయంత్రం 6.30 గంటలకు రాజ్పార్క్కు చేరుకుంది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. మళ్లీ సుమారు 150-200 మంది ఆఫ్రికన్ దేశాల ప్రజలు పోలీసులను చుట్టుముట్టారు. పోలీసుల చెరలో ఉన్న వారు తప్పించుకునేందుకు సాయం చేశారు. వారిని చెదరగొట్టిన పోలీసులు నిందితులను నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి వారిని స్వదేశాలకు పంపించనున్నారు. Delhi Cops Arrest 3 On Drug Charge, Foreigners' Mob Brings Them Back https://t.co/Ggnt34m0rC pic.twitter.com/tFJLQBcF1L — NDTV (@ndtv) January 8, 2023 ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
విదేశీయులకు షాకిచ్చిన కెనడా
స్థిరాస్తుల (ఇళ్లు) కొనుగోళ్లు,అమ్మకాల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1,2023 నుంచి రెండేళ్ల పాటు కెనడాలో విదేశీయులు ఇళ్లను కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అధికారిక ప్రకటన చేశారు. కోవిడ్ -19 కారణంగా 2020 నుంచి కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు పలువురు రాజకీయ నాయకులు ఇళ్లపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీంతో అక్కడ ఇళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఆ కొరత తగ్గించాలని కెనడీయన్లు ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ఆ మరసటి ఏడాది దేశ ప్రధాని పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా తరుపున ట్రూడో రెండోసారి ప్రధాని పదవి కోసం బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లను రెండేళ్ల పాట బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీయే ట్రూడో రెండోసారి ప్రధాని అయ్యేందుకు దోహదపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతి అటుంచితే.. ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచి సామాన్యుల వరకు కెనడాలో ఇళ్లను కొనుగోలు చేయడానికి వీల్లేదంటూ అధికారిక ప్రకటన చేశారు. ఈ కొత్త చట్టంతో కెనడాలో ఇల్లు కొనుగోలు చేసే అవకాశం విదేశీయులు కోల్పోనున్నారు. వడ్డీ రేట్ల పెంపు కెనడియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ (సీఆర్ఈఏ) లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 2022లో ఇళ్ల ధరలు యావరేజ్గా $800,000 పెరిగాయి. ఆ తర్వాత 13శాతం తగ్గాయి. అదే సమయంలో కెనడా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచింది. ఫలితంగా మార్టిగేజ్ ఇంట్రస్ట్ రేట్లు భారీగా పెరిగాయి. 2019 నుంచి ఇళ్ల ధరలు 38శాతం పెరిగినట్లు నివేదించగా.. అమ్మకానికి ఉన్న గృహాల జాబితా ప్రీకోవిడ్ ముందుకు చేరాయని తెలిపింది. ఆందోళనలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఇళ్ల కొనుగోళ్లపై కెనడా ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయంపై ఆదేశ రియల్ఎస్టేట్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిషేధం కెనడియన్లు, ప్రత్యేకించి వింటర్ సీజన్లో ఇక్కడ ఉన్న ఇళ్లను అమ్మేసి విదేశాల్లో కొనుగోలు చేయాలనుకునే వారికి, లేదంటే విదేశీయులు కెనడాలో ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటే మెక్సికో, యూఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. చివరిగా::: మోర్టిగేజ్లోన్ అంటే ఓ వ్యక్తికి సొంతంగా ఓ ఇల్లు ఉండి పోషణ నిమిత్తం మోర్టిగేజ్లోన్ పేరిట కొంత మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్గా తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు విఫలమైనా, లేదంటే మరణించినా.. మోర్టిగేజ్లోన్లో ఉన్న ఇంటిని బ్యాంక్ అధికారులు వేలంలో అమ్మేస్తారు. ఆక్షన్లో వచ్చిన మొత్తంలో ఎంత లోన్ ఇచ్చారో తీసుకొని మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు. -
బిహార్లో నలుగురు విదేశీయులకు కరోనా.. ‘దలైలామా’ ఈవెంట్ వేళ కలకలం
పట్నా: కోవిడ్ మరోమారు విజృంభిస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచింది భారత్. ఎయిర్పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బిహార్లోని గయా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్గా తేలింది. అందులో ముగ్గురు ఇంగ్లాండ్, ఒకరు మయన్మార్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. కోవిడ్ పాజిటివ్గా తేలిన విదేశీయులను ఐసోలేషన్కు తరలించారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని గయా సివిల్ సర్జన్ రంజన్ కుమార్ సింగ్ తెలిపారు. ఎయిర్పోర్ట్లో మొత్తం 33 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్గా తేలింది. డిసెంబర్ 20న వారంతా బ్యాంకాక్ నుంచి గయా ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఇంగ్లాండ్ దేశీయులను బోధ్ గయాలోని హోటల్లో ఐసోలేషన్లో ఉంచగా.. మయన్మార్కు చెందిన వ్యక్తి ఢిల్లీకి వెళ్లారు. బోధ్ గయాలో డిసెంబర్ 29న బౌద్ధమత గురువు దలైలామా ప్రసంగం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా విదేశీ భక్తులు హాజరవుతారని అంచనా. 50 దేశాలపైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఈవెంట్కు మూడు రోజుల ముందు నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్గా తేలడం కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది? -
పర్యాటక ఏపీ.. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో మూడో ర్యాంకు
సాక్షి, అమరావతి: దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం సాధించింది. గత ఏడాది (2021) 9.32 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. 2021లో 11.53 కోట్ల మంది తమిళనాడును సందర్శించినట్లు ఆ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకులో ఉండగా, కర్ణాటక నాలుగో ర్యాంకు, మహారాష్ట్ర ఐదో ర్యాంకులో ఉన్నాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సందర్శనలో దాదాపు 65.41 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దేశీయ పర్యాటకుల్లో తమిళనాడును 17.02 శాతం, ఉత్తరప్రదేశ్ను 16.19 శాతం, ఆంధ్రప్రదేశ్ను 13.77 శాతం, కర్ణాటకను 12 శాతం, మహారాష్ట్రను 6.43 శాతం మంది సందర్శించినట్లు తెలిపాయి. 2021లో దేశీయ పర్యాటకుల వృద్ధి ఆంధ్రప్రదేశ్లో 31.69 శాతంగా గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల వృద్ధి 11.05 శాతమే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన వారి సంఖ్య క్షీణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో 2021లో దేశీయ పర్యాటకుల్లో వృద్ధి –19.99 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2019లో కూడా మూడో ర్యాంకులో ఉంది. అయితే 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగో ర్యాంకు పొందింది. 2021లో మళ్లీ పుంజుకొని మూడో ర్యాంకులోకి వచ్చింది. 2019 నుంచి 2021 వరకు టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటోంది. 2019లో ఆంధ్రప్రదేశ్ను 23.70 కోట్ల మంది దేశీయ పర్యాటకులు సందర్శించారు. కోవిడ్ ఆంక్షలు కారణంగా 2020లో 7.08 కోట్ల మందే వచ్చారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకుల సంఖ్య 2021లో గణనీయంగా తగ్గిపోయినట్లు పర్యాటక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం విదేశీ పర్యాటకుల సంఖ్య 7.17 మిలియన్లు ఉండగా 2021లో 1.05 మిలియన్లకు తగ్గిపోయింది. 2020తో పోల్చి చూస్తే 2021లో దేశం మొత్తం మీద విదేశీ పర్యాటకుల సంఖ్య 85.29 శాతం క్షీణించింది. 2019లో ఏపీలో విదేశీ పర్యాటకుల సంఖ్య 0.89 శాతం వృద్ధి ఉండగా కోవిడ్ కారణంగా 2020లో ఏపీలో 70.12 శాతం మేర, 2021లో 59.24 శాతం మేర క్షీణించింది. -
‘స్మార్ట్’ గైడ్.. ఒక్క క్లిక్తో ఎక్కడెక్కడికో.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ‘స్మార్ట్ ట్రావెలింగ్’ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ను ట్రావెల్ టూల్గా ఉపయోగిస్తూ దేశ, విదేశాలను చుట్టేస్తున్నారు. మధ్యవర్తులు, టూర్ ఆపరేటర్లు లేకుండానే ఒక్క క్లిక్తో అరచేతిలో సమాచారాన్ని వీక్షిస్తూ ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా 18 నుంచి 64 ఏళ్ల వయసు గల ప్రయాణికుల్లో 71% మంది తమ పర్యటనల కోసం స్మార్ట్ ఫోన్లపై ఆధారపడుతున్నారు. భారతదేశంలో అత్యధికంగా 87% మంది ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ సాయంతోనే తమ ప్రయాణాలు చేస్తున్నట్లు గూగుల్, ఫోకస్ రైట్ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. ఫోన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లోని వాయిస్ మోడ్లో సూచనలు, టికెట్ బుకింగ్లో డిజిటల్ అసిస్టెంట్ సేవలు సులభంగా లభిస్తున్నాయి. పర్యాటకులు ఎంపిక చేసుకున్న ప్రదేశాలకు నావిగేషన్ సాయంతో తేలికగా చేరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రావెల్ కంపెనీలు కూడా కస్టమర్ జర్నీకి అనుగుణంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సేవలను ప్రవేశపెడుతున్నాయి. పర్యాటక రంగానికి ఊతం... భారతదేశం నుంచి 2024 నాటికి సుమారు 8 కోట్ల మంది విదేశీ పర్యటనలు చేస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆసియా పసిఫిక్ డెస్టినేషన్ ఫోర్కాస్ట్–2022–24 రిపోర్టు ప్రకారం రానున్న రెండేళ్లలో 1.34 కోట్ల మంది విదేశీయులు భారతదేశాన్ని సందర్శిస్తారని అంచనా. దీనివల్ల కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రచారంలో డిజిటల్ పోటీ... కేరళ, మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఆన్లైన్ వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే కేరళ ప్రభుత్వం వర్చువల్ ట్రావెల్ గైడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా టూరిజం లొకేషన్లను సులభంగా తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో వాటిని విరివిగా ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) కూడా సాంకేతిక వ్యవస్థను మెరుగుపరుస్తోంది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా పర్యాటకులు కచ్చితత్వంతో తమ ప్రయాణాలను ఎంపిక చేసుకునేలా సేవలు అందించనుంది. స్థానిక కళలు, చేతివృత్తులను ప్రోత్సహించేలా పర్యాటక రంగానికి అనుసంధానిస్తూ జీఐఎస్ వెబ్సైట్ను రూపొందిస్తున్నారు. -
ఇంగ్లండ్, వేల్స్ విదేశీ నివాసితుల్లో భారతీయులదే అగ్రస్థానం
లండన్: ఇంగ్లండ్, వేల్స్లో ఉండే ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టిన వారే కాగా, ఇందులో 1.5 శాతంతో భారతీయులు అగ్రభాగంలో ఉన్నట్లు తేలింది. ఇంగ్లండ్, వేల్స్లోని నివాసితుల్లో విదేశాల్లో జన్మించిన వారు 2011లో 75 లక్షల మంది (13.4%) ఉండగా, 2021 నాటికి కోటి మంది (16.8%)కి చేరారని యూకే ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) గణాంకాలను వెలువరించింది. ఇంగ్లండ్, వేల్స్ నివాసితుల్లో యూకే వెలుపల జన్మించిన వారిలో అత్యధికులు 9.20 లక్షల మంది భారత్కు చెందిన వారే. ఆ తర్వాతి స్థానంలో 7.43 లక్షల మంది (1.2%)తో పోలండ్, 6.24 లక్షల మంది (1%)తో పాకిస్తాన్ మూడో స్థానంలో నిలిచాయి. 2011లో చేపట్టిన గణాంకాల్లోనూ భారత్, పోలండ్, పాకిస్తాన్లే మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. కాగా, యూకేలోని స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ ప్రాంతాల వివరాలను ఓఎన్ఎస్ పేర్కొనలేదు. ఇదీ చదవండి: COP 27: పాపం మీది.. పరిహారమివ్వండి.. పేద దేశాల డిమాండ్ -
చైనా ఆలోచనే డిఫరెంట్.. జిన్పింగ్ సర్కార్ను తిట్టిపోస్తున్న చైనీయులు!
బీజింగ్: మంకీపాక్స్ వైరస్ సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తమ ప్రజలకు చైనా వైద్య నిపుణులు సూచించారు. విదేశీయులను, విదేశాల నుంచి వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తాకవద్దని చెప్పారు. చైనాలోని తొలి మంకీపాక్స్ కేసు చాంగ్ఖింగ్ సిటీలో శుక్రవారం బయటపడింది. ఈ నేపథ్యంలో చైనాలో పేరుగాంచిన అంటువ్యాధుల నిపుణుడు వూ జున్యూ పలు సూచనలు జారీ చేశారు. స్కిన్ టు స్కిన్ కాంటాక్టు వల్ల మంకీపాక్స్ సోకుతుందని, అందుకే విదేశీయులను, ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిని ముట్టుకోవద్దని తెలియజేశారు. అయితే, వూ జున్యూ సూచనలపై చైనాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవి జాత్యహంకారాన్ని, జాతి వివక్షను ప్రోత్సహించేలా ఉన్నాయని జనం విరుచుకుపడుతున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. చైనాలో ఇప్పటికీ కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా, చైనాలో ఇటీవల మంకీపాక్స్ తొలి కేసు నమోదైంది. విదేశాల నుంచి ఇక్కడి చాంగ్క్వింగ్ నగరానికి చేరుకున్న ఓ వ్యక్తి.. కొవిడ్తో క్వారంటైన్లో ఉన్న సమయంలోనే మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే విదేశీయులను తాకవద్దంటూ సూచనలు చేశారు. Chief epidemiologist at the Chinese Centre for Disease Control and Prevention, Wu Zunyou, warned people not to touch foreigners after mainland China confirmed its first case of #monkeypox infectionhttps://t.co/enlrbXRqzc — IndiaToday (@IndiaToday) September 19, 2022 -
దేశాలు దాటిన ప్రేమ.. తల్లిదండ్రుల అనుమతితో రాష్ట్రానికి రప్పించి..
సాక్షి, చెన్నై: ఆన్లైన్లో ప్రేమించిన విదేశీ యువతిని రామేశ్వరం ఆలయంలో హిందూ సంప్రదాయ ప్రకారం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగళం ప్రాంతానికి చెందిన కాళిదాసు (30). ఇతని తండ్రి సబ్ ఇన్స్పెక్టర్గా పని చేసి విశ్రాంతి పొందారు. విదేశాల్లో పని చేస్తూ వచ్చిన కాళిదాసు కరోనా కారణంగా సొంత ఊరికి వచ్చాడు. గత రెండేళ్లుగా ఇంటి నుంచి అన్లైన్లో పని చేస్తూ వచ్చిన అతనికి యూరప్కి చెందిన హానా బొమిక్లోవా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఆన్లైన్లోనే ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తమిళ సంప్రదాయం ప్రకారం ఆమెను వివాహం చేసుకోవడానికి కాళిదాసు ఇష్టపడ్డాడు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ప్రియురాలిని రాష్ట్రానికి రప్పించాడు. ఇరు కుటుంబాల సమ్మతితో వారి వివాహము రామేశ్వరంలోని భద్రకాళి అమ్మన్ ఆలయంలో బుధవారం ఘనంగా జరిగింది. తర్వాత వధూవరులు రామనాథస్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. చదవండి: (తమిళనాడు అబ్బాయి, దక్షిణ కొరియా అమ్మాయి.. అలా ఒకటయ్యారు!) -
తిప్పి పంపడానికి తిప్పలెన్నో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తూ పోలీసులకు పట్టుబడిన విదేశీయులను వారి దేశాలకు పంపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి డిపోర్టేషన్ సెంటర్లో ఉంచుతారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సెంటర్ను తాత్కాలిక ప్రాతిపదికన నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఏర్పాటు చేశారు. సరైన వసతులు, సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ ఉంటున్న విదేశీయులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి వైఖరి పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే డిపోర్టేషన్ సెంటర్ను అనువైన ప్రాంతానికి మార్చాలంటూ నగర పోలీసుల దాదాపు ఏడాది క్రితం పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించట్లేదు. నగరంలోనే బెడద ఎక్కువ.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే నగరంలోనే ‘ఈ విదేశీయుల’ బెడద ఎక్కువగా ఉంటోంది. విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి నేపథ్యంలో, కల్చర్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగానూ అనేక మంది విదేశీయులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు ఇక్కడే అక్రమంగా ఉండిపోతున్నారు. ప్రధానంగా సూడాన్, సోమాలియా, నైజీరియా, యమెన్, కెన్యా, జిబౌటీ తదితర దేశాల నుంచి వస్తున్న వారితోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. ఇలా అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్) ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ సెంటర్గా పిలిచే చోట నిర్భంధించి ఉంచుతారు. ఉమ్మ డి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ఆపై తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్ సీసీఎస్ డిపోర్టేషన్ సెంటర్గా మా రింది. విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే వారి దేశాలకు పంపడం సాధ్యం కాదు. భాష అర్థం కాక.. ఆహారం అందించలేక.. చిక్కిన వారి వివరాలను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు (ఎఫ్ఆర్ఆర్ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సాయంతోనే డిపోర్ట్ చేయాలి. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్లోనే ఉంచాలి. డిపోర్టేషన్ సెంటర్ ఏర్పాటుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్లేటర్లు, వారికి అనువైన ఆహారం వండి ఇవ్వడానికి కుక్స్ ఉండాలి. సదరు సెంటర్ సైతం సువిశాల స్థలం మధ్యలో భవంతులతో నిర్మితం కావాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇవేవీ లేకుండా సీసీఎస్లోని ఓ సెల్ను డిపోర్టేషన్ సెంటర్గా మార్చారు. దీంతో ఇక్కడి విదేశీయుల భాష అర్థం కాక, వారు అడిగిన ఆహారం అందించలేక, వసతుల లేమి నేపథ్యంలో వాళ్లు చేస్తున్న హంగామా భరించలేక పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. వీటిని గమనించిన ఉన్నతాధికారులు డిపోర్టేషన్ సెంటర్ను అనువైన ప్రాంతానికి మార్చాలంటూ దాదాపు ఏడాది క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ సెంటర్ సీసీఎస్లోనే కొనసాగుతోంది. (చదవండి: 6 నెలల ముందే అభ్యర్థులు) -
పార్క్లో బట్టలు లేకుండా సంచరిస్తూ.. కనిపించిన వారితో..
బనశంకరి(బెంగళూరు): ఒంటిపై దుస్తులు లేకుండా ఉద్యానవనాల్లో సంచరిస్తూ పర్యాటకులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విదేశీ పర్యాటకున్ని ఆదివారం సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్చేశారు. జేమ్స్ అనే విదేశీయుడు శివరామకారంత లేఔట్పార్కులో బట్టలు లేకుండా తిరుగుతుండగా స్థానికులు సమాచారం అందించడంతో సంపిగేహళ్లి పోలీసులు వచ్చి అతన్ని పట్టుకోబోయారు. దీంతో పోలీసులపై దాడికి యత్నించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరో ఘటనలో.. చిన్నారిని చిదిమేసిన టిప్పర్ మండ్య: మద్దూరు తాలూకా దుండనహళ్లిలో ఘోరం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన భూమిక (6) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడే ప్రాణాలు విడిచింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై గ్రామస్తులు మండిపడ్డారు. పెద్దసంఖ్యలో జనం రోడ్డుపై ధర్నా చేసి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కెస్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: పదిరోజుల్లో తేజ పెళ్లి.. పెద్దలు పత్రికలు పంచుతుంటే.. -
విదేశీ వనిత కేసులో ఇద్దరికి అర్ధ జీవిత ఖైదు
నెల్లూరు (లీగల్): విదేశీ పర్యటనకు వచ్చిన వనితపై లైంగిక దాడికి యత్నించిన మనుబోలు మండలం బద్దవోలు వెంకన్నపాలేనికి చెందిన ఇంగిరాల సాయికుమార్, గూడూరు శారదనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహ్మద్అబీద్లకు జీవిత కాలంలో సగభాగం జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి.సుమ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. లిథువేనియా దేశానికి చెందిన ఓ విదేశీ వనిత శ్రీలంకకు వచ్చారు. అక్కడి నుంచి ఈ ఏడాది మార్చి 7న చెన్నైకి చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో బెంగళూరుకు వెళ్తుండగా ఆమె వద్ద ఉన్న కరెన్సీ చెల్లుబాటు కాకపోవడంతో కండక్టర్ దిగి పొమ్మన్నారు. బస్సులో ఉన్న సాయికుమార్ గమనించి ఆమెకు నగదు సాయం చేసి బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమెను బద్దవోలు వెంకన్నపాలెంలో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు తన స్నేహితుడు అబీద్తో కలిసి విదేశీ వనితను సైదాపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరూ లైంగిక దాడికి యత్నించారు. ఆమె తప్పించుకుని రోడ్డుపై వెళ్తున్న స్థానికుల సాయంతో సైదాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ విజయరావు ప్రత్యేక దృష్టి సారించి కేసును దిశ పోలీసులకు అప్పగించారు. విదేశీ వనిత కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసింది. దర్యాప్తు అనంతరం 10 రోజుల్లో కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేసింది. కేసుపై ప్రత్యేక దృష్టి సారించి 57 రోజుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాధుప్రసాద్ కేసు వాదించారు. జిల్లాలో అతి తక్కువ రోజుల్లో కేసు విచారణ చేసి తీర్పు వెలువరించడం గమనార్హం. -
Omicron: ‘నాన్ రిస్క్’ నుంచే రిస్క్!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయాల్లో కేవలం రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎక్కువగా దృష్టి పెట్టి పరీక్షలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో నమోదైన మూడు ఒమిక్రాన్ కేసులూ నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల విషయంలో తీసుకోవల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయాలని, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్గా పరీక్షలు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. 11 దేశాలను రిస్క్ కేటగిరీ కింద గుర్తించారు. ఇందులో జర్మనీ, ఫ్రాన్స్, కెనడాతో పాటు యూఎస్, యూకే తదితర దేశాలున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన అందరు ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ర్యాండమ్గా శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చి పాజిటివ్గా తేలిన వారి నమూనాల్లో ఒమిక్రాన్ను గుర్తించేందుకు జీనోమ్ స్వీక్వెన్సింగ్కు పంపిస్తున్నారు. వారిని విమానాశ్రయం నుంచి నేరుగా టిమ్స్కు తరలిస్తున్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారి నుంచి (2 శాతం) కేవలం నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్ ఫలితం రాకముందే పంపేస్తున్నారు. ఇలా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 7,018 మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో నాన్ రిస్క్ దేశాలకు చెందిన వారు 1,622 మంది ఉన్నారు. ఈ విధంగా నిర్దేశించిన 2 శాతం కంటే ఎక్కువగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షలు చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా 3 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అందరినీ పరీక్షించాలి రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రిస్క్, నాన్ రిస్క్ దేశాలనే దానితో సంబంధం లేకుండా విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడిపైనా దృష్టిపెట్టి పరీక్షలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన మూడు కేసులు జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని అంటున్నారు. అలాగే ర్యాండమ్గా పరీక్షలు నిర్వహిస్తున్న వారిని ఆర్టీపీసీఆర్ ఫలితం వచ్చేవరకు ఆపకుండా పంపించేయడం కూడా సమంజసం కాదని పేర్కొంటున్నారు. ఇలా పంపించేయ డం వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బయట పడిన 3 కేసులు ఇందుకు నిదర్శనమని అంటున్నారు. చదవండి: శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన -
సికింద్రాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ స్కామ్
సాక్షి, హైదరాబాద్: అమెరికాతో పాటు ఇంగ్లాడ్, ఐర్లాండ్ దేశాల్లో ఉన్న వారిని టార్గెట్గా చేసుకుని, సికింద్రాబాద్ కేంద్రంగా సాగుతున్న కాల్ సెంటర్ స్కామ్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. సోమవారం రాత్రి సదరు బోగస్ కాల్ సెంటర్పై దాడి చేసిన ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. ఆయా దేశాలకు చెందిన కొన్ని వందల మంది వీళ్లు ట్యాక్సులు, క్రిమినల్ కేసుల పేరుతో బెదిరించి భారీగా డబ్బు గుంజినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే నిందితులను లోతుగా విచారిస్తున్న అధికారులు పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. నగరవాసులతో కూడిన ఓ అంతరాష్ట్ర ముఠా సికింద్రాబాద్లో ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. వీళ్లు వివిధ మార్గాల్లో అమెరికా, ఇంగ్లాడ్, ఐర్లాండ్లో ఉన్న పన్ను చెల్లింపుదారుల వివరాలు సేకరించారు. వారికి ఈ కాల్ సెంటర్ నుంచి టెలికాలర్స్ ద్వారా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) విధానంలో వారికి కాల్స్ చేయిస్తోంది. తాము రెవెన్యూ, కస్టమ్స్ విభాగాలకు చెందిన అధికారులుగా పరిచయం చేసుకుంటోంది. ఫలానా లావాదేవీలకు సంబంధించి పన్ను బకాయి ఉన్నారంటూ వారిని బెదిరిస్తోంది. ఆ మొత్తం పెనాల్టీతో సహా చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని బెదరగొడుతున్నారు. చదవండి: (Hyderabad: అమ్ముతావా.. చస్తావా!) అక్కడి వారితో ఒప్పందాలు.. ►ఆయా దేశాల్లో రెవెన్యూ, కస్టమ్స్ విభాగాలకు సంబంధించిన కేసులు కఠినంగా ఉండటం వీరికి కలిసి వచ్చింది. ఈ కాల్స్కు భయపడిన ఆయా దేశీయులు సెటిల్ చేసుకుంటూ కొంత మొత్తం చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. ►వీరితో డబ్బు బదిలీ చేయించుకోవడానికి అక్కడే ఉంటున్న వారితో ఒప్పందాలు చేసుకున్న కాల్ సెంటర్ నిర్వాహకులు వారి అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. ►ఇలా ఇప్పటికే వందల మంది నుంచి భారీ మొత్తాలు ఆయా బ్యాంకు ఖాతాలకు వెళ్లాయి. ఈ మొత్తంలో తమ కమీషన్ మిగుల్చుకుంటున్న ఖాతాదారులు మిగిలింది హవాలా మార్గంలో ఇక్కడి సూత్రధారులకు పంపుతున్నారు. ►దీనిపై అమెరికన్ కాన్సులేట్కు సమాచారం అందింది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బేగంపేట, టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి కాల్ సెంటర్పై దాడి చేశారు. ►కొందరు టెలీకాలర్లతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితులను పట్టుకునేందుకు వేట ముమ్మరం చేశారు. ►ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయనున్నారు. నిందితుల అరెస్టును నేడోరేపో నగర పోలీసు కమిషనర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
ఊరట: విదేశీయుల వీసా గడువు పొడిగింపు..
న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు విదేశీయులు భారత్లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం వారి వీసా గడువు పెంచుతూ నిర్ణయం తీసకుంది. దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు ఆగస్ట్ 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది కూడా కేంద్రం దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు పెంచిన సంగతి తెలిసిందే. మహమ్మారి కారణంగా సాధారణ కమర్షియల్ విమాన కార్యకలాపాలు 2020 మార్చి నుంచి రద్దయ్యాయి. లాక్డౌన్కు ముందే చెల్లుబాటు అయ్యే భారతీయ వీసాలపై మన దేశానికి వచ్చిన అనేక మంది విదేశీ పౌరులు ఇండియాలో చిక్కుకుపోయారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. లాక్డౌన్ కారణంగా భారత్లో చిక్కుకున్న విదేశీ పౌరులు తమ వీసా గడువును పొడిగించుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో జూన్ 30, 2020 తర్వాత గడువు ముగిసే అటువంటి విదేశీ పౌరులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020 జూన్ 29న వీసా గడువును పొడిగిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. 2020 సాధారణ అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తేదీ నుంచి మరో 30 రోజుల వరకు వీసా చెల్లుబాటు అవుతుందని తెలిపింది. తాజాగా మరో సారి ఇదే సమస్య తలెత్తడంతో ఆగస్టు 31, 2021 వరకు ఎటువంటి ఓవర్స్టే పెనాల్టీ విధించకుండా ఉచిత ప్రాతిపదికన దేశంలో చిక్కుకున్న వీదేశీయుల వీసా గడువు పొడగిస్తూ కేంద్రం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక విదేశీ పౌరులు తమ వీసా గడువు పొడిగింపు కోసం సంబంధిత ఎఫ్ఆర్ఆర్ఓ లేదా ఎఫ్ఆర్ఓకు ఎటువంటి దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. విదేశీ పౌరులు దేశం నుంచి వెళ్లే ముందు సంబంధిత ఎఫ్ఆర్ఆర్ఓ, ఎఫ్ఆర్ఓకు నిష్క్రమణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఓవర్స్టే జరిమానా విధించకుండా ఉచిత ప్రాతిపదికన మంజూరు చేయబడుతుంది అని కేంద్రం తెలిపింది. -
హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం
మాదాపూర్: హైటెక్ సిటీలోని ఓ స్టార్ హోటల్పై యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ దాడి చేసి విదేశీ యువతులు, మోడళ్లతో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసింది. నిర్వాహకుడు పరారీ కాగా, ఐదుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించింది. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్లోని ఓ స్టార్ హోటల్లో ఉజబెకిస్తాన్కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతుల పేరిట ఐదు రూమ్లు బుక్ చేశారు. నిర్వాహకులు అర్నవ్, ప్రిన్స్లు ఫోన్లో విటులతో మాట్లాడి హోటల్కు రప్పించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ సదరు హోటల్పై దాడి చేసింది. వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉజబెకిస్తాన్కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుంది. విటుడు షేక్పేట్కు చెందిన జ్ఞాన శేఖర్ మణికంఠన్(44)ను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ గదులలో రూ.29,560 నగదు, కండోమ్ ప్యాకెట్లు, సెల్ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. కాగా, యువతులను రెస్క్యూ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఊరట
సాక్షి, హైదరాబాద్; వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా విదేశాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. నాలుగు రోజుల్లోపు తిరుగు ప్రయాణ టికెట్లతో వ్యాపార నిమిత్తం వచ్చే వారు తమ ప్రయాణానికి 96 గంటల్లోపు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వస్తే క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా, వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వారు కేవలం 14 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉంటే చాలని తెలిపారు. అలాగే గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు, వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్న వాళ్లు హోమ్ క్వారంటైన్లో ఉండవచ్చు. నెగెటివ్ రిపోర్టు లేని వాళ్లు మాత్రం కచ్చితంగా 7 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు రెగ్యులర్ విమానాలు (ఎయిర్ ట్రాఫిక్ బబుల్ ఒప్పందం మేరకు) రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి వందే భారత్ మిషన్ కింద చార్టర్డ్ విమానాలు, ఇతర విదేశీ విమాన సర్వీసులు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు విదేశాల్లో చిక్కుకుపోయిన 55 వేల మంది నగరానికి చేరుకున్నారు. -
తబ్లిగీ జమాత్: వారిని బలిపశువులను చేశారు
ముంబై : ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 29 మంది విదేశీయులపై నమోదైన కేసులను శనివారం బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించింది. మార్చిలో ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీ పౌరులను బలి పశువులు చేశారని, కరోనా వ్యాప్తికి వారు కారణమయ్యారని అనవసర ప్రచారం జరిగిందని హై కోర్టు తెలిపింది. ఈ మేరకు 29 విదేశీయులపై నమోదైన కేసులను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ టీవీ నాలావాడే ఎంజీ సెవ్లికర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. (కేంద్ర నిర్ణయం : ఏకమైన విపక్షాలు) ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరించారని, రాజకీయ బలవంతంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని ధర్మాసనం పేర్కొంది. అలాగే వీరిపై సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేసినందుకు సోషల్ మీడియాపైనా బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరుకావడం ద్వారా దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైనట్లు అప్పట్లో పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. (అన్లాక్ 3.0: యూటీలు, రాష్ట్రాలకు కేంద్రం లేఖ) పర్యాటక వీసా అనుమతులను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 29 మంది విదేశీ పౌరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు తబ్లిగీ జమాత్ కార్యక్రమం 50 సంవత్సరాల నుంచి కొనసాగుతోందని, ఇది ఏడాదంతా సాగుతుందని వ్యాఖ్యానించింది. అతిథులను స్వాగతించే గొప్ప సంప్రదాయం, సంస్కృతిని భారతదేశ ప్రజలు నిజంగా పాటిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు పశ్చాత్తాపడాలని పేర్కొంది. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావొద్దని హెచ్చరించింది. -
టికెట్ల డబ్బులు తిరిగివ్వలేం..
జైపూర్: లాక్డౌన్ కాలంలో రంథమ్బోర్ పులుల అభయారణ్యాన్ని సందర్శించేందుకు టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి చెల్లించలేమని రాజస్థాన్ అటవీ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే ఆ డబ్బును రాష్ట్ర ఖజానాలో జమ చేసినందున తిరిగి ఇవ్వడం కష్టమని పేర్కొంది. అయితే ఓ వెసులుబాటు కల్పించింది. పర్యాటకులు ఎప్పుడైనా రాష్ట్రంలో పర్యటించవచ్చునని స్పష్టం చేసింది. ఇందుకు జూన్ 22, 2022 వరకు గడువు విధించింది. కాగా మార్చి 18 నుంచి జూన్ 30 మధ్య 28 వేల మంది పర్యాటకులు రంథమ్బోర్ పులుల అభయారణ్యాన్ని సందర్శించేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇందులో పది వేలమంది విదేశీయులు ఉన్నారు. (రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..) బుక్ చేసుకున్న టికెట్ల విలువ రూ.8 కోట్లు ఉంది. అయితే వీటిని తిరిగి చెల్లించడానికి బదులుగా జూన్ 2022లోపు ఎప్పుడైనా టైగర్ రిజర్వ్ను సందర్శించేందుకు అటవీ శాఖ అవకాశం ఇచ్చింది. ఇందుకోసం పర్యాటకులు మూడు తేదీలను సూచించాల్సిందిగా కోరింది. వాటిని పరిశీలించిన పిదప అందులో ఒక తేదీని ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. కాగా పులుల అభయారణ్యంలోకి ప్రవేశించిన అనంతరం వాటిని దగ్గర నుంచి వీక్షించేందుకు జిప్సీ, క్యాంటర్లలో వెళ్లాల్సి ఉంటుంది. వీటిని వినియోగించుకోవాలంటే స్వదేశీయులు 1100 రూపాయలు, 780 రూపాయలు చెల్లించాల్సి ఉండగా విదేశీయులు 1800, 1200 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. (అడవి బిడ్డే హక్కుదారు) -
అక్రమంగా అడుగిడుతూ.. ఇక్కడే స్థిరపడుతూ..
మనదేశంలో ఎంతమంది విదేశీయులు అక్రమంగా ఉంటున్నారన్న ప్రశ్నకు కేంద్ర హోం శాఖ వద్ద సమాచారం లేదు.’ తెలంగాణలో ఎందరు రోహింగ్యాలు పాస్పోర్టు, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారన్న విషయంపై ఆర్టీఐ దరఖాస్తుకు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఇంకా సమాధానం వెల్లడించలేదు. సాక్షి,హైదరాబాద్: విజిటింగ్ వీసాల పేరిట భారత్లోకి వస్తున్న విదేశీయులు ఏం చేస్తున్నారు? వారిపై నిఘా ఉందా? మొన్న తబ్లిగీ జమాత్ కోసం వచ్చిన ఇండోనేషియన్లు విజిటింగ్ వీసాను దుర్వినియోగం చేయడం, వారివల్ల దేశంలో కరోనా వ్యాపించడంపై ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వీసాలు రద్దు చేసి, వారిపై వీసా ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశాయి. అయితే ఇప్పటికే భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ వల్ల దేశంలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో అక్రమ వలసలకు తోడు విజిటింగ్ వీసాల మీద వచ్చిన వారిపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్లోని పలు ముఠాలు భారత్లో మానవ అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణా, దొంగనోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రదాడులకూ ప్రణాళికలు రచిస్తున్నాయి. వాటిలో దొంగనోట్లు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ.. దేశంలో విధ్వంసాలకు కారణంగా మారుతోంది. 9 లక్షలకు పైగానే.. తబ్లిగీ జమాత్ ఉదంతం నేపథ్యంలో ఆగస్టు 2019 నుంచి మార్చి 2020 వరకు దేశంలోకి ఎందరు విజిటింగ్ వీసాలపై వచ్చారన్న సమాచారం ‘సాక్షి’ సేకరించింది. దీనిపై బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్న భారత ఎంబసీకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఆగస్టు నుంచి మార్చి వరకు 9.6 లక్షల మంది బంగ్లాదేశీయులు విజిటింగ్ వీసాలపై భారత్లోకి వచ్చారు. అలాగే వియత్నాం నుంచి 1,126 మంది, కౌలాలంపూర్లోని 1,405 మంది ఇండోనేషియన్లకు భారత్లో పర్యటించేందుకు వీసాలు ఇచ్చామని వాళ్లెవరికీ మతపరమైన వీసాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. తెలంగాణలోనూ అధికంగా..! వివిధ దేశాల నుంచి విజిటింగ్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు వీసా గడువు ముగిసినా వెనక్కి వెళ్లట్లేదు. ఇలాంటి వారిలో కొందరు తెలంగాణలోనూ స్థిరపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్లో కలిపి 10 వేల మందికిపైగానే రోహింగ్యాలు, ఇతర విదేశీయులు అక్రమంగా ఉంటున్నారని సమాచారం. వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం కల్పిస్తుండగా మిగిలిన వారు భూములను కబ్జా చేసి స్థిర నివాసం ఏర్పరుచు కుంటున్నారు. ఆధార్, పాస్పోర్ట్, పా¯Œ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసె¯Œ ్స వంటి గుర్తింపు పత్రాలను సులువుగా సంపాదిస్తున్నారు. -
దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కారణంగా ఇండియాలో చిక్కుకు పోయిన విదేశీయులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించింది. విదేశీయుల వీసా గడువును పొడిగించింది. విదేశీయుల వీసాల చెల్లుబాటును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తరువులిచ్చింది. కరోనా వైరస్ కారణంగా బారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీ పౌరుల రెగ్యులర్ వీసా, ఇ-వీసా లేదా స్టే నిబంధనలను 30.04.2020 (అర్ధరాత్రి) వరకు పొడిగించినట్టు తెలిపింది. అటువంటి విదేశీ పౌరుల వీసాలను ఎలాంటి జరిమానా లేకుండా ఉచితంగా ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో దేశీయంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. అలాగే ఇతర దేశాలకు రాకపోకలను కూడా నిషేధించిన సంగతి విదితమే. కాగా దేశంలో 21 రోజుల లాక్డౌన్ రేపటితో ముగియనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడిగించాలని కోరుకుంటుండగా. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ను పొడిగించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (మంగళవారం) ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని తెలుస్తోంది. -
లాక్డౌన్: 500 సార్లు సారీ..
డెహ్రాడూన్: మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దయచేసి ఇంట్లోనే ఉండండి.. సామూహికంగా తిరగకండి అని చిలకకు చెప్పినట్లు చెప్పినా ఎవరూ చెవికెక్కించుకోవట్లేదు. దీంతో పోలీసులు లాఠీ ఝుళిపించక తప్పలేదు. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. తాజాగా విహారానికి అంటూ మూకుమ్మడిగా తిరుగుతున్న విదేశీయులకు రిషికేశ్ పోలీసులు తగిన గుణపాఠం నేర్పారు. వివరాల్లోకి వెళితే... శనివారం ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో పదిమంది విదేశీయులు లాక్డౌన్ ఆంక్షలను బేఖాతరు చేస్తూ బయటకు వచ్చారు. (కరోనా ఎఫెక్ట్: ఇకపై విదేశీయులకు నో ఎంట్రీ) కనీసం సామాజిక ఎడబాటును కూడా పట్టించుకోకుండా గంగా నదిలో విహరిస్తూ ఎంజాయ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని వారికి అరుదైన శిక్ష విధించారు. "నేను లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించాను, అందుకు క్షమించండి" అని వారితో 500 సార్లు రాయించారు. దీనికోసం పెన్నూ పేపర్ కూడా చేతికందించారు. మొదటిసారి కాబట్టి ఇలాంటి చిన్న శిక్షతో వదిలేస్తున్నామని, మరోసారి ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా విదేశీయులంతా ఇజ్రాయెల్, మెక్సికో, ఆస్ట్రేలియా, ఇతర యూరోపియన్ దేశాలకు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. (కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారత్ అగ్రస్థానం) -
విదేశీయునికి కరోనా పాజిటివ్
సాక్షి, అనంతపురం: బెంగళూరులో ఫ్రాన్స్కు చెందిన వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. కోవిడ్ స్టేట్ నోడల్ అధికారులు సదరు విదేశీయుడు పుట్టపర్తిలో ఎక్కడ బస చేశాడు? ఎవరితో సన్నిహితంగా ఉన్నాడు తదితర వివరాలు సేకరించాలని జిల్లా ఆరోగశాఖాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు ర్యాపిడ్ యాక్షన్ బృందం డాక్టర్ వాలీ్మకి శ్రీనివాస్, డాక్టర్ భీమసేనాచార్, డాక్టర్ రాంకిషోర్ (అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనాస్పత్రి), డీఎంఓ దోశారెడ్డి, పోలీసులు పుట్టపర్తిలో జల్లెడ పట్టారు. ఫ్రాన్స్ దేశస్తుడు కొమరైన్ అలైన్జెన్ (64) పుట్టపర్తిలోని సాయికుమార్ సాయికుమార్ లాడ్జ్లో బస చేశారని చెప్పడంతో బృందం అక్కడకు వెళ్లి ఆరా తీసింది. అధికారుల ఆదేశాల మేరకు విదేశీయులను లాడ్జి నుంచి ఖాళీ చేయించారు. దీంతో కొమరైన్ ఈ నెల 15న లాడ్జి ఖాళీ చేశాడు. 17వ తేదీ బెంగుళూరుకు వెళ్లిపోయాడు. శుక్రవారం బెంగుళూరులోని ఆస్పత్రిలోపరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో అధికారులు గురువారం రాత్రి సాయికుమార్ లాడ్జిని సీజ్ చేశారు. సదరు విదేశీయుడు పుట్టపర్తిలో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నాడు అని ఎస్పీ సత్యయేసుబాబు సైతం ఆరా తీశారు. ఐదుగురి నమూనాల సేకరణకు ఆదేశం పుట్టపర్తి చెందిన లాడ్జ్ యజమాని దంపతులు, ఓ వృద్ధురాలు, స్వీపర్, స్వీపర్ భర్తకు అధికారులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు తెల్సింది. శనివారం మరోసారి స్థానికంగా ఉండే వైద్యులు సర్వే చేయనున్నారు. మరో రెండు అనుమానిత కేసులు: కదిరి, తాడిపత్రి నుంచి మరో రెండు అనుమానిత కేసులు సర్వజనాస్పత్రికి వచ్చాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు అనంతపురం నుంచి రెండు అంబులెన్స్లను ఆయా ప్రాంతాలకు పంపారు. వెయ్యి టెస్టులకు సిద్ధం చేసుకోవాలి వైరల్ రీసెర్చ్ డయాగ్నస్టిక్ ల్యాబోరేటరీలో వెయ్యి కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన పరికరాలు, కెమికల్స్ సిద్ధం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డిల్లీరావు వైద్యులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం వైద్య కళాశాలలోని వీఆర్డీఎల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎన్ని పరీక్షలు జరిపారని, మౌలిక సదుపాయాలు ఏం కావాలని ఆరా తీశారు. ఆయన వెంట జాయింట్ డైరెక్టర్ సుదర్శన్, నోడల్ ఆఫీసర్ ఏపీ నాయుడు, వీఆర్డీఎల్ వైద్యులు తదితరులు ఉన్నారు. -
కరోనా ఎఫెక్ట్: ఇకపై విదేశీయులకు నో ఎంట్రీ
ఈటానగర్: కరోనా వైరస్(కొవిడ్-19) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. చైనాలో ప్రాణం పోసుకున్న ఈ మహమ్మారి ప్రస్తుతం 73 దేశాలను వణికిస్తోంది. పరస్పరం షేక్హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా మనుషులు ఆలోచిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తులను శత్రువుల కన్నా హీనంగా చూసి, దూరంగా వెళ్తున్న ఘటనలను ఎన్నింటినో మనం చూస్తున్నాం. ముందస్తు చర్యగా కరోనా వైరస్ను అడ్డుకునేందుకు అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత్ @ 39 అందులో భాగంగా రాష్ట్రంలోకి విదేశీయుల రాకపోకలపై నిషేధం విధించింది. విదేశీయులకు అనుమతులు(పీఏపీ) ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. చైనాతో సరిహద్దును పంచుకునే అరుణాచల్ ప్రదేశ్లోకి పీఏపీలకు ప్రవేశం అనుమతించాలని విదేశీయులు కోరుతున్నా అంగీకరించడంలేదు. తాజాగా కేరళలో ఒకే రోజు ఐదు కేసులు నమోదు కావడంతో అరుణాచల్ ప్రదేశ్ అప్రమత్తమై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
కొంపముంచిన ఫేస్బుక్ పరిచయం
సాక్షి, గుంటూరు: ఫేస్బుక్లో పరిచయమైన ఓ విదేశీ యువతి తనను దారుణంగా మోసం చేసిందని నరసరావుపేటకు చెందిన సీహెచ్ కృష్ణదాసు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీ అందించారు. ఫేస్బుక్లో తరచూ చాటింగ్ చేస్తున్న క్రమంలో నెల రోజుల క్రితం గిఫ్టు పంపుతున్నాను అని యువతి కృష్ణదాసుకు సమాచారం పంపింది. కొన్ని రోజుల తర్వాత రోజు మరో వ్యక్తి ఫోన్ చేసి గిఫ్ట్ వచ్చిందని పార్సిల్ తీసుకోవాలంటే రూ.30 వేలు కట్టాలని అని చెప్పాడు. దీంతో కృష్ణదాసు ఆన్లైన్లో ఆ నగదు చెల్లించాడు. మరుసటి రోజున మరో వ్యక్తి ఫోన్ చేసి ట్యాక్స్లు చెల్లిస్తేనే మీ పార్సిల్ తీసుకోవడం సాధ్యం అని చెప్పాడు. మొత్తం రూ.3 లక్షలు కట్టాలని చెప్పడంతో ఆ నగదు కూడా చెల్లించాడు. ఆ తర్వాత నుంచి వారి ఫోన్ స్విచ్చాఫ్ అయింది. విచారించి న్యాయం చేయాలని బాధితుడు వాపోయాడు. అలానే కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసగా మారి వేధిస్తున్నాడని నరసరావుపేటకు చెందిన శశికళ అనే మహిళ ఫిర్యాదు చేసింది. తన కాపురం చక్కదిద్దాలని వేడుకుంది. 95 కు పైగా ఫిర్యాదులు అందాయి. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు నా భర్త ఓ హాస్పటల్లో మేనేజర్గా పనిచేస్తుంటాడు. మాకు ముగ్గురు ఆడపిల్లలు. రెండేళ్ల క్రితం నాకు పుట్టింటి నుంచి వచ్చిన డబ్బుతో పాటు నేను దాచుకున్న డబ్బు రూ. 37 లక్షలు నా భర్త తీసుకున్నాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే తరచూ హింసిస్తున్నాడు. బాధలు భరించలేక రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేశానని మళ్లీ తీవ్రంగా కొట్టాడు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోగా నా భర్తకు వత్తాసు పలుకుతున్నారు. విచారించి న్యాయం చేయాలి. – జి.శ్రీలక్ష్మీ, గంగానమ్మపేట, తెనాలి -
విదేశీయుల ఆధ్యాత్మిక చింతన
నెల్లిమర్ల రూరల్: భారతదేశ యువత పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ.. భారతీయ సంస్కృతిని పెడచెవిన పెడుతున్న రోజుల్లో.. విదేశీయులు భారతదేశ సంస్కృతిని అమితంగా ఇష్టపడుతున్నారు. భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి నెల్లిమర్ల మండలం టెక్కలి గ్రామం వేదికైంది.వరల్డ్ టీచర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్ప్రెయిన్, జర్మనీ తదితర పది దేశాల నుంచి 100 మంది విదేశీయులు గ్రామానికి ఆదివారం విచ్చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆచారాలను, వ్యవహారశైలిని దగ్గరుండి తిలకించారు. గ్రామానికి విచ్చేసిన విదేశీయులకు ఆ గ్రామ ప్రజలు, జగద్గురు పీఠం సభ్యులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు దారి పొడువునా నిలిచి చిరునవ్వులతో పూలను అందించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణ నడుమ గ్రామ పోలిమేరల నుంచి పాదయాత్రగా టెక్కలిలో రామాలయానికి తీసుకువచ్చారు. విదేశీయులందరూ హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో విశేష పూజలు జరిపారు. గణపతి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి మురిసిపోయారు. అనంతరం ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలను సందర్శించి గో పూజలు నిర్వహించారు. ట్రస్టు ప్రతినిధులు బీఆర్కేరాజు, ఎన్వీఎస్ఎన్ మూర్తి, మాజీ సర్పంచ్ కర్రోతు రాజినాయుడు తదితరులు సేవలందించారు. ఏటా విశాఖకు విదేశీ బృందం... మానవుడికి కావాల్సిన జ్ఞానాన్ని అన్ని మతాలు బోధిస్తాయి. అలా మానవుడిని ఉన్నతిగా నడిపించడం కోసం చేసిన ప్రయత్మమే గురుతత్వం. గురువుగా ఉన్నది తత్వమే గాని వ్యక్తి మాత్రం కాదు అనేది వరల్డ్ టీచర్ ట్రస్టు సిద్ధాంతం. సృష్టి ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు జీవిని నడిపిస్తునటువంటి గురువును జగద్గురువని పిలుస్తారని, వారి పేరిట ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్టు నిర్వాహుకులు తెలిపారు. ఈ వరల్డ్ టీచర్ ట్రస్టును విశాఖపట్నంకు చెందిన ఎక్కిరాల కృష్ణామాచార్యులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ట్రస్టు 126 దేశాల్లో విస్తరించి ఉంది. ఏటా జనవరి నెలలో 11, 12, 13 తేదీల్లో విశాఖ జిల్లా సింహాచలం కొండ దిగువున అంతర్జాతీయ యోగా సమావేశాలను నిర్వహిస్తుంటారు. వరల్డ్ టీచర్ ట్రస్టు తరఫున వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు అధిక సంఖ్యలో విశాఖకు తరలివచ్చి ఏటా క్రమం తప్పకుండా సమావేశాలకు హజరవుతారు. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక బావాలను తెలుసుకుంటారు. దీనిలో భాగంగా నెలరోజుల కిందటే విదేశీయులంతా విశాఖకు విచ్చేశారు. ట్రస్టు ప్రతినిధి‡ స్వగ్రామం టెక్కలి కావడంతో గ్రామీణ ప్రాంత ప్రజల వ్యవహారశైలి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వారంతా గ్రామానికి విచ్చేశారు. వీరి రాకతో టెక్కలిలో సందడి వాతావరణం నెలకొంది. భారతీయ సంస్కృతి గొప్పది... భారతీయుల సంస్కృతి గొప్పది. వారి ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఎంతో నచ్చుతాయి. మేమంతా సంస్థ తరఫున ఏటా భారతదేశంలో ఉన్న విశాఖపట్నంకు వస్తుంటాం. యోగా, ఆధ్యాత్మిక తరగతులను నిర్వహిస్తుంటాం. పట్టణంలో ఉన్న కల్చర్కు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రజలు ఇస్తున్న గౌరవం మరువలేనిది. – గాబ్రియల్ ఫారెస్, స్పెయిన్ దేశస్తురాలు -
పంపాలంటే ప్రహసనమే!
సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాదం... మాదకద్రవ్యాలు... సైబర్ నేరాలు... ఇలా వివిధ కేసుల్లో విదేశీయులు నగరంలో అరెస్టు అవుతుంటారు. వీరితో పాటు సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారినీ పట్టుకుంటారు. వీరందరినీ ఎప్పుడో ఒకప్పుడు వారి దేశాలకు బలవంతంగా తిప్పి పంపాల్సి ఉంటుంది. డిపోర్టేషన్గా పిలిచే ఈ ప్రక్రియ పెద్ద ప్రహసనమే. గత ఏడాది సైబర్ నేరంలో చిక్కిన పాకిస్థానీ ఇక్రమ్ విషయంలో ఈ తంతు నడుస్తుండగా... తాజాగా పట్టుబడిన మరో పాక్ జాతీయుడు గుల్జార్ అంశంలో ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆప్రికా దేశాల వాళ్ళే ఎక్కువ... రాజధానిలో ఏళ్ళుగా వివిధ నేరాలకు సంబంధించి విదేశీయులు పట్టుబడుతూనే ఉన్నారు. ఇలా చిక్కుతున్న వారిలో అత్యధికులు ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళే ఉంటున్నారు. నైజీరియా, ఇథియోపియా, సోమాలియా, సూడాన్ తదితర దేశాలకు చెందిన అనేక మంది విద్య, ఉద్యోగ, వ్యాపార వీసాలపై వచ్చి దాని గడువు ముగిసినా అక్రమంగా స్థిరపడి చిక్కుతున్నారు. ఇలాంటి వారితో పాటు సక్రమంగా నివసిస్తున్న వారిలోనూ డ్రగ్స్, సైబర్ నేరాలకు పాల్పడుతూ మరికొందరు పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇక ఉగ్రవాద సంబంధ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో పాకిస్థాన్తో పాటు బంగ్లాదేశీయులు ఉంటున్నారు. ఇటీవల కాలంలోరోహింగ్యాల అరెస్టులూ పెరిగాయి. వీటితో పాటు ఇతర దేశాలకు చెందిన వారూ అప్పుడప్పుడు పట్టుబడుతున్నారు. ఎంబసీలకు పక్కా సమాచారం... సాధారణ వ్యక్తుల అరెస్టు విషయంలో ఉండే నిబంధనలకు భిన్నంగా విదేశీయుల అరెస్టులో ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలు, ఆయా దేశాలతో ఉండే వర్తకవాణిజ్య వ్యవహారాల ఆధారంగా> ఈ విధానాలు ప్రవేశపెట్టారు. వీటి ప్రకారం నగరంలో ఏ విదేశీయుడిని అరెస్టు చేసినా తక్షణం ఆ సమాచారం ఆ దేశాలకు చెందిన ఎంబసీ/కాన్సులేట్ కార్యాలయకు చేర్చాలింది. నిందితుల్ని అరెస్టు చేసిన విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు లిఖిత పూర్వకంగా, అమలులో ఉన్న ఫార్మాట్ల ప్రకారం దీన్ని అందిస్తారు. ఇతర దేశాల విషయంలో పరిస్థితి ఎలా ఉన్నా... అమెరికా, లండన్ తదితర కొన్నింటికి చెందిన రాయబార కార్యాలయాలు ఈ విషయాల్లో తక్షణం స్పందిస్తాయి. అనేక సందర్భాల్లో తమ ఉద్యోగుల్ని జైళ్ళ వద్దకు పంపి, మిలాఖత్లో రిమాండ్లో ఉన్న తమ దేశీయుల్ని కలిసి మాట్లాడేలా చేస్తాయి. అవసరమైన పక్షంలో న్యాయసహాయం చేయడానికి ముందుకు వస్తాయి. తీవ్రమైన కేసుల్లో చేతులెత్తేస్తారు... ఎంహెచ్ఏ, ఎంఈఏల ద్వారా పోలీసులు రాసే ప్రతి లేఖ పైనా ఆయా రాయబార కార్యాలయాలు సానుకూలంగా స్పందించవు. ఆ నిందితుడిపై మోపిన నేరాల తీరుతెన్నుల్ని బట్టి వారి స్పందన ఉంటుంది. సైబర్ నేరాలు, మోసాలతో పాటు హత్య, హత్యాయత్నం, దాడి వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న లేదా దోషిగా నిరూపితమైన వ్యక్తి తమ దేశీయుడే అంటూ అంగీకరిస్తాయి. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఇక్రమ్ విషయంలో అతడు పాకిస్థానీయే అని అంగీకరించిన ఆ దేశం కేసు విచారణ ముగిసిన వెంటనే డిపోర్టేషన్ చేయమని కోరింది. ఉగ్రవాదం, గూఢచర్యం వంటి ఆరోపణలు, బలమైన ఆధారాలు ఉన్న కేసుల్లో మాత్రం ఆయా దేశాలు ఈ విధంగా స్పందించవు. అరెస్టు అయిన వ్యక్తికి, తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని చెప్తుంటాయి. కొన్నేళ్ళ క్రితం పాతబస్తీలో చిక్కిన ఐఎస్ఐ ఏజెంట్ సలీం జునైద్ విషయంలో ఇలానే జరిగింది. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్లోనే... ఆయా దేశాలతో సంప్రదింపులు, రూఢీలు పూర్తయ్యే వరకు ఆయా నిందితులు ఇక్కడే ఉంటారు. కేసు విచారణలో ఉంటేనో, శిక్ష పడితేనో జైల్లో ఉంచాలి. అలా కాకుండా సరైన ఆధారాలు లేని కారణంగా కేసు వీగిపోయినా, శిక్షాకాలం పూర్తయినా డిపోర్టేషన్ సెంటర్కు తరలిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ప్రసుత్తం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డిపోర్టేషన్ సెంటర్గా, దాని డీసీపీ డిటైన్ చేసే అధికారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లో కొన్ని ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వీరిలో కొందరు తమ వివరాలు చెప్పడానికి వెనుకాడటంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశానికి వెళ్ళమని చెప్తున్నారు. అలాంటి వారిలో అర్హత ఉన్న వారికి డిపోర్టేషన్ సెంటర్ అధికారులే ఐక్యరాజ్య సమితి నుంచి శరణార్థుల కార్డులు ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశం అంగీకరించాల్సిందే.. ఏ నేరంలో చిక్కిన విదేశీయుడినైనా ఏదో ఒక సందర్భంలో వారి దేశానికి పంపించేయాల్సి ఉంటుంది. ఎప్పుడు పంపాలనేది ఆ దేశ రాయబార కార్యాలయం కోరిన దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేసు విచారణతో పాటు శిక్షాకాలం ముగిసిన తర్వాత, అరుదైన కేసుల్లో మాత్రమే శిక్షతో సంబంధం లేకుండా కేసు విచారణ ముగిసిన వెంటనే పంపాల్సి ఉంటుంది. డిపోర్టేషన్గా పిలిచే దీన్ని చేపట్టాలంటే తొలుత ఆ నిందితుడు/దోషి తమ దేశీయుడే అంటూ ఆ దేశం అంగీకరిస్తూ రాయబార కార్యాలయం ద్వారా సందేశం ఇవ్వాలి. దీనికోసం పోలీసు విభాగం నిందితుడి/దోషి వివరాలు, అందుబాటులో ఉంటే పాస్పోర్ట్ నెంబరుతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు (ఎంహెచ్ఏ) లేఖ రాస్తారు. ఆ శాఖ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దాన్ని ఆయా దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదించి వివరాలు పొందుతుంది. దీనికి కొన్ని నెలల సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. -
పైపుల్లో 14 కేజీల పసిడి
శంషాబాద్: పైపుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా విమానం ఏఐ–952 గురువారం తెల్లవారుజామున 5.30కి శంషాబాద్ విమానాశ్రయం లో దిగింది. బంగారం అక్రమ రవాణా గురించి విశ్వసనీయ సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు తాము కూర్చున్న 31ఏ, 32ఏ సీట్ల కింద బంగారాన్ని తెచ్చినట్లు గుర్తించారు. నల్లని టేపుతో చుట్టిన బంగారాన్ని 14 హాలో పైపుల్లో దాచినట్లు అధికారులు తెలిపారు. పైపుల నుంచి 112 బంగారు బిస్కెట్ ముక్కలను బయటకు తీశారు. మొత్తం 14 కేజీల బరువు కలిగిన ఈ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిలో ఒకరు దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తి కాగా మరొకరు చైనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో వీరితో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయించింది ఎవరనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా, ఐదేళ్ల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు 27 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం 9 కేజీల బంగారాన్ని మరో వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఇద్దరు వ్యక్తుల నుంచి బంగారం స్వాధీనం చేసుకోవడం చర్చనీయాశమైంది. -
పెళ్లికని వచ్చి శవమై తేలింది..!
న్యూఢిల్లీ : భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుందామని వచ్చిన ఓ జంటకు తీవ్ర విషాదం మిగిలింది. మహిళ అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. న్యూజిలాండ్కు చెందిన తుయల్లి పాలీ అన్నే(49), ఆస్ట్రేలియాకు చెందిన తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఢిల్లీ వచ్చారు. పహర్గంజ్లోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. అక్కడ జరిగే ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని.. వారు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, శనివారం ఉదయం అన్నే వాష్రూమ్లో అపస్మారక స్థితిలో పడివుంది. అది గమనించిన ఆమె బాయ్ఫ్రెండ్ హోటల్ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అన్నే అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అన్నే హైపర్ టెన్షన్ రోగి కావడంతో.. కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమె మృతికి కచ్చితమైన కారణం తెలియదని చెప్పారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
పిలవని పెళ్లికి వెళ్లొద్దాం
ఒక దేశ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవాలనుకుంటే పండుగలు, వివాహాలకు మించిన వేడుకలేముంటాయి? అదీగాక సంప్రదాయబద్ధంగా, వైభవోపేతంగా జరిగే భారతీయ పెళ్లి సందడంటే పాశ్చాత్యులకు మోజు. ఆ క్రేజ్ను గమనించే ‘జాయిన్ మై వెడ్డింగ్ డాట్ కామ్’ అనే ఆస్ట్రేలియన్ సైట్ వెలిసింది! తమ పెళ్లికి విదేశీ అతిథులను ఆహ్వానించదలిచిన వధూవరులు ఈ వెబ్సైట్లో తమ పేరు, పెళ్లి సంబరం తాలూకు వివరాలను పొందుపర్చాలి. భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కడి పెళ్లిళ్లను చూడాలనే ఆసక్తిగల విదేశీయులు ఈ వెబ్సైట్ లాగిన్ అయి ఏ సంప్రదాయపు పెళ్లి.. అంటే ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతీయ పెళ్లిళ్లలో ఏ వివాహతంతును చూడాలనుకుంటే అక్కడున్న వధూవరులు సైట్కి ఇచ్చిన పెళ్లి వివరాల ప్రకారం ఆ పెళ్లికి హాజరుకావచ్చు.ఆ పెళ్లికి సంబంధించిన టికెట్లను కొనుక్కోవాలి. ఆ టికెట్ డబ్బులో కొంత శాతాన్ని సైట్ వాళ్లు కమీషన్గా తీసుకొని మిగిలిన డబ్బును ఆ జంటకు ఇచ్చేస్తారు. పసుపు దంచే కార్యక్రమం నుంచి మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ దాకా అన్నిట్లో ముందువరుసలో ఉండి ఆలకిస్తారు ఆ విదేశీ అతిథులు. ఇంట్రెస్ట్ ఉంటే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కూడా. మన సంప్రదాయపు దుస్తులు ధరించొచ్చు. విందును ఆస్వాదించవచ్చు. ఆత్మీయ అతిథిౖయె పెళ్లి సంబరంలో పాలుపంచుకోవచ్చు. జాయిన్ మై వెడ్డింగ్ డాట్ కామ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే మీ పెళ్లికి విదేశీయులకు టికెట్లు అమ్మడం. యేటా కొన్ని లక్షల పెళ్లిళ్లు ఆర్భాటంగా జరుగుతుంటాయి కాబట్టి ఈ తరహా వివాహ పర్యటనలకు విదేశీ అతిథుల డిమాండ్ చాలానే ఉంటోందట. ఒక్క పర్యటనలో దాదాపు అయిదారు పెళిళ్లకు హాజరైన అతిథులూ ఉన్నారట. ఈ వెడ్డింగ్ టూరిజంలో ఇప్పటిదాకా దాదాపు వంద పెళ్లిళ్లకు హాజరయ్యారట విదేశీ అతిథులు. మరో సంగతేంటంటే ఇలా పెళ్లికి విదేశీయుల నుంచి వచ్చిన టికెట్ డబ్బులతో కొత్త జంటలు ఎంచక్కా తమ హనీమూన్ను ప్లాన్ చేసుకుంటున్నాయట. అంటే ఉచితంగా హనీమూన్ డెస్టినేషన్కు చేరుకుంటున్నారన్నమాట. కొత్త ప్రాంతాల నుంచి ఫ్రెండ్స్ అవడానికి ఇంతకన్నా గొప్ప వేడుక ఏముంటుంది అని అటు ఫారిన్ గెస్ట్లు, ఇటు వధూవరులూ అంటున్నారు. ఈ పెళ్లిళ్లను చూడ్డానికి అమెరికా, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా అండ్ అఫ్కోర్స్ ఆస్ట్రేలియా నుంచి యమ డిమాండ్ ఉంటోందట. కార్తీకమాసం పెళ్లిళ్ల సీజనే.. ఆలస్యమెందుకు.. ఆన్లైన్లో టికెట్స్కు శుభస్య శీఘ్రం!! అన్నట్లు.. మనం విదేశీయుల పెళ్లిళ్లకు వెళ్లాలన్నా.. ఇదే రూటు. ఇదే సైటు. టికెట్ కొనుక్కుని వెళ్లిపోవచ్చు. -
పశ్చిమగోదావరిలో విదేశీయుడి అరెస్ట్
సాక్షి, జంగారెడ్డిగూడెం: పాస్పోర్టు లేకుండా అనుమానాస్పదంగా సంచరిస్తున్న విదేశీయుడిని సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో మయన్మార్ దేశానికి చెందిన మహ్మద్ ఇస్లాం అనుమానాస్పదంగా సంచరించడంతో లక్కవరం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని వద్ద పాస్పార్టు కూడా లేకపోవడంతో కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్కు ముందు హాజరు పరిచారు. అనంతరం సెంట్రల్ జైలుకు తరలించారు. మహ్మద్ ఇస్లాం ఎందుకు వచ్చాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
‘విదేశీయుల’పై నజర్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై పోలీసు విభాగం దృష్టి పెట్టింది. ఎలాంటి పత్రాలు లేకుండా, గడువు ముగిసినా ఇక్కడే తిష్టవేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. సిటీ పోలీసు, ఫారెనర్స్ రిజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ), కేంద్ర నిఘా వర్గాలతో ఏర్పడిన ఉమ్మడి బృందాలు మంగళవారం వరుస దాడులు చేశాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎనిమిది ఠాణాల పరిధిలో 75 మందిని తనిఖీ చేశారు. వీరిలో 23 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి విషయంలో ఎఫ్ఆర్ఆర్ఓ తదుపరి చర్యలు తీసుకుంటుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. కాగా ఓయూ పరిధిలో నివసిస్తున్న ఓ నల్లజాతీయుడు అక్రమంగా ఆధార్ కార్డు సైతం పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడిపై సంబంధిత చట్టం కింద మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. పాస్పోర్ట్ అక్కడే ‘డిపాజిట్’ చేసి... హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల్లో ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. కొందరు ఇక్కడికి వచ్చిన తర్వాత నిబంధనలు తెలియక, తప్పనిసరి పరిస్థితుల్లో వీసా గడువు ముగిసినా ఉండిపోతున్నారు. ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లో ‘స్థిరపడాలనే’ ఉద్దేశంతో పథకం ప్రకారం వివిధ రకాలైన వీసాలపై ఇక్కడికి వస్తున్న వారూ ఉంటున్నారు. దేశంలోని ఇతర మెట్రోల్లో దిగుతున్న వీరు అక్కడే ఎఫ్ఆర్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఆపై ఆయా ప్రాంతాల్లోని పరిచయస్తుల వద్ద తమ పాస్పోర్టులను ఉంచి హైదరాబాద్ చేరుకుని అక్రమంగా నివసిస్తున్నారు. ఏదైనా నేరానికి పాల్పడినా పాస్పోర్ట్ లేని కారణంగా దానిపై రిమార్క్ పడదని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఏకకాలంలో ఆకస్మిక దాడులు దీనిపై కొన్నాళ్లుగా నిఘావేసిన ప్రభుత్వ విభాగాలు ఎట్టకేలకు చర్యలు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఆర్లో అధికారులు ఈ విదేశీయుల డేటాను అప్డేట్ చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల సాయంతో వారి వద్దకు వెళ్లి వేలిముద్రలు, ఫోటోలు తదితరాలు రిజిస్టర్ చేసుకున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించేందుకు దాడులు చేయాలని సోమవారం నిర్ణ యించారు. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున ఎఫ్ఆర్ఆర్ఓ, ఐబీ, స్పెషల్బ్రాంచ్, టాస్క్ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో కూడిన 21 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బంజారాహిల్స్, గోల్కొండ, ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, లంగర్హౌస్, చిలకలగూడ, మలక్పేట, అంబర్పేట, సైఫాబాద్, ఉస్మానియా వర్శిటీ, చిక్కడపల్లి ఠాణాల పరిధిలో వరుస దాడులు చేశాయి. మొత్తం 75 మందిని తనిఖీ చేసిన ఈ బృందాలు 23 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించాయి. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. డిటెన్షన్ సెంటర్స్కు తరలించి... ఈ అక్రమ నివాసితులను డిటెన్షన్ సెంటర్స్గా పరిగణించే నగర నేర పరిశోధన విభాగంతో (సీసీఎస్) పాటు మహిళా పోలీసుస్టేషన్, ఇతర ఠాణాలకు తరలించారు. వీరిపై పాస్పోర్ట్, ఫారెనర్స్ యాక్టŠస్ ప్రకారం రెండు రకాలైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో, అవగాహన లేక ఓవర్స్టే చేస్తున్న వారితో జరిమానా కట్టించి ఎగ్జిట్ వీసాపై పంపడం, ఉద్దేశపూర్వకంగా ఉండిపోయిన వారిని డిటెన్షన్లో ఉంచి ఆయా దేశాలకు డిపోర్టేషన్ చేయడం (బలవంతంగా తిప్పిపంపడం) వంటి చర్యలు తీసుకోనున్నారు. వీరికి అవసరమైన పాస్పోర్టులు, వీసాల కోసం ఆయా రాయబార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. అక్రమంగా ఉంటున్న వారిలో కొందరిని తీవ్రతను బట్టి నిర్ణీత కాలానికి బ్లాక్లిస్ట్లో పెట్టాలని నిర్ణయించారు. ఇలా చేస్తే ఆ గడువు ముగిసేవరకు వారు మళ్ళీ దేశంలోకి అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఈ తరహా స్పెషల్ డ్రైవ్స్ను కొనసాగించాలని పోలీసు విభాగం నిర్ణయించింది. సక్రమంగా వచ్చి అక్రమంగా మారి... నగరం విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. ఫలితంగా ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు చెందిన వారు సిటీకి వస్తున్నారు. కల్చర్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగానూ పలువురు విదేశీయులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు ఇక్కడే అక్రమంగా ఉండిపోతున్నారు. పాస్పోర్ట్, విదేశీచట్టాలను తుంగలో తొక్కి తమ ‘పనులు’ చూసుకుంటున్నారు. గతంలో నగరంలో నివసించే విదేశీయులు కచ్చితంగా స్పెషల్ బ్రాంచ్లో రిజిస్టర్ చేసుకునే వారు. అయితే కొన్నేళ్లుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్లకు చెందిన వారు మినహా మిగిలిన వారంతా ఎఫ్ఆర్ఆర్ఓ వద్ద రిజిస్టర్ చేసుకునే నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో సిటీ పోలీసుల వద్ద అక్రమంగా ఉంటున్న వారి డేటా అందుబాటులో ఉండట్లేదు. -
పాపం ‘మధుబాల’.. అన్యాయంగా
గువాహటి : అస్సాంలో మరో లక్ష మందిని జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ముసాయిదా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారుల నిర్లక్ష్యం మూలానా ఓ భారతీయురాలు మీద.. విదేశీయురాలు అనే ముద్ర పడింది. ఫలితంగా గత మూడేళ్ల నుంచి ఆ మహిళ నిర్భందంలో గడపింది. చివరకు బుధవారం సాయంత్రం విడుదల అయ్యింది. వివరాలు.. అస్సాం బోర్డర్ పోలీసులు రాష్ట్రంలో అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను గుర్తించి వారిని నిర్భందంలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం చిరాంగ్ జిల్లా బిష్టుపూర్ గ్రామానికి చెందిన మధుబాల దాస్ అనే విదేశీయురాలిని నిర్భందంలోకి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆమె అప్పటికే మరణించడంతో అధికారులు మధుబాల మొండల్(59)ను నిర్భందంలోకి తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాల గురించి ఆమెకు ఏ మాత్రం అవగాహన లేదు. నిరక్ష్యరాస్యురాలు కావడంతో మొండల్ అధికారులను ఎదిరించలేకపోయింది. మధుబాల మొండల్కు సాయం చేయడానికి ఆమెకంటూ ఎవరూ లేరు. భర్త కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు ఓ మూగ, చెవిటి కూమార్తె ఉంది. పెళ్లైన ఆమెను భర్త వదిలిపెట్టడంతో కుమార్తె బాధ్యతలు కూడా మొండల్పైనే పడ్డాయి. కుటుంబానికి ఆమె జీవనాధారం. ఈ క్రమంలో ఓ రోజు అస్సాం బార్డర్ పోలీసులు ఆమెను విదేశీయిరాలు అంటూ కొక్రాఝర్ నిర్భంద కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు మధుబాల మొండల్కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అధికారుల నిర్లక్ష్యాన్ని అస్సాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారి కృషి ఫలితంగా మూడేళ్ల నిర్భందం తర్వాత బుధవారం సాయంత్రం మధుబాలను విడిచిపెట్టారు. -
పోచంపల్లిలో విదేశీయుల సందడి
సాక్షి, భూదాన్పోచంపల్లి (భువనగిరి) : పోచంపల్లిలో విదేశీయులు సందడి చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల సంస్థ(నిమిస్మే) ఆధ్వర్యంలో సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా, ఘనా, సౌత్ ఆఫ్రికా, అఫ్ఘనిస్తాన్, టాంజానియా, జిం బాబ్వే, కజకిస్తాన్, ఈజిప్ట్, జోర్ధాన్, కాంగో దేశాలకు చెందిన 25 మంది పోచంపల్లిని సందర్శించారు. స్థాని క గ్రామీణ వికాసబ్యాంకు సందర్శించి బ్యాంకు అంది స్తున్న సేవలు, స్వయం సహాయక గ్రూప్లు, రైతులు, చిరువ్యాపారులకు ఎంత వడ్డీకి రుణాలు అందిస్తున్నారని, రుణాల చెల్లింపు విధానాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆర్థిక వికాసానికి బ్యాంకులు ఏ మేరకు పనిచేస్తున్నాయో ఆరా తీశారు. అనంతరం టూరిజం పార్క్ను సందర్శించారు. అక్కడ చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలైన నూలు వడకడం, చిటికి కట్టడం, మగ్గాలను పరిశీలించారు. ప్రాచీన చేనేత కళ, కార్మికుల నైపుణ్యాలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రొగ్రామ్ డైరెక్టర్లు జి. సుదర్శన్, డాక్టర్ ఇ. విజయ మాట్లాడుతూ నిమిస్మేలో ‘సూక్ష్మ వ్యాపార విస్తరణ, అభివృద్ధి అనే అంశంపై అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని, అందులో భాగంగానే క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. వీరికి స్థానిక టూరిజం మేనేజర్ జితేందర్ మార్గదర్శకం చేశారు. -
అమెరికాలో 14% విదేశీయులే
అమెరికాలో వలసదారులను నియంత్రించేందుకు ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ సర్కారు శతవిధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. అమెరికా జనాభా లెక్కల కేంద్రం గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 14శాతం మంది విదేశీయులే ఉన్నారు. అంటే ప్రతి ఏడుగురు అమెరికన్లలో ఒకరు విదేశీయుడన్నమాట. ఈ వలసదారుల్లో చట్టబద్ధంగా వచ్చిన వారితోపాటు అక్రమంగా వచ్చిన వారు కూడా ఉన్నారు. 14 శాతం మంది వలసదారులు ఉండటం ఈ శతాబ్దంలోనే రికార్డు అని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్(సీఐఎస్) పేర్కొంది. ఒక్క 2016లోనే అమెరికాలో విదేశీ జనాభా 8 లక్షలు పెరిగింది. 2017 జూలై నాటికి దేశంలో మొత్తం 4.45 కోట్ల మంది వలసదారులు ఉన్నారు. 1980 లెక్కల ప్రకారం ప్రతి 16 మంది అమెరికన్లలో ఒకరు విదేశీయుడు కాగా ఇప్పుడది రెట్టింపు అయింది. మనవాళ్లే ఎక్కువ 2010–17 మధ్య అమెరికాకు వలస వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ మంది భారతీయులేనని, ఈ ఏడేళ్లలో 8.30 లక్షల మంది భారతీయులు(47% పెరుగుదల) అమెరికా వెళ్లారని సీఐఎస్ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానాల్లో చైనా (6.77 లక్షలు–31%), డొమినికన్ రిపబ్లిక్ (2.83 లక్షలు–32%) ఉన్నాయి. ఈ కాలంలో నేపాల్ వలసదారులు 120% పెరిగారు. 2017 జూలై నాటికి అమెరికాలో 1.52 లక్షల మంది నేపాలీలు ఉన్నారు. పాకిస్తాన్ నుంచి 4 లక్షల మంది అమెరికాకు వలస వచ్చినట్లు సీఐఎస్ గణాంకాలు చెబుతున్నాయి. 2010– 17 మధ్య 95 లక్షల మంది కొత్త వలసదారులు అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఏటా దాదాపు 3 లక్షల మంది వలసదారులు స్వదేశం వెళ్లిపోతున్నారు. మరో 3 లక్షల మంది చనిపోతున్నారు. -
గుడ్న్యూస్ చెప్పిన ఖతార్
విదేశీ వర్కర్లకు ఖతార్ గుడ్న్యూస్ చెప్పింది. వివాదాస్పద ఎగ్జిట్ వీసా విధానాన్ని సవరిస్తున్నట్టు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ దేశంలో పనిచేస్తున్న లక్షల మంది వలస కార్మికులకు భారీ ఊరట కలిగింది. ఈ వీసా విధానం సవరణతో, యజమానులు(ఎంప్లాయర్స్) అనుమతి లేకుండానే.. కార్మికులు ఆ దేశం విడిచి రావొచ్చు. సుదీర్ఘకాలంగా కార్మిక హక్కుల సంఘాలు చేస్తున్న ఈ డిమాండ్ను ఖతార్ ప్రభుత్వం ఆమోదించింది. ఖతార్లో పనిచేస్తున్న చాలా మంది వలస కార్మికులను ఆ దేశం విడిచి వెళ్లకుండా ఎంప్లాయర్స్ వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల కాంట్రాక్ట్ సమయం అయిపోయినప్పటికీ, యజమానులు తమల్ని విడిచిపెట్టడం లేదని కార్మికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విదేశీ కార్మికులకు భారీ ఊరటనిస్తోంది. ప్రస్తుతం ఖతార్లో 16 లక్షల మందికి పైగా విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి వెళ్లినవారే. వారిలో ఎక్కువగా కూడా భారత్ నుంచి ఖతార్ వెళ్లినవారే ఉన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. దీని వల్ల వలస కార్మికుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆ సంస్థ తెలిపింది. ఖతార్ ప్రభుత్వంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం కార్మికులకు కనీస వేతనం, బకాయి వేతనాల చెల్లింపు, ఫండ్లు అందనున్నాయి. ఖతార్లోని వలస కార్మికులకు మంచి పనిని, రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ మంత్రి ఇస్సా సాద్ అల్ జఫర్ అల్-నూమిమి తెలిపారు. 2022లో ఖతార్ ఫుట్బాల్ వరల్డ్ కప్ను నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో ఫుట్బాల్ వరల్డ్ కప్ పనుల్లో భారీ ఎత్తున్న విదేశీ కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖతార్లో పనిచేస్తున్నారు. అయితే ఎగ్జిట్ వీసా విధానంలో సవరణలు తీసుకొచ్చినప్పటికీ, విదేశీ కార్మికులు, ఉద్యోగాన్ని మారాలనుకుంటే, ప్రస్తుత యజమానుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంది. -
నేను.. మా మమ్మీ, డాడీ!
సాక్షి, హైదరాబాద్: ఫ్రాంక్ ఆంటోనీ–పమేలా దంపతులది అమెరికాలోని న్యూజెర్సీ. ఉన్నత కుటుంబానికి చెందిన ఆంటోనీ–పమేలా వ్యాపార రంగంలో ఉంటూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. కానీ వారికి సంతానం కలగలేదు. పిల్లలు లేక మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు.. హైదరాబాద్లోని ప్రభుత్వ శిశు గృహంలోని ఓ మూడేళ్ల బాలికను దత్తత తీసుకున్నారు. ఇలాంటి దంపతులు ఎందరో.. శిశుగృహాల్లోని పిల్లలు ఇప్పుడు విదేశాలకు దత్తతకు వెళ్తున్నారు. రాçష్ట్రంలో ఇప్పటికి 43 మంది పిల్లలు ఇలా దత్తత తీసుకోవడంతో విదేశాలకు వెళ్లారు. అనాథ శిశువులను దత్తత తీసుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆన్లైన్ దత్తత కార్యక్రమం ఎల్లలు దాటిపోతోంది. ప్రపంచం నలుమూలల నుంచి చిన్నారులను దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల దత్తత ప్రక్రియలో ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి చెందిన పిల్లలను విదేశీ యులు దత్తత తీసుకుంటున్నారు. అమెరికా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇంగ్లండ్కు చెందిన కుటుంబాలు మన రాష్ట్రంలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. డెన్మార్క్ దేశానికి చెందిన మార్టిన్ దంపతులు నల్లగొండ జిల్లాకు చెందిన బాలికను దత్తత తీసుకున్నారు. నిబంధనలు మార్చాక ఇలా.. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న అనాథ చిన్నారులను అయినా దత్తత తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. దీని కోసం ప్రత్యేకంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) వెబ్సైట్ను నిర్వహిస్తోంది. దత్తత తీసుకోవాలనుకునే వారు ఈ వెబ్సైట్ విధానంతోనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. దీంట్లోనూ స్వదేశం(ఇన్ కంట్రీ), విదేశీ(ఇంటర్ కంట్రీ) పేరుతో రెండు విధానాలున్నాయి. స్వదేశీ విధానంతో భారతీయులు, రెండో విధానంతో విదేశీయులు మన దేశంలోని పిల్లలను దత్తత తీసుకోవచ్చు. మన దేశంలోని అనాథ పిల్ల లను విదేశీయులు దత్తత తీసుకునేందుకు రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ప్రక్రియ జరుగుతుంది. ఆన్లైన్లో నమోదు చేసిన ప్రభుత్వ సంస్థలలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు మన దేశీయులు ఎవరూ సుముఖత వ్యక్తం చేయని సందర్భాల్లో రెండో ఆప్షన్ కింద విదేశీ దత్తత కేటగిరీలోకి మారుస్తారు. దీనికి 90 రోజులు గడువు ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత ఆ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబర్చిన విదేశీయులు ‘కారా’ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అక్కడి ఏజెన్సీలు దత్తతకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. పిల్లల పెంపకానికి ఇబ్బంది లేదని నిర్ధారించిన అనంతరం దత్తత ప్రక్రియ పూర్తవుతుంది. అలాగే స్వదేశీ దత్తత మార్గదర్శ కాల మేరకు దత్తత పొందేందుకు దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దంపతుల సొంత రాష్ట్రంతోపాటు మరో రెండు రాష్ట్రాలను ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా మూడు రాష్ట్రాల నుంచి పిల్లలను ఎంపిక చేసుకోవచ్చు. ఆన్లైన్ పద్ధతితో జాప్యం లేకుండా గరి ష్టంగా 30 రోజులలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పాత నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలంటే కనీసం ఏడాదిన్నరపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది. -
వస్తారు.. ఇక వెళ్లరు
సాక్షి బెంగళూరు: బెంగళూరును విదేశీయులు అక్రమ అడ్డాగా చేసుకుంటున్నారు. విద్య, వైద్యం, వ్యాపారం వీసా మీద బెంగళూరులో ఉంటున్న విదేశీయులు చాలా మంది వీసా గడువు ముగిసినప్పటికీ తమ దేశానికి వెళ్లడం లేదు. విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్వో) ఇటీవల హైకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో సుమారు 28 వేల మంది విదేశీయలు ఉన్నారు. అందులో 66 దేశాలకు చెందిన 1076 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు తేలింది. ఇందులో వెయ్యిమంది వరకూ బెంగళూరులోనే మకాం వేశారు. అనధికారికంగా ఈ సంఖ్య కొన్ని రెట్ల ఎక్కువగా ఉండవచ్చని అంచనా. పోలీసులు ఏడాది కాలంగా నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించారు. వారిపై విదేశీ పౌరచట్టం, పాస్పోర్టు చట్టంఉల్లంఘనల మేరకు కేసులు నమోదు చేశారు. ఈ విదేశీయులు డ్రగ్స్ దందా, దోపిడీలలో పాల్గొంటుండడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇటీవల కొలంబియా దోపిడీ దొంగల ముఠా పట్టుబడడం తెలిసిందే. వెనక్కి పంపడం పెద్ద పని విదేశీయుల గణాంకాలు మొత్తం ఎఫ్ఆర్ఆర్వో శాఖ వద్ద మాత్రమే ఉంటాయి. అక్రమంగా నగరంలో నివసిస్తున్న వారిని బెంగళూరు పోలీసులు పట్టుకుని పాస్పోర్టు చట్టం సెక్షన్ 12 ప్రకారం జైలు శిక్ష విధించవచ్చు. దీంతోపాటు ఎఫ్ఆర్ఆర్వోకి ఆ సమాచారాన్ని తెలియజేయాలి. ఎఫ్ఆర్ఆర్వో ఆయా దేశాల రాయబార కార్యాలయానికి వారి దేశీయులకు సంబంధించిన వివరాలను లేఖ రాస్తుంది. పాస్పోర్టు లేకుండా విదేశీయులను విమానాశ్రయం లోనికి కూడా రానివ్వరు. అక్రమంగా ఉంటున్న విదేశీయులను పోలీసులు వారి దేశ విమానంలో ఎక్కించి పంపించేస్తున్నారు. అయితే అదే విమానంలోనే తిరిగి భారత్కు విదేశీయులు మళ్లీ వస్తున్నారు. దీనికి తగిన విధానం రూపొందించాలని పోలీసు అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశీయులు అధికం.. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న వారే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దు నుంచి రైలు మార్గం ద్వారా చాలా మంది బెంగళూరుకు చేరుకుంటున్నారని సమాచారం. బెంగళూరు చేరుకున్న వారిలో కొందరు చెత్త ఏరుకుంటూ, నిర్మాణ పనులతో జీవిస్తున్నారు. బెంగళూరులోని మహదేవపురతో పాటు తదితర ప్రాంతాల్లో గుడిసెలు, టెంట్లు వేసుకుని నివాసం చేస్తున్నారు. వారికి ఆధార్, రేషన్ కార్డులు కూడా తీసుకుని ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. తిరిగి వెళ్తున్నది కొందరే వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా రాష్ట్రంలో ఉంటున్న వారిని వారి సొంత దేశాలకు పంపించడంలో రాష్ట్ర పోలీసులు అధికారులు విఫలమవుతున్నారు. అక్రమ వలసదారులను గుర్తించిన వెంటనే వారి సమాచారాన్ని ఎఫ్ఆర్ఆర్వోకు పంపించాలి. అక్రమంగా దేశంలో నివసిస్తున్న ఆ విదేశీయుల వివరాలను ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు ఎఫ్ఆర్ఆర్వో లేఖ ద్వారా తెలియజేస్తుంది. ఆ తర్వాత వారి వీసా పునరుద్ధరించడమా లేక వారి సొంత దేశాలకు పంపించడమా అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ చాలా తక్కువగా జరుగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు. 66 దేశాల పౌరుల తిష్ట బెంగళూరులో 66 దేశాలకు చెందిన పౌరులు అక్రమంగా నివసిస్తున్నారు. కాంగోకు చెందిన వారు 164 మంది, ఐవరికోస్ట్ నుంచి 100 మంది, అఫ్ఘనిస్తాన్ నుంచి 33, బంగ్లాదేశ్ నుంచి 36, నైజీరియా నుంచి 93 మంది, మారిషస్, మంగోలియా, నమీబియా ఇతర దేశాలకు చెందిన మరికొంత మంది విదేశీయులు నగరంలో తలదాచుకున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడం చాలా కష్టం. బెంగళూరుకు చేరుకున్న విదేశీయులు ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న చిరునామాల్లో వారు ఉండడం లేదు. వీసా గడువు ముగిసిన అనంతరం గోవా, ముంబై, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలల్లో తిరుగుతూ వస్తున్నారు. అక్కడక్కడ నేరపూరిత చర్యల్లోనూ పాలుపంచుకుంటున్నారు. -
విదేశాల్లో భారత ‘వంటిల్లు’!
న్యూఢిల్లీ: పంజాబీ చికెన్ టిక్కా... రాజస్థానీ థాలీ... మహారాష్ట్ర వడాపావ్... తమిళనాడు సాంబార్ ఇడ్లీ... హైదరాబాద్ బిర్యానీ... చెబుతుంటేనే నోరూరుతోంది కదా..!! ఈ భారతీయుల వంటకాల ఘుమఝుమలు విదేశీయులనూ ఆవురావురుమనేలా చేస్తున్నాయి. అదిరిపోయే భారతీయ వంటలతో మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. మన నలభీములకు విదేశీయులు ఎర్ర తివాచీ పరుస్తుండటంతో ఇక్కడి రెస్టారెంట్ చైన్లు అత్యంత వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. లైట్ బైట్ ఫుడ్స్, జిగ్స్ అండ్ జోరవార్ కల్రా రెస్టారెంట్ చైన్లతో పాటు పారిశ్రామికవేత్త, ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్కు చెందిన రెస్టారెంట్లు విదేశాల్లో పాగా వేస్తున్నాయి. అనుమతులు, లైసెన్సులు సులువు... కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్, డామినోస్ లాంటి విదేశీ రెస్టారెంట్ చైన్లకు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంస్థలు చొచ్చుకుపోతున్నాయి. ఇతర దేశాల్లో రెస్టారెంట్లను ప్రారంభించడం సులువుగా ఉండటం, బయట వంటకాలకు విదేశీయులు ఖర్చులు పెంచడం లాంటి సానుకూల అంశాలు హోటల్ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతున్నాయని నిర్వహకులు చెబుతున్నారు. ’విదేశీ రెస్టారెంట్ వ్యాపారం విధానాలలో స్థిరత్వం ఉంటుంది. అనేక దేశాలలో హోటళ్లను ప్రారంభించడానికి బహుళ అనుమతులు, లైసెన్సుల అవసరం లేకపోవడం అనేది ప్రయోజనకరంగా ఉంది. లండన్, న్యూయార్క్, దుబాయ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో బయట తిండికి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 150 మంది కూర్చుని భోజనం చేయడానికి సరిపడేంతటి రెస్టారెంట్ను ఈఏడాది సెప్టెంబరులోనే వాషింగ్టన్ డీసీలో ప్రారంభిస్తున్నాం’ అని లైట్ బైట్ ఫుడ్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ అన్నారు. పంజాబ్ గ్రిల్ పేరుతో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుందని, త్వరలోనే దుబాయ్, కువైట్, ఇతర గల్ఫ్ దేశాలలో సైతం సత్తా చాటనున్నామని వెల్లడించారు. మానవ వనరుల పరంగా ఇబ్బందే... వ్యాపారం బాగానే ఉన్నా... మానవవనరుల కొరత, వీసా సమస్యలు వెంటాడుతున్నట్లు రోహిత్ తెలిపారు. భారత్లో మార్జిన్లు చూడలేకపోతున్న అనేక రెస్టారెంట్ చైన్లు విదేశాల్లో లాభాలను గడిస్తున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) అంటోంది. ఇతర దేశాలలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉందని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రాహుల్ సింగ్ వెల్లడించారు. గతేడాది అమెరికన్లు ఆహారంపై చేస్తున్న ఖర్చులలో ఏకంగా 48% రెస్టారెంట్లలోనే జరుగుతున్నట్లు తెలిపారు. విదేశాల్లో హోటల్ నడపడం చాలా సులభం... దివ్యాని ఇంటర్నేషనల్ అమెరికా, లండన్, సింగపూర్, దుబాయ్ దేశాలలో విస్తరిస్తోంది. నోరు ఊరించే వంటకాలతో అదరగొట్టే సంజీవ్ కపూర్ సైతం విదేశీ రెస్టారెంట్ల విస్తరణలో వేగంగా దూసుకుపోతున్నారు. సంజీవ్ కపూర్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మొత్తం 70 స్టోర్లను నడుపుతుండగా, వీటిలో సగం వరకు విదేశాల్లోనే ఉన్నాయి. విదేశాల్లో హోటల్ వ్యాపారం చాలా సులువుగా నడపవచ్చని వెల్లడించిన ఆయన త్వరలోనే లండన్, న్యూయార్క్, టొరంటో, సౌదీలలో రెస్టారెంట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
వెళ్తోంది లక్షల్లో.. వస్తోంది వేలల్లో
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు.. ఐఐఎంలు.. ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు! అయినా విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భారత్ వెనుకబడే ఉంది. విదేశాల్లో చదువుకునేందుకు మన దేశం నుంచి ఏటా లక్షల మంది వెళ్తుంటే.. విదేశాల నుంచి మాత్రం వేలల్లోనే వస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు 90 దేశాల్లో 7.5 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతుంటే మన దేశంలో మాత్రం విదేశీ విద్యార్థులు కేవలం 46,144 మందే చదువుకుంటున్నారు. ఏటా కొత్తగా వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల వేయి మాత్రమే ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే విదేశీ విద్యార్థులు ఎక్కువగా కర్ణాటకలో చదువుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. తెలంగాణ ఆరో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. ఆరు రాష్టాల్లో అయితే విదేశీ విద్యార్థులు కేవలం పది మంది లోపే ఉన్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఐదేళ్లతో పోలిస్తే కాస్త మెరుగు.. తక్కువ స్థాయిలోనే ఉన్నా గడచిన ఐదేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2013–14 విద్యా సంవత్సరంలో భారత్లో 39,517 మంది విదేశీ విద్యార్థులు చదివితే 2017–18 నాటికి ఆ సంఖ్య 46,144కు పెరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే 2013–14లో కర్ణాటకలో 13,903 మంది చదవగా.. ప్రస్తుతం వారి సంఖ్య కాస్త తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 2013–14తో పోలిస్తే ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2013–14లో తెలంగాణలో 2,103 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2,877కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో 862 మంది విదేశీ విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 2,092కు పెరిగింది. నేపాల్ విద్యార్థులే అధికం విదేశాల నుంచి భారత్కు వస్తున్నవారిలో ఎక్కువ మంది నేపాల్కు చెందిన వారే ఉన్నారు. చదువుల కోసం మన దేశం నుంచి విద్యార్థులు 166 దేశాలకు వెళ్తుండగా.. భారత్కు మాత్రం 10 దేశాల నుంచే ఎక్కువగా వస్తున్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో 24.9 శాతం మంది నేపాల్కు చెందినవారు కాగా, అఫ్గాన్ విద్యార్థులు 9.5 శాతం, సుడాన్ విద్యార్థులు 4.8 శాతం, భూటాన్ విద్యార్థులు 4.8 శాతం మంది, నైజీరియా విద్యార్థులు 4.3 శాతం, బంగ్లాదేశ్, ఇరాన్ విద్యార్థులు 4 శాతం మంది, యెమన్ విద్యార్థులు 3.2 శాతం మంది, అమెరికా విద్యార్థులు 3.1 శాతం, శ్రీలంక విద్యార్థులు 2.7 శాతం ఉన్నారు. బీటెక్, బీబీఏ వైపే ఎక్కువ.. భారత్కు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది బీటెక్ వైపు చూస్తున్నారు. గడచిన ఐదేళ్లలో ఎక్కువ మంది బీటెక్ చదివిన వారే ఉన్నారు. 2013–14లో 4,135 మంది బీటెక్ చదవగా.. ప్రస్తుతం ఆ కోర్సును 7,610 మంది చదువుతున్నారు. బీటెక్ తర్వాత బీబీఏ కోర్సును ఎక్కువ మంది చదువుతున్నారు. ఉత్తరప్రదేశ్లోనే అత్యధికంగా పీహెచ్డీలు విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా పీహెచ్డీలను (412 మంది) ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. కర్ణాటకలో ఎక్కువ మంది(897) ఎం.ఫిల్ చేస్తున్నారు. డిగ్రీ (10,051 మంది), పీజీ (1,533), ఇంటిగ్రేటెడ్ కోర్సులు (7181) చేస్తున్న వారు కూడా కర్ణాటకలోనే ఉన్నారు. -
అతిథులపై క్లారిటీ
-
విదేశీ నేతల్ని పిలవట్లేదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీసహా విదేశీ నేతలెవరినీ ఆహ్వానించడం లేదని పాక్ విదేశాంగశాఖ తెలిపింది. పాక్ ప్రధానిగా తన ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా సాగాలని ఇమ్రాన్ కోరుకుంటున్నట్లు వెల్లడించింది. 11న అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత అధ్యక్షుడు మమ్నూన్ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుకకు రావాల్సిందిగా ఇమ్రాన్ స్నేహితులైన కొంతమంది విదేశీయులకే ఆహ్వానాలు పంపారు. జూలై 25న జరిగిన పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం అనుమతిస్తే ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరవుతానని పంజాబ్ మంత్రి నవ్జ్యోత్సింగ్ సిద్ధూ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే వచ్చే ఏడాది పాక్లోని నన్కనా సాహిబ్లో జరిగే గురునానక్ 550వ జయంతి ఉత్సవాలకు హాజరవ్వాలన్న తన కల నెరవేరుతుందన్నారు. -
కిడ్నాప్ కలకలం : మృతుల్లో భారతీయుడు
కాబుల్ (అఫ్గానిస్తాన్) : ఉగ్రదాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న అఫ్గానిస్తాన్లో మరో కలకలం రేగింది. ఇప్పటికే వలసవాదులపై దాడులకు తెగబడుతున్న తాలిబన్ ఉగ్రవాదులు తాజాగా ముగ్గురు విదేశీయుల్ని చంపారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. వివరాలు.. సోడెక్సో ఇంటర్నేషనల్ ఫుడ్ కంపనీలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు విధులకు వెళ్తుండగా ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. ముసాహీ జిల్లాలోని పార్కింగ్ చేసి ఉన్న కారులో మృత దేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మలేసియా (64), ఇండియా (39), మాసిడోనియా (37) పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారని అంతర్గతభద్రత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నుష్రత్ రహీమి తెలిపారు. మృతదేహాల పక్కన కొన్ని ఐడీ కార్డులు పడి ఉన్నాయనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఇన్నాళ్లూ స్వదేశీయుల్ని కిడ్నాప్ చేసి డబ్బులు దండుకుంటున్న క్రిమినల్స్ కోవలోకి తీవ్రవాదులు సైతం చేరారు. విదేశీయులే లక్ష్యంగా రెచ్చిపోతూ బాంబు దాడులు, కిడ్నాప్లకు తెగబడుతున్నారు. -
విదేశీ కార్మికులకు క్షమాభిక్ష
దుబాయ్: గడువు తీరిన తర్వాత దేశంలో నివసిస్తూ పట్టుబడిన కార్మికులకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా 3 నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న లక్షల మంది భారతీయులు సహా విదేశీ కార్మికులకు ఇది లబ్ధిచేకూర్చనుంది. ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల్లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా ఆర్నెల్లలో ఉద్యోగం వెతుక్కునే చాన్సుంటుంది. యూఏఈ అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 28లక్షల మంది భారతీయ వలసదారులున్నారు. ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 15–20% కాగా, 20 శాతం మంది వివిధ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన 65% మంది వివిధ పరిశ్రమల్లో కార్మికులు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష అమల్లో ఉంటుందని ఈ మధ్యలోనే అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని యూఏఈ గుర్తింపు, పౌరసత్వ సంస్థ స్పష్టం చేసింది. ఈ దిశగా దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, వివిధ బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటుచేశారు. బుధవారం ముగ్గురు భారతీయులు అబుదాబిలోని బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సెంటర్లో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. తొలిరోజే కావడంతో సంఖ్య పలుచగా ఉందని.. రానున్న రోజుల్లో మరింత మంది రావొచ్చని భావిస్తున్నారు. యూఏఈలో ఉన్న భారత కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన వారే ఉన్నారు. ‘క్షమాభిక్ష గురించి సమాచారం తెలిసింది. స్వామి అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఏ1 ఆమ్నెస్టీ సెంటర్లో దరఖాస్తు చేసుకున్నారు. యూఏఈలో యజమాని.. భారత్లో ఉన్న తన కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వనందునే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని లక్ష్మీదేవి రెడ్డి అనే మహిళ పేర్కొన్నారు. జూన్లోనే తన ఔట్పాస్ గడువు ముగిసిందని ఆమె తెలిపారు. యజమాని తనపై కేసు వేసినందున పోలీసు క్లియరెన్స్ రాలేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆమె చెప్పారు. -
విదేశీయుడి అనుమానాస్పద మృతి
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీలో ఫిన్లాండ్కు చెందిన స్టార్టప్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... ఐటీసీ పీఎస్పీడీలో నూతన యంత్రాలను అమర్చేందుకు వచ్చిన ఫిన్లాండ్కు చెందిన స్టార్టప్ ఇంజనీర్ విజో కలెవి కొర్హనన్(55), శుక్రవారం ఉదయం తనకు కేటాయించిన వసతి గదిలో మృతిచెందాడు. ఇతడు జూన్ 16నఆర్ఏటీఆర్ కన్సల్టెన్సీ నుంచి చెన్నైకి చెందిన వాలెట్ కంపెనీ తరఫున ఐటీసీ పీఎస్పీడీలో నూతన యంత్రాల అమర్చేందుకు వచ్చాడు. అతనికి ఐటీసీ పీఎస్పీడీలో బ్యాచిలర్ క్వార్టర్స్లో రూమ్ నెంబర్ 122ను అధికారులు కేటాయించారు. ఆయన రోజు మాదిరిగానే గురువారం సాయంత్రం విధులు ముగించుకుని క్యాంటీన్లో డిన్నర్ చేసి రూమ్కు వెళ్లాడు. శుక్రవారం ఉదయం గది తలుపులు తీయలేదు. అక్కడి వర్కర్లు ఇచ్చిన సమాచారంతో వాలెట్ కంపెనీ ప్రతినిధులు వెళ్లారు. గది తలుపులు పగలగొట్టి చూసేసరికి మంచంపై విగతుడిగా పడున్నాడు. నోటి వెంట నురగు వస్తోంది. అతని మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ గదిని పాల్వంచ సీఐ రాఘవేంద్రరావు, బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ పరిశీలించారు. మృతుడు విదేశీయుడవడంఓ ఎస్పీకి తెలిపారు. విదేశాంగ శాఖ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ అంబర్కిషోర్ ఝా సమాచారమిచ్చారు. మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. వాలెట్ కంపెనీ ఇంజనీర్ సంతోష్ తివారీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసాకు ఓకే
న్యూఢిల్లీ: విదేశీ పౌరుల్ని వివాహం చేసుకునే భారతీయులకు కేంద్రం శుభవార్త తెలిపింది. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న విదేశీయులు తమ పర్యాటక వీసాలను ఎక్స్2(డిపెండెంట్) వీసాలుగా మార్చుకునేలా నిబంధనల్ని సవరించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఓ భారతీయుడు ఫిలిప్పైన్స్ మహిళను అక్కడే వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె పర్యాటక వీసాపై భారత్కు వచ్చారు. ఆ తర్వాత పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చాలని వధువు దరఖాస్తు చేసుకోగా నిబంధనలు అంగీకరికపోవడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు. ఫిలిప్పైన్స్కు వెళ్లి ఎక్స్2 వీసా కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో ఆమె భర్త ఈ విషయమై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫిర్యాదు చేశారు. రాజ్నాథ్ ఆదేశాలతో వెంటనే స్పందించిన హోంశాఖ.. పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చేందుకు అడ్డుగా ఉన్న నిబంధనల్ని సవరించనున్నట్లు తెలిపింది. అలాగే భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకుంటే వారి జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసా ఇచ్చేందుకు ఇప్పటివరకూ అడ్డంకిగా ఉన్న నిబంధనల్ని మార్చనున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ వెసులుబాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సూడాన్, ఇరాక్ దేశాలు, పాక్ సంతతి పౌరులు, ఏ దేశానికి చెందనివారికి వర్తించబోదని పేర్కొంది. -
విదేశీయులను పెళ్లాడిన సెలబ్రెటీలు
సెలబ్రెటీల జీవితాల్లో ప్రతీ అంశం ఆసక్తికరమే. అందుకే వారి వ్యక్తిగత జీవిత విశేషాల పై కూడా అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. ముఖ్యంగా వారి ప్రేమ పెళ్లి లాంటి విషయాల కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ ప్రముఖం వినిపిస్తుంటాయి. ఇటీవల హాలీవుడ్లో సత్తా చాటుతున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ గాయకుడు జాన్ నికోస్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఫంక్షన్స్లోనూ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకు కనిపించటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. దీంతో గతంలో ఇలా విదేశీయులతో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న తారల జీవితాలకు సంబంధించిన చర్చ మొదలైంది. ఈ జాబితాలో దేశీయ తారలు చాలా మందే ఉన్నారు. ఇటీవల కాలంలో మన సెలబ్రెటీ నటీనటులు చాలా మంది విదేశీయులను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది శ్రియా, ఆండ్రీ కోశ్చివ్ను వివాహం చేసుకోవడం, ఇలియానా, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్తో ఆండ్రూ నీబోన్తో ప్రేమాయణం సాగించటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా.. ప్రియాంక, నిక్ జోనాస్లకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. వీరి కుటుంబ కార్యక్రమాలకు కూడా ఇద్దరు కలిసి హాజరవుతున్నారు. గతంలో.. ప్రీతిజింటా లాస్ ఏంజిల్స్లోని ఆర్థిక విశ్లేషకుడు జీన్ గుడ్నఫ్తో కొంతకాలం పాటు డేటింగ్ చేసి 2016లో వివాహం చేసుకున్నారు. బుల్లితెర నటి ఆష్కా గొరాడియా అమెరికన్ బ్రెంట్ గ్లోబేతో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. లాస్ వెగాస్లో వీరు మొదటిసారిగా కలుసుకున్నారు. టీవీ నటి అయిన సుచిత్ర పిళ్లై డెన్మార్క్కు చెందిన లార్స్ జెల్సన్ అనే ఇంజనీర్ను పెళ్లి చేసుకున్నారు. వీరు మొదటి సారిగా ముంబైలో జరిగిన ఓ వేడుకలో కలిశారు. అరుణోదయ్ సింగ్ అనే నటుడు కెనడాకు చెందిన లీ ఎల్టన్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు గోవాలో మొదటిసారిగా కలుసుకున్నారు. లక్కీ అలీ అనే గాయకుడి మూడో భార్య ఎలిజబెత్ హాలమ్. ఈమె మాజీ మిస్ గ్రేట్ బ్రిటన్. వీరికి 2010లో వివాహం జరిగింది. వివాహానంతరం ఈమె పేరును అయేషా అలీగా మార్చుకున్నారు. బాలీవుడ్ స్టార్ శశి కపూర్ బ్రిటీష్ నటి జెన్నిఫర్ కెండల్ను 1958లో వివాహమాడారు. సల్మాన్ ఖాన్, రొమేనియన్ మోడల్ లూలియా వాంటూర్కు మధ్య ఏదో నడుస్తుందన్న వార్త బాలీవుడ్లో ఇప్పటికీ హాట్ టాపికే. -
ఇక ఈబీ - 5 వీసాల వంతు..?
వాషింగ్టన్ : ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికా కలలు కనే జనాలకు ఒకటే ఆందోళన. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇన్నాళ్లు హెచ్ - 1బీ వీసా మార్పుల గురించి మాట్లాడిన ట్రంప్ తాజాగా మరో బాంబ్ పేల్చారు. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనే విదేశీ పెట్టుబడిదారులకు జారీ చేసే ఈబీ-5 వీసాలపై ట్రంప్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఈ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో కనీసం ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అంతేకాక ఓ పదిమందికి తప్పకుండా పర్మినెంట్ జాబ్ కల్పించాలి. ఇలా పెట్టుబడి పెట్టిన విదేశీయులకు గ్రీన్ కార్డు లభిస్తుంది. అయితే ఈ వీసాల దుర్వనియోగం జరుగుతోందని, వీటి వల్ల అక్రమాలు, మోసాలు పెరిగిపోతున్నాయని ట్రంప్ యంత్రాంగానికి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో యూఎస్ కాంగ్రెస్ ఈ వీసా విధానంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేయడం లేదా సంస్కరణలు చేపట్టడం చేయాలని ట్రంప్ యంత్రాంగం యూఎస్ కాంగ్రెస్ను కోరింది. ఈ సందర్భంగా అమెరికా పెట్టుబడిదారులకు ఉత్తమమైన రక్షణ కల్పించాలని, మోసాలకు గురికాకుండా కావాడాల్సిన అవసరం ఉందని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల విభాగం డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్సానా పేర్కొన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈబీ-5 వీసాల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందన్నారు ఫ్రాన్సిస్. విదేశీయులు మనీలాండరింగ్కు పాల్పడడానికి, గూఢచర్యం చేయడానికి దేశంలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది, సెప్టెంబర్ 30 నాటికి ఈబీ - 5 వీసా కార్యక్రమం ముగియనుంది. ఈబీ - 5 వీసా విధానం ద్వారా ఏటా పది వేల మంది విదేశీ పెట్టుబడిదారులకు ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఇది కూడా దేశాల వారీ కోటా ఆధారంగా ఉంటుంది. కాగా అమెరికాలో ఈబీ-5 వీసా కోసం దరఖాస్తులు చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో, వియత్నాం రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. గత ఏడాది భారత్ నుంచి ఈబీ-5 వీసా కోసం 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఏడాది 700 మంది దాకా దరఖాస్తు చేసే అవకాశం ఉందని అంచనా. ఈబీ - 5 వీసా కోసం మన దేశం నుంచి ఎక్కువగా చండిఘర్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ పోటి ఉంటుందని తెలిపారు. అయితే దుర్వినియోగం, మోసాలకు పాల్పడుతున్నట్లు వస్తోన్న ఫిర్యాదులు ఎక్కువగా చైనాకు సంబంధించినవని తెలుస్తోంది. -
విమానం ఎక్కేదాకా వారు జైల్లోనే!
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వివిధ ఆశలు చూపించి ఆన్లైన్ ద్వారా ఎర వేస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్న విదేశీ నేరస్తుల విషయంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) సరికొత్త వ్యూహాన్ని అనుసరించనుంది. అధిక నేరాలకు పాల్పడ్డ కేసుల్లో వీరు బెయిల్ తీసుకుని తర్వాత ఆచూకీ లేకుండా పోతుండడంతో వారు తమ దేశాలకు తిరిగి వెళ్లేదాకా జైల్లోనే ఉంచాలని నిర్ణయించింది. ఇటీవల పలు ఆన్లైన్ నేరాలకు పాల్పడ్డ నైజీరియన్ ఆచూకీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు ఆరు నెలల పాటు శ్రమించారు. ఎట్టకేలకు ఢిల్లీలో అతడి కదలికలు కనిపెట్టి అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం దాదాపు 15 రోజుల పాటు గాలించి పట్టుకుంది. ఇలా చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అతగాడు వారం రోజులకు బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఆపై రెండేళ్లుగా ఆచూకీ లేకపోవడంతో కేసు పెండింగ్లో ఉండిపోయింది. ఇలాంటి ఉదంతాలకు తావు లేకాకుండా చూసేందుకు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు చర్యలు ప్రారంభించారు. తీవ్రమైన నేరాల్లో అరెస్టయిన విదేశీయులకు బెయిల్ ఇవ్వొద్దని, నిర్ణీత కాలంలో తాము చార్జ్షీట్లు దాఖలు చేస్తామని న్యాయ విభాగానికి ఇటీవల ప్రతిపాదించారు. ఇందులోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆ విభాగం అందుకు అంగీకరించింది. దీంతో సైబర్ నేరాల్లో చిక్కిన ఇద్దరు నైజీరియన్లతో పాటు అక్రమంగా నివసించడంతో పాటు బోగస్ గుర్తింపు కార్డులు పొంది చిక్కిన పాకిస్థానీ సైతం బయటకు వచ్చే అవకాశం లేదు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేసి ట్రయల్ నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండు రకాల చర్యలకు అవకాశం దేశంలో అక్రమంగా నివసిస్తూ చిక్కిన విదేశీయులపై రెండు రకాల చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమికంగా వారి పాస్పోర్ట్పై ‘ఎగ్జిట్ స్టాంప్’ కొట్టడం ద్వారా స్వదేశానికి బలవంతంగా తిప్పిపంపే (డిపోర్టేషన్) ఆస్కారం ఉంది. అలాకానప్పుడు, ఉదంతం తీవ్రతను బట్టి వారిపై కేసు నమోదు చేసి ట్రయల్ నిర్వహించవచ్చు. ఇలా కేసు నమోదైతే మాత్రం తక్షణం డిపోర్టేషన్ చేయడానికి చట్టం అంగీకరించదు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేసి, విచారణ పూర్తై, శిక్షపడేతే అది అనుభవించిన తర్వాతే తిప్పి పంపాల్సి ఉంటుంది. ఈలోపు బెయిల్ పొందుతున్న ఈ విదేశీయులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా కేసుల విచారణ ఆగిపోవడంతో పాటు మరో ప్రాంతంలో వారు యథేచ్ఛగా నేరాలు చేస్తున్నా గుర్తించి, పట్టుకోలేని పరిస్థితి ఉంది. నగరం విషయానికి వస్తే ఇక్కడ చిక్కుతున్న వారిలో ఆఫ్రికా దేశాలతో పాటు పాక్, బంగ్లాదేశ్కు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలోనూ నల్లజాతీయులతోనే ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. వీరు అక్రమంగా నివసిస్తున్నప్పటికీ ఏదో ఒక పోలీసు కేసు నమోదైతే తప్ప ఈ విషయం వెలుగులోకి రావట్లేదు. దీంతో వెంటనే డిపోర్టేషన్ చేసే ఆస్కారం ఉండడం లేదు. పాస్పోర్ట్ ‘భద్రపరిచి’ రాక.. సిటీలో జరుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయాల్లో ఎక్కువగా నల్లజాతీయులు అరెస్ట్ అవుతున్నారు. వీరంతా తొలిదశలో విద్య, వ్యాపార, పర్యాటక వీసాలపై దేశంలోని ఏదో ఒక మెట్రో నగరానికి చేరుకుంటున్నారు. అక్కడ ఉంటూ ఈ దందాల్లోకి దిగుతున్నప్పుడే తమ పాస్పోర్టులను కొందరి వద్ద భద్రపరిచి, నేరబాట పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆయా నిందితులు పోలీసులకు చిక్కుతున్నప్పటికీ పాస్పోర్టులు స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావడం లేదు. కనీసం వాటి నంబర్లు, కొన్ని సందర్భాల్లో తమ నిజమైన పేర్లు కూడా ఈ నేరగాళ్లు బయటపెట్టడం లేదు. అవి లభిస్తే తప్ప సీజ్ చేయడానికి, రద్దు చేయించడానికో ఆస్కారం లేదు. ఈ కారణంగానే బెయిల్పై వచ్చిన వారు తమ దేశాలకు చెక్కేస్తున్నా గుర్తించలేని, పట్టుకోలేని పరిస్థితి. దీనివల్ల ఓపక్క కేసుల విచారణ ముందుకు సాగకపోవడంతో పాటు అనేక నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఈ పరిణామాలు ఇటు న్యాయస్థానాలతో పాటు అటు పోలీసులకూ పని భారం పెంచుతున్నాయి. నేరం చేసిన వాళ్లు స్వేచ్ఛగా విహరించే ఆస్కారం ఇస్తున్నాయి. బెయిల్ ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. సాధారణంగా ఏదైనా నేరంలో నిందితుడిగా అరెస్ట్ అయిన వ్యక్తి దోషిగా తేలే వరకు జైల్లోనే మగ్గిపోకుండా బెయిల్ పొందడం చట్టం కల్పించిన అవకాశం. అయినప్పటికీ విదేశీ నేరగాళ్లకు బెయిల్ ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చట్ట ప్రకారం ఆయా కేసుల్లో నిందతులను అరెస్ట్ చేసిన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో (ప్రత్యేక కేసుల్లో మినహా) అభియోగపత్రాలు దాఖలు చేయాలి. కీలక కేసుల్లో ఈ కోణంలో పోలీసులు విఫలమైనప్పుడే న్యాయస్థానాలు నిందితులకు బెయిల్ ఇస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు తాము నిర్ణీత కాలంలో చార్జ్షీట్లు దాఖలు చేస్తామంటూ న్యాయ విభాగం దృష్టికి తీసుకువెళ్లారు. విదేశీ నేరస్తుల విషయంలో ఇది కచ్చితంగా అమలయ్యేలా చర్యలు కుంటున్నట్లు వివరించాయి. దీనికి సమ్మతించిన న్యాయ విభాగం పూర్వాపరాల నేపథ్యంలో విదేశీ నేరస్తులకు బెయిల్ ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు విచారణ, శిక్ష పూర్తయిన తర్వాత నేరుగా డిపోర్టేషన్ చేయడానికి నిర్ణయించామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. -
విదేశీయులతో శృంగారంలో పాల్గొనకండి!
మాస్కో : సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా రష్యా మహిళలు శ్వేతజాతియేతర విదేశీయులతో శృంగారంలో పాల్గొనకూడదని ఆ దేశ ప్రజాప్రతినిధి ఒకరు సూచించారు. శ్వేతజాతియేతర విదేశీయులతో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. మిశ్రమ జాతి (మిక్స్డ్ రేస్) పిల్లలతో సింగిల్ మదర్గా మహిళలు మిగిలిపోయే అవకాశముందని అన్నారు. రష్యా మహిళలు విదేశీయులతో చేసుకుంటున్న వివాహ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని, రష్యా మహిళలు విదేశాల్లో చిక్కుకుపోవడం, లేదా వారు దేశంలో ఉంటే.. వారి పిల్లలు విదేశాల్లో ఉండటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని సీనియర్ చట్టసభ సభ్యురాలు, కుటుంబ వ్యవహారాలు, మహిళా శిశు పార్లమెంటు కమిటీ చైర్మన్ తమరా ప్లెట్న్యోవా తెలిపారు. 1980లో మాస్కో ఒలింపిక్స్ సందర్భంగా విదేశీయులతో సంబంధాల కారణంగా రష్యా మహిళలు పిల్లలను కన్నారు. అప్పట్లో గర్భనిరోధక పద్ధతులు అంతగా అందుబాటులో లేకపోవడంతో ఇలా పుట్టిన చిన్నారులు ‘ఒలింపిక్ పిల్లలు’గా ముద్రపడ్డారు. అంతర్జాతీయ క్రీడల సందర్భంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా పురుషులతో సంబంధాల వల్ల రష్యా మహిళలకు పుట్టిన శ్వేతజాతియేతర పిల్లలను పిలిచేందుకు సోవియట్ హయాంలో ఈ పదాన్ని వాడేవారు. ఈ పిల్లలు రష్యాలో వివక్షను ఎదుర్కొన్నారు. ఈ విషయమై ఓ ప్రశ్నకు బదులిచ్చిన తమరా.. ‘మన పిల్లలకు మాత్రమే మనం జన్మనివ్వాలి. సోవియట్ కాలం నుంచి మిశ్రమ జాతి పిల్లలు ఎన్నో కష్టాలు పడ్డారు’ అని ఆమె స్థానిక రేడియో కార్యక్రమంలో పేర్కొన్నారు. నేటి నుంచి ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. -
అమెరికా గుడ్న్యూస్ : అదనంగా 15వేల వీసాలు
వాషింగ్టన్ : వీసాల జారీ విషయంలో కఠినతరమైన నిబంధనలు విధిస్తూ.. విదేశీయులకు చుక్కలు చూపిస్తూ వస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. అదనంగా 15వేల హెచ్-2బీ వీసాలను విదేశీయులకు జారీచేయనున్నట్టు ప్రకటించింది. ఈ వీసాలు ఇప్పటికే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జారీ చేసిన 66వేల వీసాల కంటే అదనం. అదనపు వీసాలు జారీ చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యురిటీ ప్రకటించింది. ఈ హెచ్-2బీ వీసాలను ప్రస్తుతం తాత్కాలికంగా నాన్-అగ్రికల్చర్ వర్కర్లకు జారీ చేస్తున్నారు. ఈ వీసాల ద్వారా అమెరికన్ వ్యాపారాలు పలు అవసరాల నేపథ్యంలో నాన్-అగ్రికల్చర్ ఉద్యోగాలను పూరించుకోవడం కోసం విదేశీయులను వారి దేశానికి రప్పించడం కోసం ఉపయోగపడుతున్నాయి. అమెరికాన్ వ్యాపారాలను సంతృప్తిపరిచేంతగా, తాత్కాలిక నాన్-అగ్రికల్చర్ లేబర్గా పనిచేసేందుకు ప్రతిభావంతులైన, సరిపడ స్థాయిలో అమెరికన్ వర్కర్లు లేరని సెక్రటరీ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యురిటీ కిర్స్టేజెన్ నీ నీల్సన్ చెప్పారు. సెక్రటరీ ఆఫ్ లేబర్ అలెక్సాండర్ అకోస్టా, కాంగ్రెస్ సభ్యులు, వ్యాపార యజమానులతో సమావేశమైన తర్వాత ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీహెచ్ఎస్ ప్రెస్కు తెలిపింది. హెచ్-2బీ వీసాను కూడా ఇందుకోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతిభావంతులైన, సరిపడ స్థాయిలో వర్కర్లు దొరకనప్పుడు, తాత్కాలికంగా విదేశాల నుంచి అమెరికా వ్యాపారాలకు అనుగుణంగా వర్కర్లను రప్పించుకోవచ్చు. గరిష్టంగా ఈ ఏడాది ప్రథమార్థంలో 33వేల హెచ్-2బీ వీసాలు అందుబాటులో ఉంటాయని, మరో 33వేలు వీసాలను ద్వితీయార్థంలో జారీచేయనున్నట్టు హోమ్ల్యాండ్ సెక్యురిటీ పేర్కొంది. ఈ వారం నుంచి అర్హత కలిగిన వారు హెచ్-2బీ వీసాల కోసం ఫామ్ 1-129ను సమర్పించాలని చెప్పింది. -
విదేశీ విద్యార్థి అనుమానాస్పద మృతి
మౌలాలి: క్వారీ గుంతలో పడి విదేశీ విద్యార్ధి అనుమానస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుడాన్ దేశానికి చెందిన సాలిహ్ అబ్డీన్ సాలీహ్ అలియస్ కోహా(28) నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసి చదువుతుతూ ఓయూ టీచర్స్ కాలనీలోని రాఘవేంద్రహిల్స్ ఎమ్మార్ రెసిడెన్సీలో ఉంటున్నాడు. శనివారం రాత్రి తన స్నేహితులు సబ్రా, కెల్విన్, సండ్రా, హ్యాపి, రేమాండ్, గాడ్విల్లతో కలిసి ప్లాట్లో విందు చేసుకున్నారు. స్నేహితులు వెళ్లిపోవడంతో ప్లాట్లో ఒక్కడే ఉన్నాడు. ఉదయం స్నేహితులు వచ్చి చూసేసరికి అతను క్వారీ గుంతలో మృతి చెంది ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విదేశీయుడిని దోచుకున్న క్యాబ్ డ్రైవర్ల రిమాండ్
శంషాబాద్: ప్రయాణికుడి బ్యాగ్ను చోరీ చేసిన ఇద్దరు క్యాబ్ డ్రైవర్లను ఆర్జీఐఏ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీఐ దస్రునాయక్ తెలిపిన వివరాల ప్రకారం... నాలుగు రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్ను క్యాబ్ డ్రైవర్లు దొంగిలించారు. బ్యాగ్లో నగదు, బంగారం పోవడంతో బాధితుడు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా చోరీ చేసిన నిందితులను గుర్తించి బేగంపేట పోలీస్ ల్యాండ్లో నివాసం ఉంటున్న మహ్మద్ గౌస్(34), రసూల్పురాలో నివాసం ఉంటున్న మహ్మద్ జాకీర్(21)లను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు తులాల బంగారం, రూ. 76 వేల నగదు స్వాధీనం చేసుకోని గురువారం రిమాండ్కు తరలించారు. -
ఇక్కడి మహిళలు అదృష్టవంతులు
తార్నాక: నేటి సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు విజయాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో వారికి ఎంతో గౌరవం లభిస్తుండగా.. మరికొన్ని దేశాలు వారిపై అంక్షలు విధిస్తూ స్వేచ్ఛను ఆంక్షల చట్రంలో బిగిస్తున్నాయి. ఈ విషయంలో భారత మహిళలకు మాత్రం కావాల్సినంత స్వేచ్ఛ ఉందని, ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులంటున్నారు విదేశీ విద్యార్థులు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న పలువురు విదేశీ విద్యార్థినులతో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ వివరాలు విద్యార్థుల మాటల్లోనే.. చాలా అదృష్టవంతులు మా దేశంతో పోలిస్తే భారతదేశంలో మహిళలు స్వేచ్ఛగా ఉంటారు. మా దేశంలో మహిళా దినోత్సవం నిర్వహించరు. అయితే రక్షణ, గౌరవం బాగానే లభిస్తుంది. అయితే ఎంత రక్షణ ఉన్నా స్వేచ్ఛగా ఉండే అవకాశం లేదు. అందుకే భారతీయ స్త్రీలు అన్ని విషయాల్లోనూ అదృష్టవంతులు.– రెవీనా సెమాల్, ఇథియోఫియా ప్రభుత్వమే గౌరవిస్తుంది.. మా దేశంలో మార్చి 8న ‘మదర్స్డే’గాను, జూలై 27న ‘డాటర్స్డే’ గాను ఉత్సవాలు చేస్తారు. ఈ సందర్భాల్లో మహిళలందరికీ బహుమతులు ఇవ్వడంతో పాటు, సన్మానాలు చేస్తారు. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ నిధులతోనేచేపడతారు. ప్రభుత్వమే మహిళలను గౌరవిస్తుంది. – ఆజాదే ఫర్హాదీ, ఇరాన్ సమానత్వం ఉండదు.. మా దేశంలో మహిళా దినోత్సవాలు ఉన్నతమైన హోదాలో ఉన్న వారికే పరిమితం. స్వేచ్ఛ విషయంలో భారత్లో పోలిస్తే మా దేశంలో కొంత నిర్బంధమే. పురుషులతో సమానం గా చూసే పరిస్థితి లేదు. ఒక సంస్థలో పనిచేసే స్త్రీలకు పురుషులతో సమానంగా వేతనాలు ఉండవు. అయితే స్త్రీలు హక్కులు సాధించుకునే విశగాస్వశక్తిగా ఎదగాలి. – బొరాయ్ రోహిన్, ఇరాక్ ఇప్పటికీ స్వేచ్ఛ లేదు.. ఆఫ్రికాలోని టీ–చాంద్ దేశంలో పుట్టిన మేం బతుకు దెరువు కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లాం. ఇక్కడా, ఇక్కడా నేను గమనించిందేంటంటే.. స్త్రీలపై నిర్బంధం కొనసాగడం. ఇప్పటికీ మా దేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదు. మా దేశంలో మహిళా దినోత్సవాలు నిషిద్ధం. బయటకు వెళ్లాలంటే మాకంటే చిన్న వారైనా సరే ఒక మగతోడు ఉండాల్సిందే. చదువు కోసం వచ్చిన మాకు ఇక్కడున్న కొద్ది కాలమైన ఆనందంగా ఉంటాం. అందుకు భారతదేశానికి సల్యూట్.– నియిమా అక్బర్, దక్షిణాఫ్రికా స్త్రీ స్వేచ్ఛలో భారత్ మిన్న.. స్త్రీ స్వేచ్ఛలో భారత్ తరువాతే ప్రపంచంలోని మిగతా దేశాలు. మా దేశంలో అయితే స్త్రీలకు స్వేచ్ఛ లేకపోగా, అభద్రతా భావం కూడా ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీంతో మేం చాలా నిర్బంధంలో ఉంటాం. స్వేచ్ఛగా బయట తిరుగలేం. భారత్లో అలా కాదు.. స్త్రీలను ఎంతో గౌరవిస్తారు. అందుకే ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. – నసీబా, అఫ్ఘనిస్థాన్ -
లవ్... మ్యారేజ్!
ప్రేమ ఒక అనుభూతి. పెళ్లి ఒక అనుబంధం. విభిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్లో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొనేవాళ్లు ఉన్నారు. పెళ్లి తరువాతే ప్రేమంటూ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉండేవాళ్లూ ఉన్నారు. ఎవరైనా కోరుకొనేది ఒక్కటే...ఆ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలి. ప్రేమ పరమార్థం పెళ్లి కావాలి. ప్రేమ పెళ్లిళ్లపై యువత ఏమనుకుంటున్నారు? పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లపై వాళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అనే అంశం ఎప్పుడైనా ఆసక్తిదాయకమే. చర్చనీయాంశమే. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇదే అంశంపై ‘సాక్షి’ ఒక సర్వే నిర్వహించింది. విదేశీ యువతీ యువకులు, హైదరాబాద్ యువత మనోగతాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నించింది. ప్రేమించుకున్నాకే పెళ్లి చేసుకోవాలని 70 శాతం మంది విదేశీ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకొని లోపాలను సరిదిద్దుకొనేందుకు వీలు కలుగుతుందన్నారు. హైదరాబాద్ స్టూడెంట్స్ మాత్రం 85 శాతం మంది పెళ్లి తరువాతే ప్రేమకు జై కొట్టారు. ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమేనని రెండు వర్గాల విద్యార్థులు స్పష్టంగా అభిప్రాయపడ్డారు. యువత మనోగతం ఇదే... సాక్షి నెట్వర్క్: ప్రేమ, పెళ్లి అంశంపై అభిప్రాయ సేకరణ చేపట్టగా...నగరంలోని బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలకు చెందిన హైదరాబాద్ యువతీ యువకులు, తార్నాక ఇఫ్లూ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించారు. ఏ బంధమైనా తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిలిచిపోవాలని ఇరువర్గాల విద్యార్థులు గట్టిగా చెప్పారు. ప్రేమించుకున్నాకే పెళ్లి చేసుకోవాలని 70 శాతం మంది విదేశీ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకొని లోపాలను సరిదిద్దుకొనేందుకు వీలు కలుగుతుందన్నారు. హైదరాబాద్ స్టూడెంట్స్ మాత్రం 85 శాతం మంది పెళ్లి తరువాతే ప్రేమకు జై కొట్టారు. ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమేనని రెండు వర్గాల విద్యార్థులు స్పష్టంగా అభిప్రాయపడ్డారు. అలాగే ప్రేమిస్తే కచ్చితంగా పెళ్లి వరకూ వెళ్లాల్సిందేనని 85 శాతం మంది హైదరాబాద్ విద్యార్థులు కుండబద్దలు కొట్టి చెప్పారు. విదేశీ విద్యార్థుల్లో 25 శాతం మాత్రం అభిప్రాయబేధాలు ఉంటే పెళ్లి చేసుకోవడం కంటే దూరం కావడమే మంచిదని స్పష్టం చేశారు. సర్వే ఇలా.... 1) ప్రేమ తర్వాత పెళ్లి....పెళ్లి తర్వాత ప్రేమ...ఏది కరెక్ట్? ఎ) ప్రేమ తర్వాత పెళ్లి – హైదరాబాద్ విద్యార్థులు : 35 శాతం, విదేశీ విద్యార్థులు : 70 శాతం బి) పెళ్లి తర్వాత ప్రేమ – హైదరాబాద్ విద్యార్థులు : 65 శాతం విదేశీ విద్యార్థులు : 30 శాతం 2) మీ దృష్టిలో ప్రేమంటే? ఎ) ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం – రెండు కేటగిరీల విద్యార్థులు: 80 శాతం బి) ఒకరి అవసరాలు ఒకరు తీర్చడం – రెండు కేటగిరీల విద్యార్థులు: 20 శాతం 3) ప్రేమిస్తే ఖచ్చితంగా పెళ్లి వరకు వెళ్లాల్సిందేనా..? ఎ) అవును – హైదరాబాద్ స్టూడెంట్స్ – 85 శాతం. విదేశీ విద్యార్థులు: 75 శాతం బి) లేదు– హైదరాబాద్ స్టూడెంట్స్ – 15 శాతం విదేశీ విద్యార్థులు: 25 శాతం 4) లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నిజమేనా? ఎ) కాదు– రెండు కేటగరీల విద్యార్థులు: 80 శాతం బి) అవును – రెండు కేటగరీల విద్యార్థులు: 20 శాతం 5) మీ ఓటు లవ్ మ్యారేజ్కా లేక అరేంజ్డ్ మ్యారెజ్కా....? ఎ) లవ్ మ్యారేజ్ – హైదరాబాద్ స్టూడెంట్స్ 35 శాతం, విదేశీ స్టూడెంట్స్ 70 శాతం బి) అరేంజ్డ్ – హైదరాబాద్ స్టూడెంట్స్ 65 శాతం, విదేశీ విద్యార్థులు 30 శాతం అది ఒక ఆకర్షణ మాత్రమే.... ఇక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది చాలా వరకు ఆకర్షణ మాత్రమేని హైదరాబాద్ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కొట్టిపడేశారు. తొలిచూపులోనే ప్రేమ చిగురిస్తుందనే దానికి కేవలం 20 శాతం మంది సానుకూలత వ్యక్తం చేయగా, 80 శాతం మంది మాత్రం అది సరైంది కాదన్నారు. ఒకరునొకరు స్పష్టంగా తెలుసుకొని, అభిప్రాయాలను,ఆలోచనలను పంచుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పారు. పెద్దలు కుదిర్చితే ఓకే.... పెద్దలు కుదిర్చిన పెళ్లికి 65 శాతం మొగ్గు చూపారు. మిగతా 35 శాతం మాత్రం ప్రేమ పెళ్లి పట్ల ఆసక్తిని ప్రదర్శించారు.పెద్దలు కుదుర్చిన వివాహ వ్యవస్థలో భద్రత ఉంటుందని, కుటుంబం అండదండలు ఉంటాయని కొందరు అభిప్రాయపడగా, అలా అని చెప్పి గుడ్డిగా ఒప్పేసుకోలేమని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. నమ్మకం ముఖ్యం ప్రేమించి చేసుకున్నా..లేకపోయినా సరే కాని పెళ్లి తర్వాత ఒకరిని ఒకరు గౌరవించుకోవలి. ప్రేమించుకోవాలి. ఒకరిపై ఒకరు పరస్పర నమ్మకం ఉంచాలి. నేను పెద్దలు కుదిర్చిన వివాహానికే మొగ్గు చూపుతాను. – గిరిష్మా పట్నాయక్, విద్యార్థిని జీవితాంతం ప్రేమించుకోవాలి ప్రేమించి చేసుకోవడమా లేదా పెళ్లి తర్వాత ప్రేమించడమా అన్నది పెద్ద సమస్య కాదు. ఎలా చేసుకున్నా జీవితకాలం ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ప్రధానం. లేకుంటే వివాహానికి అర్థం లేదు. – హిమజ, విద్యార్థిని ప్రేమ తర్వాతే పెళ్లి... ప్రేమ తర్వాతే పెళ్లికి నేను ఓటేస్తాను. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, అభిప్రాయాలను గౌరవించుకోవడం ముఖ్యం . అదే పెళ్లిని కలకాలం నిలుపుతుంది. నిజమైన ప్రేమికులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.–భవ్య, విద్యార్థిని లవ్ ఫస్ట్.... ప్రేమించిన తరువాత పెళ్లి చేసుకోవడమనేది సరైంది. ఇద్దరి మ«ధ్య చిగురించిన ప్రేమ ఆకర్షణగా మొదలై ఆ తరువాత ఒకరినొకరు అర్థం చేసుకునే వరకు వెళుతుంది. జీవితాంతం తాను ప్రేమించిన వ్యక్తితోనే ఉండాలి కాబట్టి ఇద్దరూ తన అభిప్రాయాలను తెలుసుకుంటారు.– ఒసామా, ఎల్ఎల్ఎం(ఇరాక్) చివరి వరకు నిలిచేది ప్రేమ... ప్రేమంటే రెండు జీవితాలు ప్రాణమున్నంత వరకు కలిసి ఉండేది. ఒకరినొకరు పూర్తిగా అర్దం చేసుకోవాలి. అపుడే వారి మధ్య నిజమైన బంధంఏర్పడుతుంది. వాలెంటైన్స్ డే సందర్బంగా తనకు నచ్చిన వ్యక్తిని గిఫ్టుల ద్వారా ఆకట్టుకోవడం కాదు, వారికి జీవితాంతం తోడునీడగా ఉండాలి.–నసీబా, బీసీ ఓయూ (అఫ్టనిస్తాన్) నో లవ్... నో మ్యారేజ్...ఓన్లీ సింగిల్... ప్రేమలు, పెళ్లిళ్లు అనేది పెద్ద బోగస్...వాలెంటైన్స్ డే పేరుతో ప్రేమికులు తమప్రేను వ్యక్తపర్చడమనేది కేవలం ఒక ఆకర్షణ మాత్రమే. నాకు ఈ ప్రేమలు, పెళ్లిళ్లు అసలే నచ్చవు. వీటికి నేను దూరం.. నో వాలెంటైన్స్ డే...నో లవ్... నో మ్యారేజ్.. అయామ్ ఓన్లీ సింగిల్... – ఎలీనా, పీహెచ్డీ (సిరియా) మా దేశంలో లవ్ మ్యారేజెస్ ఎక్కువ మా దేశంలో చాలా వరకు ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తారు. వాలెంటైన్స్ డే సందర్బంగా చాలా మందిప్రేమికులు తమ ప్రేమను వెలిబుచ్చి ఆమోదం పొందుతారు. పెళ్లికి ముందు ప్రేమ వల్ల ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. దీంతో ఇరువురి మధ్య ఒక నమ్మకం కుదురి గొప్ప బంధం ఏర్పడుతుంది. –మరియం, ఎంసీజే (మొరాకో) -
విదేశీయుల ‘ఫీల్ ద జైల్’
సంగారెడ్డి క్రైం: ఎవరైనా జైలు జీవితం అనుభవించాలని కలలో కూడా ఊహించరు. కానీ ఇద్దరు విదేశీయులు మాత్రం జైలు శిక్ష అనుభవించి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట! అయితే వారి కోరికను సంగారెడ్డి జైలు అధికారులు తీర్చారు. ఇటీవల సంగారెడ్డి జైలు అధికారులు ‘ఫీల్ ద జైల్’అనే కార్యక్రమాన్ని చేపట్టారు. మలేషియాకు చెందిన దంత వైద్యుడు క్వెన్, రెస్టారెంట్ వ్యాపారి కెల్విన్ ఆన్లైన్లో వీటి గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏకంగా వారు మలేషియా నుంచి ఇక్కడికి వచ్చారు.జైలు సూపరింటెండెంట్ సంతోష్రాయ్ను సంప్రదించి తమ మనసులోని మాటను చెప్పారు. నిబంధనల ప్రకారం జైలు మ్యూజియంలో రూ.500 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఖైదీల్లా కారాగారంలో అడుగు పెట్టారు. ఆన్లైన్లో ‘ఫీల్ ద జైల్’గురించి వివరాలు తెలుసుకొని జైలు జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని క్వెన్, కెల్విన్ తెలిపారు. శిక్ష కాలంలో ఖైదీలకు అందించే ఆహారాన్నే తమకూ వడ్డించాలని వారు అధికారులను కోరారు. -
తాలిబన్ల దాడిలో 14మంది విదేశీయులు మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో ఇంటర్ కాంటినెంటల్ హోటల్పై తాలిబన్లు శుక్రవారం రాత్రి జరిపిన దాడిలో 14 మంది విదేశీయులు చనిపోయారు. ఒక టెలికం అధికారి, ముగ్గురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి 9.30 ప్రాంతంలో సాయుధులైన నలుగురు దుండగులు హోటల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ కొందరిని బందీలుగా పట్టుకున్నారు. హోటల్లోని కొన్ని గదులకు నిప్పంటించారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు హెలికాప్టర్ ద్వారా భవనం పైనుంచి ప్రవేశించి ఉగ్రవాదులతో తలపడ్డాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనకు తామే కారణమంటూ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ తాలిబాన్ ప్రకటించుకుంది. -
టూరిస్టు వీసాలిచ్చి మోసగిస్తున్న ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమాయక ప్రజలకు టూరిస్ట్ వీసాలు ఇచ్చి మోసగిస్తున్న, దుబాయ్ పంపిన మహిళల్ని భయపెట్టి వ్యభిచారంలోకి దింపుతున్నముఠాలోని కొందరు సభ్యులను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బి నగర్లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో సిపి మహేష్ భగవత్ మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, కువైట్ దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరక్షరాస్యులైన అమాయక ప్రజలకు టూరిస్ట్ వీసాలు ఇచ్చి ఈ ముఠా మోసాలకు పాల్పడుతోందని చెప్పారు. అలాగే దుబాయ్కు పంపిన మహిళల్ని భయపెట్టి వ్యభిచార గృహాలకు తరలించి డబ్బులు దండుకుంటున్నదని కూడా తెలిపారు. 12మంది సభ్యుల ఈ ముఠాలో ఐదుగురిని మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. అరెస్టు అయిన వారినుంచి రూ.1.60 లక్షల నగదు, వీసా డాక్యుమెంట్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా, ఈ కేసు విషయంలో బాధితులు పిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించిన ఘట్కేసర్ ఎస్ఐ శోభన్బాబును 15 రోజుల క్రితం సీపీ సస్పెండ్ చేశారు. ఏసీపీ, సిఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. -
విదేశీ వనితలా.. మజాకా !
సాక్షి, తిరువళ్లూరు: మనం గొప్ప పనులు చేయలేకపోచ్చు.. కానీ చేసే పనులను మనసు పెట్టి చేస్తే అదే మనిషి ఔన్నత్యానికి కొలబద్దతగా మారుతుందన్న మదర్థెరిస్సా మాటలు వారిలో స్ఫూర్తి నింపాయి. ఇదే స్ఫూర్తితో కెనడాకు చెందిన క్లోవీఎలిజబెత్, స్కాట్లాండ్కు చెందిన హన్నారోస్ తిరువళ్లూరు సమీపం, సేవాలయ ఆశ్రమంలోని అనాథలకు సేవ, విద్యార్థులకు ఆంగ్లం బోధిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు ఎలిజబెత్, హన్నారోస్. ఈ సందర్భంగా వారిని పలుకరించిన సాక్షికి తెలిపిన వివరాలు వారి మాటల్లోనే.. సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచి సామాజిక సేవ చేయాలన్న ఆసక్తి ఉండేది. దీంతో భారతదేశానికి వెళ్లి ఏదైనా ఆశ్రమంలో సేవచేస్తూ.. సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది ఎలిజబెత్. ఇంగ్లాండ్కు చెందిన క్లోవీఎలిజబెత్ తండ్రి జాన్ పర్యావరణ పరిరక్షణ అధికారి. తల్లి సారా ప్లేస్కూల్, స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. ‘2016లో వ్యవసాయ సాగు– ఆహార పదార్థాల్లో విషతుల్యం అనే అంశంపై ప్రాజెక్టు చేయడానికి స్కాట్లాడ్కు వెళ్లా. అక్కడే నెదర్లాండ్కు చెందిన హన్నారోస్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఆసక్తి సేవచేయడమే కావడంతో ఇంటర్ పూర్తిచేశాక భారత్కు వెళ్లాలనుకున్నాం. అక్కడ ఏదైనా ఓ ఆశ్రమంలో సేవ చేస్తూనే సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించాం’ అని వివరించారు ఎలిజబెత్. తల్లిదండ్రులను ఒప్పించి మాకు అనువైన చెన్నై సమీపం, కసువ వద్ద ఉన్న సేవాలయ ఆశ్రమాన్ని ఎంచుకున్నామని హన్నారోస్, ఎలిజబెతు లు వివరించారు. ఉదయం వ్యవసాయం – సాయంత్రం సంప్రదాయం నవంబర్లో సేవాలయకు వచ్చాం. మాకు ఉన్న ఏడాది సమయంలో వ్యవసాయం, సనాతన భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం వ్యవసాయ పనులు, తొమ్మిదింటికి అవ్వతాతల బాగోగులు చూసుకోవడం, తరువాత మధ్యాహ్నం మూడు గంటల వరకు చిన్నపిల్లలకు స్పోకెన్ ఇంగ్లిష్ చెప్పడం మా దినచర్య. పాఠశాల ముగియగానే మళ్లి అరకపట్టి దున్నడం, కలుపుతీయడం, కూరగాయలను కోసి ఆశ్రమానికి పంపించడం చేస్తాం, మిగతా సమయంలో సంప్రదాయ వంటకాలు, భరతనాట్యం, వస్త్రధారణ నేర్చుకుంటున్నాం. తమిళం మాట్లాడడం, రాయడం నేర్చుకుంటున్నామన్నారు హన్నారోస్. పాఠశాల ముగిసే సమయానికి పిల్లల కోసం తల్లిదండ్రులు గేటు వద్దే వేచి ఉండడం, పిల్లలు రాగానే వారిని ప్రేమగా ముద్దాడడం చూస్తే ప్రేమకు దూరమయ్యామనే బాధ కలుగుతుందన్నారు క్లోవీఎలిజబెత్, హన్నారోస్. సేంద్రియ సాగుపై ఆసక్తి ఎందుకంటే: 2016లో వ్యవసాయ సాగు పద్ధతులు – ఆహార పదార్థాల విషతుల్యం అనే అంశంపై ప్రత్యేక ప్రాజెక్టును రూపొదించడానికి స్కాట్లాండ్కు వెళ్లాం. అక్కడ వివిధ వర్గాల ప్రజలు, ప్రముఖ వైద్యుల అభిప్రాయాల మేరకు మనిషి తినే ఆహరంలో ఉన్న రసాయనాలే అనారోగ్యానికి కారణమనే విషయం మాకు స్పష్టంగా అర్థమైంది. ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలన్న ఉద్దేశంతో సేంద్రియ సాగుపై ఆసక్తి ప్రదర్శిస్తున్నామన్నారు ఎలిజబెత్, హన్నారోస్. ప్రస్తుతం సేవాలయలో కూరగాయలు, పప్పుదినుసులు, వరి తదితర ఆహార«ధాన్యాలను సాగు చేస్తున్నాం. మొదట కొంచెం భూమిని చదును చేసి విత్తనాలను చల్లిన సమయంలో వర్షాలు పడడంతో వృథాగా పోయింది. అయినా నిరాశ చెందలేదు. అక్కడున్న రైతుల సూచనలు స్వీకరించి కూరగాయలు సాగు చేసాం. ప్రస్తుతం పంట భాగానే పండింది. సేఫ్ డ్రస్సింగ్ భారతదేశంలో మహిళలు ధరించే వస్త్రాలు చాలా సేఫ్గా ఉంటాయి. కట్టుబొట్టు, బంగారు అలంకరణ బాగుంది. అందుకే భారతీయ సంప్రదాయం బాగా నచ్చిందని వివరించారు హన్నారోస్. ఎప్పుడూ పీజా బర్గర్ తినే మాకు ఆరటి ఆకు భోజనాలు ఇష్టం. మొదట తాము సేంద్రియ వ్యవసాయ సాగు, ఆశ్రమంలో సేవ చేయడం, స్పోకెన్ ఇంగ్లిష్ బోధించడానికే వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక నేర్చుకోవాల్సింది చాలా ఉందని వివరించారు ఎలిజబెత్. విదేశాల మోజులో వ్యవసాయానికి స్వస్తి పలుకుతున్న ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు క్లోవీ ఎలిజబెత్, హన్నారోస్. -
మహిళతో ఉబర్ డ్రైవర్ వాగ్వాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో లండన్ మహిళతో ఉబర్ క్యాబ్ డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. వివరాలివి.. లండన్ మహిళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఉబర్ క్యాబ్ను బుక్ చేసుకుంది. ప్రయాణ సమయంలో డ్రైవర్ ప్రవర్తన అనుమానంగా ఉండటాన్ని గమనించి వెంటనే ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో క్యాబ్ డ్రైవర్ భయంతో కారును ఇంకా వేగంగా నడిపాడు. ఇద్దరి మధ్య వెళ్లే మార్గంలో వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న మాదన్నపేట పోలీసులు రంగంలోకి దిగి క్యాబ్ డ్రైవర్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
విదేశీ వర్కర్లకు ఖతార్ మరో గుడ్న్యూస్
విదేశీ కార్మికులకు ఖతార్ గుడ్న్యూస్ చెప్పింది. విదేశీయులకు నివాస ప్రక్రియలను సులభతరం చేసేందుకు, వారు తమ స్వదేశంలోనే విధానాలన్నింటిన్నీ పూర్తి చేసుకునే వీలు కల్పించింది. ఈ కొత్త ఒప్పందంపై ఖతారీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సింగపూర్కు చెందిన కంపెనీ సంతకాలు చేసుకున్నాయి. ఖతారీ నివాస ప్రక్రియలన్నింటిన్నీ విదేశీ వర్కర్లు తమ స్వదేశంలోనే పూర్తి చేసుకోవచ్చని ఖతార్ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో ఎనిమిది దేశాలకు వర్తిస్తుంది. భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ట్యునీషియాలు ఉన్నాయి. ఖతార్ మొత్తం వర్క్ఫోర్స్లో ఈ దేశాల వారు 80 శాతం ఉంటారు. డీల్ ప్రకారం విదేశీయులు తమ మెడికల్ చెకప్, బయోమెట్రిక్ డేటా, ఫింగర్ప్రింట్, వర్క్ కాంట్రాక్టులపై సంతకం అన్ని కూడా ఖతార్కు రాకముందే తమ స్వదేశంలోనే పూర్తి చేసుకునే అనుమతి ఉంటుంది. ఈ డీల్తో మెడికల్ టెస్ట్లో విఫలమయ్యారని విదేశీ వర్కర్లను దేశంలోకి తిరస్కరించే కేసులు తగ్గుతాయని తెలిసింది. అక్టోబర్ మొదట్లోనే ఖతార్ ఈ డ్రాఫ్ట్ బిల్లును రూపొందించింది. విదేశీ వర్కర్లు తమ ఉద్యోగులు మారడానికి వీలుగా గతేడాదే ఖతార్ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. -
అమెరికా వైపే అడుగులు...!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: అమెరికా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చేరే విదేశీ విద్యార్థులు 2017–18 విద్యా సంవత్సరంలో మొత్తంగా 7 శాతం తగ్గిపోగా భారత విద్యార్థుల సంఖ్యలో రెండంకెల వృద్ధి నమోదైంది. అమెరికాలోని 522 విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విదేశీ విద్యార్థుల చేరికలపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) ఓ సర్వే చేసింది. ‘ఫాల్ 2017 ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ స్నాప్షాట్ సర్వే’ పేరిట చేసిన ఈ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. గతేడాదితో పోలిస్తే అమెరికాలోని 45 శాతం విద్యాసంస్థల్లో కొత్తగా చేరిన విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గింది. మరో 24 శాతం విద్యాసంస్థల్లో తటస్థంగా ఉంది. 31 శాతం విద్యాసంస్థల్లోనే విదేశీ విద్యా ర్థుల చేరికలో వృద్ధి నమోదైం ది. ఈ ఏడాది అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్య పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. మూడున్నర లక్షల మంది విద్యార్థులతో చైనా తొలి స్థానంలో నిలవగా, భారత్ నుంచి 1,86,267 మంది అమెరికా వచ్చారు. గతేడాది ఇండియా నుంచి వచ్చిన వారు 1,65,918 మంది. అంటే భారతీయ విద్యార్థులసంఖ్యలో ఈ ఏడాది 12.3శాతం వృద్ధి నమోదైంది. చైనా విష యంలో ఈ వృద్ధి 6.8 శాతమే. కానీ విద్యార్థుల సంఖ్య పరంగా మాత్రం చైనానే తొలిస్థానంలో ఉంది. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య మొత్తం విదేశీ విద్యార్థుల్లో దాదాపు యాభై శాతం. ఈ ఏడాది విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గేందుకు అమెరికాలోని సామాజిక, రాజకీయ అనిశ్చి త వాతావరణమే ప్రధాన కారణమని భావి స్తున్నారు. అలాగే వీసాల నిరాకరణ లేదా జారీలో జాప్యం, అధికవ్యయం, ఇతర దేశా ల నుంచి పోటీ వంటివి ప్రభావం చూపినట్లుగా వివిధ విశ్వవిద్యాలయాలు అభిప్రాయపడ్డాయి. గతంలో అధికసంఖ్యలో విద్యార్థులు వచ్చిన బ్రెజిల్ నుంచి ఈసారి 32% మంది, సౌదీ ఆరేబియా నుంచి 14% మంది తగ్గిపోయారు. ప్రభుత్వం అందించే ఉపకారవేతనాల్లో కోత కారణంగా ఈ పరిణామం చోటుచేసుకుందని ఐఐఈ తెలిపింది. . -
‘గ్లోబల్’ అతిథులకు ప్రత్యేక విందు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జరగనున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్–2017కు హాజరు కానున్న విదేశీ అతిథులకు హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, గత వైభవాన్ని తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫలక్నుమా ప్యాలెస్, గోల్కొండ కోటల్లో వారికి ప్రత్యేక విందులను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 28న ఈ సదస్సు ప్రారంభం కానుండగా, అదేరోజు విదేశీ అతిథులకు ఫలక్నుమా ప్యాలెస్లో, 29న గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంకా ట్రంప్తో పాటు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సహా 1,200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై గురు వారం సచివాలయంలో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ పై విషయాన్ని వెల్లడించారు. 28న ప్రారంభోత్సవం ఉంటుందని, 29, 30 తేదీల్లో ప్లీనరీ సెషన్ మరియు ప్యానెల్ డిస్కషన్, వర్క్షాప్ మానిటరింగ్ క్లాసులు ఉంటాయన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు. సదస్సు నిర్వహణపై వచ్చేవారం మరో మారు సమావేశం అవుతామన్నారు. సదస్సును పురస్కరించుకొని ఈ నెల 17 నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ సీఎస్కు వివరించారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మదనపల్లి : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి శివారులోని ఈడిగపల్లి ఏతాలవంక వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు స్పెయిన్ దేశీయులు దుర్మరణం చెందారు. మృతులు స్పెయిన్ దేశానికి చెందినవారు. ట్రావెల్ టెంపోలో అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి చిత్తూరువైపు వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో నలుగురు మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పుంగనూరు, మదనపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు విదేశీ మహిళలను 108లో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ట్రావెల్ టెంపో నుజ్జునుజ్జు అయింది. స్పెయిన్ దేశానికి చెందిన వారు అనంతపురం జిల్లా బత్తులపల్లి వద్ద ఉన్న ఆర్డీటీ(రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు)లో పనిచేస్తున్నారు. వారు టెంపోలో పాండిచ్చేరికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా మృతులు విన్సెంట్ పెరోజ్, ఫ్రాన్సికో పెడ్రోసా, జోసిఫా మెరాన్, నీపెస్ లోసా..గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ఏడుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో స్పెయిన్ దేశస్థులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. స్పెయిన్ దౌత్య కార్యాలయంతో సంప్రదించి మృతుల వివరాలు తెలుసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పెయిన్ దేశస్తులు మృతిచెందడంపై చిత్తూరు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే మదనపల్లె సబ్ కలెక్టర్ వెట్రి సెల్వి, డిఎస్పీ, వైద్యులను సంఘటనా స్థలానికి పంపారు. మదనపల్లె ఏరియా ఆసుపత్రి డాక్టర్లను అప్రమత్తం చేసి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని, అవసరమైతే తిరుపతి రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు గాని, బెంగళూరుకు గానీ క్షతగాత్రులను తరలించాలని సూచించారు. మృతదేహాలకు ఆలస్యం లేకుండా పోస్టుమార్టం నిర్వహించాలని డాక్టర్లకు కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు. -
దెబ్బకు దెబ్బ: వీసాల ఫీజు పెంపు
వీసా ఫీజుల పెంపు, కఠినతరమైన నిబంధనల విషయంలో భారత్ సైతం ప్రపంచదేశాలకు అదేస్థాయిలో దీటుగా బదులివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు దెబ్బకు దెబ్బ సమాధానం కూడా ఇస్తోంది. భారత్ ను సందర్శించే విదేశీయులకు వివిధ కేటగిరీల్లో వీసా పీజులను 50 శాతం వరకు పెంచింది. తాత్కాలిక ఉద్యోగ విధులపై వచ్చే వారిపై కూడా ఈ ఫీజు పెంపును ప్రకటించింది. ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలు ఇటీవల వీసాల విషయంలో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ భారతీయులకు షాకిస్తున్నాయి. వారికి దీటైన సమాధానం ఇవ్వడానికే భారత్ సైతం వీసా ఫీజులను పెంచేసింది. అమెరికా, కెనడా, యూకే, ఇజ్రాయిల్, ఇరాన్, యూఏఈ దేశస్తులకు వివిధ కేటగిరీల్లో భారత్ ఇప్పటికే ఫీజులు పెంచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఏడాదికి వరకు ఇచ్చే పర్యాటక వీసాలకు ముందస్తు ఉన్న 100 డాలర్ల ఫీజును 153 డాలర్లకు పెంచింది. అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం 6450 రూపాయల నుంచి 9868 రూపాయలకు పెరిగింది. ఏడాదికి పైగా, ఐదేళ్ల వరకు ఇచ్చే వీసాలపై కూడా 120 డాలర్లుగా ఉన్న ఫీజును 306 డాలర్లకు పెంచేసింది. అంటే ప్రస్తుతం ఈ వీసాలకు 19736 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ వీసా పెంపులో కూడా ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. యూకే దేశస్తులకు మాత్రమే ఏడాదిపాటు ఇచ్చే పర్యాటక వీసాలకు ప్రస్తుతమున్న 162 డాలర్లను 248 డాలర్లకు మాత్రమే పెంచుతున్నట్టు తెలిపింది. ఐదేళ్లకు ఇచ్చే వీసాలకు కూడా 484 డాలర్ల నుంచి 741 డాలర్లకు పెంచుతున్నట్టు చెప్పింది. కెనడా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, థాయ్ లాండ్ దేశస్తులు ఉద్యోగ వీసాలకు 300 డాలర్లకు బదులు ఇకనుంచి 459 డాలర్లు చెల్లించాలి. -
కండెబలం
‘రెండు మొక్కజొన్న పొత్తులున్నాయ్ తిందువా....? కారముప్పు, మసాలాలు... దట్టించ మందువా? (ట్యూన్ మార్చుకోండ్రి) హే ‘రెండు మొక్కజొన్న పొత్తులున్నాయ్ తిందువా? తిందువా? (కోరస్)కారముప్పు మసాలాలు దట్టించ మందువా? మందువా? (కోరస్) నిప్పుల్లో దోరగా వేయించరా..? వేయించరా..? (కోరస్)పేలాలు వేపడమే నెక్స్ట్ రా! నెక్స్ట్ రా! (కోరస్) ఏంది సంగతి.. పేరడీ ఊపుమీద ఉంది అంటారా? జూన్ 11న ప్రపంచ మొక్కజొన్న కండెల డే కదా. అందుకే హడావడి. ఏంటీ... మొక్కజొన్న డేనా? ఓరి నాయనో.. ఈ ఫారినర్స్కి ఏం పనిలేదా? క్యాట్ డే, ర్యాట్ డే అంటే... వాటిని ముస్తాబు చేసి ముద్దు చేస్తారు ఓకే, మరి మొక్కజొన్న కండెల రోజుకేం చేస్తారు? అనేగా మీ డౌట్! ఏం చెయ్యారు! మంచిగా రకరకాల రెసిపీల్లో కండెను ఊడికించి, వేయించి, నిప్పుల మీద కాల్చి లొట్టలేసుకుంటా లాగించేస్తారు! (రెండు మొక్క.. మొక్క...) పాడింది చాలుగానీ విషయం చెప్పమంటారా? సరే అయితే మేటర్లోకి వెళ్లిపోదాం పదండి! సిటీ కార్న్ పచ్చని పల్లెల్లో.. ప్రకృతి లోగిల్లో... చినుకు పడేవేళల్లో... నిప్పుల మధ్య దోరగా వేయించిన మొక్కజొన్న కండెను కొరుక్కు తినడంలో ఉన్న మజానే వేరు. ఇక సిటీ వాసులైతే ఉప్పు, కారం, కొత్తిమీర, మసాలా.. దట్టించి ఇచ్చే స్వీట్ కార్న్కే ఓటేస్తున్నారు. అందుకే సిటీల్లో స్వీట్ కార్న్ బండ్లు పోటెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తి సుమారుగా 80 కోట్ల టన్నుల పైమాటే. వీటిని 15 కోట్ల హెక్టార్లుల్లో సుమారు 4970 కిలోగ్రాములు దిగుబడి జరగుతోందని అంచనా. మొక్కజొన్న పంటల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. చైనా, బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనా, భారత్ వరుస స్థానాల్లో ఉన్నాయి. మొక్కజొన్న ఆరోగ్యకరం మొక్కజొన్న తింటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెబుతారు వైద్య నిపుణులు. ఇందులోని విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు గుండెజబ్బులు రాకుండా కాపాడతాయి. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించడంలో, బరువు తగ్గడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు నియంత్రణలో.. తోడ్పడతాయి. ఎముకలు ధృడం చేయడంతో పాటు, పేగు సంబంధిత క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. చర్మసౌందర్యాన్ని, కంటిచూపును మెరుగుపరుస్తాయి చరిత్ర చాలా పెద్దది ఇంచుమించు 5000 సంవత్సరాల క్రితమే దక్షిణ అమెరికాలోని మెక్సికోలో మొక్కజొన్నను పండించేవారు. 1492లో వ్యాపారం పేరుతో ఐరోపావాసులు, స్పానిష్ వలసదారులు ఈ మొక్కజొన్నను ప్రపంచానికి పరిచయం చేశారు. కండెలాంటి కట్టడాలు అద్భుతాలను నిర్మించే ఆర్కిటక్ట్లు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న ఆకారంతో కూడా కట్టడాలను నిర్మించారు. జొన్న ఆకారంలో ఉన్న వాటర్ ట్యాంక్లు, బిల్డింగ్లు, పెవిలియన్లు కట్టేశారు. వాటిలో చెప్పుకోదగ్గది మెక్సికోలోని జొన్నకండెకి చుట్టు ఉండే (ఊక) ఆకులు ఆకారంలో నిర్మించిన పెవిలియన్. దీన్ని 2015లో లాగౌర్ డిజైన్స్ అనే ఓ నిర్మాణ సంస్థ నిర్మించింది. ∙సమ్థింగ్ స్పెషల్ సాంకేతిక పరిజ్ఞానంలో చైనా ఎప్పటికప్పుడు ముందుటుంది. అయిదు సంవత్సరాల క్రితం ‘చైనీస్ రైల్వే కార్పొరేషన్’ రైల్వే ట్రాకు అవసరం లేని సరికొత్త ట్రైన్లను డిజైన్ చేసింది. ప్రత్యేకమైన మార్గాలలో రబ్బర్ చక్రాలతో పరుగులు తీసే ఈ ట్రాక్లెస్ రైళ్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంపై చైనీస్ రైల్వే కార్పొరేషన్కు సర్వహక్కులు ఉన్నాయి. సంప్రదాయ రైళ్లతో పోల్చితే ఈ ట్రాక్లెస్ ట్రైన్లకు తక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. కాలుష్యరహితం కూడా. ఇప్పటికైతే ఈ ట్రైన్లో మూడు వందల మందికి పైగా ప్రయాణించవచ్చు. – సంహిత నిమ్మన -
పీహెచ్డీకి హెచ్1బీ ఆంక్షలుండవు
ప్రతినిధుల సభలో కొత్త బిల్లు వాషింగ్టన్: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో అమెరికాలో పీహెచ్డీ చేసిన విదేశీయుల్ని గ్రీన్కార్డు, హెచ్–1బీ వీసాల ఆంక్షల పరిధిని తప్పించాలని ప్రతిపాదిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ‘స్టాపింగ్ ట్రైన్డ్ ఇన్ అమెరికా పీహెచ్డీ ఫ్రం లీవింగ్ ద కంట్రీ’(స్టాపల్) బిల్లును కాంగ్రెస్ సభ్యులు ఎరిక్ పాల్సెన్, మైక్ క్విగ్లేలు ప్రవేశపెడుతూ.. దీని వల్ల అమెరికాకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొ న్నారు. హెచ్–1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తూ గత నెల్లో కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో తాజా బిల్లు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో పీహెచ్డీ చేస్తున్న, చేసిన భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలివైన విద్యార్థులు పీహెచ్డీ డిగ్రీల కోసం అమెరికా వస్తున్నారని, వారి పరిజ్ఞానం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సాయపడేలా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. అమెరికాలో అంత్యంత నైపుణ్యం అవసరమైన వేలాది ఉద్యోగాలు భర్తీకావడం లేదని, ప్రస్తుతం ప్రవేశపెట్టిన స్టాపల్ యాక్ట్తో ఆ కొరత తీరుతుందని అభిప్రాయపడ్డారు. కొత్త బడ్జెట్తో లక్షలాది ఉద్యోగాలు: ట్రంప్ అధికారంలోకి వచ్చాక రూపొందించిన తొలి బడ్జెట్ నూతన అమెరికాకు బాటలు వేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాల కల్పనతో ఆర్థిక మందగమనం తగ్గుముఖం పడుతుందన్నారు. బడ్జెట్లో సాంఘిక భద్రత, వైద్యసాయానికి నిధుల కోత ఉండదని, బడ్జెట్ కేటాయింపుల్లో సమతూకం పాటిస్తామని చెప్పారు. గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అభివృద్ధి కంటే ఇప్పుడు ఎంతో వేగవంతమైన వృద్ధిని అమెరికా ప్రజలు చూస్తారన్నారు. -
సమస్యలపై ఆమె బాగా స్పందిస్తారు: కేటీఆర్
హైదరాబాద్: కేంద్రమంత్రిగా సుష్మాస్వరాజ్ బాధ్యతలు చేపట్టాక విదేశాల్లో ఉంటున్న లక్షలమంది భద్రంగా ఉంటున్నారని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక్క ట్వీట్తో ఆమెకు తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం కల్పించారని.. సమస్యలపై ఆమె బాగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. హెచ్ఐసీసీలో విదేశీ సంపర్క్ సదస్సును శనివారం కేంద్రమంతి వీకేసింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర మంత్రి వీకే సింగ్ మాట్లాడుతూ విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చాలా మంది ఇక్కడ కంటే విదేశాల్లోనే ఉండటానికి మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఈ సందస్సులో ప్రవాసభారతీయుల పాస్పోర్టు సమస్యలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. -
వీసా గడువు ముగిసిన విదేశీయుల అరెస్ట్
హైదరాబాద్: వీసాల గడువు ముగిసినప్పటికీ హైదరాబాద్లో అక్రమంగా ఉంటున్నవిదేశీయులపై టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం వేకువజామున దాడులు నిర్వహించి వీసా గడువు ముసిగిన 118 మంది విదేశీయులను గుర్తించారు. మెహదీపట్నం, టప్పాచబుత్ర, టోలీచౌకి, లంగర్హౌజ్, మంగళ్హాట్, గోల్కొండ ప్రాంతాల్లో 15 టాస్క్ఫోర్స్ బృందాలు ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించాయి. గుర్తించిన వారిలో సోమాలియా, యెమన్, నైజీరియా, ఖతార్, సౌదీ అరేబియా, అమెరికా దేశాల వారు ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ట్రంప్ బాటలో సౌదీ..విదేశీయులపై వేటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి క్రమక్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. విదేశీ ఉద్యోగులపై వేటు వేస్తూ తమ స్థానికులకే ఉద్యోగాల కల్పనంటూ ముందుకు వెళ్తున్నాయి. ఇటీవలే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు వీసా నిబంధనల్లో కఠినతరమైన మార్పులు తీసుకురాగా.. తాజాగా సౌదీ అరేబియా కూడా విదేశీయులపై వేటు వేస్తోంది. తమ దేశ షాపింగ్ మాల్స్లో విదేశీయులు పనిచేయడానికి వీలులేదంటూ నిబంధనలను జారీచేస్తోంది.. తమ దీర్ఘకాలిక ఆర్థిక సమగ్రతలో భాగంగా తమ సిటిజన్లకే ఉద్యోగవకాశాలు మెరుగుపరుచనున్నామని సౌదీ అరేబియా చెప్పింది. ఈ నిర్ణయంతో 35వేల ఉద్యోగాలను కల్పించే అవకాశముందని ఆ దేశ కార్మిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఖలేద్ అబా అల్ ఖైల్ చెప్పారు. ఫారిన్ లేబర్ కాంట్రాక్టులతో కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి గడువిస్తామని పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు బట్టి ఈ నిబంధనలు సౌదీ అమల్లోకి తీసుకొస్తుందని అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. చమురుపైనే ఎక్కువగా ఆధారపడిన దేశంలో ఉద్యోగవకాశాలు కల్పించడం చాలా కీలకమైన అంశమని డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. 25 ఏళ్ల కంటే తక్కువ వయసున వారు కనీసం సగం మంది ఉద్యోగం కోసం వెతుకులాడుతున్నారని చెప్పారు. సౌదీ స్థానికుల్లో నిరుద్యోగిత కూడా నాలుగో త్రైమాసికంలో 12.3 శాతం పెరిగిందని రిపోర్టులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మాల్స్ లో పనిచేసే విదేశీయులపై వేటు వేసి, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని సౌదీ నిర్ణయించింది. -
విదేశీ మహిళకు టోకరా: వెల్వో ట్రావెల్స్ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్: ఇండియన్ కరెన్సీని యూరోలుగా మారుస్తానని నమ్మించి ఆస్ట్రియా దేశానికి చెందిన మహిళను మోసం చేశాడు. ఈ ఘటనలో శ్రీనగర్కాలనీలోని వోల్వో ట్రావెల్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మార్ల ఫణికృష్ణ(35)ను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ దయాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రియా దేశం వియన్నా నగరంలో నివసించే శిల్పి రాజాదురై గత ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన వ్యాపారం నిమిత్తం హైదరాబాద్కు వచ్చి జూబ్లీహిల్స్ క్లబ్లో బస చేశారు. ఆమె తిరిగి వెళ్లడానికి యూరోలు అవసరం కాగా అందుకోసం గత ఏడాది జూలై 20న మహేష్బ్యాంకు నుంచి రూ.20.89 లక్షలు డ్రా చేసి వాటిని యూరోలుగా మార్పించుకునేందుకు మార్ల ఫణికృష్ణను ఆశ్రయించింది. తాను ఇండియన్ కరెన్సీని యూరోల్లోకి మారుస్తానని ట్రావెల్స్ చెక్ ద్వారా ఈ పని సులువుగా అవుతుందని ఆమెను నమ్మించాడు. ఇందుకోసం మల్టీ కరెన్సీ వీసా కార్డు ఇస్తానని దాన్ని ఆమె తల్లి సరళా దీక్షిత్ పేరుతో జారీ చేస్తున్నట్లు చెప్పి వియన్నాలో సరళా దీక్షిత్ బ్యాంకు అకౌంట్ నుంచి డ్రా చేసుకోవచ్చని చెప్పాడు. ఈ మేరకు కార్డు ఇచ్చాడు. తీరా ఆమె వియన్నా వెళ్లే క్రమంలో ఈ కార్డు ద్వారా యూరోలు డ్రా చేసుకోవడానికి యత్నించగా పనిచేయలేదు. బాధితురాలి ఒత్తిడి మేరకు అతడు పలుమార్లు ఇచ్చిన చెక్కులను డ్రా చేసుకోవడానికి యత్నించగా బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితురాలు రెండు రోజులక్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420, 406ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. -
అమెరికా మాదిరి సౌదీ కూడా...
దుబాయ్ : అమెరికా మాదిరి సౌదీ అరేబియా కూడా నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలకు, విదేశీ వర్కర్లకు నిబంధనలను కఠినతరం చేసి, నిరుద్యోగితను తగ్గించుకోవాలని సౌదీ ప్లాన్ చేస్తోంది. ఎక్కువమంది సౌదీ వాసులనే ఉద్యోగులుగా నియమించుకునేందుకు కంపెనీలకు త్వరలోనే కఠినతరమైన ఆదేశాలు జారీచేయాలని నిర్ణయించినట్టు అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త పాలసీ, సౌదీ గతేడాది లాంచ్ చేసిన ఆర్థిక సంస్కరణలకు ఎంతో సహకరించనున్నాయి. ఈ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా సౌదీ తమ దేశంలో నిరుద్యోగితను 2020 నాటికి 12.1 శాతం నుంచి 9 శాతానికి తగ్గించుకోవాలని నిర్దేశించుకుంది. కానీ కంపెనీలు మాత్రం తక్కువ జీతాలు చెల్లించే విదేశీ వర్కర్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చి కంపెనీలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఈ రూల్స్ తో సౌదీలో పనిచేసే చాలామంది విదేశీ వర్కర్లపైన ప్రభావం పడనుంది. మరోవైపు ఆ దేశంలోని కంపెనీలపై కూడా ఈ పాలసీ ప్రతికూల ప్రభావం చూపనుంది. సౌదీ అరేబియాలో 12 మిలియన్ల విదేశీలు పనిచేస్తున్నారు. కొత్త పాలసీ కింద 500 నంఉచి 2999 వరకు వర్కర్లు పనిచేసే నిర్మాణ సంస్థలో 100 శాతం సౌదీలుంటే ప్లాటినం కేటగిరీని కంపెనీకి అందిస్తారు. రిటైల్ సెక్టార్లో 35 శాతం సౌదీలుంటే ప్రస్తుతం ప్లాటినంగా గుర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ శాతాన్ని 100కు పెంచనున్నారని అధికారులు చెబుతున్నారు. ఇలా 60కి పైగా ఇండస్ట్రీల్లో ఈ కఠినతరమైన నిబంధలు అమలవుతాయని పేర్కొంటున్నారు. -
భారత్..బెస్ట్
తమ దేశం కన్నా భారత్ మిన్న అంటున్న విదేశీ మహిళలు మహిళా దినోత్సవం సందర్భంగా విదేశీ విద్యార్థులతో ‘సాక్షి’ టాక్ షో సికింద్రాబాద్/తార్నాక: ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం... అన్నింటా మహిళలు సగం...సగం...అనే నానుడుని నేటి మహిళలు నిజం చేస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానంగా పోటీపడుతూ అన్నిరంగాల్లో దూసుకువెళుతున్నారు. అయితే మహిళలకు కొన్ని దేశాల్లో ఉన్నతమైన స్థానం లభిస్తుండగా, మరి కొన్ని దేశాలు వారిపై ఎన్నో ఆంక్షలు విధిస్తూ కట్టడి చేస్తున్నాయి. భారత్లో స్త్రీలకు కావాల్సినంత స్వేచ్చ, అపూర్వమైన గౌరవం లభిస్తుందని, అది భారతీయుల గొప్పతనమని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో ఇండియా తమ దేశాలకంటే ముందుందని పలువురు విదేశీ విద్యార్థినులు పేర్కొన్నారు. భారతదేశంలో మహిళలు శాస్త్ర సాంకేతిక రంగాలు, విద్య ,ఉద్యోగావకాశాల్లో సమానత్వం సాధించలేకపోయినా ఒక మహిళగా వారికి లభించే గౌరవం ఎంతో గొప్పదని, భారత దేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు గొప్పవని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలువురు విదేశీ విద్యార్థులతో ‘సాక్షి’ నిర్వహించిన టాక్ షోలో విదేశీ విద్యార్థుల అభిప్రాయాలు వారి మాటల్లోనే... భారత సంస్కృతి చాలా బాగుంది... మా దేశంలో మహిళలను చాలా గౌరవిస్తారు. మా దేశంతో పోలిస్తే ఇక్కడ మహిళలకు ఇచ్చే గౌవరం ఎక్కువనే చెప్పాలి. మా దేశంతో పోలిస్తే ఇక్కడ ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ ఒక ప్రత్యేకగా చెప్పవచ్చు. ఇక్కడ స్త్రీలు ధరించే దుస్తులు వారి ప్రాంతాలు, సంస్కృతులకు అద్దంపడుతున్నాయి. – న్వీకూ వుచే, నైజీరియా మా దేశంలో ప్రభుత్వమే నిధులు ఇస్తుంది మా దేశంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించడమేగాక, మహిళలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుంది. మహిళా దినోత్సవాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా కలిసి జరుపుకుంటాం. ఆ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహించి మహిళలను ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తుంది. – మర్హబో ముర్తాస్వావ్,తుర్కుమెనిస్తాన్ పండుగలా జరుపుకుంటాం మా దేశంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు సైతం సెలవు ప్రకటిస్తాయి. కుటుంబ సభ్యులంతా కలిసి çమహిళా దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకునే సంస్కృతి మా దేశంలో కొనసాగుతోంది. భారత దేశంలో ఉన్నట్లుగానే మా దేశంలో కూడా మహిళలకు స్వేచ్చ ఉంది. –రోయా కలేసే, ఇరాన్. యుద్ధాల వల్ల స్త్రీలకు సమస్యలు.. మా దేశంలో అప్పుడప్పుడు జరిగే యుద్ధాల వల్ల మహిళలు స్వేచ్చగా బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. స్త్రీ స్వేచ్చ విషయంలో మా దేశం కన్నా భారత దేశమే మిన్న. మాదేశంలో స్త్రీలకు అభద్రతా భావం ఎక్కువే. గ్రామీణప్రాంతాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. –బ్రిష్ణ గులామ్ మహ్మద్, అఫ్ఘనిస్తాన్ భారత మహిళలు అదృష్టవంతులు.. మా దేశంతో పోలిస్తే భారత దేశ మహిళలు ఎంతో అదృష్టవంతులు. ఇక్కడ మహిళలకు లభించే గౌరవం చాలా ఉన్నతమైనది. మహిళా దినోత్సవాల సందర్బంగా వివిధ రంగాలకు చెందిన మహిళతో పాటు సాధారణ మహిళలను సైతం గౌరవించే సంస్కృతి మా దేశంలో కొనసాగుతోంది. –ఫర్హా ఆస్టా, కెన్యా -
ఖతర్నాక్ ‘ఖత్’ దందా!
- అంతర్జాతీయ ఖత్ లీవ్స్(మత్తు) రవాణా గుట్టురట్టు - 180 కేజీలు స్వాధీనం చేసుకున్న కొచ్చి కస్టమ్స్ - గతేడాది సిటీలో దొరికిన గ్యాంగ్కు మూలాలివే - కేరళలో బయటపడిన వ్యవహారం సాక్షి, హైదరాబాద్: సోమాలియా నుంచి అక్రమంగా ఖత్ ఆకుల్ని తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయుల్ని నగర పోలీసులు గత ఏడాది మే 16న అరెస్టు చేశారు. ఈ ముఠాకు ఆ మత్తు ఆకులు ఎక్కడ నుంచి? ఎలా వస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ఇలాంటి అనేక సోమాలియా ముఠాలకు ఖత్ను సరఫరా చేస్తున్న విధానాన్ని కేరళ కస్టమ్స్ అధికారులు గత వారం కనిపెట్టారు. సిటీలో పట్టుబడిన ముఠాకూ ఇలానే సరఫరా చేసినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బ్రౌన్షుగర్, కొకైన్, మొథకొలోన్... ఇవన్నీ ఉన్నత వర్గాలకు చెందిన వారి డ్రగ్స్. గంజాయి వంటివి దిగువ, మధ్య తరగతి వారు వినియోగించే మాదకద్రవ్యాలు. ఈ రెండు వర్గాలకు చెందిన వారు, ఎవరూ గుర్తించని ‘మత్తు’ను ఆశ్రయిస్తున్నారు... అదే ఖత్. నైజీరియన్లు ఖరీదైన మాదకద్రవ్యాలను విక్రయిస్తుంటే ఖత్ అమ్మకాల్ని ఎక్కువగా ఒమన్, సోమాలియా దేశీయులు చేపడుతున్నారు. ఆకులు, కాడల రూపంలో ఉండే ఈ డ్రగ్ను నగరంలోని అనేక ప్రాంతాల్లో గుట్టుగా అమ్మేస్తున్నారనే అనుమానాలున్నాయి. ఎక్కువగా విద్యా కేంద్రాలనే టార్గెట్గా చేసుకుని ‘వ్యాపారం’ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. పాతిక కేజీలతో చిక్కిన ఇద్దరు సోమాలియా దేశానికి చెందిన అవైస్ మహమూద్ జమాక్, ఫదీ మహమూద్ జమాక్ శరణార్థి (రిఫ్యూజీ) వీసాలపై నగరానికి వచ్చి టోలిచౌకి ప్రాంతంలో నివసించారు. వీరు గుట్టుగా ఖత్ ఆకుల వ్యాపారం చేస్తున్నట్లు గత ఏడాది నగర పోలీసులకు సమాచారం అందింది. దీంతో టోలిచౌకి గెలాక్సీ థియేటర్ వద్ద వలపన్నిన అధికారులు ఇరువురినీ గుర్తించారు. వీరు పోలీసుల్ని చూపి పారిపోతుండగా... వెంబడించి పట్టుకున్నారు. పాలిథిన్ కవర్లులో చుట్టిన 25 కేజీల ఖత్ ఆకుల్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ ద్వయం తమకు సోమాలియాకే చెందిన అహ్మద్ అనే వ్యక్తి వీటిని పంపిస్తున్నాడని చెప్పారు. సోయాలియాతో పాటు సౌతాఫ్రికాకు చెందిన కొందరు నగరంలో విద్య, వ్యాపారం, విహారం, శరణార్థి ముసుగులో తిష్టవేస్తున్నారు. వీరిలో అక్రమంగా నివసిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి వారు ఒకప్పుడు తమ స్వస్థలం నుంచి వచ్చేప్పుడు రహస్యంగా ఖత్ను అక్రమ రవాణా చేసి తీసుకువచ్చే వారు. రూటు మార్చి దీటుగా రవాణా... గత ఏడాది మేలో చిక్కిన ద్వయానికి ఖత్ ఆకుల్ని సరఫరా చేసిన ముఠా ఈసారి పంథా మార్చింది. కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన కొందరిని దళారులుగా ఏర్పాటు చేసుకుంది. విదేశాల నుంచి పార్శిల్స్ రూపంలో పోస్టల్ ద్వారానే ఖత్ ఆకుల్ని పంపిస్తోందని వెల్లడైంది. నేరుగా సౌతాఫ్రికా దేశాల నుంచి పార్శిల్స్ వస్తే ఎవరైనా అనుమానించే ఆస్కారం ఉంటుదనే ఉద్దేశంతో ‘వయా’ రూట్ ఎంచుకుంది. కువైట్లో కొందరు అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని సౌతాఫ్రికా నుంచి వారికి, అక్కడ నుంచి ఇక్కడకు పంపిస్తోంది. ఇదే పంథాలో ఇటీవల కొచ్చిలోని పోస్టల్ శాఖకు కొన్ని పార్శిల్స్ వచ్చాయి. వీటిని అనుమానించిన పోస్టల్ అధికారులు కస్టమ్స్కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన తనిఖీ చేసిన అధికారులు అవి ఖత్ ఆకులుగా గుర్తించారు. వాసన లేకపోవడంతో సేఫ్గా... గత ఏడాది హైదరాబాద్లో చిక్కిన ద్వయానికి ఇదే పంథాలో ఖత్ లీవ్స్ అందినట్లు, దీని వెనుక భారీ మాఫియా ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఖత్ ఆకులు, కాడలకు ఉండే వాసన లేని గుణం కారణంగానే తేలిగ్గా అక్రమ రవాణా చేస్తుండచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో చిక్కడం తప్ప, విమానాశ్రయంలో ఖత్ పట్టుబడిన ఉదంతాలు అరుదని పేర్కొంటున్నారు. వీరిని తీసుకువస్తున్న సందర్భంలో విమానాశ్రయంలో కస్టమ్స్ సహా ఇతర విభాగాలు ఆపినా, తనిఖీ చేసినా ‘ఆయుర్వేదం’ అంటూ అక్రమ రవాణాదారులు తప్పించుకుంటూ ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటాయి. అయితే ఖత్ ఆకులు, కాడలకు ఎలాంటి వాసనా ఉండదు. ఈ కారణంగా అధికారులు అనుమానం వచ్చి తనిఖీ చేయడం, పరిశీలించడం వంటివి చేసినా... ఖత్ను మత్తు పదార్థం/మాదకద్రవ్యమని గుర్తించడం కష్టమని, ఈ కారణంగానే నిరాటంకంగా రవాణా, క్రయవిక్రయాలు సాగిపోతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యంతో పాటు నేరప్రవృత్తి... ఒమన్తో పాటు సోమాలియా, ఇథియోపియా తదితర దేశాల్లో పొలాల్లోనే ఖత్ను సాగుచేస్తుంటారు. కొన్నేళ్లకు పూర్వం కేవలం అమెరికా, యూరోపియన్ దేశాల్లో మాత్రమే ఖత్ దందా జోరుగా సాగేది. ఆయా దేశాల్లో దీన్ని నిషేధించడంతో భారత్ సహా మరికొన్ని దేశాలపై కన్నేసిన ఒమన్ జాతీయులు అక్కడకు ఈ దందాను విస్తరించారు. తొలినాళ్లల్లో ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు వంటి మహానగరాలకే పరిమితమైనా తమ ‘వ్యాపారాన్ని’ నిర్వహించారు. ఆ తరవాతి కాలంలో సిటీలో పెరిగిన డ్రగ్స్ వినియోగంతో వారి దందా ఇక్కడకూ విస్తరించింది. ఖత్ పరిణామాలు, శరీరం, మనస్సుపై ప్రభావానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. వీటిల్లో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఖత్లో ఉండే కేథ్యూనిన్ మత్తును కలిగింనప్పటికీ... దీని వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని గుర్తించారు. దీనికంటే ఆందోళనకర అంశం ఏమిటంటే... ఖత్ వినియోగించే విద్యార్థులు, మైనర్లలో నేర ప్రవృత్తి పెరుగుతుందని అధ్యయనాల్లో బయటపడింది. ఖత్ అంటే... బ్రౌన్షుగర్, కొకైన్, మొథకొలోన్... ఇవన్నీ ఉన్నత వర్గాలకు చెందిన వారి డ్రగ్స్. గంజాయి వంటివి దిగువ, మధ్య తరగతి వారు వినియోగించే మాదకద్రవ్యాలు. ఈ రెండు వర్గాలకు చెందిన వారు, ఎవరూ గుర్తించని ‘మత్తు’ను ఆశ్రయిస్తున్నారు... అదే ఖత్. నమిలితే మత్తునిచ్చే కేథ్యూనిన్... ఖత్ ఆకు పరిమాణంలో మందారం చెట్టు ఆకు సైజులో ఉంటుంది. దీని ఆకు, కాడల్ని నమిలినప్పుడు కెథ్యూనిన్ అనే రసాయన పదార్థం లాలాజలం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వీటిని నమలడం ద్వారా ఎక్కే కిక్కు దాదాపు ఏడు గంటల పాటు శరీరంలో ఉండి పని చేస్తుంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతులకు చెందిన వారు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బ్రౌన్షుగర్, కొకైన్ వంటి ఖరీదైన మాదకద్రవ్యాలు దొరకనప్పుడు, ఆర్థిక ఇబ్బందుల సందర్భంలోనూ ఖత్ను ప్రత్యామ్నాయంగా అనేక మంది వినియోగిస్తున్నారు. ఖత్ను వాడుతున్న వారిలోనూ ఒమన్, కెన్యాలకు చెందిన యువతే ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు చెప్తున్నారు. నగరంలోని కొన్ని విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర విద్యా సంస్థల వద్దా ఈ ఖత్ దందా జోరుగా సాగుతోందని పోలీసులే అంగీకరిస్తున్నారు. స్థానిక సిబ్బందికి దీనిపై అవగాహన లేకపోవడం, అన్ని చోట్లా ప్రత్యేక బృందాలు మాటు వేయడం సాధ్యం కాకపోవడంతో ఖత్ దందా యథేచ్ఛగా సాగుతోంది. -
నాగార్జునకొండలో విదేశీయుల సందడి
విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండలో ఆదివారం 40 మంది విదేశీ విద్యార్థులు సందడి చేశారు. వీరు శాంతిసిరి లాంచీలో కొండకు చేరుకుని మ్యూజియంతో పాటు మాన్యుమంట్స్ను తిలకించారు. అనంతరం సాగర్ చేరుకుని అనుపు, ఎత్తిపోతల జలపాతాలు వీక్షించారు. యెమన్, సుడాన్, సోమాలియా, సౌదీఆరేబియా దేశానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. -
లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయం ఆదివారం పర్యాటకులు, భక్తుల సందడితో కిటకిటలాడింది. అనేక మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను సందర్శించి ఆనందంగా గడిపారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రలతో పాటు విదేశీయులు కూడా ఆలయాన్ని సందర్శించి పార్కుల్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా నంది విగ్రహం చూసి ఆనందం వ్యక్తం చేశారు. -
భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ షాక్
-
భారతీయులకు ట్రంప్ షాక్
- అమెరికన్ల స్థానంలో హెచ్1బీ వీసాదారులను అనుమతించబోమని ప్రకటన వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డాలర్ డ్రీమ్స్లో తేలియాడే భారతీయులకు షాక్ ఇచ్చారు. అమెరికన్లను కాదని విదేశీ కార్మికులతో ఉద్యోగాల భర్తీని అంగీకరించబోమని ప్రకటించారు. ఇందుకోసం భారతీయులు ఎక్కువగా వినియోగించే హెచ్1బీ వీసాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించడం గమనార్హం. డిస్నీ వరల్డ్ మొదలైన అమెరికా కంపెనీలు అమెరికా కార్మికులను కాదని భారత్ తదితర దేశాల నుంచి వచ్చే హెచ్1బీ వీసా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని, ఇకపై అలాంటి వాటిని అనుమతించేది లేదని చెప్పారు. గురువారం అయోవాలో తన మద్దతుదారులతో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ప్రతి అమెరికన్ జీవితానికీ రక్షణ కల్పించేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హెచ్1బీ వీసాల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా తాను ఎక్కువగా అమెరికా కార్మికులతో గడిపానని, శిక్షణ కోసం తప్పించి.. వారి స్థానంలో విదేశీ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగనీయబోమని చెప్పారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించి తీరుతామని చెప్పారు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇది తప్పదన్నారు. ట్రంప్ గెలుపు వెనుక రష్యా హస్తం! అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ నిర్ధారించినట్లు మీడియా వెల్లడించింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల్లో తమకు అనుకూలమైన వ్యక్తి గెలుపుకోసం రష్యా ప్రయత్నించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనాన్ని ప్రచురించింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం హిల్లరీ ప్రతిష్టను మసకబార్చి ట్రంప్ అవకాశాల్ని మెరుగుపరచేందుకు రష్యా ప్రభుత్వంతో సంబంధం ఉన్న కొందరు పనిచేశారని, వీరు హిల్లరీ ప్రచారకమిటీ చైర్మన్తో సహా డెమోక్రటిక్ పార్టీకి చెందిన అనేకమంది మెయిల్ ఎకౌంట్లను హ్యాక్ చేసి వీకీలిక్స్కు అందజేసినట్లు నిఘావర్గాలు గుర్తించాయంది. -
విదేశీ విద్యార్ధులకు నోటు తిప్పలు
-
అమెరికాలో 25% పెరిగిన భారతీయ విద్యార్థులు
న్యూఢిల్లీ: అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థారుులో 25 శాతం పెరిగింది. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికాలో 1,65,918 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని ఓ నివేదిక తెలిపింది. దీంతో అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో మనోళ్లు రెండో స్థానంలో నిలిచారు. మునుపెన్నడూ లేనంత రికార్డు స్థారుులో ఈ సంఖ్య నమోదైందని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ అధ్యయనం జరిపిన 2016 ఓపెన్ డ్రూప్స్ నివేదిక పేర్కొంది. అమెరికాలో కాలేజీలు, వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య ఏడు శాతం పెరిగి, ఈ అకడమిక్ సంవత్సరంలో ఒక మిలియన్ను దాటింది. మొత్తం 10,44,000 మందిగా నమోదై అమెరికా జనాభాలో ఐదు శాతంగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. అమెరికాలోని స్టేట్స్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ ట్రూప్స్ నివేదికను ప్రచురిస్తోంది. -
విదేశీ టేకు పట్టివేత
ఒంగోలు క్రైం: అక్రమంగా విదేశీ టేకు తరలిస్తున్న రెండు లారీలను ప్రకాశం జిల్లాలో సోమవారం అర్థరాత్రి అటవీ శాఖ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్కు విదేశీ టేకు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గుంటూరుకు చెందిన స్క్వాడ్ రేంజర్ నాగేంద్రరావు ఆధ్వర్యంలోని బందం ఒంగోలు బైపాస్ రోడ్డులో మాటు వేశారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న టేకును చెన్నై హార్బర్ నుంచి లారీల్లో తరలిస్తున్నారనే సమాచారంతో టీఎన్ 18 కె 3745, ఏపి 29 టిబి 1177 నంబర్లు గల లారీలను తనిఖీ చేశారు. డ్రైవర్లను టేకుకు సంబంధించిన ఇన్వాయిస్, సరుకు వివరాలు చూపించాలని కోరగా.. ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో లారీలను ఒంగోలు రెగ్యులర్ ఫారెస్ట్ రేంజర్ కార్యాలయానికి తరలించారు. వాటిని ఒంగోలు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. -
విదేశీ మహిళతో అసభ్య ప్రవర్తన
డెలివరీబాయ్కు దేహశుద్ధి బెంగళూరు(బనశంకరి) :విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈఘటన కుమారస్వామిలేఔట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుమారస్వామి లేఔట్లోని ఓ అపార్టుమెంట్లో ఇరాన్ దేశానికి చెందిన మహిళ నివాసముంటోంది. ఈమె ఆన్లైన్లో బుక్ చేసిన షూను తీసుకొని ఈ నెల 10న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కంపెనీ కి చెందిన ఇలియాస్నగరకు చెందిన ఆబుసల్మాన్ అనే డెలివరీ బాయ్ వెళ్లాడు. షూ తీసుకుని డబ్బు ఇచ్చే సమయంలో ఆబూససల్మాన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయభ్రాంతులకు గురైన ఆమహిళ గట్టిగా కేకలు వేయడంతో డెలివరీబాయ్ అపార్టుమెంట్ నుంచి కిందికి దిగి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇరుగుపొరుగు వారు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. -
బుద్ధవనంలో విదేశీయుల సందడి
నాగార్జునసాగర్: శ్రీపర్వతారామంలోని బుద్ధవనాన్ని శనివారం 14 దేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా 40 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని, మ్యూజియంను సందర్శించారు. అనంతరం ఫణిగిరితో పాటు, ఖమ్మం జిల్లాలోనే నేలకొండపల్లిని సందర్శించేందుకు వెళ్లారు. సాగర్కు వచ్చిన వారిలో ఆస్ట్రేలియాకు చెందిన కుహదాస్ వివేకానంద, జర్మనీకి చెందిన గెర్డ్ మథియాస్ డెకెర్ట్, గ్రీస్రం చెందిన తెకహరిదౌఅతనాస్య, ఇటలీకి చెందిన అనియోలోడెల్గట్టో, గబ్రీలా, బాల్దిని, ఆంటోనియా అర్టోలెవతో పాటు మలేసియా, నెదర్లాండ్, తైవాన్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరివెంట పర్యాటక సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్రావు, గైడ్ సత్యనారాయణ, శ్యాంలు ఉన్నారు. -
ఖిలాను సందర్శించిన విదేశీయులు
భువనగిరి టౌన్ : అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఖిలాపై కట్టడాలు, నిర్మాణాలు, శిల్పకళను వారు పరిశీలించారు. భారతీయ కళానైపుణ్యం అద్భుతంగా ఉందని, చారిత్రక కట్టడాల్లో భువనగిరి ఖిలా ఒకటిగా ఉందన్నారు. -
భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు
భువనగిరి టౌన్ : అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఖిలాపై కట్టడాలు, నిర్మాణాలు, శిల్పకళను వారు పరిశీలించారు. భారతీయ కళానైపుణ్యం అద్భుతంగా ఉందని, చారిత్రక కట్టడాల్లో భువనగిరి ఖిలా ఒకటిగా ఉందన్నారు. -
పోచంపల్లిని సందర్శించిన విదేశీయులు
భూదాన్పోచంపల్లి: చేనేత వృత్తిలో మహిళల భాగస్వామ్యం– అభివృద్ధిని అధ్యయనం చేయడానికి సోమవారం విదేశీ అధికారుల బృందం పోచంపల్లిని సందర్శించారు. హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల సంస్థ ఆధ్వర్యంలో తజకిస్తాన్, హోండూరస్, మాల్దీవులు, ఇరాక్, టాంజానియా, జాంబియా, ఇ«థియోపియా, శ్రీలంక, సిరియా, ఘనా, జింబాబ్వే, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, లిథునియా, లిబేరియా దేశాలకు చెందిన 33 మంది సభ్యులు పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ను సందర్శించారు. ఇక్కడ తయారవుతున్న చేనేత వస్త్రాలు, వస్త్ర తయారీ ప్రక్రియలు, మార్కెటింగ్, పనిచేస్తున్న కార్మికులలో మహిళలు ఎంత మంది పనిచేస్తున్నారు, వారికి లభిస్తున్న గిట్టుబాటు ఆరా తీశారు. వారి వెంట ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వివేక్కుమార్, వి. స్వప్న, పార్క్ డైరక్టర్లు చిక్క కృష్ణ, చిట్టిపోలు గోవర్దన్, అశోక్, వెంకటయ్య పాల్గొన్నారు. -
విదేశీ మహిళపై భర్త వేధింపులు
పుట్టపర్తి టౌన్ : అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ విదేశీ మహిళ ఫిర్యాదు చేయడంతో పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. జపాన్ దేశానికి చెందిన సత్యసాయి భక్తురాలు 37 ఏళ్ల నిమిషాహీ మదా తరచూ పుట్టపర్తికి వస్తుండేది. ఈక్రమంలో పుట్టపర్తిలో గణేష్ గేట్కు సమీపంలో పాదరక్షల దుకాణం నిర్వహిస్తోన్న జాకీర్హుస్సేన్తో ఐదేళ్లుగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిరువురూ రెండేళ్ల క్రితం కదిరిలో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఆరు నెలలుగా వారి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఇటీవల ఆమె కలెక్టరేట్కు వెళ్లి భర్త నిత్యం వేధిస్తున్నాడని, సుమారు రూ.60 లక్షల పైబడి డబ్బు తీసుకున్నాడని, ఇంకా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమెకు న్యాయపరమైన సహాయం అందించాలని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగంను ఆదేశించారు. ఐసీడీఎస్ అధికారులు జిల్లా ఎస్పీ దష్టికి తీసుకుని పోయి ఆయన ఆదేశాల మేరకు స్థానిక పుట్టపర్తి పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి వారిని సోమవారం రాత్రి విచారణ చేశారు. అనంతరం నిందితుడు జాకీర్హుస్సేన్పై వేధింపుల కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
బోటులో పేలుడు: విదేశీ పర్యాటకురాలు మృతి
జకార్తా : ఇండోనేషియాలోని బాలి ద్వీపం సమీపంలో విదేశీ పర్యాటకులతో వెళ్తున్న బోటులో గురువారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఇండేనేషియా పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 35 మంది విదేశీయులు ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. వీరంతా పోర్చుగల్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, బ్రిటన్ దేశాలకు చెందిన వారని తమ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. అలాగే నలుగురు బోటు సిబ్బంది కూడా ఉన్నారన్నారు. గురువారం ఉదయం పశ్చిమ బాలిలోని పడంగ్ బాయి పోర్టు నుంచి బోటు బయలుదేరిన ఐదు నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. అయితే పేలుడు ఇంజన్ ప్రాంతంలో నుంచి వచ్చిందని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
ఇటువైపు చూడని విదేశీ విద్యార్థులు
ఆకర్షించలేకపోతున్న తెలంగాణ విద్యా సంస్థలు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యధిక విద్యా సంస్థలు కలిగిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు విదేశీ విద్యార్థులను మాత్రం ఆకర్షించలేకపోతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలు ఇందులో ముందుండగా...తెలుగు రాష్ట్రాలు చివ రి స్థానాల్లో నిలిచిపోయాయి. మరోవైపు ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్లో చదివేందుకు ఇతర దేశాలవారు ఆసక్తి చూపడం లేదు. దేశంలో వర్సిటీలు, ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి 800కు పైగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నా విదేశీ విద్యార్థులను రాబట్టలేకపోతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల వైపు మొగ్గు... దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో 3.32 కోట్ల సీట్లు అందుబాటులో ఉండగా, వీటిలో 10% సీట్లలో విదేశీయులను చేర్చుకునే వీలుంది. ఈ లెక్కన 30 లక్షల మందికి అవకాశం ఉంది. అయితే భారత్లోని వర్సిటీల పరిధిలో ప్రస్తుతం చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 31,126 మాత్రమే. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లోని విద్యా సంస్థల్లోనే చదువుతున్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియన్ వర్సిటీలు సంయుక్తంగా రూపొందించిన ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా-2015 నివేదిక స్పష్టం చేస్తోంది. తెలంగాణలో దాదాపు 16 లక్షల సీట్లు ఉన్నత విద్యలో ఉండగా, ఒక్క శాతం కూడా విదేశీ విద్యార్థులను ఆకర్షించలేకపోతోంది. ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితి. తెలంగాణలో 5.45 శాతం... మొత్తం 31,126 మంది విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా 7,750 మంది (24.90 శాతం) మహారాష్ట్రలో... 7,290 మంది (23.42 శాతం) ఢిల్లీలో... 4,877 మంది (15.67 శాతం) కర్ణాటకలో చదువుతున్నారు. తరువాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (3,548), పంజాబ్ (1,964) ఉన్నాయి. తెలంగాణలో 1,696 మంది (5.45 శాతం) విద్యార్థులు చదువుతున్నట్లు నివేదిక పేర్కొంది. దేశంలోని విదేశీ విద్యార్థుల్లో ఎక్కువమంది (23,350) ఆసియా దేశాలకు చెందిన వారు కాగా, 5,799 మంది ఆఫ్రికా వారున్నారు. అమెరికా విద్యార్థుల సంఖ్య కేవలం 457 మాత్రమే! -
విదేశీ విద్యార్థులకు ఐఐటీల కానుక!
► నేరుగా అడ్వాన్స్డ్ రాసేందుకు తొమ్మిది దేశాలకు అనుమతి ► జేఈఈ-2017 ప్రవేశాల నుంచి అమల్లోకి! ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణత సాధించాలి. అడ్వాన్స్డ్కు హాజరవ్వాలంటే.. జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్లో అర్హత సాధించడమే కాకుండా.. +2, లేదా తత్సమాన కోర్సుల్లో టాప్ 20 పర్సంటైల్లో నిలవాలి! భారత విద్యార్థులైనా, ప్రవాస భారతీయుల పిల్లలైనా, భారత సంతతికి చెందిన వారైనా.. ఇతర దేశాల విద్యార్థులైనా.. ఇప్పటివరకు ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ + ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి అనుసరిస్తున్న విధానమిది. ఐఐటీలు ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థులకు నిబంధనలను సడలిస్తున్నాయి. ముఖ్యంగా తొమ్మిది దేశాల విద్యార్థులకు నేరుగా జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నాయి. దీనిపై గతవారం ఐఐటీ ప్రవేశాలకు సంబంధించిన జాయింట్ అడ్మిషన్ బోర్డ్ సమావేశంలో ఐఐటీ కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ ప్రతిపాదనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా లభిస్తే.. తొమ్మిది దేశాలకు చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్లో అర్హత సాధించకుండానే నేరుగా అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తొమ్మిది దేశాలు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, సింగపూర్, యూఏఈ, ఇథియోపియా. వీటిలో ఇథియోపియా మినహా మిగిలినవన్నీ ఆసియా ఖండంలోనివే. ఈ తొమ్మిది దేశాల విద్యార్థులు నేరుగా అడ్వాన్స్డ్ రాసేలా అనుమతిచ్చే చర్యలకు ఐఐటీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ఈ దేశాల్లో అడ్వాన్స్డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించనుంది. ఈ దేశాలకు చెందిన విద్యార్థులకు నేరుగా అడ్వాన్స్డ్కు హాజరయ్యే కొత్త విధానం అమలు, కార్యాచరణ బాధ్యతలను ఐఐటీ - బాంబే చేపట్టనున్నట్లు తెలిసింది. వాస్తవానికి విదేశీ విద్యార్థులకు ఐఐటీల గురించి అవగాహన, ఆసక్తి ఉన్నప్పటికీ రెండంచెల పరీక్ష విధానం, పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో నిరాసక్తత చూపుతున్నారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్ పరీక్షను కొలంబో, ఖాట్మండు, సింగపూర్, బహ్రెయిన్, దుబాయ్, మస్కట్, రియాద్, షార్జాలలో నిర్వహిస్తున్నారు. అడ్వాన్స్డ్ పరీక్ష కేంద్రాలు దుబాయ్, యూఏఈలో మాత్రమే ఉన్నాయి. ఈ కారణాలతో విదేశీ విద్యార్థులు ఐఐటీలపై దృష్టిసారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తొమ్మిది దేశాల్లోనూ నేరుగా అడ్వాన్స్డ్కు హాజరయ్యేలా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ దేశాలకే ఎందుకు? అమెరికా, యూకే వంటి దేశాల్లో సైతం ప్రత్యేక బ్రాండ్ను సొంతం చేసుకున్న ఐఐటీలు.. అటువైపు చూడకుండా ఈ తొమ్మిది దేశాలనే లక్ష్యంగా పెట్టుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముందుగా సార్క్ కూటమిలోని పొరుగు దేశాల విద్యార్థులు మొబిలిటీ, కల్చరల్ డైవర్సిటీ వంటి విషయాల్లో భారత పరిస్థితుల్లో ఇమడగలిగే అవకాశం ఉంటుంది. సార్క్ కూటమిలో ఉండటంతోపాటు భారత్లో చదవాలని ఈ దేశాలకు చెందిన విద్యార్థులు ఆసక్తి చూపుతున్నందున వీటిని ఎంపిక చేశారు. అలాగే ఆసియా ఖండంలో లేనప్పటికీ.. ఇథియోపియా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు భారత్పై ఆసక్తి చూపుతుండటంతో ఆ దేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. జేఈఈ మెయిన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ అడ్వాన్స్డ్కు అర్హతగా పేర్కొన్న నిబంధనలను యథాతథంగా అమలు చేయనున్నారు. దీని ప్రకారం ఈ దేశాల విద్యార్థులకు జనరల్ కేటగిరీ విద్యార్థుల నిబంధనలు వర్తిస్తాయి. కామన్ మెరిట్ లిస్ట్లో నిలవాలి. +2, తత్సమాన బోర్డ్ పరీక్షలో టాప్ 20 పర్సంటైల్లో ఉండాలి. లేదా బోర్డ్ పరీక్షల్లో 75 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి. అంతర్జాతీయ విద్యార్థులు..గ్లోబల్ ర్యాంకులు అంతర్జాతీయంగా ఇన్స్టిట్యూట్లకు ర్యాంకులు ఇచ్చే క్రమంలో ఒక ఇన్స్టిట్యూట్లోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య కూడా ఒక పరామితిగా ఉంటోంది. గ్లోబల్ ర్యాంకింగ్స్ అనగానే గుర్తొచ్చే క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ ర్యాంకింగ్స్, అకడమిక్ ర్యాంకింగ్స్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీస్ నిర్వాహకులు ర్యాంకులు కేటాయించేటప్పుడు పరిగణనలోకి తీసుకొనే అయిదారు పరామితుల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంశం కూడా ఉంటోంది. రీసెర్చ్, ఫ్యాకల్టీ సైటేషన్స్, ఔట్కమ్ వంటి విషయాల్లో మన ఇన్స్టిట్యూట్స్ మెరుగైన పాయింట్లు సాధిస్తున్నప్పటికీ.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పారామీటర్ విషయంలో వెనుకంజలో ఉంటున్నాయి. ఉదాహరణకు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2015-16ను పరిగణనలోకి తీసుకుంటే.. 179వ ర్యాంకులో నిలిచిన ఐఐటీ ఢిల్లీ మిగిలిన పారామీటర్స్లో ముందంజలో ఉన్నప్పటికీ.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రాతిపదిక పరంగా చూస్తే అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఐఐటీ-బాంబేలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థులు 50. కాగా, 18 శాతం మందే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు. ఇలా.. ఇంటర్నేషనల్ స్టూడెంట్ పారామీటర్లో తక్కువ స్కోరింగ్ లేదా నిల్ స్కోరింగ్ అనేది మొత్తం ర్యాంకులపై ప్రభావం చూపుతోందన్న ఉద్దేశంతో ఐఐటీలు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచే అమల్లోకి! తాజా ప్రతిపాదనను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఐఐటీ కౌన్సిల్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు మరికొద్ది రోజుల్లో పంపనుంది. ఎంహెచ్ఆర్డీ ఆమోదం లభించాక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుంటుంది. ఈ రెండు ప్రక్రియలు మరో రెండు నెలల్లో పూర్తవుతాయని ఐఐటీ కౌన్సిల్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇది జరిగితే జేఈఈ అడ్వాన్స్డ్-2017 నోటిఫికేషన్లోనే సంబంధిత మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు చేపట్టిన తాజా ప్రతిపాదనను ప్రస్తుతానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, ఐఐటీలకే పరిమితం చేయనున్నారు. రెండు, మూడేళ్ల తర్వాత స్పందన ఆధారంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఇతర ఇన్స్టిట్యూట్లకు కూడా వర్తింపజేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఐఐటీలు అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు యోచిస్తున్న తరుణంలో భారత విద్యార్థులు తమ అవకాశాలు చేజారుతాయని ఆందోళన చెందనవసరం లేదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం ప్రత్యేకంగా పది శాతం సూపర్ న్యూమరరీ సీట్లను ఏర్పాటు చేయనున్నారు. అంటే.. ప్రస్తుతం దేశంలోని ఐఐటీల్లో బీటెక్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో దాదాపు 11 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి పది శాతం అంటే దాదాపు 1100 సీట్లను అదనంగా పెంచి, అంతర్జాతీయ విద్యార్థులకు కేటాయిస్తారు. తాజా ప్రతిపాదన వల్ల ఐఐటీలు.. గ్లోబల్ ర్యాంకులకు సంబంధించి ఒక్క అంతర్జాతీయ విద్యార్థుల విభాగంలోనే ముందంజలో ఉంటాయనుకోవడం సరికాదు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల తొలుత ‘మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య’ అనేదే ప్రధానంగా నిలిచినప్పటికీ.. తొలి బ్యాచ్ పూర్తయ్యేసరికి నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, ఔట్కమ్ వంటి ఇతర పారామీటర్స్లోనూ మెరుగైన పాయింట్లు పొందే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ఫ్యాకల్టీ సైతం ఐఐటీలపై ఆసక్తి చూపే పరిస్థితి వస్తుంది. ఇది జరిగితే గ్లోబల్ ర్యాంకుల్లో ఇతర ప్రామాణికాలైన ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ వంటి వాటిలో మెరుగుదల సాధ్యమవుతుంది. - ప్రొఫెసర్ ఆర్.వి.రాజ్కుమార్, డెరైక్టర్, ఐఐటీ-భువనేశ్వర్. ఐఐటీ మద్రాస్... ఐఐటీ మద్రాస్.. క్రిష్ గోపాల క్రిష్ణన్, రోహిణి చక్రవర్తి, జీకే అనంత సురేశ్, ఆనంద్ రాజారామన్, అనంత్ అగర్వాల్ వంటి ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన అత్యున్నత విద్యా సంస్థ. అంతటి ఘన చరిత్ర కలిగిన విద్యాసంస్థలో చదువుకునే అవకాశం రావడం తనకు దక్కిన అరుదైన అవకాశం అంటున్నాడు అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోహిత్. అంతేకాదు చదువుతోపాటు సినిమాలు, షికార్లు, కబుర్లు, స్నేహాలు, ప్రేమలు, ఆత్మీయతలు వంటివాటికి కొదవలేదంటున్న రోహిత్ చెబుతున్న క్యాంపస్ కబుర్లు.. ఐఐటీలో సీటే లక్ష్యంగా.. మాది వైజాగ్. ఇంటర్ వరకు నా విద్యాభ్యాసం అక్కడే సాగింది. 96 శాతం మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణత సాధించాను. నాన్న బీకే నాయుడు.. ఏపీసీపీడీసీఎల్ ఉద్యోగి. అమ్మ కల్పన గృహిణి. అమ్మానాన్న చిన్నప్పటి నుంచే క్రమశిక్షణగా పెంచారు. నన్ను అత్యున్నత స్థాయిలో చూడాలని నిత్యం కలలు కనేవారు. నేను కూడా అందుకు తగ్గట్లుగానే చదివేవాడిని. ఇంటర్లో ఉండగానే ఐఐటీలో సీటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కష్టపడి చదివితే జేఈఈ అడ్వాన్సడ్లో మంచి ర్యాంకు వచ్చింది. నా కెరీర్కు అన్ని విధాలా సరైందని భావించి ఐఐటీ-మద్రాసులో చేరాను. అందరిలానే నాక్కూడా... ఇక్కడ చేరిన కొత్తలో నాకు అన్నీ కొత్తగా కనిపించేవి. కొత్త ప్రాంతం, కొత్త కల్చర్, రకరకాల వ్యక్తులు ఇలా అంతా గజిబిజిగా ఉండేది. ఈ పరిస్థితులకు అలవాటుపడేందుకు కొంత సమయం పట్టింది. జీవితంలో అత్యంత కీలకమైన దశను వృథా కానీయకుండా బంగారు భవితను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఐఐటీ కల్పించింది. అంతేకాకుండా భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న మనస్తత్వాలు కలిగిన వారిని ఒకచోటకు చేర్చి సువిశాల ప్రపంచాన్ని కళ్లముందుంచింది. కాలేజీలో చేరిన తొలి రోజు నుంచే దృఢమైన జీవిత లక్ష్యాన్ని ఏర్పరుచుకునే విధంగా ప్రోత్సహించింది. ఉన్నత ఆలోచనలు, అలవాట్లు, జీవన విధానాలను నేర్పించి ఒక మనిషి ఎదుగుదలకు అవసరమైన అన్ని అవకాశాలను కల్పించింది. చదువుతోపాటు అన్నీ... ఇక చదువు విషయానికొస్తే... ఇక్కడ క్లాసులు రెండు బ్యాచ్లుగా జరుగుతాయి. కొన్ని బ్రాంచ్లకు ఉదయం 8 నుంచి 12 వరకు..మరి కొన్ని బ్యాచ్లకు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. క్లాసులు అయిపోగానే కొంత మంది స్పోర్ట్స్, కొంత మంది కల్చరల్ యాక్టివిటీస్, మరి కొంత మంది రీసెర్చ్ ఇలా ఎవరి వ్యాపకాల్లో వాళ్లు నిమగ్నమవుతారు. వాటితో పాటు కాలేజీలో అప్పుడప్పుడు ఇంటర్ కాలేజీ వ్యాసరచన పోటీలు, సెమినార్లు, గెస్ట్ లెక్చర్లు ఉంటాయి. వీటితో పాటు కల్చరల్ ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్ జరుగుతుంటాయి. సీఎఫ్ఐ (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్) ద్వారా స్టార్టప్స్పై ఆసక్తి ఉన్న వారికి ట్రైనింగ్ ఇస్తారు. హాస్టల్ లైఫ్ని జీవితంలో మరిచిపోలేం. కామన్రూంలలో చెప్పుకున్న కబుర్లు, షేర్ చేసుకున్న నాలెడ్జ్, రూమ్స్లో ఆడిన ఇండోర్ గేమ్లు ఎప్పటికీ మరిచిపోలేని మధురానుభూతులు. ఎన్నో ప్రత్యేకతలు ఐఐటీ-మద్రాస్ 620 ఎకరాల సువిశాల ప్రాంగణం. చెట్లుచేమలతో చూడ్డానికి అడవిని తలపిస్తుంది. అనేక అడవి జంతువులు, పక్షులు సైతం కళ్ల ముందే తిరుగుతుంటాయి. ఇవన్నీ చూస్తే కాలేజీలో ఉన్న ఫీలింగ్ పోయి విహారయాత్రకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. అంతేకాక ఏ ఐఐటీలో లేని అత్యాధునిక టెక్నాలజీ, ల్యాబ్లు, మన సంప్రదాయాలను గుర్తుకుతెచ్చే హెరిటేజ్ సెంటర్ ఇక్కడ ఉన్నాయి. ఏ పని చేసినా దాని నుంచి కొంత అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని గ్రహించాలన్నదే నా సిద్ధాంతం. అందుకు తగిన విధంగా ముందుకెళ్తున్నాను. ఆకట్టుకునే వీడియో రెజ్యుమె ఇలా.. నిన్నమొన్నటి వరకు ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే బయోడేటా/ రెజ్యుమె ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు సాధారణ పేపర్ రెజ్యుమెల స్థానంలో వీడియో రెజ్యుమెలు ప్రవేశిస్తున్నాయి. ఇవి మనకు కొత్త కావచ్చు. కానీ విదేశాల్లో ఎప్పటి నుంచో వీడియో రె జ్యుమెల ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. రిక్రూటర్లు కూడా వీటిపై ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతున్న వీడియో రెజ్యుమెల గురించి తెలుసుకుందాం.. వీడియో రెజ్యుమె అంటే.. ఇంతకుముందు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తన వివరాలను, అకడమిక్ అర్హతలను, పూర్వానుభవాన్ని ఒక పేపర్పైన రాసేవాళ్లు. దీన్నే బయోడేటా/రెజ్యుమె అనేవారు. వీడియో రెజ్యుమె.. సాధారణ రెజ్యుమెకు భిన్నంగా ఉంటుంది. అభ్యర్థి తన వివరాలను, అర్హతలను, అనుభవాలను స్వయంగా వివరిస్తూ వీడియోను చిత్రీకరించుకోవడాన్నే వీడియో రెజ్యుమె అంటారు. దీన్నే సంబంధిత కంపెనీలకు పంపించాల్సి ఉంటుంది. రిక్రూటర్లు వీటిని పరిశీలించి, తగిన అర్హతలున్నవారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీడియో రెజ్యుమె ఆకర్షణీయంగా ఉంటే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. పొరపాట్లు చేస్తే అవకాశాలు చేజారతాయి. వీడియో రెజ్యుమె రూపకల్పనలో ఏ మాత్రం నిరక్ష్యంగా ఉన్న ఇంటర్వ్యూకి పిలుపు రాదు. ఈ విషయంలో అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రిక్రూటర్లను మెప్పించొచ్చు. వీడియో రెజ్యుమె ఎందుకు? సాధారణ రెజ్యుమె/సీవీలతో పోలిస్తే వీడియో రెజ్యుమెలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పేపర్ రెజ్యుమెతో రిక్రూటర్ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేరు. అంతేకాకుండా మీరు సాధించిన విజయాలను కూడా రిక్రూటర్ను ఆకట్టుకునేలా రాయడం కష్టం. వీడియో రెజ్యుమెతో ఇలాంటి సమస్యలు ఉండవు. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. మీరు సాధించిన విజయాలను, ఆయా సమస్యల సాధనలో మీ నైపుణ్యాలను ప్రభావవంతంగా రిక్రూటర్ను ఆకట్టుకునేలా చెప్పొచ్చు. మరీ ఎక్కువ సమయం ఉండొద్దు.. వీడియో రెజ్యుమె ఎక్కువ సమయం లేకుండా చూసుకోండి. 3 నిమిషాలు మించకుండా ఉండాలి. మీ గురించిన వివరాలను స్పష్టంగా, సూటిగా, క్లుప్తంగా ఉండేలా చూడండి. నిజానికి 3 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉన్న వీడియో రెజ్యుమెలను చూసేంత తీరిక, సమయం హెచ్ఆర్/మేనేజ్మెంట్కు ఉండదని తెలుసుకోండి. అందుకే ముందు మీ గురించి అంటే మీ పేరు, స్వస్థలం వంటి వివరాలు చెప్పిన తర్వాత పదో తరగతి, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్, పీజీలో సాధించిన మార్కులు తెలపండి. మీరు కళాశాలలో ఉండగా సాధించిన ఘనతలను క్లుప్తంగా వివరించండి. ఇంతకు ముందే ఉద్యోగ అనుభవం ఉంటే అక్కడ సాధించిన విజయాలను చెప్పండి. వీడియో రెజ్యుమె ఇలా.. ఇంటర్నెట్లో అందుబాటులోని వీడియో రెజ్యుమె నమూనాలను పరిశీలించాలి. వీడియో చిత్రీకరణ కంటే ముందే స్క్రిప్ట్ను బిగ్గరగా చదువుతూ సాధన చేయాలి. వస్త్రధారణ ప్రొఫెషనల్గా ఉండేలా చూసుకోవాలి. వీడియో చిత్రీకరణకు అనుకూలంగా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న డెస్క్ వెనుక పద్ధతిగా కూర్చోవాలి. అక్కడ వెలుతురు సక్రమంగా వచ్చేలా జాగ్రత్తపడాలి. రణగొణ ధ్వనులు వినిపించకూడదు. నేరుగా కెమెరావైపే చూడాలి. మాట్లాడేటప్పుడు పక్కకు, పైకి, కిందికి చూడొద్దు. వీడియో క్లుప్తంగా ఉండాలి. వ్యవధి మూడు నిమిషాల్లోపే ఉండడం మంచిది. మాటలు స్పష్టంగా ఉండాలి. ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. మొదట అభ్యర్థి తన పేరు చెప్పాలి. తర్వాత మిగిలిన వివరాలు వెల్లడించాలి. అర్హతలు, అనుభవాలను తెలియజేయాలి. కంపెనీ అవసరాలకు తాను సరిగ్గా సరిపోతాననే భావం వ్యక్తమవ్వాలి. చివరగా ఈ అవకాశం కల్పించినందుకు రిక్రూటర్కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో చిత్రీకరణను ముగించాలి. -
అమరావతిలో విదేశీయుల సందడి
అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన అమరావతిని శనివారం దేశ విదేశాల పర్యాటకులు సందర్శించారు. రాజధానిని సందర్శించిన అనంతరం ఉదయం 11 గంటలకు కొరియాకు చెందిన పారిశ్రామిక వేత్తల బృందం, సాయంత్రం టిబెట్కు చెందిన యాత్రికులు తొలుత అమరావతి కొత్త, పాత మ్యూజియంలలోని శిల్పాలను, ధ్యానబుద్ధ విగ్రహన్ని సదర్శించారు. ప్రతి ఏడాది సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు అమరావతిని సందర్శించే విదేశీయుల సందడి ఎక్కువనే చెప్పవచ్చు. -
విదేశీయుల చండీయాగం
పుట్టపర్తి టౌన్ : లోక కళ్యానార్థం విదేశీయులు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మేరకు చండీయాగం నిర్వహించారు. బుధవారం నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపల్లి మార్కెట్ వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో వేద మంత్రోచ్చారణ నడుమ చండీయాగం నిర్వహించారు. అమావాస్య ముందురోజు చతుర్దసి రోజున అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. ఇదే రోజు చండీయాగం చేస్తే అమ్మవారు కరుణించి లోకకళ్యాణం ప్రాప్తిస్తుందన్న విశ్వాçÜంతో వారు యాగం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి మార్గంలో మానవాళి నడవాలని, ఆయన బోధించిన మేరకు లోకాసమస్త సుఖినోభవంతు అన్న సందేశాన్ని నమ్ముతూ లోకకళ్యాణం కోసం చండీయాగం చేపట్టినట్లు తెలిపారు. -
అప్పన్న సన్నిధిలో విదేశీ బృందం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం విదేశీ అధికార బృందం దర్శించుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామీణావృద్ధిని పరిశీలించేందుకు పలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు రాష్రీ్టయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో తరలివచ్చారు. కప్పసం్తభాన్ని ఆలింగనం చేసుకుని బేడాచుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో అషో్టత్తరంపూజ, గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చనలు నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. హుండీఆదాయం రూ.99.52 లక్షలు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం గడిచిన 29 రోజులకు రూ. 99 ,52, 490 వచ్చినట్టు సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. నగదుతోపాటు 125 గ్రాముల బంగారం, 8 కిలోల 750 గ్రాముల వెండి వచ్చినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన లెక్కింపులో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శ్రీహరి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
ఆ జంట ఎంతో ఆశగా ఇండియాకొస్తే..
న్యూఢిల్లీ: ఎన్నో ఆశలతో భారత్కు వచ్చిన ఓ విదేశీ జంటను కొందరు దారుణంగా దోచుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఎర్రకోట, తాజ్మహల్ చూడాలని ఎన్నో అంచనాలతో ఇక్కడికి చేరుకున్న వారిని మొదట విమానాశ్రయంలో కలిసిన ఓ టాక్సీ డ్రైవర్ దారుణంగా మోసం చేశాడు. అనంతరం వారిని ఓ ట్రావెల్ ఏజెన్సీకి అప్పగించిన ఘటనను చూస్తే, ఇలా కూడా మోసం చేస్తారా! అని అనిపించకమానదు. జర్మనీకి చెందిన నైనా ఫరినా, తన స్పానిష్ మిత్రుడు అలెక్స్తో కలిసి ఇటీవల భారత్ను సందర్శించడానికి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే వారు ముందుగానే బుక్ చేసుకున్న హోటల్కు టాక్సీలో బయలుదేరారు. అయితే, టాక్సీ డ్రైవర్ ఢిల్లీలో ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, నగరం మొత్తం కర్ఫ్యూ విధించారని వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అలా వారిని నగరశివార్లలో తిప్పుతూ వారి దగ్గర వేల రూపాయలు గుంజాడు. అనంతరం ఇప్పుడు వారు సందర్శించడానికి ఢిల్లీ అనుకూలం కాదని.. జైపూర్, వారణాసి ప్రాంతాలకు వెళ్తే మంచిదని సలహా ఇస్తూ వారిని ఓ ట్రావెల్ ఏజెన్సీకి అప్పగించాడు. ట్రావెల్ ఏజెన్సీ వారు జైపూర్, వారణాసి ప్రాంతాలకు వెళ్లడానికి భారీ మొత్తం అవుతుందని, వారు చెల్లించే దానిలో సగానికి పైగా ప్రభుత్వానికే పన్నుగా వెళ్తుందని చెప్పుకొచ్చారు. దీంతో వారు భారీ మొత్తంలో డబ్బును ఆ ట్రావెల్ ఏజెన్సీకి చెల్లించారు. అనంతరం వారు బుక్ చేసిన హోటల్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. ఢిల్లీలో అసలు కర్ఫ్యూనే లేదనే విషయాన్ని చెప్పడంతో వారికి దారుణంగా మోసపోయామనే విషయం తెలిసింది. దీంతో ఆ జంట ఢిల్లీ పోలీసులను ఆశ్రయించగా వారు తమ స్టేషన్ పరిధిలోకి రాదంటూ.. ఆ జంటను పలు పోలీస్ష్టేషన్ల చుట్టు తిరిగేలా చేశారు. తనకు ఎదురైన అనుభవాలను నైనా ఫరినా మీడియాతో వెల్లడించింది. ఢిల్లీలో ఈ తరహా మోసాలు ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది. కొత్తగా ఇక్కడికి వచ్చే విదేశీయులను టార్గెట్ చేసి దోచుకునే ముఠాలు అక్కడ చాలానే ఉన్నాయని సమాచారం. వీరి దెబ్బకు భారత్ను సందర్శించాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తున్న యాత్రికులు 'అమ్మో ఇండియానా' అనే పరిస్థితి ఏర్పడుతోంది. -
ఉబెర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, అరెస్ట్
ముంబై: ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో ఉబెర్ క్యాబ్ డ్రైవర్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ విదేశీ మహిళ బాంద్రా నుంచి వెర్సోవాకు క్యాబ్లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వేదింపులకు పాల్పడిన డ్రైవర్ను షాబాజ్ షేక్(32) గా గుర్తించారు. బాధితురాలి మిత్రురాలు ఫేస్బుక్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళను క్యాబ్ డ్రైవర్ షాబాజ్ ఆమెను ముందు సీట్లో కూర్చోమని కోరాడు. దానికి నిరాకరించిన ఆ మహిళ వెనుక సీట్లో కూర్చోగా.. సీట్ను క్లీన్ చేయాలనే వంకతో షాబాజ్ ఆమె సమీపంలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ వెంటనే కేకలు వేస్తూ క్యాబ్ దిగి వెళ్లిపోయింది. అనంతరం శాంతాక్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. షాబాజ్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉబెర్ ప్రకటించింది. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించింది. -
స్వాతంత్య్ర వేడుకల్లో విదేశీయులు
డోర్నకల్: వరంగల్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని చర్చి కాంపౌండ్లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో విదేశీయులు పాల్గొన్నారు. ఇంగ్లాండ్ దేశంలోని గ్లౌస్టర్ చర్చికి చెందిన పది మంది బృందం గత కొద్ది రోజులుగా డోర్నకల్ మండలంలో పర్యటిస్తున్నారు. చర్చి కాంపౌండ్లో డోర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో విదేశీయులు పాల్గొన్నారు. -
కోటసత్తెమ్మ హుండీ ఆదాయం రూ.13 లక్షలు
తిమ్మరాజుపాలెం (నిడదవోలు): నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మవారి ఆలయంలో హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. రెండు నెలల నాలుగు రోజులకు రూ.13.52 లక్షల ఆదాయం వచ్చినట్టు ఈవో పాతూరి లోకేశ్వరి తెలిపారు. నగదుతో పాటుగా 30 గ్రాముల బంగారం, 222 గ్రాముల వెండి, రెండు విదేశీ నోట్లు లభించాయన్నారు. అన్నదాన ట్రస్ట్ హుండీ లెక్కించగా రూ.10 వేల ఆదాయం సమకూరిందని చెప్పారు. దేవాదాయశాఖ తాడేపల్లిగూడెం తనిఖీ అధికారి కేవీవీ రమణ, ఆలయ ఫౌండర్ దేవులపల్లి రామ సుబ్బరాయశాస్త్రి తదితరులు పర్యవేక్షించారు. -
భారతీయ సంస్కృతిపై విదేశీయుల మోజు
-
చర్చిలో విదేశీయుల సందడి
కోదాడ: పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న సీఎస్ఐ చర్చిలో సోమవారం ఇంగ్లాండ్ దేశానికి చెందిన పలువురు సందడి చేశారు. గ్లోస్టర్ డయాసిస్ బృందం చర్చిల సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చారు. వీరిని నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చర్చి ఆవరణలో మెుక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ బిషప్ ఆనందరావు, అశోక్సాల్మన్, జాన్వెస్లీ, నెమ్మాది భాస్కర్, ఏర్పుల యాకోబు, కర్ల సుందర్బాబు, ఏర్పుల వెంకటేష్, సునీల్, రాజేష్ పాల్గొన్నారు. -
తీర గ్రామాల్లో విదేశీ ప్రతినిధుల బృందం
ప్రకృతి వైపరీత్యాలు, మడ అడవులపై పరిశోధన తాళ్లరేవు : మండలంలోని పలు పర్యాటక ప్రదేశాలు, తీర ప్రాంత గ్రామాలలో విదేశీ ప్రతినిధుల బృందం మంగళవారం పర్యటించింది. హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 13 దేశాలకు చెందిన 22 మంది విదేశీ ప్రతినిధులు ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంత రక్షణ, మడ అడవులు ప్రాముఖ్యం, మత్స్యకారుల జీవన విధానాలు తదితర అంశాలను పరిశోధించేందుకు ఇక్కడికి వచ్చారు. జింబ్వాబ్వే, లైబేరియా, నైజీరియా, ఆఫ్టనిస్తాన్, ఇథియోపియా, కజికిస్తాన్, శ్రీలంక తదితర దేశాల ప్రతినిధులు ఉన్నట్టు ఎన్ఐఆర్డీ ప్రాజెక్టు హెడ్ ఈవీ ప్రకాష్రావు, డాక్టర్ వీ సురేష్ బాబు తెలిపారు. తొలుత వారు చొల్లంగిలోని కోరంగి అభయారణ్యాన్ని సందర్శించారు. కోరంగిలోని ఫారెస్ట్ స్టాఫ్ కాంప్లెక్స్, చినవలసలలోని డ్రై ఫిష్ ఫ్లాట్ ఫారమ్ పలు క్రీకులను పరిశీలించారు. పెదవలసల గ్రామంలో ఇగ్రీ ఫౌండేషన్ నిధులతో నిర్మించిన క్రాబ్ మార్కెట్ కాంప్లెక్స్ను పరిశీలించి, అక్కడ మత్స్యకారులతో మాట్లాడారు. సునామీ, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ విధంగా వ్యవహరించారు, మడ అడవులు ఏ విధంగా దోహద పడ్డాయి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో విరివిగా లభించే మత్స్యజాతుల ఉత్పత్తులు, వాటివల్ల కలిగే ఉపాధి, వ్యాపార అవకాశాలపై శోధించారు. క్రాబ్ మార్కెట్లో పీతలను బృంద సభ్యులు ఆసక్తిగా తిలకించారు. -
మానసిక వికలాంగురాలికి విదేశీయుల చేయూత
చండ్రాయనిపల్లి(బుక్కపట్నం): మండలంలోని చండ్రాయనిపల్లికి చెందిన ఓ మానసిక వికలాంగురాలికి విదేశీయులు చేయూతనిందించారు. గ్రామానికి చెందిన రామాంజనమ్మ పుట్టుకతోనే వికలాంగురాలు. ఈమెకు తల్లి లేదు. తండ్రి ఉన్నారు. పుట్టపర్తి మండలం చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చెన్నకృష్ణారెడ్డి పక్కనే ఉన్న తరుగువాండ్లపల్లికి చెందిన వ్యక్తి కావటంతో విషయం తెలుసుకొని తన వంతుగా చేయూతనిందిస్తూ గ్రీసు దేశానికి చెందిన సత్యసాయి భక్తుడు డిబిలీయస్ సహకారంతో సుమారు లక్ష రూపాయలతో షెడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో రూ.10 వేలు చెన్నకృష్ణారెడ్డి వాటాగా విరాళం అందించారు. ఆదివారం గ్రీసు దేశస్తుడు గ్రామానికి వచ్చారు. ఆయనకు ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. విదేశీయులు చేయూతనిందించేందుకు కృషి చేసిన చెన్నకృష్ణారెడ్డికి రామాం జనమ్మ తండ్రి,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎంజే అక్బర్కు గల్ఫ్ బాధ్యతలు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్కు పశ్చిమ ఆసియా ప్రాంత బాధ్యతలు అప్పగించారు. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ దేశాలతో ఎన్డీఏ ప్రభుత్వం సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని కోరుకుంటోంది. గల్ఫ్ ప్రాంతంలో సుమారు 50 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇక్కడి రాజకీయాలపై అక్బర్కు పట్టుంది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మినహా యూరోపియన్ యూనియన్, సెంట్రల్, పశ్చిమ యూరప్ దేశాలతో భారత్ సంబంధాలనూ అక్బర్ పర్యవేక్షిస్తారు. పశ్చిమ ఆఫ్రికా, యూరేసియా(రష్యా మినహా) దేశాలతో భారత్ సంబంధాల బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. విదేశాంగ శాఖలో అక్బర్తో పాటు వీకేసింగ్ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. -
విదేశీయులే లక్ష్యం..!
- ఒకే దెబ్బకు రెండు ప్రయోజనాలు కలిగేలా ఐసిస్ వ్యూహం - ఎన్ఐఏ విచారణలో వెల్లడి... మహారాష్ట్రకు ఇబ్రహీం సాక్షి, హైదరాబాద్ : విదేశీయులనే టార్గెట్గా చేసుకుని ఉగ్రమూకలు బాంబు పేలుళ్లకు కుట్ర రచించినట్లు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) విచారణలో తేలింది. అందుకే విదేశీయులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని ఉగ్రవాదులు నిర్ణయించినట్లు వెల్లడైంది. దీనివల్ల ఒకే దెబ్బతో రెండు ప్రయోజనాలు నెరవేరుతాయని ఐసిస్ కీలక నేత షఫీ ఆర్మర్ నూరిపోసినట్లు సమాచారం. అందుకనుగుణంగానే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. హైదరాబాద్లో పెద్దఎత్తున పేలుళ్లకు పథకం వేసిన ఐదుగురు ఉగ్ర అనుమానితులను ఆదివారం కూడా ఎన్ఐఏ అధికారులు విచారించారు. కాగా, వీరిలో అతికీలకమైన ఇబ్రహీం యజ్దానీని ఎన్ఐఏ అధికారులు మహారాష్ట్ర తీసుకెళ్లారు. మిగతా నలుగురిని ఇక్కడే ఉంచి పలు కోణాల్లో ప్రశ్నించారు. విదేశీయులు లక్ష్యంగానే ఐటీ కారిడార్, ప్రముఖ షాపింగ్ మాల్స్, హోటళ్లు, విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఐటీ కారిడార్లోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గాలపైనా ప్రత్యేక అధ్యయనం చేశారు. అలా చేస్తేనే విస్తృత ప్రచారం... విదేశీయులు లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడితే అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతుందనేది ఐసిస్ ఉద్దేశం. దీని ద్వారా పాశ్చాత్య దేశాలను భయభ్రాంతులకు గురిచేయవచ్చని ఉగ్రమూకలకు ఐసిస్ ప్రతినిధులు సూచించారు. అలాగే దేశంలో శాంతిభద్రతల అంశం అంతర్జాతీయ వేదికలెక్కేలా కుట్ర చేశారు. తద్వారా ఆయా దేశాలతో భారత సంబంధాలను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. అందుకోసం గత కొంత కాలంగా ఐసిస్ జరుపుతున్న దాడులను ప్రస్తావించినట్లు తెలిసింది. తాజాగా బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్లో జరిగిన ఘటనను పేర్కొంది. ఉగ్రమూకలకు ఉత్సాహం నింపేందుకు స్వయంగా షఫీ ఆర్మర్ తరచుగా వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడుతున్నట్లు ఎన్ఐఏ విచారణలో వెలుగు చూసింది. సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన... హైదరాబాద్లో పేలుళ్లలకు సంబంధించి కీలకంగా వ్యవహరించిన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీని ఎన్ఐఏ అధికారులు మహారాష్ట్రకు తీసుకెళ్లారు. నాందేడ్లో ఆయుధాల కొనుగోలుతో పాటు రెండు పర్యాయాలు ఇబ్రహీం పర్యటించాడు. వీరికి మహారాష్ట్ర కేంద్రంగా సహాయ సహకారాలు లభించినట్లు ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. అందుకోసం అక్కడ ఇబ్రహీం ఎవరెవరిని కలిశాడనే కోణంలో ఆరా తీయడం కోసం స్థానిక సీసీ టీవీ కెమెరాను పరిశీలించాలని నిర్ణయించింది. అలాగే రాజస్థాన్లోని అజ్మీర్లో కూడా ఇబ్రహీం పర్యటించడం, అక్కడి నుంచి వీరికి రసాయనాలు అందడంతో దీనిపైనా ఎన్ఐఏ దృష్టి సారించింది. -
పెరిగిన ఈ-వీసా యాత్రికులు
కోల్కతా: ఈ-టూరిస్ట్ వీసా మీద భారత్ను సందర్శించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం 179.9 శాతం వృద్ధి నమోదైందని అసోచామ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ- టూరిస్ట్ వీసా ఆధారంగా ఈ మేలో 43,833 మంది సందర్శించగా, కిందటి సారి ఇదే సమయంలో 15,659 మంది వచ్చారు. ఈ ఏడాది జనవరి-మే మధ్య 4,34,927 మంది ఈ సదుపాయం వినియోగించుకోగా, గత ఏడాది ఇదే కాలంలో 1,10,657 మంది మాత్రమే వినియోగించుకున్నారు. ఈ విధానాన్ని 2014 నవంబర్ 27 నుంచి 2016 ఫిబ్రవరి 25 వరకు 113 దేశాలకు చెందిన పౌరులకు భారత ప్రభుత్వం వర్తింపజేసింది. -
మెడికల్ టూరిస్టులకు త్వరలో ఈ-వీసా!
న్యూఢిల్లీ: విదేశీయులు భారత్లో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం సులభతరం కానున్నది. కేంద్ర ప్రభుత్వం భారత్కు వైద్య చికిత్సల కోసం వచ్చే పర్యాటకుల కోసం త్వరలో ఈ-వీసాలను జారీ చేయనున్నది. దేశంలో మెడికల్ టూరిజం మార్కెట్ 3 బిలియన్ డాలర్లు ఉంటుందని అం చనా. ఇది 2020 నాటికి 7-8 బిలియన్ డాలర్లకి చేరే అవ కాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ-వీసాల జారీ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్కు వైద్యం కోసం వచ్చే విదేశీయులకు త్వరలో ఈ-వీసాల జారీ ఉంటుందని హోం శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. విదేశాల నుంచి వైద్యం కోసం ఇండియాకు వచ్చిన వారు 2012, 2013, 2014లో వరుసగా 1.71 లక్షలు, 2.36 లక్షలు, 1.84 లక్షలుగా ఉంది. -
వాళ్లంతా బెంగళూరుకు ఎందుకు వచ్చారో తెలుసా?
బెంగళూరు: వైద్యం కోసం ఎక్కువ మంది విదేశీయులు ఆశ్రయిస్తున్న నగరంగా బెంగళూరు రికార్డుల్లోకెక్కింది. 2014 జనవరి నుంచి ఇప్పటివరకు చేసిన సర్వేలో ప్రపంచ దేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన వారిలో 88,020 మంది వైద్యం కోసం వచ్చినట్లు వెల్లడి అయిది. బెంగళూరులో ఆసుపత్రుల్లో రికార్డులను పరిశీలించి ఈ లెక్కలను వేసినట్లు సర్వేయర్లు తెలిపారు. ఎక్కువమంది రోగులు క్యాన్సర్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్, కార్డియాక్ కేర్, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్ధో పెడిక్స్ చికిత్సల కోసం బంగ్లాదేశ్, ఇరాక్, యెమన్, మాల్దీవులు, ఒమన్, మారిషస్, టాంజేనియా, కెన్యా, నైజీరియా, ఇండోనేసియాల నుంచి వస్తున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. భారత్ లో అదీ బెంగళూరులో వైద్యం చౌకగా లభిస్తుండటంతో వీరందరూ తరలివస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ రోగులు గత రెండేళ్లలో అత్యధికంగా 49,000 మంది మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. మణిపాల్ హస్పిటల్ సీఈవో డా.అజయ్ భక్షి మాట్లాడుతూ భారత్ లో మెడికల్ టూరిజం క్రమంగా ఎదుగుతోందని అన్నారు. ప్రస్తుతం మెడికల్ టూరిజంలో ప్రపంచలో మూడో స్థానంలో ఉన్నట్లు వివరించారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే విదేశాల నుంచి వచ్చే రోగులకు సౌకర్యాలు, వసతులను పెంచాలని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే బెంగళూరులో పది శాతం వైద్యఖర్చులు తగ్గుతున్నాయని అందుకే అంతర్జాతీయ రోగులు భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మజుందార్ షా మెడికల్ సెంటర్ డా. సునీల్ భట్ తెలిపారు. యూఎస్, సింగపూర్, యూరప్ దేశాలతో పోల్చితే వైద్యుల కేరింగ్, నిపుణతలో ముందున్న డాక్టర్లు బెంగళూరులో ఉంటున్నట్లు వివరించారు. కొన్ని దశాబ్దాల నుంచి భారత్ లో డాక్టర్ల నిపుణతో పెరుగుతూ వస్తోందనీ చెప్పారు. మజుందార్ షా మెడికల్ సెంటర్ మణిపాల్ తర్వాత 10,000 మంది విదేశీయులకు చికిత్స అందించి రెండో స్థానంలో కొనసాగుతోంది. కొలంబియా ఆసియా ఆసుపత్రి, ఫోర్టిస్ ఆసుపత్రులు విదేశీయులకు చక్కని వైద్యాన్ని అందిస్తున్నాయి. -
స్తంభాల కిందే సమాధి
► లింగాపూర్ వద్ద విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా ► ముగ్గురి దుర్మరణం ఏడుగురికి గాయాలు ► ఒకరి పరిస్థితి విషమం కూలీ పనికొచ్చి కానరాని లోకాలకు... వాళ్లంతా పొట్టచేత పట్టుకుని కూలీ పని కోసం ఓ కాంట్రాక్టర్ వద్ద చేరారు. ఉన్న ఊరు వదిలి మరో ఊరికి కూలీ పనికి వచ్చారు. కూలీ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలను ఒక చోటు నుంచి మరో చోటికి ట్రాక్టర్లో తరలించే క్రమంలో వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వలస కూలీల కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. దండేపల్లి : దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామ సమీపంలో విద్యుత్ స్తంభాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న కూలీలపై విద్యుత్ స్తంభాలు పడటంతో బెజ్జూర్ మండల కేంద్రంలోని గోల్కొండ వార్డుకు చెందిన పెద్దల పోషం(45), గౌతురె మల్లేశ్(18), కౌటాల మండలం గంగాపూర్కు చెందిన తుమ్మెడ విశ్వనాథం(50) అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయూలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ప్రాణాలు తీసిన అతివేగం దండేపల్లి విద్యుత్ సబ్స్టేషన్ నుంచి ట్రాక్టర్లో 12 విద్యుత్ స్తంభాలను ఎక్కించుకుని తాళ్లపేట వైపు తరలిస్తున్నారు. విద్యుత్ స్తంభాలను అక్కడ దించడం కోసం 11 మంది కూలీలు కూడా అదే ట్రాక్టర్లోనే వెళ్తున్నారు. ట్రాక్టర్ను డ్రైవర్ అతి వేగంగా నడపడంతో అదుపుతప్పి లింగాపూర్ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో స్తంభాలపై కూర్చుని ఉన్న కూలీలపై విద్యుత్ స్తంభాలు పడటంతో ముగ్గురు దుర్మరణం చెందగా, ఏడుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న లక్సెట్టిపేట సీఐ మోహన్, దండేపల్లి, లక్సెట్టిపేట, జ న్నారం ఎస్సైలు రాములు, అశోక్, లింగమూర్తి తమ సిబ్బందితో వెంటనే అక్కడకు చేరుకున్నారు. 108 అంబులెన్సులో క్షతగాత్రులను లక్సెట్టిపేట, మంచిర్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. స్తంభాల కింద ఇరుక్కుని ఉన్న మృతదేహాలను, తీసి పోస్టు మార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తుమ్మెడ విశ్వనాథంకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పెద్దల పోషంకు రెండేళ్ల క్రితం భార్య చనిపోయింది. ఓ కొడుకు ఉన్నాడు. గౌతూరి మల్లేశ్ ఇటీవలే ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. ఇతడికి తల్లిదండ్రి ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, అతడు పరారీలో ఉన్నాడని సీఐ మోహన్ తెలిపారు. ఈ మేరకు దండేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నడీ రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా పడి రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్ను, విద్యుత్ స్తంభాలను తొలగింపజేశారు. గాయపడిన వారు వీరే.. ఈ ఘటనలో ఏడుగురు మధునయ్య, లచ్చన్న, శ్రీనివాస్, బాపురావు, రాజు, జలేందర్, తిరుపతి, గాయపడ్డారు. వీరిలో కొందరిని లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో, మరికొందరిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్న మధునయ్యను కరీంనగర్కు రెఫర్ చేశారు. క్షతగాత్రులందరిది బెజ్జూర్, కౌటాల మండలాలు. కుటుంబాలను ఆదుకుంటాం - కోనేరు కోనప్ప, సిర్పూర్(టి) ఎమ్మెల్యే ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆయన లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పంటలు పండక.. వలస ‘పోయి..’ కౌటాల : మండలంలోని గంగాపూర్కు తుమ్డి విశ్వనాథ్(40) లింగాపూర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. విశ్వనాథ్కు వ్యవసాయ భూమి ఉన్నా కరువు ప్రభావంతో ఖరీఫ్లో ఆశించిన స్థాయి పంటలు పండలేదు. వేసవిలో గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడంతో కూలీ కోసం విశ్వనాథ్ దండేపల్లి మండలానికి వెళ్లాడు. పనిలో భాగంగా ప్రమాదం జరిగి మరణించాడు. అలాగే గంగాపూర్ గ్రామానికి చెందిన లచ్చన్న, శ్రీనివాస్, బాబురావులకు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలియగానే విశ్వనాథ కుటుంబీకులు, గ్రామస్తులు బయల్దేరి వెళ్లారు. ఉన్న ఊరు వదిలి.. అసువులు భాసి... బెజ్జూర్ : ఉన్న ఊరిలో పని దొరకక కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితుల్లో పొట్టచేత పట్టుకొని బతుకు కోసం పట్టణానికి వలస వెళ్లిన కూలీలకు చివరకు వారి పనే ప్రమాదానికి గురి చేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. బెజ్జూర్ గ్రామానికి చెందిన గౌతురే మల్లేశ్(18) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. వేసవి సెలవుల్లో పని చేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్నాడు. అలా దండేపల్లికి కూలీ పనికని పోరుు ప్రమాదంలో అసువులు బాసాడు. మల్లేశ్ తన తల్లిదండ్రులు గోవారు, లక్ష్మిలకు నాలుగో సంతానం. కాగా, ఇదే గ్రామానికి చెందిన పెద్దల పోశం(45) ఇదే ప్రమాదంలో మృతి చెందాడు. రెండేళ్ల క్రితం ఈయన భార్య బుచ్చక్క మృతిచెందింది. ఇప్పుడు పోశం కూడా మృతిచెందడంతో వారి కొడుకు శ్రీకాంత్ అనాథగా మిగిలాడు. దీంతో బెజ్జూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామంలో ఇద్దరు ఇలా చనిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఏటీఅండ్టీ, వర్జిన్ రీఎంట్రీ!
* భారత్ టెలికం మార్కెట్లో ప్రవేశానికి ప్రయత్నాలు... * రానున్న స్పెక్ట్రం వేలాల్లో పాల్గొనేందుకూ సన్నాహాలు న్యూఢిల్లీ: భారత్ టెలికం మార్కెట్పై మరోసారి విదేశీ దిగ్గజాల కన్నుపడింది. అమెరికా టెలికం అగ్రగామి ఏటీఅండ్టీ, వర్జిన్ మీడియాలు ఇక్కడి మార్కెట్లోకి మరోసారి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ రెండు కంపెనీలూ ఇప్పటికే మోదీ సర్కారుకు తమ రీఎంట్రీకి సంబంధించి ఆసక్తిని వ్యక్తం చేయడంతోపాటు ప్రాథమికంగా చర్చలు కూడా జరిపినట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్(ఎంవీఎన్ఓ) రూట్లో తమ కార్యకలాపాలను భారత్లో ప్రారంభించే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న టెలికం కంపెనీల నుంచి ఎయిర్టైమ్, బ్యాండ్విడ్త్(కాల్స్, డేటా కోసం)ను హోల్సేల్ రేట్లకు బల్క్లో కొనుగోలు చేసి.. సొంత బ్రాండ్ కింద టెలికం సేవలను ఆఫర్ చేయడాన్ని ఎంవీఎన్ఓగా పేర్కొంటారు. వర్జిన్ మీడియాను రిచర్డ్ బ్రాన్సన్ స్థాపించగా.. ప్రస్తుతం దీని నియంత్రణ అంతా 18.3 బిలియన్ డాలర్ల విలువైన లిబర్టీ గ్లోబల్ చేతిలో ఉంది. ఇక ఏటీఅండ్టీ కంపెనీ విలువ 147 బిలియన్ డాలర్లుగా అంచనా. భారీ గేమ్ప్లాన్తోనే... దేశీ టెలికం రంగంలోకి తిరిగి అడుగుపెట్టాలని భావిస్తున్న విదేశీ కంపెనీలు రానున్నకాలంలో భారీస్థాయిలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏటీఅండ్టీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరిగే మెగా స్పెక్ట్రం వేలంలో బిడ్డింగ్పై దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. ‘2,000 మెగాహెర్ట్జ్కు పైబడిన బ్యాండ్విడ్త్లో భారీ పరిమాణంలో స్పెక్ట్రం అందుబాటులో ఉండనుంది. కొత్తగా భారత్ టెలికం మార్కెట్లోకి ప్రవేశించే ఆపరేటర్కు ఇది మంచి అవకాశం’ అని ఈ పరిణామంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై ఏటీఅండ్టీ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. తమ పాలసీ మేరకు మీడియాలో ఊహాగానాలపై మాట్లాడబోమని పేర్కొనడం గమనార్హం. మరోపక్క, అత్యంత సమర్ధవంతమైన 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్విడ్త్ స్పెక్ట్రం కూడా రానున్న వేలంలో అందుబాటులో ఉండటం కొత్తగా ప్రవేశించే టెల్కోలకు సదావకాశంగా పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 5 మెగాహెర్ట్జ్ బ్లాక్ను ఈ బ్యాండ్విడ్త్లో చేజిక్కించుకోవడానికి సుమారు రూ.57,425 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికే భారీ రుణభారంతో ఉన్న భారతీ ఎయిర్టెల్, ఐడియా వంటి టెల్కోలు దీనిపై దృష్టిపెట్టే అవకాశం లేదని.. దీంతో కొత్త ఆపరేటర్లు భారీగా విస్తరించేందుకు ఈ స్పెక్ట్రం దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చి, వెళ్లిపోయాయి... వాస్తవానికి భారత్లోకి ఏటీఅండ్టీ సుమారు 15 ఏళ్ల క్రితమే అడుగుపెట్టింది. అప్పట్లో దేశీయంగా టెలికం సేవలను ప్రారంభించిన బిర్లా, టాటా గ్రూప్లతో జట్టుకట్టింది. అయితే, ఆతర్వాత 2005లో ఆయా సంస్థల్లోని వాటాలను విక్రయించి భారత్కు గుడ్బై చెప్పింది. ఇక వర్జిన్ మీడియా కూడా 2008లో టాటా గ్రూప్తో భాగస్వామ్యం ద్వారా వర్జిన్ మొబైల్ బ్రాండ్ కింద టెలికం సేవలను అందించింది. అయితే, వ్యాపారంలో పెద్దగా పురోగతి సాధించలేక 2011లో కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, ఎంవీఎన్ఓ విధానానికి భారత్లోని టెలికం కమిషన్ ఈ ఏడాది మార్చి 28న ఆమోదముద్ర వేయడంతో మళ్లీ విదేశీ దిగ్గజాలు ఇక్కడి భారీ మార్కెట్పై దృష్టిపెట్టేలా చేసింది. ‘టెలికం సేవల విస్తరణ తక్కువగా ఉన్న గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లో కార్యకలాపాలు అందించాలనుకునే కంపెనీలకు ఎంవీఎన్ఓ రూట్ చాలా మంచి అవకాశం. ప్రస్తుతం పెద్ద ఆపరేటర్లు తగినంత బ్యాండ్విడ్త్ లేక విస్తరణకు దిక్కులుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రభుత్వ రంగ టెల్కోల వద్ద భారీస్థాయిలో స్పెక్ట్రం, మౌలిక సదుపాయాలు ఉన్నా... సరైన మార్కెటింగ్ సామర్థ్యం లేకపోవడంతో వెనుకబడ్డాయి. ఎంవీఎన్ఓ మోడల్తో ఇలాంటి కంపెనీలకు ఉపయోగం ఉంటుంది’ అని గార్ట్నర్ రీసెర్చ్ ఎనలిస్ట్ రిషి తేజ్పాల్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం దేశంలో మొబైల్, డేటా టారిఫ్ల విషయంలో టెల్కోల మధ్య ధరల యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఎంవీఎన్ఓలు ఇక్కడి మార్కెట్లో నిలదొక్కుకోవడం ఏమంత సులువు కాదనేది మరికొందరు విశ్లేషకుల వాదన. -
విదేశీ మహిళకు టీసర్కార్ బాసట
సాక్షి, హైదరాబాద్: ఆమె గర్భిణి.. వేరే దేశంలో కొలువు... ప్రసవం కోసం సంతోషంగా స్వదేశానికి వెళ్తుండగా విమానంలోనే పురిటి నొప్పులు రావటంతో అనుకోని పరిస్థితిలో హైదరాబాద్కు చేరుకుంది. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ కళ్లముందే కన్నుమూసింది... ఇక అక్కడి నుంచి అన్నీ సమస్యలే. పాప మృతదేహంతో స్వదేశం వెళ్లలేక, నగరంలో అంత్యక్రియలు చేద్దామంటే అడ్డొచ్చిన నిబంధనలు, ఆసుపత్రిలో చికిత్సకైన ఖర్చు చెల్లించేందుకు డబ్బుల్లేక... ఆ తల్లిపడ్డ మానసిక క్షోభ అంతాఇంతా కాదు. అయితే, ఆమెను అతిథిగా భావించి తెలంగాన పర్యాటక శాఖ అండగా నిలిచింది. చిన్నారి అంత్యక్రియలతోపాటు అవసరమైన ఖర్చులకు సాయం చేసి ఆమెను ప్రశాంతంగా స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేసింది. పిలిప్పీన్స్ వెళ్తూ... పిలిప్ఫీన్స్కు చెందిన గ్రేస్ అలెగ్జాండ్రియా దుబాయ్లో నర్సుగా పనిచేస్తోంది. గర్భవతి అయిన ఆమె ప్రసవం కోసం స్వదేశానికి బయలుదేరింది. వారం క్రితం ఎమిరేట్స్ విమానమెక్కిన ఆమెకు గగనతలంలోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి. విమానంలోనే ప్రసవించిన ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే ప్రసవం జరగటంతో శిశువు పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. అప్పుడు విమానం భారత గగనతలంలో ఉండటంతో పైలట్ అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని దింపాడు. ముందే అధికారులకు సమాచారం అందించటంతో విమానాశ్రయంలోని అపోలో ఆరోగ్య కేంద్రం సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స ప్రారంభించి తర్వాత జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా ఎదగకుండానే జన్మించిన శిశువును వైద్యులు కాపాడలేకపోయారు. ఓవైపు శిశువు చనిపోయిందన్న బాధ కంటే తర్వాత ఏర్పడ్డ సమస్యలు అలెగ్జాండ్రియాను మరింత ఇబ్బంది పెట్టాయి. శిశువు మతదేహంతో స్వదేశానికి వెళ్లలేక ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె నిర్ణయించుకుంది. కానీ స్థానికంగా చర్చిల్లో సభ్యత్వం లేనివారికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉండదని స్థానిక శ్మశానవాటిక నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించలేక, అటు స్వదేశానికి వెళ్లలేక, ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు డబ్బులేక ఆమె తీవ్ర మనోవేదనను అనుభవించింది. విషయం తెలుసుకున్న తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడి ఆమె దుస్థితికి చలించిపోయారు. వెంటనే పోలీసులు, ఇతర విభాగాల అధికారులతో మాట్లాడి శిశువు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరుమలగిరిలోని శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి నిర్వాహకులతో చర్చించి చికిత్స బిల్లును తగ్గించే ఏర్పాటు చేశారు. ఆ డబ్బులు కూడా సరిపోని పక్షంలో ప్రభుత్వపరంగా సాయం అందించటంతోపాటు ఆమెను స్వదేశానికి పంపేందుకు వీలుగా విమాన టికెట్ను అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ముందు ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చే పర్యాటకులే కాకుండా అనుకోని విపత్తులతో వచ్చేవారినీ అతిథులుగా భావించి వారిని అక్కున చేర్చుకోవటం మన ధర్మమని, దాన్ని నిర్వహించేందుకు పర్యాటక శాఖ ముందుకొచ్చిందని వెంకటేశం తెలిపారు. -
విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త!
విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త! ఇకపై తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లను విదేశాల నుంచే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కొత్తగా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) కల్పిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నారైలు, విదేశీయులు భారత్ పర్యటనకు వచ్చేముందు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడం కోసం ఇండియాలోని తమ బంధువులు, టూర్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఐఆర్ సీటీసీ ఈ పరిస్థితిలో మార్పులు చేర్సులు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం వెబ్ సైట్ లో అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం కల్పించింది. విదేశీ ప్రయాణీకులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చూడటమే లక్ష్యంగా కొత్త టికెట్ బుకింగ్ వ్యవస్థను భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ కొత్త పద్ధతిలో విదేశీయులు, ఎన్నారైలు తమకు ఫారిన్ బ్యాంకులు అందించిన క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. 'ప్యాలెస్ ఆన్ వీల్స్' , 'మహరాజా' వంటి లగ్జరీ ట్రైన్లు, విదేశీయుల పర్యటనలకు అనువుగా ఉండే ఇతర టూరిస్ట్ స్పెషల్ ట్రైన్లతోపాటు, సాధారణ సర్వీసుల్లో కూడ ఈ కొత్త అవకాశం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇటువంటి అంతర్జాతీయ లావాదేవీలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ప్రత్యేక అవకాశం కల్పించడం ఇది రెండోసారి. క్రెడిట్ కార్డుల దుర్వినియోగాన్ని గమనించిన ఐఆర్ సీటీసీ మొదటిసారి ఇచ్చిన అవకాశాన్ని అప్పట్లో రద్దు చేసింది. ప్రస్తుతం హ్యాకింగ్ వంటి సమస్యలు ఎదురు కాకుండా వెబ్ సైట్ లో భద్రతను మరింత పటిష్ఠ పరచి ముందుగానే అన్నిరకాల పరిశీలనలు పూర్తయిన తర్వాతే టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. నిమిషానికి 15,000 బుకింగ్స్ ను చేసే ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ... సెకనుకు 250 టికెట్లను వినియోగదారులకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో సుమారు 58 శాతం టికెట్లు ఆన్ లైన్ లోనే అమ్మకాలు జరుగుతుండటం విశేషం. కాగా ప్రస్తుతం ఐఆర్ సీటీసీ అందిస్తున్న కొత్త సదుపాయం ఏప్రిల్ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. -
గర్ల్ఫ్రెండ్ను చూసేందుకు వచ్చి..
న్యూఢిల్లీ: గర్ల్ఫ్రెండ్ను చూసేందుకు ఓ విదేశీయుడు అక్రమంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడ్డాడు. నిందితుడు ఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ నకిలీ విమాన టికెట్తో టర్మినల్ 3 లోపలికి ప్రవేశించాడు. చివరకు అధికారులు గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. గత సోమవారం జరిగిన ఈ సంఘటన విమానాశ్రయంలో భద్రతాలోపాలను ఎత్తిచూపింది. నిందితుడిని మైకేల్ ఎలియాజ్ రోడ్రిగుజ్గా గుర్తించారు. అతడికి స్పెయిన్ పాస్పోర్టు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ప్రవేశ ద్వారం వద్ద మైకేల్ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు మీద టికెట్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అతడిపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా తన గర్ల్ఫ్రెండ్ను చూసేందుకు వచ్చినట్టు అతడు చెప్పాడు. ఢిల్లీ విమానాశ్రయంలోకి భారత ప్రయాణికులతో పాటు విదేశీయులు భారీ సంఖ్యలో వస్తుంటారని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన అవసరముందని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయని, అయితే ఇంతవరకు పరిష్కారం కనుగొనలేదని చెప్పారు. కొందరు నకిలీ టికెట్లతో విమానాశ్రయంలోకి వస్తున్నారని, ఇది భద్రతపరంగా ఆందోళన కలిగించే విషయమని పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ విమానాశ్రయంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నకిలీ టికెట్లను గుర్తించేందుకు ప్రవేశ ద్వారాల వద్ద బార్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేయనున్నారు. బ్రసెల్ బాంబు పేలుళ్ల ఘటన అనంతరం ముందుజాగ్రత్తగా విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. -
వెయ్యేళ్ల యుద్ధం ఎవరి మీద?
జాతిహితం దివంగత జుల్ఫికర్ ఆలీ భుట్టో ఒక సందర్భంలో భారత్తో వెయ్యేళ్ల యుద్ధాన్ని సాగిస్తామన్నారు. 1990 వేసవిలో, ఉద్రిక్తతలు మరోమారు చెలరేగుతుండగా ఆయన కుమార్తె ప్రభుత్వం సైన్యం నేతృత్వంలోని అధికార వ్యవస్థ ఒత్తిడి కి గురై ఉన్నప్పుడు ... ఆమె కూడా తిరిగి అదే పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి కావడమే కాదు, చారిత్రాత్మకమైన ఆ రోజులే వివాదాలమయమైనవి. పాకిస్తాన్ ఆ వ్యాఖ్య ద్వారా భారత్కు అణు యుద్ధ హెచ్చరికను పంపిందని ఈ రచయితతో సహా చాలా మంది అప్పట్లో విశ్వసించారు. కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వం సైతం పాక్ బెదిరింపులపై మాట్లాడాల్సి వచ్చింది. వెయ్యేళ్ల యుద్ధం గురించి బెదిరించేవారు వెయ్యి గంటల యుద్ధంలోనైనా నిలవగలరేమో చూసుకోవాలి’’ అంటూ సింగ్ అద్భుతంగా స్పందించారు. గెలుపుకు మూల్యం ఏమిటి? వెయ్యి గంటలంటే ఏమిటో వెంటనే ఆలోచించాను, అదేమీ చిన్నది కాదు, 42 రోజుల యుద్ధం. అంటే 1965, 1971లలో జరిగిన రెండు యుద్ధాలను కలిపినాగానీ ఇంకా ఏడు రోజులు ఎక్కువే. నేనప్పుడు ‘ఇండియా టుడే’కు ఈ ఉద్రిక్తతల మీద కవర్ పేజీ కథనాన్ని తయారుచేస్తున్నాను, నా మిత్రుడు, సునిశిత సైనిక విశ్లేషకుడు రవి రిఖ్యే భారత్ గెలుస్తుందనే ముందస్తు ప్రమేయంతో వెయ్యి గంటల యుద్ధం ఊహాత్మకంగా జరగడం గురించి అంచనాలు కట్టాడు. ఆ యుద్ధంలో గెలవడానికి ఆహుతైపోయే విమానాలు, ట్యాంకులు, సాధారణ వాహనాలు, జీవితాల సంఖ్యను, పేల్చాల్సివచ్చే మందుగుండు సామగ్రి, ఇతర ఆర్థిక నష్టాలను అంచనా కట్టి విజయానికి చెల్లించాల్సిన మూల్యం ఎంతో అంచనాకట్టాం. విజయం కోసం అపారమైన మూల్యం చెల్లించాల్సి రావడమే కాదు, పాక్తో ఉన్న నిజమైన సమస్యలు పరిష్కారం కావనే నిర్ధారణకు వచ్చాం. ఎంత చిన్న యుద్ధాన్ని, ఎంత అను కూల పరిస్థితుల్లో చేసినాగానీ అందుకు మనం భరించలేనంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందనే మా ముందస్తు నిర్ధారణను అది రుజువు చేసింది. ఆకట్టుకునే విధంగా ఉండాలని 1971లో పూర్తి స్థాయి నిర్ణయాత్మక విజ యాన్ని సాగించినా, రెండు దశాబ్దాల తర్వాత మనం మరింత భారీ సేన లతో, మెరుగైన ఆయుధ, సాధన సంపత్తితో, మరింత ఆగ్రహంగా ఉన్న ప్రజ లతో మరో యుద్ధం వాకిట నిలిచామని కూడా జోడించాం. వెంటనే మా సహ భారత వ్యూహాత్మక నిపుణులు మాపై విరుచు కుపడ్డారు యుద్ధంలో ఖర్చయిపోయే ట్యాంకులు, విమానాలు, క్షిపణుల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టడానికి అయ్యే వ్యయాలను లెక్కగట్టామని, అవన్నీ అంతకు ముందే నిల్వ ఉన్నాయి, అరుగుదలకు గురవుతాయనే విష యాన్ని విస్మరించామనేది మా కథనంపై వారి ప్రధాన అభ్యంతరం. విజయం సాధించిన సైన్యాలు ఎప్పుడూ పాత సాధన సంపత్తి స్థానే కొత్త వాటిని సమకూర్చుకుంటాయని, 1971లో కూడా మనం అదే చేశామంటూ మేం దాన్ని కొట్టిపారేశాం. మా విశ్లేషణ ఎంతగా శాంతివాద పూరితమైన దంటే పలు ప్రముఖ పాకిస్తానీ ఇంగ్లిష్, ఉర్దూ పత్రిక లు దాన్ని పునర్ము ద్రించాయి. ఒక పత్రిక మరీ తెగించి ఏకంగా మా కథనం నకలును యథా తథంగా ప్రచురించింది. 1971లో ఢాకాలో నియాజీ, అరోరాకు లొంగి పోతున్నప్పటి ఫొటోనూ, నిర్ణయాత్మక విజయమే కానీ దేన్నీ పరిష్క రించలేదు. మరో యుద్ధం మూర్ఖపు ఆలోచన అనే శీర్షికను కూడా అది జోడించింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ పత్రిక సంపాదకుణ్ణి సైనిక ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. భారత ప్రచారాన్నీ, ఆ ఫొటోను ఎలా ప్రచురించారు? అని అడిగారు. ఆ పత్రిక మొదటి పేజీలోనే అందుకు క్షమాపణలు చెప్పుకుని, ఆ తదుపరి ఒక రిటైర్డ్ పాక్ వైమానిక దళ ఎయిర్ మార్షల్ రాసిన వ్యాసాలను వరుసగా ప్రచురించింది. కొత్త యుద్ధంలో పాక్ మూడు రోజుల్లో ఎలా భారత్ను మట్టి కరిపిస్తుందో, తమ ట్యాంకులు జైపూర్ను ఎలా ముట్టడిస్తాయో ఆయన వివరించారు. అంతేకాదు, శాంతి కోసం భారత్, కశ్మీర్ను వదులుకోవడమే కాదు, ‘‘అదుపులో ఉంచగలిగిన’’ పరిమాణంలోని కొన్ని దేశాలుగా విభజించడానికి సైతం అంగీకరించాల్సి వస్తుందని కూడా చెప్పారాయన. జాతీయ భద్రతా రాజ్యంగా పాక్ ఇరవై ఐదేళ్లు గడిచాక, ఒక చిన్న యుద్ధాన్ని (కార్గిల్) చేశాక, దాదాపు పూర్తిస్థాయి యుద్ధం చేసే వరకు (ఆపరేషన్ పరాక్రమ్) పోయాక.... ఇప్పుడు మనం మరోసారి నాటి పాక్ వెయ్యేళ్ల యుద్ధం పిలుపును నాటి విమానాలు, ట్యాంకులు, లేదా అణు క్షిపణుల లెక్కలకు దూరంగా నిలచి సరికొత్త దృక్కోణం నుంచి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఆ పని చేసిన నేను రెండు ప్రతిపాదనలు చేస్తున్నాను. ఒకటి, మనం విశ్వసిస్తున్నదానికి విరు ద్ధంగా వెయ్యేళ్ల యుద్ధం నిజంగా జరగడమే కాదు, అది 1947 నాటి దేశవిభజనతో మొదలై ఇప్పుడు 70వ ఏడాదిలో ఉంది. రెండు, వెంటనే నాకు కొత్తగా సంఘీ తీర్థం పుచ్చుకున్నవాడు’’ అనే ముద్ర వేసేయకుండా ఆలోచించండి.... ఆ యుద్ధం చాలా వరకు ఒక్క దేశం మాత్రమే (పాకిస్తాన్) చేస్తున్నది, ప్రధానంగా తనపైన తానే సాగిస్తున్నది. నేను పాక్ వ్యతిరేతకను రెచ్చగొట్టేవాడినని ఎవరో ఆరోపించారు. ఆ దేశం అనివార్యంగా స్వీయ విధ్వంసానికి గురవుతుందనీ నేను విశ్వసించను. అలా జరగాలని కోరుకోను. పైగా పాకిస్తానీ జాతీయవాదం చాలా బలమైన శక్తిగా ఎదిగిందని, అదిప్పుడు నిజమైన ఉద్వేగపరమైన, భావజాలపరమైన ఐక్యతగల జాతి రాజ్యమని భావిస్తాను. దీనిపై మీ వాదనలు ఎలానైనా ఉండనివ్వండి. అసలు విషయం మాత్రం ఈ జాతీయ ఐక్యత ఇస్లాం భావ జాలంపై ఎంతగా ఆధారపడి ఉందో, అంతగానూ భారత్పట్ల అసాధారణ అనుమానంపై ఆధారపడినది. బలమైన, పెద్ద, ‘‘మరింత జిత్తులమారి’’ భారతదేశం నిరంతరం మీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు చేస్తున్నదని, అందుకే మీరు నిరంతరం దానితో యుద్ధం చేయాల్సి వస్తోందని ఊహించుకోండి. ఇది, ఆచరణలో మీకు మీరే ఓ పీడకలను కనిపెట్టి, అదే మీ మనసులను శాసించేట్టు చేయడమే అవుతుంది. పాక్ ఒక బలమైన, అసాధా రణమైన జాతి రాజ్యంగా అవతరించడానికి అదే కారణమైంది. పాక్, సౌదీ అరేబియాలా పూర్తిగా ఇస్లామీకరణ చెందలేదు లేదా ఇరాన్లోలా పూర్తిగా మత పెద్దల చెప్పు చేతుల్లో నడిచేదీ కాదు లేదా ఒకప్ప టిలా సైనిక నియంతృ త్వమూ కాదు. అలా అని నిజమైన ప్రజాస్వామ్యం కూడా కాదు. అది జాతీయ భద్రతా రాజ్యానికి ప్రామాణిక ఉదాహరణగా నిలుస్తుంది. అహం కారం జాతీయవాదం, ధిక్కారం, అనుమానం, సమస్యాత్మకమైన రక్షణా త్మకత, ఎప్పుడూ వెనుకాముందూ, అటూఇటూ భయంతో, ఆగ్రహంతో చూస్తూ ఉండే రాజ్యం కావడం వంటి జాతీయ భద్రతా రాజ్యానికి ఉండా ల్సిన అన్ని లక్షణాలూ దానికి ఉన్నాయి. తనపైన తానే యుద్ధం చేయాల్సిన రాజ్యం గత మూడు వారాలుగా పాకిస్తాన్ నుంచి చాలా గందరగోళపరిచే వార్తలు వస్తున్నాయి. పాకిస్తానీ మహిళలా జట్టు టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో మనల్ని, ఆ తర్వాత వెస్ట్ఇండీస్ను ఓడించింది, పాక్ చేతిలో ఓడిన ఆ జట్టే చివరికి ఫైనల్స్కు చేరింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని లాహోర్లో బాంబు పేలుళ్లు జరిగాయి. అదే సమయంలో సల్మాన్ తసీర్ హంతకుడనే అభియోగంతో ఉరితీసిన మక్బూల్ ఖాద్రీ మద్దతుదా రులు ఇస్లామాబాద్ను ముట్టడించారు. బాంబు పేలుడు వహాబీ దియోబందీ గ్రూపు చేసినది కాగా, తహీరుల్ ఖాద్రీ మద్దతుదారులు బారెల్వి సూీఫీయిజం సభ్యులు. అయితే సరిగ్గా దీనికి ముందే, కెనడియన్-పాకి స్తానీ చపల బుద్ధి మనిషి తహీరుల్ ఖాద్రీని భారత్లో ప్రముఖునిగా చూశారు. మన ప్రధాని ఢిల్లీలో జరిగిన సూఫీ సదస్సులో అతన్ని మధ్యేవాదిగా పేర్కొనడం చెప్పుకోదగినది. ఈ వ్యవహారాలను అర్థంచేసుకోవడానికి నేను నా పాకిస్తానీ మిత్రుడు, కాలమిస్టు ఖలీద్ అహ్మద్ సహాయాన్ని కోరాను. పాక్లోని బారెల్వీ సూఫీయిజంలో రెండు విభిన్న పాయలు ఉన్నట్టనిపిస్తోంది. ఒకటి, (సున్నీ తెహ్రిక్) ఇస్లామాబాద్లో మృతదేహాలను చూడాలని కోరుకునేది. మరొకటి తహిరుల్ ఖాద్రీకి చెందినది. ఆయన మద్దతుదార్లే ఇమ్రాన్ఖాన్తో కుమ్మక్కై, సైన్యం తరపున ఇస్లామాబాద్ను ముట్టడించారు. ప్రజాస్వామ్యం నిజంగానే వేళ్లూనుకునేట్టుంటే, కొత్తగా ఎన్నికైన నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం కోసం సైన్యం వారిని వాడుకుంటోంది. అంటే మనం మితవాదిగా ప్రశంసించే ఖాద్రీయే సైన్యం చేతుల్లో రాజకీయ మిలీషియా పాత్ర ను పోషించారు. అదే సైన్యం ఇప్పుడు ఈ రెండు గ్రూపులపైనా ద్విముఖ సైనిక చర్యను ప్రారంభించింది. కానీ లష్కరే, జైషేల వంటి ఉగ్రవాద సంస్థలను మాత్రం కాపాడుతోంది. జాతీయ భద్ర తా రాజ్యానికి నిర్వచనం ఇదే. ఇందులో సైన్యం/భద్రతా వ్యవస్థ ఎవరికి వారే శత్రువు ఎవరో నిర్వచించుకుని ఎవరికి తోచిన రీతిలోవారు... అది ఎంత హేతువిరుద్ధమైనాగానీ పోరాడుతుంటారు. ఇక మిగతా వ్యవస్థా, సంస్థలు, చివరికి మతపెద్దలు అత్యంత ప్రాధాన్యం గల ఆ విజయ సాధన కోసం దానికి సహాయపడుతుంటారు. ఈ విధంగా పాకిస్తాన్ తన్ను తాను జాతీయ భద్రతా రాజ్యంగా నిర్వచించుకోవడంతో, తన స్థానాన్ని సమంజసమైనదిగా చూపటం కోసం నిరంతరం ఎవరో ఒకరితో యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి ఇతర సమాజాల్లాగానే అది కూడా తనపైనా, తన ప్రజలపైనా తానే యుద్ధం చేయాల్సి వస్తోంది. వజీరిస్తాన్, సరిహద్దు రాష్ట్రాల్లో జరుగు తున్నది ఇదే. అందుకే మనం పాకిస్తాన్ తనను తాను వెయ్యేళ్ల యుద్ధంలోకి ఈడ్చుకున్నదనే విషయాన్ని ఇంత విస్తృతంగా చర్చించాల్సి వస్తోంది. వ్యాసకర్త: శేఖర్ గుప్తా -
విదేశాల్లో ఉద్యోగాల పూచీ ప్రభుత్వానిదే
సాక్షి, హైదరాబాద్: దళారుల ప్రమే యం లేకుండా గల్ఫ్ దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున క ల్పిస్తున్న ఉపాధి అవకాశాలను యువత ఉపయోగించుకోవాలని హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వమే పూచీకత్తుగా వ్యవహరించి సమస్యను పరిష్కరిస్తుందన్నారు. బుధవారం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీస్ (టామ్కామ్) ఆధ్వర్యం లో ఇక్కడ ఏర్పాటు చేసిన ‘విదేశీ ఉద్యోగ మేళా’ను మంత్రి ప్రారంభించారు. దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం తెలంగాణ యువ త దళారులను ఆశ్రయించి మోసపోతున్నారని, ఈ సమస్యను అధిగమించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున టామ్కామ్ ఏర్పాటు చేసి దుబాయ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నదని వివరించారు. అందులో భాగంగా ఇప్పుడు ఆల్ జజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీ ముందుకొచ్చి, అవసరమైన 250 మందిని మూడు రోజులపాటు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటుందన్నారు. త్వరలో మరో రెండు కంపెనీలు 500 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. ఏటా 5 వేల నుంచి 10వేల వరకు విదేశాల్లో ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నామన్నారు. అక్కడ శ్రమ దోపిడీకి గురికాకుండా చట్ట ప్రకారం పని కల్పించేలా ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధిని నియమించామన్నారు. దుబాయ్లో డ్రైవర్లకు ప్రారంభ వేతనం రూ.50వేలు, ఎలక్ట్రిషియన్లకు రూ.30వేలు, హెల్పర్లకు రూ.20వేలు ఉంటుందన్నా రు. ఎంపికైన అభ్యర్థులు టామ్కామ్కు రూ.20 వేలు చెల్లిస్తే వీసా, టికెటు తదితర వాటినన్నింటినీ వారే చూసుకుంటారన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్కామ్ డెరైక్టర్ కె.వై.నాయక్, జనరల్ మేనేజర్ భవాని, అల్ జజీరా ఏమిరేట్స్ పవర్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విదేశీ విద్యార్థి మృతి
ఉస్మానియా యూనివర్సిటీ: రోడ్డు ప్రమాదంలో విదేశీ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్లో శనివారం జరిగింది. ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం ఇరాక్ దేశానికి చెందిన మహ్మద్ హైథన్ అబిద్ ఇబ్రహీమ్పట్నంలోని సెయింట్ పాల్స్ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ కోర్సు చదవుతున్నాడు. హబ్సిగూడ రవీంద్రనగర్ కాలనీలో ఉండే అతను తన బైక్ పై స్నేహితుడు సలాదిన్ కలసి వేగంగా వెళ్తుండగా అదుపు తప్పిన బైక్ హబ్సిగూడ ఆంధ్రాబ్యాంక్ సమీపంలో ఓ షాప్ మెట్లకు ఢీకొంది. హైథమ్ అబిద్ తలకు తీవ్రగాయాలతో పాటు శరీరంలో మరికొన్న చోట్ల బలమైన గాయాలవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక గల సలాదీన్కు తీవ్రగాయాలయ్యాయి. తలకు హెల్మేట్ ఉంటే హైథమ్ అబిద్ ప్రణాల నుంచి బయటపడే వారని ఎస్సై ఉపేందర్ తెలిపారు. -
విద్యార్థులకు షూ పంపిణీ చేసిన కెనడా దేశస్తురాలు
శంషాబాద్: మండల కేంద్రంలోని రాళ్లగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆగాఖాన్ అకాడమీలో పనిచేస్తున్న కెనడా దేశస్తురాలు వెండి ఇలియాట్ షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి డీ రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూతనందించడానికి విదేశీయురాలు మందుకు రావడం అభినందనీయమన్నారు. పాఠశాల అభివృద్ధికి తమవంతు సాయం చేస్తామని ఈ సందర్భంగా ఆగాఖాన్ అకాడమీ అంతర్జాతీయ ప్రోగ్రామింగ్ డెరైక్టర్ ఫరాన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శ్రీకాంత్ యాదవ్, వార్డు సభ్యురాలు భారతమ్మ, ప్రధానోపాధ్యాయులు ఇమ్మానుయేల్, ఉపాధ్యాయులు రాధాకృష్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఖట్టర్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
చంఢీగఢ్: లగ్జరీ హోటళ్లలో విదేశీయులకు సరఫరా చేసేందుకు గో మాంసాన్ని అనుమతిస్తామని, అందుకు ప్రత్యేక లెసైన్స్ విధానాన్ని తీసుకొస్తామంటూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ మరో వివాదానికి తెర తీశారు. మానవులకు భిన్న రుచులు ఉంటాయని, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గోమాంసం ఎక్కువగా తినే అలవాటు ఉంటుందని, అలాంటి వారి ఇష్టాయిష్టాలను ఎందుకు కాదనాలని, మద్యాన్ని నిషేధించిన గుజరాత్లో ప్రత్యేక అనుమతికింద విదేశీయులకు మద్యాన్ని అనుమతిస్తున్నప్పుడు తమ రాష్ట్రంలో మాత్రం గోమాంసాన్ని ఎందుకు అనుమతించరాదంటూ కూడా ఖట్టర్ మీడియా ముందు వ్యాఖ్యానించారు. గోవులను పవిత్ర జంతువుగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కఠినమైన గోమాంస నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి ఖట్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినవా, ఇది ద్వంద్వ ప్రమాణాలను పాటించడం కాదా? అంటూ వివిధ వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన నాలుక కరచుకున్నారు. ఇంకా ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని ప్రభుత్వం అన్ని కోణాల నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉందని ఖట్టర్కు ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న జవహర్ యాదవ్ సోమవారం వివరణ ఇచ్చారు. భారత్లో నివసించాలంటే ముస్లింలు గోమాంసం తినడాన్ని మానుకోవాలని, తినాలనుకుంటే దేశం విడిచి వెళ్లాలంటూ ఖట్టర్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెల్సిందే. ఖట్టర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం హర్యానాలో గోమాంసాన్ని ఎవరైనా విక్రయించినా, దాన్ని కొనుగోలు చేసినా, ఆహారంగా స్వీకరించినా లక్ష రూపాయల జరిమానా లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కబేళాకు గోవులను తరలించిన వారికి 30 నుంచి 70 వేల వరకు జరిమానా లేదా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. -
విదేశీ విద్యార్థులపై దాడి
టీనగర్ : చెన్నై వర్సిటీలో డిజాస్టర్ మేనేజ్మెంట్, చెన్నై వరద బాధితుల గురించి ఫీల్డు వర్కు పేరిట సమావేశం మంగళవారం జరిగింది. చెన్నై వర్సిటీ వైస్ చాన్స్లర్ తాండవన్, ఐఏఎస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమావేశంలో వర్సిటీకి చెందిన ఎంఏ రెండవ ఏడాది ఫ్రాన్స్ దేశపు విద్యార్థి జోనస్ ఆంటన్ పులేంద్ర రాసా పాల్గొని వరద చర్యలపై ప్రశ్నించారు. ఆ విద్యార్థిపై ఎగ్జామినేషన్ కంట్రోలర్ తిరుమగన్, ప్రొఫెసర్ మదురై వీరన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశన్ దాడి చేసి బయటకు గెంటివేశారు. దీనిని ఖండిస్తూ 20మందికి పైగా విద్యార్థులు వర్సిటీలో ఆందోళనలు జరిపారు. అక్కడికి చేరుకున్న వర్సిటీ నిర్వాహకులు కొందరు ఆందోళనలో పాల్గొన్న వారిపై దాడి జరిపారు. టాంజానియా దేశపు విద్యార్థి పాప్పు కూడా దాడికి గురయ్యారు. ఈ క్రమంలో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ వైస్ చాన్సలర్కు విద్యార్థులు వినతి పత్రం సమర్పించారు. అయితే ఆయన దీనిని నిరాకరించారు. బుధవారం ఎస్ ఎఫ్ ఐ, వర్సిటీ విద్యార్థులు 42 మంది ఫ్రాన్స్, టాంజానియా విద్యార్థులు దాడికి గురవడాన్ని ఖండిస్తూ వర్సిటీలో ఆందోళనలు జరిపారు. ముఖ్యమంత్రి జయలలిత సచివాలయానికి ఆ మార్గం గుండా వెళ్లనుండడంతో ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని బలవంతంగా వారిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఫ్రాన్స్ విద్యార్థి జోనస్పై దాడి గురించి రాయబారి కార్యాలయంలో ఫిర్యాదు అందింది. అన్నావర్సిటీ పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. విదేశీ విద్యార్థుల దాడి గురించి ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం అందిందని, విద్యార్థులపై దాడి గురించి విడివిడిగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం అందింది. -
అదిరేటి డ్రస్సు మేమేస్తే..
భారతీయ సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిన విదేశీ విద్యార్థులు గుంటూరు పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాంప్ వాక్ గుంటూరు ఎడ్యుకేషన్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువతో గుం‘టూరు’ వచ్చిన విదేశీ విద్యార్థులు సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే వస్త్రాలు ధరించి ర్యాంప్వాక్ చేసి ఆకట్టుకున్నారు. యూకే-ఇండియా ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (యూకేఐఈఆర్ఐ) ప్రాజెక్టు కింద ఏఐసీటీఈ సహకారంతో గుంటూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్యాషన్ అప్పారెల్ టెక్నాలజీపై స్కాట్లాండ్కు చెందిన గ్లాస్గో కెల్విన్ కాలేజీ విద్యార్థుల బృందం నాలుగు రోజులుగా శిక్షణ పొందుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన 10 మంది విదేశీయుల బృందం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులతో కలిసి ఆధునిక, సంప్రదాయ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్లో హోయలొలికించారు. గార్మెంట్ మేకింగ్పై పొందిన శిక్షణ ఆధారంగా యూకే విద్యార్థులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు సంయుక్తంగా రూపొందించిన వస్త్రాలను ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి తిలకించారు. అనంతరం స్వదేశీ, విదేశీ విద్యార్థులు ‘ఫ్యాషన్ టెక్స్టైల్ రిఫ్లెక్షన్స్’ పేరుతో ర్యాంప్పై నడుస్తూ అలరించారు. ఉదయలక్ష్మి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన భారతదేశ వస్త్రాలకు విదేశాల్లో గుర్తింపు ఉందన్నారు. విదేశాల నుంచి విద్యార్థులు శిక్షణ పొందేందుకు రావడం శుభ పరిణామమని చెప్పారు. యూకేలోని గ్లాస్గో కెల్విన్ కళాశాల సందర్శనకు పాలిటెక్నిక్ కళాశాల తరపున అధ్యాపక బృందాన్ని పంపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్లాస్గో కెల్విన్ కాలేజీ డెరైక్టర్ ఎలస్టైర్ అండర్సన్ మెక్గే పైస్లీ ప్యాట్రన్ నిపుణుడు డాక్టర్ డాన్ కౌలీన్, ఇరువురు ఫ్యాకల్టీతో పాటు ఆరుగురు విద్యార్థులు, ఎస్బీటీఈటీ కార్యదర్శి నిర్మల్కుమార్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ ప్రతినిధి గజేంద్ర కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ ప్రసాద్, శిక్షణా కార్యక్రమం సమన్వయకర్త బి.నాగమణి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో నిర్మించిన శిక్షణా కేంద్ర నూతన భవనాన్ని కమిషనర్ ప్రారంభించారు. -
లైంగిక వేధింపులు... ప్రొఫెసర్పై వేటు
న్యూఢిల్లీ: విదేశీ రీసెర్చ్ స్కాలర్ను లైంగికంగా వేధించిన కేసులో ప్రసిద్ధ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్పై వేటుపడింది. అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్కు చెందిన పరిశోధనా విద్యార్థినిని వేధించిన ఆరోపణలు నిజమని విచారణ కమిటీ తేల్చడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. జేఎన్యూ ప్రొఫెసర్ దగ్గర బంగ్లాదేశ్కు చెందిన విద్యార్థిని పరిశోధన నిమిత్తం చేరింది. ఈ నేపథ్యంలో పార్టీ కోసమని ఆమెను ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించాడు. అనంతరం ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె యూనివర్సిటీ లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి ఫిర్యాదుచేసింది. తక్షణమే ప్రొఫెసర్ను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ అధికారులు.. విచారణకు ఆదేశించారు. విదేశీ విద్యార్థిని ఆరోపణలపై విచారణ చేపట్టిన కమిటీ అతనిని దోషిగా నిర్ధారించి, చర్యకు సిఫార్సు చేసింది. దీంతో పాలకమండలి అత్యవసర సమావేశంలో తక్షణమే అతని సేవలు రద్దుచేయాలని నిర్ణయించామని యూనివర్సిటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
విదేశీయులపై నిఘా
ఎఫ్ఆర్ఆర్ఓతో పూర్తి సమన్వయం ఇతర విభాగాల నుంచీ సమాచారం వారి డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ సన్నాహాలు చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ సిటీబ్యూరో: నైజీరియాకు చెందిన సోలా, శ్యాంసన్ ఎబూపా, అటోబ్ బోషా కెల్విన్, ఉజోమ్ ప్రామిస్ 90 గ్రాముల కొకైన్తో ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుబడ్డారు. సోలా గతంలోనూ అనేకసార్లు అరెస్టు కాగా.. ప్రామిస్ వీసా గడువు ముగిసినా ఇక్కడే తిష్టవేశాడు. నైజీరియాకే చెందిన జాన్ ఉకో ఓకొన్ గంజాయితో సెప్టెంబర్లో గచ్చిబౌలి పోలీసులకు చిక్కాడు. గుర్తింపుపత్రాలను తనిఖీ చేయగా... ఇతడి వీసా గడువు ఏడాది క్రితమే పూర్తయినట్టు తేలింది. బహదూర్పుర, ఎస్బీ విభాగం పోలీసులు ఇటీవల పాతబస్తీలోకి కిషన్బాగ్, ఎంఎం పహాడ్, కిస్మత్పూర్ల్లో తనిఖీలు చేపట్టారు. అవసరమైన అనుమతులు లేకుండా శరణార్థులుగా నివసిస్తున్న పలువురు బర్మా దేశీయుల్ని గుర్తించారు. ఇలాంటి ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న నగర నిఘా విభాగం (ఎస్బీ) అధికారులు సిటీలో నివసిస్తున్న విదేశీయులపై పటిష్ట నిఘా ఉంచాలని నిర్ణయించారు. ఇందు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి అదనపు పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డి సన్నాహాలు ప్రారంభించారు. విద్య, ఉపాధి పేరుతో వచ్చి తిష్ట... శరవేగంగా విస్తరిస్తున్న నగరంలో కుప్పతెప్పలుగా విద్య, ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో నిత్యం అనేక మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఇలా వస్తున్న వారిలో సౌతాఫ్రికన్లు ఎక్కువగా ఉంటున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న సౌతాఫ్రికన్లు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్స్లో కీలకపాత్ర పోషిస్తూ పెడ్లర్స్గా మారుతున్నారు. వీరిని గుర్తించి పట్టుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది నగర పోలీసులకు ప్రస్తుతం అందుబాటులో లేవు. వెరిఫికేషన్ మెకానిజం కరువు... ఈ నల్లజాతీయులే కాదు... వివిధ దేశాల నుంచి సిటీకి ఎంత మంది వస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? వీసా గడువు ప్రకారమే నివసిస్తున్నారా? అసలు ఎంతమంది ఉన్నారు? గడువు ముగిశాక తిరిగి వెళ్తున్నారా? అనేవి తనిఖీ చేయడానికి పోలీసు విభాగంలో పక్కా మెకానిజం అంటూ లేదు. నగరానికి వచ్చే ముందు ఓ చిరునామాను ఇచ్చిన విదేశీయుడు ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడా? అసలు అది నిజమైన అడ్రస్సేనా? అనేవి పరిశీలించడం సాధ్యం కావట్లేదు. ఎస్బీ విభాగం ప్రస్తుతం మాన్యువల్గా పని చేస్తుండటంతో పూర్తిస్థాయి నిఘా సాధ్యం కావట్లేదు. ఎఫ్ఆర్ఆర్ఓ రాకతో మరో ఇబ్బంది... ఫారెనర్స్ రిజిస్ట్రేషన్ అనేది కొన్నాళ్ల క్రితం వరకు స్పెషల్ బ్రాంచ్ పరిధిలోనే ఉండేది. ఆపై ఈ బాధ్యతలు కేంద్రం ఆధీనంలోని ఇమ్మిగ్రేషన్ బ్యూరోలోని ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) చేతికి వెళ్లింది. కేవలం బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చే వారి రిజిస్ట్రేషన్లు మాత్రమే స్పెషల్బ్రాంచ్ చేస్తోంది. దీని వల్లా సమస్య ఉత్పన్నం అవుతోంది. మరోపక్క ఐక్యరాజ్య సమితి శరణార్థి గుర్తింపు కార్డులు ఎంత మందికి జారీ చేసిందనేదీ ఎస్బీకి స్పష్టంగా తెలియట్లేదు. ఇదీ విదేశీయులపై నిఘాకు నగర పోలీసులకు అడ్డంకిగా మారుతున్న పరిణామమే. సాంకేతికతతో సమస్యల పరిష్కారం... ఈ తరహా సమస్యలన్నింటికీ సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమించాలని స్పెషల్ బ్రాంచ్ అధికారులు నిర్ణయించారు. సిటీ పోలీసు వద్ద అందుబాటులో ఉన్న విదేశీయుల డేటాతో పాటు ఎఫ్ఆర్ఆర్ఓ, ఇతర ఇమ్మిగ్రేషన్ విభాగాల నుంచీ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించనున్నారు. వీటన్నింటినీ క్రోడీకరిస్తూ డేటాబేస్ ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా సిటీకి ఎందరు, ఏ దేశాలకు చెందిన వారు ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? వీసా గడువు ఏంటి? అనేవి ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ఫలితంగా స్థానిక పోలీసుల సహకారంతో వారిపై నిఘా ఉంచడానికి ఆస్కారం ఏర్పడుతుంది. -
విదేశీ విద్యార్థినికి లైంగిక వేధింపులు
బెంగళూరు : ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతున్న విదేశీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆసుపత్రి సిబ్బంది ఒకరిని ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి 10 మంది విద్యార్థినిలు అధ్యయన పర్యటన నిమిత్తం మైసూరు వెళ్లారు. ఆ క్రమంలో వారిలో ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను మైసూరులోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చికిత్స నిమిత్తం చేరింది. ఈ సమయంలో ఆసుపత్రి సిబ్బంది సుమీత్... ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి... లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సదరు విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన ఎన్ఆర్ పోలీసులు... అనంతరం సుమిత్ని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కి తరలించారు. -
'మంచి' దొంగ పోలీసులకు చిక్కాడు
ప్రయాణాల్లోనూ, టూర్లలోనూ లగేజీ పోగొట్టుకుంటుంటాం. అలాగే వాల్యుబుల్స్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కోసారి ఎక్కడో పెట్టి మర్చిపోవడమో, ఎవరైనా దోచేయడమో జరుగుతుంటుంది. అయితే అటువంటప్పుడు కనీసం బ్యాగ్ దొరికిన వారు అందులోని డబ్బు, బంగారం వంటివి ఇవ్వకపోయినా... పాస్పోర్ట్ సర్టిఫికెట్లు, ఫోన్ డేటా వంటి అత్యవసరమైనవైనా తిరిగి ఇచ్చేస్తే బాగుండునని ఎంతగానో అనుకుంటాం. అయితే దొంగల్లోనూ కొందరు సిన్సియర్లు ఉంటారని, వారు అలాకూడా చేస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా? తాజాగా ముంబైలో అటువంటి ఓ మా మంచి దొంగ పోలీసులకు చిక్కాడు. తనకు కావలసినదేదో తీసుకొని విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను నిజాయితీగా యజమానికి అప్పగించే అలవాటున్న ఆ 61 ఏళ్ళ మంచిదొంగను.. ఓ చోరీకి పాల్పడుతుండగా పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ...ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ఓ 61 ఏళ్ళ వయసున్న వింత దొంగను అరెస్ట్ చేశారు. ఎన్నారైలను మాత్రమే టార్గెట్ చేసి వారివద్ద ఉన్న విలువైన వస్తువులను తస్కరించడంలో మంచి హస్త లాఘవం ఉన్న కిషోర్ సుబ్రహ్మణ్యన్ మద్దాలి అనే దొంగను చాకచక్యంగా పట్టుకొన్నారు. అతనివద్ద నుంచీ ఐదుగురు విదేశీయులకు సంబంధించి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కిషోర్ సుబ్రహ్మణ్యం టార్గెట్ కేవలం ఫారెనర్లే. వారిని తన మాటలతో మస్కాకొట్టించి, నమ్మకం కలిగించి మెల్లగా వారి బ్యాగ్లను కొట్టేయడం కొన్నేళ్ళుగా అతని అలవాటుగా మారింది. అయితే ఆ బ్యాగుల్లో వారికి సంబంధించిన పాస్పోర్టులు వంటివి ఉంటే మాత్రం వారికి ఎలాగైనా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించడం ఈ దొంగగారి ప్రత్యేక లక్షణం. అయితే ఎన్నో ఏళ్ళుగా ఈ వ్యవహారం జరుగుతున్నా బయటపడలేదు గానీ, తాజాగా సౌదీ అరేబియాకు చెందిన దేవదాసన్ శివరామ్ సోనారికి చెందిన పాస్పోర్ట్ ను తిరిగి ఇవ్వడం ఈ మంచిదొంగ పీకకు చుట్టుకుంది. దేవదాసన్ సోనారీ మంగుళూరు ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా బ్యాగ్ ను కొట్టేసిన మద్దాలి... తర్వాత అతని అడ్రస్ ట్రేస్ చేసి మరీ పాస్పోర్టును అందేలా చేశాడు. ''మేం మొత్తం ఐదుగురికి చెందిన విలువైన వస్తువులను మద్దాలి నుంచీ స్వాధీనం చేసుకున్నాం. అతని మరిన్ని దొంగతనాలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నాం. నిందితుడికి తెలుగు, మలయాళం, తమిళ్, ఇంగ్లీష్, హిందీ భాషలతోపాటు మరాఠీ కూడా బాగా తెలుసు. అంతేకాదు అతడు బీఎస్సీ గ్రాడ్యుయేట్ కూడా.'' అని జీఆర్పీ పోలీస్ ఇనస్పెక్టర్ మానిక్ సాథీ తెలిపారు. గతంలో 24 ఏళ్ళ నైజీరియాకు చెందిన రుకో మిగా పాస్పోర్టును కూడ మద్దాలి తిరిగి ఇచ్చేశాడు. అతడు చెన్నై మెయిల్ ఎక్కుతుండగా అతగి బ్యాగ్ను ఓ ల్యాప్టాప్, ఏభై వేల రూపాయల క్యాష్తో పాటు తస్కరించాడు. అయితే ఆ తర్వాత అతడి నెంబర్ యూనివర్శిటీ ద్వారా వివరాలు తెలుసుకొని అతడికి పాస్పోర్ట్ చేరేలా చేశాడు. అయితే తరచుగా వస్తున్న ఫిర్యాదులపై దృష్టి సారించిన పోలీసులు మద్దాలిని పట్టుకునేందుకు వల పన్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో సన్ గ్లాస్లు, క్యాప్ పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గమనించారు. అయితే సీసీ కెమెరాలో క్యాప్, కళ్ళజోడు లేకపోవడంతో అతడు మద్దాలి అవునా కాదా అని కాస్త సంశయించారు. కాపు కాసి సివిల్ డ్రస్లో ఉన్న పోలీసులు ...ఓరోజు పధ్నాలుగో నెంబర్ ప్లాట్ ఫాం పైకి మంగుళూరు ఎక్స్ ప్రెస్ వచ్చిన వెంటనే ఒకరి నుంచి బ్యాగ్ ను కొట్టేందుకు ట్రై చేస్తున్న మద్దాలిని పట్టుకున్నారు. అయితే మద్దాలి బాధితులను బ్రెయిన్ వాష్ చేసిన తీరు మాత్రం పోలీసులకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అతడు దొంగ అంటే నిజానికి బాధితులే నమ్మలేని పరిస్థితి కనిపించడంతో అతడి హస్త లాఘవ నైపుణ్యానికి విస్తుపోయిన పోలీసులు ఎట్టకేలకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడైన మద్దాలి ముంబైలోని టెక్స్టైల్ ఫ్యాక్టరీ లో పనిచేసేవాడు. 58 ఏళ్ళకు మద్దాలి రిటైర్ అయిన తర్వాత తాగుడుకు అలవాటు పడటంతో అతని భార్య కొడుకుతోపాటు అతడిని వదిలి వెళ్ళిపోయింది. చివరికి తాగేందుకు డబ్బులేక మద్దాలి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ముఖ్యంగా విదేశీయులను టార్గెట్ చేసే మద్దాలి... ముందుగా వారిని మాటల్లో పెట్టి, మంచి తనంతో నమ్మించి.. ఆ తర్వాత హెల్స్ చేస్తానంటూ వారు వాష్రూమ్ కు వెళ్ళిన సమయంలో లగేజీ జాగ్రత్తగా చూస్తానంటూ నమ్మించి ట్రైన్ నుంచి పరారయ్యే వాడు. ఇంగ్లీష్ భాషలో ఎంతో కమాండ్ ఉన్నమద్దాలి వారిని ఆ భాషతోనే చాకచక్యంగా బుట్టలో వేసుకొని వారి లగేజీనుంచీ ఓ బ్యాగ్ ను తీసుకొని పరుగు లంకించేవాడు. తాను కూడా ప్రయాణీకుడినంటూ మిగిలిన వారిని నమ్మించేందుకు.. మద్దాలి తన చేతిలో కూడా ఎప్పుడూ ఓ బ్యాగ్ను పట్టుకొని తిరిగేవాడు. -
ముఠా హైదరాబాద్లో.. లూటీ అమెరికాలో!
* కాల్ సెంటర్ ద్వారా విదేశీయులకు కుచ్చుటోపీ * అమెరికా, బ్రిటన్ ముఠా ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరణ * బ్యాంకు రుణం మంజూరు చేస్తామని ఇక్కడ్నుంచి ఫోన్లు * మొదటి వాయిదా ముందే చెల్లించాలంటూ ముగ్గులోకి * సొమ్ము చేతికందగానే ‘హవాలా’ ద్వారా లావాదేవీలు * సూత్రధారి గుజరాత్వాసి.. పాత్రధారులు నగర యువకులు * 14 మందిని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: లాటరీలు, బహుమతుల పేరుతో మోసాలు చూశాం.. ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్స్తో అందినకాడికి దండుకునే నైజీరియన్ ముఠాల చీటింగ్లూ చూశాం..! ఇప్పుడు ఈ గ్యాంగ్లే డంగైపోయే ఘరానా కాల్ సెంటర్ క్రైమ్ హైదరాబాద్లో వెలుగుచూసింది. అమెరికా, బ్రిటన్లోని లండన్లో బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైనవారే లక్ష్యంగా ఈ భారీ మోసానికి తెరదీశారు. రుణం దక్కని వారి వివరాలు సేకరించి ఇక్కడ్నుంచి కథ నడిపించారు. అచ్చంగా అమెరికన్ల తరహాలో ఫోన్లలో మాట్లాడుతూ బురిడీ కొట్టించారు. ‘మీ లోన్ ఓకే అయింది.. అయితే మొదటి వాయిదా ముందే చెల్లించాలి..’ అని అడగడం.. ఆ వాయిదా సొమ్ము చేతికందగానే వాటాలు పంచుకొని మరో కస్టమర్ను వెతుక్కోవడం.. ఇదీ ఈ గ్యాంగ్ చేస్తున్న మోసం! అమెరికా, లండన్కు చెందిన వారిని ఇలా సుమారు రూ.1.5 కోట్లకుపైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన 14 మంది నిందితులను దక్షిణ మండల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి కేసు వివరాలను తెలిపారు. గుజరాత్ టు హైదరాబాద్ వయా పుణె గుజరాత్లోని భావ్నగర్కు చెందిన ఇషాన్ పాఠక్ ఈ మోసానికి సూత్రధారి. మహారాష్ట్రలోని పుణే వాసి రాహుల్ బజాజ్ ద్వారా కొన్నాళ్ల క్రితం నగరానికి చెందిన ఖాదర్ను పరిచయం చేసుకున్నాడు. వీరంతా కలిసి అప్పట్లో కొన్ని ఆన్లైన్ నేరాలు చేశారు. ఇందుకు హైదరాబాద్కు చెందిన కొందరు యువకులను వినియోగించుకున్నారు. ఆ నేరాలు వెలుగులోకి రావడంతో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన ఖాదర్ ప్రస్తుతం దుబాయ్లో స్థిరపడ్డాడు. అప్పట్లో ఖాదర్ దగ్గర సహాయకులుగా పని చేసిన నగర యువకులు ఎంఏ ఖరీద్, నోమన్, సయ్యద్ అబ్దుల్లా, మహ్మద్ అబ్దుల్లతో ఇషాన్ పరిచయాలు కొనసాగించాడు. వారి ద్వారా కాల్ సెంటర్ చీటింగ్కు తెరదీశాడు. బురిడీ కొట్టించారిలా.. ఇషాన్కు అమెరికా, లండన్లో అనుచరులు ఉండటంతో వారి సాయంతో అక్కడి బ్యాంకులకు సంబంధించిన డేటాను హ్యాకింగ్ ద్వారా సేకరించేవాడు. ‘లీడ్స్’గా పిలిచే ఈ వివరాలను అక్కడి ఏజెంట్ల ద్వారా బ్యాంకు సర్వర్లు హ్యాక్ చేయించి ఈ-మెయిల్ రూపంలో తెప్పించుకునేవాడు. 1,000 నుంచి 5 వేల డాలర్ల మధ్యలో రుణానికి దరఖాస్తు చేసుకున్నవారిని గుర్తించేవాడు. ఈ లీడ్స్లో దరఖాస్తుదారుడి పేరు, చిరునామా, సోషల్ సెక్యూరిటీ నంబర్ సహా మొత్తం 40 రకాలైన సమాచారం ఉంటుంది. దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న నలుగురు ఏజెంట్లకూ పంపేవాడు. వారికి కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయించాడు. రెయిన్బజార్లో పర్వేజ్ కాలింగ్ సొల్యూషన్స్, టోలీచౌకిలో క్విక్ క్యాష్ లోన్స్, క్యాష్ సేమ్ డే, పంజగుట్టలో ఏబీ కాలింగ్ సొల్యూషన్స్ పేరిట వీటిని ఏర్పాటు చేశాడు. వీటిలో కొందరు ఉద్యోగుల్ని సైతం నియమించుకున్నారు. వారికి అమెరికా, లండన్ వాసులతో ఎలా మాట్లాడాలనే అంశంపై 15 రోజులపాటు శిక్షణ ఇచ్చేవాడు. గ్యాంగ్ సభ్యులందరికీ ఆయా దేశాల్లోని పేర్లను మారుపేర్లుగా పెట్టారు. ఆయా దేశాల్లో బ్యాంకులు పనిచేసే సమయాల్లోనే ‘కస్టమర్ల’కు కాల్స్ చేసే వారు. హైదరాబాద్కు చెందిన నంబర్ల నుంచి కాల్ చేస్తే అనుమానించే అవకాశం ఉండడంతో.. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐబీమ్, ఎక్స్-లైట్, సాఫ్ట్ఫోన్ అనే సాఫ్ట్వేర్లను వినియోగించారు. వీటి ద్వారా కాల్ చేస్తే దాన్ని రీసీవ్ చేసుకునే వ్యక్తి ఏ దేశానికి చెందిన వాడైతే అక్కడి లోకల్ నంబర్ అతడికి డిస్ప్లే అయ్యేలా చేయవచ్చు. వెయ్యి డాలర్లకు 110 డాలర్ల వాయిదా ముఠా సభ్యులు ఆంగ్ల పేర్లతో అక్కడి కస్టమర్లను పరిచయం చేసుకునేవారు. ‘లీడ్స్’లో ఉన్న వివరాలను చెప్పేవారు. దీంతో తాము దరఖాస్తు చేసిన బ్యాంకు నుంచే ఫోన్ వచ్చినట్లు అవతలి వారు భ్రమపడే వారు. బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకుని రుణం మంజూరైందని, నెలసరి వాయిదా ఎంతో చెప్పి, చెల్లించగలరా అని అడిగేవాడు. వారు అంగీకరించగానే.. కస్టమర్ కాల్ను అధికారికి కనెక్ట్ చేస్తున్నట్లు చెప్పి మరో ముఠా సభ్యుడికి ఇచ్చేవాడు. ‘మీకు ముందు రుణం మంజూరు చేసేస్తాం. రెండ్రోజుల్లో సంతకాలు తీసుకుంటాం. అయితే మీ చెల్లింపు సామర్థ్యం తెలుసుకోవాలి. ఇందుకు మొదటి విడత వాయిదా ముందే చెల్లించండి’ అంటూ ముగ్గులోకి దింపేవాడు. వెయ్యి డాలర్ల రుణానికి నెలకు 110 డాలర్ల చొప్పున ఇన్స్టాల్మెంట్ చెల్లించాలని కోరేవాడు. వాయిదాను ఈజీ క్యాష్ రూపంలోనే చెల్లించాలని చెప్పేవారు. ఈజీ క్యాష్ ద్వారా లావాదేవీలు అమెరికా, బ్రిటన్లో యూ-క్యాష్, గ్రీన్డాట్ కార్డ్ వంటి ఈజీ క్యాష్ లావాదేవీలు నడుస్తాయి. వీటికి సంబంధించిన ఔట్లెట్స్లో వినియోగదారులు నగదు చెల్లిస్తారు. కొంత కమీషన్ తీసుకుని నిర్వాహకులు 14 నుంచి 16 సంఖ్యలతో ఉండే కార్డు నంబర్, సీవీవీ నంబర్ ఇస్తారు. వీటిని ఆ కస్టమర్లు ముఠా సభ్యులతో ఫోన్లో చెప్పేవారు. ఈ వివరాలన్నీ ఇషాన్కు చేరేవి. అతడు వీటిని అమెరికాలో ఉండే ఏజెంట్లకు పంపి తక్షణం నగదు డ్రా చేయించేవాడు. వాళ్లు కమీషన్ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని హవాలా రూపంలో ఇషాన్కు చేరవేసేవారు. అతడు హైదరాబాద్లోని ఏజెంట్లకు 40 శాతం కమీషన్ను హవాలా ద్వారానే పంపేవాడు. నగదు పంపిన కస్టమర్ నంబర్ను బ్లాక్ చేసి సంప్రదింపులు నిలిపివేసేవారు. బాధితులంతా అక్కడివారు కావడంతో ఇక్కడ ఎలాంటి ఫిర్యాదులు ఉండేవి కాదు. డొంక కదిలిందిలా..: బుధవారం పాతబస్తీ లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా చిక్కా రు. పేర్లు చెప్పమని అడగ్గా.. వారు బిన్ హాప్కి న్స్, జాసన్ స్మిత్గా చెప్పారు. అయితే స్థానికులుగా ఉన్న వీరు విదేశీయుల పేర్లు చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించ గా.. మొత్తం వ్యవహారం బయటపడింది. పోలీసులు 4 కాల్ సెంటర్లపై దాడులు చేసి 14 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఇషాన్, రాహుల్ సహా నిందితుల్ని పట్టుకోవడానికి కేసును సీసీఎస్కు అప్పగించనున్నారు. పోలీసులకు చిక్కిన నిందితులు, వారి మారు పేర్లు 1. మహ్మద్ అబ్దుల్ పర్వేజ్-జాసన్ స్మిత్ 2. బాసిత్ అలీ అలియాస్ అర్షద్-బిన్ హాప్కిన్స్ 3. సయ్యద్ అఫ్సాన్ ఉల్ ఇస్లాముద్దీన్ అలియాస్ నౌమన్-కీత్ బ్రౌన్ 4. సయ్యద్ ముదసర్ మోయినుద్దీన్ అలియాస్ నౌషాద్-డేవిడ్ హోమ్స్ 5. ఎంకే ఖదీర్-రోగర్ బ్యాంక్స్ 6. వాసిర్ ఆసిఫ్-సామ్ విల్సన్ 7. వసీమ్ అహ్మద్-జాక్ స్మిత్ 8. సౌద్ అహ్మద్-అస్టిన్ మార్క్ 9. మహ్మద్ ఖయూమ్-కెవిన్ కూపర్ 10. షేక్ జునైద్-జేమ్స్ స్మిత్ 11. సయ్యద్ అబ్దుల్లా-స్టౌర్ట్ బ్రౌన్, ఫ్రాంక్ జోర్డాన్ 12. మహ్మద్ ఇంతియాజ్-స్టీవ్ జోనిస్ 13. సయ్యద్ సల్మాన్-డేవిడ్ వైట్ 14. రవితేజ-బీన్ హాకిన్స్ -
చేతిరాత పాస్పోర్ట్ చెల్లదిక!
నవంబర్ 24 తర్వాత వీటిని అనుమతించరు సాక్షి, హైదరాబాద్: చేతిరాతతో జారీ చేసిన పాస్పోర్ట్లు ఇకపై చెల్లుబాటు కావు. వాటిని తీసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే విదేశాలకు వెళ్లేందుకు చేతిరాత పాస్పోర్ట్లు అనుమతించరు. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) విదేశాంగ శాఖకు సూచించింది. ఈ నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల పాస్పోర్ట్ కార్యాలయాలకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం జారీ అయ్యే మెషిన్ రీడబుల్ (యంత్రాల ఆధారంగా రూపొందించిన) పాస్పోర్ట్లు పదేళ్ల కాలపరిమితికి ఇస్తున్నారు. 2001 ఏడాదికి ముందు హ్యాండ్ రిటన్ (చేతిరాత)తో పాస్పోర్ట్లు జారీ చేశారు. అప్పట్లో కొంతమంది 20 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నారు. ఆ తరహా చేతిరాత పాస్పోర్ట్లు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఇలాంటి పాస్పోర్ట్లు 2015 నవంబర్ 24 వరకే చెల్లుబాటవుతాయి. ఆ తర్వాత వీటికి వీసా ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఏడాది ముందే దరఖాస్తు చేసుకోవచ్చు.. చాలా దేశాలు పాస్పోర్ట్ గడువు 6 మాసాల కంటే తక్కువ ఉన్నప్పుడు ప్రయాణానికి అనుమతించవు. అందుకే పదేళ్ల పాస్పోర్ట్ కాలపరిమితిలో తొమ్మిదేళ్లు పూర్తవగానే రెన్యువల్ చేసుకోవాలి. పాస్పోర్టు బుక్లెట్లో 2పేజీలకి మించి లేకపోతే చాలా దేశాలు అనుమతించ వు. తరచూ విదేశీ ప్రయాణాలు చేసేవారు జంబోబుక్లెట్కు దరఖాస్తు చేసుకోవాలి. - అశ్విని సత్తారు, హైదరాబాద్ పాస్పోర్ట్ అధికారిణి -
'రాత్రికి రాత్రే హీరోలయ్యారు'
న్యూఢిల్లీ: వారంతా ఓ పార్క్లో సాయంత్రం పూట సరదాగా ఫుట్ బాల్ ఆడుకునే పిల్లలు. వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కూడా. కానీ అనుకోకుండా రాత్రికి రాత్రే పెద్ద హీరోలయ్యారు. ఢిల్లీ అంతటా శబాష్ యువత అనిపించుకుంటున్నారు. ఓ విదేశీయురాలిని రక్షించడమే వారికి హీరోలు అనే బిరుదును ఇచ్చేలా చేసింది. గత ఆగస్టులో ఢిల్లీలో ఓ రాత్రి పూట ఓ విదేశీయురాలు నడుచుకుంటూ వెళుతోంది. రోడ్డుకు ఇరువైపుల కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అనూహ్యంగా ఓ యువకుడు కొంత దూరం ఆమెను అనుసరించి చుట్టూ ఎవరూ లేరనుకోని ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు. ఆమె సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించే క్రమంలో పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో ఆ మహిళ రక్షించండంటూ కేకలు పెట్టింది. ఈ కేకలు విన్న కుర్రాళ్లు వెంటనే ఫెన్సింగ్ గోడ దూకి వచ్చారు. వారు వస్తున్నది గమనించి ఫోన్ దొంగతనానికి ప్రయత్నించిన యువకుడు పారిపోయాడు. అయితే, అతడు దూరంగా పారిపోయినట్లు నటించి ఓ కారు వెనకాలే దాక్కున్నాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు అదే గుంపులో కలిశాడు. అయిన పసిగట్టిన యువకులు అతడిని కొట్టి బందించి పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. -
విదేశీ విద్యార్థులకు ఆరేళ్ల వర్క్ పర్మిట్
సెనేట్ కమిటీకి అమెరికా సర్కారు ప్రతిపాదన వాషింగ్టన్: వీలైనంత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు అమెరికా అడుగులేస్తోంది. కొన్ని రకాల నైపుణ్య కోర్సుల్లో చేరే విదేశీ విద్యార్థులకు ఏకంగా ఆరేళ్ల వర్క్ పర్మిట్ ఇవ్వాలని ఒబామా సర్కారు యోచిస్తోంది. దీనివల్ల భారతీయ విద్యార్థులకే ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం కోర్సులను ‘ఎస్టీఏఎం(స్టెమ్)’గా పిలుస్తారు. వీటిలో చేరే విద్యార్థులకు ఆరేళ్ల వీసా ఇస్తారు. దీంతో మూడేళ్ల డిగ్రీ కోర్సులు పూర్తికాగానే మరో మూడేళ్లు పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ డిగ్రీలు పూర్తి చేసే విదేశీ విద్యార్థులకు 12 నెలల వర్క్ పర్మిటే ఇస్తున్నారు. స్టెమ్ విద్యార్థులకు మరో 17 నెలల అదనపు సమయం లభిస్తోంది. వీరికి మూడేళ్ల గడువు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సెనేట్ జ్యుడీషియరీ కమిటీకి ప్రతిపాదించింది. అయితే ఈ కమిటీకి చైర్మన్గా ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత, సెనేటర్ చక్ గ్రాస్లీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త ప్రతిపాదనలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని, ప్రమాదకరమని, ఈ కార్యక్రమంలో మోసాలు జరిగే అవకాశముందంటూ అంతర్గత భద్రతా కార్యదర్శికి లేఖ రాశారు. -
జూన్ 3న కేటీఆర్ విదేశీ పర్యటన
హైదరాబాద్: ఎల్లుండి(బుధవారం) తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఐదు రోజులపాటు విదేశీపర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తైవాన్, హాంకాంగ్, మలేషియాలలో పర్యటించనున్నారు. జూన్ 3న విదేశీపర్యటనకు బయలుదేరి ఆయా దేశాల్లోని హార్డ్ వేర్ పార్కులు, కంపెనీలను మంత్రి సందర్శించనున్నారు. -
ఇంటర్తోనే విదేశీ ఇంజనీరింగ్!
విదేశీ విద్య/స్టడీ అబ్రాడ్ అనగానే సాధారణంగా ఎంఎస్, ఎంటెక్, ఎంబీఏ వంటి పీజీ స్థాయి కోర్సులే గుర్తుకొస్తాయి. ఏటా దాదాపు 2 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు విదేశీ విద్య కోసం పయనమవుతున్నారు. చాలామంది మన దేశంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే విదేశీ విద్య దిశగా ఆలోచిస్తారు. కాని ఇప్పుడు స్వదేశంలోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో తీవ్ర పోటీ.. విదేశాల్లో ఓ మాదిరి ఫీజులు, స్కాలర్షిప్లతో తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్య లభిస్తుండటంతో బ్యాచిలర్ స్థాయిలోనే ఫారిన్ ఎడ్యుకేషన్ వైపు అడుగులేస్తున్నారు. +2/ఇంటర్మీడియెట్ తర్వాత విదేశీ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఇప్పుడు భారతీయ విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రత్యామ్నాయంగా మారుతోంది. అండర్గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులకు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, జర్మనీ బెస్ట్ డెస్టినేషన్స్గా నిలుస్తున్నాయి. ఫాల్ సెషన్ (ఆగస్టు/సెప్టెంబర్) అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో.. ఇంటర్ అర్హతతో స్టడీ అబ్రాడ్ బీటెక్పై ఆయా దేశాల వారీగా విశ్లేషణ... అమెరికా.. అందరి చూపు అటే! విదేశీ విద్య, విదేశీ అవకాశాల కోసం ప్రతి ఒక్కరూ చూసేది అమెరికావైపే! అందుకే విదేశీ విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం అమెరికా. అమెరికాలోని పబ్లిక్, ప్రైవేట్ యూనివ ర్సిటీల సంఖ్య అక్షరాల నాలుగు వేలు. దాదాపు ప్రతి అమెరికన్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ప్రోగ్రామ్ అందిస్తోంది. మన దేశంలో బీటెక్గా పిలిచే కోర్సులను అక్కడ బీఎస్గా పేర్కొంటారు. నాలుగేళ్ల వ్యవధిలో ఉండే బ్యాచిలర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. 10+2తోపాటు స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(శ్యాట్), ఐఈఎల్టీఎస్/టోఫెల్లో మంచి స్కోర్లు ఉండాలి. ఇక కోర్సు ఫీజులు పబ్లిక్ ఇన్స్టిట్యూట్లలో ఎనిమిది వేల నుంచి 15 వేల డాలర్ల మధ్యలో; ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో 10 వేల డాలర్ల నుంచి 20 వేల డాలర్ల మధ్యలో ఉంటాయి. అమెరికాలోని ఇన్స్టిట్యూట్లలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆయా ఇన్స్టిట్యూట్లు, ఎడ్యుకేషన్ ట్రస్ట్లు పలు స్కాలర్షిప్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. అమెరికాలో అండర్గ్రాడ్యుయేట్ స్థాయి ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్), స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఎంజెల్స్ (యూసీఎల్ఏ), కార్నెగి మెలాన్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీ, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తదితర వర్సిటీలకు మంచి పేరుంది. కొన్ని ముఖ్య స్కాలర్షిప్స్: ఫుల్బ్రైట్ ఫారెన్ స్టూడెంట్ ప్రోగ్రామ్ రోటరీ ఇంటర్నేషనల్ అంబాసిడరియల్ స్కాలర్షిప్స్ జేఎన్ టాటా ఎండోమెంట్ యూకే... మరో మంచి గమ్యం విదేశాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సు ఔత్సాహికులకు మరో మంచి గమ్యం.. యూకే. ప్రతి ఏటా సెప్టెంబర్/అక్టోబర్లలో అకడమిక్ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇందుకోసం కనీసం ఆరు నెలల ముందుగానే కసరత్తు ప్రారంభించాలి. సెప్టెంబర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు జూన్లో ముగుస్తుంది. ఇక్కడి ఇన్స్టిట్యూట్లలో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లకు సంబంధించి మరో ప్రత్యేక అంశం ఉమ్మడి ప్రవేశ విధానం. ఇందుకోసం యూనివర్సిటీస్ కాలేజెస్ అడ్మిషన్ సిస్టమ్(యూసీఏఎస్) అనే ప్రత్యేక సంస్థ ఉంది. అండర్గ్రాడ్యుయేట్ ఔత్సాహికులు యూసీఏఎస్ ద్వారానే తమ దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. అకడమిక్ అర్హతలతోపాటు శాట్, టోఫెల్, ఐఈఎల్టీఎస్ స్కోర్లు తప్పనిసరి. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వ్యయం ఇన్స్టిట్యూట్ల విధానాల మేరకు 7,500 పౌండ్ల నుంచి 22 వేల పౌండ్ల మధ్యలో ఉంటుంది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. యూకేలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్(యూసీఎల్), యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హమ్, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ తదితర విశ్వవిద్యాలయాలకు మంచి పేరుంది. యూకేలోని విదేశీ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అవి.. కామన్వెల్త్ స్కాలర్షిప్ అండ్ ఫెలోషిప్ ప్లాన్ చార్లెస్ వాలేస్ ఇండియా ట్రస్ట్ అవార్డ్స్ అండ్ ఫెలోషిప్స్ ఫెలిక్స్ స్కాలర్షిప్స్ బ్రెండిష్ ఫ్యామిలీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ వెబ్సైట్: www.educationuk.org ఆస్ట్రేలియా.. పెరుగుతున్న అవగాహన విదేశాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సును అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులు ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా పట్ల ఆసక్తి చూపుతున్నారు. కోర్సుల ఎంపికలో విద్యార్థికి ఇక్కడ ఎంతో వెసులుబాటు ఉంటుంది. మేజర్స్, డబుల్ మేజర్స్, మైనర్స్ ఇలా విస్తృత స్థాయిలో ఆఫ్షన్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సు నాలుగే ళ్లలో పూర్తవుతుంది. ఇన్స్టిట్యూట్ల నిబంధనల మేరకు ట్యూషన్ ఫీజు 9 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 14 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల మధ్య ఉంటోంది. +2 లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఐఈఎల్టీఎస్/టోఫెల్ స్కోర్ తప్పనిసరి. ఐఈఎల్టీఎస్లో 6 పాయింట్లకుపైగా స్కోరు సాధించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడి కోర్సులకు ప్రతి ఏటా రెండుసార్లు (ఫిబ్రవరి/జూలై) అడ్మిషన్లు జరుగుతాయి. కనీసం ఆరు నెలల ముందుగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకుంటే.. ప్రవేశాల పరంగా ముందంజలో ఉండొచ్చు. ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ అండర్గ్రాడ్యుయేట్ కోర్సులను అందించడంలో యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్వేల్స్ తదితర వర్సిటీలకు మంచి పేరుంది. వెబ్సైట్: www.studyinaustralia.gov.au న్యూజీలాండ్ తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్న దేశం.. న్యూజిలాండ్. దాదాపు 25పైగా పబ్లిక్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉన్న న్యూజీలాండ్లో.. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును మన కరెన్సీలో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలోపే పూర్తి చేయొచ్చు. ఇటీవల కాలంలో మన దేశం నుంచి విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2012-13 విద్యా సంవత్సరంలో దాదాపు పది వేల మంది భారతీయ విద్యార్థులు న్యూజీలాండ్లోని యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పీహెచ్డీ వరకు పలు కోర్సులు అభ్యసించారు. వెబ్సైట్: www.enz.gov.nz సింగపూర్ విదేశీ విద్యార్థులకు బెస్ట్ డెస్టినేషన్గా మారుతున్న ఆసియా ఖండంలోని దేశం.. సింగపూర్. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ఇక్కడి ఇన్స్టిట్యూట్లు ప్రామాణికంగా మారుతున్నాయి. నాలుగేళ్ల వ్యవధిలో ఉండే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. 10+2తోపాటు శాట్ స్కోర్ తప్పనిసరి. ఏడాదికి 24 వేల డాలర్ల నుంచి 30 వేల డాలర్లలోపు ఫీజులు ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడి పబ్లిక్ యూనివర్సిటీలు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలకు.. ప్రతిష్టాత్మక డ్యూక్ యూనివర్సిటీ, జార్జియా టెక్ యూనివర్సిటీ, ఎంఐటీ వంటి ఇన్స్టిట్యూట్లతో అకడమిక్ ఒప్పందాలు ఉన్నాయి. ఫలితంగా ఈ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులకు ఒకే సమయంలో రెండు అంతర్జాతీయ సర్టిఫికెట్లు పొందే అవకాశం లభిస్తుంది. కెనడా అమెరికా, యూకే లాంటి దేశాలతో పోల్చుకుంటే కెనడా ఇమ్మిగ్రేషన్కు అనుకూలం. అందుకే ఈ దేశం అంతర్జాతీయ విద్యార్థులకు అధికంగా ఆకట్టుకుంటోంది. గతేడాదితో పోలిస్తే ఈ దేశ యూనివర్సిటీల్లో చేరే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా 50 శాతం పెరిగింది. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సులకు అంతర్జాతీయంగా క్రేజ్ పెరుగుతున్న దేశం కెనడా. ఇంటర్మీడియెట్తోపాటు ఐఈఎల్టీఎస్/టోఫెల్ స్కోర్తో ఇక్కడి నాలుగేళ్ల ఇంజనీరింగ్ బ్యాచిలర్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఇతర దేశాలతో పోల్చితే ఇక్కడ ఇన్స్టిట్యూట్లకు ప్రభుత్వ నిధులు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు ట్యూషన్ ఫీజుల భారం తక్కువే. మరోవైపు అకడమిక్గా ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ల నుంచి స్కాలర్షిప్ సదుపాయాలు కూడా లభిస్తాయి. వీటితోపాటు మన దేశంలోని ప్రముఖ సంస్థలు కూడా స్కాలర్షిప్స్ పేరిట ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయి. కెనడాలో ఇంజనీరింగ్ అండర్గ్రాడ్యుయేట్ కోర్సులను అందించడంలో వాటర్లూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టొరెంటో, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, మెక్గిల్ యూనివర్సిటీ, మెక్ మాస్టర్ యూనివర్సిటీలకు మంచి పేరుంది. Ððl»Œæ-OòÜsŒæ: www.educationauincanada.ca, www.studycanada.ca జర్మనీ.. పరిశోధనల దిశగా పునాది భవిష్యత్తులో పరిశోధనలు చేయాలనుకునే విద్యార్థులకు బీటెక్ స్థాయి నుంచే బలమైన పునాదులు వేసుకునే అవకాశం కల్పిస్తున్న దేశం.. జర్మనీ. మూడు వందలకుపైగా యూనివర్సిటీలు ఉన్న ఈ దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫీజుల పరంగానూ విద్యార్థులకు ఎంతో వెసులుబాటు లభిస్తోంది. అన్ని యూనివర్సిటీలకు ప్రభుత్వ నిధులు సమకూరుతున్నాయి. దీంతో ఫీజు వ్యయం చాలా తక్కువ. వెబ్సైట్: www.daad.de బెస్ట్ కోర్సు.. బెటర్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం భారతీయ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే పలు దేశాల్లో ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసించే అవకాశం లభిస్తోంది. అయితే విద్యార్థులు బెస్ట్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ కోర్సు పరంగా పరిశోధన చేయాలి. తాము చేరాలనుకుంటున్న ఇన్స్టిట్యూట్కు సదరు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో ఆయా దేశాల అధికారిక వెబ్సైట్స్ ద్వారా తెలుసుకోవాలి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు 10+2 ఉత్తీర్ణతతోపాటు శాట్, టోఫెల్, ఐఈఎల్టీఎస్ వంటి పరీక్షల స్కోర్లు కూడా దరఖాస్తు చేసుకునే సమయానికి ఉండాలి. సదరు టెస్ట్లకు పదో తరగతి పూర్తయినప్పటి నుంచే సిద్ధం కావడం వల్ల సరైన సమయంలో ఆశించిన గమ్యం దిశగా అడుగులు వేయడానికి వీలవుతుంది. - తేజస్వి, డెరైక్టర్, ఫస్ట్ అకాడమీ ఆర్థిక చేయూత..: విదేశాల్లో బ్యాచిలర్ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సు అభ్యసించాలనుకునే విద్యార్థులకు.. తాము ప్రవేశం పొందిన ఇన్స్టిట్యూట్లతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు స్కాలర్షిప్ల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయి. ప్రస్తుతం విద్యార్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన స్కాలర్షిప్స్.. కామన్వెల్త్ స్కాలర్షిప్స్; ఫుల్బ్రైట్ నెహ్రూ స్కాలర్షిప్; ఇన్సీడ్ స్కాలర్షిప్స్; అ ఖీఅఖ ఇండియా యూత్ స్కాలర్షిప్; టోఫెల్ స్కాలర్షిప్స్; ఐఈఎల్టీఎస్ స్కాలర్షిప్స్; బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్; డాక్టర్ మన్మోహన్ సింగ్ స్కాలర్షిప్స్; జేఎన్ టాటా స్కాలర్షిప్ స్కీం టెస్ట్ స్కోర్స్ ముఖ్యం విదేశాల్లో బీటెక్ ఔత్సాహికులకు అకడమిక్ అర్హతలతోపాటు స్టాండర్ట్ టెస్ట్ స్కోర్స్ కూడా ఎంతో ముఖ్యం. అమెరికాలోని కొన్ని ఇన్స్టిట్యూట్లు శాట్ సబ్జెక్ట్ పేపర్ స్కోర్ను కూడా తప్పనిసరి ప్రామాణికంగా పేర్కొంటున్నాయి. ఔత్సాహికులు +1/11వ తరగతిలో చేరిన రోజు నుంచే ప్రిపరేషన్ సాగించాలి. ప్రస్తుత ట్రెండ్ను పరిగణనలోకి తీసుకుంటే శాట్లో కనీసం 1500 ఉంటేనే ఫలితం ఆశాజనకం. - డి.రవి, మేనేజర్, ప్రిన్స్టన్ రివ్యూ, హైదరాబాద్ బ్రాంచ్ -
మద్యం మత్తులో పట్టుబడ్డ విదేశీ విద్యార్థులు
శామీర్పేట్: రంగారెడ్డి జిల్లా శామీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని లియోనియా రిసార్టులోని లియోక్లబ్లో నిబంధనలను ఉల్లంఘించిన 19 మంది విదేశీ యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుడాన్, సోమాలియా, నమీబియా, నైజీరియా, టాంజానియా, కెమారాన్, యుగాండాలకు చెందిన ఎనిమిది మంది యువతులు, 11 మంది యువకులు నగరంలోని పలు కాలేజీల్లో చదువుకుంటున్నారు. వీరంతా లియోక్లబ్లో వీకెండ్ పార్టీకి వచ్చారు. అర్ధరాత్రి తర్వాత నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగుతూ డీజీహోరులో నృత్యం చేస్తుండగా మాదాపూర్ ఎస్వోటీ, శామీర్పేట్ పోలీసులు క్లబ్పై దాడి చేసి పట్టుకున్నారు. నిర్వాహకులు జమాసిమాదాణియా, భరద్వాజ్లను అదుపులోకి తీసుకున్నారు. -
రిసార్ట్స్పై దాడి, యువతీ యువకుల అరెస్ట్