Foreigner
-
రుచుల రివ్యూ.. సిటీకి క్యూ
విభిన్నమైన ఆహార పదార్థాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్... ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను చారిత్రక విశేషాల ద్వారా మాత్రమే కాకుండా చవులూరించే ఘుమఘమల ద్వారా కూడా ఆకర్షిస్తోంది. అలా వచ్చి వెళ్లేవారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న అనుభవాలు పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. సిటీ రుచులకు సంబంధించి ఉన్న అభిప్రాయాలపై చర్చోపచర్చలకు దారి తీస్తున్నాయి. నగరానికి ఉన్న గొప్ప వంటల వారసత్వం పుణ్యమాని.. మొఘలాయ్, తెలుగు హైదరాబాదీ రుచులను మిళితం చేసిన సిటీ ఫుడ్ వెరైటీ రుచులను ఇష్టపడే ఎవరికైనా ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. బిర్యానీల నుంచి ఇరానీ చాయ్ వరకు, బిస్కెట్ల నుంచి డబుల్ కా మీఠా వరకూ.. ఆహార ప్రియులకు హైదరాబాద్ స్వర్గధామం. ఈ నేపథ్యంలో నగరాన్ని సందర్శించే చాలా మంది విదేశీ సందర్శకులు సిటీ ఫుడ్ని ఎంజాయ్ చేయడం సోషల్ మీడియాలో స్పందనను పంచుకోవడం కూడా పరిపాటిగా మారింది. స్కాట్లాండ్ సే ఆయే మేరా దోస్త్.. సాధారణంగా నగరాన్ని సందర్శించే విదేశీయులు మన రుచుల్ని పొగుడుతూనో, లేదా అరుదుగా బాగోలేదు అనో ఒక్క ముక్కలో తేల్చేస్తారు. అయితే తాజాగా ఒక (స్కాట్లాండ్) స్కాటిష్ ట్రావెలర్ మాత్రం భిన్నంగా స్పందించి సోషల్ మీడియాలో తన పోస్ట్ల ద్వారా సిటీ ఫుడీస్ని ఆకర్షించాడు. స్కాటిష్ అయిన హ్యూ అబ్రాడ్ అనే విదేశీయుడు నగరాన్ని సందర్శించాడు. నగర ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ప్రసిద్ధ వంటకాలు రుచి చూశాడు. అనంతరం వీటిని అందిస్తున్న హోటల్స్ రెస్టారెంట్స్పై తనదైన రీతిలో వీడియో పోస్టులు చేశాడు. అయితే ఇవి ఏదో యథాలాపంగా చేసినట్టు కాకుండా ఈ పోస్టులు చాలా వరకూ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రేటింగ్స్ సైతం.. హ్యూ అబ్రాడ్ తన వీడియోలలో హోటల్ షాదాబ్లో అందించే ప్రసిద్ధ హైదరాబాదీ బిర్యానీని తాను రుచి చూసినట్లు తెలిపాడు. ఆ రుచి అమోఘం అంటూ మెచ్చుకుని షాదాబ్ బిర్యానీకి 10/10 రేటింగ్ ఇచ్చాడు. అదే సమయంలో అనేక మంది ఇష్టంగా తినే నిమ్రా కేఫ్లోనిఉస్మానియా బిస్కెట్ రుచిని మాత్రం తీసిపారేశాడు. అదొక ‘డ్రై’గా అతను పోస్ట్లో పేర్కొన్నాడు. అలాగే షహ్రాన్ హోటల్ కబాబ్ల కోసం మొజాంజాహీ మార్కెట్ను సందర్శించాడు. అక్కడి బోటీ, కబాబ్ రుచికరమైందిగా అంటూనే.. అందులో ఒక కబాబ్ ముక్కలో వైర్ను కనుగొనడంతో తానిచ్చే రేటింగ్ నుంచి ఒక పాయింట్ తగ్గించాడు. అదేవిధంగా మొజాంజాహీ మార్కెట్లోని ఒక దుకాణంలో పిస్తా ఐస్క్రీమ్ను కూడా టేస్ట్ చేసి ‘నేను ఇప్పటి వరకు రుచి చూసిన వాటిలో అత్యంత నకిలీ పిస్తా’ ఇది అంటూ విమర్శించాడు. రుచి అతి కృత్రిమంగా ఉందని దానికి 3/10 రేటింగ్ ఇచ్చాడు. ఇంకా ఇరానీ చాయ్, బిస్కెట్లు, బుర్హాన్పూర్ ఖోవా జిలేబి, మిలన్ జ్యూస్ సెంటర్లోని షెహదూద్ మలై ఇంకా ఇతర స్ట్రీట్ ఫుడ్స్పై కూడా ఇలాగే రివ్యూలను, రేటింగ్స్ను రివ్యూ అందించాడు. లైక్స్.. కామెంట్స్.. స్కాట్లాండ్వాసి హ్యూ అబ్రాడ్ పోస్టులకు నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది. అనేక మంది ఈ వీడియోలను లైక్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియోల శ్రేణి హైదరాబాదీల మధ్య పరస్పరం చర్చకు సైతం దారి తీసింది. చాలామంది స్థానికులు ఆ పోస్టుల్లో నిజాయితీ ఉందని ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం అతను నగరంలోని మరింత ఉత్తమమైన, మరింత ప్రమాణాలు పాటించే ఆహార కేంద్రాలను సందర్శించలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు సిటీ వంటకాల నిజమైన సారాన్ని అందించే మరికొన్ని వంటలు, వాటి చిరునామాలను సూచించారు. అంతేకాదు స్థానిక భాషలో విక్రేతలతో ఎలా సంభాíÙంచాలనే దానిపై చిట్కాలను కూడా అతడికి అందించారు. ఏదేమైనా మన రుచులపై విదేశీయుల అభిప్రాయాలకు దక్కుతున్న స్పందనకు స్కాటిష్ టూరిస్ట్ పోస్టులు అద్దం పట్టాయని చెప్పొచ్చు. -
ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే
ఖాట్మాండు: అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని పర్వతారోహకులు కలలుగంటుంటారు. అలాంటి వారికి నేపాల్ ప్రభుత్వం ఒక చేదువార్త వినిపించింది. ఇకపై ఎవరెస్ట్ శిఖర అధిరోహణ అత్యంత ఖరీదైనదిగా మారబోతోంది.ఎవరెస్ట్ను అధిరోహించడానికి విదేశీయులు ఇకపై దాదాపు 21 లక్షల రూపాయలు, అంటే ఐదు లక్షల నేపాలీ రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో విదేశీయులు ఇందుకోసం రూ. 15,17,780 రుసుము చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు దానిని రూ. 20,69,676కి పెంచారు.నేపాల్ ప్రభుత్వం పర్వతారోహణ మాన్యువల్ను ఆరోసారి సవరించింది. ఇటీవల జరిగిన నేపాలీ క్యాబినెట్ సమావేశంలో పర్వతారోహణ నియమాలను సవరిస్తూ, అధిరోహణ రుసుమును పెంచింది. ఈ కొత్త నియమం 2025, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ్ రెగ్మి మీడియాకు తెలిపారు. ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల కారణంగా చెత్త పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త సవరణల ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులకు బీమా, ఇతర నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం పర్వతారోహణ గైడ్లు, ఎత్తయిన ప్రదేశాలలో పనిచేసే కార్మికులు, సామాను క్యారియర్లకు రోజువారీ భత్యం, బీమా రేట్లు పెంచారు. నూతన రికార్డులు సృష్టించే లక్ష్యంతో ఎవరెస్ట్ ఎక్కే అధిరోహకులు తమ పూర్తి వివరాలను సంబంధిత ప్రభుత్వశాఖకు సమర్పించాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ తొలి వారం రివ్యూ.. అమెరికాలో ఏం మారింది? -
భారతీయ సంస్కృతిపై విదేశీయుల ఆసక్తి
సాక్షి, పుట్టపర్తి (శ్రీసత్యసాయి జిల్లా): దేశ, విదేశాల నుంచి వచ్చిన మహిళలు భారతీయ సంస్కృతిపై ఇష్టం పెంచుకున్నారు. చీర, పంచెకట్టులో దర్శనిమిచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడి విధానాలను పరిచయం చేయడమే కాకుండా.. స్థానిక అలవాట్లను వంటబట్టించుకున్నారు. సత్యసాయిబాబా నడయాడిన పుట్టపర్తికి పలు దేశాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. తెలుగోడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి సత్యసాయి తీసుకెళ్లారని చెబుతున్నారు. అంతేకాకుండా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు మరువలేనివని కొనియాడుతున్నారు. ఓసారి పుట్టపర్తికి వస్తే.. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్ని సమస్యలతో వచ్చినా.. మందిరంలో అడుగు పెట్టాక ప్రశాంతత వస్తుందని పేర్కొంటున్నారు. శనివారం శ్రీసత్యసాయి 99వ జయంతి సందర్భంగా విదేశీయులతో ‘సాక్షి’ మాటామంతీ.. ప్రశాంతతకు మారుపేరు పుట్టపర్తికి చాలా ఏళ్ల నుంచి వస్తున్నా. వచ్చిన ప్రతిసారీ నెల రోజులు ఉంటా. ఫుడ్ బాగా నచ్చింది. తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. చీరకట్టు చాలా నచ్చింది. సత్యసాయి కోట్ల మంది గుండెల్లో కొలువై ఉన్నారు. – మెరియిల్లె, ఫ్రాన్స్మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది పుట్టపర్తి గురించి చాలా ఏళ్లుగా వింటున్నా. తొలిసారి 15 రోజుల క్రితం వచ్చా. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. ఒక వ్యక్తి ఇంతమందికి ఓ శక్తిలా మారి.. ఒక ఊరిని తయారు చేశారంటే మామూలు విషయం కాదు. – ఒట్టావి, ఫ్రాన్స్ సంప్రదాయాలు బాగున్నాయి తెలుగు సంప్రదాయం నచ్చిoది. చీరకట్టుకోవడం, తెలుగు వంటకాలు నేర్చుకున్నా. సెంట్రల్ ట్రస్టు సేవలు చాలా బాగున్నాయి. విద్య, వైద్యంపై భగవాన్ శ్రీసత్యసాయి సేవలను చరిత్ర మరువదు. – డానేలా, ఇటలీసాయిబాబా వ్యక్తి కాదు.. శక్తి 1980 నుంచి పుట్టపర్తికి వస్తున్నా. సాయిబాబా ఓ వ్యక్తి కాదు.. ఆయన ఓ శక్తి. ఇక్కడ చాలామంది పరిచయమయ్యారు. సొంత బంధువుల్లా ఆదరిస్తారు. తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకున్నా. – లిండా, లండన్ సాయిబాబానే బతికించారు ఇక్కడకు చాలాసార్లు వచ్చాను. నేను మూడుసార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యా. బాబానే బతికించాడని నమ్ముతున్నా. ఏటా బాబా జయంతి వేడుకలు మిస్ కాకుండా వస్తా. దోశ అంటే చాలా ఇష్టం. – ఫెర్నాండో, ఇటలీ అతిథులకు లోటు రానివ్వం భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులకు ఎలాంటి లోటు రానివ్వం. ఏ దేశం నుంచి అతిథులు వచ్చినా సాదరంగా స్వాగతిస్తాం. వారికి కావాల్సిన వసతి ఏర్పాటు చేస్తున్నాం. బాబా ఆశయాల సాధన మేరకు శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు ఉన్నాయి. చిన్న గ్రామాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి భగవాన్ శ్రీసత్యసాయిబాబా. – ఆర్జే రత్నాకర్రాజు, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ -
దేశంలో విస్తరిస్తున్న మెడికల్ టూరిజం
తక్కువ ఖర్చు.. అత్యాధునిక సౌకర్యాలు.., చికిత్స పద్ధతులు, సుశిక్షితులైన వైద్యులు, నాణ్యమైన వైద్యానికి భారత దేశం కేరాఫ్ అడ్రస్. అత్యంత క్లిష్టమైన చికిత్సలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అందుకే దేశంలో వైద్య పర్యాటకం (మెడికల్ టూరిజం) ఏటేటా పెరుగుతోంది. ఏటా లక్షలాది మంది విదేశీయులు భారత దేశానికి వచ్చి వైద్యం పొంది వెళ్తున్నారు. గత పదేళ్లలో ఏటా వచ్చే మెడికల్ టూరిస్టుల సంఖ్య దాదాపు ఐదింతలు పెరిగింది. ఇదిలాగే కొనసాగి, 2034 నాటికి 50,671 బిలియన్ డాలర్లకు భారత దేశ మెడికల్ టూరిజం పరిశ్రమ విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి. – సాక్షి, అమరావతిదేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయుష్ వీసాను ప్రవేశపెట్టింది. వివిధ జబ్బులతో బాధపడే విదేశీయులు చికిత్స కోసం భారత్కు రావడానికి సరళమైన నిబంధనలతో దీనిని రూపొందించింది. ఈ వీసాతో భారత వైద్య పర్యాటకం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా దేశ ఆరోగ్య సంరక్షణ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 70 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని గతంలో మోదీ ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. గతేడాది 8.7 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. ఈ ఏడాది (2024)లో 10.4 బిలియన్ డాలర్ల మేర మెడికల్ టూరిజంలో పెరుగుదల ఉంటుందని ఫార్చ్యూన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 17.2 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 2034 నాటికి 50,671 బిలియన్ డాలర్లకు పరిశ్రమ విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి.వివిధ రకాల వ్యాధులకు చికిత్స కోసం 2014లో 1.39 లక్షల మంది విదేశీయులు భారత్కు రాగా, ఆ సంఖ్య గత ఏడాది (2023) 6.35 లక్షలకు పెరిగింది. అదే విధంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం 2017–19 మధ్య రెండేళ్లలో మెడికల్ టూరిజంలో వృద్ధి 34.5 శాతంగా నమోదైంది. కరోనా కారణంగా 2020లో కొంత తగ్గినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ మెడికల్ టూరిజం గణనీయంగా పుంజుకుంది. గుండె సంబంధిత సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, క్యాన్సర్ వైద్యం, ఇతర చికిత్సలకు విదేశీయులు తెలంగాణాలోని హైదరాబాద్, ఏపీలోని గుంటూరు, విజయవాడల్లోని ఆస్పత్రులకు కూడా వస్తున్నారు. -
విదేశీయుల విడిది 'భారత్'
సాక్షి, అమరావతి: స్వదేశంలో ఉన్న వారు విదేశాలకు వెళ్లి సేద తీరాలనుకుంటుంటే... విదేశీయులు మాత్రం భారత్వైపే చూస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో 47.78 లక్షలమంది విదేశీయులు భారత్ను సందర్శించారు. దీంతో విదేశీయులకు భారత్ విశ్రాంతి, వినోద కేంద్రంగా మారుతోంది. అమెరికా నుంచి 17.56శాతం, యూకే నుంచి 9.82శాతం, కెనడా 4.5శాతం, ఆ్రస్టేలియా 4.32శాతం మంది వచ్చారు. ఫారిన్ టూరిస్టు ఎరైవల్ (ఎఫ్టీఏ) ఒక్క జూన్లోనే 7.06లక్షలు ఉండటం విశేషం.ఇది 2023లో 6.48లక్షలు, 2019లో 7.26లక్షలుగా నమోదైంది. అయితే ఇది 2023 జూన్ ఎఫ్టీఏలతో పోలిస్తే 9శాతం వృద్ధిని సాధించగా 2019తో పోలిస్తే 2శాతం క్షీణించింది. భారత్కు వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ (46శాతం) మంది సరదాగా కుటుంబాలతో సహా గడిపి వెళ్లారు. ఇక 18శాతం మంది వ్యాపార, వైద్య సేవల కోసం భారత్ను సందర్శిస్తున్నారు. వెల్నెస్ రిట్రీట్లు, అడ్వెంచర్ ట్రిప్లకు క్రేజ్ పెరుగుతోంది. ఢిల్లీ నుంచే దేశంలోకి విదేశీ పర్యాటకుల టాప్ ప్రవేశ స్థానంగా 31.45శాతంతో ఢిల్లీ నిలుస్తోంది. ఆ తర్వాత ఆర్థిక రాజధాని ముంబై (14.83శాతం), హరిదాస్పూర్ (9.39శాతం), చెన్నై (8.35శాతం), బెంగళూరు (6.45శాతం) ఉన్నాయి. అనిశ్చితిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా 21.55శాతం మంది భారత్కు వచ్చారు. అయితే వీరందరూ పర్యాటకులని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. దశాబ్ద కాలంగా హరిదాస్పూర్ నుంచే వీరందరూ భారత్లోకి వస్తున్నారు. ఈ క్రమంలో ఫారెక్స్ ఆదాయం గతేడాదితో పోలిస్తే 17.62శాతం ఎక్కువగా ఉంది. అదే 2023లో ఆసియా పసిఫిక్ దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా 90లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్లోకి వచ్చారు. భారతీయ ఇన్»ౌండ్ పర్యాటక మార్కెట్కు ఆ్రస్టేలియా, మలేసియా, సింగపూర్, జపాన్, థాయ్లాండ్, దక్షిణ కొరియా ప్రధానంగా నిలుస్తున్నాయి. 2023లో ఈ ఆరు దేశాల నుంచే ఏకంగా 10.22లక్షల మందిపైగా విదేశీయులు వచ్చారు. 1.50 కోట్ల మంది విదేశాలకు కోవిడ్ మహమ్మారి విజృంభించిన తర్వాత విదేశాల్లో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యలో 1.50 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పర్యటించారు. గతేడాది ఇదే సమయానికి 1.32లక్షల మంది విదేశాలకు వెళ్లారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఎక్కువ మంది విదేశీ యాత్రలు చేస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లో యూకే, సౌదీ, యూఎస్, థాయ్లాండ్, సింగపూర్ భారతీయుల అగ్రగామి ఎంపికలుగా నిలిచాయి. -
Video: పద్మనాభస్వామి ఆలయంలోకి విదేశీ మహిళకు ప్రవేశం నిరాకరణ
తిరువనంతపురం: పవిత్రమైన దేవాలయంలోకి విదేశీ మహిళను వెళ్లకుండా అడ్డుకున్న ఘటన కేరళలోని పద్మానాభస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. కేవలం భారతీయులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉందంటూ ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. అయితే తన భర్త భారతీయుడేనని, వారికి నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పినా ఆలయ అధికారులు పట్టించుకోలేదు.. ఈ మేరకు సదరు విదేశీ మహిళకు ఎదురైన అనుభవాన్ని హర్ప్రీత్ అనే మహిళ సోషల్ మీడియాలో పంచుకున్నారు.విదేశాలకు చెందిన మహిళ చక్కగా చీర కట్టుకొని తనకు కాబోయే భర్తతో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సిబ్బంది.. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తన జాతీయత, మతం కారణంగా ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించినట్లు ఆమె వాపోయింది. భారతీయులకు మాత్రమే ఆలయ అనుమతి ఉంటుందని అధికారులు చెప్పినట్లు వీడియోలో పేర్కొంది. తనతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇండియన్ అయిన ఆమె ప్రియుడు చెప్పినా.. ఆలయ సిబ్బంది ఆ విదేశీ మహిళకు గుడిలోకి అనుమతి ఇవ్వలేదు.తాను హిందువునే అని ఆ మహిళ వీడియోలో చెప్పుకున్నప్పటికీ అధికారులు సర్టిఫికేట్ చూపించాలంటూ కోరారని తెలిపింది. ప్రతిసారి సర్ఠిఫికేట్ తీసుకెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని, భగవద్గీతను చదవుతానని, అయినా సెక్యూర్టీ గార్డులు తనను ఓ నేరస్థురాలిగా చూస్తున్నారని ఆమె తన వీడియోలో ఆరోపించింది. ఆలయ అధికారులు వర్ణవివక్షను ప్రదర్శించినట్లు ఆరోపించింది. కేవలం ఆలయంలో ప్రవేశించేందుకు మాత్రమే చీరను కొన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.Why should anyone be barred from a place worship they want to visit? https://t.co/Y6LrCCJUwV— Karti P Chidambaram (@KartiPC) July 16, 2024 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.తాజాగా ఈ వీడియోపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ప్రార్ధన స్థలానికి వెళ్లి పూజలు చేయాలనుకున్న వ్యక్తులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు అనేకమంది ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆలయాల్లోకి విదేశీయులను అనుమతించాలని కోరగా.. మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని చెబుతున్నారు. "మతం, జాతీయతతో సంబంధం లేకుండా ఎవరినైనా హిందూ దేవాలయాలలోకి అనుమతించాలి. కేవలం వారి దుస్తులు, శాఖాహారం తినడం, చెప్పులు తీయడం వంటి ఆలయ సంస్కృతిని గౌరవించాలనే షరతులు మాత్రమే ఉండాలి. అని సూచిస్తున్నారు. ఇక దేవాలయాలు అందరూ సందర్శించడానికి టూరిస్టు ప్రదేశాలు కాదని, మీ ఇంట్లోకి ఎవరినైనా అనుమతిస్తారా? ఇవ్వరు కదా!. వారు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇస్తే ఆలయంలోకి అనుమతించాలి’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. -
సీన్ హై జపానీ..సినిమా హై హిందుస్థానీ
భారతీయ సినిమా పాటలకు విదేశీయులు డ్యాన్స్ చేయడం కొత్త కాదు. అయితే జపాన్లో మాత్రం బాలీవుడ్ హిట్ సినిమాల ఐకానిక్ సీన్లను రీక్రియేట్ చేసే కొత్త ట్రెండ్ మొదలైంది. బాలీవుడ్ మూవీ ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (కె3జి)లో అంజలిగా కాజోల్, రాహుల్గా షారుఖ్ ఖాన్ నటించారు. రాహుల్, అంజలి వేషధారణలో జపనీస్ ఇన్ఫ్లూయెన్సర్లు మాయో, కకే టకులు ‘కె3జి’లోని ‘బడే మజాకీ హో’ కామెడీ సీన్ను రీక్రియేట్ చేశారు. ‘లెర్నింగ్ హిందీ ఇన్ 2024 ఈజ్ లైక్ బడే మజాకీ హో’ కాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. హిందీలో ్రపావీణ్యం సంపాదించిన మాయో, కకే టకుల లిప్ సింక్ బాగా కుదిరింది. ‘క్రాస్–కల్చరల్ అడ్మిరేషన్ అనేది భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక గొడుగు కిందికి తీసుకువస్తుంది. పర్యాటక ఆసక్తి పెంచుతుంది’... లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వచ్చాయి. -
ఈ అన్న ఇంగ్లీష్ చూసి నోరెళ్లబెట్టిన ఫారెనర్స్
-
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇంఫాల్: మణిపూర్లో ముష్కరులు జరిపిన దాడిలో గాయపడిన భద్రతా బలగాలను సీఎం బీరేన్ సింగ్ పరామర్శించారు. దాడిలో మయన్మార్కు చెందిన కిరాయి సైనికులు పాల్గొన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. దుండగులు ఆధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు వెల్లడించారు. ముష్కరులను పట్టుకునేందుకు కూంబింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మణిపూర్లో వరుసగా రెండోరోజు ఉగ్రమూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మంగళవారం ఆకస్మికదాడి జరిపారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. అంతకుముందు తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో దుండగులు సోమవారం కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తౌబల్తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మణిపూర్లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం -
ఈ 'వెడ్డూరం' చూశారా? పెళ్లిని సొమ్ము చేసుకునే ట్రెండ్! ఏకంగా..
కొంతమంది ఎంతోఘనంగా జరుపుకునే తమ పెళ్లి వేడుకల వీడియోలను అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడం ఇప్పటి ట్రెండ్గా మారింది. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు తమ పెళ్లి వీడియోలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిలానే సెలబ్రెటీ హోదాలేని వారు సైతం విదేశీయులకు పెళ్లి టికెట్లు అమ్మి వెడ్డింగ్ పర్యాటకానికి తలుపులు తెరుస్తున్నారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే చాలా మంది విదేశీయులు ఇక్కడి సంస్కృతిని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. విదేశాలతో పోలిస్తే ఇండియాలో ఎంతో శాస్త్రోక్తంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ పెళ్లిళ్లను చూసేందుకు విదేశీయులు చాలా ఉత్సాహం చూపుతారు. పెళ్లి సంప్రదాయాలు, రకరకాల రుచికరమైన వంటకాలను టేస్ట్ చేసేందుకు తహ తహలాడుతుంటారు. అందుకే ఏ మాత్రం అవకాశం చిక్కినా వెంటనే వచ్చి ఇండియాలో వాలిపోతుంటారు. ఇందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ఈ అభిరుచినే మన భారతీయ జంటలు, వెడ్డింగ్ ప్లానర్స్ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్సైట్లూ నడుపుతున్నారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ను టికెట్గా చూపిస్తూ నిశ్చితార్థం నుంచి, మెహందీ, సంగీత్, హల్దీ ఇలా ఒక్కో వేడుకకి ఒక్కో రేటుని చెబుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. జాయిన్ మై వెడ్డింగ్... పెళ్లి చేసుకునే జంట సొంతంగా జాయిన్ మై వెడ్డింగ్ పేరుతో అకౌంట్ను క్రియేట్ చేస్తారు. ఈ వెబ్సైట్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరి ఫోటోలు, పెళ్లి తేదీ, ఎన్నిరోజులు వేడుకలు జరుగుతాయి.. ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు... వంటి వివరాలను అప్లోడ్ చేస్తారు. పెళ్లిలో పెట్టే భోజనం వెజ్, నాన్వెజ్, మందు, చిందు ఉంటే అదీ చెబుతారు. ఇవేగాక డ్రెస్ కోడ్, అక్కడ మాట్లాడే భాష, వేడుక జరిగే ప్రదేశం అడ్రెస్తోపాటు ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ను ఇస్తారు. విదేశీ పర్యటనలో ఉన్న వారికి ఈ పెళ్లి తేదీలు జత కుదిరితే టికెట్స్ బుక్ చేసుకుని వచ్చేసి మరీ పెళ్లి బ్యాండ్ బాజా, బారాత్లను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కరోజుకి పన్నెండు వేలపైనే... ఎంతో ఆడంబరంగా జరిగే మన వివాహ వేడుకలను చూడడానికి పర్యాటకులు రోజు కోసం 150 డాలర్ల టికెట్ను సంతోషంగా కొనేస్తున్నారు. మన రూపాయలలో పన్నెండు వేలకు పైనే. ఇక పెళ్లి పూర్తి తతంగం మొత్తం అంటే రెండు రోజులు చూడాలంటే 250 డాలర్లు చెల్లించాలి (రూ.20 వేలకుపైన). ఒకటీ, రెండూ కాదు ఐదు రోజుల పెళ్లి చూడాలంటే ప్రత్యేక వెడ్డింగ్ ప్యాకేజీ టికెట్ కొనాల్సిందే. ఇలా పదిమంది విదేశీ అతిథులు పెళ్లికి వచ్చారంటే పెళ్లిలో కొన్ని ఖర్చులకు సరిపడా డబ్బు సమకూడినట్లే! అందుకే ఎక్కువ మంది వెడ్డింగ్ టూరిజంపైన ఆసక్తి కనబరుస్తున్నారు. తొలిసారి... హంగేరియన్– ఆస్ట్రేలియన్ సంతతికి చెందిన ఒర్సి పర్కాణి తొలిసారి 2016లో ‘జాయిన్ మై వెడ్డింగ్’ పేరిట వెబ్సైట్ను క్రియేట్ చేసింది. అప్పుడు ఇది ఒక చిన్న స్టార్టప్. కానీ ఇప్పుడు ఇది ట్రెండ్గా మారింది. ఈ ఏడాది ఆగస్టు 19న పర్యాటక మంత్రిత్వ శాఖ వెడ్డింగ్ టూరిజంను ప్రారంభించింది. వెడ్డింగ్ టూరిజం ద్వారా భారతీయులేగాక, విదేశీయులు సైతం ఇక్కడికి వచ్చి ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్టుగా పెళ్లి వేడుకలు జరుపుకోవచ్చని చెబుతూ వెడ్డింగ్ టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. బీచ్ వెడ్డింగ్, నేచర్ వెడ్డింగ్, రాయల్ వెడ్డింగ్, హిమాలయన్ వెడ్డింగ్ థీమ్ల పేరిట ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ట్రెండ్కు మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం బూస్టర్గా పనిచేసి ఇండియాలో వెడ్డింగ్ వ్యాపారం వృద్ధిలోకి రాబోతుంది. ఇంకెందుకాలస్యం... మీ ఇంట్లో జరిగే పెళ్లివేడుకలకు వెడ్డింగ్ టూరిజంను జోడించి మరింత కలర్పుల్గా జరుపుకోండి. సెర్మనీ గైడ్... విదేశీయులను పెళ్లికి పిలవడమేగాక, వారికి అతిథి మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోవడం ఈ వెడ్డింగ్ టూరిజం ప్రత్యేకత. వేడుక లో జరిగే ప్రతి విషయం, పర్యాటకులకు వచ్చే సందేహాలు నివృత్తి చేసేందుకు సెర్మనీ గైడ్ను ఏర్పాటు చేస్తున్నారు.‘‘ప్రస్తుతం రాజస్థాన్, ఢిల్లీ, ముంబైలలో ఈ వెడ్డింగ్ టూరిజం పెరుగుతోంది. రాజస్థాన్లోని చిన్నటౌన్లలో జరిగే వేడుకలకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. జో«ద్పూర్, జైపూర్, జైసల్మేర్, ఉదయ్పూర్లలో జరిగే రాయల్ ఇండియన్ వెడ్డింగ్స్కు డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది’’ అని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. (చదవండి: ఉద్దానంలోని మరణాలకు గల కారణాన్ని కనిపెట్టిన పరిశోధకులు! చాలా మరణాలు..) -
పట్టుమని పది కిలోమీటర్ల విస్తీర్ణం కూడా లేకున్నా ప్రపంచ ఖ్యాతి
సాక్షి, పుట్టపర్తి: సత్య, ధర్మ ,శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు మానవతా విలువలను పాటించినవారే నిజమైన మానవులనీ, అవే మానవ జాతికి ముక్తి కలిగించేవనీ ప్రవచించిన భగవాన్ సత్యసాయిబాబా నడియాడిన పుట్టపర్తి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. పట్టుమని చుట్టూ పది కిలోమీటర్ల విస్తీర్ణం కూడా లేని కుగ్రామం విశ్వ చైతన్య శక్తిగా ఎదిగింది. జిల్లాలోనే అతి చిన్న మున్సిపాలిటీగా ఉన్న పుట్టపర్తి.. నేడు శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా అందరినీ దృష్టిని ఆకట్టుకుంటోంది. దీంతో పర్యాటకులు, సత్యసాయి భక్తులతో పాటు జిల్లా కేంద్రంలోని వివిధ కార్యాలయాలకు పనులపై వచ్చే వారి సంఖ్య పెరిగింది. అటు కొత్తచెరువు... ఇటు బుక్కపట్నం పుట్టపర్తికి ఓ వైపు బుక్కపట్నం చెరువు.. మరో వైపు కొత్తచెరువు ఉంటాయి. కేవలం పది కిలోమీటర్ల వ్యవధిలోనే మూడు మండల కేంద్రాలు ఉండడం మరో విశేషం.భగవాన్ సత్యసాయిబాబా నడియాడిన ప్రాంతం కావడంతో పుట్టపర్తిలో నివసించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. దీంతో ఆధునాతన ఎతైన భవంతులు వెలిసాయి. మాంసాహారం నిషేధం.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, విదేశీయులు నెలల తరబడి పుట్టపర్తిలోనే మకాం ఉంటారు. ఫలితంగా పుట్టపర్తి భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. దేశవిదేశీయులు మెచ్చే వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. అత్యధికంగా తమిళనాడు, కేరళ శైలి వంటకాలు లభ్యమవుతాయి. ఇక క్రిస్పీగా ఉంటూ కాస్త కారంతో ఉండే ఫాస్ట్ఫుడ్ అంటే విదేశీయులు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. అయితే కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ పుట్టపర్తిలో మాంసాహారం పూర్తిగా నిషేధం. కనీసం కోడి గుడ్డు కూడా ఇక్కడ లభ్యం కాదు. అలాగే సినిమా థియేటర్లూ ఉండవు. జిల్లా కేంద్రమే అయినా బార్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయాలకు అనుమతుల్లేవు. అత్యంత పవిత్ర ప్రాంతంగా నేటికీ భావిస్తూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. చాలా హోటళ్లలో బర్గర్, పిజ్జాలతో పాటు పలు రకాల శాకాహార వంటలు అందుబాటులో ఉంటాయి. ఓ వైపు నుంచి చూడాల్సిందే.. కొత్తచెరువు, బుక్కపట్నం మండల కేంద్రాలకు పుట్టపర్తికి మధ్యలో బుక్కపట్నం చెరువు ఉంటుంది. ఈ చెరువు చుట్టూ ఓ వైపు పుట్టపర్తి, మరోవైపు కొత్తచెరువు, ఇంకోవైపు పుట్టపర్తి ఉంటాయి. మూడు మండల కేంద్రాలు పది కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. అయితే ఎటు వైపు నుంచి చూసినా పుట్టపర్తి కనిపించదు. చుట్టూ కొండలే కనిపిస్తాయి. కేవలం ‘బుక్కపట్నం – నల్లమాడ’ మార్గంలో నుంచి మాత్రమే పుట్టపర్తిని దూరం నుంచి చూసే అవకాశం ఉంది. పుట్టపర్తి ముఖచిత్రం చూడాలంటే ఏరియల్ వ్యూ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పుట్టపర్తికి ఓ వైపు చిత్రావతి నది, మరో వైపు విమానాశ్రయం, ఇంకోవైపు చెరువు సరిహద్దులుగా ఉంటాయి. -
India with Jessica: ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి
మన దేశంలో పుట్టిన చాలామందికి హిందీ మాట్లాడటం రాదు. కొంతమందికి అర్థమైనప్పటికీ మాట్లాడలేరు. అమెరికా నుంచి వచ్చిన జెస్సికా మాత్రం హిందీలో అనర్గళంగా మాట్లాడేస్తుంది. ఇలా పలకాలి అని హిందీ పాఠాలు కూడా చెబుతోంది. మనదేశానికి వచ్చే విదేశీయులకు హిందీతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ నెటిజనుల మన్ననలను అందుకుంటోంది ఈ ‘బిహారీ బహూ’. పదిహేడేళ్లుగా ఇండియాతో చక్కని బంధాన్ని కొనసాగిస్తోన్న జెస్సికా గురించి ఆమె మాటల్లోనే... ‘‘నేను చికాగోలో పుట్టాను. అమ్మానాన్న ఇరు కుటుంబాలకు చెందిన తాత, బామ్మలతో కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం మాది. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో కలిసి స్కూలుకు వెళ్లి చదువుకునేదాన్ని. ఆదివారం వచ్చిందంటే... కుటుంబమంతా కలిసి గడుపుతాం. నాన్న అంతర్జాతీయ వ్యాపారి కావడంతో తరచూ చైనా, కొరియాలు వెళ్తుండేవారు. ఆయన్ని చూసి నేను కూడా అలా తిరగాలని అనుకునేదాన్ని. కాలేజీ చదువుకోసం 18 ఏళ్ల వయసులో చికాగో నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాను. నాలుగేళ్లపాటు హాస్టల్లో ఉన్నాను. ‘చైనా, ఇండియాలలో ఆర్థికమాంద్యం వస్తుంది’ అని కాలేజీలో ఎక్కువమంది విద్యార్థులు మాట్లాడుకునేవారు. అది విన్న నాకు ఇండియా వెళ్లి అక్కడి పరిస్థితులు చూడాలనిపించేది. ఏడాదిలో తిరిగి వచ్చేస్తాను అనుకున్నా.. కాలేజీ చదువు పూర్తయిన తరువాత తెలిసిన వాళ్ల ఐటీ కంపెనీ హరిద్వార్లో ఉంటే.. అక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి ఇండియా వచ్చాను. ఇంటర్న్షిప్తోపాటు భారతీయులు, వారి భాషల గురించి తెలుసుకోవచ్చని అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఇరుగు పొరుగు నుంచి కూరగాయలు విక్రయించేవాళ్ల వరకు అందరితో పరిచయం ఏర్పడింది. అందరూ చక్కగా కలిసి పోయేవారు. ఏడాదిలో ఇంటర్న్షిప్ పూర్తయిన తరువాత అదే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అలా ఏడాదిలో తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది స్నేహితుల ద్వారా అభిషేక్ పరిచయం అయ్యాడు. నేను ఇక్కడ ఉంటే.. అభిషేక్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇద్దరం మంచి స్నేహితులుగా మారాం. నేను మా ఇంటికి వెళ్లినప్పుడల్లా అభిషేక్ను కలిసేదాన్ని. అలా మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చి బిహార్ కోడలిని అయ్యాను. అత్తమామల అనురాగం చూసి... హరిద్వార్లో ఉండే రోజుల్లో ఇక్కడి అత్తమామలు కుటుంబ పెద్దలుగా కోడళ్లు, మనవళ్లను చూసే విధానం నాకు బాగా నచ్చింది. అభిషేక్ను పెళ్లిచేసుకోవడానికి అది కూడా ఒక కారణం. మేము పెళ్లి చేసుకుంటామని మా నాన్నని అడిగాం. ‘చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి పెళ్లిచేసుకో’ అని నాన్న చెప్పారు. అభిషేక్ కుటుంబ సభ్యుల్లో సగం మంది అమెరికాలో నివసిస్తుండడంతో వారి గురించి బాగా అర్థం చేసుకోవడం కూడా నాన్న ఒప్పుకోవడానికి ఒక కారణం. అభిషేక్ తల్లిదండ్రులు విదేశీ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోవడానికి మొదట్లో భయపడ్డారు. ఎలాంటి అమ్మాయో అని సందేహించినప్పటికీ మా కుటుంబం గురించి తెలుసుకుని పెళ్లికి సమ్మతించడంతో 2010లో మా వివాహం జరిగింది. జీవితాంతం ఆధారపడాల్సిందే... పెళ్లి అయిన తరువాత అమెరికాలో కొన్నిరోజులు, ఇండియాలో కొన్ని రోజులు ఉండేవాళ్లం. ఆరేళ్ల తరువాత బిహార్కి వచ్చి స్థిరపడ్డాం. మాకు ఇద్దరు పిల్లలు బాబు, పాప. ప్రపంచంలో కూతురికంటే కొడుకులనే మరింత ప్రేమగా చూసుకుంటారు. ఇండియాలో ఇది కాసింత ఎక్కువే. అమ్మాయిలకు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేలా అన్నీ నేర్పిస్తారు. అబ్బాయిలకు మాత్రం ఏమీ నేర్పించరు. కొంతమంది తల్లులు అయితే ‘మా అబ్బాయికి కప్పు టీ పెట్టడం కూడా రాదు’ అని గర్వంగా చెబుతుంటారు. ఇలా అయితే వాళ్లు స్వయంసమృద్ధిని సాధించలేరు. జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిందే. అందుకే నేను నా పిల్లలకు లింగభేదం లేకుండా అన్నీ నేర్పిస్తున్నాను. నేర్చుకుని నేర్పిస్తున్నా... హరిద్వార్లో ఉన్నప్పుడే హిందీ నేర్చుకున్నాను. కోర్సు కూడా చేశాను. బిహార్కి వచ్చిన తరువాత నా హిందీ బాగా మెరుగుపడింది. బిహారీలు మాట్లాడే హిందీ సరిగాలేదని, వారి మాటలు విని నవ్వుతుంటారు చాలామంది. కానీ ఇక్కడ మాట్లాడే హిందీలో సంస్కృతం, భోజ్పూరి, మైథిలి, ఆంగిక వంటి భాషలు కూడా కలుస్తాయి. అందుకే బిహారీలు మాట్లాడే హిందీ కొంచెం విభిన్నంగా ఉంటుంది. బిహారీలు మాట్లాడే హిందీపై చాలామందికి ఉండే చిన్నచూపు, వివక్ష పోవాలని నా వీడియోల్లో.. బిహారీ స్టైల్ హిందీనే మాట్లాడుతున్నాను. ఇండియా విత్ జెస్సికా ఇక్కడ ఉండే భారతీయులకు, విదేశాల్లో ఉండే ఇండియన్స్కు హిందీ నేర్పిస్తున్నాను. అమెరికా, కెనడాలలో స్థిరపడిన ఎంతోమంది భారతీయుల పిల్లలకు హిందీలో మాట్లాడడం తెలీదు. ఇది వాళ్లకు పెద్ద సమస్య. అందుకే నేను హిందీ నేర్పిస్తున్నాను. నాలుగున్నరేళ్ల క్రితం ‘ఇండియా విత్ జెస్సికా’ పేరిట యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాను. వీటిద్వారా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తున్నాను. కొన్నిసార్లు వివిధ రకాల అంశాలపై మాట్లాడడానికి అతిథిగా కూడా వెళ్తున్నాను. అమెరికా అమ్మాయి ఇండియా గురించి మాట్లాడడం, అందులో హిందీలో అనర్గళంగా మాట్లాడుతుంది అని తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యంగా నా క్లాసులు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసం లిప్సింక్ వీడియోలు పోస్టు చేస్తుంటారు. నేను అవేమీ చేయడం లేదు. కేవలం తెలియని సమాచారం ఇవ్వడమే నా లక్ష్యం. అందుకే ఫాలోవర్స్ గురించి కూడా పట్టించుకోను. కొంతమంది మెసేజులకు జవాబులు చెప్పడం లేదని తిడుతుంటారు. నన్ను సెలెబ్రిటీలా చూస్తున్నారు. కానీ నేను సెలబ్రిటీని కాదు. ఇద్దరు పిల్లలకు తల్లిని, వాళ్లకు నేర్పించాలి. వంట చేయాలి, ఇంటిని చూసుకోవాలి. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. నేను అందరిలానే సామాన్యమైన వ్యక్తిని’’ అని ఎంతో నిరాడంబరంగా చెబుతోంది జెస్సికా. -
కిచెన్ క్వీన్ శశికళ.. ఈమె వంటలకు విదేశీయులు కూడా ఫిదా
ఉదయ్పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు. పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది. రాజస్థాన్కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది. ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్పూర్ వస్తుంటారు. -
Hyderabad: హిందీ నేర్చుకుంటూ.. ఆదాయం అందుకుంటూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలోని రిసెప్షన్లో ఉన్న వ్యక్తుల్ని ‘‘కిత్నా రూపియా టెస్ట్ కే లియే? (పరీక్షలకు ఎంత ఖర్చవుతుంది?)’’అని ఆఫ్రికాకు చెందిన కవాంగు(25) అడుగుతోంది. కెన్యా నుంచి న్యూరో సర్జన్ను సంప్రదించడానికి నగరానికి వచ్చిన ముగ్గురు రోగులు తనకు కస్టమర్లుగా ఉన్నారు. వారికి అవసరమైన సంప్రదింపులు, పరీక్షల ఏర్పాట్ల నుంచి రెస్టారెంట్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం దాకా అన్నీ కవాంగు బాధ్యతలే. విదేశీయులకు అత్యున్నత వైద్యసేవల్ని మాత్రమే కాదు ఆదాయమార్గాలను కూడా నగర వైద్యం అందిస్తున్న తీరుకు కువాంగు ఒక ఉదాహరణ. తన కుటుంబంతో నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి అలాంటి ఫెసిలిటేటర్ సహాయంతో సంక్లిష్టమైన కాలేయ సమస్యకు కవాంగు చికిత్స పొందింది. ఆ తర్వాత తానే ఫెసిలిటేటర్గా మారితే రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చని అర్థమయ్యాక కవాంగు మూడేళ్లుగా అదే పనిచేస్తూ నగరంలోనే ఉంటున్నారు. ఆ వృత్తి కోసం కొంచెం హిందీ కూడా నేర్చుకుందామె. ‘హిందీ భాష నేర్చుకోవడం కోసం కోర్సులో చేరడంతోపాటు బాలీవుడ్ సినిమాలు చూడటం ప్రారంభించాను‘అని ఆమె చెప్పారు. టోలీచౌకి కేంద్రంగా... ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తున్నవారికి కేంద్రంగా నగరంలోని టోలీచౌకి మారిందని ఓ ఆసుపత్రికి చెందిన మార్కెటింగ్ విభాగ ప్రతినిధి తెలిపారు. ఈ ఏరియాలోని ప్రీమియర్ అపార్ట్మెంట్లో అద్దెకుండేవారిలో అత్యధికులు ఈ తరహా సేవల్లో నిమగ్నమవుతున్నారన్నారు. చాలామంది ఇక్కడ ట్రావెల్ లేదా స్టడీ వీసాపై మాత్రమే ఉన్నారు. కాబట్టి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ యాక్ట్కి సంబంధించిన సమస్యల గురించి భయపడివారు తమపేరు తదితర వ్యక్తిగత వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు, ‘‘మాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు నైరోబీలోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు మాకు సహాయం చేస్తారు’’అని నైరోబీకి చెందిన మార్గరెట్ కారీ చెప్పారు. కొన్ని ఆసుపత్రులు దేశీయ రోగులతో పోలిస్తే అంతర్జాతీయ రోగులకు ట్రీట్మెంట్ రేట్లు అమాంతం 50 శాతం మేర పెంచేసి వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఫెసిలిటేటర్లకు బిల్లును బట్టి 15 నుంచి 20 శాతం కూడా ఇస్తున్నారని సమాచారం. ‘సోమాలియాలో ఆరోగ్య సంరక్షణకు సరైన మౌలిక సదుపాయాలు లేవు. దాంతో చికిత్స కోసం థాయ్లాండ్, మలేషియా, చైనాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు చాలామంది భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్కు వస్తున్నారు, అందువల్ల నేనిక్కడ ఉంటూ బంధువులు, స్నేహితులకు సహాయం చేయడం ప్రారంభించాను. అలా చాలామంది నాతో కనెక్ట్ అయ్యారు’అని 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన సోమాలియా జాతీయుడైన జువేద్ అన్నారు. ఏజెన్సీలూ ఉన్నాయి... మెడికల్ టూరిజమ్ సేవలు అందించే కొన్ని అంతర్జాతీయ కంపెనీలు చట్టప్రకారం కొందరిని ఫెసిలిటేటర్లుగా నియమించుకుని రోగులకు సహాయకులుగా వినియోగిస్తాయి. ఇలాంటి సంస్థలు ఢిల్లీ, ముంబై, బెంగుళూర్లలో ఎక్కువ. వాటి సేవలు హైదరాబాద్కు ఇంకా విస్తృతంగా వ్యాపించలేదు. దాంతో ఇక్కడ వ్యక్తిగతంగా సేవలు అందించే ఫెసిలిటేటర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటున్న విదేశీ విద్యార్థులు నగరంలోని హైదరాబాద్, ఉస్మానియా వంటి యూనివర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్టైమ్గా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. పదేళ్లు, పన్నెండేళ్ల పాటు నర్సింగ్ స్టాఫ్, ఫిజియోథెరపీ స్టాఫ్గా సేవలు అందించినవాళ్లు కూడా జోర్డాన్, ఇరాక్, సిరియా తదితర మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చి అక్కడి పరిచయాలను, అరబిక్ భాష మీద పట్టు లాంటి సానుకూల అంశాలతో ఫెసిలిటేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ఉభయ కుశలోపరి విధానం మా ఆసుపత్రికి నైజీరియా, కెన్యా, సుడాన్, సోమాలియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరి కోసం మేం అధికారికంగా ఉన్న సంస్థల నుంచి ఫెసిలిటేటర్ల సేవలు అందుకుంటాం. అరుదుగా మాత్రం తెలిసిన, పరిచయస్తులను ఉపయోగించుకుంటాం. రోగులకు ఎదురయ్యే భాషా పరమైన ఇతర అవరోధాలకు పరిష్కారంగానూ, మరోవైపు ఇక్కడ విద్యార్జన తదితర పనులపై వచ్చేవారికి ఆదాయమార్గంగానూ ఈ విధానం ఉపకరిస్తోంది. –డా.కిషోర్రెడ్డి, అమోర్ ఆసుపత్రి -
భగవద్గీత గురించి విదేశీ యువతి ఎంత బాగా చెప్తుందో..
-
రుషికొండలో బ్లూ ఫ్లాగ్ రెపరెపలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అందాల తీరానికి అంతర్జాతీయ హంగులద్దుతున్నారు. స్వచ్ఛత, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యావరణ హితంగా.. పర్యాటక స్వర్గధామంగా ఉన్న బీచ్లకు విదేశీ గుర్తింపు లభిస్తోంది. డెన్మార్క్కు చెందిన అధ్యయన సంస్థ అందించే ఈ ధ్రువపత్రం వస్తే చాలు.. ఆ బీచ్లకు విదేశీయులు క్యూ కడతారు. అంతర్జాతీయ సాగరతీరంగా గుర్తింపు పొందుతూ.. సురక్షితమైన బీచ్ల జాబితాలో భారత్కు చెందిన 12 ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడుతున్నాయి. వరుసగా మూడో ఏడాది రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎలా వస్తుందంటే.. బ్లూ ఫ్లాగ్ బీచ్లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టీఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక దేశాన్ని సందర్శించేందుకు వెళ్లే విదేశీ పర్యాటకులు ఆ దేశంలో బీచ్ల గురించి శోధించినప్పుడు ముందుగా బ్లూ ఫ్లాగ్ గురించే సెర్చ్ చేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్లు ఉంటే.. ఆ ప్రాంతాన్ని కచ్చితంగా విదేశీ పర్యాటకులు పర్యటిస్తారు. బ్లూ ఫ్లాగ్ ధ్రువ పత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు, జల కాలుష్యం ఉండకూడదు. పర్యావరణ హితంగా ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పరిశ్రమల వ్యర్థాలు కలవకూడదు. సముద్రంలో స్నానం చేసేటపుడు ఆరోగ్యపరమైన భద్రత ఉండాలి. నీటిలో బ్యాక్టీరియా ఉండకూడదు. 150 మీటర్ల వరకు తీరం నుంచి లోపలకు ఇసుక తిన్నెలుండాలి. సముద్రంలో బోటింగ్ సదుపాయం ఉండాలి. ఈ ప్రాజెక్టుకు ఎంపికైన బీచ్లలో ఆయా అంశాల్లో పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టీఫికెట్ ఇస్తారు. బీచ్లో బ్లూ ఫ్లాగ్ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఎవరు ఇస్తారు? 1985లో డెన్మార్క్లో ప్రారంభించిన ’ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’(ఎఫ్ఈఈ) ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్లను అందిస్తోంది. ప్రపంచంలో తొలిసారి ఈ సర్టీఫికెట్ పొందిన దేశం స్పెయిన్. బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్ అందిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ స్పెయిన్ దేశానికి చెందిన సాగరతీరాలు ఎక్కువ సంఖ్యలో బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్స్ను సొంతం చేసుకున్నాయి. స్పెయిన్లో ఇప్పటి వరకు మొత్తం 566 బీచ్లు ఈ సర్టీఫికెట్ పొందగా, గ్రీస్ 515, ఫ్రా న్స్ 395 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ పొందాయి. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్లకు ఈ సర్టీఫికెట్ లభించింది. బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరణ కొమ్మాది(భీమిలి): రానున్న కాలంలో మరిన్ని బీచ్ లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. రుషికొండ బీచ్లో శనివారం బ్లూ ఫ్లాగ్ను జేసీ కె.ఎస్.విశ్వనాథన్, బ్లూ ఫ్లాగ్ ఇండియా ఆపరేటర్ డాక్టర్ కురూప్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్, సమాచారశాఖ జేడీ వి.మణిరామ్ పాల్గొన్నారు. మన దేశంలో 2018లో తొలిసారిగా.. భారతదేశంలోనే కాదు.. ఆసియా ఖండంలో ఈ సర్టీఫికెట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని ’చంద్రబాగ్’ బీచ్. ఇది 2018లో ఈ సర్టిఫికెట్ పొందింది. ఆ తర్వాత ఇండియాలో మరో 12 తీర ప్రాంతాలను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ పొందే స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని పర్యావరణశాఖ ఆధ్వర్యంలో పని చేసే సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్ మెంట్కు అప్పగించింది. తొలి సారిగా భారత్కు చెందిన 13 బీచ్లు ఇందుకు అర్హత సాధించగా.. ఇప్పటి వరకూ 12 బీచ్లలో బ్లూ ఫ్లాగ్ ఎగురుతోంది. ఇవీ బ్లూ ఫ్లాగ్ బీచ్లు.. మొత్తంగా 12 బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉండగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క తీరంలో నీలి జెండా రెపరెపలాడుతోంది. 2020 అక్టోబర్ 10న రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ దక్కింది. అప్పటి నుంచి వరుసగా మూడేళ్లు ఎఫ్ఈఈ రుషికొండకు బ్లూ ఫ్లాగ్ను రెన్యువల్ చేస్తోంది. ఇంకా మనదేశంలో చంద్రబాగ్, రుషికొండతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. పుదుచ్ఛేరిలోని ఈడెన్ బీచ్, గుజరాత్లోని శివరాజ్ పూర్, డయ్యూలోని ఘోఘ్లా, కర్ణాటకలోని కసర్కోడ్, పడుబిద్రి బీచ్లు, కేరళలోని కప్పడ్, ఒడిశా నుంచి పూరి గోల్డెన్ బీచ్, అండమాన్ నికోబార్ దీవుల నుంచి రాధానగర్ బీచ్, లక్షద్వీప్ నుంచి మినికోయ్ తుండి, కద్మత్ బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టీఫికేషన్ దక్కించుకున్నాయి. -
Love Marriage: మాచారెడ్డి అబ్బాయి వెడ్స్ అమెరికా అమ్మాయి
మాచారెడ్డి: అమెరికా అమ్మాయి మాచారెడ్డి అబ్బాయి వివాహానికి కామారెడ్డి పట్టణం వేదికైంది. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన సిద్దంశెట్టి గంగ, రమేశ్ల పెద్ద కుమారుడు సాయి సంకేత్ చదువుకోవడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ సహాధ్యాయి అయిన కన్సిలో ఎలిజబెత్, ఫ్రాన్సిస్కో ఎర్నిస్టోల కూతురు రిషికతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురూ తమ తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో శనివారం రాత్రి కామారెడ్డిలోని సత్య గార్డెన్లో వివాహ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. (చదవండి: TSPSC: పేపర్ లీక్లో కొత్త కోణం.. ఉద్యోగికి హానీట్రాప్!) -
రైల్వే కానిస్టేబుల్ పాడుపని.. సిట్జర్లాండ్ మహిళలతో అసభ్యంగా..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో ఓ రైల్వే కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. తేజస్ ఎక్స్ప్రెస్లో స్విట్జర్లాండ్కు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెపై భౌతికంగా దాడి చేయబోయాడు. ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉన్నా పట్టించుకోకుండా కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అతిథి అని కూడా చూడకుండా విదేశీ మహిళను వేధించిన ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పేరు జితేంద్ర సింగ్. గత ఏడాదిన్నరగా యూపీ ఫిరోజాబాద్లోని ఆర్పీఎఫ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
పుట్టపర్తి: వస్తే.. వెళ్లలేమప్పా!.. విదేశీ అతిథుల మన్ననలు..
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతుల కలబోతగా ప్రతిబింబిస్తోంది. విదేశీ అతిథులు తమ సంప్రదాయాలను వదిలి.. తెలుగు డ్రెస్ కోడ్ను ఇష్టపడుతుంటారు. మన వంటకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ జీవనశైలిని పాటిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనలో సంప్రదాయాలను అనుసరిస్తారు. సుమారు 150 దేశాల నుంచి యాత్రికులు పుట్టపర్తి వస్తుంటారు. విదేశీ సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు మన సంప్రదాయాలను అనుసరిస్తారు. భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇదో గర్వకారణమని పుట్టపర్తివాసులు చెబుతున్నారు. సాయిబాబా చలువ వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. విదేశీయులు మెచ్చే విధంగా పుట్టపర్తిలో వసతి అందుబాటులో ఉంది. హోటళ్లు, వస్త్ర దుకాణాలు, సంగీత పరికరాల అంగళ్లు ఉన్నాయి. విదేశీయులు మెచ్చే విధంగా హోటళ్లలో అలంకరణ కనిపిస్తుంది. సుమారు 10 లాడ్జిలు, 30 హోటళ్లు విదేశీయులకు నచ్చేశైలిలో అందుబాటులో ఉన్నాయి. భారత దేశానికి వచ్చినా.. ఇక్కడి దర్శనీయ స్థలాలను చూసినా వదిలి వెళ్లలేమని విదేశీ అతిథులు అంటున్నారు. ఇక్కడ పాటించే ఆచార వ్యవహారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెబుతున్నారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
RBI: విదేశీయులూ యూపీఐ చెల్లింపులు చేయొచ్చు!
విదేశీ టూరిస్టులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మంచి వెసులుబాటు కల్పించనుంది. వారు భారత్లో ఉన్నప్పుడు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసుకునేలా అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. దీంతో భారత్కు వచ్చిన విదేశీయులు తమ బ్యాంకు ఖాతాలను ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి చెల్లింపు యాప్లకు అనుసంధానించుకుని చెల్లింపులు జరపవచ్చు. మొదటగా జీ20 దేశాల అతిథులకు.. మొదటగా జీ20 దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు ఎంపిక చేసిన ఎయిర్ పోర్టుల్లో ఈ అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన ప్రకటన సందర్భంగా వెల్లడించారు. యూపీఐ అనేది దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న చెల్లింపు వ్యవస్థ అని, ఇటీవల ఎన్ఆర్ఐలకు కూడా దీని సేవలను విస్తరించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే విదేశీయులకు యూపీఐ చెల్లింపుల అవకాశం ఉంటుందని, క్రమంగా దీన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: RBI repo rate hike షాకింగ్ న్యూస్: ఇక ఈఎంఐల బాదుడే బాదుడు!) -
వినసొంపుగా వయోలిన్ వాయిస్తూ.. అందరిని ఆకర్షిస్తూ..
సాక్షి, బెంగళూరు: జీవనోపాధి కోసం కళలను రోడ్డుపై ప్రదర్శించడం విదేశాలలో సాధారణంగా చూస్తూ ఉంటాము. అటువంటి దృశ్యమే ఓ ధార్మిక క్షేత్రంలో కనిపించింది. పొట్టకూటి కోసమే లేక తన కళను చూపించాలనో తపనో తెలియదు కాని ఓ విదేశీ మహిళ దేశం కాని దేశం వచ్చి వయోలిన్ వాయిస్తూ డబ్బు సంపాదన చేస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలో ప్రముఖ ధార్మిక క్షేత్రమైన కుమటా తాలూకా గోకర్ణకు వచ్చే విదేశీయులు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. రెండు రోజులుగా ఓ విదేశీ యువతి వయోలిన్ను వినసొంపుగా వాయిస్తూ రోడ్డు పక్కన నిలబడి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ప్రజలు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఆమె ఆర్థిక సమస్యల వల్ల ఇలా యాచిస్తోందో, లేక కళారాధన చేస్తోందో తెలియడం లేదని స్థానికులు చెప్పారు. చదవండి: పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనక తప్పదు! ముందుంది పెను ముప్పు? -
మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి!
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా దేశ రాజధానిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు అదుపులోకి తీసుకుంది యాంటీ డ్రగ్స్ ఫోర్స్. దీంతో దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమవారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసి సుమారు 100 మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టు ముట్టారు. నైజీరియన్లను వారి నుంచి విడిపించేందుకు పోలీసులకు చుక్కులు చూపించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశం పంపించేందుకు నెబ్సరాయ్లోని రాజుపార్క్కు శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్కొటిక్స్ సెల్ బృందం వెళ్లింది. వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే పోలీసులను 100 మంది ఆఫ్రికన్లు చుట్టుముట్టారు. వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ముగ్గురిలో ఇద్దరు పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. 22 ఏళ్ల పిలిప్ అనే వ్యక్తి దొరికిపోయాడు. పోలీసులపై మూకదాడి సమాచారం అందుకున్న నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్ బృందం, నార్కొటిక్స్ స్క్వాడ్ సాయంత్రం 6.30 గంటలకు రాజ్పార్క్కు చేరుకుంది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. మళ్లీ సుమారు 150-200 మంది ఆఫ్రికన్ దేశాల ప్రజలు పోలీసులను చుట్టుముట్టారు. పోలీసుల చెరలో ఉన్న వారు తప్పించుకునేందుకు సాయం చేశారు. వారిని చెదరగొట్టిన పోలీసులు నిందితులను నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి వారిని స్వదేశాలకు పంపించనున్నారు. Delhi Cops Arrest 3 On Drug Charge, Foreigners' Mob Brings Them Back https://t.co/Ggnt34m0rC pic.twitter.com/tFJLQBcF1L — NDTV (@ndtv) January 8, 2023 ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
విదేశీయులకు షాకిచ్చిన కెనడా
స్థిరాస్తుల (ఇళ్లు) కొనుగోళ్లు,అమ్మకాల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1,2023 నుంచి రెండేళ్ల పాటు కెనడాలో విదేశీయులు ఇళ్లను కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అధికారిక ప్రకటన చేశారు. కోవిడ్ -19 కారణంగా 2020 నుంచి కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు పలువురు రాజకీయ నాయకులు ఇళ్లపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీంతో అక్కడ ఇళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఆ కొరత తగ్గించాలని కెనడీయన్లు ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ఆ మరసటి ఏడాది దేశ ప్రధాని పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా తరుపున ట్రూడో రెండోసారి ప్రధాని పదవి కోసం బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లను రెండేళ్ల పాట బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీయే ట్రూడో రెండోసారి ప్రధాని అయ్యేందుకు దోహదపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతి అటుంచితే.. ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచి సామాన్యుల వరకు కెనడాలో ఇళ్లను కొనుగోలు చేయడానికి వీల్లేదంటూ అధికారిక ప్రకటన చేశారు. ఈ కొత్త చట్టంతో కెనడాలో ఇల్లు కొనుగోలు చేసే అవకాశం విదేశీయులు కోల్పోనున్నారు. వడ్డీ రేట్ల పెంపు కెనడియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ (సీఆర్ఈఏ) లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 2022లో ఇళ్ల ధరలు యావరేజ్గా $800,000 పెరిగాయి. ఆ తర్వాత 13శాతం తగ్గాయి. అదే సమయంలో కెనడా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచింది. ఫలితంగా మార్టిగేజ్ ఇంట్రస్ట్ రేట్లు భారీగా పెరిగాయి. 2019 నుంచి ఇళ్ల ధరలు 38శాతం పెరిగినట్లు నివేదించగా.. అమ్మకానికి ఉన్న గృహాల జాబితా ప్రీకోవిడ్ ముందుకు చేరాయని తెలిపింది. ఆందోళనలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఇళ్ల కొనుగోళ్లపై కెనడా ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయంపై ఆదేశ రియల్ఎస్టేట్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిషేధం కెనడియన్లు, ప్రత్యేకించి వింటర్ సీజన్లో ఇక్కడ ఉన్న ఇళ్లను అమ్మేసి విదేశాల్లో కొనుగోలు చేయాలనుకునే వారికి, లేదంటే విదేశీయులు కెనడాలో ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటే మెక్సికో, యూఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. చివరిగా::: మోర్టిగేజ్లోన్ అంటే ఓ వ్యక్తికి సొంతంగా ఓ ఇల్లు ఉండి పోషణ నిమిత్తం మోర్టిగేజ్లోన్ పేరిట కొంత మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్గా తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు విఫలమైనా, లేదంటే మరణించినా.. మోర్టిగేజ్లోన్లో ఉన్న ఇంటిని బ్యాంక్ అధికారులు వేలంలో అమ్మేస్తారు. ఆక్షన్లో వచ్చిన మొత్తంలో ఎంత లోన్ ఇచ్చారో తీసుకొని మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు. -
బిహార్లో నలుగురు విదేశీయులకు కరోనా.. ‘దలైలామా’ ఈవెంట్ వేళ కలకలం
పట్నా: కోవిడ్ మరోమారు విజృంభిస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచింది భారత్. ఎయిర్పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బిహార్లోని గయా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్గా తేలింది. అందులో ముగ్గురు ఇంగ్లాండ్, ఒకరు మయన్మార్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. కోవిడ్ పాజిటివ్గా తేలిన విదేశీయులను ఐసోలేషన్కు తరలించారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని గయా సివిల్ సర్జన్ రంజన్ కుమార్ సింగ్ తెలిపారు. ఎయిర్పోర్ట్లో మొత్తం 33 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్గా తేలింది. డిసెంబర్ 20న వారంతా బ్యాంకాక్ నుంచి గయా ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఇంగ్లాండ్ దేశీయులను బోధ్ గయాలోని హోటల్లో ఐసోలేషన్లో ఉంచగా.. మయన్మార్కు చెందిన వ్యక్తి ఢిల్లీకి వెళ్లారు. బోధ్ గయాలో డిసెంబర్ 29న బౌద్ధమత గురువు దలైలామా ప్రసంగం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా విదేశీ భక్తులు హాజరవుతారని అంచనా. 50 దేశాలపైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఈవెంట్కు మూడు రోజుల ముందు నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్గా తేలడం కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది? -
పర్యాటక ఏపీ.. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో మూడో ర్యాంకు
సాక్షి, అమరావతి: దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం సాధించింది. గత ఏడాది (2021) 9.32 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. 2021లో 11.53 కోట్ల మంది తమిళనాడును సందర్శించినట్లు ఆ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకులో ఉండగా, కర్ణాటక నాలుగో ర్యాంకు, మహారాష్ట్ర ఐదో ర్యాంకులో ఉన్నాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సందర్శనలో దాదాపు 65.41 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దేశీయ పర్యాటకుల్లో తమిళనాడును 17.02 శాతం, ఉత్తరప్రదేశ్ను 16.19 శాతం, ఆంధ్రప్రదేశ్ను 13.77 శాతం, కర్ణాటకను 12 శాతం, మహారాష్ట్రను 6.43 శాతం మంది సందర్శించినట్లు తెలిపాయి. 2021లో దేశీయ పర్యాటకుల వృద్ధి ఆంధ్రప్రదేశ్లో 31.69 శాతంగా గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల వృద్ధి 11.05 శాతమే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన వారి సంఖ్య క్షీణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో 2021లో దేశీయ పర్యాటకుల్లో వృద్ధి –19.99 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2019లో కూడా మూడో ర్యాంకులో ఉంది. అయితే 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగో ర్యాంకు పొందింది. 2021లో మళ్లీ పుంజుకొని మూడో ర్యాంకులోకి వచ్చింది. 2019 నుంచి 2021 వరకు టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటోంది. 2019లో ఆంధ్రప్రదేశ్ను 23.70 కోట్ల మంది దేశీయ పర్యాటకులు సందర్శించారు. కోవిడ్ ఆంక్షలు కారణంగా 2020లో 7.08 కోట్ల మందే వచ్చారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకుల సంఖ్య 2021లో గణనీయంగా తగ్గిపోయినట్లు పర్యాటక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం విదేశీ పర్యాటకుల సంఖ్య 7.17 మిలియన్లు ఉండగా 2021లో 1.05 మిలియన్లకు తగ్గిపోయింది. 2020తో పోల్చి చూస్తే 2021లో దేశం మొత్తం మీద విదేశీ పర్యాటకుల సంఖ్య 85.29 శాతం క్షీణించింది. 2019లో ఏపీలో విదేశీ పర్యాటకుల సంఖ్య 0.89 శాతం వృద్ధి ఉండగా కోవిడ్ కారణంగా 2020లో ఏపీలో 70.12 శాతం మేర, 2021లో 59.24 శాతం మేర క్షీణించింది. -
‘స్మార్ట్’ గైడ్.. ఒక్క క్లిక్తో ఎక్కడెక్కడికో.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ‘స్మార్ట్ ట్రావెలింగ్’ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ను ట్రావెల్ టూల్గా ఉపయోగిస్తూ దేశ, విదేశాలను చుట్టేస్తున్నారు. మధ్యవర్తులు, టూర్ ఆపరేటర్లు లేకుండానే ఒక్క క్లిక్తో అరచేతిలో సమాచారాన్ని వీక్షిస్తూ ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా 18 నుంచి 64 ఏళ్ల వయసు గల ప్రయాణికుల్లో 71% మంది తమ పర్యటనల కోసం స్మార్ట్ ఫోన్లపై ఆధారపడుతున్నారు. భారతదేశంలో అత్యధికంగా 87% మంది ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ సాయంతోనే తమ ప్రయాణాలు చేస్తున్నట్లు గూగుల్, ఫోకస్ రైట్ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. ఫోన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లోని వాయిస్ మోడ్లో సూచనలు, టికెట్ బుకింగ్లో డిజిటల్ అసిస్టెంట్ సేవలు సులభంగా లభిస్తున్నాయి. పర్యాటకులు ఎంపిక చేసుకున్న ప్రదేశాలకు నావిగేషన్ సాయంతో తేలికగా చేరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రావెల్ కంపెనీలు కూడా కస్టమర్ జర్నీకి అనుగుణంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సేవలను ప్రవేశపెడుతున్నాయి. పర్యాటక రంగానికి ఊతం... భారతదేశం నుంచి 2024 నాటికి సుమారు 8 కోట్ల మంది విదేశీ పర్యటనలు చేస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆసియా పసిఫిక్ డెస్టినేషన్ ఫోర్కాస్ట్–2022–24 రిపోర్టు ప్రకారం రానున్న రెండేళ్లలో 1.34 కోట్ల మంది విదేశీయులు భారతదేశాన్ని సందర్శిస్తారని అంచనా. దీనివల్ల కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రచారంలో డిజిటల్ పోటీ... కేరళ, మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఆన్లైన్ వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే కేరళ ప్రభుత్వం వర్చువల్ ట్రావెల్ గైడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా టూరిజం లొకేషన్లను సులభంగా తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో వాటిని విరివిగా ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) కూడా సాంకేతిక వ్యవస్థను మెరుగుపరుస్తోంది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా పర్యాటకులు కచ్చితత్వంతో తమ ప్రయాణాలను ఎంపిక చేసుకునేలా సేవలు అందించనుంది. స్థానిక కళలు, చేతివృత్తులను ప్రోత్సహించేలా పర్యాటక రంగానికి అనుసంధానిస్తూ జీఐఎస్ వెబ్సైట్ను రూపొందిస్తున్నారు. -
ఇంగ్లండ్, వేల్స్ విదేశీ నివాసితుల్లో భారతీయులదే అగ్రస్థానం
లండన్: ఇంగ్లండ్, వేల్స్లో ఉండే ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టిన వారే కాగా, ఇందులో 1.5 శాతంతో భారతీయులు అగ్రభాగంలో ఉన్నట్లు తేలింది. ఇంగ్లండ్, వేల్స్లోని నివాసితుల్లో విదేశాల్లో జన్మించిన వారు 2011లో 75 లక్షల మంది (13.4%) ఉండగా, 2021 నాటికి కోటి మంది (16.8%)కి చేరారని యూకే ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) గణాంకాలను వెలువరించింది. ఇంగ్లండ్, వేల్స్ నివాసితుల్లో యూకే వెలుపల జన్మించిన వారిలో అత్యధికులు 9.20 లక్షల మంది భారత్కు చెందిన వారే. ఆ తర్వాతి స్థానంలో 7.43 లక్షల మంది (1.2%)తో పోలండ్, 6.24 లక్షల మంది (1%)తో పాకిస్తాన్ మూడో స్థానంలో నిలిచాయి. 2011లో చేపట్టిన గణాంకాల్లోనూ భారత్, పోలండ్, పాకిస్తాన్లే మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. కాగా, యూకేలోని స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ ప్రాంతాల వివరాలను ఓఎన్ఎస్ పేర్కొనలేదు. ఇదీ చదవండి: COP 27: పాపం మీది.. పరిహారమివ్వండి.. పేద దేశాల డిమాండ్ -
చైనా ఆలోచనే డిఫరెంట్.. జిన్పింగ్ సర్కార్ను తిట్టిపోస్తున్న చైనీయులు!
బీజింగ్: మంకీపాక్స్ వైరస్ సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తమ ప్రజలకు చైనా వైద్య నిపుణులు సూచించారు. విదేశీయులను, విదేశాల నుంచి వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తాకవద్దని చెప్పారు. చైనాలోని తొలి మంకీపాక్స్ కేసు చాంగ్ఖింగ్ సిటీలో శుక్రవారం బయటపడింది. ఈ నేపథ్యంలో చైనాలో పేరుగాంచిన అంటువ్యాధుల నిపుణుడు వూ జున్యూ పలు సూచనలు జారీ చేశారు. స్కిన్ టు స్కిన్ కాంటాక్టు వల్ల మంకీపాక్స్ సోకుతుందని, అందుకే విదేశీయులను, ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిని ముట్టుకోవద్దని తెలియజేశారు. అయితే, వూ జున్యూ సూచనలపై చైనాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవి జాత్యహంకారాన్ని, జాతి వివక్షను ప్రోత్సహించేలా ఉన్నాయని జనం విరుచుకుపడుతున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. చైనాలో ఇప్పటికీ కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా, చైనాలో ఇటీవల మంకీపాక్స్ తొలి కేసు నమోదైంది. విదేశాల నుంచి ఇక్కడి చాంగ్క్వింగ్ నగరానికి చేరుకున్న ఓ వ్యక్తి.. కొవిడ్తో క్వారంటైన్లో ఉన్న సమయంలోనే మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే విదేశీయులను తాకవద్దంటూ సూచనలు చేశారు. Chief epidemiologist at the Chinese Centre for Disease Control and Prevention, Wu Zunyou, warned people not to touch foreigners after mainland China confirmed its first case of #monkeypox infectionhttps://t.co/enlrbXRqzc — IndiaToday (@IndiaToday) September 19, 2022 -
దేశాలు దాటిన ప్రేమ.. తల్లిదండ్రుల అనుమతితో రాష్ట్రానికి రప్పించి..
సాక్షి, చెన్నై: ఆన్లైన్లో ప్రేమించిన విదేశీ యువతిని రామేశ్వరం ఆలయంలో హిందూ సంప్రదాయ ప్రకారం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగళం ప్రాంతానికి చెందిన కాళిదాసు (30). ఇతని తండ్రి సబ్ ఇన్స్పెక్టర్గా పని చేసి విశ్రాంతి పొందారు. విదేశాల్లో పని చేస్తూ వచ్చిన కాళిదాసు కరోనా కారణంగా సొంత ఊరికి వచ్చాడు. గత రెండేళ్లుగా ఇంటి నుంచి అన్లైన్లో పని చేస్తూ వచ్చిన అతనికి యూరప్కి చెందిన హానా బొమిక్లోవా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఆన్లైన్లోనే ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తమిళ సంప్రదాయం ప్రకారం ఆమెను వివాహం చేసుకోవడానికి కాళిదాసు ఇష్టపడ్డాడు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ప్రియురాలిని రాష్ట్రానికి రప్పించాడు. ఇరు కుటుంబాల సమ్మతితో వారి వివాహము రామేశ్వరంలోని భద్రకాళి అమ్మన్ ఆలయంలో బుధవారం ఘనంగా జరిగింది. తర్వాత వధూవరులు రామనాథస్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. చదవండి: (తమిళనాడు అబ్బాయి, దక్షిణ కొరియా అమ్మాయి.. అలా ఒకటయ్యారు!) -
తిప్పి పంపడానికి తిప్పలెన్నో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తూ పోలీసులకు పట్టుబడిన విదేశీయులను వారి దేశాలకు పంపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి డిపోర్టేషన్ సెంటర్లో ఉంచుతారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సెంటర్ను తాత్కాలిక ప్రాతిపదికన నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఏర్పాటు చేశారు. సరైన వసతులు, సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ ఉంటున్న విదేశీయులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి వైఖరి పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే డిపోర్టేషన్ సెంటర్ను అనువైన ప్రాంతానికి మార్చాలంటూ నగర పోలీసుల దాదాపు ఏడాది క్రితం పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించట్లేదు. నగరంలోనే బెడద ఎక్కువ.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే నగరంలోనే ‘ఈ విదేశీయుల’ బెడద ఎక్కువగా ఉంటోంది. విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి నేపథ్యంలో, కల్చర్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగానూ అనేక మంది విదేశీయులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు ఇక్కడే అక్రమంగా ఉండిపోతున్నారు. ప్రధానంగా సూడాన్, సోమాలియా, నైజీరియా, యమెన్, కెన్యా, జిబౌటీ తదితర దేశాల నుంచి వస్తున్న వారితోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. ఇలా అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్) ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ సెంటర్గా పిలిచే చోట నిర్భంధించి ఉంచుతారు. ఉమ్మ డి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ఆపై తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్ సీసీఎస్ డిపోర్టేషన్ సెంటర్గా మా రింది. విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే వారి దేశాలకు పంపడం సాధ్యం కాదు. భాష అర్థం కాక.. ఆహారం అందించలేక.. చిక్కిన వారి వివరాలను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు (ఎఫ్ఆర్ఆర్ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సాయంతోనే డిపోర్ట్ చేయాలి. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్లోనే ఉంచాలి. డిపోర్టేషన్ సెంటర్ ఏర్పాటుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్లేటర్లు, వారికి అనువైన ఆహారం వండి ఇవ్వడానికి కుక్స్ ఉండాలి. సదరు సెంటర్ సైతం సువిశాల స్థలం మధ్యలో భవంతులతో నిర్మితం కావాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇవేవీ లేకుండా సీసీఎస్లోని ఓ సెల్ను డిపోర్టేషన్ సెంటర్గా మార్చారు. దీంతో ఇక్కడి విదేశీయుల భాష అర్థం కాక, వారు అడిగిన ఆహారం అందించలేక, వసతుల లేమి నేపథ్యంలో వాళ్లు చేస్తున్న హంగామా భరించలేక పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. వీటిని గమనించిన ఉన్నతాధికారులు డిపోర్టేషన్ సెంటర్ను అనువైన ప్రాంతానికి మార్చాలంటూ దాదాపు ఏడాది క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ సెంటర్ సీసీఎస్లోనే కొనసాగుతోంది. (చదవండి: 6 నెలల ముందే అభ్యర్థులు) -
పార్క్లో బట్టలు లేకుండా సంచరిస్తూ.. కనిపించిన వారితో..
బనశంకరి(బెంగళూరు): ఒంటిపై దుస్తులు లేకుండా ఉద్యానవనాల్లో సంచరిస్తూ పర్యాటకులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విదేశీ పర్యాటకున్ని ఆదివారం సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్చేశారు. జేమ్స్ అనే విదేశీయుడు శివరామకారంత లేఔట్పార్కులో బట్టలు లేకుండా తిరుగుతుండగా స్థానికులు సమాచారం అందించడంతో సంపిగేహళ్లి పోలీసులు వచ్చి అతన్ని పట్టుకోబోయారు. దీంతో పోలీసులపై దాడికి యత్నించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరో ఘటనలో.. చిన్నారిని చిదిమేసిన టిప్పర్ మండ్య: మద్దూరు తాలూకా దుండనహళ్లిలో ఘోరం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన భూమిక (6) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడే ప్రాణాలు విడిచింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై గ్రామస్తులు మండిపడ్డారు. పెద్దసంఖ్యలో జనం రోడ్డుపై ధర్నా చేసి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కెస్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: పదిరోజుల్లో తేజ పెళ్లి.. పెద్దలు పత్రికలు పంచుతుంటే.. -
విదేశీ వనిత కేసులో ఇద్దరికి అర్ధ జీవిత ఖైదు
నెల్లూరు (లీగల్): విదేశీ పర్యటనకు వచ్చిన వనితపై లైంగిక దాడికి యత్నించిన మనుబోలు మండలం బద్దవోలు వెంకన్నపాలేనికి చెందిన ఇంగిరాల సాయికుమార్, గూడూరు శారదనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహ్మద్అబీద్లకు జీవిత కాలంలో సగభాగం జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి.సుమ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. లిథువేనియా దేశానికి చెందిన ఓ విదేశీ వనిత శ్రీలంకకు వచ్చారు. అక్కడి నుంచి ఈ ఏడాది మార్చి 7న చెన్నైకి చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో బెంగళూరుకు వెళ్తుండగా ఆమె వద్ద ఉన్న కరెన్సీ చెల్లుబాటు కాకపోవడంతో కండక్టర్ దిగి పొమ్మన్నారు. బస్సులో ఉన్న సాయికుమార్ గమనించి ఆమెకు నగదు సాయం చేసి బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమెను బద్దవోలు వెంకన్నపాలెంలో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు తన స్నేహితుడు అబీద్తో కలిసి విదేశీ వనితను సైదాపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరూ లైంగిక దాడికి యత్నించారు. ఆమె తప్పించుకుని రోడ్డుపై వెళ్తున్న స్థానికుల సాయంతో సైదాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ విజయరావు ప్రత్యేక దృష్టి సారించి కేసును దిశ పోలీసులకు అప్పగించారు. విదేశీ వనిత కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసింది. దర్యాప్తు అనంతరం 10 రోజుల్లో కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేసింది. కేసుపై ప్రత్యేక దృష్టి సారించి 57 రోజుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాధుప్రసాద్ కేసు వాదించారు. జిల్లాలో అతి తక్కువ రోజుల్లో కేసు విచారణ చేసి తీర్పు వెలువరించడం గమనార్హం. -
Omicron: ‘నాన్ రిస్క్’ నుంచే రిస్క్!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయాల్లో కేవలం రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎక్కువగా దృష్టి పెట్టి పరీక్షలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో నమోదైన మూడు ఒమిక్రాన్ కేసులూ నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల విషయంలో తీసుకోవల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయాలని, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్గా పరీక్షలు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. 11 దేశాలను రిస్క్ కేటగిరీ కింద గుర్తించారు. ఇందులో జర్మనీ, ఫ్రాన్స్, కెనడాతో పాటు యూఎస్, యూకే తదితర దేశాలున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన అందరు ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ర్యాండమ్గా శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చి పాజిటివ్గా తేలిన వారి నమూనాల్లో ఒమిక్రాన్ను గుర్తించేందుకు జీనోమ్ స్వీక్వెన్సింగ్కు పంపిస్తున్నారు. వారిని విమానాశ్రయం నుంచి నేరుగా టిమ్స్కు తరలిస్తున్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారి నుంచి (2 శాతం) కేవలం నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్ ఫలితం రాకముందే పంపేస్తున్నారు. ఇలా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 7,018 మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో నాన్ రిస్క్ దేశాలకు చెందిన వారు 1,622 మంది ఉన్నారు. ఈ విధంగా నిర్దేశించిన 2 శాతం కంటే ఎక్కువగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షలు చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా 3 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అందరినీ పరీక్షించాలి రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రిస్క్, నాన్ రిస్క్ దేశాలనే దానితో సంబంధం లేకుండా విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడిపైనా దృష్టిపెట్టి పరీక్షలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన మూడు కేసులు జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని అంటున్నారు. అలాగే ర్యాండమ్గా పరీక్షలు నిర్వహిస్తున్న వారిని ఆర్టీపీసీఆర్ ఫలితం వచ్చేవరకు ఆపకుండా పంపించేయడం కూడా సమంజసం కాదని పేర్కొంటున్నారు. ఇలా పంపించేయ డం వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బయట పడిన 3 కేసులు ఇందుకు నిదర్శనమని అంటున్నారు. చదవండి: శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన -
సికింద్రాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ స్కామ్
సాక్షి, హైదరాబాద్: అమెరికాతో పాటు ఇంగ్లాడ్, ఐర్లాండ్ దేశాల్లో ఉన్న వారిని టార్గెట్గా చేసుకుని, సికింద్రాబాద్ కేంద్రంగా సాగుతున్న కాల్ సెంటర్ స్కామ్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. సోమవారం రాత్రి సదరు బోగస్ కాల్ సెంటర్పై దాడి చేసిన ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. ఆయా దేశాలకు చెందిన కొన్ని వందల మంది వీళ్లు ట్యాక్సులు, క్రిమినల్ కేసుల పేరుతో బెదిరించి భారీగా డబ్బు గుంజినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే నిందితులను లోతుగా విచారిస్తున్న అధికారులు పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. నగరవాసులతో కూడిన ఓ అంతరాష్ట్ర ముఠా సికింద్రాబాద్లో ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. వీళ్లు వివిధ మార్గాల్లో అమెరికా, ఇంగ్లాడ్, ఐర్లాండ్లో ఉన్న పన్ను చెల్లింపుదారుల వివరాలు సేకరించారు. వారికి ఈ కాల్ సెంటర్ నుంచి టెలికాలర్స్ ద్వారా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) విధానంలో వారికి కాల్స్ చేయిస్తోంది. తాము రెవెన్యూ, కస్టమ్స్ విభాగాలకు చెందిన అధికారులుగా పరిచయం చేసుకుంటోంది. ఫలానా లావాదేవీలకు సంబంధించి పన్ను బకాయి ఉన్నారంటూ వారిని బెదిరిస్తోంది. ఆ మొత్తం పెనాల్టీతో సహా చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని బెదరగొడుతున్నారు. చదవండి: (Hyderabad: అమ్ముతావా.. చస్తావా!) అక్కడి వారితో ఒప్పందాలు.. ►ఆయా దేశాల్లో రెవెన్యూ, కస్టమ్స్ విభాగాలకు సంబంధించిన కేసులు కఠినంగా ఉండటం వీరికి కలిసి వచ్చింది. ఈ కాల్స్కు భయపడిన ఆయా దేశీయులు సెటిల్ చేసుకుంటూ కొంత మొత్తం చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. ►వీరితో డబ్బు బదిలీ చేయించుకోవడానికి అక్కడే ఉంటున్న వారితో ఒప్పందాలు చేసుకున్న కాల్ సెంటర్ నిర్వాహకులు వారి అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. ►ఇలా ఇప్పటికే వందల మంది నుంచి భారీ మొత్తాలు ఆయా బ్యాంకు ఖాతాలకు వెళ్లాయి. ఈ మొత్తంలో తమ కమీషన్ మిగుల్చుకుంటున్న ఖాతాదారులు మిగిలింది హవాలా మార్గంలో ఇక్కడి సూత్రధారులకు పంపుతున్నారు. ►దీనిపై అమెరికన్ కాన్సులేట్కు సమాచారం అందింది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బేగంపేట, టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి కాల్ సెంటర్పై దాడి చేశారు. ►కొందరు టెలీకాలర్లతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితులను పట్టుకునేందుకు వేట ముమ్మరం చేశారు. ►ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయనున్నారు. నిందితుల అరెస్టును నేడోరేపో నగర పోలీసు కమిషనర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
ఊరట: విదేశీయుల వీసా గడువు పొడిగింపు..
న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు విదేశీయులు భారత్లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం వారి వీసా గడువు పెంచుతూ నిర్ణయం తీసకుంది. దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు ఆగస్ట్ 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది కూడా కేంద్రం దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు పెంచిన సంగతి తెలిసిందే. మహమ్మారి కారణంగా సాధారణ కమర్షియల్ విమాన కార్యకలాపాలు 2020 మార్చి నుంచి రద్దయ్యాయి. లాక్డౌన్కు ముందే చెల్లుబాటు అయ్యే భారతీయ వీసాలపై మన దేశానికి వచ్చిన అనేక మంది విదేశీ పౌరులు ఇండియాలో చిక్కుకుపోయారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. లాక్డౌన్ కారణంగా భారత్లో చిక్కుకున్న విదేశీ పౌరులు తమ వీసా గడువును పొడిగించుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో జూన్ 30, 2020 తర్వాత గడువు ముగిసే అటువంటి విదేశీ పౌరులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020 జూన్ 29న వీసా గడువును పొడిగిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. 2020 సాధారణ అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తేదీ నుంచి మరో 30 రోజుల వరకు వీసా చెల్లుబాటు అవుతుందని తెలిపింది. తాజాగా మరో సారి ఇదే సమస్య తలెత్తడంతో ఆగస్టు 31, 2021 వరకు ఎటువంటి ఓవర్స్టే పెనాల్టీ విధించకుండా ఉచిత ప్రాతిపదికన దేశంలో చిక్కుకున్న వీదేశీయుల వీసా గడువు పొడగిస్తూ కేంద్రం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక విదేశీ పౌరులు తమ వీసా గడువు పొడిగింపు కోసం సంబంధిత ఎఫ్ఆర్ఆర్ఓ లేదా ఎఫ్ఆర్ఓకు ఎటువంటి దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. విదేశీ పౌరులు దేశం నుంచి వెళ్లే ముందు సంబంధిత ఎఫ్ఆర్ఆర్ఓ, ఎఫ్ఆర్ఓకు నిష్క్రమణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఓవర్స్టే జరిమానా విధించకుండా ఉచిత ప్రాతిపదికన మంజూరు చేయబడుతుంది అని కేంద్రం తెలిపింది. -
హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం
మాదాపూర్: హైటెక్ సిటీలోని ఓ స్టార్ హోటల్పై యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ దాడి చేసి విదేశీ యువతులు, మోడళ్లతో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసింది. నిర్వాహకుడు పరారీ కాగా, ఐదుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించింది. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్లోని ఓ స్టార్ హోటల్లో ఉజబెకిస్తాన్కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతుల పేరిట ఐదు రూమ్లు బుక్ చేశారు. నిర్వాహకులు అర్నవ్, ప్రిన్స్లు ఫోన్లో విటులతో మాట్లాడి హోటల్కు రప్పించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ సదరు హోటల్పై దాడి చేసింది. వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉజబెకిస్తాన్కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుంది. విటుడు షేక్పేట్కు చెందిన జ్ఞాన శేఖర్ మణికంఠన్(44)ను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ గదులలో రూ.29,560 నగదు, కండోమ్ ప్యాకెట్లు, సెల్ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. కాగా, యువతులను రెస్క్యూ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఊరట
సాక్షి, హైదరాబాద్; వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా విదేశాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. నాలుగు రోజుల్లోపు తిరుగు ప్రయాణ టికెట్లతో వ్యాపార నిమిత్తం వచ్చే వారు తమ ప్రయాణానికి 96 గంటల్లోపు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వస్తే క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా, వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వారు కేవలం 14 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉంటే చాలని తెలిపారు. అలాగే గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు, వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్న వాళ్లు హోమ్ క్వారంటైన్లో ఉండవచ్చు. నెగెటివ్ రిపోర్టు లేని వాళ్లు మాత్రం కచ్చితంగా 7 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు రెగ్యులర్ విమానాలు (ఎయిర్ ట్రాఫిక్ బబుల్ ఒప్పందం మేరకు) రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి వందే భారత్ మిషన్ కింద చార్టర్డ్ విమానాలు, ఇతర విదేశీ విమాన సర్వీసులు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు విదేశాల్లో చిక్కుకుపోయిన 55 వేల మంది నగరానికి చేరుకున్నారు. -
తబ్లిగీ జమాత్: వారిని బలిపశువులను చేశారు
ముంబై : ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 29 మంది విదేశీయులపై నమోదైన కేసులను శనివారం బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించింది. మార్చిలో ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీ పౌరులను బలి పశువులు చేశారని, కరోనా వ్యాప్తికి వారు కారణమయ్యారని అనవసర ప్రచారం జరిగిందని హై కోర్టు తెలిపింది. ఈ మేరకు 29 విదేశీయులపై నమోదైన కేసులను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ టీవీ నాలావాడే ఎంజీ సెవ్లికర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. (కేంద్ర నిర్ణయం : ఏకమైన విపక్షాలు) ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరించారని, రాజకీయ బలవంతంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని ధర్మాసనం పేర్కొంది. అలాగే వీరిపై సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేసినందుకు సోషల్ మీడియాపైనా బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరుకావడం ద్వారా దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైనట్లు అప్పట్లో పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. (అన్లాక్ 3.0: యూటీలు, రాష్ట్రాలకు కేంద్రం లేఖ) పర్యాటక వీసా అనుమతులను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 29 మంది విదేశీ పౌరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు తబ్లిగీ జమాత్ కార్యక్రమం 50 సంవత్సరాల నుంచి కొనసాగుతోందని, ఇది ఏడాదంతా సాగుతుందని వ్యాఖ్యానించింది. అతిథులను స్వాగతించే గొప్ప సంప్రదాయం, సంస్కృతిని భారతదేశ ప్రజలు నిజంగా పాటిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు పశ్చాత్తాపడాలని పేర్కొంది. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావొద్దని హెచ్చరించింది. -
టికెట్ల డబ్బులు తిరిగివ్వలేం..
జైపూర్: లాక్డౌన్ కాలంలో రంథమ్బోర్ పులుల అభయారణ్యాన్ని సందర్శించేందుకు టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి చెల్లించలేమని రాజస్థాన్ అటవీ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే ఆ డబ్బును రాష్ట్ర ఖజానాలో జమ చేసినందున తిరిగి ఇవ్వడం కష్టమని పేర్కొంది. అయితే ఓ వెసులుబాటు కల్పించింది. పర్యాటకులు ఎప్పుడైనా రాష్ట్రంలో పర్యటించవచ్చునని స్పష్టం చేసింది. ఇందుకు జూన్ 22, 2022 వరకు గడువు విధించింది. కాగా మార్చి 18 నుంచి జూన్ 30 మధ్య 28 వేల మంది పర్యాటకులు రంథమ్బోర్ పులుల అభయారణ్యాన్ని సందర్శించేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇందులో పది వేలమంది విదేశీయులు ఉన్నారు. (రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..) బుక్ చేసుకున్న టికెట్ల విలువ రూ.8 కోట్లు ఉంది. అయితే వీటిని తిరిగి చెల్లించడానికి బదులుగా జూన్ 2022లోపు ఎప్పుడైనా టైగర్ రిజర్వ్ను సందర్శించేందుకు అటవీ శాఖ అవకాశం ఇచ్చింది. ఇందుకోసం పర్యాటకులు మూడు తేదీలను సూచించాల్సిందిగా కోరింది. వాటిని పరిశీలించిన పిదప అందులో ఒక తేదీని ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. కాగా పులుల అభయారణ్యంలోకి ప్రవేశించిన అనంతరం వాటిని దగ్గర నుంచి వీక్షించేందుకు జిప్సీ, క్యాంటర్లలో వెళ్లాల్సి ఉంటుంది. వీటిని వినియోగించుకోవాలంటే స్వదేశీయులు 1100 రూపాయలు, 780 రూపాయలు చెల్లించాల్సి ఉండగా విదేశీయులు 1800, 1200 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. (అడవి బిడ్డే హక్కుదారు) -
అక్రమంగా అడుగిడుతూ.. ఇక్కడే స్థిరపడుతూ..
మనదేశంలో ఎంతమంది విదేశీయులు అక్రమంగా ఉంటున్నారన్న ప్రశ్నకు కేంద్ర హోం శాఖ వద్ద సమాచారం లేదు.’ తెలంగాణలో ఎందరు రోహింగ్యాలు పాస్పోర్టు, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారన్న విషయంపై ఆర్టీఐ దరఖాస్తుకు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఇంకా సమాధానం వెల్లడించలేదు. సాక్షి,హైదరాబాద్: విజిటింగ్ వీసాల పేరిట భారత్లోకి వస్తున్న విదేశీయులు ఏం చేస్తున్నారు? వారిపై నిఘా ఉందా? మొన్న తబ్లిగీ జమాత్ కోసం వచ్చిన ఇండోనేషియన్లు విజిటింగ్ వీసాను దుర్వినియోగం చేయడం, వారివల్ల దేశంలో కరోనా వ్యాపించడంపై ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వీసాలు రద్దు చేసి, వారిపై వీసా ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశాయి. అయితే ఇప్పటికే భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ వల్ల దేశంలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో అక్రమ వలసలకు తోడు విజిటింగ్ వీసాల మీద వచ్చిన వారిపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్లోని పలు ముఠాలు భారత్లో మానవ అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణా, దొంగనోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రదాడులకూ ప్రణాళికలు రచిస్తున్నాయి. వాటిలో దొంగనోట్లు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ.. దేశంలో విధ్వంసాలకు కారణంగా మారుతోంది. 9 లక్షలకు పైగానే.. తబ్లిగీ జమాత్ ఉదంతం నేపథ్యంలో ఆగస్టు 2019 నుంచి మార్చి 2020 వరకు దేశంలోకి ఎందరు విజిటింగ్ వీసాలపై వచ్చారన్న సమాచారం ‘సాక్షి’ సేకరించింది. దీనిపై బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్న భారత ఎంబసీకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఆగస్టు నుంచి మార్చి వరకు 9.6 లక్షల మంది బంగ్లాదేశీయులు విజిటింగ్ వీసాలపై భారత్లోకి వచ్చారు. అలాగే వియత్నాం నుంచి 1,126 మంది, కౌలాలంపూర్లోని 1,405 మంది ఇండోనేషియన్లకు భారత్లో పర్యటించేందుకు వీసాలు ఇచ్చామని వాళ్లెవరికీ మతపరమైన వీసాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. తెలంగాణలోనూ అధికంగా..! వివిధ దేశాల నుంచి విజిటింగ్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు వీసా గడువు ముగిసినా వెనక్కి వెళ్లట్లేదు. ఇలాంటి వారిలో కొందరు తెలంగాణలోనూ స్థిరపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్లో కలిపి 10 వేల మందికిపైగానే రోహింగ్యాలు, ఇతర విదేశీయులు అక్రమంగా ఉంటున్నారని సమాచారం. వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం కల్పిస్తుండగా మిగిలిన వారు భూములను కబ్జా చేసి స్థిర నివాసం ఏర్పరుచు కుంటున్నారు. ఆధార్, పాస్పోర్ట్, పా¯Œ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసె¯Œ ్స వంటి గుర్తింపు పత్రాలను సులువుగా సంపాదిస్తున్నారు. -
దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కారణంగా ఇండియాలో చిక్కుకు పోయిన విదేశీయులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించింది. విదేశీయుల వీసా గడువును పొడిగించింది. విదేశీయుల వీసాల చెల్లుబాటును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తరువులిచ్చింది. కరోనా వైరస్ కారణంగా బారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీ పౌరుల రెగ్యులర్ వీసా, ఇ-వీసా లేదా స్టే నిబంధనలను 30.04.2020 (అర్ధరాత్రి) వరకు పొడిగించినట్టు తెలిపింది. అటువంటి విదేశీ పౌరుల వీసాలను ఎలాంటి జరిమానా లేకుండా ఉచితంగా ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో దేశీయంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. అలాగే ఇతర దేశాలకు రాకపోకలను కూడా నిషేధించిన సంగతి విదితమే. కాగా దేశంలో 21 రోజుల లాక్డౌన్ రేపటితో ముగియనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడిగించాలని కోరుకుంటుండగా. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ను పొడిగించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (మంగళవారం) ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని తెలుస్తోంది. -
లాక్డౌన్: 500 సార్లు సారీ..
డెహ్రాడూన్: మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దయచేసి ఇంట్లోనే ఉండండి.. సామూహికంగా తిరగకండి అని చిలకకు చెప్పినట్లు చెప్పినా ఎవరూ చెవికెక్కించుకోవట్లేదు. దీంతో పోలీసులు లాఠీ ఝుళిపించక తప్పలేదు. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. తాజాగా విహారానికి అంటూ మూకుమ్మడిగా తిరుగుతున్న విదేశీయులకు రిషికేశ్ పోలీసులు తగిన గుణపాఠం నేర్పారు. వివరాల్లోకి వెళితే... శనివారం ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో పదిమంది విదేశీయులు లాక్డౌన్ ఆంక్షలను బేఖాతరు చేస్తూ బయటకు వచ్చారు. (కరోనా ఎఫెక్ట్: ఇకపై విదేశీయులకు నో ఎంట్రీ) కనీసం సామాజిక ఎడబాటును కూడా పట్టించుకోకుండా గంగా నదిలో విహరిస్తూ ఎంజాయ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని వారికి అరుదైన శిక్ష విధించారు. "నేను లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించాను, అందుకు క్షమించండి" అని వారితో 500 సార్లు రాయించారు. దీనికోసం పెన్నూ పేపర్ కూడా చేతికందించారు. మొదటిసారి కాబట్టి ఇలాంటి చిన్న శిక్షతో వదిలేస్తున్నామని, మరోసారి ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా విదేశీయులంతా ఇజ్రాయెల్, మెక్సికో, ఆస్ట్రేలియా, ఇతర యూరోపియన్ దేశాలకు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. (కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారత్ అగ్రస్థానం) -
విదేశీయునికి కరోనా పాజిటివ్
సాక్షి, అనంతపురం: బెంగళూరులో ఫ్రాన్స్కు చెందిన వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. కోవిడ్ స్టేట్ నోడల్ అధికారులు సదరు విదేశీయుడు పుట్టపర్తిలో ఎక్కడ బస చేశాడు? ఎవరితో సన్నిహితంగా ఉన్నాడు తదితర వివరాలు సేకరించాలని జిల్లా ఆరోగశాఖాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు ర్యాపిడ్ యాక్షన్ బృందం డాక్టర్ వాలీ్మకి శ్రీనివాస్, డాక్టర్ భీమసేనాచార్, డాక్టర్ రాంకిషోర్ (అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనాస్పత్రి), డీఎంఓ దోశారెడ్డి, పోలీసులు పుట్టపర్తిలో జల్లెడ పట్టారు. ఫ్రాన్స్ దేశస్తుడు కొమరైన్ అలైన్జెన్ (64) పుట్టపర్తిలోని సాయికుమార్ సాయికుమార్ లాడ్జ్లో బస చేశారని చెప్పడంతో బృందం అక్కడకు వెళ్లి ఆరా తీసింది. అధికారుల ఆదేశాల మేరకు విదేశీయులను లాడ్జి నుంచి ఖాళీ చేయించారు. దీంతో కొమరైన్ ఈ నెల 15న లాడ్జి ఖాళీ చేశాడు. 17వ తేదీ బెంగుళూరుకు వెళ్లిపోయాడు. శుక్రవారం బెంగుళూరులోని ఆస్పత్రిలోపరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో అధికారులు గురువారం రాత్రి సాయికుమార్ లాడ్జిని సీజ్ చేశారు. సదరు విదేశీయుడు పుట్టపర్తిలో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నాడు అని ఎస్పీ సత్యయేసుబాబు సైతం ఆరా తీశారు. ఐదుగురి నమూనాల సేకరణకు ఆదేశం పుట్టపర్తి చెందిన లాడ్జ్ యజమాని దంపతులు, ఓ వృద్ధురాలు, స్వీపర్, స్వీపర్ భర్తకు అధికారులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు తెల్సింది. శనివారం మరోసారి స్థానికంగా ఉండే వైద్యులు సర్వే చేయనున్నారు. మరో రెండు అనుమానిత కేసులు: కదిరి, తాడిపత్రి నుంచి మరో రెండు అనుమానిత కేసులు సర్వజనాస్పత్రికి వచ్చాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు అనంతపురం నుంచి రెండు అంబులెన్స్లను ఆయా ప్రాంతాలకు పంపారు. వెయ్యి టెస్టులకు సిద్ధం చేసుకోవాలి వైరల్ రీసెర్చ్ డయాగ్నస్టిక్ ల్యాబోరేటరీలో వెయ్యి కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన పరికరాలు, కెమికల్స్ సిద్ధం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డిల్లీరావు వైద్యులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం వైద్య కళాశాలలోని వీఆర్డీఎల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎన్ని పరీక్షలు జరిపారని, మౌలిక సదుపాయాలు ఏం కావాలని ఆరా తీశారు. ఆయన వెంట జాయింట్ డైరెక్టర్ సుదర్శన్, నోడల్ ఆఫీసర్ ఏపీ నాయుడు, వీఆర్డీఎల్ వైద్యులు తదితరులు ఉన్నారు. -
కరోనా ఎఫెక్ట్: ఇకపై విదేశీయులకు నో ఎంట్రీ
ఈటానగర్: కరోనా వైరస్(కొవిడ్-19) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. చైనాలో ప్రాణం పోసుకున్న ఈ మహమ్మారి ప్రస్తుతం 73 దేశాలను వణికిస్తోంది. పరస్పరం షేక్హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా మనుషులు ఆలోచిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తులను శత్రువుల కన్నా హీనంగా చూసి, దూరంగా వెళ్తున్న ఘటనలను ఎన్నింటినో మనం చూస్తున్నాం. ముందస్తు చర్యగా కరోనా వైరస్ను అడ్డుకునేందుకు అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత్ @ 39 అందులో భాగంగా రాష్ట్రంలోకి విదేశీయుల రాకపోకలపై నిషేధం విధించింది. విదేశీయులకు అనుమతులు(పీఏపీ) ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. చైనాతో సరిహద్దును పంచుకునే అరుణాచల్ ప్రదేశ్లోకి పీఏపీలకు ప్రవేశం అనుమతించాలని విదేశీయులు కోరుతున్నా అంగీకరించడంలేదు. తాజాగా కేరళలో ఒకే రోజు ఐదు కేసులు నమోదు కావడంతో అరుణాచల్ ప్రదేశ్ అప్రమత్తమై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
కొంపముంచిన ఫేస్బుక్ పరిచయం
సాక్షి, గుంటూరు: ఫేస్బుక్లో పరిచయమైన ఓ విదేశీ యువతి తనను దారుణంగా మోసం చేసిందని నరసరావుపేటకు చెందిన సీహెచ్ కృష్ణదాసు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీ అందించారు. ఫేస్బుక్లో తరచూ చాటింగ్ చేస్తున్న క్రమంలో నెల రోజుల క్రితం గిఫ్టు పంపుతున్నాను అని యువతి కృష్ణదాసుకు సమాచారం పంపింది. కొన్ని రోజుల తర్వాత రోజు మరో వ్యక్తి ఫోన్ చేసి గిఫ్ట్ వచ్చిందని పార్సిల్ తీసుకోవాలంటే రూ.30 వేలు కట్టాలని అని చెప్పాడు. దీంతో కృష్ణదాసు ఆన్లైన్లో ఆ నగదు చెల్లించాడు. మరుసటి రోజున మరో వ్యక్తి ఫోన్ చేసి ట్యాక్స్లు చెల్లిస్తేనే మీ పార్సిల్ తీసుకోవడం సాధ్యం అని చెప్పాడు. మొత్తం రూ.3 లక్షలు కట్టాలని చెప్పడంతో ఆ నగదు కూడా చెల్లించాడు. ఆ తర్వాత నుంచి వారి ఫోన్ స్విచ్చాఫ్ అయింది. విచారించి న్యాయం చేయాలని బాధితుడు వాపోయాడు. అలానే కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసగా మారి వేధిస్తున్నాడని నరసరావుపేటకు చెందిన శశికళ అనే మహిళ ఫిర్యాదు చేసింది. తన కాపురం చక్కదిద్దాలని వేడుకుంది. 95 కు పైగా ఫిర్యాదులు అందాయి. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు నా భర్త ఓ హాస్పటల్లో మేనేజర్గా పనిచేస్తుంటాడు. మాకు ముగ్గురు ఆడపిల్లలు. రెండేళ్ల క్రితం నాకు పుట్టింటి నుంచి వచ్చిన డబ్బుతో పాటు నేను దాచుకున్న డబ్బు రూ. 37 లక్షలు నా భర్త తీసుకున్నాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే తరచూ హింసిస్తున్నాడు. బాధలు భరించలేక రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేశానని మళ్లీ తీవ్రంగా కొట్టాడు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోగా నా భర్తకు వత్తాసు పలుకుతున్నారు. విచారించి న్యాయం చేయాలి. – జి.శ్రీలక్ష్మీ, గంగానమ్మపేట, తెనాలి -
విదేశీయుల ఆధ్యాత్మిక చింతన
నెల్లిమర్ల రూరల్: భారతదేశ యువత పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ.. భారతీయ సంస్కృతిని పెడచెవిన పెడుతున్న రోజుల్లో.. విదేశీయులు భారతదేశ సంస్కృతిని అమితంగా ఇష్టపడుతున్నారు. భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి నెల్లిమర్ల మండలం టెక్కలి గ్రామం వేదికైంది.వరల్డ్ టీచర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్ప్రెయిన్, జర్మనీ తదితర పది దేశాల నుంచి 100 మంది విదేశీయులు గ్రామానికి ఆదివారం విచ్చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆచారాలను, వ్యవహారశైలిని దగ్గరుండి తిలకించారు. గ్రామానికి విచ్చేసిన విదేశీయులకు ఆ గ్రామ ప్రజలు, జగద్గురు పీఠం సభ్యులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు దారి పొడువునా నిలిచి చిరునవ్వులతో పూలను అందించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణ నడుమ గ్రామ పోలిమేరల నుంచి పాదయాత్రగా టెక్కలిలో రామాలయానికి తీసుకువచ్చారు. విదేశీయులందరూ హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో విశేష పూజలు జరిపారు. గణపతి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి మురిసిపోయారు. అనంతరం ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలను సందర్శించి గో పూజలు నిర్వహించారు. ట్రస్టు ప్రతినిధులు బీఆర్కేరాజు, ఎన్వీఎస్ఎన్ మూర్తి, మాజీ సర్పంచ్ కర్రోతు రాజినాయుడు తదితరులు సేవలందించారు. ఏటా విశాఖకు విదేశీ బృందం... మానవుడికి కావాల్సిన జ్ఞానాన్ని అన్ని మతాలు బోధిస్తాయి. అలా మానవుడిని ఉన్నతిగా నడిపించడం కోసం చేసిన ప్రయత్మమే గురుతత్వం. గురువుగా ఉన్నది తత్వమే గాని వ్యక్తి మాత్రం కాదు అనేది వరల్డ్ టీచర్ ట్రస్టు సిద్ధాంతం. సృష్టి ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు జీవిని నడిపిస్తునటువంటి గురువును జగద్గురువని పిలుస్తారని, వారి పేరిట ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్టు నిర్వాహుకులు తెలిపారు. ఈ వరల్డ్ టీచర్ ట్రస్టును విశాఖపట్నంకు చెందిన ఎక్కిరాల కృష్ణామాచార్యులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ట్రస్టు 126 దేశాల్లో విస్తరించి ఉంది. ఏటా జనవరి నెలలో 11, 12, 13 తేదీల్లో విశాఖ జిల్లా సింహాచలం కొండ దిగువున అంతర్జాతీయ యోగా సమావేశాలను నిర్వహిస్తుంటారు. వరల్డ్ టీచర్ ట్రస్టు తరఫున వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు అధిక సంఖ్యలో విశాఖకు తరలివచ్చి ఏటా క్రమం తప్పకుండా సమావేశాలకు హజరవుతారు. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక బావాలను తెలుసుకుంటారు. దీనిలో భాగంగా నెలరోజుల కిందటే విదేశీయులంతా విశాఖకు విచ్చేశారు. ట్రస్టు ప్రతినిధి‡ స్వగ్రామం టెక్కలి కావడంతో గ్రామీణ ప్రాంత ప్రజల వ్యవహారశైలి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వారంతా గ్రామానికి విచ్చేశారు. వీరి రాకతో టెక్కలిలో సందడి వాతావరణం నెలకొంది. భారతీయ సంస్కృతి గొప్పది... భారతీయుల సంస్కృతి గొప్పది. వారి ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఎంతో నచ్చుతాయి. మేమంతా సంస్థ తరఫున ఏటా భారతదేశంలో ఉన్న విశాఖపట్నంకు వస్తుంటాం. యోగా, ఆధ్యాత్మిక తరగతులను నిర్వహిస్తుంటాం. పట్టణంలో ఉన్న కల్చర్కు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రజలు ఇస్తున్న గౌరవం మరువలేనిది. – గాబ్రియల్ ఫారెస్, స్పెయిన్ దేశస్తురాలు -
పంపాలంటే ప్రహసనమే!
సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాదం... మాదకద్రవ్యాలు... సైబర్ నేరాలు... ఇలా వివిధ కేసుల్లో విదేశీయులు నగరంలో అరెస్టు అవుతుంటారు. వీరితో పాటు సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారినీ పట్టుకుంటారు. వీరందరినీ ఎప్పుడో ఒకప్పుడు వారి దేశాలకు బలవంతంగా తిప్పి పంపాల్సి ఉంటుంది. డిపోర్టేషన్గా పిలిచే ఈ ప్రక్రియ పెద్ద ప్రహసనమే. గత ఏడాది సైబర్ నేరంలో చిక్కిన పాకిస్థానీ ఇక్రమ్ విషయంలో ఈ తంతు నడుస్తుండగా... తాజాగా పట్టుబడిన మరో పాక్ జాతీయుడు గుల్జార్ అంశంలో ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆప్రికా దేశాల వాళ్ళే ఎక్కువ... రాజధానిలో ఏళ్ళుగా వివిధ నేరాలకు సంబంధించి విదేశీయులు పట్టుబడుతూనే ఉన్నారు. ఇలా చిక్కుతున్న వారిలో అత్యధికులు ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళే ఉంటున్నారు. నైజీరియా, ఇథియోపియా, సోమాలియా, సూడాన్ తదితర దేశాలకు చెందిన అనేక మంది విద్య, ఉద్యోగ, వ్యాపార వీసాలపై వచ్చి దాని గడువు ముగిసినా అక్రమంగా స్థిరపడి చిక్కుతున్నారు. ఇలాంటి వారితో పాటు సక్రమంగా నివసిస్తున్న వారిలోనూ డ్రగ్స్, సైబర్ నేరాలకు పాల్పడుతూ మరికొందరు పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇక ఉగ్రవాద సంబంధ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో పాకిస్థాన్తో పాటు బంగ్లాదేశీయులు ఉంటున్నారు. ఇటీవల కాలంలోరోహింగ్యాల అరెస్టులూ పెరిగాయి. వీటితో పాటు ఇతర దేశాలకు చెందిన వారూ అప్పుడప్పుడు పట్టుబడుతున్నారు. ఎంబసీలకు పక్కా సమాచారం... సాధారణ వ్యక్తుల అరెస్టు విషయంలో ఉండే నిబంధనలకు భిన్నంగా విదేశీయుల అరెస్టులో ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలు, ఆయా దేశాలతో ఉండే వర్తకవాణిజ్య వ్యవహారాల ఆధారంగా> ఈ విధానాలు ప్రవేశపెట్టారు. వీటి ప్రకారం నగరంలో ఏ విదేశీయుడిని అరెస్టు చేసినా తక్షణం ఆ సమాచారం ఆ దేశాలకు చెందిన ఎంబసీ/కాన్సులేట్ కార్యాలయకు చేర్చాలింది. నిందితుల్ని అరెస్టు చేసిన విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు లిఖిత పూర్వకంగా, అమలులో ఉన్న ఫార్మాట్ల ప్రకారం దీన్ని అందిస్తారు. ఇతర దేశాల విషయంలో పరిస్థితి ఎలా ఉన్నా... అమెరికా, లండన్ తదితర కొన్నింటికి చెందిన రాయబార కార్యాలయాలు ఈ విషయాల్లో తక్షణం స్పందిస్తాయి. అనేక సందర్భాల్లో తమ ఉద్యోగుల్ని జైళ్ళ వద్దకు పంపి, మిలాఖత్లో రిమాండ్లో ఉన్న తమ దేశీయుల్ని కలిసి మాట్లాడేలా చేస్తాయి. అవసరమైన పక్షంలో న్యాయసహాయం చేయడానికి ముందుకు వస్తాయి. తీవ్రమైన కేసుల్లో చేతులెత్తేస్తారు... ఎంహెచ్ఏ, ఎంఈఏల ద్వారా పోలీసులు రాసే ప్రతి లేఖ పైనా ఆయా రాయబార కార్యాలయాలు సానుకూలంగా స్పందించవు. ఆ నిందితుడిపై మోపిన నేరాల తీరుతెన్నుల్ని బట్టి వారి స్పందన ఉంటుంది. సైబర్ నేరాలు, మోసాలతో పాటు హత్య, హత్యాయత్నం, దాడి వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న లేదా దోషిగా నిరూపితమైన వ్యక్తి తమ దేశీయుడే అంటూ అంగీకరిస్తాయి. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఇక్రమ్ విషయంలో అతడు పాకిస్థానీయే అని అంగీకరించిన ఆ దేశం కేసు విచారణ ముగిసిన వెంటనే డిపోర్టేషన్ చేయమని కోరింది. ఉగ్రవాదం, గూఢచర్యం వంటి ఆరోపణలు, బలమైన ఆధారాలు ఉన్న కేసుల్లో మాత్రం ఆయా దేశాలు ఈ విధంగా స్పందించవు. అరెస్టు అయిన వ్యక్తికి, తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని చెప్తుంటాయి. కొన్నేళ్ళ క్రితం పాతబస్తీలో చిక్కిన ఐఎస్ఐ ఏజెంట్ సలీం జునైద్ విషయంలో ఇలానే జరిగింది. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్లోనే... ఆయా దేశాలతో సంప్రదింపులు, రూఢీలు పూర్తయ్యే వరకు ఆయా నిందితులు ఇక్కడే ఉంటారు. కేసు విచారణలో ఉంటేనో, శిక్ష పడితేనో జైల్లో ఉంచాలి. అలా కాకుండా సరైన ఆధారాలు లేని కారణంగా కేసు వీగిపోయినా, శిక్షాకాలం పూర్తయినా డిపోర్టేషన్ సెంటర్కు తరలిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ప్రసుత్తం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డిపోర్టేషన్ సెంటర్గా, దాని డీసీపీ డిటైన్ చేసే అధికారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లో కొన్ని ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వీరిలో కొందరు తమ వివరాలు చెప్పడానికి వెనుకాడటంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశానికి వెళ్ళమని చెప్తున్నారు. అలాంటి వారిలో అర్హత ఉన్న వారికి డిపోర్టేషన్ సెంటర్ అధికారులే ఐక్యరాజ్య సమితి నుంచి శరణార్థుల కార్డులు ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశం అంగీకరించాల్సిందే.. ఏ నేరంలో చిక్కిన విదేశీయుడినైనా ఏదో ఒక సందర్భంలో వారి దేశానికి పంపించేయాల్సి ఉంటుంది. ఎప్పుడు పంపాలనేది ఆ దేశ రాయబార కార్యాలయం కోరిన దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేసు విచారణతో పాటు శిక్షాకాలం ముగిసిన తర్వాత, అరుదైన కేసుల్లో మాత్రమే శిక్షతో సంబంధం లేకుండా కేసు విచారణ ముగిసిన వెంటనే పంపాల్సి ఉంటుంది. డిపోర్టేషన్గా పిలిచే దీన్ని చేపట్టాలంటే తొలుత ఆ నిందితుడు/దోషి తమ దేశీయుడే అంటూ ఆ దేశం అంగీకరిస్తూ రాయబార కార్యాలయం ద్వారా సందేశం ఇవ్వాలి. దీనికోసం పోలీసు విభాగం నిందితుడి/దోషి వివరాలు, అందుబాటులో ఉంటే పాస్పోర్ట్ నెంబరుతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు (ఎంహెచ్ఏ) లేఖ రాస్తారు. ఆ శాఖ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దాన్ని ఆయా దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదించి వివరాలు పొందుతుంది. దీనికి కొన్ని నెలల సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. -
పైపుల్లో 14 కేజీల పసిడి
శంషాబాద్: పైపుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా విమానం ఏఐ–952 గురువారం తెల్లవారుజామున 5.30కి శంషాబాద్ విమానాశ్రయం లో దిగింది. బంగారం అక్రమ రవాణా గురించి విశ్వసనీయ సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు తాము కూర్చున్న 31ఏ, 32ఏ సీట్ల కింద బంగారాన్ని తెచ్చినట్లు గుర్తించారు. నల్లని టేపుతో చుట్టిన బంగారాన్ని 14 హాలో పైపుల్లో దాచినట్లు అధికారులు తెలిపారు. పైపుల నుంచి 112 బంగారు బిస్కెట్ ముక్కలను బయటకు తీశారు. మొత్తం 14 కేజీల బరువు కలిగిన ఈ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిలో ఒకరు దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తి కాగా మరొకరు చైనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో వీరితో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయించింది ఎవరనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా, ఐదేళ్ల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు 27 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం 9 కేజీల బంగారాన్ని మరో వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఇద్దరు వ్యక్తుల నుంచి బంగారం స్వాధీనం చేసుకోవడం చర్చనీయాశమైంది. -
పెళ్లికని వచ్చి శవమై తేలింది..!
న్యూఢిల్లీ : భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుందామని వచ్చిన ఓ జంటకు తీవ్ర విషాదం మిగిలింది. మహిళ అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. న్యూజిలాండ్కు చెందిన తుయల్లి పాలీ అన్నే(49), ఆస్ట్రేలియాకు చెందిన తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఢిల్లీ వచ్చారు. పహర్గంజ్లోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. అక్కడ జరిగే ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని.. వారు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, శనివారం ఉదయం అన్నే వాష్రూమ్లో అపస్మారక స్థితిలో పడివుంది. అది గమనించిన ఆమె బాయ్ఫ్రెండ్ హోటల్ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అన్నే అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అన్నే హైపర్ టెన్షన్ రోగి కావడంతో.. కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమె మృతికి కచ్చితమైన కారణం తెలియదని చెప్పారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
పిలవని పెళ్లికి వెళ్లొద్దాం
ఒక దేశ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవాలనుకుంటే పండుగలు, వివాహాలకు మించిన వేడుకలేముంటాయి? అదీగాక సంప్రదాయబద్ధంగా, వైభవోపేతంగా జరిగే భారతీయ పెళ్లి సందడంటే పాశ్చాత్యులకు మోజు. ఆ క్రేజ్ను గమనించే ‘జాయిన్ మై వెడ్డింగ్ డాట్ కామ్’ అనే ఆస్ట్రేలియన్ సైట్ వెలిసింది! తమ పెళ్లికి విదేశీ అతిథులను ఆహ్వానించదలిచిన వధూవరులు ఈ వెబ్సైట్లో తమ పేరు, పెళ్లి సంబరం తాలూకు వివరాలను పొందుపర్చాలి. భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కడి పెళ్లిళ్లను చూడాలనే ఆసక్తిగల విదేశీయులు ఈ వెబ్సైట్ లాగిన్ అయి ఏ సంప్రదాయపు పెళ్లి.. అంటే ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతీయ పెళ్లిళ్లలో ఏ వివాహతంతును చూడాలనుకుంటే అక్కడున్న వధూవరులు సైట్కి ఇచ్చిన పెళ్లి వివరాల ప్రకారం ఆ పెళ్లికి హాజరుకావచ్చు.ఆ పెళ్లికి సంబంధించిన టికెట్లను కొనుక్కోవాలి. ఆ టికెట్ డబ్బులో కొంత శాతాన్ని సైట్ వాళ్లు కమీషన్గా తీసుకొని మిగిలిన డబ్బును ఆ జంటకు ఇచ్చేస్తారు. పసుపు దంచే కార్యక్రమం నుంచి మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ దాకా అన్నిట్లో ముందువరుసలో ఉండి ఆలకిస్తారు ఆ విదేశీ అతిథులు. ఇంట్రెస్ట్ ఉంటే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కూడా. మన సంప్రదాయపు దుస్తులు ధరించొచ్చు. విందును ఆస్వాదించవచ్చు. ఆత్మీయ అతిథిౖయె పెళ్లి సంబరంలో పాలుపంచుకోవచ్చు. జాయిన్ మై వెడ్డింగ్ డాట్ కామ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే మీ పెళ్లికి విదేశీయులకు టికెట్లు అమ్మడం. యేటా కొన్ని లక్షల పెళ్లిళ్లు ఆర్భాటంగా జరుగుతుంటాయి కాబట్టి ఈ తరహా వివాహ పర్యటనలకు విదేశీ అతిథుల డిమాండ్ చాలానే ఉంటోందట. ఒక్క పర్యటనలో దాదాపు అయిదారు పెళిళ్లకు హాజరైన అతిథులూ ఉన్నారట. ఈ వెడ్డింగ్ టూరిజంలో ఇప్పటిదాకా దాదాపు వంద పెళ్లిళ్లకు హాజరయ్యారట విదేశీ అతిథులు. మరో సంగతేంటంటే ఇలా పెళ్లికి విదేశీయుల నుంచి వచ్చిన టికెట్ డబ్బులతో కొత్త జంటలు ఎంచక్కా తమ హనీమూన్ను ప్లాన్ చేసుకుంటున్నాయట. అంటే ఉచితంగా హనీమూన్ డెస్టినేషన్కు చేరుకుంటున్నారన్నమాట. కొత్త ప్రాంతాల నుంచి ఫ్రెండ్స్ అవడానికి ఇంతకన్నా గొప్ప వేడుక ఏముంటుంది అని అటు ఫారిన్ గెస్ట్లు, ఇటు వధూవరులూ అంటున్నారు. ఈ పెళ్లిళ్లను చూడ్డానికి అమెరికా, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా అండ్ అఫ్కోర్స్ ఆస్ట్రేలియా నుంచి యమ డిమాండ్ ఉంటోందట. కార్తీకమాసం పెళ్లిళ్ల సీజనే.. ఆలస్యమెందుకు.. ఆన్లైన్లో టికెట్స్కు శుభస్య శీఘ్రం!! అన్నట్లు.. మనం విదేశీయుల పెళ్లిళ్లకు వెళ్లాలన్నా.. ఇదే రూటు. ఇదే సైటు. టికెట్ కొనుక్కుని వెళ్లిపోవచ్చు. -
పశ్చిమగోదావరిలో విదేశీయుడి అరెస్ట్
సాక్షి, జంగారెడ్డిగూడెం: పాస్పోర్టు లేకుండా అనుమానాస్పదంగా సంచరిస్తున్న విదేశీయుడిని సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో మయన్మార్ దేశానికి చెందిన మహ్మద్ ఇస్లాం అనుమానాస్పదంగా సంచరించడంతో లక్కవరం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని వద్ద పాస్పార్టు కూడా లేకపోవడంతో కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్కు ముందు హాజరు పరిచారు. అనంతరం సెంట్రల్ జైలుకు తరలించారు. మహ్మద్ ఇస్లాం ఎందుకు వచ్చాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
‘విదేశీయుల’పై నజర్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై పోలీసు విభాగం దృష్టి పెట్టింది. ఎలాంటి పత్రాలు లేకుండా, గడువు ముగిసినా ఇక్కడే తిష్టవేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. సిటీ పోలీసు, ఫారెనర్స్ రిజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ), కేంద్ర నిఘా వర్గాలతో ఏర్పడిన ఉమ్మడి బృందాలు మంగళవారం వరుస దాడులు చేశాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎనిమిది ఠాణాల పరిధిలో 75 మందిని తనిఖీ చేశారు. వీరిలో 23 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి విషయంలో ఎఫ్ఆర్ఆర్ఓ తదుపరి చర్యలు తీసుకుంటుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. కాగా ఓయూ పరిధిలో నివసిస్తున్న ఓ నల్లజాతీయుడు అక్రమంగా ఆధార్ కార్డు సైతం పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడిపై సంబంధిత చట్టం కింద మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. పాస్పోర్ట్ అక్కడే ‘డిపాజిట్’ చేసి... హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల్లో ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. కొందరు ఇక్కడికి వచ్చిన తర్వాత నిబంధనలు తెలియక, తప్పనిసరి పరిస్థితుల్లో వీసా గడువు ముగిసినా ఉండిపోతున్నారు. ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లో ‘స్థిరపడాలనే’ ఉద్దేశంతో పథకం ప్రకారం వివిధ రకాలైన వీసాలపై ఇక్కడికి వస్తున్న వారూ ఉంటున్నారు. దేశంలోని ఇతర మెట్రోల్లో దిగుతున్న వీరు అక్కడే ఎఫ్ఆర్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఆపై ఆయా ప్రాంతాల్లోని పరిచయస్తుల వద్ద తమ పాస్పోర్టులను ఉంచి హైదరాబాద్ చేరుకుని అక్రమంగా నివసిస్తున్నారు. ఏదైనా నేరానికి పాల్పడినా పాస్పోర్ట్ లేని కారణంగా దానిపై రిమార్క్ పడదని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఏకకాలంలో ఆకస్మిక దాడులు దీనిపై కొన్నాళ్లుగా నిఘావేసిన ప్రభుత్వ విభాగాలు ఎట్టకేలకు చర్యలు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఆర్లో అధికారులు ఈ విదేశీయుల డేటాను అప్డేట్ చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల సాయంతో వారి వద్దకు వెళ్లి వేలిముద్రలు, ఫోటోలు తదితరాలు రిజిస్టర్ చేసుకున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించేందుకు దాడులు చేయాలని సోమవారం నిర్ణ యించారు. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున ఎఫ్ఆర్ఆర్ఓ, ఐబీ, స్పెషల్బ్రాంచ్, టాస్క్ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో కూడిన 21 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బంజారాహిల్స్, గోల్కొండ, ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, లంగర్హౌస్, చిలకలగూడ, మలక్పేట, అంబర్పేట, సైఫాబాద్, ఉస్మానియా వర్శిటీ, చిక్కడపల్లి ఠాణాల పరిధిలో వరుస దాడులు చేశాయి. మొత్తం 75 మందిని తనిఖీ చేసిన ఈ బృందాలు 23 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించాయి. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. డిటెన్షన్ సెంటర్స్కు తరలించి... ఈ అక్రమ నివాసితులను డిటెన్షన్ సెంటర్స్గా పరిగణించే నగర నేర పరిశోధన విభాగంతో (సీసీఎస్) పాటు మహిళా పోలీసుస్టేషన్, ఇతర ఠాణాలకు తరలించారు. వీరిపై పాస్పోర్ట్, ఫారెనర్స్ యాక్టŠస్ ప్రకారం రెండు రకాలైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో, అవగాహన లేక ఓవర్స్టే చేస్తున్న వారితో జరిమానా కట్టించి ఎగ్జిట్ వీసాపై పంపడం, ఉద్దేశపూర్వకంగా ఉండిపోయిన వారిని డిటెన్షన్లో ఉంచి ఆయా దేశాలకు డిపోర్టేషన్ చేయడం (బలవంతంగా తిప్పిపంపడం) వంటి చర్యలు తీసుకోనున్నారు. వీరికి అవసరమైన పాస్పోర్టులు, వీసాల కోసం ఆయా రాయబార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. అక్రమంగా ఉంటున్న వారిలో కొందరిని తీవ్రతను బట్టి నిర్ణీత కాలానికి బ్లాక్లిస్ట్లో పెట్టాలని నిర్ణయించారు. ఇలా చేస్తే ఆ గడువు ముగిసేవరకు వారు మళ్ళీ దేశంలోకి అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఈ తరహా స్పెషల్ డ్రైవ్స్ను కొనసాగించాలని పోలీసు విభాగం నిర్ణయించింది. సక్రమంగా వచ్చి అక్రమంగా మారి... నగరం విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. ఫలితంగా ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు చెందిన వారు సిటీకి వస్తున్నారు. కల్చర్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగానూ పలువురు విదేశీయులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు ఇక్కడే అక్రమంగా ఉండిపోతున్నారు. పాస్పోర్ట్, విదేశీచట్టాలను తుంగలో తొక్కి తమ ‘పనులు’ చూసుకుంటున్నారు. గతంలో నగరంలో నివసించే విదేశీయులు కచ్చితంగా స్పెషల్ బ్రాంచ్లో రిజిస్టర్ చేసుకునే వారు. అయితే కొన్నేళ్లుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్లకు చెందిన వారు మినహా మిగిలిన వారంతా ఎఫ్ఆర్ఆర్ఓ వద్ద రిజిస్టర్ చేసుకునే నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో సిటీ పోలీసుల వద్ద అక్రమంగా ఉంటున్న వారి డేటా అందుబాటులో ఉండట్లేదు. -
పాపం ‘మధుబాల’.. అన్యాయంగా
గువాహటి : అస్సాంలో మరో లక్ష మందిని జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ముసాయిదా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారుల నిర్లక్ష్యం మూలానా ఓ భారతీయురాలు మీద.. విదేశీయురాలు అనే ముద్ర పడింది. ఫలితంగా గత మూడేళ్ల నుంచి ఆ మహిళ నిర్భందంలో గడపింది. చివరకు బుధవారం సాయంత్రం విడుదల అయ్యింది. వివరాలు.. అస్సాం బోర్డర్ పోలీసులు రాష్ట్రంలో అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను గుర్తించి వారిని నిర్భందంలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం చిరాంగ్ జిల్లా బిష్టుపూర్ గ్రామానికి చెందిన మధుబాల దాస్ అనే విదేశీయురాలిని నిర్భందంలోకి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆమె అప్పటికే మరణించడంతో అధికారులు మధుబాల మొండల్(59)ను నిర్భందంలోకి తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాల గురించి ఆమెకు ఏ మాత్రం అవగాహన లేదు. నిరక్ష్యరాస్యురాలు కావడంతో మొండల్ అధికారులను ఎదిరించలేకపోయింది. మధుబాల మొండల్కు సాయం చేయడానికి ఆమెకంటూ ఎవరూ లేరు. భర్త కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు ఓ మూగ, చెవిటి కూమార్తె ఉంది. పెళ్లైన ఆమెను భర్త వదిలిపెట్టడంతో కుమార్తె బాధ్యతలు కూడా మొండల్పైనే పడ్డాయి. కుటుంబానికి ఆమె జీవనాధారం. ఈ క్రమంలో ఓ రోజు అస్సాం బార్డర్ పోలీసులు ఆమెను విదేశీయిరాలు అంటూ కొక్రాఝర్ నిర్భంద కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు మధుబాల మొండల్కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అధికారుల నిర్లక్ష్యాన్ని అస్సాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారి కృషి ఫలితంగా మూడేళ్ల నిర్భందం తర్వాత బుధవారం సాయంత్రం మధుబాలను విడిచిపెట్టారు. -
పోచంపల్లిలో విదేశీయుల సందడి
సాక్షి, భూదాన్పోచంపల్లి (భువనగిరి) : పోచంపల్లిలో విదేశీయులు సందడి చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల సంస్థ(నిమిస్మే) ఆధ్వర్యంలో సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా, ఘనా, సౌత్ ఆఫ్రికా, అఫ్ఘనిస్తాన్, టాంజానియా, జిం బాబ్వే, కజకిస్తాన్, ఈజిప్ట్, జోర్ధాన్, కాంగో దేశాలకు చెందిన 25 మంది పోచంపల్లిని సందర్శించారు. స్థాని క గ్రామీణ వికాసబ్యాంకు సందర్శించి బ్యాంకు అంది స్తున్న సేవలు, స్వయం సహాయక గ్రూప్లు, రైతులు, చిరువ్యాపారులకు ఎంత వడ్డీకి రుణాలు అందిస్తున్నారని, రుణాల చెల్లింపు విధానాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆర్థిక వికాసానికి బ్యాంకులు ఏ మేరకు పనిచేస్తున్నాయో ఆరా తీశారు. అనంతరం టూరిజం పార్క్ను సందర్శించారు. అక్కడ చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలైన నూలు వడకడం, చిటికి కట్టడం, మగ్గాలను పరిశీలించారు. ప్రాచీన చేనేత కళ, కార్మికుల నైపుణ్యాలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రొగ్రామ్ డైరెక్టర్లు జి. సుదర్శన్, డాక్టర్ ఇ. విజయ మాట్లాడుతూ నిమిస్మేలో ‘సూక్ష్మ వ్యాపార విస్తరణ, అభివృద్ధి అనే అంశంపై అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని, అందులో భాగంగానే క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. వీరికి స్థానిక టూరిజం మేనేజర్ జితేందర్ మార్గదర్శకం చేశారు. -
అమెరికాలో 14% విదేశీయులే
అమెరికాలో వలసదారులను నియంత్రించేందుకు ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ సర్కారు శతవిధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. అమెరికా జనాభా లెక్కల కేంద్రం గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 14శాతం మంది విదేశీయులే ఉన్నారు. అంటే ప్రతి ఏడుగురు అమెరికన్లలో ఒకరు విదేశీయుడన్నమాట. ఈ వలసదారుల్లో చట్టబద్ధంగా వచ్చిన వారితోపాటు అక్రమంగా వచ్చిన వారు కూడా ఉన్నారు. 14 శాతం మంది వలసదారులు ఉండటం ఈ శతాబ్దంలోనే రికార్డు అని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్(సీఐఎస్) పేర్కొంది. ఒక్క 2016లోనే అమెరికాలో విదేశీ జనాభా 8 లక్షలు పెరిగింది. 2017 జూలై నాటికి దేశంలో మొత్తం 4.45 కోట్ల మంది వలసదారులు ఉన్నారు. 1980 లెక్కల ప్రకారం ప్రతి 16 మంది అమెరికన్లలో ఒకరు విదేశీయుడు కాగా ఇప్పుడది రెట్టింపు అయింది. మనవాళ్లే ఎక్కువ 2010–17 మధ్య అమెరికాకు వలస వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ మంది భారతీయులేనని, ఈ ఏడేళ్లలో 8.30 లక్షల మంది భారతీయులు(47% పెరుగుదల) అమెరికా వెళ్లారని సీఐఎస్ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానాల్లో చైనా (6.77 లక్షలు–31%), డొమినికన్ రిపబ్లిక్ (2.83 లక్షలు–32%) ఉన్నాయి. ఈ కాలంలో నేపాల్ వలసదారులు 120% పెరిగారు. 2017 జూలై నాటికి అమెరికాలో 1.52 లక్షల మంది నేపాలీలు ఉన్నారు. పాకిస్తాన్ నుంచి 4 లక్షల మంది అమెరికాకు వలస వచ్చినట్లు సీఐఎస్ గణాంకాలు చెబుతున్నాయి. 2010– 17 మధ్య 95 లక్షల మంది కొత్త వలసదారులు అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఏటా దాదాపు 3 లక్షల మంది వలసదారులు స్వదేశం వెళ్లిపోతున్నారు. మరో 3 లక్షల మంది చనిపోతున్నారు. -
గుడ్న్యూస్ చెప్పిన ఖతార్
విదేశీ వర్కర్లకు ఖతార్ గుడ్న్యూస్ చెప్పింది. వివాదాస్పద ఎగ్జిట్ వీసా విధానాన్ని సవరిస్తున్నట్టు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ దేశంలో పనిచేస్తున్న లక్షల మంది వలస కార్మికులకు భారీ ఊరట కలిగింది. ఈ వీసా విధానం సవరణతో, యజమానులు(ఎంప్లాయర్స్) అనుమతి లేకుండానే.. కార్మికులు ఆ దేశం విడిచి రావొచ్చు. సుదీర్ఘకాలంగా కార్మిక హక్కుల సంఘాలు చేస్తున్న ఈ డిమాండ్ను ఖతార్ ప్రభుత్వం ఆమోదించింది. ఖతార్లో పనిచేస్తున్న చాలా మంది వలస కార్మికులను ఆ దేశం విడిచి వెళ్లకుండా ఎంప్లాయర్స్ వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల కాంట్రాక్ట్ సమయం అయిపోయినప్పటికీ, యజమానులు తమల్ని విడిచిపెట్టడం లేదని కార్మికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విదేశీ కార్మికులకు భారీ ఊరటనిస్తోంది. ప్రస్తుతం ఖతార్లో 16 లక్షల మందికి పైగా విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి వెళ్లినవారే. వారిలో ఎక్కువగా కూడా భారత్ నుంచి ఖతార్ వెళ్లినవారే ఉన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. దీని వల్ల వలస కార్మికుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆ సంస్థ తెలిపింది. ఖతార్ ప్రభుత్వంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం కార్మికులకు కనీస వేతనం, బకాయి వేతనాల చెల్లింపు, ఫండ్లు అందనున్నాయి. ఖతార్లోని వలస కార్మికులకు మంచి పనిని, రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ మంత్రి ఇస్సా సాద్ అల్ జఫర్ అల్-నూమిమి తెలిపారు. 2022లో ఖతార్ ఫుట్బాల్ వరల్డ్ కప్ను నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో ఫుట్బాల్ వరల్డ్ కప్ పనుల్లో భారీ ఎత్తున్న విదేశీ కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖతార్లో పనిచేస్తున్నారు. అయితే ఎగ్జిట్ వీసా విధానంలో సవరణలు తీసుకొచ్చినప్పటికీ, విదేశీ కార్మికులు, ఉద్యోగాన్ని మారాలనుకుంటే, ప్రస్తుత యజమానుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంది. -
నేను.. మా మమ్మీ, డాడీ!
సాక్షి, హైదరాబాద్: ఫ్రాంక్ ఆంటోనీ–పమేలా దంపతులది అమెరికాలోని న్యూజెర్సీ. ఉన్నత కుటుంబానికి చెందిన ఆంటోనీ–పమేలా వ్యాపార రంగంలో ఉంటూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. కానీ వారికి సంతానం కలగలేదు. పిల్లలు లేక మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు.. హైదరాబాద్లోని ప్రభుత్వ శిశు గృహంలోని ఓ మూడేళ్ల బాలికను దత్తత తీసుకున్నారు. ఇలాంటి దంపతులు ఎందరో.. శిశుగృహాల్లోని పిల్లలు ఇప్పుడు విదేశాలకు దత్తతకు వెళ్తున్నారు. రాçష్ట్రంలో ఇప్పటికి 43 మంది పిల్లలు ఇలా దత్తత తీసుకోవడంతో విదేశాలకు వెళ్లారు. అనాథ శిశువులను దత్తత తీసుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆన్లైన్ దత్తత కార్యక్రమం ఎల్లలు దాటిపోతోంది. ప్రపంచం నలుమూలల నుంచి చిన్నారులను దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల దత్తత ప్రక్రియలో ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి చెందిన పిల్లలను విదేశీ యులు దత్తత తీసుకుంటున్నారు. అమెరికా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇంగ్లండ్కు చెందిన కుటుంబాలు మన రాష్ట్రంలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. డెన్మార్క్ దేశానికి చెందిన మార్టిన్ దంపతులు నల్లగొండ జిల్లాకు చెందిన బాలికను దత్తత తీసుకున్నారు. నిబంధనలు మార్చాక ఇలా.. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న అనాథ చిన్నారులను అయినా దత్తత తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. దీని కోసం ప్రత్యేకంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) వెబ్సైట్ను నిర్వహిస్తోంది. దత్తత తీసుకోవాలనుకునే వారు ఈ వెబ్సైట్ విధానంతోనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. దీంట్లోనూ స్వదేశం(ఇన్ కంట్రీ), విదేశీ(ఇంటర్ కంట్రీ) పేరుతో రెండు విధానాలున్నాయి. స్వదేశీ విధానంతో భారతీయులు, రెండో విధానంతో విదేశీయులు మన దేశంలోని పిల్లలను దత్తత తీసుకోవచ్చు. మన దేశంలోని అనాథ పిల్ల లను విదేశీయులు దత్తత తీసుకునేందుకు రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ప్రక్రియ జరుగుతుంది. ఆన్లైన్లో నమోదు చేసిన ప్రభుత్వ సంస్థలలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు మన దేశీయులు ఎవరూ సుముఖత వ్యక్తం చేయని సందర్భాల్లో రెండో ఆప్షన్ కింద విదేశీ దత్తత కేటగిరీలోకి మారుస్తారు. దీనికి 90 రోజులు గడువు ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత ఆ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబర్చిన విదేశీయులు ‘కారా’ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అక్కడి ఏజెన్సీలు దత్తతకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. పిల్లల పెంపకానికి ఇబ్బంది లేదని నిర్ధారించిన అనంతరం దత్తత ప్రక్రియ పూర్తవుతుంది. అలాగే స్వదేశీ దత్తత మార్గదర్శ కాల మేరకు దత్తత పొందేందుకు దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దంపతుల సొంత రాష్ట్రంతోపాటు మరో రెండు రాష్ట్రాలను ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా మూడు రాష్ట్రాల నుంచి పిల్లలను ఎంపిక చేసుకోవచ్చు. ఆన్లైన్ పద్ధతితో జాప్యం లేకుండా గరి ష్టంగా 30 రోజులలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పాత నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలంటే కనీసం ఏడాదిన్నరపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది. -
వస్తారు.. ఇక వెళ్లరు
సాక్షి బెంగళూరు: బెంగళూరును విదేశీయులు అక్రమ అడ్డాగా చేసుకుంటున్నారు. విద్య, వైద్యం, వ్యాపారం వీసా మీద బెంగళూరులో ఉంటున్న విదేశీయులు చాలా మంది వీసా గడువు ముగిసినప్పటికీ తమ దేశానికి వెళ్లడం లేదు. విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్వో) ఇటీవల హైకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో సుమారు 28 వేల మంది విదేశీయలు ఉన్నారు. అందులో 66 దేశాలకు చెందిన 1076 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు తేలింది. ఇందులో వెయ్యిమంది వరకూ బెంగళూరులోనే మకాం వేశారు. అనధికారికంగా ఈ సంఖ్య కొన్ని రెట్ల ఎక్కువగా ఉండవచ్చని అంచనా. పోలీసులు ఏడాది కాలంగా నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించారు. వారిపై విదేశీ పౌరచట్టం, పాస్పోర్టు చట్టంఉల్లంఘనల మేరకు కేసులు నమోదు చేశారు. ఈ విదేశీయులు డ్రగ్స్ దందా, దోపిడీలలో పాల్గొంటుండడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇటీవల కొలంబియా దోపిడీ దొంగల ముఠా పట్టుబడడం తెలిసిందే. వెనక్కి పంపడం పెద్ద పని విదేశీయుల గణాంకాలు మొత్తం ఎఫ్ఆర్ఆర్వో శాఖ వద్ద మాత్రమే ఉంటాయి. అక్రమంగా నగరంలో నివసిస్తున్న వారిని బెంగళూరు పోలీసులు పట్టుకుని పాస్పోర్టు చట్టం సెక్షన్ 12 ప్రకారం జైలు శిక్ష విధించవచ్చు. దీంతోపాటు ఎఫ్ఆర్ఆర్వోకి ఆ సమాచారాన్ని తెలియజేయాలి. ఎఫ్ఆర్ఆర్వో ఆయా దేశాల రాయబార కార్యాలయానికి వారి దేశీయులకు సంబంధించిన వివరాలను లేఖ రాస్తుంది. పాస్పోర్టు లేకుండా విదేశీయులను విమానాశ్రయం లోనికి కూడా రానివ్వరు. అక్రమంగా ఉంటున్న విదేశీయులను పోలీసులు వారి దేశ విమానంలో ఎక్కించి పంపించేస్తున్నారు. అయితే అదే విమానంలోనే తిరిగి భారత్కు విదేశీయులు మళ్లీ వస్తున్నారు. దీనికి తగిన విధానం రూపొందించాలని పోలీసు అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశీయులు అధికం.. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న వారే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దు నుంచి రైలు మార్గం ద్వారా చాలా మంది బెంగళూరుకు చేరుకుంటున్నారని సమాచారం. బెంగళూరు చేరుకున్న వారిలో కొందరు చెత్త ఏరుకుంటూ, నిర్మాణ పనులతో జీవిస్తున్నారు. బెంగళూరులోని మహదేవపురతో పాటు తదితర ప్రాంతాల్లో గుడిసెలు, టెంట్లు వేసుకుని నివాసం చేస్తున్నారు. వారికి ఆధార్, రేషన్ కార్డులు కూడా తీసుకుని ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. తిరిగి వెళ్తున్నది కొందరే వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా రాష్ట్రంలో ఉంటున్న వారిని వారి సొంత దేశాలకు పంపించడంలో రాష్ట్ర పోలీసులు అధికారులు విఫలమవుతున్నారు. అక్రమ వలసదారులను గుర్తించిన వెంటనే వారి సమాచారాన్ని ఎఫ్ఆర్ఆర్వోకు పంపించాలి. అక్రమంగా దేశంలో నివసిస్తున్న ఆ విదేశీయుల వివరాలను ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు ఎఫ్ఆర్ఆర్వో లేఖ ద్వారా తెలియజేస్తుంది. ఆ తర్వాత వారి వీసా పునరుద్ధరించడమా లేక వారి సొంత దేశాలకు పంపించడమా అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ చాలా తక్కువగా జరుగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు. 66 దేశాల పౌరుల తిష్ట బెంగళూరులో 66 దేశాలకు చెందిన పౌరులు అక్రమంగా నివసిస్తున్నారు. కాంగోకు చెందిన వారు 164 మంది, ఐవరికోస్ట్ నుంచి 100 మంది, అఫ్ఘనిస్తాన్ నుంచి 33, బంగ్లాదేశ్ నుంచి 36, నైజీరియా నుంచి 93 మంది, మారిషస్, మంగోలియా, నమీబియా ఇతర దేశాలకు చెందిన మరికొంత మంది విదేశీయులు నగరంలో తలదాచుకున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడం చాలా కష్టం. బెంగళూరుకు చేరుకున్న విదేశీయులు ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న చిరునామాల్లో వారు ఉండడం లేదు. వీసా గడువు ముగిసిన అనంతరం గోవా, ముంబై, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలల్లో తిరుగుతూ వస్తున్నారు. అక్కడక్కడ నేరపూరిత చర్యల్లోనూ పాలుపంచుకుంటున్నారు. -
విదేశాల్లో భారత ‘వంటిల్లు’!
న్యూఢిల్లీ: పంజాబీ చికెన్ టిక్కా... రాజస్థానీ థాలీ... మహారాష్ట్ర వడాపావ్... తమిళనాడు సాంబార్ ఇడ్లీ... హైదరాబాద్ బిర్యానీ... చెబుతుంటేనే నోరూరుతోంది కదా..!! ఈ భారతీయుల వంటకాల ఘుమఝుమలు విదేశీయులనూ ఆవురావురుమనేలా చేస్తున్నాయి. అదిరిపోయే భారతీయ వంటలతో మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. మన నలభీములకు విదేశీయులు ఎర్ర తివాచీ పరుస్తుండటంతో ఇక్కడి రెస్టారెంట్ చైన్లు అత్యంత వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. లైట్ బైట్ ఫుడ్స్, జిగ్స్ అండ్ జోరవార్ కల్రా రెస్టారెంట్ చైన్లతో పాటు పారిశ్రామికవేత్త, ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్కు చెందిన రెస్టారెంట్లు విదేశాల్లో పాగా వేస్తున్నాయి. అనుమతులు, లైసెన్సులు సులువు... కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్, డామినోస్ లాంటి విదేశీ రెస్టారెంట్ చైన్లకు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంస్థలు చొచ్చుకుపోతున్నాయి. ఇతర దేశాల్లో రెస్టారెంట్లను ప్రారంభించడం సులువుగా ఉండటం, బయట వంటకాలకు విదేశీయులు ఖర్చులు పెంచడం లాంటి సానుకూల అంశాలు హోటల్ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతున్నాయని నిర్వహకులు చెబుతున్నారు. ’విదేశీ రెస్టారెంట్ వ్యాపారం విధానాలలో స్థిరత్వం ఉంటుంది. అనేక దేశాలలో హోటళ్లను ప్రారంభించడానికి బహుళ అనుమతులు, లైసెన్సుల అవసరం లేకపోవడం అనేది ప్రయోజనకరంగా ఉంది. లండన్, న్యూయార్క్, దుబాయ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో బయట తిండికి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 150 మంది కూర్చుని భోజనం చేయడానికి సరిపడేంతటి రెస్టారెంట్ను ఈఏడాది సెప్టెంబరులోనే వాషింగ్టన్ డీసీలో ప్రారంభిస్తున్నాం’ అని లైట్ బైట్ ఫుడ్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ అన్నారు. పంజాబ్ గ్రిల్ పేరుతో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుందని, త్వరలోనే దుబాయ్, కువైట్, ఇతర గల్ఫ్ దేశాలలో సైతం సత్తా చాటనున్నామని వెల్లడించారు. మానవ వనరుల పరంగా ఇబ్బందే... వ్యాపారం బాగానే ఉన్నా... మానవవనరుల కొరత, వీసా సమస్యలు వెంటాడుతున్నట్లు రోహిత్ తెలిపారు. భారత్లో మార్జిన్లు చూడలేకపోతున్న అనేక రెస్టారెంట్ చైన్లు విదేశాల్లో లాభాలను గడిస్తున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) అంటోంది. ఇతర దేశాలలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉందని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రాహుల్ సింగ్ వెల్లడించారు. గతేడాది అమెరికన్లు ఆహారంపై చేస్తున్న ఖర్చులలో ఏకంగా 48% రెస్టారెంట్లలోనే జరుగుతున్నట్లు తెలిపారు. విదేశాల్లో హోటల్ నడపడం చాలా సులభం... దివ్యాని ఇంటర్నేషనల్ అమెరికా, లండన్, సింగపూర్, దుబాయ్ దేశాలలో విస్తరిస్తోంది. నోరు ఊరించే వంటకాలతో అదరగొట్టే సంజీవ్ కపూర్ సైతం విదేశీ రెస్టారెంట్ల విస్తరణలో వేగంగా దూసుకుపోతున్నారు. సంజీవ్ కపూర్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మొత్తం 70 స్టోర్లను నడుపుతుండగా, వీటిలో సగం వరకు విదేశాల్లోనే ఉన్నాయి. విదేశాల్లో హోటల్ వ్యాపారం చాలా సులువుగా నడపవచ్చని వెల్లడించిన ఆయన త్వరలోనే లండన్, న్యూయార్క్, టొరంటో, సౌదీలలో రెస్టారెంట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
వెళ్తోంది లక్షల్లో.. వస్తోంది వేలల్లో
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు.. ఐఐఎంలు.. ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు! అయినా విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భారత్ వెనుకబడే ఉంది. విదేశాల్లో చదువుకునేందుకు మన దేశం నుంచి ఏటా లక్షల మంది వెళ్తుంటే.. విదేశాల నుంచి మాత్రం వేలల్లోనే వస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు 90 దేశాల్లో 7.5 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతుంటే మన దేశంలో మాత్రం విదేశీ విద్యార్థులు కేవలం 46,144 మందే చదువుకుంటున్నారు. ఏటా కొత్తగా వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల వేయి మాత్రమే ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే విదేశీ విద్యార్థులు ఎక్కువగా కర్ణాటకలో చదువుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. తెలంగాణ ఆరో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. ఆరు రాష్టాల్లో అయితే విదేశీ విద్యార్థులు కేవలం పది మంది లోపే ఉన్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఐదేళ్లతో పోలిస్తే కాస్త మెరుగు.. తక్కువ స్థాయిలోనే ఉన్నా గడచిన ఐదేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2013–14 విద్యా సంవత్సరంలో భారత్లో 39,517 మంది విదేశీ విద్యార్థులు చదివితే 2017–18 నాటికి ఆ సంఖ్య 46,144కు పెరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే 2013–14లో కర్ణాటకలో 13,903 మంది చదవగా.. ప్రస్తుతం వారి సంఖ్య కాస్త తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 2013–14తో పోలిస్తే ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2013–14లో తెలంగాణలో 2,103 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2,877కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో 862 మంది విదేశీ విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 2,092కు పెరిగింది. నేపాల్ విద్యార్థులే అధికం విదేశాల నుంచి భారత్కు వస్తున్నవారిలో ఎక్కువ మంది నేపాల్కు చెందిన వారే ఉన్నారు. చదువుల కోసం మన దేశం నుంచి విద్యార్థులు 166 దేశాలకు వెళ్తుండగా.. భారత్కు మాత్రం 10 దేశాల నుంచే ఎక్కువగా వస్తున్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో 24.9 శాతం మంది నేపాల్కు చెందినవారు కాగా, అఫ్గాన్ విద్యార్థులు 9.5 శాతం, సుడాన్ విద్యార్థులు 4.8 శాతం, భూటాన్ విద్యార్థులు 4.8 శాతం మంది, నైజీరియా విద్యార్థులు 4.3 శాతం, బంగ్లాదేశ్, ఇరాన్ విద్యార్థులు 4 శాతం మంది, యెమన్ విద్యార్థులు 3.2 శాతం మంది, అమెరికా విద్యార్థులు 3.1 శాతం, శ్రీలంక విద్యార్థులు 2.7 శాతం ఉన్నారు. బీటెక్, బీబీఏ వైపే ఎక్కువ.. భారత్కు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది బీటెక్ వైపు చూస్తున్నారు. గడచిన ఐదేళ్లలో ఎక్కువ మంది బీటెక్ చదివిన వారే ఉన్నారు. 2013–14లో 4,135 మంది బీటెక్ చదవగా.. ప్రస్తుతం ఆ కోర్సును 7,610 మంది చదువుతున్నారు. బీటెక్ తర్వాత బీబీఏ కోర్సును ఎక్కువ మంది చదువుతున్నారు. ఉత్తరప్రదేశ్లోనే అత్యధికంగా పీహెచ్డీలు విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా పీహెచ్డీలను (412 మంది) ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. కర్ణాటకలో ఎక్కువ మంది(897) ఎం.ఫిల్ చేస్తున్నారు. డిగ్రీ (10,051 మంది), పీజీ (1,533), ఇంటిగ్రేటెడ్ కోర్సులు (7181) చేస్తున్న వారు కూడా కర్ణాటకలోనే ఉన్నారు. -
అతిథులపై క్లారిటీ
-
విదేశీ నేతల్ని పిలవట్లేదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీసహా విదేశీ నేతలెవరినీ ఆహ్వానించడం లేదని పాక్ విదేశాంగశాఖ తెలిపింది. పాక్ ప్రధానిగా తన ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా సాగాలని ఇమ్రాన్ కోరుకుంటున్నట్లు వెల్లడించింది. 11న అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత అధ్యక్షుడు మమ్నూన్ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుకకు రావాల్సిందిగా ఇమ్రాన్ స్నేహితులైన కొంతమంది విదేశీయులకే ఆహ్వానాలు పంపారు. జూలై 25న జరిగిన పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం అనుమతిస్తే ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరవుతానని పంజాబ్ మంత్రి నవ్జ్యోత్సింగ్ సిద్ధూ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే వచ్చే ఏడాది పాక్లోని నన్కనా సాహిబ్లో జరిగే గురునానక్ 550వ జయంతి ఉత్సవాలకు హాజరవ్వాలన్న తన కల నెరవేరుతుందన్నారు. -
కిడ్నాప్ కలకలం : మృతుల్లో భారతీయుడు
కాబుల్ (అఫ్గానిస్తాన్) : ఉగ్రదాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న అఫ్గానిస్తాన్లో మరో కలకలం రేగింది. ఇప్పటికే వలసవాదులపై దాడులకు తెగబడుతున్న తాలిబన్ ఉగ్రవాదులు తాజాగా ముగ్గురు విదేశీయుల్ని చంపారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. వివరాలు.. సోడెక్సో ఇంటర్నేషనల్ ఫుడ్ కంపనీలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు విధులకు వెళ్తుండగా ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. ముసాహీ జిల్లాలోని పార్కింగ్ చేసి ఉన్న కారులో మృత దేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మలేసియా (64), ఇండియా (39), మాసిడోనియా (37) పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారని అంతర్గతభద్రత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నుష్రత్ రహీమి తెలిపారు. మృతదేహాల పక్కన కొన్ని ఐడీ కార్డులు పడి ఉన్నాయనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఇన్నాళ్లూ స్వదేశీయుల్ని కిడ్నాప్ చేసి డబ్బులు దండుకుంటున్న క్రిమినల్స్ కోవలోకి తీవ్రవాదులు సైతం చేరారు. విదేశీయులే లక్ష్యంగా రెచ్చిపోతూ బాంబు దాడులు, కిడ్నాప్లకు తెగబడుతున్నారు. -
విదేశీ కార్మికులకు క్షమాభిక్ష
దుబాయ్: గడువు తీరిన తర్వాత దేశంలో నివసిస్తూ పట్టుబడిన కార్మికులకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా 3 నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న లక్షల మంది భారతీయులు సహా విదేశీ కార్మికులకు ఇది లబ్ధిచేకూర్చనుంది. ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల్లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా ఆర్నెల్లలో ఉద్యోగం వెతుక్కునే చాన్సుంటుంది. యూఏఈ అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 28లక్షల మంది భారతీయ వలసదారులున్నారు. ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 15–20% కాగా, 20 శాతం మంది వివిధ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన 65% మంది వివిధ పరిశ్రమల్లో కార్మికులు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష అమల్లో ఉంటుందని ఈ మధ్యలోనే అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని యూఏఈ గుర్తింపు, పౌరసత్వ సంస్థ స్పష్టం చేసింది. ఈ దిశగా దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, వివిధ బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటుచేశారు. బుధవారం ముగ్గురు భారతీయులు అబుదాబిలోని బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సెంటర్లో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. తొలిరోజే కావడంతో సంఖ్య పలుచగా ఉందని.. రానున్న రోజుల్లో మరింత మంది రావొచ్చని భావిస్తున్నారు. యూఏఈలో ఉన్న భారత కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన వారే ఉన్నారు. ‘క్షమాభిక్ష గురించి సమాచారం తెలిసింది. స్వామి అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఏ1 ఆమ్నెస్టీ సెంటర్లో దరఖాస్తు చేసుకున్నారు. యూఏఈలో యజమాని.. భారత్లో ఉన్న తన కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వనందునే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని లక్ష్మీదేవి రెడ్డి అనే మహిళ పేర్కొన్నారు. జూన్లోనే తన ఔట్పాస్ గడువు ముగిసిందని ఆమె తెలిపారు. యజమాని తనపై కేసు వేసినందున పోలీసు క్లియరెన్స్ రాలేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆమె చెప్పారు. -
విదేశీయుడి అనుమానాస్పద మృతి
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీలో ఫిన్లాండ్కు చెందిన స్టార్టప్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... ఐటీసీ పీఎస్పీడీలో నూతన యంత్రాలను అమర్చేందుకు వచ్చిన ఫిన్లాండ్కు చెందిన స్టార్టప్ ఇంజనీర్ విజో కలెవి కొర్హనన్(55), శుక్రవారం ఉదయం తనకు కేటాయించిన వసతి గదిలో మృతిచెందాడు. ఇతడు జూన్ 16నఆర్ఏటీఆర్ కన్సల్టెన్సీ నుంచి చెన్నైకి చెందిన వాలెట్ కంపెనీ తరఫున ఐటీసీ పీఎస్పీడీలో నూతన యంత్రాల అమర్చేందుకు వచ్చాడు. అతనికి ఐటీసీ పీఎస్పీడీలో బ్యాచిలర్ క్వార్టర్స్లో రూమ్ నెంబర్ 122ను అధికారులు కేటాయించారు. ఆయన రోజు మాదిరిగానే గురువారం సాయంత్రం విధులు ముగించుకుని క్యాంటీన్లో డిన్నర్ చేసి రూమ్కు వెళ్లాడు. శుక్రవారం ఉదయం గది తలుపులు తీయలేదు. అక్కడి వర్కర్లు ఇచ్చిన సమాచారంతో వాలెట్ కంపెనీ ప్రతినిధులు వెళ్లారు. గది తలుపులు పగలగొట్టి చూసేసరికి మంచంపై విగతుడిగా పడున్నాడు. నోటి వెంట నురగు వస్తోంది. అతని మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ గదిని పాల్వంచ సీఐ రాఘవేంద్రరావు, బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ పరిశీలించారు. మృతుడు విదేశీయుడవడంఓ ఎస్పీకి తెలిపారు. విదేశాంగ శాఖ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ అంబర్కిషోర్ ఝా సమాచారమిచ్చారు. మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. వాలెట్ కంపెనీ ఇంజనీర్ సంతోష్ తివారీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసాకు ఓకే
న్యూఢిల్లీ: విదేశీ పౌరుల్ని వివాహం చేసుకునే భారతీయులకు కేంద్రం శుభవార్త తెలిపింది. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న విదేశీయులు తమ పర్యాటక వీసాలను ఎక్స్2(డిపెండెంట్) వీసాలుగా మార్చుకునేలా నిబంధనల్ని సవరించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఓ భారతీయుడు ఫిలిప్పైన్స్ మహిళను అక్కడే వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె పర్యాటక వీసాపై భారత్కు వచ్చారు. ఆ తర్వాత పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చాలని వధువు దరఖాస్తు చేసుకోగా నిబంధనలు అంగీకరికపోవడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు. ఫిలిప్పైన్స్కు వెళ్లి ఎక్స్2 వీసా కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో ఆమె భర్త ఈ విషయమై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫిర్యాదు చేశారు. రాజ్నాథ్ ఆదేశాలతో వెంటనే స్పందించిన హోంశాఖ.. పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చేందుకు అడ్డుగా ఉన్న నిబంధనల్ని సవరించనున్నట్లు తెలిపింది. అలాగే భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకుంటే వారి జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసా ఇచ్చేందుకు ఇప్పటివరకూ అడ్డంకిగా ఉన్న నిబంధనల్ని మార్చనున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ వెసులుబాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సూడాన్, ఇరాక్ దేశాలు, పాక్ సంతతి పౌరులు, ఏ దేశానికి చెందనివారికి వర్తించబోదని పేర్కొంది. -
విదేశీయులను పెళ్లాడిన సెలబ్రెటీలు
సెలబ్రెటీల జీవితాల్లో ప్రతీ అంశం ఆసక్తికరమే. అందుకే వారి వ్యక్తిగత జీవిత విశేషాల పై కూడా అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. ముఖ్యంగా వారి ప్రేమ పెళ్లి లాంటి విషయాల కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ ప్రముఖం వినిపిస్తుంటాయి. ఇటీవల హాలీవుడ్లో సత్తా చాటుతున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ గాయకుడు జాన్ నికోస్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఫంక్షన్స్లోనూ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకు కనిపించటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. దీంతో గతంలో ఇలా విదేశీయులతో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న తారల జీవితాలకు సంబంధించిన చర్చ మొదలైంది. ఈ జాబితాలో దేశీయ తారలు చాలా మందే ఉన్నారు. ఇటీవల కాలంలో మన సెలబ్రెటీ నటీనటులు చాలా మంది విదేశీయులను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది శ్రియా, ఆండ్రీ కోశ్చివ్ను వివాహం చేసుకోవడం, ఇలియానా, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్తో ఆండ్రూ నీబోన్తో ప్రేమాయణం సాగించటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా.. ప్రియాంక, నిక్ జోనాస్లకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. వీరి కుటుంబ కార్యక్రమాలకు కూడా ఇద్దరు కలిసి హాజరవుతున్నారు. గతంలో.. ప్రీతిజింటా లాస్ ఏంజిల్స్లోని ఆర్థిక విశ్లేషకుడు జీన్ గుడ్నఫ్తో కొంతకాలం పాటు డేటింగ్ చేసి 2016లో వివాహం చేసుకున్నారు. బుల్లితెర నటి ఆష్కా గొరాడియా అమెరికన్ బ్రెంట్ గ్లోబేతో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. లాస్ వెగాస్లో వీరు మొదటిసారిగా కలుసుకున్నారు. టీవీ నటి అయిన సుచిత్ర పిళ్లై డెన్మార్క్కు చెందిన లార్స్ జెల్సన్ అనే ఇంజనీర్ను పెళ్లి చేసుకున్నారు. వీరు మొదటి సారిగా ముంబైలో జరిగిన ఓ వేడుకలో కలిశారు. అరుణోదయ్ సింగ్ అనే నటుడు కెనడాకు చెందిన లీ ఎల్టన్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు గోవాలో మొదటిసారిగా కలుసుకున్నారు. లక్కీ అలీ అనే గాయకుడి మూడో భార్య ఎలిజబెత్ హాలమ్. ఈమె మాజీ మిస్ గ్రేట్ బ్రిటన్. వీరికి 2010లో వివాహం జరిగింది. వివాహానంతరం ఈమె పేరును అయేషా అలీగా మార్చుకున్నారు. బాలీవుడ్ స్టార్ శశి కపూర్ బ్రిటీష్ నటి జెన్నిఫర్ కెండల్ను 1958లో వివాహమాడారు. సల్మాన్ ఖాన్, రొమేనియన్ మోడల్ లూలియా వాంటూర్కు మధ్య ఏదో నడుస్తుందన్న వార్త బాలీవుడ్లో ఇప్పటికీ హాట్ టాపికే. -
ఇక ఈబీ - 5 వీసాల వంతు..?
వాషింగ్టన్ : ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికా కలలు కనే జనాలకు ఒకటే ఆందోళన. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇన్నాళ్లు హెచ్ - 1బీ వీసా మార్పుల గురించి మాట్లాడిన ట్రంప్ తాజాగా మరో బాంబ్ పేల్చారు. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనే విదేశీ పెట్టుబడిదారులకు జారీ చేసే ఈబీ-5 వీసాలపై ట్రంప్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఈ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో కనీసం ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అంతేకాక ఓ పదిమందికి తప్పకుండా పర్మినెంట్ జాబ్ కల్పించాలి. ఇలా పెట్టుబడి పెట్టిన విదేశీయులకు గ్రీన్ కార్డు లభిస్తుంది. అయితే ఈ వీసాల దుర్వనియోగం జరుగుతోందని, వీటి వల్ల అక్రమాలు, మోసాలు పెరిగిపోతున్నాయని ట్రంప్ యంత్రాంగానికి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో యూఎస్ కాంగ్రెస్ ఈ వీసా విధానంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేయడం లేదా సంస్కరణలు చేపట్టడం చేయాలని ట్రంప్ యంత్రాంగం యూఎస్ కాంగ్రెస్ను కోరింది. ఈ సందర్భంగా అమెరికా పెట్టుబడిదారులకు ఉత్తమమైన రక్షణ కల్పించాలని, మోసాలకు గురికాకుండా కావాడాల్సిన అవసరం ఉందని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల విభాగం డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్సానా పేర్కొన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈబీ-5 వీసాల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందన్నారు ఫ్రాన్సిస్. విదేశీయులు మనీలాండరింగ్కు పాల్పడడానికి, గూఢచర్యం చేయడానికి దేశంలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది, సెప్టెంబర్ 30 నాటికి ఈబీ - 5 వీసా కార్యక్రమం ముగియనుంది. ఈబీ - 5 వీసా విధానం ద్వారా ఏటా పది వేల మంది విదేశీ పెట్టుబడిదారులకు ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఇది కూడా దేశాల వారీ కోటా ఆధారంగా ఉంటుంది. కాగా అమెరికాలో ఈబీ-5 వీసా కోసం దరఖాస్తులు చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో, వియత్నాం రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. గత ఏడాది భారత్ నుంచి ఈబీ-5 వీసా కోసం 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఏడాది 700 మంది దాకా దరఖాస్తు చేసే అవకాశం ఉందని అంచనా. ఈబీ - 5 వీసా కోసం మన దేశం నుంచి ఎక్కువగా చండిఘర్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ పోటి ఉంటుందని తెలిపారు. అయితే దుర్వినియోగం, మోసాలకు పాల్పడుతున్నట్లు వస్తోన్న ఫిర్యాదులు ఎక్కువగా చైనాకు సంబంధించినవని తెలుస్తోంది. -
విమానం ఎక్కేదాకా వారు జైల్లోనే!
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వివిధ ఆశలు చూపించి ఆన్లైన్ ద్వారా ఎర వేస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్న విదేశీ నేరస్తుల విషయంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) సరికొత్త వ్యూహాన్ని అనుసరించనుంది. అధిక నేరాలకు పాల్పడ్డ కేసుల్లో వీరు బెయిల్ తీసుకుని తర్వాత ఆచూకీ లేకుండా పోతుండడంతో వారు తమ దేశాలకు తిరిగి వెళ్లేదాకా జైల్లోనే ఉంచాలని నిర్ణయించింది. ఇటీవల పలు ఆన్లైన్ నేరాలకు పాల్పడ్డ నైజీరియన్ ఆచూకీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు ఆరు నెలల పాటు శ్రమించారు. ఎట్టకేలకు ఢిల్లీలో అతడి కదలికలు కనిపెట్టి అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం దాదాపు 15 రోజుల పాటు గాలించి పట్టుకుంది. ఇలా చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అతగాడు వారం రోజులకు బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఆపై రెండేళ్లుగా ఆచూకీ లేకపోవడంతో కేసు పెండింగ్లో ఉండిపోయింది. ఇలాంటి ఉదంతాలకు తావు లేకాకుండా చూసేందుకు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు చర్యలు ప్రారంభించారు. తీవ్రమైన నేరాల్లో అరెస్టయిన విదేశీయులకు బెయిల్ ఇవ్వొద్దని, నిర్ణీత కాలంలో తాము చార్జ్షీట్లు దాఖలు చేస్తామని న్యాయ విభాగానికి ఇటీవల ప్రతిపాదించారు. ఇందులోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆ విభాగం అందుకు అంగీకరించింది. దీంతో సైబర్ నేరాల్లో చిక్కిన ఇద్దరు నైజీరియన్లతో పాటు అక్రమంగా నివసించడంతో పాటు బోగస్ గుర్తింపు కార్డులు పొంది చిక్కిన పాకిస్థానీ సైతం బయటకు వచ్చే అవకాశం లేదు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేసి ట్రయల్ నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండు రకాల చర్యలకు అవకాశం దేశంలో అక్రమంగా నివసిస్తూ చిక్కిన విదేశీయులపై రెండు రకాల చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమికంగా వారి పాస్పోర్ట్పై ‘ఎగ్జిట్ స్టాంప్’ కొట్టడం ద్వారా స్వదేశానికి బలవంతంగా తిప్పిపంపే (డిపోర్టేషన్) ఆస్కారం ఉంది. అలాకానప్పుడు, ఉదంతం తీవ్రతను బట్టి వారిపై కేసు నమోదు చేసి ట్రయల్ నిర్వహించవచ్చు. ఇలా కేసు నమోదైతే మాత్రం తక్షణం డిపోర్టేషన్ చేయడానికి చట్టం అంగీకరించదు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేసి, విచారణ పూర్తై, శిక్షపడేతే అది అనుభవించిన తర్వాతే తిప్పి పంపాల్సి ఉంటుంది. ఈలోపు బెయిల్ పొందుతున్న ఈ విదేశీయులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా కేసుల విచారణ ఆగిపోవడంతో పాటు మరో ప్రాంతంలో వారు యథేచ్ఛగా నేరాలు చేస్తున్నా గుర్తించి, పట్టుకోలేని పరిస్థితి ఉంది. నగరం విషయానికి వస్తే ఇక్కడ చిక్కుతున్న వారిలో ఆఫ్రికా దేశాలతో పాటు పాక్, బంగ్లాదేశ్కు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలోనూ నల్లజాతీయులతోనే ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. వీరు అక్రమంగా నివసిస్తున్నప్పటికీ ఏదో ఒక పోలీసు కేసు నమోదైతే తప్ప ఈ విషయం వెలుగులోకి రావట్లేదు. దీంతో వెంటనే డిపోర్టేషన్ చేసే ఆస్కారం ఉండడం లేదు. పాస్పోర్ట్ ‘భద్రపరిచి’ రాక.. సిటీలో జరుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయాల్లో ఎక్కువగా నల్లజాతీయులు అరెస్ట్ అవుతున్నారు. వీరంతా తొలిదశలో విద్య, వ్యాపార, పర్యాటక వీసాలపై దేశంలోని ఏదో ఒక మెట్రో నగరానికి చేరుకుంటున్నారు. అక్కడ ఉంటూ ఈ దందాల్లోకి దిగుతున్నప్పుడే తమ పాస్పోర్టులను కొందరి వద్ద భద్రపరిచి, నేరబాట పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆయా నిందితులు పోలీసులకు చిక్కుతున్నప్పటికీ పాస్పోర్టులు స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావడం లేదు. కనీసం వాటి నంబర్లు, కొన్ని సందర్భాల్లో తమ నిజమైన పేర్లు కూడా ఈ నేరగాళ్లు బయటపెట్టడం లేదు. అవి లభిస్తే తప్ప సీజ్ చేయడానికి, రద్దు చేయించడానికో ఆస్కారం లేదు. ఈ కారణంగానే బెయిల్పై వచ్చిన వారు తమ దేశాలకు చెక్కేస్తున్నా గుర్తించలేని, పట్టుకోలేని పరిస్థితి. దీనివల్ల ఓపక్క కేసుల విచారణ ముందుకు సాగకపోవడంతో పాటు అనేక నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఈ పరిణామాలు ఇటు న్యాయస్థానాలతో పాటు అటు పోలీసులకూ పని భారం పెంచుతున్నాయి. నేరం చేసిన వాళ్లు స్వేచ్ఛగా విహరించే ఆస్కారం ఇస్తున్నాయి. బెయిల్ ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. సాధారణంగా ఏదైనా నేరంలో నిందితుడిగా అరెస్ట్ అయిన వ్యక్తి దోషిగా తేలే వరకు జైల్లోనే మగ్గిపోకుండా బెయిల్ పొందడం చట్టం కల్పించిన అవకాశం. అయినప్పటికీ విదేశీ నేరగాళ్లకు బెయిల్ ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చట్ట ప్రకారం ఆయా కేసుల్లో నిందతులను అరెస్ట్ చేసిన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో (ప్రత్యేక కేసుల్లో మినహా) అభియోగపత్రాలు దాఖలు చేయాలి. కీలక కేసుల్లో ఈ కోణంలో పోలీసులు విఫలమైనప్పుడే న్యాయస్థానాలు నిందితులకు బెయిల్ ఇస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు తాము నిర్ణీత కాలంలో చార్జ్షీట్లు దాఖలు చేస్తామంటూ న్యాయ విభాగం దృష్టికి తీసుకువెళ్లారు. విదేశీ నేరస్తుల విషయంలో ఇది కచ్చితంగా అమలయ్యేలా చర్యలు కుంటున్నట్లు వివరించాయి. దీనికి సమ్మతించిన న్యాయ విభాగం పూర్వాపరాల నేపథ్యంలో విదేశీ నేరస్తులకు బెయిల్ ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు విచారణ, శిక్ష పూర్తయిన తర్వాత నేరుగా డిపోర్టేషన్ చేయడానికి నిర్ణయించామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. -
విదేశీయులతో శృంగారంలో పాల్గొనకండి!
మాస్కో : సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా రష్యా మహిళలు శ్వేతజాతియేతర విదేశీయులతో శృంగారంలో పాల్గొనకూడదని ఆ దేశ ప్రజాప్రతినిధి ఒకరు సూచించారు. శ్వేతజాతియేతర విదేశీయులతో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. మిశ్రమ జాతి (మిక్స్డ్ రేస్) పిల్లలతో సింగిల్ మదర్గా మహిళలు మిగిలిపోయే అవకాశముందని అన్నారు. రష్యా మహిళలు విదేశీయులతో చేసుకుంటున్న వివాహ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని, రష్యా మహిళలు విదేశాల్లో చిక్కుకుపోవడం, లేదా వారు దేశంలో ఉంటే.. వారి పిల్లలు విదేశాల్లో ఉండటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని సీనియర్ చట్టసభ సభ్యురాలు, కుటుంబ వ్యవహారాలు, మహిళా శిశు పార్లమెంటు కమిటీ చైర్మన్ తమరా ప్లెట్న్యోవా తెలిపారు. 1980లో మాస్కో ఒలింపిక్స్ సందర్భంగా విదేశీయులతో సంబంధాల కారణంగా రష్యా మహిళలు పిల్లలను కన్నారు. అప్పట్లో గర్భనిరోధక పద్ధతులు అంతగా అందుబాటులో లేకపోవడంతో ఇలా పుట్టిన చిన్నారులు ‘ఒలింపిక్ పిల్లలు’గా ముద్రపడ్డారు. అంతర్జాతీయ క్రీడల సందర్భంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా పురుషులతో సంబంధాల వల్ల రష్యా మహిళలకు పుట్టిన శ్వేతజాతియేతర పిల్లలను పిలిచేందుకు సోవియట్ హయాంలో ఈ పదాన్ని వాడేవారు. ఈ పిల్లలు రష్యాలో వివక్షను ఎదుర్కొన్నారు. ఈ విషయమై ఓ ప్రశ్నకు బదులిచ్చిన తమరా.. ‘మన పిల్లలకు మాత్రమే మనం జన్మనివ్వాలి. సోవియట్ కాలం నుంచి మిశ్రమ జాతి పిల్లలు ఎన్నో కష్టాలు పడ్డారు’ అని ఆమె స్థానిక రేడియో కార్యక్రమంలో పేర్కొన్నారు. నేటి నుంచి ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. -
అమెరికా గుడ్న్యూస్ : అదనంగా 15వేల వీసాలు
వాషింగ్టన్ : వీసాల జారీ విషయంలో కఠినతరమైన నిబంధనలు విధిస్తూ.. విదేశీయులకు చుక్కలు చూపిస్తూ వస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. అదనంగా 15వేల హెచ్-2బీ వీసాలను విదేశీయులకు జారీచేయనున్నట్టు ప్రకటించింది. ఈ వీసాలు ఇప్పటికే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జారీ చేసిన 66వేల వీసాల కంటే అదనం. అదనపు వీసాలు జారీ చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యురిటీ ప్రకటించింది. ఈ హెచ్-2బీ వీసాలను ప్రస్తుతం తాత్కాలికంగా నాన్-అగ్రికల్చర్ వర్కర్లకు జారీ చేస్తున్నారు. ఈ వీసాల ద్వారా అమెరికన్ వ్యాపారాలు పలు అవసరాల నేపథ్యంలో నాన్-అగ్రికల్చర్ ఉద్యోగాలను పూరించుకోవడం కోసం విదేశీయులను వారి దేశానికి రప్పించడం కోసం ఉపయోగపడుతున్నాయి. అమెరికాన్ వ్యాపారాలను సంతృప్తిపరిచేంతగా, తాత్కాలిక నాన్-అగ్రికల్చర్ లేబర్గా పనిచేసేందుకు ప్రతిభావంతులైన, సరిపడ స్థాయిలో అమెరికన్ వర్కర్లు లేరని సెక్రటరీ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యురిటీ కిర్స్టేజెన్ నీ నీల్సన్ చెప్పారు. సెక్రటరీ ఆఫ్ లేబర్ అలెక్సాండర్ అకోస్టా, కాంగ్రెస్ సభ్యులు, వ్యాపార యజమానులతో సమావేశమైన తర్వాత ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీహెచ్ఎస్ ప్రెస్కు తెలిపింది. హెచ్-2బీ వీసాను కూడా ఇందుకోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతిభావంతులైన, సరిపడ స్థాయిలో వర్కర్లు దొరకనప్పుడు, తాత్కాలికంగా విదేశాల నుంచి అమెరికా వ్యాపారాలకు అనుగుణంగా వర్కర్లను రప్పించుకోవచ్చు. గరిష్టంగా ఈ ఏడాది ప్రథమార్థంలో 33వేల హెచ్-2బీ వీసాలు అందుబాటులో ఉంటాయని, మరో 33వేలు వీసాలను ద్వితీయార్థంలో జారీచేయనున్నట్టు హోమ్ల్యాండ్ సెక్యురిటీ పేర్కొంది. ఈ వారం నుంచి అర్హత కలిగిన వారు హెచ్-2బీ వీసాల కోసం ఫామ్ 1-129ను సమర్పించాలని చెప్పింది. -
విదేశీ విద్యార్థి అనుమానాస్పద మృతి
మౌలాలి: క్వారీ గుంతలో పడి విదేశీ విద్యార్ధి అనుమానస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుడాన్ దేశానికి చెందిన సాలిహ్ అబ్డీన్ సాలీహ్ అలియస్ కోహా(28) నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసి చదువుతుతూ ఓయూ టీచర్స్ కాలనీలోని రాఘవేంద్రహిల్స్ ఎమ్మార్ రెసిడెన్సీలో ఉంటున్నాడు. శనివారం రాత్రి తన స్నేహితులు సబ్రా, కెల్విన్, సండ్రా, హ్యాపి, రేమాండ్, గాడ్విల్లతో కలిసి ప్లాట్లో విందు చేసుకున్నారు. స్నేహితులు వెళ్లిపోవడంతో ప్లాట్లో ఒక్కడే ఉన్నాడు. ఉదయం స్నేహితులు వచ్చి చూసేసరికి అతను క్వారీ గుంతలో మృతి చెంది ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విదేశీయుడిని దోచుకున్న క్యాబ్ డ్రైవర్ల రిమాండ్
శంషాబాద్: ప్రయాణికుడి బ్యాగ్ను చోరీ చేసిన ఇద్దరు క్యాబ్ డ్రైవర్లను ఆర్జీఐఏ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీఐ దస్రునాయక్ తెలిపిన వివరాల ప్రకారం... నాలుగు రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్ను క్యాబ్ డ్రైవర్లు దొంగిలించారు. బ్యాగ్లో నగదు, బంగారం పోవడంతో బాధితుడు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా చోరీ చేసిన నిందితులను గుర్తించి బేగంపేట పోలీస్ ల్యాండ్లో నివాసం ఉంటున్న మహ్మద్ గౌస్(34), రసూల్పురాలో నివాసం ఉంటున్న మహ్మద్ జాకీర్(21)లను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు తులాల బంగారం, రూ. 76 వేల నగదు స్వాధీనం చేసుకోని గురువారం రిమాండ్కు తరలించారు. -
ఇక్కడి మహిళలు అదృష్టవంతులు
తార్నాక: నేటి సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు విజయాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో వారికి ఎంతో గౌరవం లభిస్తుండగా.. మరికొన్ని దేశాలు వారిపై అంక్షలు విధిస్తూ స్వేచ్ఛను ఆంక్షల చట్రంలో బిగిస్తున్నాయి. ఈ విషయంలో భారత మహిళలకు మాత్రం కావాల్సినంత స్వేచ్ఛ ఉందని, ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులంటున్నారు విదేశీ విద్యార్థులు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న పలువురు విదేశీ విద్యార్థినులతో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ వివరాలు విద్యార్థుల మాటల్లోనే.. చాలా అదృష్టవంతులు మా దేశంతో పోలిస్తే భారతదేశంలో మహిళలు స్వేచ్ఛగా ఉంటారు. మా దేశంలో మహిళా దినోత్సవం నిర్వహించరు. అయితే రక్షణ, గౌరవం బాగానే లభిస్తుంది. అయితే ఎంత రక్షణ ఉన్నా స్వేచ్ఛగా ఉండే అవకాశం లేదు. అందుకే భారతీయ స్త్రీలు అన్ని విషయాల్లోనూ అదృష్టవంతులు.– రెవీనా సెమాల్, ఇథియోఫియా ప్రభుత్వమే గౌరవిస్తుంది.. మా దేశంలో మార్చి 8న ‘మదర్స్డే’గాను, జూలై 27న ‘డాటర్స్డే’ గాను ఉత్సవాలు చేస్తారు. ఈ సందర్భాల్లో మహిళలందరికీ బహుమతులు ఇవ్వడంతో పాటు, సన్మానాలు చేస్తారు. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ నిధులతోనేచేపడతారు. ప్రభుత్వమే మహిళలను గౌరవిస్తుంది. – ఆజాదే ఫర్హాదీ, ఇరాన్ సమానత్వం ఉండదు.. మా దేశంలో మహిళా దినోత్సవాలు ఉన్నతమైన హోదాలో ఉన్న వారికే పరిమితం. స్వేచ్ఛ విషయంలో భారత్లో పోలిస్తే మా దేశంలో కొంత నిర్బంధమే. పురుషులతో సమానం గా చూసే పరిస్థితి లేదు. ఒక సంస్థలో పనిచేసే స్త్రీలకు పురుషులతో సమానంగా వేతనాలు ఉండవు. అయితే స్త్రీలు హక్కులు సాధించుకునే విశగాస్వశక్తిగా ఎదగాలి. – బొరాయ్ రోహిన్, ఇరాక్ ఇప్పటికీ స్వేచ్ఛ లేదు.. ఆఫ్రికాలోని టీ–చాంద్ దేశంలో పుట్టిన మేం బతుకు దెరువు కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లాం. ఇక్కడా, ఇక్కడా నేను గమనించిందేంటంటే.. స్త్రీలపై నిర్బంధం కొనసాగడం. ఇప్పటికీ మా దేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదు. మా దేశంలో మహిళా దినోత్సవాలు నిషిద్ధం. బయటకు వెళ్లాలంటే మాకంటే చిన్న వారైనా సరే ఒక మగతోడు ఉండాల్సిందే. చదువు కోసం వచ్చిన మాకు ఇక్కడున్న కొద్ది కాలమైన ఆనందంగా ఉంటాం. అందుకు భారతదేశానికి సల్యూట్.– నియిమా అక్బర్, దక్షిణాఫ్రికా స్త్రీ స్వేచ్ఛలో భారత్ మిన్న.. స్త్రీ స్వేచ్ఛలో భారత్ తరువాతే ప్రపంచంలోని మిగతా దేశాలు. మా దేశంలో అయితే స్త్రీలకు స్వేచ్ఛ లేకపోగా, అభద్రతా భావం కూడా ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీంతో మేం చాలా నిర్బంధంలో ఉంటాం. స్వేచ్ఛగా బయట తిరుగలేం. భారత్లో అలా కాదు.. స్త్రీలను ఎంతో గౌరవిస్తారు. అందుకే ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. – నసీబా, అఫ్ఘనిస్థాన్ -
లవ్... మ్యారేజ్!
ప్రేమ ఒక అనుభూతి. పెళ్లి ఒక అనుబంధం. విభిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్లో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొనేవాళ్లు ఉన్నారు. పెళ్లి తరువాతే ప్రేమంటూ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉండేవాళ్లూ ఉన్నారు. ఎవరైనా కోరుకొనేది ఒక్కటే...ఆ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలి. ప్రేమ పరమార్థం పెళ్లి కావాలి. ప్రేమ పెళ్లిళ్లపై యువత ఏమనుకుంటున్నారు? పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లపై వాళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అనే అంశం ఎప్పుడైనా ఆసక్తిదాయకమే. చర్చనీయాంశమే. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇదే అంశంపై ‘సాక్షి’ ఒక సర్వే నిర్వహించింది. విదేశీ యువతీ యువకులు, హైదరాబాద్ యువత మనోగతాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నించింది. ప్రేమించుకున్నాకే పెళ్లి చేసుకోవాలని 70 శాతం మంది విదేశీ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకొని లోపాలను సరిదిద్దుకొనేందుకు వీలు కలుగుతుందన్నారు. హైదరాబాద్ స్టూడెంట్స్ మాత్రం 85 శాతం మంది పెళ్లి తరువాతే ప్రేమకు జై కొట్టారు. ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమేనని రెండు వర్గాల విద్యార్థులు స్పష్టంగా అభిప్రాయపడ్డారు. యువత మనోగతం ఇదే... సాక్షి నెట్వర్క్: ప్రేమ, పెళ్లి అంశంపై అభిప్రాయ సేకరణ చేపట్టగా...నగరంలోని బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలకు చెందిన హైదరాబాద్ యువతీ యువకులు, తార్నాక ఇఫ్లూ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించారు. ఏ బంధమైనా తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిలిచిపోవాలని ఇరువర్గాల విద్యార్థులు గట్టిగా చెప్పారు. ప్రేమించుకున్నాకే పెళ్లి చేసుకోవాలని 70 శాతం మంది విదేశీ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకొని లోపాలను సరిదిద్దుకొనేందుకు వీలు కలుగుతుందన్నారు. హైదరాబాద్ స్టూడెంట్స్ మాత్రం 85 శాతం మంది పెళ్లి తరువాతే ప్రేమకు జై కొట్టారు. ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమేనని రెండు వర్గాల విద్యార్థులు స్పష్టంగా అభిప్రాయపడ్డారు. అలాగే ప్రేమిస్తే కచ్చితంగా పెళ్లి వరకూ వెళ్లాల్సిందేనని 85 శాతం మంది హైదరాబాద్ విద్యార్థులు కుండబద్దలు కొట్టి చెప్పారు. విదేశీ విద్యార్థుల్లో 25 శాతం మాత్రం అభిప్రాయబేధాలు ఉంటే పెళ్లి చేసుకోవడం కంటే దూరం కావడమే మంచిదని స్పష్టం చేశారు. సర్వే ఇలా.... 1) ప్రేమ తర్వాత పెళ్లి....పెళ్లి తర్వాత ప్రేమ...ఏది కరెక్ట్? ఎ) ప్రేమ తర్వాత పెళ్లి – హైదరాబాద్ విద్యార్థులు : 35 శాతం, విదేశీ విద్యార్థులు : 70 శాతం బి) పెళ్లి తర్వాత ప్రేమ – హైదరాబాద్ విద్యార్థులు : 65 శాతం విదేశీ విద్యార్థులు : 30 శాతం 2) మీ దృష్టిలో ప్రేమంటే? ఎ) ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం – రెండు కేటగిరీల విద్యార్థులు: 80 శాతం బి) ఒకరి అవసరాలు ఒకరు తీర్చడం – రెండు కేటగిరీల విద్యార్థులు: 20 శాతం 3) ప్రేమిస్తే ఖచ్చితంగా పెళ్లి వరకు వెళ్లాల్సిందేనా..? ఎ) అవును – హైదరాబాద్ స్టూడెంట్స్ – 85 శాతం. విదేశీ విద్యార్థులు: 75 శాతం బి) లేదు– హైదరాబాద్ స్టూడెంట్స్ – 15 శాతం విదేశీ విద్యార్థులు: 25 శాతం 4) లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నిజమేనా? ఎ) కాదు– రెండు కేటగరీల విద్యార్థులు: 80 శాతం బి) అవును – రెండు కేటగరీల విద్యార్థులు: 20 శాతం 5) మీ ఓటు లవ్ మ్యారేజ్కా లేక అరేంజ్డ్ మ్యారెజ్కా....? ఎ) లవ్ మ్యారేజ్ – హైదరాబాద్ స్టూడెంట్స్ 35 శాతం, విదేశీ స్టూడెంట్స్ 70 శాతం బి) అరేంజ్డ్ – హైదరాబాద్ స్టూడెంట్స్ 65 శాతం, విదేశీ విద్యార్థులు 30 శాతం అది ఒక ఆకర్షణ మాత్రమే.... ఇక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది చాలా వరకు ఆకర్షణ మాత్రమేని హైదరాబాద్ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కొట్టిపడేశారు. తొలిచూపులోనే ప్రేమ చిగురిస్తుందనే దానికి కేవలం 20 శాతం మంది సానుకూలత వ్యక్తం చేయగా, 80 శాతం మంది మాత్రం అది సరైంది కాదన్నారు. ఒకరునొకరు స్పష్టంగా తెలుసుకొని, అభిప్రాయాలను,ఆలోచనలను పంచుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పారు. పెద్దలు కుదిర్చితే ఓకే.... పెద్దలు కుదిర్చిన పెళ్లికి 65 శాతం మొగ్గు చూపారు. మిగతా 35 శాతం మాత్రం ప్రేమ పెళ్లి పట్ల ఆసక్తిని ప్రదర్శించారు.పెద్దలు కుదుర్చిన వివాహ వ్యవస్థలో భద్రత ఉంటుందని, కుటుంబం అండదండలు ఉంటాయని కొందరు అభిప్రాయపడగా, అలా అని చెప్పి గుడ్డిగా ఒప్పేసుకోలేమని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. నమ్మకం ముఖ్యం ప్రేమించి చేసుకున్నా..లేకపోయినా సరే కాని పెళ్లి తర్వాత ఒకరిని ఒకరు గౌరవించుకోవలి. ప్రేమించుకోవాలి. ఒకరిపై ఒకరు పరస్పర నమ్మకం ఉంచాలి. నేను పెద్దలు కుదిర్చిన వివాహానికే మొగ్గు చూపుతాను. – గిరిష్మా పట్నాయక్, విద్యార్థిని జీవితాంతం ప్రేమించుకోవాలి ప్రేమించి చేసుకోవడమా లేదా పెళ్లి తర్వాత ప్రేమించడమా అన్నది పెద్ద సమస్య కాదు. ఎలా చేసుకున్నా జీవితకాలం ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ప్రధానం. లేకుంటే వివాహానికి అర్థం లేదు. – హిమజ, విద్యార్థిని ప్రేమ తర్వాతే పెళ్లి... ప్రేమ తర్వాతే పెళ్లికి నేను ఓటేస్తాను. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, అభిప్రాయాలను గౌరవించుకోవడం ముఖ్యం . అదే పెళ్లిని కలకాలం నిలుపుతుంది. నిజమైన ప్రేమికులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.–భవ్య, విద్యార్థిని లవ్ ఫస్ట్.... ప్రేమించిన తరువాత పెళ్లి చేసుకోవడమనేది సరైంది. ఇద్దరి మ«ధ్య చిగురించిన ప్రేమ ఆకర్షణగా మొదలై ఆ తరువాత ఒకరినొకరు అర్థం చేసుకునే వరకు వెళుతుంది. జీవితాంతం తాను ప్రేమించిన వ్యక్తితోనే ఉండాలి కాబట్టి ఇద్దరూ తన అభిప్రాయాలను తెలుసుకుంటారు.– ఒసామా, ఎల్ఎల్ఎం(ఇరాక్) చివరి వరకు నిలిచేది ప్రేమ... ప్రేమంటే రెండు జీవితాలు ప్రాణమున్నంత వరకు కలిసి ఉండేది. ఒకరినొకరు పూర్తిగా అర్దం చేసుకోవాలి. అపుడే వారి మధ్య నిజమైన బంధంఏర్పడుతుంది. వాలెంటైన్స్ డే సందర్బంగా తనకు నచ్చిన వ్యక్తిని గిఫ్టుల ద్వారా ఆకట్టుకోవడం కాదు, వారికి జీవితాంతం తోడునీడగా ఉండాలి.–నసీబా, బీసీ ఓయూ (అఫ్టనిస్తాన్) నో లవ్... నో మ్యారేజ్...ఓన్లీ సింగిల్... ప్రేమలు, పెళ్లిళ్లు అనేది పెద్ద బోగస్...వాలెంటైన్స్ డే పేరుతో ప్రేమికులు తమప్రేను వ్యక్తపర్చడమనేది కేవలం ఒక ఆకర్షణ మాత్రమే. నాకు ఈ ప్రేమలు, పెళ్లిళ్లు అసలే నచ్చవు. వీటికి నేను దూరం.. నో వాలెంటైన్స్ డే...నో లవ్... నో మ్యారేజ్.. అయామ్ ఓన్లీ సింగిల్... – ఎలీనా, పీహెచ్డీ (సిరియా) మా దేశంలో లవ్ మ్యారేజెస్ ఎక్కువ మా దేశంలో చాలా వరకు ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తారు. వాలెంటైన్స్ డే సందర్బంగా చాలా మందిప్రేమికులు తమ ప్రేమను వెలిబుచ్చి ఆమోదం పొందుతారు. పెళ్లికి ముందు ప్రేమ వల్ల ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. దీంతో ఇరువురి మధ్య ఒక నమ్మకం కుదురి గొప్ప బంధం ఏర్పడుతుంది. –మరియం, ఎంసీజే (మొరాకో) -
విదేశీయుల ‘ఫీల్ ద జైల్’
సంగారెడ్డి క్రైం: ఎవరైనా జైలు జీవితం అనుభవించాలని కలలో కూడా ఊహించరు. కానీ ఇద్దరు విదేశీయులు మాత్రం జైలు శిక్ష అనుభవించి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట! అయితే వారి కోరికను సంగారెడ్డి జైలు అధికారులు తీర్చారు. ఇటీవల సంగారెడ్డి జైలు అధికారులు ‘ఫీల్ ద జైల్’అనే కార్యక్రమాన్ని చేపట్టారు. మలేషియాకు చెందిన దంత వైద్యుడు క్వెన్, రెస్టారెంట్ వ్యాపారి కెల్విన్ ఆన్లైన్లో వీటి గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏకంగా వారు మలేషియా నుంచి ఇక్కడికి వచ్చారు.జైలు సూపరింటెండెంట్ సంతోష్రాయ్ను సంప్రదించి తమ మనసులోని మాటను చెప్పారు. నిబంధనల ప్రకారం జైలు మ్యూజియంలో రూ.500 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఖైదీల్లా కారాగారంలో అడుగు పెట్టారు. ఆన్లైన్లో ‘ఫీల్ ద జైల్’గురించి వివరాలు తెలుసుకొని జైలు జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని క్వెన్, కెల్విన్ తెలిపారు. శిక్ష కాలంలో ఖైదీలకు అందించే ఆహారాన్నే తమకూ వడ్డించాలని వారు అధికారులను కోరారు. -
తాలిబన్ల దాడిలో 14మంది విదేశీయులు మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో ఇంటర్ కాంటినెంటల్ హోటల్పై తాలిబన్లు శుక్రవారం రాత్రి జరిపిన దాడిలో 14 మంది విదేశీయులు చనిపోయారు. ఒక టెలికం అధికారి, ముగ్గురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి 9.30 ప్రాంతంలో సాయుధులైన నలుగురు దుండగులు హోటల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ కొందరిని బందీలుగా పట్టుకున్నారు. హోటల్లోని కొన్ని గదులకు నిప్పంటించారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు హెలికాప్టర్ ద్వారా భవనం పైనుంచి ప్రవేశించి ఉగ్రవాదులతో తలపడ్డాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనకు తామే కారణమంటూ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ తాలిబాన్ ప్రకటించుకుంది. -
టూరిస్టు వీసాలిచ్చి మోసగిస్తున్న ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమాయక ప్రజలకు టూరిస్ట్ వీసాలు ఇచ్చి మోసగిస్తున్న, దుబాయ్ పంపిన మహిళల్ని భయపెట్టి వ్యభిచారంలోకి దింపుతున్నముఠాలోని కొందరు సభ్యులను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బి నగర్లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో సిపి మహేష్ భగవత్ మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, కువైట్ దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరక్షరాస్యులైన అమాయక ప్రజలకు టూరిస్ట్ వీసాలు ఇచ్చి ఈ ముఠా మోసాలకు పాల్పడుతోందని చెప్పారు. అలాగే దుబాయ్కు పంపిన మహిళల్ని భయపెట్టి వ్యభిచార గృహాలకు తరలించి డబ్బులు దండుకుంటున్నదని కూడా తెలిపారు. 12మంది సభ్యుల ఈ ముఠాలో ఐదుగురిని మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. అరెస్టు అయిన వారినుంచి రూ.1.60 లక్షల నగదు, వీసా డాక్యుమెంట్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా, ఈ కేసు విషయంలో బాధితులు పిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించిన ఘట్కేసర్ ఎస్ఐ శోభన్బాబును 15 రోజుల క్రితం సీపీ సస్పెండ్ చేశారు. ఏసీపీ, సిఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. -
విదేశీ వనితలా.. మజాకా !
సాక్షి, తిరువళ్లూరు: మనం గొప్ప పనులు చేయలేకపోచ్చు.. కానీ చేసే పనులను మనసు పెట్టి చేస్తే అదే మనిషి ఔన్నత్యానికి కొలబద్దతగా మారుతుందన్న మదర్థెరిస్సా మాటలు వారిలో స్ఫూర్తి నింపాయి. ఇదే స్ఫూర్తితో కెనడాకు చెందిన క్లోవీఎలిజబెత్, స్కాట్లాండ్కు చెందిన హన్నారోస్ తిరువళ్లూరు సమీపం, సేవాలయ ఆశ్రమంలోని అనాథలకు సేవ, విద్యార్థులకు ఆంగ్లం బోధిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు ఎలిజబెత్, హన్నారోస్. ఈ సందర్భంగా వారిని పలుకరించిన సాక్షికి తెలిపిన వివరాలు వారి మాటల్లోనే.. సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచి సామాజిక సేవ చేయాలన్న ఆసక్తి ఉండేది. దీంతో భారతదేశానికి వెళ్లి ఏదైనా ఆశ్రమంలో సేవచేస్తూ.. సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది ఎలిజబెత్. ఇంగ్లాండ్కు చెందిన క్లోవీఎలిజబెత్ తండ్రి జాన్ పర్యావరణ పరిరక్షణ అధికారి. తల్లి సారా ప్లేస్కూల్, స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. ‘2016లో వ్యవసాయ సాగు– ఆహార పదార్థాల్లో విషతుల్యం అనే అంశంపై ప్రాజెక్టు చేయడానికి స్కాట్లాడ్కు వెళ్లా. అక్కడే నెదర్లాండ్కు చెందిన హన్నారోస్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఆసక్తి సేవచేయడమే కావడంతో ఇంటర్ పూర్తిచేశాక భారత్కు వెళ్లాలనుకున్నాం. అక్కడ ఏదైనా ఓ ఆశ్రమంలో సేవ చేస్తూనే సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించాం’ అని వివరించారు ఎలిజబెత్. తల్లిదండ్రులను ఒప్పించి మాకు అనువైన చెన్నై సమీపం, కసువ వద్ద ఉన్న సేవాలయ ఆశ్రమాన్ని ఎంచుకున్నామని హన్నారోస్, ఎలిజబెతు లు వివరించారు. ఉదయం వ్యవసాయం – సాయంత్రం సంప్రదాయం నవంబర్లో సేవాలయకు వచ్చాం. మాకు ఉన్న ఏడాది సమయంలో వ్యవసాయం, సనాతన భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం వ్యవసాయ పనులు, తొమ్మిదింటికి అవ్వతాతల బాగోగులు చూసుకోవడం, తరువాత మధ్యాహ్నం మూడు గంటల వరకు చిన్నపిల్లలకు స్పోకెన్ ఇంగ్లిష్ చెప్పడం మా దినచర్య. పాఠశాల ముగియగానే మళ్లి అరకపట్టి దున్నడం, కలుపుతీయడం, కూరగాయలను కోసి ఆశ్రమానికి పంపించడం చేస్తాం, మిగతా సమయంలో సంప్రదాయ వంటకాలు, భరతనాట్యం, వస్త్రధారణ నేర్చుకుంటున్నాం. తమిళం మాట్లాడడం, రాయడం నేర్చుకుంటున్నామన్నారు హన్నారోస్. పాఠశాల ముగిసే సమయానికి పిల్లల కోసం తల్లిదండ్రులు గేటు వద్దే వేచి ఉండడం, పిల్లలు రాగానే వారిని ప్రేమగా ముద్దాడడం చూస్తే ప్రేమకు దూరమయ్యామనే బాధ కలుగుతుందన్నారు క్లోవీఎలిజబెత్, హన్నారోస్. సేంద్రియ సాగుపై ఆసక్తి ఎందుకంటే: 2016లో వ్యవసాయ సాగు పద్ధతులు – ఆహార పదార్థాల విషతుల్యం అనే అంశంపై ప్రత్యేక ప్రాజెక్టును రూపొదించడానికి స్కాట్లాండ్కు వెళ్లాం. అక్కడ వివిధ వర్గాల ప్రజలు, ప్రముఖ వైద్యుల అభిప్రాయాల మేరకు మనిషి తినే ఆహరంలో ఉన్న రసాయనాలే అనారోగ్యానికి కారణమనే విషయం మాకు స్పష్టంగా అర్థమైంది. ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలన్న ఉద్దేశంతో సేంద్రియ సాగుపై ఆసక్తి ప్రదర్శిస్తున్నామన్నారు ఎలిజబెత్, హన్నారోస్. ప్రస్తుతం సేవాలయలో కూరగాయలు, పప్పుదినుసులు, వరి తదితర ఆహార«ధాన్యాలను సాగు చేస్తున్నాం. మొదట కొంచెం భూమిని చదును చేసి విత్తనాలను చల్లిన సమయంలో వర్షాలు పడడంతో వృథాగా పోయింది. అయినా నిరాశ చెందలేదు. అక్కడున్న రైతుల సూచనలు స్వీకరించి కూరగాయలు సాగు చేసాం. ప్రస్తుతం పంట భాగానే పండింది. సేఫ్ డ్రస్సింగ్ భారతదేశంలో మహిళలు ధరించే వస్త్రాలు చాలా సేఫ్గా ఉంటాయి. కట్టుబొట్టు, బంగారు అలంకరణ బాగుంది. అందుకే భారతీయ సంప్రదాయం బాగా నచ్చిందని వివరించారు హన్నారోస్. ఎప్పుడూ పీజా బర్గర్ తినే మాకు ఆరటి ఆకు భోజనాలు ఇష్టం. మొదట తాము సేంద్రియ వ్యవసాయ సాగు, ఆశ్రమంలో సేవ చేయడం, స్పోకెన్ ఇంగ్లిష్ బోధించడానికే వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక నేర్చుకోవాల్సింది చాలా ఉందని వివరించారు ఎలిజబెత్. విదేశాల మోజులో వ్యవసాయానికి స్వస్తి పలుకుతున్న ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు క్లోవీ ఎలిజబెత్, హన్నారోస్. -
మహిళతో ఉబర్ డ్రైవర్ వాగ్వాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో లండన్ మహిళతో ఉబర్ క్యాబ్ డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. వివరాలివి.. లండన్ మహిళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఉబర్ క్యాబ్ను బుక్ చేసుకుంది. ప్రయాణ సమయంలో డ్రైవర్ ప్రవర్తన అనుమానంగా ఉండటాన్ని గమనించి వెంటనే ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో క్యాబ్ డ్రైవర్ భయంతో కారును ఇంకా వేగంగా నడిపాడు. ఇద్దరి మధ్య వెళ్లే మార్గంలో వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న మాదన్నపేట పోలీసులు రంగంలోకి దిగి క్యాబ్ డ్రైవర్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.